ఇండియా, ఇంగ్లండ్‌ సిరీస్‌లో స్వల్ప మార్పులు | BCCI Announced Revised Schedule For Bangladesh And England Series | Sakshi
Sakshi News home page

ఇండియా, ఇంగ్లండ్‌ సిరీస్‌లో స్వల్ప మార్పులు

Published Tue, Aug 13 2024 9:10 PM | Last Updated on Wed, Aug 14 2024 9:35 AM

BCCI Announced Revised Schedule For Bangladesh And England Series

వచ్చే ఏడాది భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ సిరీస్‌లోని తొలి టీ20 చెన్నైలో, రెండో టీ20 కోల్‌కతాలో జరగాల్సి ఉన్నాయి. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ల వేదికలు తారుమారు కానున్నాయి. తొలి టీ20 కోల్‌కతాలో, రెండో టీ20 చెన్నైలో జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 

అలాగే ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగే ఓ టీ20 మ్యాచ్‌ వేదిక కూడా మారనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల్లోని తొలి టీ20 ముందుగా ప్రకటించిన ధర్మశాల వేదికగా కాకుండా గ్వాలియర్‌లో జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement