
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు, లోకేష్ చేస్తున్నది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీలో పాలన చేతకాక చంద్రబాబు చేతులెత్తేశాడని కామెంట్స్ చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..
చంద్రబాబు.. పాలన చేతకాక చేతులెత్తేశాడు.
అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. రాజకీయ హత్యలు.
చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెర లేపాడు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చేస్తున్నది 'ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్'(వ్యవస్థీకృత నేరం).
ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. 40ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు.. పాలన చేతకాక చేతులెత్తేశాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు.. ..పాలన చేతకాక చేతులెత్తేశాడు...
అక్రమ కేసులు..... నిర్బంధాలు..... చిత్రహింసలు....రాజకీయ హత్యలు...
చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెర లేపాడు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చేస్తున్నది 'ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్'(వ్యవస్థీకృత…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 10, 2024