‘భరోసా’.. వచ్చింది | - | Sakshi
Sakshi News home page

‘భరోసా’.. వచ్చింది

Published Fri, Feb 28 2025 9:01 PM | Last Updated on Fri, Feb 28 2025 9:00 PM

‘భరోసా’.. వచ్చింది

‘భరోసా’.. వచ్చింది

షాద్‌నగర్‌: ఉపాధి హామీ పఽథకంలో పని చేస్తున్న కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏడాదికి రెండు విడతల్లో నిధులు జమ చేయనుంది. మొదటి విడతలో భాగంగా శివరాత్రి రోజున కూలీల కుటుంబాలకు రూ.6వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 560 గ్రామ పంచాయతీల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.6కోట్ల 38 లక్షల 40 వేలు మంజూరు చేసింది. నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 10,640 మంది ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు లబ్ధి చేకూరింది.

వీరికే ఆత్మీయ భరోసా..

● భూమి లేని రైతులు, వ్యవసాయ కార్మికులకే పథకం వర్తిస్తుంది.

● 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పని పూర్తి చేసిన ఉపాధి హామీ కూలీలు అర్హులు.

● శాశ్వత నివాసం ఉన్న వారు, ధరణి పోర్టల్‌లో ఒక్క గుంట కూడా భూమి లేని నిరుపేదలను ఈ పథకం కింద ఎంపిక చేశారు.

● ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితా ప్రకారం గ్రామ సభలు నిర్వహించారు. అర్హుల జాబితాను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించి, లబ్ధి దారులను గుర్తించారు.

రైతుల ఖాతాల్లో జమ

ఇందిరమ్మ భరోసా పథకం కింద ఉపాధి హామీ పథ కంలో పని చేస్తున్న భూమి లేని పేదలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమయ్యాయి.

– అరుణ, ఏపీఓ, ఫరూఖ్‌నగర్‌

సంక్షేమమే ధ్యేయం

ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోంది. భూమి లేని పేదలకు అండగా నిలిచింది. ఇందిరమ్మ భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందజేసింది.

– వీర్లపల్లి శంకర్‌, ఎమ్మెల్యే, షాద్‌నగర్‌

మండలం లబ్ధిదారులు

అబ్దుల్లాపూర్‌మెట్‌ 720

ఆమనగల్లు 368

చేవెళ్ల 207

చౌదరిగూడ 267

ఫరూఖ్‌నగర్‌ 538

ఇబ్రహీంపట్నం 749

కడ్తాల్‌ 390

కందుకూరు 1,566

కేశంపేట 330

కొందుర్గు 142

కొత్తూరు 32

మాడ్గుల 828

మహేశ్వరం 269

మంచాల 948

మొయినాబాద్‌ 65

నందిగామ 106

షాబాద్‌ 432

శంషాబాద్‌ 89

శంకర్‌పల్లి 454

తలకొండపల్లి 689

యాచారం 1,451

ఉపాధి హామీ కూలీలకు నిధులు విడుదల

ఒక్కో కుటుంబానికి రూ.6వేల చొప్పున..

జిల్లాకు రూ.6.38 కోట్లు మంజూరు

లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ

10,640 కుటుంబాలకు లబ్ధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement