'ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు' | Vijaysai Reddy Slams TDP Govt over Vijayawada Floods | Sakshi
Sakshi News home page

'టీడీపీ ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు'

Published Wed, Sep 11 2024 2:53 PM | Last Updated on Wed, Sep 11 2024 3:35 PM

Vijaysai Reddy Slams TDP Govt over Vijayawada Floods

తాడేపల్లి, సాక్షి: విజయవాడ వరదల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తన అసమర్థతను ప్రదర్శించుకుందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో ఆయన ట్వీట్‌ చేశారు.

కరోనాలాంటి విపత్తు సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఎంతో సమర్థవంతంగా పని చేశారని ఏపీ మొత్తం ప్రశంసించింది. అలాంటిది ఇప్పుడు విజయవాడ వరదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా పని చేసింది. టీడీపీ ప్రభుత్వానికి ప్రజల అవసరాలను సకాలంలో గుర్తించగలిగే సామర్థ్యం(సహానుభూతి-ఎంపథీ) ఏమాత్రం లేదు అని విజయసాయిరెడ్డి  పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నటి కేసు.. టీడీపీ సర్కారు జిత్తులు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement