YSRCP ధర్నా.. ఢిల్లీ బయల్దేరిన వైఎస్‌ జగన్‌ | YSRCP Protest News Updates: YS Jagan Depature To Delhi, Will Hold A Peaceful Protest Over Lawlessness Anarchy In AP | Sakshi
Sakshi News home page

YSRCP Protest In Delhi Today: వైఎస్సార్‌సీపీ ధర్నా.. ఢిల్లీ బయల్దేరిన వైఎస్‌ జగన్‌

Published Tue, Jul 23 2024 8:25 AM | Last Updated on Tue, Jul 23 2024 10:14 AM

YSRCP Protest News: YS Jagan Depature To Delhi Today News

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి జగన్‌ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు. దేశ ప్రజలకు ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలు తెలిసేలా వైఎస్సార్‌సీపీ రేపు ధర్నా చేపడుతోంది. ఆ ధర్నాలో ఆయనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొనబోతున్నారు.

మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్‌.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్‌ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్‌ ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు. 

ఇదీ చదవండి: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి: వైఎస్‌ జగన్‌

అలాగే.. పలు జాతీయ పార్టీల నేతల్నీ కలిసి ఇక్కడి పరిస్థితుల్ని వివరించనున్నారు. అలాగే వాళ్లనూ ధర్నాకు హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న ఈ పోరాటంలో కలిసొచ్చే అన్ని పార్టీ­లనూ కలుపుకుపోతామని జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. 

అరాచకాలు అందరికీ తెలిసేలా.. 
ఢిల్లీలో రేపటి ధర్నాలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరుగుతున్న హింసకు ఫొటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. అలాగే.. చట్టసభల్లోనూ పెద్దఎత్తున తమ పార్టీ వాణి వినిపిస్తామని అంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement