మహిళల చదువుతోనే కుటుంబంలో మార్పు | - | Sakshi
Sakshi News home page

మహిళల చదువుతోనే కుటుంబంలో మార్పు

Published Fri, Feb 28 2025 9:01 PM | Last Updated on Fri, Feb 28 2025 9:00 PM

మహిళల చదువుతోనే కుటుంబంలో మార్పు

మహిళల చదువుతోనే కుటుంబంలో మార్పు

రసూల్‌పురా: మహిళలు చదువుకుంటే కుటుంబమంతా విద్యావేత్తలుగా మారుతారని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. గురువారం మారేడుపల్లి కస్తూర్బాగాంధీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను గవర్నర్‌ ప్రారంభించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని ప్రశంసించారు. కస్తూర్బా కళాశాల విద్యార్థులు విద్యతో పాటు ఇతర కార్యక్రమాల్లో గొప్ప మైలురాళ్లు అధిగమిస్తున్నారని కొని యాడారు. స్వామి వివేకానంద జీవితాన్ని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొ, ఆయన బాటలో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు, క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ సరోత్తమ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement