-
లారీల కొరత లేకుండా చూడాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): కొనుగోలు కేంద్రాల్లో లారీలు, గన్నీ సంచుల కొరత లేకుండా చూ డాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులకు సూచించా రు. చందుర్తి సింగిల్విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఈ విషయమై విన్నవించగా.. వెంటనే జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, జిల్లా కార్యదర్శి గొట్టే ప్రభాకర్, నాయకులు భీంరాజు కనకరాజు, దారం చంద్రం, వేల్పుల దేవస్వామి, పులి సత్తయ్య, ధర్మపురి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకుందాం● జెడ్పీ సీఈవో ఉమారాణి సిరిసిల్ల: ఓటుహక్కు వినియోగం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని జెడ్పీ సీఈవో ఉమారాణి కోరారు. జిల్లా సమాఖ్యలో శుక్రవారం నిర్వహించిన మహిళల సమావేశంలో ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. జెడ్పీ సీఈవో మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ ఓటరు ఎన్నికల్లో ఓటువేసేలా మహిళలు చైతన్యపరచాలన్నారు. ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చూడాలన్నారు. స్వీప్లో భాగంగా జిల్లా సమాఖ్య ప్రతినిధులు ‘ఐ ఓటు ఫర్ ష్యూర్’ ‘ఓటుహక్కు నా బాధ్యత’ అంటూ నినాదాలు చేసి ప్రతిజ్ఞ చేశారు. డీఆర్డీవో శేషాద్రి, స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, డీపీఎం సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ సిరిసిల్ల: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ను అర్థ గణాంకశాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహన్రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపాతం వివరాలు ఎలా నమోదవుతున్నాయో సందర్శించారు. మోహన్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 21 ఆటోమేటిక్ వెదర్స్టేషన్లు ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణం వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తామని వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బోనాలలో వరి పంటకోత ప్రయోగం నిర్వహించారు. డీవైఎస్వోలు శ్యాంసుందర్, గణేశ్, సీపీవో శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ ఉన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి ● డీటీవో లక్ష్మణ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డుపై తిరిగే ప్రతీ వాహనదారుడు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేకపోవడంతో పలు వాహనాలను సీజ్చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సుమారు 30 వాహనాల యజమానుల జరిమానాలు విధించారు. డీటీవో లక్ష్మణ్ మాట్లాడుతూ అతివేగంగా వాహనాలు నడిపితే డ్రైవింగ్లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలుకెళ్లడం ఖాయమన్నారు. -
దమ్ముంటే ఎంపీగా పోటీ చెయ్..
● మంత్రి పదవికి రాజీనామా చేసిరా.. ఎవరికి ప్రజాదరణ ఉందో తేల్చుకుందాం ● బండి సంజయ్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేతలుకరీంనగర్టౌన్: గత కొద్ది రోజులుగా బీజేపీ, బండి సంజయ్పైన మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఇకనైనా పిచ్చివాగుడు మానుకోవాలని హెచ్చరించింది. పొన్నంకు దమ్ముంటే నేరుగా పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్ విసిరింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ తరఫున పార్టీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ డి.శంకర్, కార్పొరేటర్ రమణారెడ్డి తదితరులు శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ కల్టెకరేట్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని పొన్నం మరిచిపోయారని అన్నారు. చివరకు న్యాయస్థానాలపై కూడా ఆరోపణలు చేస్తూ లిక్కర్స్కాం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బీజేపీకి రూ.500 కోట్ల ఎలక్ట్రోబాండ్స్ ఇయ్యగానే... కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు అని, బెయిల్కు, బాండ్స్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సుప్రీంకోర్టు పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయాలని కోరారు. ఏ సర్వే చూసినా బండి సంజయ్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నడని తేలడంతో పొన్నంకు ఫ్రస్టేషన్ ఎక్కువైందని, అందుకే కరీంనగర్ నుంచి అభ్యర్థి ఎవరో కూడా తేల్చలేకపోతున్నరని విమర్శించారు. ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోతే మంత్రి పదవికే ఎసరొస్తుందనే భయం పొన్నంకు పట్టుకుందన్నారు. మంత్రిని అని మరిచిపోయి పొన్నం అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ సభ్యసమాజం అసహ్యించుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ ఇకనైనా బండి సంజయ్పై అవాకులు చవాకులు మానుకోవాలని హితవు పలికారు. -
‘బండి’ పోరాటంతోనే స్పందించిన ప్రభుత్వం
● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ సిరిసిల్ల: నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై ఎంపీ బండి సంజయ్ చేపట్టిన పోరాట ఫలితంగానే రూ.50కోట్లు విడుదలయ్యాయని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్లతో కలిపి శుక్రవారం ప్రకటన విడుదలు చేశారు. నేతన్నల దీనావస్థపై బండి చేపట్టిన పోరాటంతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని పేర్కొన్నారు. మిగిలిన రూ.301 కోట్లు కూడా వెంటనే విడుదలు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రాంతంలో వసతి కల్పించాలితంగళ్లపల్లి(సిరిసిల్ల): ఉపాధిహామీ పనులు జరిగే ప్రాంతాల్లో వసతి కల్పించాలని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. తంగళ్లపల్లి మండలంలోని ఉపాధిహామీ సిబ్బందితో మండల పరిషత్లో శుక్రవారం సమావేశమయ్యారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి జాబ్కార్డు గల ప్రతీ కుటుంబానికి పని కల్పించాలని సూచించారు. 8,815 జాబ్కార్డులకు 8,81,500 పని దినాలు కల్పించాలన్నారు. జిల్లాలో మండలాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలని కోరారు. ఏపీడీ నర్సింహులు, ఎంపీడీవో(ఎఫ్ఏసీ) జోగం రాజు, ఇన్చార్జి ఏపీవో రాజనర్సయ్య పాల్గొన్నారు. -
విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యం
సిరిసిల్లక్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ అఖిల్మహాజన్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో నేరవిచారణ సమర్థంగా చేపట్టాలని సూచించారు. పెండింగ్ కేసులపై దృష్టి పెట్టి పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిస్సింగ్కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతీ రోజు వాహనాల తనిఖీలు చేపట్టాలని, గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాలు, మహిళా చట్టలు, గంజాయితో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయితీలు చేస్తామంటూ మధ్యవర్తిత్వం చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని, డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిత్యం చేపట్టాలని సూచించారు. పటిష్ట ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేలా అందరూ కలిసి పనిచేయాలని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఉంచి, బైండోవర్ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో ఫ్లాగ్మార్చ్ నిర్వహించి ప్రజలకు భద్రతభావం కల్గించాలని పేర్కొన్నారు. ట్రెయినీ ఐపీఎస్ రాహుల్రెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్రెడ్డి, నాగేంద్రచారి, మురళీకృష్ణ, సర్వర్, సీఐలు, ఎస్సైలు, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు అక్రమార్కులను పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ నిఘా -
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు
సిరిసిల్ల: జిల్లాలో మొదటి ర్యాండమైజేషన్ను శుక్రవారం పరిశీలించారు. సర్దాపూర్ గోదాంలోని ఈవీ ఎంలను శుక్రవారం కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ నుంచి సిరిసిల్ల, వే ములవాడ నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు ప్రక్రియను పరిశీలించారు. పోలీసుల భద్రత మధ్య స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. సిరిసిల్ల నియోజకవర్గానికి కంట్రోల్ యూనిట్స్ 358, బ్యాలెట్ యూనిట్స్ 358, వీవీ ప్యాట్లు 401, వేములవాడ నియోజకవర్గానికి కంట్రోల్ యూనిట్స్ 325, బ్యాలెట్ యూని ట్స్ 325, వీవీ ప్యాట్లు 364 కేటాయించారు. అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఎన్.ఖీమ్యానా యక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీవోలు రమేశ్, రాజేశ్వర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సముద్రలింగాపూర్, ము చ్చర్లలోని ఆరోగ్య ఉపకేంద్రాలను తనిఖీ చేశారు. సముద్రలింగాపూర్లో ఏర్పాటు చేసిన దంత వైద్యశిబిరాన్ని పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో రజిత, పీవో ఉమాదేవి, మెడికల్ ఆఫీసర్ వేణుగోపాల్, ఎంఎల్హెచ్పీలు శివాని, వనజ పాల్గొన్నారు. ● పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి -
శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024
పార్కుల వివరాలు ఇలా.. వెంకట్రావునగర్ రూ.60లక్షలు నెహ్రూపార్కు రూ.90లక్షలు శివనగర్ పార్కు రూ.40లక్షలు అంబికానగర పార్కు రూ.50లక్షలు ఇందిరాపార్కు రూ.80లక్షలు గణేష్నగర్ పార్కు రూ.50లక్షలు టీ.ఆర్.నగర్ పార్కు రూ.13లక్షలు పద్మనగర్ పార్కు రూ.15లక్షలు యాదాద్రి డెన్స్ పార్కు రూ.10లక్షలు అర్బన్ ఫారెస్టు పార్కు రూ.1.38లక్షలు మీరు చూస్తున్న ఈ చిత్రం సిరిసిల్ల ఇందిరాపార్కులోనివి. రూ.50లక్షలు పైబడి వెచ్చించిన ఈపార్కు అందాలు నిత్యం వందలాది మందికి కనువిందు చేసేవి. ఫొటో, వీడియో షూటింగ్స్కు అనుకూలంగా ఉండే ఈ పార్కు నిర్వహణ లోపంతో ఇలా డస్ట్బిన్స్ విరిగిపోయి, చెత్తకుప్పలతో, పచ్చదనం కనుమరుగైతుంది.వర్కర్లను సర్దుబాటు చేస్తున్నాం హరిత సిరిసిల్ల లక్ష్యాన్ని పాడుకానివ్వం. ప్రణాళికాబద్ధంగా మున్సిపల్ వర్కర్లతో పార్కులు, డివైడర్లు, జంక్షన్లలోని మొక్కలకు నీరు పోయిస్తున్నాం. పట్టణంలో గ్రీనరీ పనుల కోసం వర్కర్ల కొరతను సరిదిద్దుతున్నాం. ప్రత్యేక ప్రణా ళికతో పార్కుల నిర్వహణ సాగిస్తూ అవసరమై చోట్ల అభివృద్ధి పనులు చేపడతాం. – డి.లావణ్య, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల సిరిసిల్లటౌన్: సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు స్మార్ట్సిటీ స్ఫూర్తితో సిరిసిల్లలో నిర్మించిన పార్కులు నిర్వహణ లేక బోసిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, సందర్శకులకు ఆహ్లాదం పంచేందుకు కార్పొరేట్ స్థాయిలో పార్కులు, జంక్షన్లు, డివైడర్లను సుందరీకరించారు. వాటి నిర్వహణను కొన్నేళ్లుగా మహిళా సమాఖ్యలకు కాంట్రాక్టు అప్పగించారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలో పార్కులు కళావిహీనంగా మారాయి. ఇప్పుడు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహణ సాగుతుండగా.. వర్కర్ల కొరత, నిధుల లేమితో పార్కులు పనికిరాకుండా పోయాయి. ఫలితంగా పట్టణ వాసులు, చిన్నారులు, పెద్దలు వేసవిలో ఆహ్లాదం కోసం వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో కళావిహీనంగా మారిన స్మార్ట్ అందాలపై ఫోకస్.. ప్రజాధనం వృథా సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో రూ.5.46 కోట్లతో పది పార్కులు, రూ.2.15 కోట్లతో ఆరు ప్రధాన కూడళ్లు, సుమారు రూ.10 కోట్లతో పట్టణం నుంచి ఇతర నగరాలకు వెళ్లే ప్రధాన రహదారుల విస్తరణతోపాటు డివైడర్లు, వాటి మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలిచేందుకు రూ.కోట్లు వెచ్చించగా.. నిర్వహణ లోపం, పాలకులు, అధికారుల అలక్ష్యం ప్రజలకు ఆహ్లాదాన్ని దూరం చేస్తుంది. మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు పార్కులు, జంక్షన్లు, డివైడర్ల మధ్యలో గ్రీనరీ పెంచుతూ మొక్కలు, గడ్డి పాడవకుండా చూడాలి. ఏపుగా పెరిగిన చెట్లు, మొక్కలు, గడ్డిని నిత్యం కత్తిరించాలి. వాటిని నిర్ధేశిత ప్రాంతాల్లో వేయాలి. మొక్కలకు ఎరువు పెట్టడం, పాడయిన జిమ్ పరికరాలు, పాత్వేస్, ఫౌంటేన్స్ తదితరాలు రిపేరు చేయించాలి. కానీ మున్సిపల్ నిర్వహణ లోపంతో పార్కుల అందాలు కనుమరుగవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ కనుమరుగైన పచ్చదనం సిరిసిల్ల వాసుల ఆగ్రహం నిరుపయోగంగా ప్రజా ఆస్తులు బోసిపోతున్న పార్కులు విరిగిన ఆట వస్తువులుపూర్తిగా పాడుబడిన తోటలాగా కనిపిస్తున్న ఈ ఫొటో శివనగర్ పార్కులోనివి. కార్మికవాడల్లోని ఈపార్కులో వర్కర్లు లేక, మున్సిపల్ పట్టింపు లేకుండా ఇలా మొక్కలు పాడై, చెట్లు విరుగుతూ.. పాత్ వేస్ పాడయి ఎండిపోయిన మొక్కలతో సందర్శకులకు దర్శనమిస్తుంది. ఇక్కడ పనిచేసే వారు లేక పార్కులో తాగుబోతులకు అడ్డాగా మారింది. స్మార్ట్సిటీ లుక్తో ఏర్పాటైన పార్కు ఇప్పుడు వట్టిపోతుంది. -
ఆహ్లాదం అధ్వానం
మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్ పార్కు. అప్పట్లోనే రూ.30లక్షలతో నిర్మించిన ఈపార్కులో అందమైన గోబిగోలు, మోడ్రన్ టాయిలెట్స్, వాటర్ ఫౌంటేయిన్స్, ఓపెన్జిమ్ ఏర్పాటు చేయగా..పార్కు నిర్వహణ కరువైంది. ఫలితంగా పార్కులో జిమ్ పరికరాలు విరిగి, ఫౌంటేయిన్స్ పాడయి, మోడ్రన్ టాయిలెట్స్ గోడలు పగుళ్లు బారి పోయింది. కంటికి ఇంపైన పచ్చదనంతో ఆహ్లాదం పంచిన అందాలు ఇలా ప్రజలకు బోసిపోయి శోభాహీనంగా కనిపిస్తున్నాయి.మీరు చూస్తున్న ఈ ఫొటో వెంకట్రావునగర్ పార్కులోనిది. స్మార్ట్సిటీలో భాగంగా ఏడేళ్లక్రితం ఈపార్కును రూ.60లక్షలతో నిర్మించారు. అప్పట్లో ఎంతో ఆహ్లాదాన్ని పంచిన ఈ పార్కు పచ్చదనం కోల్పోయి, ఆటవస్తువులు విరిగిపోయి, పెద్దలు, చిన్న పిల్లలకు పనికిరాకుండా ఉంటుంది. ఓపెన్జిమ్ పరికరాలు విరిగిపోయి, వాటర్ ఫౌంటేయిన్ అందాలు కోల్పోయి ఇలా కళావిహీనంగా మారింది. -
దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేయండి
సిరిసిల్లటౌన్: అధికారం నుంచి ప్రజలు తిరస్కరించినా కేసీఆర్, కేటీఆర్లకు అహం పోలేదని, తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటుండ్రని.. దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేయండని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులుగా నిలబెట్టిన వారే ఆ పార్టీ అవినీతి, నియంతృత్వంపై ఛీత్కరించుకుంటూ పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అందించే కాంగ్రెస్పైనే ప్రజల ఆశీర్వాదం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ లేవీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలువనోళ్లు రాజకీయం చేస్తే.. ఇట్లానే ఉంటుందని బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి విమర్శించారు. ఆ పార్టీల ని యంతృత్వంపై ప్రజలు విసిగిపోయారని, రాహుల్ నేతృత్వంలో అందించే ప్రజాపాలనకే రానున్న ఎ న్నికల్లో ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చే శారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటై సిరిసిల్లకు కేటా యించిన మెగా టెక్స్టైల్ క్లస్టర్ను వరంగల్కు తరలించి ఇక్కడి కార్మికుల ఉసురు పోసుకున్నారని ధ్వ జమెత్తారు. కరీంనగర్ నుంచి పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. రూ.60కోట్ల అప్పు రూ.7లక్షలకు పెరిగింది అరవై ఏళ్లలో రూ.60కోట్లు అప్పులున్న తెలంగాణను పదేళ్లలో రూ.7లక్షల కోట్ల అప్పుల్లోకి కేసీ ఆర్ కుటుంబం నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడువక ముందే కూలుతుందని శాపనార్థాలు పెడుతు న్న కేసీఆర్ కుటుంబ పార్టీకి ప్రజలు తగిన గుణపా ఠం చెబుతారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ లన్నీ నాలుగు నెలల్లోనే అమలు చేశామని, రాహుల్గాంధీ ప్రకటించిన ఈ ఎన్నికల హామీలు సైతం అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో: ఆది శ్రీనివాస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిద్దామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ నియంతృత్వ పాలనను ప్రజలు పడగొట్టారని, ఇప్పుడు కేంద్రంలో నియంతృత్వాన్ని కూల్చడానికి సిద్ధమయ్యారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో కలిసేందుకు సిద్దమవుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ...బండి సంజయ్ చదువు రాని మొద్దని, ఆయనను గెలిపించుకున్నందుకే ఏమి అభివృద్ధి చేయలేదన్నారు. కేటీఆర్ పనైపోయిందని అమెరికాకు వెళ్లాలో..జైలుకు వెళ్లాలో తేల్చుకునే స మయం ఆసన్నమైందని చురక అంటించారు. చొ ప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అబద్దాలు, మోసాలతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్లు పాలన సాగించి ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చా ర్జి కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలో పాల న పోలీస్ నిర్బంధంలో సాగిందని ఇప్పుడు ప్రజా పాలనే నడుస్తుందన్నారు. నేరెళ్లలో దళితులపై పోలీస్లతో బీఆర్ఎస్ చేపట్టిన దాష్టీకాన్ని ప్రజలు మరువొద్దన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ల డబ్బులు నేతన్నలకు ఇవ్వకుండా ఎందుకు బకాయి పెట్టావ్ కేటీఆర్ అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, సత్యనారాయణ, నాయకులు పెరుమాండ్ల శ్రీనివాస్, ప్రణవ్, నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, చీటి ఉమేశ్రావు, ఆకునూరి బాలరాజు, చొప్పదండి ప్రకాశ్, కనమేని చక్రధర్రెడ్డి, వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, సూర దే వరాజు, పిట్టల భూమేశ్, కౌన్సిలర్లు రెడ్యానాయక్, కుడిక్యాల రవికుమార్, వేముల రవికుమార్, గోనె ఎల్లప్ప, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, వెల్ముల స్వరూప, కల్లూరి చందన, మడుపు శ్రీదేవి, గొట్టె రుక్మిణి పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులే ఆ పార్టీని వీడుతున్నారు రాష్ట్ర విభజన హామీలేవీ బీజేపీ నెరవేర్చలేదు ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ -
‘కరెంట్’ బిల్లుల కష్టాలు
● పనిచేయని ఆన్లైన్ పేమెంట్స్ ● క్యూలైన్లో గంటలకొద్దీ ఎదురుచూపులుసిరిసిల్ల: సిరిసిల్లలో విద్యుత్ వినియోగదారులు ‘కరెంట్’ బిల్లులు చెల్లించేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ‘సెస్’ పరిధిలో విద్యు త్ బిల్లుల చెల్లింపులకు గతంలో ఆన్లైన్లో అవకాశం ఉండగా.. ఆ సేవలు నిలిచిపో యాయి. ఫలితంగా సిరిసిల్లలోని విద్యుత్ వినియోగదారులు ‘సెస్’ ఆఫీస్ వెనకాల క్యూలైన్లో నిల్చొని బిల్లులు చెల్లించాల్సి వ స్తోంది. సిరిసిల్లలో 35వేల విద్యుత్ సర్వీ సులు ఉన్నాయి. రెండే కౌంటర్ల వద్ద క్యూకట్టి బిల్లులు చెల్లించడం ఇబ్బందిగా మారింది. కనీసం ఫ్యాన్ సౌకర్యం లేదు. మహిళలకు ప్ర త్యేక లైన్ లేదు. గతంలో మాదిరి ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించేలా ఆన్లైన్ సౌకర్యం కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
హస్తం అభ్యర్థి ఎవరు?
రాజన్న సిరిసిల్ల● ఎంపీ నామినేషన్ల ప్రక్రియ మొదలైనా స్పష్టత లేదు ● వెలిచాల రాజేందర్రావు పేరు వినిపిస్తున్నా అధికారిక ప్రకటనేది? ● ప్రచారానికి మిగిలింది 22 రోజులే ● కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాలను చుట్టేయడం సాధ్యమేనా? ● అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే వ్యవహరించిన కాంగ్రెస్ ● నిరుత్సాహంలో కేడర్7వినోద్కుమార్కు బీఫామ్కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం బీఫామ్ అందించారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. – కరీంనగర్శుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎవరు? ఇప్పుడు ఇది కేవలం ఎంపీ సెగ్మెంట్లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది. తొలిరోజు పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. కానీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తన అభ్యర్థిపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశం ఇటు కేడర్లో, అటు ఓటర్లలో గందరగోళానికి కారణమవుతోంది. ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, వెలిచాల రాజేందర్రావు, తీన్మార్ మల్లన్న పేర్లను అధిష్టానం పరిశీలించింది. వీరిలో ఎవరో ఒకరికి సీటు ఖాయమని అనుకున్నారు. వెలిచాల రాజేందర్రావు పేరు ను ఖరారు చేశారని చెబుతున్నా.. అధికారిక ప్రకటన రాలేదు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లు నెలరోజుల ముందే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి, గురువారమే తన అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు బీఫాం కూడా అందజేసింది. ఎంపీ బండి సంజయ్ కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. 4 జిల్లాల్లో విస్తరించిన సెగ్మెంట్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలను బాగా ఆకర్షించింది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఉచిత బస్సు, గ్యాస్, నెలకు రూ.2,500, తులం బంగారం తదితర పథకాలతో తమవైపు తిప్పుకోవడంలో ఆ పార్టీ సఫలీకృతమైంది. పేరుకు ఆరు గ్యారంటీలే అయినప్పటికీ.. అందులో మరిన్ని హామీలు ఇమిడి ఉన్నాయి. అయితే, మే 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ 4 జిల్లాల్లో విస్తరించి ఉంది. మొత్తం 7 నియోజకవర్గాలు, 34 మండలాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించినా.. 22 రోజుల్లో రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోని అన్ని మండలాల్లో అభ్యర్థి పరిచయం, ప్రచారం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో విజయావకాశాలు మెండుగా ఉన్నా.. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించింది. ఫలితంగా ప్రచారంలో వెనకబడి మూడోస్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తుండటం కేడర్ను నిరుత్సాహానికి గురిచేస్తోంది.స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేస్తున్న కోట శ్యామ్కుమార్, పొత్తూరి రాజేందర్సాక్షిప్రతినిధి,కరీంనగర్: లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ నెల 25వరకు నామినేషన్లను స్వీకరించనుండగా ఎన్నికల యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధికి గానూ కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరించారు. తొలి రోజు రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా నగరంలోని విద్యానగర్కు చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్కుమార్, గంగాధర మండలం గట్టుబూత్కూర్కు చెందిన పొత్తూరి రాజేందర్ తమసెట్లను ఎన్నికల అధికారి పమేలా సత్పతికి అందజేశారు. మూడంచెల భద్రత కరీంనగర్ కలెక్టరేట్లో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నామపత్రాల దాఖలులో అయిదుగురిని మించి అనుమతించడం లేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుతంగా నామినేషన్ల దాఖలు జరిగేలా నిఘా ఏర్పాటు చేశారు. సీపీ అభిషేక్ మహంతి పర్యవేక్షణలో నిత్యం నామినేషన్ల స్వీకరణలో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 40మంది వరకు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల అధికారి కార్యాలయానికి 200 మీటర్ల పరిధిలో వాహనాలను నియంత్రించేలా ఏర్పాటు చేయగా 100 మీటర్ల వరకు మూడు వాహనాలు అనుమతిస్తున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద ఓ బృందం, మూల మలుపు వద్ద మరో తనిఖీ బృందం, ఆర్వో కార్యాలయం వద్ద మరో భద్రతా విభాగం తనిఖీ చేస్తున్నారు. నామినేషన్ పత్రాలపై గందరగోళం ఉదయం నుంచే నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు కోలాహలం ఏర్పడగా ఎక్కడిస్తారన్నది గందరగోళం నెలకొంది. ఈ కార్యాలయం, ఆ కార్యాలయమంటూ తిప్పుతున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లోపలికి అనుమతించడం లేదని నామినేషన్ పత్రాలపై స్పష్టతనివ్వాలని అభ్యర్థి గవ్వల శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు బయటకు గెంటివేశారని ఆరోపించారు. ఈ క్రమంలో మరో గేట్ నుంచి వెళ్లి నామినేషన్ పత్రాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల: వస్త్రపరిశ్రమకు ప్రభుత్వం పడ్డ బతుకమ్మ చీరల బకాయిలు విడుదల కాలేదని, కొత్తగా వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వలేదని వస్త్రపరిశ్రమ అనుబంధ రంగాల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వస్త్రవ్యాపార సంఘ భవనంలో గురువారం సమావేశమయ్యారు. జేఏసీ కన్వీనర్ మూశం రమేశ్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్రపరిశ్రమలోని సంక్షోభాన్ని నివారించాలని వస్త్రపరిశ్రమ, అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటం చేశామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డిలు పది రోజుల క్రితం జేఏసీ నాయకులతో సమావేశమయ్యారని వివరించారు. వారం రోజుల్లో పెండింగ్ బతుకమ్మ బిల్లులు, కార్మికుల యారన్ సబ్సిడీ అందించేలా చూస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఉపాధి అందించేలా వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామన్నారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతల హామీలతో జేఏసీ 45 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని తా త్కాలికంగా వాయిదా వేసిందని తెలిపారు. సిరిసిల్లలో వస్త్రోత్పత్తిని ప్రారంభించి పది రోజులు గడిచినా బతుకమ్మ బకాయిలు రాలేదని, కార్మికులకు సబ్సిడీ డబ్బులు అందలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ అమలుకాకపోవడంతో మళ్లీ పోరాడాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. జేఏసీ నాయకుడు సిరిసిల్ల రవీందర్ మాట్లాడుతూ వస్త్రోత్పత్తిదారుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రభుత్వం స్పందించాలని కోరారు. 22న నేతన్నల నిరసన దీక్ష వస్త్రపరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు, నూలు సబ్సిడీ డబ్బులు అందించాలని కోరుతూ ఈనెల 22న నేతన్నల దీక్ష చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. వస్త్రపరిశ్రమ అనుబంధ రంగాల ఐక్యవేదిక జేఏసీ నాయకులు పంతం రవి, మండల సత్యం, తాటిపాముల దామోదర్, మంచె శ్రీనివాస్, గోలి వెంకటరమణ, వెల్దండి శంకర్, కోడం రమణ, సిరిమల్ల సత్యం, అ శోక్, మండల రాజు, పిస్క మధు, వెల్దండి దేవదా స్, మోర రాజు, బండారి అశోక్, శ్రీరామ్ సత్యం, ఏనుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.బద్దిపోచమ్మకు బోనం మొక్కులువేములవాడ: బద్దిపోచమ్మకు గురువారం హిజ్రాలు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయంలో బుధవారం నిర్వహించిన రాములోరి కల్యాణానికి హాజరైన వారు బద్దిపోచమ్మకు బోనం తీశారు.న్యూస్రీల్బతుకమ్మ బకాయిలు రాలేదు ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులే లోక్సభ నామినేషన్ల స్వీకరణ షురూ నామినేషన్ పత్రాలివ్వడం లేదని అభ్యర్థి శ్రీకాంత్ ఆందోళన మూడంచెల భద్రత.. అడుగడుగునా వీడియో చిత్రీకరణఅభివృద్ధిలో భాగస్వామ్యం కోసం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి శూన్యం. కాగితాల్లో తప్ప కార్యక్షేత్రంలో విరుద్ధ పరిస్థితి. శివారు గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. దీనికి తోడు యువత రాజకీయాల్లోకి రావాలి. అందుకే నామినేషన్ వేఽశాను. – పొత్తూరి రాజేందర్, స్వతంత్ర అభ్యర్థి అవినీతి అంతం నా పంతం అవినీతి అంతమే నా పంతం. గతంలోనూ రెండుసార్లు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ నామినేషన్ వేయగా తాజాగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిఽగా నామినేషన్ వేశా. ఓటర్లు మద్యానికి బానిసై ఓటు వేయొద్దు. నిజాయితీని గుర్తించి ఓటు వేయాలి. – కోట శ్యామ్కుమార్, స్వతంత్ర అభ్యర్థి అనుకూలతలు ఎన్నో.. అయినా ఆలస్యమే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం చేస్తున్న కొద్దీ.. ప్రత్యర్థులైన బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీతో ములాఖత్ అయ్యారని బీఆర్ఎస్, బీఆర్ఎస్తో చేతులు కలిపారని బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్రెడ్డి తిప్పికొడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో అనేక అనుకూలతలు ఉన్నాయి. మానకొండూరు, హు స్నాబాద్, చొప్పదండి, వేములవాడ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కరీంనగర్లో మైనార్టీల్లో అనుకూల పవనాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆరు గ్యారంటీలు, గత ప్రభుత్వంపై ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్, మేడిగడ్డ బరాజ్ వివాదం తదితర ఆయుధాలు కాంగ్రెస్ అ మ్ముల పొదిలో ఉన్నాయి. అయినా, అభ్యర్థిని ప్రకటించడంలో చేస్తున్న ఆలస్యం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో గందరగోళానికి కారణమవుతోంది. -
‘లే అవుట్ అనుమతులు రద్దు చేయండి’
సిరిసిల్లటౌన్: నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఉన్న అక్రమ లేఅవుట్ అనుమతులు రద్దు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్కు ఫిర్యాదు చేసి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శివారులో సర్వేనంబర్ 1563లో విశ్వనాథస్వామి ఆలయానికి సంబంధించిన 22గుంటల స్థలం ఉందన్నారు. ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేశారని, దాని పక్కనే కొత్తగా లేఅవుట్ అనుమతులు పొందారని పేర్కొన్నారు. మోఖపై 27 ఫీట్ల రోడ్డు ఉందని లేఅవుట్లో 40 ఫీట్లుగా చూపుతున్నారన్నారు. అక్రమ లేఅవుట్కు అనుమతి తీసుకున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటి వేణు, పంతం రవి, మూశం రమేశ్, అన్నల్దాస్ గణేశ్, రొడ్డ రాంచంద్రం, అంకని భాను, తీగల శేఖర్గౌడ్ పాల్గొన్నారు. గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గౌడసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్గౌడ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని హెచ్పీ పెట్రోల్బంక్ సమీపంలో మండల గౌడ సంఘం భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. భవనానికి రూ.11 లక్షల విలు వైన తన సొంత స్థలాన్ని అందజేశారు. భవన నిర్మాణానికి సంఘం మండలాధ్యక్షుడు గంట కార్తీక్గౌడ్ తన వంతుగా రూ.5లక్షలు అందజేశారు. గోవర్ధన్గౌడ్ మాట్లాడుతూ మండల గౌడ సంఘం భవన నిర్మాణానికి ఏ పార్టీ సహకరించలేదని, దాతలు ముందుకురావా లని కోరారు. గోవర్ధన్గౌడ్–రాధా దంపతులను సంఘం సభ్యులు సన్మానించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ రమేశ్గౌడ్, నాయకులు మురళీగౌడ్, నారాయణ, అంజాగౌడ్, శ్రీనివాస్, సుధాకర్గౌడ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. హాస్టల్ అద్దె భవనం పరిశీలన చందుర్తి(వేములవాడ): మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతిగృహం ఏర్పాటుకు అద్దె భవనాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల సహాయ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి గురువారం పరిశీలించారు. వసతిగృహం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న అద్దె భవనంలో కొనసాగుతుండడంతో మరో భవనంలోకి మార్చాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో మరో అద్దె భవనాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల సహాయ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి పరిశీలించారు. భవన పరిసర ప్రాంతాలను క్షుణంగా తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రస్తుతం కొనసాగుతున్న వసతిగృహన్ని తనిఖీ చేసి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వార్డెన్ రవీంద్రస్వామి ఉన్నారు. రెప్యూటెడ్ కాలేజీల నుంచి దరఖాస్తుల ఆహ్వానంసిరిసిల్లకల్చరల్: రానున్న విద్యాసంవత్సరంలో కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు అర్హత గల రెప్యూటెడ్ జూనియర్ కాలేజీల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు ఎస్సీడీవో వినోద్కుమార్ తెలిపా రు. ప్రామాణిక విద్యనందిస్తూ, పోటీపరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత సాఽధిస్తున్న కళాశాలలు దరఖాస్తునకు అర్హులన్నారు. ఐదేళ్ల అకాడమిక్ ప్రొఫైల్తో telanganaepass.cgg. gov.in వెబ్సైట్లో ఈనెల 27లోపు దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత హార్డ్కాపీని ఎస్సీడీవో ఆఫీస్లో అందించాలని సూచించారు. ఎంపికైన కళాశాలలో అర్హ త గల విద్యార్థికి ట్యూషన్ ఫీజు రూ.35వేలు, విద్యార్థికి ప్యాకెట్ మనీగా రూ.3వేలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య ఉపకేంద్రం తనిఖీవీర్నపల్లి(సిరిసిల్ల): గర్జనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని డీఎంహెచ్వో సుమన్ మోహన్రావు గురువారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. డాక్టర్ చిరంజీవి, ఏఎన్ఎం మంజుల, ఆశవర్కర్లు ఉన్నారు. -
No Headline
పవర్లూమ్స్ ముందున్న ఇతను బూట్ల నవీన్కుమార్. జిల్లా కేంద్రంలోని శివనగర్. నవీన్కుమార్కు రెండు పవర్లూమ్ కార్ఖానాలు ఉన్నాయి. ఇందులో ఒక్క షెడ్డులో మాత్రమే ఒక్క షిప్ట్ నడిపేందుకు కార్మికులు ఉన్నారు. రేయింబవళ్లు నడిచే పవర్లూమ్స్ లేబర్ సమస్యతో ఒక్కపూట మాత్రమే అదీ పొద్దంతా నడుస్తోంది. మరో కార్ఖానాలో సాంచాలు నడిపేందుకు లేబర్లు లేరు. గతంలో పనిచేసిన లేబర్లు బిహార్, ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోయారు. వాళ్లను మళ్లీ రమ్మని పిలిస్తే.. బతుకమ్మచీరల ఆర్డర్లు రావడం లేదని తెలిసి.. కూలీ గిట్టుబాటు కాదని రావడం లేదు. స్థానికంగా అందుబాటులో ఉన్న లేబర్లతో ఒక్క కార్ఖానాను నడిపిస్తున్నారు. మరో కార్ఖానా మూతపడింది. ఫలితంగా వస్త్రోత్పత్తి సాగడం లేదు. -
నేతకార్మికులు కావలెను
విమానంలో పొరుగు రాష్ట్రాల కార్మికుల దిగుమతి సిరిసిల్ల శివారులోని ఓ ప్రాసెసింగ్ యూనిట్ యజమాని ఇటీవల పది మంది లేబర్లను ఉత్తరప్రదేశ్ నుంచి విమానంలో రప్పించారు. వారికి అడ్వాన్స్ చెల్లించి, రైలులో వస్తే ఆలస్యమవుతుందని ఏకంగా విమాన టిక్కెట్లు భరించి పది మందిని మధ్యవర్తి ద్వారా రప్పించారు. సిరిసిల్లలో ప్రాసెసింగ్ యూనిట్లలో పనిచేసేందుకు నైపుణ్యం గల లేబర్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నారు.ఇది సిరిసిల్ల శివారులోని బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్లోని ఆధునిక ర్యాపియర్ లూమ్స్. వీటిపై వస్త్రోత్పత్తి చేసేందుకు నైపుణ్యం గల కార్మికులు కావాలి. టెక్స్టైల్పార్క్లోని ఆధునిక సాంచాలు నడిపేందుకు కార్మికులు లేరు. వాస్తవానికి సిరిసిల్లతో పోల్చితే.. ఈ సాంచాలు నడిపే కార్మికులకు మెరుగైన వేతనం లభిస్తుంది. అయినా.. లేబర్లు లేక లూమ్స్పై వస్త్రోత్పత్తి సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం టెక్స్టైల్పార్క్లోని యూనిట్లకు రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇచ్చింది. ఆ బట్టను సకాలంలో అందించాలని జౌళిశాఖ అధికారులు ఒత్తిడి చేస్తుండగా.. లేబర్లు లేక.. ఆర్వీఎం బట్ట ఉత్పత్తి కావడం లేదు. ఇక్కడి వస్త్రోత్పత్తిదారులు ఉన్న లేబర్లకు అడ్వాన్స్గా డబ్బులు చెల్లించి మరీ పనిలో పెట్టుకుంటున్నారు. లేబర్ల కోసం వస్త్రోత్పత్తిదారుల మధ్య పోటీ నెలకొంది.సిరిసిల్లలో వస్త్రోత్పత్తి స్వరూపం సాంచాల సంఖ్య : 28వేలు పాలిస్టర్ బట్టను నడిపే సాంచాలు : 24వేలు కాటన్ వస్త్రాన్ని నడిపే సాంచాలు : 4వేలు టెక్స్టైల్ పార్క్లో యూనిట్లు : 112 ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న యూనిట్లు : 65 వస్త్రోత్పత్తికి అవసరమైన కార్మికులు : 20 వేలు అందుబాటులో ఉన్న కార్మికులు : 6వేలుకార్మికుల కొరత ఉంది సిరిసిల్లలో నైపుణ్యం గల నేతకార్మికుల కొరత తీవ్రంగా ఉంది. సాంచాలు నడిపేందుకు, నేటితరం ముందుకు రావడం లేదు. సిరిసిల్లను విడిచి వెళ్లిన కార్మికులు వారి సొంత ఊరిలోనే ఇతర పనుల్లో స్థిరపడుతున్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులను తెచ్చుకుని కొందరు కార్ఖానాలను నడిపిస్తున్నారు. నేతకార్మికుల కొరత ఇప్పుడు ఎక్కువైంది. పరిశ్రమల యజమానులే సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. – మిట్టకోల సాగర్, చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు, సిరిసిల్ల -
● సిరిసిల్లలో లేబర్ సమస్య ● కార్ఖానాల్లో కార్మికుల కొరత ● టెక్స్టైల్ పార్క్లోనూ ఇదే సమస్య ● వస్త్రోత్పత్తికి విఘాతం ● పొరుగు రాష్ట్రాల కార్మికుల కోసం అన్వేషణ
సిరిసిల్ల: సిరిసిల్ల అంటేనే చేనేత కార్మికుల పుట్టినిల్లు. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం నేత పనిపై ఆధారపడి ఇక్కడ బతుకుతుంటారు. ఒకప్పుడు కార్మికులు పని కోసం కార్ఖానాల ముందు బారులు తీరేవారు. కానీ నేడు పరిస్థితి తారుమారైంది. పనిచేసే నైపుణ్యం గల కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. నేటితరం యువత నేత పనిచేసేందుకు ముందుకురావడం లేదు. ఫలితంగా కార్మికుల కొరతతో కార్ఖానాలు మూతపడుతున్నాయి. తరలివెళ్లిన కార్మికులు సిరిసిల్లలో తరచూ అనేక కారణాలతో వస్త్రపరిశ్రమ బంద్ కావడంతో ఇక్కడ పనిచేసే కార్మికులు వారి సొంత ఊర్లకు వెళ్లిపోయారు. అక్కడే ఏదో ఒక పనిచేస్తూ స్థిరపడిపోయారు. మళ్లీ సిరిసిల్లకు వచ్చినా.. ఎంతకాలం పని ఉంటుందో.. లేదో.. తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మరోవైపు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక కూలీ గిట్టుబాటు కాదని వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. కార్మికులకు అన్నం పెట్టే హోటళ్లు(దినసరి కూలీల భోజనశాలలు) బంద్ అయ్యాయి. యువకులు సాంచాలు నడిపే పని నేర్చుకోవడం లేదు. శిక్షణ ఇస్తామన్నా ఎవరూ ముందుకురావడం లేదు. పాతతరం నేతకార్మికులు ఇతర పనుల్లో స్థిరపడుతూ.. పవర్లూమ్స్ పనికి దూరమవుతున్నారు. గతంలో సిరిసిల్ల కార్ఖానాల ముందు క్యూ కట్టే కార్మికులు ఇప్పుడు కనిపించడం లేదు. కార్మికుల కోసం యజమానులే వెతికే పరిస్థితి వచ్చింది. అడ్వాన్స్లు చెల్లించి పనిలో పెట్టుకునే పరిస్థితి నెలకొంది. సిరిసిల్లలో ఒక్క సాంచాలు నడపడమే కాదు.. వార్పిన్, డయింగ్, వైపని(భీములు నింపడం), సైజింగ్ రంగాల్లోనూ లేబర్ల సమస్య ఉంది. -
మేకను కాపాడబోయి అనంతలోకాలకు
● గిద్దె చెరువులో పడి యువకుడి మృతి ● పండుగపూట విషాదం ● మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మందలోని ఓ మేక ప్రమాదవశాత్తు చెరువులో పడగా..దానిని కాపాడే ప్రయత్నంలో మేకల కాపారి ఊపిరాడక మృతిచెందాడు. శ్రీరామ నవమి పండుగ రోజు ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మేకను కాపాడబోయి ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు మరణించడం అందరిని కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిర్యాల్కర్ సాయికృష్ణ(25) స్థానిక గిద్దె చెరువులో పడి బుధవారం మృతి చెందాడు. రోజు మాదిరిగానే సాయికృష్ణ మేకలను మేపడానికి గిద్దెచెరువు ప్రాంతానికి వెళ్లాడు. ఈక్రమంలో మందలోని ఒక మేక ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఆ మేకను కాపాడేందుకు సాయికృష్ణ చెరువులోకి దిగగా.. మేక చిక్కుకున్న ఊబిలోనే పడి ఊపిరాడక మరణించాడు. ఆ సమయంలో సాయికృష్ణ కేకలు వేసినప్పటికీ ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో చెరువులోనే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న ఎస్సై రమాకాంత్ సంఘటన స్థలానికి వెళ్లి చెరువులోంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు. సాయికృష్ణ మరణవార్త విని కుటుంబ సభ్యులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. పండుగపూట కొడుకు మరణించడంతో ఆ తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతునికి తల్లితండ్రులు లక్ష్మిబాయి–కిషన్, సోదరులు వినిత్, దేవిలాల్ ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. -
‘మావో’ళ్లు ఎట్లున్నరో..!?
● ఆ ఐదు కుటుంబాల్లో కలవరం ! ● బస్తర్ అడవుల్లో కాల్పులు.. జిల్లా మనసుల్లో కలవరం ● అజ్ఞాత నక్సలైట్ల కుటుంబాల్లో ‘గుర్తు తెలియని’ గుబులుసిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలవరం మొదలవుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అటవీ ప్రాంతంలోని కాంకేరు జిల్లా ఛోట్ బెటియా పోలీస్స్టేషన్ పరిధిలోని బినాగుండ, కరోనార్ మధ్య హపటోలా, మాడ్ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో 20 మంది పురుషులు కాగా, మరో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో ముగ్గురిని మాత్రమే గుర్తించగా.. చాలా మంది మావోయిస్టులను గుర్తించలేదు. పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్న మృతదేహాలలో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమిటీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు ఉన్నట్లు గుర్తించారు. మరో స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్ఛార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల సంఖ్య 29 నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలుపగా.. ఆ గుర్తు తెలియని మావోయిస్టులు ఎవరు అనేది అంతుచిక్కడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు అజ్ఞాతంలో ఉంటూ.. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహాల్లో జిల్లా వాసులు ఎవరైనా ఉన్నారా..? అనే అనుమానం ఆ కుటుంబాలను కలవరానికి గురి చేస్తుంది. ‘మావో’ళ్లు ఎక్కడున్నారో.. ఎలా.. ఉన్నారో అని అజ్ఞాత వాసుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అజ్ఞాతంలో జిల్లా మావోయిస్టులు సమసమాజ స్థాపన కోసం.. దున్నేవాడికే భూమి కావాలంటూ.. సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు అజ్ఞాతంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 114 మంది నక్సలైట్లు అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ వర్గాలు ప్రకటించాయి. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి ఉరప్ కొసా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లె వాసి. 42 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. సత్యనారాయణరెడ్డి ఆయన తల్లిదండ్రులు చనిపోయినా.. ఇంటి ముఖం చూడకుండా.. దండకారణ్యంలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయన తలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోటి రివార్డు ఉంది. కోనరావుపేట మండలం ధర్మారంకు చెందిన చంద్రయ్య అలియాస్ ఆజాద్, ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన శ్రీనివాస్రెడ్డి అలియాస్ భరత్, తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బాలసంతుల ఉప్పలయ్య అలియాస్ చిన్నన్నతోపాటు మరో ఒక్కరు అజ్ఞాతంలో ఉన్నారు. కోనరావుపేట మండలం శివంగాళపల్లెకు చెందిన జ్యోతి అలియాస్ జ్యోతక్క ఇటీవల పోలీసులకు లొంగిపోయారు. 20 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న జ్యోతి పోలీసులకు లొంగి పోయి స్వగ్రామంలో ఉంటుంది. బాలసంతుల ఉప్పలయ్య అలియాస్ చిన్నన్న మూడు దశాబ్దాలుగా ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. ఆయన మావోయిస్టు పార్టీలోనే ఉన్నాడా..? పార్టీని వీడి వెళ్లాడా.. ఇప్పటికే ఎన్కౌంటర్లో మరణించాడా తెలియదు. పోలీస్ రికార్డుల్లో మాత్రం చిన్నన్న ఇంకా అజ్ఞాతవాసిగానే ఉన్నాడు. తాజా పరిణామాలు మిగిలిన అజ్ఞాత మావోయిస్టుల కుటుంబాల్లో కలవరం నెలకొంది. కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్లు.. జిల్లాలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నక్సలైట్ల కుటుంబ సభ్యులకు పోలీసులు పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. నక్సలైట్ల తలలపై ఉన్న రివార్డులను సైతం వారికే ఇస్తామని, పునరావాసం కల్పిస్తామని, కేసులు ఎత్తివేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అజ్ఞాత నక్సలైట్ల కుటుంబ సభ్యులకు వైద్యం చేయించడం.. చలికాలంలో దుప్పట్లు పంచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ అజ్ఞాత నక్సలైట్లు అనారోగ్యంతో ఉన్నా.. వారి ప్రాణాలకు హాని లేకుండా.. చూస్తామని జనజీవనంలో కలువాలని పోలీసులు ఆహ్వానించారు. కొంతమేరకు పోలీసుల ప్రయత్నం ఫలించింది. గతంలో సీపీఐ(ఎంఎల్) జనశక్తికి చెందిన 46 మంది సాయుధులు లొంగిపోయారు. మరో వైపు 2005 మార్చి 7న జరిగిన మానాలలో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు చనిపోవడంతో జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం క్షీణించింది. కానీ జిల్లా వాసుల ఉద్యమ అజ్ఞాత వాసం కొనసాగుతుంది. ‘గుర్తు తెలియని శవాల’ గుబులు ఇటీవల మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, అటవీ ప్రాంతాల్లో తరచూ ఎన్కౌంటర్లు జరగడం... ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు మరణించడం, ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. తాజాగా బస్తర్ శివారుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మరణించినట్లు పోలీసులు ప్రకటించినా.. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి గుర్తు తెలియని వారిగా ప్రకటిస్తూ.. చాలా మంది మృతదేహాలను పోస్ట్మార్టమ్ అనంతరం పోలీసులే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల తరబడి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు అజ్ఞాతంలో ఉండడంతో వారి కుటుంబ సభ్యులు కూడా మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అనేక మంది అజ్ఞాత నక్సలైట్లు ‘గుర్తు’ తెలియని శవాలుగా దహనమైపోతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎదురు కాల్పులు జరిగినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలవరం మొదలవుతుంది. సీనియర్ అజ్ఞాత నేతలు మరణించినప్పుడు పోలీసులు ముఖ్యుల పేర్లను ప్రకటిస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్ శవాలు చిధ్రమై ఉండడంతో గుర్తించడం కష్టంగా మారింది. మావోయిస్టు పార్టీ వర్గాలే మృతుల పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. కానీ అటు పోలీసులు, ఇటు మావోయిస్టు వర్గాలు మృతుల వివరాలు వెల్లడించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహాలు ఎవరివి అనే భయం వారి కుటుంబ సభ్యుల్లో గుబులు పుట్టిస్తుంది. అజ్ఞాత వాసులపై పోలీసుల నిఘా.. జిల్లా వ్యాప్తంగా అజ్ఞాత నక్సలైట్లతోపాటు.. వారి కుటుంబ సభ్యులపైనా పోలీసులు నిఘా కొనసాగుతుంది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాలో మవోయిస్టు నక్సలైట్ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలో ప్రస్తుతం నక్సలైట్ల ఉనికి లే కున్నా.. అజ్ఞాతంలో ఐదుగురు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు భావిస్తున్నారు. రా జన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 2005 వరకు మావో యిస్టులు, జనశక్తి నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉండేది. ఆయా పార్టీలో పనిచేసిన మాజీ నక్సలైట్లు ఇప్పటికీ ఉండడంతో వారి కదలికలపైనా నిఘా పెట్టారు. మరోవైపు నక్సలైట్లను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు పోలీసులు మాజీ నక్సలైట్ల జీవన శైలిపైన దృష్టి సారించారు. పొరుగు రాష్ట్రాల్లో వరసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు రాజన్న సిరిసిల్ల జిల్లాను కలవరపెడుతున్నాయి. -
అమ్మను కొడుతున్నారు.. చర్యలు తీసుకోండి
జగిత్యాలక్రైం: అమ్మను నిత్యం అకారణంగా కొడుతూ హింసిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు బాలికలు బుధవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లాకేంద్రంలోని కృష్ణానగర్కు చెందిన మొగిలి రాజ్కుమార్, గంగవ్వకు నలుగురు సంతానం. పెద్ద కూతురు సా రక్క వివాహమైంది. సమ్మక్క (13), సంధ్య (9), కుమారుడు సృజన్(7). కొద్దిరోజుల క్రితం గంగవ్వ ఆడబిడ్డ రేష్మ సృజన్ను తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. రేష్మతోపాటు అత్త రాధ కలిసి కొద్దిరోజులుగా గంగవ్వపై దాడిచేస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా గంగవ్వపై దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గంగ వ్వ కూతుళ్లు సమ్మక్క, సంధ్య బుధవారం ఉదయం తమ తల్లిని తీసుకుని పోలీస్స్టేషన్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వారిని పిలిపించే ప్రయత్నం చేయగా వారు అందబాటులో లేరు. పోలీసులే వారు అద్దెకుంటున్న ఇంటి వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. తమ తల్లిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని రోదించారు. సాయంత్రం రేష్మతోపాటు గంగవ్వ భర్తను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలికలు కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీసులు -
గల్ఫ్బోర్డు ఏర్పాటుపై హర్షం
ముస్తాబాద్(సిరిసిల్ల): తెలంగాణ గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం హర్షనీయమని గల్ఫ్ జేఏసీ నాయకుడు తోట ధర్మేందర్ పేర్కొన్నారు. ముస్తాబాద్లో బుధవారం మాట్లాడారు. 60 ఏళ్లుగా తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నైపుణ్యం లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లి కూలీలుగా పనిచేసి, శ్రమదోపిడీకి గురయ్యారన్నారు. గల్ఫ్లో మృతిచెందిన కుటుంబాలను ఆదుకునేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఎక్స్గ్రేషియాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అమలు చేసేందుకు ముందుకొచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. నిరుద్యోగ కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ప్రోత్సహకాలను సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారని తెలిపారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు చేయూతనివ్వడం ద్వారా గ్రామీణ కార్మిక కుటుంబాలు బాగుపడుతాయన్నారు. జక్కుల చెరువు తూం విడిచిన గుర్తు తెలియని వ్యక్తులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్ శివారులోని జక్కుల చెరువు తూంను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం తెల్లావారుజామున విడిచారు. ప్రస్తుతం చెరువులో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో తూంను విడవడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తూంను విడిచిపెట్టడంతో చెరువులోని సాగునీరు వృథాగా పోతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆయకట్టు రైతులు వెంటనే నీటి పారుదలశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకొని రైతుల సహకారంతో తూంను మూసివేశారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని ఆయకట్టు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ నిర్మాణానికి సహకరించాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీవేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి దేవాదాయశాఖ అధికారులు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కోరారు. ఆలయ పునర్నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ద్వారా రూ.3కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కానీ రూ.30లక్షల కంట్రిబ్యూషన్ను గ్రామస్తులు చెల్లిస్తే ఆ నిధులను నిర్మాణ పనులకు ఖర్చు పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు బుధవారం హైదరాబాద్కు వెళ్లి దేవాదాయశాఖ అధికారులను కలిసి పునర్ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందున కోడ్ ముగియగానే టెండర్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అధికారులను కలిసిన వారిలో చందుపట్ల లక్ష్మారెడ్డి, ముత్యాల ప్రభాకర్రెడ్డి, ఎనగందుల నర్సింలు, యమగొండ పద్మారెడ్డి తదితరులు ఉన్నారు. -
కొండగట్టులో న్యాయమూర్తుల పూజలు
కొండగట్టు(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారిని బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేజిస్ట్రేట్లు దర్శించుకున్నారు. వేములవాడ మేజిస్ట్రేట్ జ్యోతి, సిరిసిల్ల మేజిస్ట్రేట్ ప్రవీణ్కుమార్, కరీంనగర్ మేజిస్ట్రేట్ హేమలత, మంచిర్యాల మేజిస్ట్రేట్ స్వాతి అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు వారి పేరున ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. లడ్డూ @ రూ.75వేలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారా యణపూర్ శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకల్లో భాగంగా బుధవారం స్వామివారి లడ్డూకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామివారి లడ్డూకు పోటాపోటీగా వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన తోట దేవరాజు రూ.75వేలకు స్వామి వారి లడ్డూను దక్కించుకున్నారు. కల్యాణ వేడుకల అనంతరం లడ్డూకు వేలం పాట నిర్వహించగా.. గ్రామస్తులు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. స్వామి వారి లడ్డూ దక్కించుకుంటే శుభాలు, కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే నారాయణపూర్లోని స్వామి వారి లడ్డూకు డిమాండ్ ఉంటుంది. లడ్డూ దక్కించుకున్న తోట దేవరాజు దంపతులను ఆలయ కమిటీ చైర్మన్ సూర నర్సయ్య, కమిటీ సభ్యులు సన్మానించారు. కార్మికులు చస్తున్నా ప్రభుత్వం స్పందించట్లే.. సిరిసిల్లటౌన్: పనుల్లేక నేతకార్మికులు చస్తున్నా ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు విమర్శించారు. సిరిసిల్లలోని కార్మికభవనంలో బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, నేతకార్మికులకు ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సిరిసిల్ల ప్రజల నిరసన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు 48 గంటల్లోపు పరిష్కరించాలని కోరారు. నల్ల చంద్రమౌళి, సోమ నాగరాజు, అజ్జ వేణు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలిసిరిసిల్ల: అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ టి.నర్సింహచారి సూచించారు. జిల్లా కేంద్రంలోని సురభీ, మహాలక్ష్మీ హాస్పిటళ్లలో బుధవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ‘ఫైర్ డ్రిల్’ నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ నర్సింహచారి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలని, వాటిని వినియోగించే విధానంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా.. ముందుచూపుతో జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగిన తరువాత బాధపడి లాభం లేదన్నారు. అగ్ని ప్రమాదాలకు ముందు చూసే మంచిదన్నారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విపత్తులు, అగ్నిమాపక నియంత్రణశాఖ ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్ని మాపకవారోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. మహాలక్ష్మీ డాక్టర్ జైల్సింగ్, ఆస్పత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
గురువారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 20247కల్యాణం నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు, తాళిబొట్టు చూపిస్తున్న అర్చకుడుపల్లకీసేవలో ప్రభుత్వ విప్తలంబ్రాలు పోసుకుంటూ..తాళిబొట్టు కట్టుకుంటూ..న్యూస్రీల్నేత్రపర్వం.. రాములోరి కల్యాణంవేములవాడ: జిల్లా వ్యాప్తంగా శ్రీసీతారాముల కల్యాణం కనుల పండువగా సాగింది. భక్తుల రాకతో జిల్లాలోని శ్రీసీతారామ ఆలయాలు కిటకిటలాడాయి. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి నుంచే భక్తుల రాకతో వేములవాడ పట్టణం రద్దీగా మారింది. చాలా మంది రోడ్లపైనే సేదతీరారు. మున్సిపల్ తరఫున కమిషనర్ అన్వేశ్, ప్రభుత్వం తరఫున ఆలయ ఈవో కృష్ణప్రసాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు ఉత్సవమూర్తులను మేళతాళాలతో వేదికపైకి తీసుకొచ్చారు. మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం సాగింది. కన్యాదాతలుగా భాను దంపతులు వ్యవహరించారు. శివపార్వతులు నెత్తిన జీలకర్ర, చేతిలో త్రిశూలం పట్టుకుని స్వామి వారిని వివాహమాడారు. గుడి చెరువు ఖాళీ స్థలంలో అన్నదానం చేశారు. చైర్మన్ చాంబర్ నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు పలువురు హిజ్రాలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 12 బ్లాక్లుగా విభజించి బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కల్యాణం ప్రశాంతంగా ముగిసింది. ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఏఈవోలు హరికిషన్, బి.శ్రీనివాస్, జయకుమారి, ప్రతాప నవీన్ పరిశీలించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆర్డీవో రాజేశ్వర్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్రెడ్డి పాల్గొన్నారు. కార్మికక్షేత్రంలో రాములోరి కల్యాణోత్సవం సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం సిరిసిల్లలోని వెంకన్న క్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. ప్రధాన అర్చకులు మాడంరాజు కృష్ణమాచారి జానకి–రాముల వివాహ ఘట్టాన్ని నిర్వహించగా ఆలయ ఈవో మారుతీరావు, ఏఈవోలు ప్రభాకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
జనావాసాల్లో సిలిం‘డర్’!
కరీంనగర్ అర్బన్: ప్రజల ప్రాణాలతో చెలగాటమిది. ఏజెన్సీలు నిబంధనలను విస్మరించి వ్యవహరిస్తుంటే నియంత్రించాల్సిన యంత్రాంగం ‘మామూలు’గా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అసలే వేసవి కాలం.. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుతుండగా సకలవర్గాలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో 4లక్షల జనాభా జీవనం సాగిస్తుండగా నివాసాల మధ్యే గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ గోడౌన్లను నిర్వహించడం అత్యంత ప్రమాదకరం. పేలుడు జరిగితే ఊహించని విస్ఫోటనమే. 10వేలకు పైగా ఎక్స్ప్లోజివ్ కెపాసిటీ కాగా సంబంధిత శాఖల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నివాసాల మధ్య నుంచి గోడౌన్లను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతా ఇష్టారాజ్యం నగరంలో 11 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. హెచ్పీ, భారత్, ఇండెన్ కంపెనీలు గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. కంపెనీల కేంద్రాల నుంచి లారీల ద్వారా గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతుండగా వాటిని ఆయా గ్యాస్ ఏజెన్సీలు గోడౌన్లలో దింపుకుని బుక్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీ బాయ్స్ ద్వారా సరఫరా చేయడం జరిగే ప్రక్రియ. కాగా సిలిండర్లతో వచ్చిన లారీలు నిబంధనల ప్రకారం గోడౌన్ గేట్ బయట నిలపాలి. అక్కడి నుంచి కార్మికులు గోడౌన్లోకి ఒక్కొక్కటిగా తీసుకెళ్లి భద్రపరచాలి. సదరు లోడ్ వాహనం ఖాళీ అయిన తర్వాత డెలివరీ బాయ్స్ ఆటోలను గేట్ బయటే నిలిపి గోడౌన్ నుంచి ఒక్కో గ్యాస్ బండను తెచ్చి ఆటోలో వేసుకోవాలి. ఇవీ నిబంధనలు కాగా.. హెచ్చు గ్యాస్ ఏజెన్సీలు వాటిని అటకెక్కించాయి. దర్జాగా ఏకంగా గోడౌన్లోకి భారీ లోడ్లతో వాహనాలు వెళుతుండగా అక్కడే ఆటోలో సిలిండర్లను లోడ్ చేస్తున్నారు. పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుండగా పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు అటువైపు కన్నెత్తిచూడకపోగా కార్యాలయాల్లోనే అన్నీ సక్రమమని మామూలుగా వ్యవహరిస్తున్నారు. గ్యాస్ లీకేజీ, కార్మికులు పొగతాగడం, తదితర నిర్లక్ష్యం మూలంగా భారీ విధ్వంసం జరిగే అవకాశముంది. ఏ చిన్న లీకేజీ ఏర్పడిన ఊహించని నష్టం.. కాలనీలకుకాలనీలే శవాల దిబ్బగా మారే పరిస్థితి. తనిఖీలు తూచ్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలు ఇళ్ల మధ్య, గోడౌన్లు నివాసాలు లేని శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నది నిబంధన. కానీ అత్యధిక ఏజెన్సీల గోడౌన్లు నివాసాల్లో ఉండటం ఆందోళనకర పరిణామం. గోడౌన్కు పటిష్టమైన గోడ.. గేట్ ఉండాలి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా దీనివల్ల నష్టాన్ని నివారించే పరిస్థితి ఉంటుంది. అయితే, కొన్ని గ్యాస్ ఏజెన్సీల్లో మినహా ఇవేవీ ఎక్కడా కనిపించవు. చుట్టూ బహుళ అంతస్తుల భవనాలుండగా గోడౌన్లు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు శివారు ప్రాంతమైనా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన యంత్రాంగం కళ్లున్నా కబోదిలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం నిర్మాణముందా, వ్యవహరిస్తున్నారా..ననేది అగ్నిమాపక శాఖ పర్యవేక్షించాల్సి ఉండగా, లైసెన్స్ రెనివల్ రెవెన్యూ శాఖ నిర్వహించాల్సి ఉండగా ఏవైనా అక్రమాలు జరుగుతున్నాయా, స్టాక్ ఎంత, ఎంత డెలివరీ అయిందనే కోణంలో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఇంకా నివాసాల మధ్య గోడౌన్లు నిర్వహిస్తున్నారంటే అధికారులు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. తనిఖీలు చేసి చర్యలు చేపడతామని సంబంధిత శాఖల అధికారులు వివరించారు. అధికారులు చర్యలు తీసుకుంటారా.. లేదా.. వేచిచూడాల్సిందే. నిబంధనలను విస్మరిస్తున్న ఏజెన్సీలు ఇళ్ల మధ్యే గోడౌన్లు అటకెక్కిన అధికారుల పర్యవేక్షణ మామూళ్ల మత్తులో యంత్రాంగం -
నామినేషన్లకు వేళాయె..
● నేడు ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్లకు శ్రీకారం ● ఉదయం 11నుంచి సాయంత్రం 3 వరకు స్వీకరణ ● చిన్న తప్పున్నా తిరస్కరణే.. నిబంధనలు కఠినతరం ● రెండో గేట్ నుంచే ఉద్యోగులు, ప్రజల రాకపోకలుకరీంనగర్ అర్బన్: సార్వత్రిక ఎన్నికల సమరానికి ప్రధాన ఘట్టం నేటి నుంచే ప్రారంభం కానుంది. నేడు ఉదయం 10గంటలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన గంట నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకు కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో రాజన్న సిరిసిల్లతో పాటు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం ఉండగా కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరించనుండగా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే కలెక్టరేట్ ప్రాంతంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా 144 సెక్షన్ విధించారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నా మినేషన్లను స్వీకరించనుండగా హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు, ప్రజలు రెండోగే ట్ నుంచి రాకపోకలు సాగించేలా ఏర్పాటు చేశారు. జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీకి ఒకరి ప్రతిపాదన చాలు జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో అదే లోక్సభ నియోజకవర్గంలో ఎవరైనా ఒక ఓటరు ప్రతిపాదించాలి. అభ్యర్థి మాత్రం రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా ఓటరై ఉండాలి. అదే రిజిస్టర్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేస్తే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ప్రతి పాదించేవారు నిరక్షరాస్యులైతే ఆర్వో ఎదుట నామి నేషన్ స్వీకరణ సమయానికి ముందు, తర్వాత వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇక ప్రతిపాదించే వారి సంతకాన్ని అభ్యర్థులు ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలితే నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పాటు కేసు నమోదు చేయనున్నారు. ఫాం 2 ద్వారా నామినేషన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఫాం 2–బీ ద్వారా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఫాం–26 ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలి. దీంట్లో అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు ఆస్తులు, రాబడి, ఖర్చు, అప్పులు, క్రిమినల్ కేసులు, రాబడి పన్ను నమోదు చేయాలి. అఫిడవిట్లో అన్ని కాలమ్లు పూరించాలి. ఏదైనా కాలమ్ వదిలి వేసినట్లయితే ఆర్వో నుంచి నోటీసు అందుకోవాల్సి వస్తుంది. అభ్యర్థితో నలుగురికి అవకాశం నామినేషన్ కేంద్రాలకు వెళ్లడానికి అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. అభ్యర్థి వెంట మూడు వాహనాలకు మాత్రమే అనుమతినిస్తారు. రిటర్నింగ్ ఆఫీస్కు వంద మీటర్ల దూరం వరకు వెహికిల్స్కు అనుమతి ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్తో పాటు అభ్యర్థులు బ్యాంకు ఖాతా వివరాలను ఆర్వోకు అందజేయాలి. ఏదైనా జాతీయబ్యాంకు నుంచి కొత్తగా ఖాతా తెరవాలి. ఎన్నికలు పూర్తయ్యే వరకు అదే ఖాతా నుంచి లావాదేవీలు నిర్వహించాలి. లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేసే సాధారణ అభ్యర్థులు రూ.10 వేలు డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో నగదు స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు తెరుస్తున్నారు. నామపత్రాలు పొందొచ్చు కలెక్టరేట్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వీటిని అభ్యర్థులు, వారి తరఫున హాజరయ్యే వారి నుంచి స్వీకరిస్తారు. ఈ నెల 21న ఆదివారం సెలవుదినం కావడంతో ఆ రోజు స్వీకరణ ఉండదు. అభ్యర్థి నాలుగు సెట్ల నామపత్రాలు అందజేయవచ్చు. ఖాళీ నామినేషన్ సెట్లను నేటి నుంచి కలెక్టరేట్ ఆర్వో కార్యాలయం నుంచి పొందవచ్చని అధికారులు వివరించారు. నీడలా నిఘా.. సహాయ కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో నిఘాను తీవ్రతరం చేశారు. కలెక్టర్ చాంబర్ కారిడార్తో పాటు సముదాయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు, పార్టీల వారికి సహకరించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలను ఈసీ వెల్లడించనుంది. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24గంటల్లోనే ఎలక్షన్ వెబ్సైట్లో ప్రదర్శించనున్నారు. కలెక్టరేట్ నామినేషన్ల స్వీకరణ కేంద్రం కాగా 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ర్యాలీగా వచ్చే అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ర్యాలీని ఆపేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోనున్నారు.ఎన్నికల షెడ్యూల్ ఇలా నామినేషన్ల నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 18 స్వీకరణ: ఏప్రిల్ 18 నుంచి 25 పరిశీలన: ఏప్రిల్ 26 ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 29 పోలింగ్: మే 13 ఓట్ల లెక్కింపు: జూన్ 04 -
అందరికీ ఓటరు స్లిప్పులు ఇవ్వాలి
● ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్సిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అందరికీ ఓటరు స్లిప్పులు అందించాలని, తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ కోరారు. హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పెండింగ్ ఉన్న ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, ఏప్రిల్ 26 నాటికి తుది ఓటరు జాబితాను రూపొందించాలని సూచించారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని, స్లిప్పులు అందలేదనే ఫిర్యాదులు రావద్దన్నారు. నేటి నుంచి నామినేషన్లు ఏప్రిల్ 18న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఏప్రిల్ 18 నుంచి 25 వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్ స్వీకరణ, స్క్రుటినీ, ఉపసంహరణ, పోటీ చేసే తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ రూపకల్పన వంటి అంశాలను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. నామినేషన్ స్వీకరణకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, పోటీ చేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నామినేషన్ దాఖలుకు ముందు ప్రీ వెరిఫికేషన్ డెస్క్ వద్ద పరిశీలించాలన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి సాధ్యమైనంతవరకు ప్రత్యేక ఎంట్రీ ఎగ్జిట్ ఉండేలా చూడాలన్నారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణపై నిత్యం నివేదికలను సమర్పించాలని, ప్రతి రోజు దాఖలైన నామినేషన్, అభ్యర్థుల అఫిడవిట్లు పారదర్శకంగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేశ్, రాజేశ్వర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. -
దేశసేవకు మించింది లేదు
● మూడు రెట్ల వేతనం వదలుకొని సివిల్స్కు మొగ్గు ● సొంత మెటీరియల్తో రోజుకు 4 గంటలు చదివా ● సోషల్ మీడియాకు దూరంగా లేను ● పేదరికం, కుటుంబ సమస్యలు చూసి దిగులొద్దు ● ప్రణాళిక ప్రకారం చదివితే సివిల్స్ కష్టమేమీ కాదు ● ‘సాక్షి’తో 27వ ర్యాంకర్ సాయికిరణ్సాధిస్తానన్న నమ్మకంతో చదివా.. సివిల్ సర్వీసెస్ చదవడమంటే చాలా కష్టపడాలి. అందులోనూ కోచింగ్ లేకుండా, మరోవైపు ఉద్యోగం చేస్తూ చదవడమంటే మాటలు కాదు. కానీ, సాధిస్తానన్న నమ్మకంతో ప్రణాళిక ప్రకారం చదివా. సోషియాలజీని ఆప్షనల్గా ఎంచుకున్నాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. కొంచెం ఇంటర్నెట్ నుంచి తీసుకునేవాడిని. ఉద్యోగానికి వెళ్లేవాడిని. రోజూ 3 నుంచి 4 గంటలు క్రమం తప్పకుండా చదివేవాడిని. వారాంతాల్లో మాత్రం పూర్తి సమయం చదివేందుకే కేటాయించేవాడిని. అలా క్రితం సారి సివిల్స్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. అక్కడ కేవలం 18 మార్కులతో సివిల్స్ మిస్సయ్యాను. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. జరిగిన పొరపాట్లు పునరావతం కాకుండా మరింత కట్టుదిట్టంగా చదివాను. ముఖ్యంగా నేను రాసిన పేపర్లను థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేయడం వల్ల నా సామర్థ్యం ఎప్పటికప్పుడు అంచనా వేసుకోగలిగాను. ఆన్లైన్లోనే మాక్ ఇంటర్వ్యూలకు ప్రిపేరవడం కలిసి వచ్చింది. సివిల్స్ ప్రిపేరవుతున్నా సోషల్ మీడియాకు దూరంగా లేను. నాకు ఎంత కావాలో అంత పరిమితి మేరకు వాడుకున్నాను.‘దేశ సేవకు మించింది లేదు.. సమాజానికి మేలు చేసే పనితో పోలిస్తే డబ్బుకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు.. అందుకే, మూడు రెట్ల అధిక జీతం వదులుకొని సివిల్ సర్వీస్లో చేరబోతున్నాను.. పేదలు, సమాజం కోసం పాటుపడేందుకు, వారిని ఆదుకునేందుకు సివిల్స్ గొప్ప వేదిక.. ఐదేళ్ల క్రితం మొదలైన సివిల్స్ వేట మొన్నటి ఫలితాలతో పూర్తయింది. పేదరికం, కుటుంబ సమస్యలు సివిల్స్ సాధనలో అసలు ఆటంకాలే కావు.. ప్రణాళిక ప్రకారం చదివితే సాధించడం కష్టమేమీ కాదు’ అన్నారు సివిల్స్ ఆలిండియా 27వ ర్యాంకర్ నందాల సాయికిరణ్. తాను సివిల్స్కు ఎంపికై న తీరు, విజయం సాధించిన క్రమాన్ని బుధవారం తన స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం.. నేటి యువతకు సివిల్స్ కష్టమేమీ కాదు. కాకపోతే క్రమశిక్షణతో ప్లాన్ ప్రకారం చదువుకుంటూ పోవాలి. పేదరికం, కుటుంబ సమస్యలపై దిగులు పడొద్దు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా దరిచేరుతుంది. బోలెడంత మెటీరియల్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. మాక్ ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్లో అటెండ్ అవ్వొచ్చు.కల కోసం శ్రమించాను.. సివిల్ సర్వీసెస్లో చేరాలన్న నా కల కోసం చాలా శ్రమించాను. చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక ఉండేది. కానీ, ఏ ఉద్యోగం చేయాలన్నది మాత్రం అప్పుడే నిర్ణయించుకోలేదు. ఆర్ఈసీ వరంగల్లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాను. మంచి ప్యాకేజీతో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అయినా, ఏదో వెలితి. ఆ సమయంలో ఐఏఎస్ అయితే దేశానికి ఎలా సేవ చేయవచ్చో ఆలోచించాను. నా సివిల్స్ కలకు అక్కడే బీజం పడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. మా నాన్న కాంతారావు చేనేత కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీ కార్మికురాలు. మాది మధ్య తరగతి కుటుంబం అని నేను ఏనాడూ కలత చెందలేదు. వారి శక్తి మేరకు నన్ను, నా సోదరిని బాగా చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు నా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. -
కేటీఆర్ను నమ్ముకుంటే సెల్ఫీలే మిగిలాయి
● ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి సిరిసిల్ల: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారక రామారావును నమ్ముకుని పదేళ్లు పని చేస్తే.. సెల్ఫీలు, అవమానాలే మిగిలాయని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు నేవూరి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అంకితభావంతో బీఆర్ఎస్కు, కేటీఆర్ కోసం పని చేసేనోళ్లు బిచ్చమెత్తుకునే ప రిస్థితి ఎదురైందన్నారు. సర్పంచ్లకు లక్షల్లో బిల్లులు పెండింగ్ పెట్టారని, తనకు రూ.80లక్షలు రావాల్సి ఉందన్నారు. పదేళ్లుగా తాను, తన భార్య ఎల్లారెడ్డిపేట సర్పంచ్గా బీఆర్ఎస్లో ప నిచేసి చాలా నష్టపోయామన్నారు. పార్టీ కోసం, కేటీఆర్ కోసం ఎంతో పనిచేసినా.. జెడ్పీటీసీ ఎ న్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుని రాజకీయంగా ఎదగకుండా చేశారని ఆరోపించారు. రి యల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.50కోట్ల నష్టం వచ్చినా.. కేటీఆర్ మాట సాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఆయన సా మాజికవర్గం వారికి అన్ని పనులు చేశారన్నారు. బీఆర్ఎస్లో ఆయన బంధువులు, అనుయాయులు తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. నేతకార్మికులకు రూ.260కోట్ల బతుకమ్మ చీరల బకాయిలు ఆపింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కొమిరిశెట్టి తిరుపతి, కౌన్సిలర్లు రెడ్డి నాయక్, కుడిక్యాల రవికుమార్, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement