అన్నం పెట్టిన అమ్మలకు చిరుకానుక | - | Sakshi
Sakshi News home page

అన్నం పెట్టిన అమ్మలకు చిరుకానుక

Published Wed, Mar 19 2025 12:42 AM | Last Updated on Wed, Mar 19 2025 12:40 AM

తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమకు ఇన్నాళ్లు పాఠశాలలో రుచికరమైన మధ్యాహ్న భోజనం వండి పెట్టిన అమ్మలకు మండలంలోని జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు కృతజ్ఞతను చాటుకున్నారు. తమకు ఆరో తరగతి నుంచి రుచికరమైన భోజనం వండి పెడుతున్న మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు మంగళవారం చీరలు బహూకరించి తమ ప్రేమను చాటారు. విద్యార్థులు మాట్లాడుతూ ఐదేళ్లుగా తమను కన్నతల్లి లాగా చూసుకొని కడుపునిండా అన్నంపెట్టారని కొనియాడారు. అనంతరం ఆఫీస్‌ సబార్డినేట్‌ సంతోష్‌కు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం జోగినపల్లి అనురాధ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement