తాడిపత్రిలో టెన్షన్‌.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి | TDP Leaders Over Action AT Tadipatri, Attacked On YSRCP Workers, More Details Inside | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో టెన్షన్‌.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

Published Thu, Feb 20 2025 9:26 AM | Last Updated on Thu, Feb 20 2025 10:27 AM

TDP Leaders Over Action AT Tadipatri

సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు  రెచ్చిపోయారు. తాజాగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్గీయులే దాడి చేసినట్టు బాధితులు చెబుతున్నారు.

వివరాల ప్రకారం.. అనంతపురంలోని పెద్దవడగూరు మండలం అప్పేచర్లలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అరాచకం సృష్టించారు. గురువారం ఉదయం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తల తలకు బలమైన గాయం కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడి విషయాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్త భాస్కర రెడ్డి సెల్ఫీ వీడియోలో వివరించారు.

ఇదిలా ఉండగా.. తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై దళిత సంఘం నేత రాంపుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను ఫోన్‌లో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరించిన జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు చెప్పాలని సమాచార చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వివరాలను పంపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement