cricket news
-
'పనికొచ్చే ప్రశ్నలు వేయండి'.. గుజరాత్ బ్యాటర్ ఆగ్రహం!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విధించిన 255 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ తెవాటియా మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో గుజరాత్ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఓటమి అనంతరం గుజరాత్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ మీడియా సమావేశానికి వచ్చాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న రిపోర్టర్లలో ఒక వ్యక్తి తన ప్రశ్నలతో గ్లెన్ ఫిలిప్స్కు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు. 'ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసినప్పుడే మీ మైండ్లో ఓటమి భయం మొదలైందనుకుంటా' అని ప్రశ్నించాడు. రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఫిలిప్స్ ఆ తర్వాత సదరు రిపోర్టర్కు ధీటుగా బదులిచ్చాడు. 'ఇదొక దిక్కుమాలిన ప్రశ్న. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడు లక్ష్యం గురించి ఆలోచించరు. మ్యాచ్లో టార్గెట్ ఎంత ఉన్నప్పటికీ పరుగులు చేయడానికే ప్రయత్నిస్తారు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలను మదిలోకి రానివ్వరు. మీరు వేసిన ప్రశ్న చాలా ఘోరంగా ఉంది. ఐపీఎల్ ఇంతకుమించి టార్గెట్లు ఛేదించిన సందర్భాలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారా?అయితే భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు ఒత్తిడి ఉండడం సహజం. ఆ ఒత్తిడిలో ఒక్కోసారి విజయం సాధించలేకపోవచ్చు. అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. చదవండి: ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ! -
ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ!
భారత్లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత విస్తరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను రెండుసార్లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి తగిన కార్యచరణను రూపొందిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘బీసీసీఐ సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లను మార్చి-మే మధ్యలో నిర్వహిస్తోంది. నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లు సహా మొత్తం 74 మ్యాచ్లు ఉన్న టోర్నమెంట్లో విస్తరణ తర్వాత 94 మ్యాచ్లు జరిగే అవకాశముంది. దీంతో ఇప్పటివవరకు లీగ్ దశలో 14 మ్యాచ్లాడిన జట్లు ఇకపై 18 మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే ఇన్ని మ్యాచ్లను ఒకేసారి నిర్వహించడం వల్ల సీజన్ మరింత పొడిగించాల్సి ఉంటుంది. అందువల్ల టోర్నీ మార్చి నుంచి జూన్ వరకు జరిగే అవకాశముంటుంది. అయితే ఎండాకాలం కావడంతో అధిక వేడిమి కారణంగా క్రికెటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఐపీఎల్ను రెండు విడతల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందున్న ఆలోచన కూడా మాకు కలిగింది. ఈ నేపథ్యంలో మొదటి విడతను ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో, రెండో విడతను సెప్టెంబర్-అక్టోబర్ మధ్య జరిగేలా ప్రణాళిక రచించాలని చూస్తున్నాం. ఐపీఎల్ కేవలం బీసీసీఐని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ బోర్డులను, ఆటగాళ్లను ప్రభావితం చేస్తోంది. అయితే టోర్నమెంట్ను మరో విండోకు మార్చవచ్చా లేదా అనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి వస్తాం. అప్పటివరకు ఐపీఎల్ ఇప్పుడున్న ఫార్మాట్లోనే జరుగుతుంది.’ అని చెప్పుకొచ్చారు. అయితే అరుణ్ ధుమాల్ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న ఫార్మాట్ను కాదని రెండు విడతల్లో ఐపీఎల్ నిర్వహించడమనేది ఒక అనవసరమైన ప్రక్రియ అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ టోర్నీల షెడ్యూల్ కూడా గందరగోళంగా తయార వుతుందని, ఆటగాళ్లు గాయపడే అవకాశాలు మరింత పెరుగుతాయని పెదవి విరుస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది.నేడు జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్తో రాజస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. మే 31 (ఆదివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది.చదవండి: పాపం సాయి సుదర్శన్.. ఐపీఎల్ చరిత్రలో వింత ఔట్! -
పాపం సాయి సుదర్శన్.. ఐపీఎల్ చరిత్రలో వింత ఔట్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్ పోరులో గుజరాత్ టైటాన్స్కు ఏదీ కలిసి రాలేదు. ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైంది. అయితే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరు నిజంగా బాధాకరమని చెప్పొచ్చు. ఈ సీజన్ లో అత్యంత నిలకడగా పరుగులు చేస్తున్న సాయి సుదర్శన్.. ఆర్సీబీతో క్వాలిఫయర్-1 పోరులోనే వరుస బౌండరీలతో మంచి టచ్లో కనిపించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో అద్భుతమైన స్క్వేర్ కట్తో బౌండరీ బాదాడు. వరుసగా రెండో ఫోర్ వచ్చిందని అభిమానులు అనుకుంటున్న తరుణంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. షాట్ ఆడిన తర్వాత సాయి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. గాల్లో తిరుగిన బ్యాట్ వచ్చి నేరుగా లెగ్ స్టంప్ను తాకి బెయిల్స్ను పడగొట్టింది. ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ సాయి సుదర్శన్ను హిట్ వికెట్గా ఔటిచ్చాడు. దీంతో చేసేదేం లేక సాయి సుదర్శన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇలాంటి విచిత్రమైన ఔట్ చూసి కామెంటేటర్లతో పాటు అభిమానులు కూడా షాక్ తిన్నారు. మ్యాచ్లో కూడా ఇదే టర్నింగ్ పాయింట్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో గుజరాత్ తరఫున నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ ఆరెంజ్క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. గతేడాది కుశాల్ మెండిస్..ఇక ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్ దశలో హిట్ వికెట్ అయిన రెండో బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. తొలి బ్యాటర్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతేడాది ముంబై ఇండియన్స్తో ప్లేఆఫ్ మ్యాచ్ సందర్భంగా ఇదే గుజరాత్కు చెందని కుశాల్ మెండిస్ హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ ఔట్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.'బంతి బౌండరీకి వెళ్లింది.. కానీ బ్యాట్ వికెట్లను కొట్టేసింది', 'పాపం సాయి సుదర్శన్', 'క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఔట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 92 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. HOW UNFORTUNATE! 🤯Probably the only way to end Sai Sudharsan's streak of five 50-plus scores 🫣Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/DbpVS0JUKw— IndianPremierLeague (@IPL) May 26, 2026చదవండి: గుజరాత్పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే! -
గుజరాత్పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గొడవలో అయినా, ఫన్నీ మోడ్లో అయినా కింగ్ కోహ్లిని ఎవరు బీట్ చేయలేరు. మ్యాచ్లో కోహ్లి 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఆర్సీబీకి శుభారంభం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఫొటో సెషన్ జరిగింది. ఈ సమయంలో డగౌట్లో ఉన్న కోహ్లీ గుజరాత్ జట్టు వైపు చూస్తూ.. ‘ బాగైంది.. మేం మీపై గెలిచి ఫైనల్కు చేరుకున్నాంలే’ అంటూ ఫన్నీ మోడ్లో తన చేతులతో స్నేక్ గెచ్చర్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన గుజరాత్ ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. అంతకముందు గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలోనూ కోహ్లీ గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్తో కయ్యానికి కాలు దువ్వడం కనిపించింది. అయితే ఇదంతా సరదా కోసమే చేసినట్లు వీడియోలో క్లియర్గా కనిపించింది. ఇక జాకబ్ డఫీకి బంతి ఇవ్వడానికి ముందు కోహ్లీ చేసిన మరొక చర్య కూడా వైరల్గా మారింది. తాను బౌలింగ్కు దిగుతున్నట్లు అంపైర్ వద్దకు వెళ్లి తన క్యాప్ను ఇచ్చిన కోహ్లీ ఆ తర్వాత బంతి తీసుకొని రనప్కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన జాకబ్ డఫీ బంతి ఇవ్వమని అడగడంతో అతని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తన క్యాప్ ఇవ్వాలంటూ అంపైర్ వద్దకు వెళ్లగా, అతడు నిరాకరించాడు. దీంతో 'ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయండి' అని అంపైర్ను అడగడం వీడియోలో కనిపించింది. గుజరాత్పై విజయం తర్వాత భార్య అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం కనిపించింది. ఇలా మ్యాచ్ మొత్తం తన చర్యలతో కోహ్లీ హల్చల్ చేశాడు. ఇవన్నీ కోహ్లీ సరదాతో చేసినప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం అతడి చర్యను తప్పుబట్టారు. కోహ్లికి వెటకారం అనుకున్నదాని కంటే ఎక్కువే ఉందని కామెంట్లు పెట్టారు. మొన్న హెడ్తో గొడవ పెట్టుకున్న కోహ్లి ఇవాళ గుజరాత్ టీమ్ను హేళన చేసేలా అతడి స్నేక్ గెచ్చర్ ఉందని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Virat Kohli teasing Gujarat Titans players during their photoshoot in Dharamshala 🤣🔥- Rajat Patidar did the same with GT too 😭 pic.twitter.com/368X6y0VpA— Jara (@JARA_Memer) May 26, 2026 -
పాటీదార్ ఒక స్లో పాయిజన్.. కప్పు గెలిస్తే చరిత్రే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆ జట్టును వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేర్చడంలో సఫలమయ్యాడు. నాయకుడంటే ముందుండి నడిపించాలి. ఆ మాటలను ఇవాళ పాటీదార్ అక్షరాలా చేసి చూపించాడు. మొదట తన అద్భుత బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరు సాధించడంలో పాటీదార్ కీలకపాత్ర పోషించి షాన్దార్గా నిలిచాడు. త్రుటిలో సెంచరీ చేజారినా, బ్యాటింగ్లో పొరపాట్లు ఉన్నా సరే, అతడి విలువైన ఇన్నింగ్స్ దానిని మర్చిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా తన టీమ్ను రెండోసారి ఫైనల్ చేర్చిన అతను మరో టైటిల్ అందిస్తే చరిత్రలో నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. గుజరాత్పై విజయంతో ఐపీఎల్లో ఒక జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ల జాబితాలో పాటీదార్ చేరిపోయాడు. గతంలో ఎంఎస్ ధోని (సీఎస్కే, 2010, 2011), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ 2019, 2020), హార్దిక్ పాండ్యా ( గుజరాత్ టైటాన్స్ 2022, 2023), శ్రేయస్ అయ్యర్ (2024లో కేకేఆర్, 2025లో పంజాబ్) ఈ ఘనత సాధించారు.స్లో పాయిజన్ బ్యాటింగ్..రజత్ పాటీదార్ బ్యాటింగ్ స్టైల్ స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. స్లో పాయిజన్ మెళ్లిగా ఎక్కినా బలంగా ప్రభావం చూపుతుంది. అదే తరహాలో ముందు స్లోగా ఆడడం.. ఒకసారి కుదురుకున్నాక అతడి విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం పాటీదార్ స్టైల్. 2025 సీజన్లో బ్యాటింగ్లో కూడా ఫర్వాలేదనిపించే ప్రదర్శన (143.77 స్ట్రైక్రేట్తో 312 పరుగులు) చేసిన అతను ఈసారి మరింతగా చెలరేగిపోయాడు. టైటిల్ సాధించిన నాయకుడిగా వచ్చిన ఆత్మవిశ్వాసం కావచ్చు తాజా సీజన్లో అతను అసాధారణ బ్యాటింగ్ను ప్రదర్శిస్తున్నాడు. తాను ఎదుర్కొన్న 247 బంతుల్లో అతను 486 పరుగులు (5 అర్ధసెంచరీలు) సాధించాడు. వీటిలో 29 ఫోర్లు, 41 సిక్సర్ల ద్వారానే 362 పరుగులు రాబట్టడం అతని బ్యాటింగ్ ధాటి ఏమిటో చూపించింది. మంగళవారం మ్యాచ్లో అతను అద్భుత షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆరుగురు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్న అతనూ ఎవరినీ వదలకుండా అందరి బౌలింగ్లో సిక్సర్లు బాదాడు. కుల్వంత్ ఓవర్లో దూకుడు ప్రదర్శించిన తర్వాత రషీద్ ఓవర్లో అతను 2 భారీ సిక్స్లు కొట్టాడు. వీటిలో ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టిన సిక్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. రబాడ ఓవర్లోనూ రెండు సిక్స్లు కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన అతను ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లోనూ 2 సిక్స్లు కొట్టాడు. ఇలా కెప్టెన్గా, ఆటగాడిగా సూపర్ సక్సెస్ అయిన రజత్ పాటీదార్ తొందరలో టీమిండియా గడప కూడా తొక్కే అవకాశం లేకపోలేదు.Captains who led their teams into back to back IPL Finals:- MS Dhoni (2010, 2011). - Rohit Sharma (2019, 2020). - Hardik Pandya (2022, 2023). - Shreyas Iyer (2024, 2025). - Rajat Patidar (2025, 2026). pic.twitter.com/2evHNpBfQK— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026Breathtaking Batting 🤯🎥 Rajat Patidar leaving the best in the business awestruck 😳❤️Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/5BFUDFTHH1— IndianPremierLeague (@IPL) May 26, 2026చదవండి: ‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్ను గెలిపించింది వాళ్లే!’ -
‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్ను గెలిపించింది వాళ్లే!’
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్ చేరింది. మ్యాచ్లో 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. ధర్మశాలలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ఒత్తిడిని అధిగమించి ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం, మైదానంలో ప్రశాంతంగా నిలదొక్కుకోవడం కీలకంగా మారిందని అన్నారు. ఈ మ్యాచ్లో తాము కేవలం స్కోరును కాపాడుకోవడానికి రాలేదని, ప్రత్యర్థిపై పూర్తి దూకుడుతో అటాక్ చేయాలనే మైండ్ సెట్తో బరిలోకి దిగడం వల్లే విజయం సొంతమా అయిందని పటీదార్ పేర్కొన్నారు.పాటీదార్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశాడు. సెంచరీ ఏముంది మరో మ్యాచ్లో చేసుకోవచ్చు. అయినా నా బ్యాటింగ్లో చాలా తప్పులున్నాయి. లైఫ్లు లభించడంతోనే ఇవాళ భారీ స్కోరు సాధించాను. మేము భారీ స్కోరు చేసినప్పటికీ, మా బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. గెలుపు క్రెడిట్ను నేను తీసుకోలేను, మా బౌలర్లే ఇవాళ నిజమైన హీరోలు.ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడమే తమ ప్రధాన లక్ష్యమని మా బౌలర్లు ముందే చెప్పారు. లీగ్ ముందుకు సాగుతున్న కొద్దీ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్, రసిక్ సలామ్, కృనాల్ మ్యాచ్ విన్నర్లుగా మారిపోయారు. పవర్ ప్లేలో కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఫైనల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తాం’ అని రజత్ పాటీదార్ ధీమా వ్యక్తం చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెపె్టన్ రజత్ పాటీదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్లు) విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన చేయగా... విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Body Language: “𝘞𝘦 𝘢𝘳𝘦 𝘤𝘰𝘮𝘪𝘯𝘨 𝘧𝘰𝘳 𝘺𝘰𝘶” 🦁 pic.twitter.com/oVXoBEWBki— Royal Challengers Bengaluru (@RCBTweets) May 26, 2026 -
ప్లేఆఫ్స్ చేరని పంజాబ్.. అర్ష్దీప్ కీలక నిర్ణయం!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. లీగ్ దశలో పంజాబ్ తమ చివరి మ్యాచ్ గెలిచినప్పటికీ, ముంబైపై రాజస్తాన్ రాయల్స్ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరని నేపథ్యంలో ఆ జట్టు బౌలర్ అర్ష్దీప్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే అర్ష్దీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను చాలా వరకు క్లియర్ చేశాడు. దాదాపు 200 పోస్టులను ఇన్స్టా ఖాతా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోహ్లీతో కలిసి రీల్ చేసిన వీడియోను తొలగించడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీతో చేసిన రీల్ దాదాపు 15 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం అర్ష్దీప్ ఖాతాలో 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే అర్ష్దీప్ ఉన్నపళంగా తన ఇన్స్టా నుంచి పోస్టులు తొలగించడం వెనుక బలమైన కారణముంది. లీగ్ స్టేజ్లో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం.. అర్ష్దీప్ సింగ్ ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో పంజాబ్ స్పిన్నర్ చాహల్.. చేతులు అడ్డం పెట్టుకుని ఈ సిగరేట్ వేప్ చేస్తూ కనిపించాడు. దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ ఘటన తర్వాత ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్దీప్ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు సోషల్ మీడియా వినియోగంపై ఫ్రాంచైజీ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు ఇకపై ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే రూపొందించి విడుదల చేయాలనే యాజమాన్యం కఠిన సూచనలు చేసింది. అందుకే అర్ష్దీప్ తన పోస్టులను తొలగించాడంటూ అభిమానులు పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో అర్ష్దీప్ సింగ్ పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్లాడిన అర్ష్దీప్ కేవలం 14 వికెట్లు మాత్రమే తీశాడు. అందునా ప్రతీ మ్యాచ్లోనూ ఓవర్కు దాదాపు 10 పరుగుల పైనే సమర్పించుకున్నాడు.Arshdeep Singh to Virat Kohli ; Paaji run km rah gye century pakki thi. Kohli ; Toss jeet gye nhi to teri bhi pakki thii dew mein 🤣#INDvSA #ViratKohli pic.twitter.com/hSxkG4ma5n— Ali Tweets (@ali_tweets05) December 6, 2025చదవండి: క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన! -
క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న పోరులో అందరి కళ్లు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. కానీ ప్లేఆఫ్స్లో కోహ్లీ ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేకపోవడం ఆర్సీబీ జట్టులో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ప్లేఆఫ్స్లో 17 మ్యాచ్లాడిన కోహ్లీ 121 స్ట్రైక్రేట్తో 396 పరుగులు సాధించాడు. మరి గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్ పోరులో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కోహ్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే గుజరాత్తో మ్యాచ్లో పిచ్పై అవగాహన వచ్చేవరకు నిలదొక్కుకుంటే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదు. పైగా ధర్మశాలలో కోహ్లీకి మంచి రికార్డే ఉంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ సీజన్లో కోహ్లీ ఇప్పటివరకు 14 మ్యాచ్ల్లో 557 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులోనూ కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఇరుజట్లు 18 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ ఆర్సీబీ నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండడంతో టేబుల్ టాపర్గా నిలిచింది. క్వాలిఫయర్-1 పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభించనుంది. బుధవారం జరిగే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడనుంది.చదవండి:‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’ -
‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2026 సీజన్లో ప్లాఫ్ షో కనబరిచాడు. 13 మ్యాచ్ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే సీజన్లో రాజస్తాన్తో మ్యాచ్లో 60 పరుగుల ఇన్నింగ్స్ సూర్యకు ఈ సీజన్లో చెప్పుకోదగిన ప్రదర్శన. ఇది మినహా అతడు రాణించిన దాఖలాలు లేవు. అయితే రాజస్తాన్తో మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ మణికట్టు గాయంతో బాధపడుతున్నాడని, అందుకే అతడి నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను సూర్యకుమార్ ఖండించాడు. తనకు ఏ గాయం కాలేదని, సరిగ్గా ఆడనంత మాత్రానా గాయంతో బాధపడుతున్నట్లు ఊహించుకున్నవారంతా మూర్ఖులేనంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. అంతేకాదు తనపై వచ్చిన వార్తలన్నీ అబద్దాలేనంటూ కొట్టిపారేశాడు. సూర్యకుమార్ మాట్లాడుతూ..‘ఒక విషయంపై నేను స్పష్టత ఇవ్వదలచుకున్నా. నేను మణికట్టు గాయంతో బాధపడుతున్నా అని మాట్లాడుకుంటున్నవాళ్లు ఫిజియోథెరపిస్టులు కాకపోవడం లేదా క్రికెట్ గురించి అవగాహన లేని వాళ్లు అయి ఉంటారు. ఎందుకంటే, ఒకవేళ నిజంగా నేను మణికట్టు గాయం లేదా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. ప్రాక్టీస్లోనూ, మ్యాచ్లలోనూ షాట్లు కొట్టడంలో ఇబ్బంది ఎదుర్కొనేవాడిని. నేను మ్యాచ్ల్లో ఆడే చాలా షాట్లతో పాటు ఫ్లిక్ షాట్లు నా మణికట్టుపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఈ రూమర్లను పట్టించుకునే సమయం నాకు లేదు. కానీ నేను పూర్తి ఫిట్గా ఉన్నప్పటికీ గాయంతో బాధపడుతున్నట్లు వార్తలు రావడం ఆగ్రహం తెప్పించింది. అందుకే పని గట్టుకొని ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. ఈ సీజన్లో నా నుంచి బ్యాటింగ్లో మంచి ప్రదర్శన రాకపోవడంపై అసంతృప్తిగానే ఉన్నా. కానీ ఈ ఏడాది మంచి హార్డ్వర్క్తోనే క్రికెట్ సీజన్ను స్టార్ట్ చేశాను. న్యూజిలాండ్తో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నా. టీ20 ప్రపంచకప్లో ఆరంభంలో విఫలమైనప్పటికీ ఆఖర్లో మంచి ప్రదర్శనే కనబరిచాను. కానీ ఐపీఎల్లో మాత్రం లయను కోల్పోయి బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాను. నా ప్రదర్శన బాగాలేదని సర్దిచెప్పుకోలేను. దానిని మెరుగుపరుచుకునేందుకు ఇంకా కష్టపడుతా. ఫలితం వస్తే సంతోషం లేకుండా మళ్లీ కష్టపడతా. దేవుడు అన్నీ చూస్తున్నాడు. త్వరలోనే మళ్లీ కమ్బ్యాక్ ఇస్తానని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.Suryakumar Yadav on his Wrist Injury : "First of all, I'd like to clear the air a little bit. The people talking about a wrist injury are either pure physios or people who don't understand cricket. Because if I really had a wrist injury or such a problem, then the shots I've… pic.twitter.com/cNvibE9e3j— Vipin Tiwari (@Vipintiwari952) May 25, 2026చదవండి: కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు! -
కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయర్-1 పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే సీజన్ ముగియకముందే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊహించినట్లుగానే రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. ఓపెనింగ్లో వైభవ్కు జంటగా గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బద్రీనాథ్ కీలకమైన మూడో స్థానానికి కోహ్లీని కాదని ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు చోటు కల్పించాడు.మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), రజత్ పటీదార్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్కు చోటు కల్పించిన బద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయడం విశేషం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చర్ (రాజస్తాన్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్)లను ఎంచుకున్నాడు. మరో పేసర్ స్థానానికి యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, కార్తిక్ త్యాగిలను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోనూ 500 పరుగుల మార్క్ను దాటాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఓపెనర్లుగా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ (14 మ్యాచ్ల్లో 583 పరుగులు), శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 616 పరుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీలక బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్కు చెందిన రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక బద్రీనాథ్ టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో 95 మ్యాచ్లాడిన బద్రీనాథ్ 1441 పరుగులు సాధించాడు.బద్రీనాథ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్:వైభవ్ సూర్యవంశీ, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.చదవండి: విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్! -
విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్
ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్లో ఘోర వైఫల్యం తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు తప్పులను సరిదిద్దుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20లు)కు లంక జట్టు కొత్త కెప్టెన్గా కుశాల్ మెండిస్ను నియమిస్తూ లంక బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వన్డేలకు కెప్టెన్గా ఉన్న షనక, టీ20లకు కెప్టెన్గా వ్యవహరించిన చరిత్ అసలంకలను ఆ పదవి నుంచి తప్పించి రెండు ఫార్మాట్లలోనూ కుశాల్ మెండిస్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టెస్టు జట్టును మాత్రం ధనుంజయ డిసిల్వానే నడిపించ నున్నాడు. పనిలో పనిగా వెస్టిండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు 16 మందితో, టెస్టు సిరీస్కు 17 మందితో కూడిన జట్లను ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయినప్పటికీ షనక, చరిత్ అసలంకలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కమిందు మెండిస్ కుశాల్కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. గాయంతో టీ20 ప్రపంచకప్కు దూరమైన లంక ఆల్రౌండర్ వనిందు హసరంగ విండీస్తో సిరీస్కు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ప్రపంచకప్కు భారత్తో కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన శ్రీలంక టోర్నీలో సెమీఫైనల్ చేరడంలో విఫలమైంది. చచ్చీ చెడీ సూపర్-8కు చేరుకున్నప్పటికీ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ దారుణ పరాజయాలు చవిచూసింది. ఈ నేపథ్యంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్లను మార్చేందుకు లంక క్రికెట్ బోర్డు మొగ్గుచూపింది.శ్రీలంక టూర్ ఆఫ్ వెస్టిండీస్:జూన్ 3: మొదటి వన్డే, జమైకాజూన్ 6: రెండో వన్డే, జమైకాజూన్ 8: మూడో వన్డే, జమైకాజూన్ 11: తొలి టీ20, జమైకాజూన్ 13: రెండో టీ20, జమైకాజూన్ 14: మూడో టీ20, జమైకాజూన్ 25 నుంచి 29 వరకు: మొదటి టెస్టు, అంటిగ్వాజూలై 3 నుంచి 7 వరకు: రెండో టెస్టు, అంటిగ్వావిండీస్తో సిరీస్కు శ్రీలంక జట్టు:వన్డే జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానాగే, చరిత్ అసలంక, మిలన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుషంక, ఇషాన్ మలింగ, అసితా ఫెర్నాండో, ప్రమోద్ మదుషన్.టీ20 జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, లసిత్ క్రూస్పుల్లే, దాసున్ షనక, మిలన్ రత్నాయకే, దునిత్ వెల్లలగే, వనీందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుషంక,ఇషాన్ మలింగ, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార.టెస్టు జట్టు: ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, పాతుమ్ నిస్సంక, లహిరు ఉదరా, నిషాన్ మదుష్క, దినేష్ చండిమల్, పసిందు సూర్యబండార, సోనాల్ దినుషా, కుసాల్ మెండిస్, మిలన్ రత్నాయకే, ప్రబాత్ జయసూర్య, రమేశ్మెండిస్, అసితా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లాహిరు కుమారా, ఇసితా విజ్వేసుందర, కాసున్ రజిత.Sri Lanka Tour of West Indies 2026🏏Sri Lanka Cricket’s Selection Panel has selected the following squads for Sri Lanka’s Tour of the West Indies 2026.The tour will feature matches across all three formats - ODI, T20I, and Test cricket.The tour will begin with the ODI series,… pic.twitter.com/rnZYZZHm0S— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) May 25, 2026చదవండి: కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు! -
క్వాలిఫయర్-1 పోరు.. ఫైనల్ అడుగు ఎవరిది?
ఐపీఎల్లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్, మాజీ చాంపియన్ జట్లు మరో టైటిల్ వేటలో ముందుగా ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సై అంటున్నాయి. చెరో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగళూరు, గుజరాత్ టీమ్ల మధ్య మ్యాచ్ తొలి క్వాలిఫయర్ విజేత నేరుగా తుది పోరుకు అర్హత సాధించే అవకాశం ఉండగా... ఓడిన జట్టు నిష్క్రమించకుండా రెండో క్వాలిఫయర్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఏడాది లీగ్ దశ రెండు ముఖాముఖి మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి క్వాలిఫయర్–1 ద్వారా నేరుగా ఫైనల్కు చేరుతుందా? గత సీజన్లో ఎలిమినేటర్లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మూడేళ్ల తర్వాత మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా? ఈ రెండు మేటి జట్ల మధ్య మరికొన్ని గంటల్లో జరిగే సమరంలో పైచేయి ఎవరిదో తేలనుంది. టోర్నీ ఆసాంతం బెంగళూరు కీలక సమరాల్లో ఆధిక్యాన్ని అందుకొని ముందంజ వేయగా... రెండో అర్ధ భాగంలో అసాధారణంగా రాణించి గుజరాత్ దూసుకొచ్చింది. ఐపీఎల్లో ఇరు జట్లు ‘ప్లే ఆఫ్స్’లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం కాగా... ఓవరాల్గా ముఖాముఖి పోరులో రెండు జట్లు 4–4తో సమానంగా ఉన్నాయి. ఆద్యంతం నిలకడగా..వరుసగా రెండో సీజన్లో టాప్–2తో ముగించడం బెంగళూరు నిలకడను చూపిస్తోంది. టోర్నీ తొలి అర్ధభాగంలో ఐదు మ్యాచ్లు గెలిచిన జట్టు రెండో అర్ధభాగంలో నాలుగు విజయాలు సాధించింది. ఈ సీజన్లో అతి తక్కువ మంది ఆటగాళ్లను ఉపయోగించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అంటే టీమ్ ఎంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో కీలక ఆటగాళ్లంతా సత్తా చాటారు. వరుసగా నాలుగో సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లి (557) ముందుండి నడిపించగా... పడిక్కల్ (433), పాటీదార్ (393) తమ వంతు పాత్ర పోషించారు. ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో చెలరేగుతున్న కోహ్లిని తాజా ఫామ్లో నిలువరించడం అంత సులువు కాదు. బౌలింగ్లో భువనేశ్వర్ (24 వికెట్లు) టోరీ్నలో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ అగ్ర స్థానంలో నిలిచాడు. హాజల్వుడ్, రసిఖ్ సలామ్లనుంచి అతనికి సరైన సహకారం లభించింది. ఇక ఆల్రౌండర్గా కృనాల్ పాండ్యా రాణిస్తున్నాడు. భిన్నమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరిస్తున్న అతను... బ్యాటింగ్లో అవకాశం వచ్చిన ప్రతీసారి తన విలువను ప్రదర్శించాడు. టిమ్ డేవిడ్ కూడా కీలక ఇన్నింగ్స్లతో తన బాధ్యతను నెరవేర్చాడు. చివరి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో దెబ్బతిన్నా... భువీ, హాజల్వుడ్ ఇచ్చే ఆరంభం మరోసారి ఆర్సీబీకి కీలకం కానుంది. స్వింగ్, సీమ్కు అనుకూలించే ధర్మశాల మైదానం వారి ప్రదర్శనకు సరైన వేదిక కాగలదు. పూర్తి ఫిట్గా ఉంటే కోహ్లికి తోడుగా ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయడం ఖాయం. లేదంటే వెంకటేశ్ అయ్యర్నే కొనసాగిస్తారు. స్పిన్నర్ సుయాశ్ స్థానంలో పేసర్ డఫీని ఆడించే అంశాన్ని కూడా మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. టాప్–3 బ్యాటింగ్తోనే..గుజరాత్ జట్టు ధర్మశాలలో ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది కొంత ప్రతికూలమే అయినా... పదునైన పేస్ బౌలింగ్ బృందం ఆ లోటు కనపడనీయకుండా చేయగలదు. సిరాజ్, రబాడ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా, అర్షద్ ఖాన్ కూడా నిలకడగా రాణించాడు. రబాడ కూడా 24 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, తక్కువ వికెట్లే (17) తీసినా... సిరాజ్ ఎంతో ప్రభావం చూపించాడు. ఆల్రౌండర్ హోల్డర్ పేస్ బౌలింగ్ కూడా జట్టుకు అదనపు బలంగా మారింది. రషీద్ ఖాన్ ఎప్పటిలాగే మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే బెంగళూరు మిడిలార్డర్ను కట్టడి చేయగలడు. గత మ్యాచ్లో ఆర్సీబీని గుజరాత్ ఓడించడంలో అతనిదే ప్రధాన (2/19) పాత్ర. పిచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిధ్ లేదా సాయికిషోర్లలో ఒకరికి చాన్స్ లభిస్తుంది. బ్యాటింగ్లో మరోసారి టైటాన్స్ టాప్–3పైనే ఆధారపడుతోంది. సాయిసుదర్శన్ (638), శుబ్మన్ గిల్ (616), జోస్ బట్లర్ (469) చెలరేగడంతోనే టైటాన్స్ ప్రస్థానం ప్లే ఆఫ్స్ వరకు చేరింది. వాషింగ్టన్ సుందర్ (303) కూడా నిలకడగా తన వంతు పాత్ర పోషించాడు.పిచ్, వాతావరణంభారీ స్కోర్లకు వేదిక ఇది. ఈ సీజన్లో ధర్మశాల మైదానంలో మూడు లీగ్ మ్యాచ్లు జరిగాయి. ఐదు ఇన్నింగ్స్లలో 200కు పైగా స్కోరు నమోదు కాగా, మరో ఇన్నింగ్స్లో 199 పరుగులు వచ్చాయి. డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ నెగ్గగా... సాయంత్రం జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఛేదన చేసిన టీమ్ విజయం సాధించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో బ్యాట్ను తాకిన బంతి వాతావరణం కారణంగా చాలా వేగంగా దూసుకుపోవడం ఖాయం. పంజాబ్పై ముంబై గెలిచిన మ్యాచ్లో ఇది బాగా కనిపించింది. వర్షసూచన లేదు. The steepest climb of the season, but the view from the top is a spot in the Final! 🏔️Dharamshala is READY for the #Qualifier1 🏟️#TATAIPL | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets | @gujarat_titans pic.twitter.com/sCdPkNMzyZ— IndianPremierLeague (@IPL) May 25, 2026 చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా! -
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన వైభవ్ 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్థసెంచరీలున్నాయి. ఆదివారం ముంబై ఇండియన్స్పై గెలిచిన రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది.మే 27న (బుధవారం) ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఫ్యామిలీ వీడియో వైరల్గా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ను వీక్షించడానికి వైభవ్ కుటుంబం మొత్తం తరలివచ్చింది.మ్యాచ్లో వైభవ్ తుస్సుమన్నప్పటికీ రాజస్తాన్ గెలవడం, ప్లేఆఫ్ చేరడంతో అతడి కుటుంబం సంతోషంతో ఇంటిబాట పట్టారు. ఈ నేపథ్యంలో స్టేడియం నుంచి బయటికి వస్తున్న వైభవ్ సూర్యవంశీ కుటుంబం సహా అతడి సోదరులు కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంది' అంటూ కామెంట్స్ చేయడం ఆసక్తి కలిగించింది.కాగా, వైభవ్కు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఉజ్వల్, విశాల్ అతడి కంటే పెద్దవాళ్లు కాగా, ఆశీర్వాద్ అందరికంటే చిన్నవాడు. ఈ నలుగురు అన్నదమ్ములు కూడా హైట్లో తేడా ఉన్నప్పటికీ ముఖ కవలికల్లో మాత్రం అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండడం విశేషం. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) సహా మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో రాజస్తాన్ 200 పరుగుల మార్క్ను దాటింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia)Vaibhav’s carbon copy cute Family 🩷🤭 pic.twitter.com/WLUDhFyg0c— Charvi Vyas (@4Vvyas) May 25, 2026చదవండి: మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం! -
మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం!
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ స్కట్ రిటైర్మెంట్పై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు మేగన్ స్కట్ వెల్లడించింది. తర్వాతి జనరేషన్కు అవకాశాలు ఇవ్వా లనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ మేఘన్ స్కట్కు చివరి అంతర్జాతీయ టోర్నీ కానుంది. 33 ఏళ్ల మేగన్ స్కట్ 2012లో 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే ఆసీస్ స్టార్ ప్లేయర్గా పేరు పొందిన మేగన్ స్కట్ ఆ జట్టు తరఫున నాలుగు టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20 మ్యాచ్లు ఆడింది. మొత్తం 240 అంతర్జాతీయ మ్యాచ్లాడిన మేగన్ స్కట్ 309 వికెట్లు పడగొట్టింది. ఇందులో వన్డేల్లో 148 వికెట్లు, టీ20ల్లో 152 వికెట్లు ఉన్నాయి. మహిళల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్గానూ రికార్డులకెక్కింది. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మేగన్ అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్గానూ మేగన్ రికార్డులకెక్కింది.ఇక తన రిటైర్మెంట్ ప్లాన్పై మేగన్ స్కట్ స్పందించింది. ‘14 ఏళ్ల కెరీర్ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయిం చుకున్నా. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది.’ అని చెప్పుకొచ్చింది. మేగన్ స్కట్.. రెండు వన్డే ప్రపంచకప్(2013, 2022)లతో పాటు మూడు టీ20 ప్రపంచకప్లు (2108, 2020, 2026) గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలిగా ఉంది. జూన్ 12న ప్రారంభం కానున్న మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 13న సౌతాఫ్రికాతో ఆడనుంది.లెస్బియన్తో వివాహంఅడిలైడ్కు చెందిన మేఘన్ స్కట్ తన దీర్ఘకాల భాగస్వామి జెస్ హోలియోక్ను వివాహం చేసుకుంది. ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం అయిన తర్వాత 2019లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 2021 ఆగస్టులో, అత్యవసర సి-సెక్షన్ సరోగసి ద్వారా నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు రైలీ లూయిస్ అని పేరు పెట్టారు. అయితే 2025లో జెస్తో తన పదేళ్ల రిలేషిన్షిప్ ముగిసిందంటూ మేగన్ స్కట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం విడిగా ఉంటున్నప్పటికీ మేగన్, జెస్లు కలిసి మిరాకిల్ బేబీస్ ఫౌండేషన్కు రాయబారులుగా పనిచేస్తూ, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: 25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్! -
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా ట్రెండింగ్లో నిలిచిన పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న ఈ 15 ఏళ్ల చిన్నోడు బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన యూట్యూబ్ షోలో పాల్గొన్న వైభవ్ సూర్యవంశీ 25 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విషయంలోకి వెళితే పీటర్సన్ తన యూట్యూబ్ చానెల్లో వైభవ్ సూర్యవంశీతో ఒక ప్రత్యేక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్లోనే పీటర్సన్ వైభవ్కు 50 బంతుల్లో 100 పరుగులు చేయాలంటూ సవాల్ విసిరాడు. కానీ వైభవ్ మాత్రం పీటర్సన్ విసిరిన సవాల్ను 25 బంతుల్లోనే అందుకోవడం విశేషం. బౌలింగ్ మెషిన్ నుంచి వచ్చిన బంతులను వైభవ్ భారీ సిక్సర్లుగా మలిచాడు. అయితే 25 బంతుల్లోనే శతకం సాధించినప్పటికీ ఇదే పీటర్సన్ షోలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో సాధించిన వంద పరుగుల రికార్డును మాత్రం బద్దలుకొట్టలేకపోయాడు. మూడు బంతుల తేడాతో అయ్యర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. ఇక పీటర్సన్ షోలో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ రెండో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, వైభవ్ తర్వాత నికోలస్ పూరన్ (28 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. అంతకముందు ఏబీ డివిలియర్స్ 30 బంతుల్లో వంద పరుగులు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో వంద పరుగులు సాధించడం గమనార్హం. ఇదే ఎపిసోడ్లో సూర్యవంశీ తన కోరికను వెల్లడించాడు. టీ20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే టీ20 క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (175 పరుగులు) పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజన్లో గేల్ ఆర్సీబీ తరఫున 175 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు టీ20ల్లో డబుల్ సెంచరీ బాదడమే తన టార్గెట్ అని మరోసారి స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్పై 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్ 16 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారం (మే 27న) జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ను ఎదుర్కోనుంది. ఇక రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీజన్లో 14 మ్యాచ్లాడి 583 పరుగులు సాధించాడు.చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్రపంచకప్కు దూరం! -
‘నేను క్లారిటీగా ఉన్నా.. మీ టైం వృథా చేసుకోవద్దు’
ఐపీఎల్ 2026 సీజన్ను కోల్కతా నైట్రైడర్స్ ఓటమితో ముగించింది. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. అయితే అంతకముందే రాజస్తాన్ రాయల్స్ ముంబైపై గెలిచి ప్లేఆఫ్స్కు చేరడంతో ఢిల్లీ, కేకేఆర్ మ్యాచ్ నామామాత్రంగా మారిపోయింది. అయితే విజయంతో సీజన్ను ముగిద్దామనుకున్న కేకేఆర్కు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భంగపాటు ఎదురైంది. ఈ సీజన్లో కేకేఆర్ ఆటతీరుపై, రహానే నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టు ప్రదర్శన, తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శలపై రహానే ఘాటుగా సమాధానమిచ్చాడు. రహానే మాట్లాడుతూ.. ‘జట్టు వరుస ఓటములతో కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదా వెనక్కి తగ్గడం నా డిక్షనరీలోనే లేదు. నేను ఎప్పుడూ సవాళ్లను చూసి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. ఈ కఠిన పరిస్థితుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఆలోచన నా మనసులోకి ఒక్కసారి కూడా రాలేదు. ఒక నాయకుడిగా జట్టును ముందుకు నడపడమే తన బాధ్యత అని, గెలుపోటములు ఆటలో సహజం. నేనైతే కేకేఆర్తోనే కొనసాగాలనుకుంటున్నా. నాకు ఆడాలనిపించినకాలం క్రికెట్ ఆడుతాను. రిటైర్మెంట్ ఆలోచన ఇప్పుడేం లేదు. ఐపీఎల్ ముగియడంతో కొంతకాలం కుటుంబంతో గడుపుతాను. ఆ తర్వాత ముంబైలో లోకల్ లీగ్లో పాల్గొంటాను. క్రికెట్ ఆడడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా.’ అని రహానే చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో కేకేఆర్ ప్రదర్శనపై కూడా రహానే స్పందించాడు. ‘సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు మా జట్టును కుంగదీశాయి. కానీ రెండో అంచె పోటీల్లో గోడకు కొట్టిన బంతిలా మేం తిరిగి ఫుంజుకున్నాం. వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి కూడా వచ్చాం. కొన్ని మ్యాచ్ల్లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయాం. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్లోనైనా గెలిచి ఉండుంటే ఇవాళ ప్లేఆఫ్స్లో ఉండేవాళ్లం. రాబోయే సీజన్లో తప్పులను సరిదిద్దుకుని బలంగా పునరాగమనం చేస్తాం.’ అని రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు.ఈ సీజన్లో కేకేఆర్ ప్రయాణం అంచనాలకు భిన్నంగా సాగింది. ఒక మ్యాచ్ రద్దు సహా వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిన కేకేఆర్ తొలి హాఫ్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. అయితే రెండో సగంలో మాత్రం వరుసగా నాలుగు విజయాలు సాధించి ఔరా అనిపించింది. మధ్యలో ఆర్సీబీ చేతిలో ఓడినా మళ్లీ రెండు విజయాలు సాధించిన కేకేఆర్ ఒక్కసారిగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.కానీ పంజాబ్, రాజస్తాన్లతో పోలిస్తే నెట్ రన్రేట్ చాలా తక్కువగా ఉండడంతో పోటీలో ఉన్నప్పటికీ ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సి వచ్చింది. రహానే కెప్టెన్సీపై విమర్శలు వచ్చినప్పటికీ, అతడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా జట్టును సమర్థంగా నడిపించాడు. ఐపీఎల్లో మూడుసార్లు చాంపియన్గా నిలిచిన కేకేఆర్ వచ్చే సీజన్లో తప్పులను సరిదిద్దుకొని సత్తా చాటుతుందని ఆశిద్దాం.Curtains down at Eden Gardens for this season! 🏟️The Kolkata Knight Riders signing off with a lap of honour for a brilliant home crowd 💜#TATAIPL | #KhelBindaas | #KKRvDC | @KKRiders pic.twitter.com/fC29SWpCYe— IndianPremierLeague (@IPL) May 24, 2026చదవండి: హెడ్ భార్యకు అవమానం.. వికృత చేష్టలు ఆపండి! -
హెడ్ భార్యకు వేధింపులు.. వికృత చేష్టలు ఆపండి!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ ఫలితం కంటే విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ల మధ్య చోటుచేసుకున్న వివాదమే హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీపై హెడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం, దీనికి కౌంటర్గా కోహ్లీ ధీటుగా బదులివ్వడం కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. అయితే వివాదం అక్కడితో సద్దుమణిగిందిలే అనకుంటే ఇప్పుడు అభిమానులు దీనిని మరింత పెద్దదిగా చేస్తున్నారనిపిస్తోంది. తాజాగా హెడ్ భార్య జెస్సికాను ఈ వివాదంలోకి లాగారు. జెస్సీకా సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసిన కొంతమంది ఆమెను కించపరుస్తూ అసభ్యకర పోస్టులతో ఆన్లైన్ వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు వివాదాన్ని మైదానానికే పరిమితం చేస్తున్నప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం వివాదాలను ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి తమ వికృత చేష్టలతో క్రీడా సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు.తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ హెడ్ భార్య జెస్సికా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వాపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 'ప్రపంచకప్ సంఘటన తర్వాత నాపై వేధింపులు తిరిగి పునరావృతమైనట్లుగా అనిపిస్తోంది. నేను నిద్రలేవడంతోనే నా సోషల్ మీడియా ఖాతాలో కొంతమంది అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టారు. నన్ను వేధింపులకు గురి చేసినా పట్టించుకునే దాన్ని కాదు, కానీ వాళ్లు శ్రుతి మించిపోయారు. నాతో పాటు నా కుటుంబసభ్యులను, మిత్రులపై వేధింపులకు దిగారు. క్రీడా సంబంధిత విషయాలను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టడం సరికాదు. ఈ వికృత చేష్టలను దయచేసి ఆపాలని కోరుతున్నా.' అంటూ జెస్సికా ఆవేదనతో రాసుకొచ్చింది. మేము మనుషులమే..'ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యం, దృక్పథం, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం గురించి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. క్రీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. కానీ ఆటను ఆటగానే చూడాలి. అంతేకానీ ఆ వివాదాలను వ్యక్తుల కుటుంబాల దాకా తీసుకురాకూడదు. మేము మనుషులమే.. మాకు కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.' అని ఆమె అన్నారు.గతంలోనూ వేధింపులు..అయితే హెడ్ భార్య జెస్సికాకు ఆన్లైన్ వేధింపులు కొత్త కాదు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఫైనల్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ను హెడ్ అందుకున్నాడు. అప్పుడు కూడా హెడ్తో పాటు అతడి భార్య జెస్సికాను టార్గెట్ చేస్తూ కొంతమంది అభిమానులు అసభ్యకర కామెంట్లు చేశారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కోహ్లీ, హెడ్ మధ్య వివాదం జెస్సికాకు మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది.కోహ్లీ, హెడ్ వివాదమేంటి?ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్.. ‘కాస్త బౌండరీలు కొట్టు’ అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల కరచాలనం సందర్భంగా హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ ముగిసింది. మంగళవారం తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ, గుజరాత్ తలపడునున్నాయి. బుధవారం ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మే 29న క్వాలిఫయర్-2, మే 31న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’ -
విజయంతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2026 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంతో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నామమాత్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్కతా వేదికగా జరిగిన సీజన్ చివరి మ్యాచ్లో కేకేఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అజింక్య రహానే (63) అర్థసెంచరీ సాధించగా, పావెల్ (29), మనీశ్ పాండే (25) పర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఎన్గిడి చెరో మూడు వికెట్లతో విజృంభించగా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థసెంచరీతో తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (39), డేవిడ్ మిల్లర్ (28), అశుతోశ్ శర్మ (18 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ 200 పరుగుల మార్క్ను దాటింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్లు తలా ఒక వికెట్ పడగొట్టారు. కేకేఆర్పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలతో సీజన్ను ఆరో స్థానంతో ముగించింది. మరోవైపు కేకేఆర్ 14 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. ఇక రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంతో పంజాబ్, కేకేఆర్లు ఇంటిదారి పట్టాయి.Ending the season exactly how you want to... with a solid W! 🙌A comprehensive 40-run win for @DelhiCapitals to finish things off 💙❤️Scorecard ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC pic.twitter.com/lc0u4ZLx6D— IndianPremierLeague (@IPL) May 24, 2026చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’ -
‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’
ఐపీఎల్ 2026 సీజన్లో తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 30 పరుగులతో ఓడించి రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. మ్యాచ్ విజయం అనంతరం రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ జోఫ్రా ఆర్చర్పై ప్రశంసలు కురిపించాడు. తమ జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో జోఫ్రా ఆర్చర్దే కీలకపాత్ర అని, అతడు ఆడకపోయుంటే ఇవాళ ఇంటికి వెళ్లిపోయేవాళ్లమని పరాగ్ పేర్కొన్నాడు. రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘మేము అనుకున్న ప్రణాళికలు సఫలం కావడం ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్చరు నంబర్ 7 స్థానంలో ప్రమోట్ చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. క్రీజులో ఎవరో ఒకరు చొరవ తీసుకుని వేగంగా ఆడాల్సిన పిచ్ ఇది. ఆ బాధ్యతను ఆర్చర్ చక్కగా నిర్వర్తించాడు. ఈ సీజన్లో నేను కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నప్పుడు, అతడిని అవుట్ చేయగల సత్తా ఒక్క జోఫ్రా ఆర్చర్కే ఉందని నేను బలంగా నమ్మాను. ఆ నమ్మకాన్ని ఆర్చర్ నిలబెట్టుకున్నాడు. అతడు బండరాయిలా దృఢంగా నిలబడి మ్యాచ్ను మా వైపు తిప్పాడు’ అని కొనియాడాడు.ఇక మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఆర్చర్ @ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ స్పందిస్తూ.. ‘ఇది నా అత్యుత్తమ ప్రదర్శన అని నేను అనుకోవడం లేదు, దీనికంటే మెరుగ్గా బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సరైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయడానికే ప్రయత్నించాను. నేను ఇంత త్వరగా బ్యాటింగ్కు రావాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇంపాక్ట్ సబ్ నిబంధన వల్ల నాకు సాధారణంగా బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. కోచ్ నన్ను ప్యాడ్లు కట్టుకోమన్నప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ, నేను నన్ను ఒక ఆల్రౌండర్గానే భావిస్తాను. ప్రస్తుతం నా ఫిట్నెస్ చాలా బాగుంది’ అని సంతోషం వ్యక్తం చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకు పరిమితమైంది. ముంబైపై విజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్, కేకేఆర్లు కూడా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి. View this post on Instagram A post shared by IPL (@iplt20) చదవండి: ముగిసిన లీగ్ దశ.. ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే -
ముగిసిన లీగ్ దశ.. ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్పై విజయంతో రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్లుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ప్లేఆఫ్స్కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు ప్లేఆఫ్స్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ సమయంకు సంబంధించి పూర్తి వివరాలు విడుదల చేశారు. మే 26న జరగనున్న క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. ఇక మే 27న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ తలపడనున్నాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మే 29న జరగనున్న క్వాలిఫయర్-2 పోరులో ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు తలపడనుంది. ఎలిమినేటర్తో పాటు క్వాలిఫయర్-2 మ్యాచ్కు ముల్లన్పూర్ వేదిక కానుంది. ఇక ఆదివారం (మే 31న) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో క్వాలిఫయర్-1 విజేతతో క్వాలిఫయర్-2 విజేత అమీతుమీ తేల్చుకోనుంది.ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్మే 26- క్వాలిఫయర్-1 (ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, ధర్మశాల, రాత్రి 7.30 నుంచి)మే 27- ఎలిమినేటర్ (ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్తాన్, ముల్లన్పూర్, రాత్రి 7.30 నుంచి)మే 29-క్వాలిఫయర్-2 (క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత, ముల్లన్పూర్, రాత్రి 7.30 నుంచి)మే 31- ఫైనల్ (క్వాలిఫయర్-1 విజేత వర్సెస్ క్వాలిఫయర్-2 విన్నర్, అహ్మదాబాద్, రాత్రి 7.30 నుంచి)4️⃣ teams. 1️⃣ winner All roads lead to the ultimate glory 🏆#TATAIPL | #TheFinalLeap pic.twitter.com/waI2u61Q4t— IndianPremierLeague (@IPL) May 24, 2026చదవండి: పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు! -
పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు!
ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్ ఒకటి. మొదట కింగ్స్ ఎలెవెన్ పంజాబ్గా, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్గా 19 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతూ వస్తోంది. జట్టు పేరు మార్చినా, కెప్టెన్లు మారినా పంజాబ్ తలరాత మాత్రం మారడం లేదు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. అయితే సీజన్ తొలి అంచె పోటీల్లో ఓటమి ఎరుగని పంజాబ్ రెండో అంచె పోటీల్లో అనవసర ఒత్తిడికి లోనైంది. తద్వారా వరుస పరాజయాలతో చేజేతులా ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. 19 సీజన్లుగా కప్పు కోసం నిరీక్షిస్తున్న పంజాబ్కు ఈ ఏడాది కూడా నిరాశనే మిగిల్చింది.ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008)లో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన పంజాబ్ మళ్లీ 2014లో ఫైనల్కు చేరుకున్నప్పటికీ తుదిమెట్టుపై బోల్తా పడింది. ఆ తర్వాత షరా మాములే అన్నట్లుగా వారి ఆటతీరు సాగింది. అయితే ఐపీఎల్ కెప్టెన్లలో లక్కీ కెప్టెన్గా పేరున్న శ్రేయస్ అయ్యర్ 2025 సీజన్కు ముందు పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా రావడంతో ఆ జట్టులో ఆశలు చిగురించాయి. జట్టు తనపై ఉంచిన నమ్మకా న్ని నిలబెట్టుకున్న శ్రేయస్ అయ్యర్ పదేళ్ల తర్వాత పంజాబ్ను మళ్లీ ఫైనల్ చేర్చాడు. అయితే తుదిపోరులో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ రన్నరప్తోనే సరిపెట్టుకుంది. గత సీజన్ ఇచ్చిన బూస్ట్తో ఈ సీజన్లో మంచి అంచనాలతోనే పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టుగానే తొలి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు (ఒక మ్యాచ్ వర్షంతో రద్దు) సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. ఇంకేముంది ఈసారి పంజాబ్ టైటిల్ కొడుతుందని అంతా భావించారు. కానీ రెండో అంచె పోటీలు మొదలవ్వగానే అంచనాలు తలకిందులయ్యాయి. రాజస్తాన్ రాయల్స్ చేతిలో మొదలైన ఓటముల పరంపర వరుసగా ఆరు మ్యాచ్ల వరకు కొనసాగింది. అయితే లక్నో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జూలు విదిల్చి విజయం సాధించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలు, ఆరు ఓటములు, ఒక రద్దుతో 15 పాయింట్లతో ఉన్నప్పటికీ మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగాక రెండో అంచె పోటీల్లో లక్నోతో మ్యాచ్కు ముందు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఒక్క దానిలో విజయం సాధించినా ఇవాళ పంజాబ్ ప్లేఆఫ్ చేరుకునేది. కానీ అదృష్టం కంటే దురదృష్టంతో ప్రయాణం చేస్తున్న పంజాబ్కు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.వైఫల్యం వెనుక కారణాలెన్నో!ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ చేరకపోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో ప్రధాన కారణం బౌలింగ్ బలహీనంగా ఉండడం. తొలి అంచె పోటీల్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధిస్తే అందులో నాలుగు మ్యాచ్ల్లో ఛేదనలో విజయాలు సాధించింది. ప్రత్యర్థి జట్లు ఎంత పెద్ద టార్గెట్ విధించినా పంజాబ్ సులువుగా ఆ లక్ష్యాన్ని అందుకునేది. అప్పుడు బౌలింగ్లో లోపాలు కనిపించలేదు. కానీ రెండో అంచె పోటీల్లో సీన్ రివర్స్ అయింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయింది. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్ కూడా పంజాబ్ కొంపముంచింది. చాలా మ్యాచ్ల్లో క్యాచ్లు జారవిడవడంపై హెడ్కోచ్ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు పంజాబ్ టైటిల్ సాధించే ఒక మంచి అవకాశాన్ని చేజేతులా కోల్పోయింది.🚨 PUNJAB KINGS KNOCKED OUT OF IPL 2026. 🚨- PBKS were unbeaten for the first 7 matches of the tournament. 🤯 pic.twitter.com/qmeXyFP0An— Mufaddal Vohra (@mufaddal_vohra) May 24, 2026చదవండి: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ధ్రువ్ జురేల్కు క్యాచ్ ఇచ్చిన రోహిత్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ డకౌట్తో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన ఆటగాడిగా గ్లెన్ మాక్స్వెల్తో కలిసి రోహిత్ శర్మ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన గ్లెన్ మాక్స్వెల్ కూడా 19 డకౌట్లతో రోహిత్ శర్మతో పాటే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత దినేష్ కార్తీక్, సునీల్ నరైన్ చెరో 18 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే స్పిన్ బౌలర్లు పియూష్ చావ్లా, రషీద్ ఖాన్ లు కూడా చెరో 16 సార్లు సున్నా పరుగులకే అవుటయ్యి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకు పరిమితమైంది. ముంబైపై విజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్, కేకేఆర్లు కూడా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.చదవండి: 'మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!' -
IPL 2026: కేకేఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
కోల్కతా వేదికగా జరిగిన సీజన్ చివరి మ్యాచ్లో కేకేఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహానే (63) అర్థసెంచరీ సాధించగా, పావెల్ (29), మనీశ్ పాండే (25) పర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఎన్గిడి చెరో మూడు వికెట్లతో విజృంభించగా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థశతకంతో రాణించాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కేకేఆర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మొదట రహానే (63) ఔటవ్వగా, మరుసటి బంతికి రింకూ సింగ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. పావెల్ (15), తేజస్వి (1) పరుగుతో ఆడుతున్నారు.13 ఓవర్లలో కేకేఆర్ 123/313 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. రహానే (59), రోవ్మెన్ పావెల్ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ 87 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన మనీశ్ పాండే ఎన్గిడి బౌలింగ్లో మిచెల్ స్టార్క్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. రహానే (45), కామెరున్ గ్రీన్ (1) పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన ఓపెనర్ ఫిన్ అలెన్ ఎన్గిడి బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. రహానే (23), మనీశ్ పాండే (4) పరుగులతో ఆడుతున్నారు.కేకేఆర్ టార్గెట్ 204 పరుగులురాజస్తాన్ ప్లేఆఫ్స్కు చేరడంతో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నామమాత్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థసెంచరీతో తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (39), డేవిడ్ మిల్లర్ (28), అశుతోశ్ శర్మ (18 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ 200 పరుగుల మార్క్ను దాటింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.హాఫ్ సెంచరీ బాది కేఎల్ రాహుల్ ఔట్ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 30 బంతులకే హాఫ్ సెంచరీ బాది జోరు మీదున్న కేఎల్ రాహుల్ అనుకుల్ రాయ్ బౌలింగ్లో రోవ్మన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఢిల్లీ స్కోరు 14 ఓవర్లకు 135-3గా ఉంది.మరో వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ మరో వికెట్ కోల్పోయింది. సాహిల్ పరాఖ్ 24 పరుగులు చేసి, సునిల్ నరైన్ బౌలింగ్లో అజింక్యా రహానెకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఢిల్లీ స్కోరు 10 ఓవర్లకు 88-2గా ఉంది. 8 ఓవర్లలో ఢిల్లీ 70/18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. సాహిల్ పరాఖ్ (15), కేఎల్ రాహుల్ (31) పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీకేకేఆర్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన అభిషేక్ పొరేల్ సౌరభ్ దూబే బౌలింగ్లో తేజస్వీ దహియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది.టాస్ గెలిచిన కేకేఆర్టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కేకేఆర్కు చాలా కీలకం. కాగా ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ముకేశ్ కుమార్, కుల్దీప్ స్థానంలో అకిబ్ నబీ, త్రిపురానా జట్టులోకి వచ్చారు. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 36 సార్లు తలపడితే ఢిల్లీ 15 సార్లు, కేకేఆర్ 21 సార్లు నెగ్గాయి. సీజన్ తొలి అంచె పోటీల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.పంజాబ్, రాజస్తాన్లు ప్లేఆఫ్ రేసులో ఉన్నప్పటికీ కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో, ఢిల్లీ విధించే టార్గెట్ను 13 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి నిగిడి.కోల్కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్), మనీష్ పాండే, కెమెరూన్ గ్రీన్, రోవ్మన్ పావెల్, రింకు సింగ్, తేజస్వి దహియా(వికెట్కీపర్), అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, సౌరభ్ దూబే, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి.🚨 TOSS update from Kolkata🚨@KKRiders won the toss and will bowl first against @DelhiCapitals Updates ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC pic.twitter.com/BS2ulpHJIT— IndianPremierLeague (@IPL) May 24, 2026 -
'మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!'
శ్రీలంక క్రికెటర్ మతీశా పతీరానా ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా ముద్రపడిన పతీరానాను రూ. 18 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న పతీరానా సీజన్లో కేకేఆర్ ఆడిన 12 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న పతీరానా గుజరాత్ టైటాన్స్తో జరిగిన గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. వచ్చీ రావడంతోనే తన ప్రతాపం చూపిస్తాడని అంతా భావించారు. కానీ విధి వింత నాటకం ఆడింది. గుజరాత్తో మ్యాచ్లో 8 బంతులు వేసిన అనంతరం పతీరానాకు కాలి పిక్క కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు. తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పతీరానా కేకేఆర్ జట్టును వీడి స్వదేశానికి వెళ్లిపోయినట్లు ఆ జట్టు ఫ్రాంచైజీ ఆదివారం తెలిపింది. ఇవాళ కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్తో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పతీరానా స్థానంలో లవ్నిత్ సిసోడియాతో భర్తీ చేయనున్నట్లు కేకేఆర్ తెలిపింది.ఈ సీజన్లో తన బౌలింగ్తో కేకేఆర్కు ఎక్స్-ఫ్యాక్టర్గా మారతాడని భావించిన కేకేఆర్కు నిరాశే మిగిలింది. పైగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్క మ్యాచ్ ఆడినా ఆటగాడికి మొత్తం పారితోషికం చెల్లించాల్సిందే. ఈ లెక్కన పతీరానా సీజన్లో ఒక్క మ్యాచ్లోనే ఆడినప్పటికీ అతనికి రూ. 18 కోట్లు దక్కనున్నాయి. దీంతో కేకేఆర్ అభిమానులు పతీరానాపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పతీరానా ఒక మోసగాడు.. కోలుకున్నానని అబద్ధం చెప్పి సర్టిఫికేట్ చూపించాడు.. కేకేఆర్ తరఫున ఈ సీజన్లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన పతీరానా డబ్బు మూటతో లంకకు వెళ్లిపోయాడు.. ఏం లాభం వచ్చాడు.. 18 కోట్లు పట్టుకెళ్లాడు.' అంటూ కామెంట్లు చేశారు.చదవండి: ‘హమ్మయ్య ఔట్ చేశా’.. వైభవ్ అంటే అంత భయమా? -
‘హమ్మయ్య ఔట్ చేశా’.. వైభవ్ అంటే అంత భయమా?
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఆటతో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టించాడు. క్రీజులోకి వచ్చిందే మొదలు బాదుడే పరమావధిగా పెట్టుకున్న 15 ఏళ్ల బీహార్ చిన్నోడు సీజన్లో 14 మ్యాచ్ల్లో 583 పరుగులు సాధించి రాజస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్తో రాజస్తాన్ ఆడిన తమ చివరి లీగ్ మ్యాచ్లో వైభవ్ నిరాశ పరిచాడు. చాహర్ వేసిన లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో పొరబడిన వైభవ్ సూర్యవంశీ స్లాగ్ షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తాకి గాల్లోకి లేచింది. బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన నమన్ ధిర్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఆట ముగిసింది. ఈ నేపథ్యంలో వైభవ్ వికెట్ తీయగానే దీపక్ చాహర్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. 'హమ్మయ్యా ఔట్ చేశాను' అన్న తరహాలో చాహర్ సైగలు చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాహర్ వింత సెలబ్రేషన్ వెనుక ఒక బలమైన కారణముంది. అదేంటంటే ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆటను ప్రదర్శించాడు. క్షణాల్లో ఆటను మార్చేసి ప్రత్యర్థి జట్లకు తలనొప్పిగా మారిపోయాడు. చాలా మ్యాచ్ల్లో అతడు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ అతని ఇంపాక్ట్ ఆటపై బలంగా ప్రభావం చూపించేది. అందుకే వైభవ్ను ఆరంభంలోనే ఔట్ చేయాలని అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇదే సీజన్లో తొలి అంచె పోటీల్లో ముంబైతో మ్యాచ్లోనూ వైభవ్ 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి ముంబై బౌలింగ్ దళాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకున్న దీపక్ చాహన్ ఈసారి పక్కా ప్రణాళికతో వైభవ్ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. అందుకే పట్టరాని సంతోషంతో వినూత్న రీతిలో సెలబ్రేషన్ చేసుకున్నాడు. 2025 సీజన్లోనూ వైభవ్ సూర్యవంశీ మంచి ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, ఈ సీజన్లో అతడి బలహీనతలు బయటపడతాయని అన్ని జట్లు భావించాయి. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీజన్ ఆద్యంతం విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. pic.twitter.com/YXigIYta2M— crictalk (@crictalk7) May 24, 2026చదవండి: వెల్ డన్ అర్జున్.. నువ్వు రెండింటినీ గెలిచావు: సచిన్ -
గంభీర్ చేతుల్లో సూర్యకుమార్ భవితవ్యం!
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దీనికి సంబంధించి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. కెప్టెన్సీ పదవి పోయినప్పటికీ సూర్యకుమార్ బ్యాటర్గా తుదిజట్టులో కొనసాగుతాడని బీసీసీఐ పేర్కొంది. అయితే తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటర్గా పూర్తిగా విఫలమైన సూర్యకుమార్ తుది జట్టు నుంచే తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లో సూర్యకుమార్ భవితవ్యం ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ను తుదిజట్టులో ఆడించాలా వద్దా అనేది గంభీర్తో పాటు సెలెక్షన్ కమిటీ సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. ఫామ్లేమి దృశ్యా సూర్యకుమార్ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ, గంభీర్తో సూర్యకు ఉన్న సఖ్యత కారణంగా అదంత సులువు కాదనిపిస్తోంది. ఎందుకంటే సూర్య సారథ్యంలో టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్తో పాటు ఆసియాకప్ను గెలుచుకుంది.అయితే దాదాపు ఏడాదిగా భారత క్రికెట్ జట్టులో సూర్యకుమార్ స్థానంపై తీవ్రమైన పరిశీలన కొనసాగుతోంది, ఐదుగురు సెలెక్టర్లు కూడా అతడిని తుది జట్టులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా కెప్టెన్గా సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటర్గా మాత్రం రాణించడంలో విఫలమయ్యాడు. అయితే భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సూర్యకుమార్ను జట్టు నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్లో నిలకడగా రాణిస్తే సూర్యకుమార్కు చివరి చాన్స్ ఇద్దామని బీసీసీఐ భావించింది. కానీ సూర్యకుమార్ ఐపీఎల్ 2026 సీజన్లో దారుణ ప్రదర్శన కనబరచడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం, గంభీర్ నాయకత్వంలోని ఈ పరివర్తన దశలో భవిష్యత్ ప్రణాళిక, అధికార సమీకరణాలు మారుతుండటంతో భారత క్రికెట్ ఒక సంధి దశలో నిలబడి ఉంది. గణాంకాలు సూర్యకుమార్కు అనుకూలంగా లేనప్పటికీ, గౌతమ్ గంభీర్కు అతనిపై ఉన్న విశ్వాసం, అతనితో ఉన్న సంబంధం భారత టీ20 కెప్టెన్సీ భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు.చదవండి: ఆర్సీబీకి షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు! -
ఆర్సీబీకి షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో డిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్ హోదాకు తగ్గట్లే టేబుల్ టాపర్గా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. అయితే గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్ పోరుకు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ఓపెనర్గా రాణిస్తున్న జాకబ్ బెతెల్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. చేతి వేలి గాయంతో జాకబ్ బెతెల్ జట్టును వీడినట్లు ఆర్సీబీ యాజమాన్యం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే జూన్లో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంతో స్వదేశంలో చేతి వేలి గాయానికి సంబంధించి మెరుగైన చికిత్స తీసుకోవడానికి ఇంగ్లండ్ వెళ్లినట్లు ఆర్సీబీ తెలిపింది. 'పంజాబ్తో జరిగిన మ్యాచ్లో జాకబ్ బెథెల్ ఎడమ చేతి వేలికి గాయమైంది. అయితే జూన్లో ఇంగ్లండ్కు కీలకమైన టెస్టు సిరీస్ ఉండడంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం ఇంగ్లండ్కు వెళ్లిపోయాడు' అని ఆర్సీబీ తమ ఎక్స్లో రాసుకొచ్చింది. కాగా ఇంగ్లండ్కే చెందిన మరో స్టార్ ఆటగాడు ఫిల్ సాల్ట్ గాయపడడంతో జట్టులో చోటు దక్కించుకున్న జాకబ్ బెతెల్ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడాడు. ఫిల్ సాల్ట్ తిరిగొచ్చినప్పటికీ బెతెల్ రాణించడంతో జట్టులో అతడినే కంటిన్యూ చేసింది. అయితే మే 26న ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్తో జరగనున్న క్వాలిఫయర్-1 పోరుకు జాకబ్ బెతెల్ దూరం కావడంతో కోహ్లీతో కలిసి ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. అందుకే జాకబ్ బెతెల్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయడం లేదని ఆర్సీబీ మరో ప్రకటనలో పేర్కొంది. ఇక ఇంగ్లండ్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. జూన్ 4 నుంచి 8 మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా జాకబ్ బెతెల్ గాయంపై స్పందించింది. ‘న్యూజిలాండ్తో వచ్చే నెలలో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం జాకబ్ బెతెల్ను ఎంపిక చేశాం. తొలి టెస్టుకు ముందే జాకబ్ బెతెల్ గాయం తీవ్రతను పూర్తిగా అంచనా వేసేందుకు వైద్య బృందం పర్యవేక్షించనుంది’ అని పేర్కొంది.🚨 𝙊𝙛𝙛𝙞𝙘𝙞𝙖𝙡 𝘼𝙣𝙣𝙤𝙪𝙣𝙘𝙚𝙢𝙚𝙣𝙩: Jacob Bethell sustained an injury to his left ring finger during our game against PBKS. He will return to England to be assessed ahead of their Test series. ❤️🩹𝙶𝚎𝚝 𝚠𝚎𝚕𝚕 𝚜𝚘𝚘𝚗, 𝙹𝙱! 🫂 𝚆𝚎’𝚕𝚕 𝚖𝚒𝚜𝚜 𝚑𝚊𝚟𝚒𝚗𝚐 𝚢𝚘𝚞… pic.twitter.com/x6ipurfteA— Royal Challengers Bengaluru (@RCBTweets) May 23, 2026చదవండి: టెస్టు క్రికెట్లో ఐసీసీ కీలక మార్పులు! -
టెస్టు క్రికెట్లో ఐసీసీ కీలక మార్పులు!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంప్రదాయ టెస్టు క్రికెట్లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఐసీసీ కమిటీ సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ చైర్మన్ జై షా సహా ఐసీసీ క్రికెట్ కమిటీ హెడ్ సౌరవ్ గంగూలీ సహా తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో వినియోగిస్తున్న ఎర్రబంతికి బదులు ఇకపై పింక్ బంతిని వినియోగంలోకి తీసుకురావాలనే యోచనలో ఐసీసీ ఉంది. దీనితో పాటు టీ20 క్రికెట్లో ఇన్నింగ్స్ విరామ సమయాలు, డ్రింక్స్ బ్రేక్ల సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వడం సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఐసీసీ టెస్టు ఫార్మాట్లో వేర్వేరు రంగుల బంతులను ఉపయోగించడాన్ని పరిశీలిస్తోంది. అందువల్ల, సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ సమయంలో ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతికి మారే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితులలో, వాతావరణ అంతరాయాలు ఏర్పడినప్పుడు లైట్ల వెలుగులో ఆటను కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరిస్తే, జట్లకు ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతిని ఉపయోగించడానికి అనుమతి లభించనుంది. ప్రతిపాదిత మార్పుల వివరాలు ఇంకా ఖరారు కానప్పటికీ, ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఎరుపు బంతి నుండి గులాబీ బంతికి మారే ప్రక్రియను ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. డ్రింక్స్ విరామ సమయంలో హెడ్ కోచ్ను మైదానంలోకి అనుమతించడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే దీనిని వన్డే క్రికెట్లో తీసుకురావాలని ఐసీసీ యోచిస్తోంది. మైదానంలోకి హెడ్కోచ్..ఇప్పటివరకు సబ్స్టిట్యూట్ ఆటగాళ్లకు మాత్రమే డ్రింక్స్ విరామంలో మైదానంలోకి అనుమతి ఉంది. భవిష్యత్తులో డ్రింక్స్ విరామాల్లో హెడ్కోచ్ను కూడా మైదానంలోకి అనుమతిస్తే, అతడు జట్టు జెర్సీ వేసుకొని రావాలా లేక సాధారణంగా రావాలా అనేది నిర్ణయించాల్సి ఉంది. ఇక వన్డే క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో రెండు డ్రింక్స్ విరామాలు ఉండేలా మార్పులు చేయనున్నారు. ఒక ఇన్నింగ్స్లో ప్రతీ డ్రింక్స్ బ్రేక్కు గంటా 10 నిమిషాల వ్యవధి ఉండనుంది.ఇన్నింగ్స్ విరామంపై కీలక నిర్ణయంఇక టీ20 క్రికెట్లో ఇన్నింగ్స్ విరామ సమయాన్ని తగ్గించాలని ఐసీసీ సమావేశంలో ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఉన్న 20 నిమిషాల సమయాన్ని 15 నిమిషాలకు కుదించాలని నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో టీ20 క్రికెట్లో ఒక ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రెండో ఇన్నింగ్స్ 15 నిమిషాల్లోనే ప్రారంభమయ్యేలా చూసుకోవాలని ఐసీసీ తెలిపింది. మే 30న అహ్మదాబాద్లో జరగనున్న మలి విడత సమావేశంలో ఐసీసీ బోర్డు దీనిపై స్పష్టతనివ్వనుంది.చదవండి: కోహ్లీకి ఎదురుపడితే ఈసారి దబిడిదిబిడే! -
IPL 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం
ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్ధానానికి చేరుకుంది. తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.లక్నో నిర్ధేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ అద్భుత విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర.అయ్యర్ అజేయ సెంచరీతో సత్తాచాటాడు. కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శ్రేయస్.. 11 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 69) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, అర్జున్ టెండూల్కర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో జోష్ ఇంగ్లిష్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 43) టాప్ స్కోరర్గా నిలవగా.. అయూశ్ బదోని(43), అబ్దుల్ సమద్(37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జానెసన్, చాహల్ తలా రెండు వికెట్లు సాధించాడు.15 ఓవర్లలో 162/315 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో ప్రబ్సిమ్రన్ (69) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.నిలకడగా ఆడుతున్న పంజాబ్12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(48), ప్రభ్సిమ్రాన్ సింగ్(56) ఉన్నారు.8 ఓవర్లలో పంజాబ్ 79/28 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28), ప్రబ్సిమ్రన్ సింగ్ (30) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్లక్నోతో మ్యాచ్లో 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. తొలి వికెట్గా ప్రియాన్ష్ ఆర్య గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక 18 పరుగులు చేసిన కూపర్ కనోలీ షమీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అవడంతో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ (2), అయ్యర్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.పంజాబ్ టార్గెట్ 197 పరుగులుపంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్ జోస్ ఇంగ్లిస్ (44 బంతుల్లో 72) అర్థసెంచరీతో రాణించాడు. ఆయుశ్ బదోని (43), అబ్దుల్ సమద్ (20 బంతుల్లో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. పంజాబ్ బౌలర్లలో చాహల్, మార్కో జాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన లక్నోలక్నో ఇన్నింగ్స్ను నిలబెట్టిన జోస్ ఇంగ్లిస్ (72) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. శశాంక్ సింగ్ బౌలింగ్లో లాంగ్ ఆన్ దిశగా ఇంగ్లిస్ షాట్ ఆడినప్పటికీ అయ్యర్ చేతికి చిక్కాడు. 18 ఓవర్లో ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.మూడో వికెట్ కోల్పోయిన లక్నోధాటిగా ఆడుతున్న ఆయుశ్ బదోనీ (43) రూపంలో లక్నో సూపర్జెయింట్స్ 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్లో షాట్కు యత్నించి విఫలమైన బదోని కీపర్ ప్రబ్సిమ్రన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఇంగ్లిస్ (24), పంత్ (6) పరుగులతో ఆడుతున్నారు.రెండు వికెట్లు కోల్పోయిన లక్నోపంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 2 పరుగులు చేసిన నికోలస్ పూరన్ను మార్కో జాన్సెన్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ అర్షిన్ కులకర్ణి అజ్మతుల్లా ఒమర్జయ్ బౌలింగ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. బదోని (20), ఇంగ్లిస్ (18) పరుగులతో ఆడుతున్నారు.టాస్ గెలిచిన పంజాబ్టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్కు చావో రేవో లాంటిది. మ్యాచ్లో లక్నోపై విజయం సాధిస్తే పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో ప్లేఆఫ్స్ పోటీలో ఉన్న కేకేఆర్, రాజస్తాన్లు తమ చివరి మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ లక్నో చేతిలో పంజాబ్ ఓటమి చవిచూస్తే మాత్రం ఆ జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. అప్పుడు కేకేఆర్, రాజస్తాన్లు ప్లేఆఫ్స్ పోటీలో ఉంటాయి.లక్నో సూపర్ జెయింట్స్: జోష్ ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.🚨Toss update from Lucknow 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @LucknowIPLUpdates ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/FZTDevYeis— IndianPremierLeague (@IPL) May 23, 2026 -
కోహ్లీకి ఎదురుపడితే ఈసారి దబిడిదిబిడే!
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ విజయం కన్నా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్కు షేక్హ్యాండ్ ఇవ్వడానికి కోహ్లీ నిరాకరించడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. వివాదం జరిగి ఒకరోజు కావొస్తున్నా ఇంకా ఆ వేడి తగ్గలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లు క్వాలిఫయర్లో ఎదురుపడే అవకాశం లేదు. కానీ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ ఓడి, ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం.. క్వాలిఫయర్-2 పోరులో ఈ రెండు జట్లు మళ్లీ తలపడనున్నాయి.అలా కాకుండా క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గెలిచి.. మరోవైపు ఎలిమినేటర్తో పాటు క్వాలిఫయర్-2లోనూ ఎస్ఆర్హెచ్ గెలిచి ఫైనల్ చేరితే మాత్రం, తుది పోరులో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏది ఏమైనప్పటికీ కోహ్లీ మాత్రం ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాడు. మరోమారు ఎస్ఆర్హెచ్తో ఆర్సీబీ మ్యాచ్ ఆడితే మాత్రం హెడ్కు దబిడిదిబిడి అయ్యేలాగే పరిస్థితులు ఉన్నట్లు అభిమానులు పేర్కొంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అసలేం జరిగిందంటే..ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్ @కాస్త బౌండరీలు కొట్టు* అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోహ్లీ దీనిని సీరియస్గా తీసుకున్నాడని స్పష్టంగా తెలిసొచ్చింది.You could easily notice that every time Venkatesh Iyer found the boundary, Kohli kept throwing Travis Head-related gestures. He sparked the whole drama himself, didn’t even shake hands afterward.His arrogance is on another level. 🥵pic.twitter.com/HEnvHnLjEw— Yorker__93™ (@Boom__93) May 23, 2026 255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: అభిమానికి రోహిత్ క్షమాపణ.. ఎందుకంటే? -
అభిమానికి రోహిత్ క్షమాపణ.. ఎందుకంటే?
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తన అభిమానికి క్షమాపణ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఆడింది. పూర్తి వన్సైడ్గా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. కేకేఆర్కు సొంత స్టేడియం కావడంతో ఆ జట్టుకు భారీగా అభిమానులు వచ్చినప్పటికీ, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా మంది అభిమానులు ముంబై ఇండియన్స్ బస చేసే హోటల్ ముందు ఆటగాళ్ల కోసం నిరీక్షించారు. ముఖ్యంగా రోహిత్ శర్మను చూడడం కోసం చాలాసేపు ఎదురుచూశారు. అందులోనే ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది. రోహిత్ బయటకు వచ్చినప్పటికీ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. దీంతో ఆ అమ్మాయి ఎమోషనల్ అయ్యి ఏడ్వడం ప్రారంభించింది. దీనిని వీడియో తీసిన కొందరు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోను చూసిన రోహిత్ శర్మ వెంటనే క్షమాపణతో కూడిన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 'టెన్షన్, గందరగోళం మధ్య వీటన్నింటిని పట్టించుకోవడం కాస్త కష్టమని రోహిత్ తెలిపాడు. అయితే నాకోసం నిరీక్షించిన చిన్న అమ్మాయిని కలవకపోడం బాధగా అనిపించింది. నా చర్య పట్ల క్షమాపణ చెబుతున్నా. మరో విషయం ఏంటంటే ఈసారి ఎప్పుడు కోల్కతాకు వచ్చినా ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతానని అందరికీ వాగ్దానం చేస్తున్నా.' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ ఒక అభిమానికి ఇలా క్షమాపణ చెబుతూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేయడంపై అభిమానులు తెగ సంతోషపడిపోయారు. 'రోహిత్ తనను ఇష్టపడే వ్యక్తులను ఎప్పుడు బాధపెట్టడానికి ఇష్టపపడడని' కామెంట్లు చేస్తున్నారు. కేకేఆర్తో మ్యాచ్లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ సౌరభ్ దూబే బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ సీజన్లో గాయంతో పలు మ్యాచ్లకు దూరమైన రోహిత్ 8 మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ పాండ్యా (26) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం కేకేఆర్ స్వల్ప టార్గెట్ను ఛేదించడానికి కష్టపడినప్పటికీ మనీష్ పాండే, రోవ్మెన్ పావెల్ మధ్య 64 పరుగుల భాగస్వామ్యం కేకేఆర్ను విజయతీరాలకు చేర్చింది. ఇప్పటికే సీజన్ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ముంబై తమ చివరి లీగ్ మ్యాచ్ను రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది.Rohit Sharma apologized to the fangirl who started crying at Eden Gardens after not being able to meet him. Rohit made a special video for her and said sorry, and he also promised that he would meet her the next time he comes to Kolkata.🥹❤️bRO doesn’t disappoint his fans.🙌 pic.twitter.com/NA5FR9AlMM— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 23, 2026చదవండి: ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్! -
ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 255 పరుగులు భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరుజట్లు ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఎస్ఆర్హెచ్ రెండో స్థానంలో ప్లేఆఫ్కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ చేయడంతో రెండో స్థానంలో నిలవాలంటే 90 ప్లస్ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ సంగతి పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెనిరిచ్ క్లాసెన్లు ఒక అరుదైన రికార్డు తమ పేరిట లిఖించుకున్నారు. ఆర్సీబీతో మ్యాచ్లో ఈ ముగ్గురు త్రిమూర్తులు అర్థసెంచరీలతో చెలరేగారు. ఈ సీజన్లో అభిషేక్, క్లాసెన్, ఇషాన్లు 500 పరుగుల మార్క్ను దాటారు. తద్వారా ఒకే ఎడిషన్లో ఒక జట్టు నుంచే ముగ్గురు బ్యాటర్లు 500 ప్లస్ పరుగులు సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. గతంలో గుజరాత్ టైటాన్స్ 2025లో ఈ ఫీట్ను నమోదు చేసింది. ఆ సీజన్లో సాయి సుదర్శన్ (600 పరుగులు), శుబ్మన్ గిల్ (759 పరుగులు), బట్లర్ (538 పరుగులు) సాధించారు. తాజా సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెన్ (606 పరుగులు), అభిషేక్ శర్మ (563 పరుగులు) ఐదొందల మార్క్ దాటగా, తాజాగా ఆర్సీబీతో మ్యాచ్లో ఫిఫ్టీ సాధించడం ద్వారా ఇషాన్ కిషన్ కూడా 500 మార్క్ దాటి 569 పరుగులతో ఆరెంజ్క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. MAXIMUMS x 2️⃣🎥 Abhishek Sharma was in his element 👊🧡Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/exdErsz4bp— IndianPremierLeague (@IPL) May 22, 2026A six-hitting Master-KLAAS on show 🍿🎥 Heinrich Klaasen going big against Josh Hazlewood 💥💥Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/DGYE4ND2WN— IndianPremierLeague (@IPL) May 22, 2026 The ball literally flew to every single corner of the ground tonight 🚀Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/8pR8qvDCnC— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
స్టార్ ప్లేయర్ దూరం.. కేకేఆర్కు ఎదురుదెబ్బ!
ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్ రేసులో ఉన్న కోల్కతా నైట్రైడర్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేకేఆర్ ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్కు దూరమైనట్లు కేకేఆర్ యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేకేఆర్ ఈ సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో ఢీలా పడింది. అయితే రెండో అంచె మ్యాచ్ల్లో వరుస విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కిన కేకేఆర్ ఇప్పుడు ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్ల్లో 6 విజయాలతో 13 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అయితే కేకేఆర్ కంటే మెరుగైన రన్రేట్తో ఉన్న పంజాబ్ ఐదో స్థానంలో ఉండగా, రాజస్తాన్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్, రాజస్తాన్లు తమ చివరి మ్యాచ్ల్లో ఓడిపోయి, కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిస్తే ప్లేఆఫ్స్లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో అంగ్క్రిష్ రఘువంశీ దూరమవ్వడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఈ సీజన్లో అంగ్క్రిష్ రఘువంశీ తన బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. 13 మ్యాచ్ల్లో 146 స్ట్రైక్రేట్తో 422 పరుగులు సాధించాడు. అయితే కేకేఆర్ జట్టులో రఘువంశీ కంటే నాణ్యమైన క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ వారెవరూ ప్రభావం చూపలేకపోయారు. కానీ అంగ్క్రిష్ రఘువంశీ ప్రతీ మ్యాచ్లో స్థిరంగా రాణించి ఇవాళ కేకేఆర్ ప్లేఆఫ్ రేసులో నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
మతి తప్పిన నేపాల్ క్రికెటర్.. ముందుంది ముసళ్ల పండగ!
నేపాల్ స్టార్ క్రికెటర్ రోహిత్ పౌడెల్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను ఔట్ కాదని క్లియర్గా తెలుస్తున్నప్పటికీ అంపైర్ ఔట్గా ఇవ్వడంపై రోహిత్ పోడెల్ ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ లీగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా అమెరికాతో మ్యాచ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 38వ ఓవర్ మిలింద్ కుమార్ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ విఫలం కావడంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే మిలింద్ కుమార్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. బంతి ప్యాడ్లకు తాకలేదని ఒకవైపు రోహిత్ చెబుతూనే ఉన్నప్పటికీ అంపైర్ ఔటిచ్చాడు. అంపైర్ నిర్ణయంతో షాక్కు గురైన రోహిత్ పౌడెల్ అంపైర్వైపు కోపంగా చూశాడు. ఆ తర్వాత బ్యాట్ను పిచ్పై బలంగా కొట్టి చేసేదేం లేక నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో బంతి ప్యాడ్లను తాకలేదు, కానీ గ్లోవ్స్ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్ ఔట్ ఇచ్చిన తర్వాత తిట్టడం, బ్యాట్ను పడేయడం, బ్యాట్తో మైదానాన్ని కొట్టుకుంటూ వెళ్లడం, బౌండరీ లైన్ను కాళ్లతో తన్నడం వంటివి నిషిద్ధం. అయితే రోహిత్ పౌడెల్ బ్యాట్ను బలంగా పిచ్కు కొట్టడంతో నిబంధన ఉల్లఘించినట్లయింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లఘించిన రోహిత్ పౌడెల్పై లెవెల్ 1 లేదా లెవెల్ 2 కింద చర్యలు తీసుకునే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే అమెరికాపై నేపాల్ 122 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఇషాన్ పాండే (84), దీపేంద్ర సింగ్ (59) అర్థసెంచరీలతో రాణించగా.. రోహిత్ పౌడెల్ (46), ఆసిఫ్ షేక్ (43) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. శుభమ్ రంజనే మూడు వికెట్లు తీశాడు. అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 41.2 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. సంజయ్ కృష్ణమూర్తి (56) అర్థసెంచరీతో రాణించాడు. నేపాల్ బౌలర్లలో సందీప్ లమిచ్చానే 3 వికెట్లు తీయగా, లలిత్, దీపేంద్ర సింగ్, గుల్షన్ జా తలా రెండు వికెట్లు పడగొట్టారు. There have been no shortage of poor umpiring decisions during the ongoing ODI tri series in Nepal. Add this from today to the list. Nepal captain Rohit Paudel given lbw on a ball that never hit his pads, appeal upheld from USA bowler Milind Kumar on gloved sweep into the ground. pic.twitter.com/KN9PwL1s7A— Peter Della Penna (@PeterDellaPenna) May 22, 2026చదవండి: ఉగ్రవాదితో షాహిద్ అఫ్రిది డిన్నర్! -
IPL 2026: ఆర్సీబీని చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
ఉప్పల్ మైదానం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 55 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో రజిత్ పాటిదార్(56) టాప్ స్కోరర్గా నిలవగా.. కృనాల్ పాండ్యా(41), వెంకటేశ్ అయ్యర్(44) రాణించారు. విరాట్ కోహ్లి మాత్రం కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు, షకీబ్, ట్రావిస్ హెడ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్పాటిదార్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన పాటిదార్.. హెడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 185/4ఆర్సీబీ మూడో వికెట్ డౌన్దేవ్దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన పడిక్కల్.. మలింగ బౌలింగ్లో ఔటయ్యాడు8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 91/28 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో దేవ్దత్త్ పడిక్కల్(20), పాటిదార్(10) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీఎస్ఆర్హెచ్ విధించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అయితే మరుసటి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్ (44) ఔట్ కావడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ టార్గెట్ 256 పరుగులుహైదరాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్ భారీ స్కోరు చేసింది. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ అర్థశతకాలతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) ఫిఫ్టీలతో మెరిశారు. ఆఖర్లో నితీశ్కుమార్ (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్హెచ్ 250 పరుగుల మార్క్ను దాటింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 2 వికెట్లు తీయగా, సుయాశ్, కృనాల్ చెరొక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్లాసెన్ 23 బంతుల్లో 50 పరుగుల మార్క్ సాధించాడు. కిషన్ 65 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ఎస్ఆర్హెచ్.. 15 ఓవర్లలో 189-2ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ దంచికొడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (50), క్లాసెన్ (47) క్రీజులో ఉన్నారు. అంతకముందు 56 పరుగులు చేసిన అభిషేక్ శర్మ సుయాశ్ శర్మ బౌలింగ్లో జోర్డాన్ కాక్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.6 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 63-16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (26), ఇషాన్ కిషన్ (8) పరుగులతో ఆడుతున్నారు.హెడ్ (26) ఔట్.. తొలి వికెట్ డౌన్ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ రసిక్సలామ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (17) క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీపై భారీ విజయాన్ని సాధించి టేబుల్లో రెండో స్థానంలో నిలవాలని ఎస్ఆర్హెచ్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇప్పటికే టాప్లో ఉన్న ఆర్సీబీ విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. మరి భారీ స్కోర్లకు పెట్టింది పేరైన ఉప్పల్ స్టేడియంలో ఎవరిది పైచేయి కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్తో తలపడింది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన ఆర్సీబీ.. యాదృశ్చికంగా లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ను మళ్లీ ఎస్ఆర్హెచ్తోనే ఆడుతోంది. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 26 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 14 సార్లు, ఆర్సీబీ 12 సార్లు విజయాలు సాధించాయి. ఇక సొంత మైదానంలో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఆరింటిలో గెలవగా.. ఆర్సీబీ మూడింట నెగ్గింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. 🚨Toss update from Hyderabad 🚨@SunRisers won the toss and elected to bat first against @RCBTweets Rajat Patidar returns to lead #RCB Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB pic.twitter.com/izekAMXKnx— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
ఉగ్రవాదితో షాహిద్ అఫ్రిది డిన్నర్!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదిగా ముద్రపడిన ఉజైర్ బలోచ్తో కలిసి అఫ్రిది డిన్నర్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో క్రికెట్ అభిమానులు షాహిద్ అఫ్రిదిని ఏకిపారేస్తు న్నారు. జీషన్ అక్రమ్ మీర్జా అనే వ్యక్తి తన ‘ఎక్స్’ వేదికగా ఫొటోలను పంచుకున్నాడు.2013లో షాహిద్ అఫ్రిది ఒక ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలుస్తోంది. అదే కార్యక్రమానికి అప్పటి ల్యారీ గ్యాంగ్ నెట్వర్క్కు కీలక నాయకుడిగా ఉన్న ఉజైర్ బలోచ్ కూడా వచ్చాడని, ఈ సందర్భంగా ఉజైర్ బలోచ్ గ్యాంగ్తో కలిసి అఫ్రిది డిన్నర్లో పాల్గొన్నాడంటూ అభిమాని ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక ల్యారీ గ్యాంగ్లో రెహమాన్ డెకాయిట్ తర్వాత రెండో అత్యున్నత పదవిలో కొనసాగిన ఉజైర్ బలోచ్ లక్షిత హత్యలు, దోపిడీలు, ముఠా హింస, మాదకద్రవ్యాల రవాణా, గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2008 ముంబై ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా చేయడంలో ఉజైర్ బలోచ్ కీలకపాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. 2016లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉజైర్ బలోచ్ను అదుపులోకి తీసుకొని దేశంలో అత్యంత కరుడుగట్టిన నేరస్థులలో ఒకడిగా ముద్ర వేశారు. ఇటీవలే విడుదలైన బాలీవుడ్ చిత్రం ధురందర్లో ఉజైర్ బలోచ్ అనే పాత్రను భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి సహకరించిన గ్యాంగ్స్టర్గా చూపించారు. అయితే తాజాగా షాహిద్ అఫ్రిది ఉగ్రవాదిగా ముద్రపడిన ఉజైర్ బలోచ్తో డిన్నర్లో పాల్గొన్న ఫొటోలు ప్రత్యక్షమవ్వడం వివాదానికి దారి తీసింది. పాక్ వ్యక్తులే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.నిజానికి మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన ప్రవర్తనతో ఎన్నోసార్లు అప్రతిష్ట పాలయ్యాడు. ఆటలో నైపుణ్యం సంగతి పక్కనబెడితే అతడు భారత్ వ్యతిరేకిగా ముద్రపడ్డాడు. ఈ పాక్ మాజీ కెప్టెన్ పదే పదే భారత్ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఉగ్రవాదాన్ని సమర్థించి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. బయట వివాదాలు ఎన్ని ఉన్నా ఆటలో మాత్రం షాహిద్ అఫ్రిది నిఖార్సైన ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. పాక్ తరఫున అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా శతకం బాదిన తొలి బ్యాటర్గా (37 బంతుల్లో) అఫ్రిది ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2018లో అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.Shahid Afridi and Uzair Baloch of PAC aka Lyari Gang pic.twitter.com/IxSg0rUPEM— Zeeshan Akram Mirza (@ZshanMirza) March 27, 2013చదవండి: గుజరాత్ ఓపెనర్కు అశ్విన్ చురకలు! -
గుజరాత్ ఓపెనర్కు అశ్విన్ చురకలు!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ నిలకడ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లాడిన సాయి సుదర్శన్ 157 స్ట్రైక్రేట్తో 638 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో లీడింగ్లో కొనసాగుతున్నాడు. అయితే సాయి సుదర్శన్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్లో ఇంకా దూకుడు పెంచాల్సిన అవసరముందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చురకలు అంటించాడు.ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నప్పటికీ ఆఖరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో సాయి సుదర్శన్ విఫలమవుతున్నాడని తెలిపాడు. అశ్విన్ మాట్లాడుతూ..'నేను శుబ్మన్ గిల్ బ్యాటింగ్ను ప్రశంసించాలనుకుంటున్నా. గుజరాత్ టైటా న్స్ను అటు కెప్టెన్గా సమర్థంగా నడిపిస్తూనే బ్యాటర్గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ప్లేలో గిల్ పట్టుదలతో భారీ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. కానీ సాయి సుదర్శన్ ప్రదర్శన మెచ్చుకునే రీతిలో ఉన్నప్పటికీ మోడ్రన్ టీ20 క్రికెట్కు సరిపోయేలా అతడు ఆడడం లేదు. సాయి సుదర్శన్ ఎక్కువగా సంప్రదాయబద్ధంగానే క్రికెట్ ఆడతాడు, కానీ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో బ్యాటింగ్లో వేగం పెంచితే మాత్రం సాయి సుదర్శన్కు తిరుగుండకపోవచ్చు. ఆరెంజ్ క్యాప్లో లీడింగ్లో ఉన్నప్పటికీ సాయి సుదర్శన్ తన ప్రదర్శనను చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అతడు దీనిని చేయగలడని ఆశిస్తున్నా. ఇక గిల్ బాగా ఆడుతున్నప్పటికీ తనలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయలేదని నాకు అనిపిస్తోంది.' అంటూ చెప్పుకొచ్చాడు. గురువారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84), కెప్టెన్ గిల్ (64) అర్థశతకాలతో రాణించారు. జాస్ బట్లర్ (57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్కింగ్స్ 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్లో ఓటమితో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: ఆటగాళ్లకు అవమానం.. పాక్ జట్టులో సంక్షోభం! -
ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ.. వైభవ్కు ప్రమోషన్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారంతో లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఏడాది టైటిల్ ఎవరి సొంతమవుతుందనేది మే 31న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బీహార్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీకి అనుమతి ఇస్తే 'బెమిసల్ బీహార్' పేరుతో కొత్త జట్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీసీసీఐ ఒప్పుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీని చూసే అవకాశముంది. ఈ ఫ్రాంచైజీ ఏర్పాటైతే ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్గా ఉంటాడని ఆయన పేర్కొన్నారు. ‘బెమిసల్ బీహార్’తో కూడిన జెర్సీని కెప్టెన్, వైస్ కెప్టెన్ హోదాలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ కలిసి ఆవిష్కరిస్తున్న ఫొటో చాట్ జీపీటీ ద్వారా ప్రత్యక్షమవ్వడం వైరల్గా మారింది. బీహార్కు చెందిన ఈ ఇద్దరితో పాటు ఈ సీజన్లో వేర్వేరు జట్లకు ఆడుతున్న అంగ్క్రిష్ రఘువంశీ (కేకేఆర్), సాకిబ్ హుస్సేన్ (ఎస్ఆర్హెచ్) కూడా అదే రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ నలుగురు బీహార్ నుంచి వచ్చినవారు కావడంతో సెపరేట్గా ఒక ఐపీఎల్ జట్టు ఉంటే బాగుంటుందని అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశం క్రీడల పరంగా బీహార్ను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు తర్వాతి తరం క్రికెటర్లకు ఇది స్ఫూర్తినిచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్లాగే బీహార్కు కూడా సొంత ఫ్రాంచైజీ ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే బీహార్ గడ్డ ఈ దేశానికి ఎంతో మంది క్రికెటర్లను అందించింది. పట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఇక బీహార్లోని సమస్తిపూర్కు చెందిన సూర్యవంశీ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. గోపాల్గంజ్లోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాకిబ్ హుస్సేన్ ఇవాళ తన బౌలింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. ఇదే రాష్ట్రానికి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ తన డైనమైట్ ఇన్నింగ్స్లతో అలరిస్తున్నాడు. వీరందరిని ఒక చోట చేర్చేలా బీహార్ పేరుతో ఒక ఫ్రాంచైజీని తీసుకొస్తే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటింగ్లో మెరిసిన వాళ్లలో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ వైస్కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉంటారు. ఈ సీజన్లో వైభవ్ 13 మ్యాచ్ల్లో 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ 13 మ్యాచ్ల్లో 490 పరుగులతో రేసులో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అనిల్ అగర్వాల్ ప్రతిపాదనతో బీహార్ నూతన ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ ఏకీభవించారు. 'బీహార్ క్రికెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన దార్శనికతో ఒక మిషన్ మోడ్లా పనిచేస్తోంది. మీరు ప్రతిపాదించిన విషయంతో ఏకీభవిస్తూ ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. ఇక ఐపీఎల్లో తొలుత 8 ఫ్రాంచైజీలు ఉంటే ఆ సంఖ్య 10కి పెంచారు. ఇటీవలే ఆర్సీబీ, రాజస్తాన్ ఫ్రాంచైజీలు భారీ ధరకు చేతులు మారాయి. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్లో ఫ్రాంచైజీల సంఖ్యను విస్తరించాలనుకుంటే మాత్రం బీహార్కు చెందిన అనిల్ అగర్వాల్ ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావొచ్చు.क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026 आपकी बात से पूर्णतः सहमत हूँ।बिहार के क्रिकेट "इमोशन" के लिए सरकार स्पष्ट "विजन" के साथ "मिशन" मोड में कार्यरत है। आपके सहयोग से निश्चित ही बिहार की क्रिकेट टीम को लेकर सकारात्मक निर्णय लिया जाएगा। https://t.co/Q5xfXYGwiC— Samrat Choudhary (@samrat4bjp) May 22, 2026చదవండి: పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర! -
క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు
ఓ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. క్రికెట్ కెనడా అధ్యక్షుడు అర్విందర్ ఖోసా నివాసం బయట గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో దుమారం రేపుతోంది.బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలోని న్యూటన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మే 20 తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో ఖోసా ఇంటి వద్ద పలుమార్లు తుపాకీ కాల్పులు జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇంటి తలుపులు, కిటికీలపై బుల్లెట్ గుర్తులు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సర్రే పోలీసులు.. ఎక్స్టోర్షన్ (దందా వసూళ్ల బెదిరింపులు)కు సంబంధించిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఇంటికి సంబంధం ఉన్న వ్యక్తికి గతంలో ఎక్స్టోర్షన్ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో కెనడా క్రికెట్ చుట్టూ వివాదాలు పరిపాటిగా మారాయి. భారత్లో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఓ డాక్యుమెంటరీలో బయటపడిన వివరాల ప్రకారం.. 2026 ప్రపంచకప్లో భాగంగా కెనడా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ జరుపుతుంది. కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడిని టోర్నీకి ముందు ఆశ్చర్యకరంగా జట్టు కెప్టెన్గా నియమించడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది.పరిపాలనా సమస్యలు, ఆర్దికపరమైన అవకతవలు, ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐసీసీ ఇటీవలే క్రికెట్ కెనడాకు ఆరు నెలలపాటు ఫండింగ్ను ఆపింది. ఇలాంటి తరుణంలో బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. -
పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర!
అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్కు గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే పంత్ డిమోషన్ వెనుక గిల్ కీలకపాత్ర పోషించాడంటూ ఒక అభిమాని సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తి రేపింది. పంత్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఒక అభిమాని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టుకు పంత్ సోదరి సాక్షి లైక్ కొట్టింది. 'పంత్ వైస్ కెప్టెన్సీ పదవి ఊడిపోవడానికి తెర వెనుక కెప్టెన్ శుబ్మన్ గిల్ పెద్ద రాజకీయమే నడిపాడు. తన పదవికి ఉన్న ముప్పును తొలగించుకోవడానికే వైస్ కెప్టెన్సీకి పంత్ను కాదని రాహుల్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది’ అంటూ పోస్టు పెట్టాడు. పంత్ భవిష్యత్తులో టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశం ఉండడంతోనే గిల్ ఇలా చేసి ఉండొచ్చని సదరు అభిమాని ఆరోపించాడు. అయితే ఇదంతా ఒక అభిమాని ఎలాంటి ఆధారాలు లేకుండా తన అభిప్రాయంగా పోస్టును పెట్టడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పంత్ సోదరి సాక్షి అభిమాని పెట్టిన పోస్టును లైక్ చేస్తూ ‘ఇది నిజమే అయి ఉండొచ్చు’ అని పేర్కొనడం ఆసక్తిని రేపింది. అయితే అభిమాని పెట్టిన పోస్టుకు లైక్ కొట్టింది నిజంగా పంత్ సోదరి సాక్షినా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పోస్టుపై సోషల్మీడియాలో అభిమానులు రెండు విధాలుగా స్పందించారు. కొందరు పంత్కు సపోర్ట్ చేస్తే, మరికొందరు గిల్కు మద్దతుగా పోస్టులు పెట్టారు. ఈ సంగతి పక్కనబెడితే యాక్సిడెంట్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పంత్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. 2025లో ఇంగ్లండ్ టూర్లో పంత్ సరైన ప్రదర్శన చేయలేదు. దీంతో వన్డే, టీ20 జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే టెస్టుల్లో పంత్కు మంచి రికార్డు ఉండడంతో ఆఫ్గన్తో టెస్టుకు ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో ఉంటాడా లేడా అన్నది చూడాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ పంత్ పెద్దగా రాణించలేదు. 132 మ్యాచ్లాడి కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్గా పంత్ జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలోనూ విఫలమయ్యాడు. వరుస ఓటములతో ఈ సీజన్లో లక్నో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.🚨 Rishabh Pant’s sister has liked an Instagram reel that says Shubman Gill has played politics with Rishabh Pant and removed him from the Vice Captaincy so that he don't have any competition in Test captaincy. 🚨Someone should tell her, that India lost 2-0 vs South Africa at… pic.twitter.com/DpNs4ACLKu— Ahmed Says (@AhmedGT_) May 20, 2026 View this post on Instagram A post shared by Pahul Walia (@cricketwithpahul)చదవండి: ప్లేఆఫ్స్ ముంగిట ఆర్సీబీకి గుడ్న్యూస్! -
ప్లేఆఫ్స్ ముంగిట ఆర్సీబీకి గుడ్న్యూస్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి ఒక శుభవార్త అందింది. గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు ఐపీఎల్కు దూరంగా ఉన్న బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ వారం చివర్లో భారత్కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 18న ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో బౌండరీని అడ్డుకునే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి వేలికి గాయం అయింది. ఆ గాయం కారణంగా అతడు మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అనంతరం జరిగిన మూడు పోటీల్లో కూడా అతడు జట్టుకు దూరంగానే ఉన్నాడు. గాయం తీవ్రతను పరీక్షించేందుకు మే మొదటి వారంలో ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన వైద్యపరీక్షల్లో గాయం పెద్దది కాదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. అయితే మే 22న హైదరాబాద్ జట్టుతో జరగనున్న బెంగళూరు చివరి లీగ్ మ్యాచ్కు ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికే 13 మ్యాచ్ల్లో 18 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్లో స్థానం ఖాయం చేసుకుంది. ఈ సీజన్లో ఓపెనర్గా ఫిల్ సాల్ట్ దూకుడైన ఆటతో జట్టుకు మంచి ఆరంభాలు అందించాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీకి శుభారంభాలను అందించాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన ఫిల్ సాల్ట్ 202 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు! -
బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
పాకిస్తాన్ను తమ సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసి బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొసెన్ షాంటో కూడా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్పై గెలుపుతో బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా నజ్ముల్ షాంటో రికార్డులకెక్కాడు. షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్ 18 టెస్టు మ్యాచ్లు ఆడితే అందులో 8 విజయాలు, 9 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. షాంటో కంటే ముందు ముష్ఫికర్ రహీమ్ కెప్టెన్సీలో బంగ్లా సాధించిన ఏడు టెస్టు విజయాలే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా షాంటో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ముష్ఫికర్ రహీమ్ సారథ్యంలో బంగ్లాదేశ్ 34 టెస్టులు ఆడింది. ఇందులో 7 విజయాలు, 18 ఓటములు, 9 డ్రాలు ఉన్నాయి. స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ నేతృత్వంలో 19 టెస్టులు ఆడిన బంగ్లా 4 విజయాలు, 15 ఓటములు చవిచూసింది. మోమినుల్ హక్ సారథ్యంలో 17 మ్యాచ్లాడిన బంగ్లాదేశ్ మూడు విజయాలు సాధించి, 12 ఓటములు, రెండు డ్రాలు చేసుకుంది. ఈ లెక్కన నజ్ముల్ హసన్ షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్ టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించడంతో అతడి కెప్టెన్సీ విన్నింగ్ శాతం అందరికంటే అధికంగా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే సిల్హెట్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్లో 78 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (94) పాక్ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్ పతనాన్ని శాసించాడు.Sylhet witnesses a memorable triumph. pic.twitter.com/Vbi39tQpih— Bangladesh Cricket (@BCBtigers) May 20, 2026చదవండి: పాక్ మాజీ క్రికెటర్కు బంపరాఫర్.. ఐపీఎల్కు అర్హత! -
IPL 2026: ముంబై ఇండియన్స్పై కేకేఆర్ ఘన విజయం
KKR Vs Mumbai Indians Match Live Updates From Kolkata: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ ఘన విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో మనీష్ పాండే(45) టాప్ స్కోరర్గా నిలవగా.. రావ్మన్ పావెల్(40) రాణించాడు. ముంబై బౌలర్లలో కార్భిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్ఫర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్లో టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(26), కార్భిన్ బాష్(32) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే, కామోరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగి తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.కేకేఆర్ ఐదో వికెట్ డౌన్కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన రోవ్మన్ పావెల్.. ఘజన్ఫర్ బౌలింగ్లో ఔటయ్యాడు.కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 20 పరుగులు కావాలి.విజయం దిశగా కేకేఆర్12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో మనీష్ పాండే(36), పావెల్(23) ఉన్నారు. కేకేఆర్ విజయానికి ఇంకా 48 బంతుల్లో 51 రన్స్ కావాలి.కేకేఆర్ రెండో వికెట్ డౌన్అజింక్య రహానే రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన రహానే.. బాష్ బౌలింగ్లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 54/2కేకేఆర్ తొలి వికెట్ డౌన్కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఫిన్ అలెన్ దీపక్ చాహర్ బౌలింగ్లో ఔటయ్యాడు.తేలిపోయిన ముంబై బ్యాటర్లు.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తేలిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లోయార్డర్ బ్యాటర్ కార్భిన్ బాష్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32) మెరుపులు మెరిపించడంతో ముంబై ఈ మాత్రం స్కోర్ అయినా సాధించగల్గింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే, గ్రీన్, కార్తిక్ త్యాగి తలా రెండు వికెట్లు సాధించగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.17 ఓవర్లలో ముంబై 106/717 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కార్బిన్ బాష్ (2) పరుగులతో ఆడుతున్నాడు.తిరిగి మొదలైన ఆట.. 9 ఓవర్లలో ముంబై 61-49 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. తిలక్ వర్మ (10), హార్దిక్ పాండ్యా (8) పరుగులతో ఆడుతున్నారు. ఆటకు ఆటంకం కలిగించిన వరుణుడుఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ముంబై ఇండియన్స్ స్కోరు 8 ఓవర్లకు 57-4గా ఉన్న సమయంలో వర్షం పడడంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబైకేకేఆర్తో మ్యాచ్లో ముంబై దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. 41 పరుగుల వద్ద సూర్యకుమార్ (15) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. పాండ్యా (6), తిలక్ వర్మ (5) పరుగులతో ఆడుతున్నారు.రోహిత్ (15) ఔట్.. మూడో వికెట్ డౌన్కేకేఆర్తో మ్యాచ్లో ముంబై కష్టాల్లో పడింది. 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ సౌరబ్ దూబే బౌలింగ్లో గ్రీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై 23 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. సూర్యకుమార్ (9), తిలక్ వర్మ (0) క్రీజులో ఉన్నారు.మెరిసిన గ్రీన్.. రెండు వికెట్లు కోల్పోయిన ముంబైకేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 17 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కామెరున్ గ్రీన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో మెరిశాడు. తొలుత 6 పరుగులు చేసిన రికెల్టన్ గ్రీన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి పాండే స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి నమన్ ధిర్ను గ్రీన్ డకౌట్ చేశాడు.టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 36 సార్లు తలపడితే ముంబై 25 సార్లు, కేకేఆర్ 11 సార్లు నెగ్గాయి. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటిబాట పట్టనుంది. ప్రస్తుతం కేకేఆర్ 12 మ్యాచ్ల్లో 5 విజయాలతో 11 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే కేకేఆర్ ఖాతాలో 13 పాయింట్లు చేరుతాయి. తమ చివరి మ్యాచ్లో ఢిల్లీని ఓడిస్తే అప్పుడు 15 పాయింట్లతో నిలవనుంది. ఇదే సమయంలో రాజస్తాన్, పంజాబ్లు తమ చివరి మ్యాచ్ల్లో ఓడితే మాత్రం కేకేఆర్ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఎలిమినేట్ కావడంతో వారు గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదు. తుది జట్లు:ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్) , రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కె ప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, రఘు శర్మ.కోల్కతా నైట్ రైడర్స్: అజింక్య రహానె(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే. 🚨Toss update from Kolkata 🚨@kkriders won the toss and elected to bowl first against @mipaltanUpdates ▶️ https://t.co/Aw11jLoww5#TATAIPL | #KhelBindaas | #KKRvMI pic.twitter.com/YoNaUICl30— IndianPremierLeague (@IPL) May 20, 2026 -
పాక్ మాజీ క్రికెటర్కు బంపరాఫర్.. ఐపీఎల్కు అర్హత!
ముంబై ఉగ్రదాడులు (2008) తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు నిలిచిపోయాయి. ఐసీసీ, ఆసియాకప్ వంటి మేజర్ టోర్నీల్లో మాత్రమే ఇరుజట్లు ముఖాముఖి తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన పాక్ మాజీలకు కూడా అవకాశం లేదు.అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్కు మాత్రం ఐపీఎల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముంది. ఇటీవలే మహ్మద్ ఆమిర్ బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందడంతో అధికారికంగా బ్రిటన్ జాతీయతను కలిగి ఉన్నాడు. దీనివల్ల ఆమిర్ పాకిస్తాన్లో జన్మించి నప్పటికీ తాజాగా బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందడంతో ఐపీఎల్లో ఆడేందుకు అర్హత సాధించాడు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత బీసీసీఐతో పాటు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పాస్పోర్టులు కలిగిన క్రికెటర్లను ఐపీఎల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. అయితే బ్రిటీష్ పాస్పోర్టు అందుకున్న తర్వాత బ్రిటన్కు చెందిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో ఆమిర్ పాల్గొన్నాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ఆటగాళ్లు వేలంలో పాల్గొనాలనుకుంటే తమ పాస్పోర్టు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. బౌగోళిక ఆంక్షల నేపథ్యంలో కేవలం పాకిస్తాన్లో జన్మించిన ఆటగాళ్లను మాత్రమే తీసుకోకూడదనే నిబంధన ఐపీఎల్లో ఉంది. మహ్మద్ పాకిస్తాన్ దేశానికి చెందిన వాడైనప్పటికీ తన వద్ద యూకే పాస్పోర్ట్ ఉన్నందున, బ్రిటీష్ పౌరుడిగా వేలంలో పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.ఆమిర్కు అవకాశమెంత?అయితే గతంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అజర్ మహ్మూద్ బ్రిటన్ మహిళను పెళ్లి చేసుకొని ఆ దేశ పౌరసత్వాన్ని పొందాడు. ఆ తర్వాత యూకే పౌరసత్వంతో ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకోవడమే గాక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే టీ20 క్రికెట్లో స్టార్ క్రికెటర్గా గుర్తింపు పొందిన మహ్మద్ ఆమిర్ ఐపీఎల్ 2027 సీజన్లో ఆడుతాడా లేదా అన్నది ప్రశ్నగానే ఉంది. ఇటీవలే ది హండ్రెడ్, ఎస్ఏ20 టోర్నీల్లో పాక్లో జన్మించిన ఆటగాళ్లను చేర్చడంపై వివాదం చెలరేగింది. దీంతో మహ్మద్ ఆమిర్ ఐపీఎల్లో ఆడుతాడా అన్నది అనుమానమే. అయితే ఆమిర్కు ఇంగ్లండ్ దేశం హోదా కింద ఐపీఎల్ ఆటగాళ్ల వేలం పూల్లో తన పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. అతడు డ్రాఫ్ట్ చేయడానికి అర్హుడైనప్పటికీ, వేలంలో ఫ్రాంచైజీలు అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఐపీఎల్లో ఆడేందుకు అధికారికంగా ఆమిర్కు అర్హత ఉన్నప్పటికీ బీసీసీఐ మాత్రం సున్నితత్వ అంశానికే ప్రాధాన్యం ఇస్తే మాత్రం అతడు వేలంలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లపై కఠిన ఆంక్షలను జారీ చేసింది. ఈ లెక్కన మహ్మద్ ఆమిర్ ఐపీఎల్ ఎంట్రీ జరగడం అనుమానమే.స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంస్వతహగా ఫాస్ట్ బౌలర్ అయిన మహ్మద్ ఆమిర్ తన స్వింగ్తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే 2010లో ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మహ్మద్ ఆమిర్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది. చాలాకాలం పాటు అతడిపై నిషేధం కొనసాగింది. 2015లో ఐసీసీ అతడిపై నిషేధం తొలగించిన తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక 2009లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమిర్ పాక్ తరఫున 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 62 టీ20ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో అంతర్జాతీయ క్రికెట్కు ఆమిర్ వీడ్కోలు పలికాడు.అయితే గతేడాది పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గతేడాది టీ20 ప్రపంచకప్కు ముందు బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరించిన సమయంలో పాకిస్తాన్ హైడ్రామా చేసిన సంగతి కూడా ఎవరు మరిచిపోలేరు. చదవండి: 'కశ్మీరీ అని చులకన.. అందుకే ఎంపిక చేయలేదా?' -
'కశ్మీరీ అని చులకన.. అందుకే ఎంపిక చేయలేదా?'
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో టెస్టు, వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు సంబంధించి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన టీమిండియాను ప్రకటించింది. సీనియర్లతో పాటు ప్రిన్స్ యాదవ్, మానవ్ సుతార్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ వంటి కొత్త ముఖాలకు బీసీసీఐ చోటు కల్పించింది. అయితే దేశవాలీ క్రికెట్లో నిలకడగా రాణించిన జమ్మూ కశ్మీర్ క్రికెటర్ అకిబ్ నబీని సెలెక్టర్లు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025-26 రంజీ సీజన్లో జమ్మూ కశ్మీర్కు ప్రాతినిధ్యం వహించిన అకిబ్ నబీ 10 మ్యాచ్ల్లోనే 60 వికెట్లు తీశాడు. తద్వారా ఫైనల్లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్ టైటిల్ అందుకోవడంలో అకిబ్ నబీ కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అకిబ్ నబీని ఎంపిక చేయకపోవడంపై రాజకీయ వివాదం అలుముకుంది. అకిబ్ నబీ కశ్మీర్కు చెందిన వ్యక్తి అన్న చులకన భావంతోనే బీసీసీఐ అఫ్గానిస్తాన్తో టెస్టుకు భారత జట్టుకు ఎంపిక చేయలేదంటూ కశ్మీర్కు చెందిన రాజకీయ నేత, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వహీద్ ఉర్ రెహమాన్-పరా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయానా దేశ ప్రధాని, ప్రజల చేత శెభాష్ అనిపించుకున్న అకిబ్ నబీ సంచలన ప్రదర్శన బీసీసీఐ కళ్లకు కనిపించలేదా అంటూ వహీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఐసీసీ చైర్మన్ జై షాలు కూడగట్టుకొని అకిబ్ నబీని జాతీయ జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుపడ్డారంటూ 'ఎక్స్' వేదికగా వారి పేర్లను ట్యాగ్ చేస్తూ విమర్శలకు దిగారు. '67 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ రంజీ ట్రోఫీ సాధించడంలో అకిబ్ నబీది కీలకపాత్ర. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఎంపికైన అకిబ్ నబీని దేశ ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, క్రికెట్ అభిమానులు ప్రశంసించారు. కానీ బీసీసీఐ మాత్రం కొన్ని శక్తులకు తలొగ్గి అకిబ్ నబీకి జాతీయ జట్టులో చోటు కల్పించకపోవడం బాధాకరం. మిథున్ మన్హాస్, జై షాల నిర్ణయం చాలా షాకింగ్గా అనిపించింది' అని వహీద్ పరా ఘాటుగా రాసుకొచ్చారు.ఇక అకిబ్ నబీ దేశవాలీ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. 29 ఏళ్ల అకిబ్ 2025-26 రంజీ సీజన్లో జమ్మూ కశ్మీర్కు ఆడాడు. 10 మ్యాచ్లాడిన అకిబ్ 17 ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేసి 12.56 సగటుతో మొత్తం 60 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏడు ఐదు వికెట్ల హాల్ను నమోదు చేయడం విశేషం.కర్నాటకతో జరిగిన రంజీ ఫైనల్లోనూ అకిబ్ నబీ 54 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం ద్వారా జమ్మూ కశ్మీర్కు తొలి ఇన్నింగ్స్లో 291 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దేశవాలీ టోర్నీలో అదరగొట్టిన అకిబ్ నబీని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. నాలుగు మ్యాచ్లాడిన అకిబ్ నబీ ఒక వికెట్ తీశాడు. జూన్ 6 నుంచి ఛండీగఢ్లోని ముల్లన్ పూర్ వేదికగా జరగనున్న ఏకైక టెస్టుకు భారత జట్టుకు గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యుటీగా కేఎల్ రాహుల్ ఉండనున్నాడు.Aqib Nabi, the man behind J&K’s historic Ranji Trophy success after 67 years, Player of the Match, IPL-selected, and praised by the @PMOIndia & @HMOIndia, CM, and cricket fans across India has surprisingly been dropped from the India team in the list released by @BCCI today.…— Waheed Ur Rehman Para (@parawahid) May 19, 2026ఆఫ్గన్తో టెస్టుకు టీమిండియా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్) , సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే , ధ్రువ్ జురేల్.చదవండి: లక్నో జట్టులోకి వైభవ్ సూర్యవంశీ! -
లక్నో జట్టులోకి వైభవ్ సూర్యవంశీ!
రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వచ్చే ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్లో చేరనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మంగళవారం లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్తో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా సుదీర్ఘంగా చర్చించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఆ ఫొటోలను సంజీవ్ గోయెంకానే స్వయంగా తన ‘ఎక్స్’లో పంచుకోవడం విశేషం. మాటల సందర్భంలో లక్నో జట్టులో చేరాలంటూ వైభవ్కు సంజీవ్ గోయెంకా అడిగినట్లు తెలుస్తోంది. అయితే కళ్లు చెదిరే మొత్తాన్ని వైభవ్కు ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. ఇద్దరి మధ్య జరిగిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంజీవ్ గోయెంకా ఆశీర్వాదం తీసుకున్న వైభవ్, ఆ తర్వాత ఆయనతో చాలాసేపు ముచ్చటించాడు. లక్నో జట్టులోకి వస్తాడా? రాడా అన్నది పక్కనబెడితే, వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అయిన సంజీవ్ గోయెంకా అతడి టెక్నిక్, బ్యాటింగ్ రహస్యం గురించి చర్చించి ఉండొచ్చని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే లక్నో జట్టులో చేరాలంటూ వైభవ్కు ఆయన భారీ ఆఫర్ కూడా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు. నిజానికి వైభవ్ సూర్యవంశీకి వచ్చే ఏడాది యాక్షన్ పూల్లో బరిలోకి దిగే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. వైభవ్ సూర్యవంశీని తక్కువ ధరకే సొంతం చేసుకున్న రాజస్తాన్ రాయల్స్ అతడిని విడుదల చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అవసరమైతే ఎక్కువ అమౌంట్ను కోట్ చేసి వైభవ్ను తమ జట్టుతోనే అట్టిపెట్టుకునే అవకాశముంది. ఐపీఎల్ మెగావేలానికి మరో రెండేళ్లు ఉండడంతో అప్పటివరకు వైభవ్ సూర్యవంశీని తమతోనే ఉంచుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ తనంతట తానుగా రాజస్తాన్ నుంచి బయటికి వచ్చి వేరే ఫ్రాంచైజీకి వెళ్లాలనుకుంటే మాత్రం అతన్ని దక్కించుకోవడానికి ఐపీఎల్లోని అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం లేకపోలేదు. పట్టుమని 16 ఏళ్లు కూడా లేని వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్తో ఇవాళ ఐపీఎల్లో అన్ని ఫ్రాంచైజీలకు హాట్ కేక్లా మారిపోయాడు. అతడు వస్తానంటే ఎంత భారీ ధరకైనా కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్లతో అదరగొడుతున్నాడు. 13 మ్యాచ్లాడిన వైభవ్ 579 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో 221 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లోనే 93) సునామీ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాన్ని బాటలు వేశాడు. ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ ఆ తర్వాత ఓటములతో ఢీలా పడింది. కానీ చివరి అంకంలో మళ్లీ ఫుంజుకున్న రాయల్స్ విజయాలు సాధించి 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. మే 24న ముంబై ఇండియన్స్తో జరగనున్న తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్ చేరుకోవాలని రాజస్తాన్ పట్టుదలతో ఉంది. ఇక టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు వైభవ్కు ఇంకా సమయముందున్న బీసీసీఐ ఇండియా-ఏ జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేసింది. మరి ఇండియా-ఏ తరఫున మ్యాచ్ల్లో వైభవ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.The world has seen your talent. The nation sees the future in you. That’s a lot of responsibility already on very young shoulders, very able ones at that. Preserve the innocence, keep honing your brilliance, and the world will be at your feet.Prayers, aashirwad, and love for… pic.twitter.com/LZS7pEe93s— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 20, 2026చదవండి: చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్ -
చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం లక్నో సూపర్జెయింట్స్పై విజయం సాధించడం ద్వారా రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. ఆదివారం (మే 24న) ముంబై ఇండియన్స్తో జరగనున్న మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా 16 పాయింట్లతో రాజస్తాన్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టనుంది. మ్యాచ్ విజయంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీదే కీలకపాత్ర. 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్తాన్ను గెలుపు తీరాలకు దగ్గర చేశాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ మిగతాపనిని పూర్తి చేశాడు. అయితే తొలి 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాతి 26 బంతుల్లో 82 పరుగులు చేయడం విశేషం. అయితే 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన అనంతరం వైభవ్ సూర్యవంశీ తన చేతులతో విచిత్రమైన ఫోజు ఇచ్చాడు. దానికి అర్థం ఏంటా అని ఎంత జుట్టు పీక్కున్నప్పటికీ లాభం లేకపోయింది. అయితే తాను ఇచ్చిన ఫోజుపై వైభవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత వెల్లడించాడు. ఆ ఫోజు వెనుక ఉన్న రహస్యాన్ని వైభవ్ పంచుకున్నాడు. మురళీ కార్తిక్తో వైభవ్ మాట్లాడుతూ..'ఆ ఫోజు ఎందుకు ఇచ్చానో నాకే తెలియదు. ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నా కానీ ఏం చేశానో అర్థం కాలేదు. లక్నోపై ఆడిన అద్భుత ఇన్నింగ్స్ను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. తన తల్లి పేరు ‘A’ అక్షరంతో మొదలవు తుందని అందుకే వేళ్లతో ఆ సింబల్ చూపించాను’ అని స్పష్టం చేశాడు. దీంతో వైభవ్ తన అమ్మపై ఉన్న ప్రేమను ఇలా మైదానంలో చాటుకోవడంతో అభిమానులు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘ఇక నేను న్యూస్ పేపర్లు పెద్దగా చదవను. దీనివల్ల నా గురించి పేపర్లలో ఏం రాస్తున్నారన్నది తెలియదు. అయితే నా కెరీర్కు ఇది ఆరంభం మాత్రమే. ఇంకా సుదీర్ఘమైన కెరీర్ మిగిలి ఉంది. నా దృష్టి కేవలం ఆటపైనే తప్ప ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోను.'అని చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ మొదట్లో స్లోగా ఆడడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు.'మా జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో నేను డగౌట్లో కూర్చున్నా. ఆ సమయంలో వికెట్ బాగుందనిపిచ్చింది. అయితే ఆదిలోనే తొందరపడితే మొదటికే చేటు అని భావించి కాస్త స్లో ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ వేగంగా ఆడడంతో నేను సైలెంట్ అయిపోయాను. కానీ జైస్వాల్ ఔటయ్యేటప్పటికీ పిచ్పై పూర్తి అవగాహన వచ్చేసింది. అందుకే ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ ఆడాను. నేను ఎక్కువసేపు క్రీజులో ఉండడమే లక్ష్యంగా పెట్టుకొని బ్యాటింగ్ కొనసాగించాను. అయితే సెంచరీ మిస్ అవ్వడంపై కాస్త నిరాశకు లోనైనప్పటికీ జట్టును గెలిపించడం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్కు మరింత చేరువయ్యాం. కానీ ఇప్పుడు మా దృష్టంతా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరగనున్న మ్యాచ్పైనే ఉంది. ఆ మ్యాచ్లోనూ గెలిచి ప్లేఆఫ్స్లో అడుగుపెట్టడమే మా ఏకైక లక్ష్యం' అని చెప్పుకొచ్చాడు.An entertainer on the field and even off it 😄That's Vaibhav Sooryavanshi for you 😌Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/XO3ZKPPJWb— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు! -
వైభవ్,జురేల్ ఊచకోత.. లక్నోపై రాజస్తాన్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు మరింత దగ్గరైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జూలు విదిల్చింది. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.అంతకముందు లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 109 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన పూరన్ (16) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. అయితే లక్నో చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో యష్ రాజ్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.ఈ విజయంతో రాజస్తాన్ 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన రాజస్తాన్ తమ చివరి మ్యాచ్లోనూ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్కు చేరుకోనుంది. రాజస్తాన్ తమ చివరి మ్యాచ్ను మే 24 (ఆదివారం) ముంబై ఇండియన్స్తో ఆడనుంది.Joy and jubilation in Jaipur 🩷🥳A statement chase from @rajasthanroyals sees them jump back into the 🔝4️⃣ 👏Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/7lJD2IYOUF— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు! -
వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం విజయంవంతంగా సాగుతోంది. మంగళవారం లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. జైస్వాల్ ఉన్నంతసేపు సైలెంట్గా ఉన్న వైభవ్ అతడు ఔటయ్యాకా ఆటను పూర్తిగా మార్చేశాడు.ఇన్నింగ్స్ 8వ ఓవర్ వరకు వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 9వ ఓవర్ వేసిన లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్కు ఆ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, రెండు వైడ్లు కలిపి మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. పనిలో పనిగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత వైభవ్ తన ఆటలో దూకుడును మరింత పెంచాడు. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జురెల్తో కలిసి వైభవ్ మరోసారి చెలరేగిపోయాడు. అగ్నికి వాయువు తోడైనట్లు ఈ ఇద్దరు కలిసి ఆ ఓవర్లో 29 పరుగులు పిండుకున్నారు. తొలుత ధ్రువ్ జురేల్ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను వరుసగా 4,6,6 బాదాడు. ఆ తర్వాత ఓవర్ ఐదు, ఆరు బంతులను వైభవ్ సూర్యవంశీ సిక్సర్లుగా మలిచాడు.దీంతో చూస్తుండగానే వైభవ్ 80 పరుగుల మార్క్ను దాటాడు. ఇక దిగ్వేష్ రాఠీ వేసిన 13వ ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టిన వైభవ్ 90ల్లోకి అడుగుపెట్టాడు. ఇక మరో సెంచరీ ఖాయమనుకున్న దశలో మోసిన్ ఖాన్ 14వ ఓవర్ తొలి బంతికి రనౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరపడినట్లయింది.అంతకముందు లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. 𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀Vaibhav Sooryavanshi lit up #RR's chase with a thunderous 93(38) 🎇Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qe6TfmGnTx— IndianPremierLeague (@IPL) May 19, 2026Just when we thought we'd seen it all 😅🎥 How has that evaded the stumps? 😮Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/qxBKA8TMhS— IndianPremierLeague (@IPL) May 19, 2026 -
'ఆ సమయంలో ద్రవిడ్ భాయ్ అండగా నిలబడ్డాడు'
టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత చాలా బాధాకరమైన దశను ఎదుర్కొన్నట్లు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న తనకు అప్పటి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోర్ కొండంత అండగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు. మంగళవారం ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ మూడో ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్లో పాల్గొన్న కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.‘నేను కెప్టెన్సీ వదిలేసిన తర్వాతే, రాహుల్ భాయ్, విక్రమ్ రాథోర్లతో మనసు విప్పి మాట్లాడగలిగాను. చాలా విషయాలు పంచుకున్నాను. 2023లో టెస్ట్ క్రికెట్లో నేను అద్భుతంగా రాణించాను. నేను కెప్టెన్సీ వదిలేసి ఒంటరిగా బాధపడుతున్న సమయంలో వీరిద్దరు నాకు అండగా నిలిచారు. నా కెరీర్ తిరిగి గాడిన పెట్టుకునేందుకు రాహుల్ భాయ్తో పాటు విక్రమ్ రాథోర్ ఎంతోగానో సహాయపడ్డారు. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. వారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచారు’ అని కోహ్లీ తెలిపాడు.రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్న సమయంలో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న కోహ్లీ ఒత్తిడిని భరించలేక 2022లో ఆ బాధ్యతల నుంచి తప్పుకు న్నాడు. కెప్టెన్గా ఉన్న సమయంలో కోహ్లీ ఆరు టెస్టుల్లో కేవలం ఒకే ఒక అర్ధశతకంతో, 26.5 సగటుతో 265 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 2021 నవంబర్లో టీమిండియా హెడ్ కోచ్గా వచ్చిన ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్తో కలిసి కోహ్లీని మళ్లీ బ్యాటింగ్లో ట్రక్ ఎక్కించడంలో విజయవంతమయ్యాడు. ద్రవిడ్ కోచ్గా వచ్చిన తర్వాత 2023 ఏడాదిలో అద్భుతంగా రాణించిన కోహ్లీ 8 టెస్టుల్లో 671 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాప్ సెంచరీలున్నాయి.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరఫున కోహ్లీ తన బ్యాటింగ్తో దుమ్మురేపుతున్నాడు. ఆడిన 13 మ్యాచ్ల్లో 542 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ప్లేఆఫ్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతేడాది తొలిసారి చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా టైటిల్పై కన్నేసింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో వన్డేలకు మాత్రమే పరిమితమైన కోహ్లీ ఐపీఎల్ ముగిసిన తర్వాత అప్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు.చదవండి: పరువు తీసుకుంటున్న పాక్, బంగ్లా క్రికెటర్లు! -
పరువు తీసుకుంటున్న పాక్, బంగ్లా క్రికెటర్లు!
బంగ్లాదేశ్, పాకిస్తాన్ల మధ్య సిల్హెట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లు తిట్ల పురాణంతో అంతర్జాతీయ మ్యాచ్ అన్న విషయం మరిచిపోయి పరువు తీసుకుంటున్నారు. షాన్ మసూద్, ముష్ఫికర్ రహీమ్ గొడవ మరవక ముందే తాజాగా నాలుగో రోజు ఆటలో మహ్మద్ రిజ్వాన్, లిటన్ దాస్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పాక్ ఇన్నింగ్స్ 72వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న రిజ్వాన్.. సైడ్ స్క్రీన్ సరిగా లేదని అంపైర్కు ఫిర్యాదు చేస్తూ బౌలర్ను ఆపేశాడు. ఇది చూసిన బంగ్లా వికెట్ కీపర్ లిటన్ దాస్ జోక్యం చేసుకుని రిజ్వాన్పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. 'ఏం చేస్తున్నావ్? అక్కడ ఏమి చూస్తున్నావ్? ఇక్కడ బ్యాటింగ్ చేయ్' అంటూ లిటన్ దాస్ వ్యాఖ్యానించాడు. లిటన్కు రిజ్వాన్ కూడా ధీటుగా బదులిచ్చాడు. 'ఇది నీ పని కాదు.. అంపైర్ పని' అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఇంతటితో ఆగని లిటన్ దాస్.. '50 పరుగులు అయ్యాక ఇప్పుడు యాక్టింగ్ మొదలవుతుంది” అంటూ రిజ్వాన్ను ఎగతాళి చేసినట్లు స్టంప్ మైక్ లో వినిపించింది. ఈ వ్యాఖ్యలతో రిజ్వాన్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. తిట్ల పురాణం అనంతరం ఇద్దరు కొట్టుకునేందుకు సిద్ధమైన సమయంలో అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో విజయం కోసం పోరాటం కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. విజయానికి మరో 121 పరుగులు అవసరం కాగా, చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజు టార్గెట్ను ఛేదించి పాక్ పరువు నిలుపుకుంటుందా లేక బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని అందుకుంటుందా అన్నది చూడాలి.Some one should stop Liton Das that's too much:- During first test, Liton das said to Rizwan that he's reputation already down in his country. - Today, Rizwan having trouble when someone was at screen and Liton said see down and bat quietly. pic.twitter.com/x4lzhSOoCz— usman (@cricbyusman) May 19, 2026చదవండి: నితీశ్రెడ్డిపై అగార్కర్ ప్రశంసలు! -
నితీశ్రెడ్డిపై అగార్కర్ ప్రశంసలు!
అఫ్గానిస్తాన్తో టెస్టు, వన్డే సిరీస్కు సంబంధించి బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఫ్గన్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు సంబంధించి తెలుగు క్రికెటర్ నితీశ్కుమార్ రెడ్డి తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ హెడ్ అగార్కర్ నితీశ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఉన్న ఆల్రౌండర్లలో నితీశ్కుమార్ ది బెస్ట్ అని, అతడి పురోగతి అద్భుతంగా ఉందని తెలిపాడు. రాబోయే రోజుల్లో టీమిండి యాలో నితీశ్కుమార్ కీలకం కానున్నాడనంటూ పేర్కొన్నాడు. ‘నితీశ్కుమార్ రెడ్డి ప్రస్తుతం టీమిండియాకు కీలకంగా మారిపోయాడు. ఈ మధ్య కాలంలో ఆటలో అతడు సాధించిన పురోగతి పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. రాబోయే కొద్ది నెలల్లో జరగబోయే సిరీస్లకు అతడి ఎంపిక చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్కు ముందు నితీశ్కు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నాం’ అని అగార్కర్ వెల్లడించాడు.ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి చెందిన నితీశ్కుమార్ రెడ్డి సంప్రదాయ టెస్టు క్రికెట్లో మంచి గుర్తింపు సాధించాడు. ఇప్పటివరకు 10 టెస్టులాడిన నితీశ్ రెడ్డి 396 పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఇక 4 వన్డేలు, 4 టీ20లు ఆడిన నితీశ్ రెడ్డి ఆల్రౌండర్ కోటాలో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీమిండియాకు కీలక ఆల్రౌండర్గా ఉన్న హార్దిక్ పాండ్యా స్థానానికి నితీశ్ రూపంలో ఎసరు పడినట్లే. ఇప్పటికీ పాండ్యా ప్రదర్శన అంతరంతమాత్రంగానే ఉంది. అగార్కర్ మాటలను బట్టి చూస్తే రాబోయే కాలంలో నితీశ్కుమార్ రెడ్డి ఆల్రౌండర్గా మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టీ20) కీలక ఆటగాడిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఆడుతున్న నితీశ్కుమార్ రెడ్డి ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఈ సీజన్లో 12 మ్యాచ్లాడిన నితీశ్రెడ్డి 235 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఏడు వికెట్లు తీశాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఎస్ఆర్హెచ్ తమ చివరి లీగ్ మ్యాచ్ను సొంతగడ్డపై మే 22న ఆర్సీబీతో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి లీగ్ టాపర్గా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది.AJIT AGARKAR ON NITISH KUMAR REDDY: "Nitish Kumar Reddy has been crucial, we are very happy with the progress he has made, in the next few months, we will give a lot of chances for him especially leading into ODI World Cup". pic.twitter.com/oXT5y0SFS2— Johns. (@CricCrazyJohns) May 19, 2026చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు! -
IPL 2026: లక్నోపై రాజస్తాన్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు మరింత దగ్గరైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జూలు విదిల్చింది. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ రాజస్తాన్ రాయల్స్ సునాయాస విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు.మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్లుహాన్ ప్రిటోరియస్ (7) రనౌట్ కావడంతో రాజస్తాన్ 196 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.93 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఔట్ అవడంతో రాజస్తాన్ 180 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ విజయానికి 30 బంతుల్లో 33 పరుగులు అవసరం. వైభవ్ హాఫ్ సెంచరీ.. రాజస్తాన్ 166/1రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ లక్నోతో మ్యాచ్లో చెలరేగిపోతున్నాడు. 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న జైస్వాల్ అంతకముందు ఆకాశ్సింగ్ వేసిన 9వ ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం రాజస్తాన్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. సూర్యవంశీ (82), ధ్రువ్ జురెల్ (31) పరుగులతో ఆడుతున్నారు.జైస్వాల్ (43) ఔట్..యశస్వి జైస్వాల్ (43) రూపంలో రాజస్తాన్ 75 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాజస్తాన్ 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. వైభవ్ (49), ధ్రువ్ జురెల్ (9) పరుగులతో ఆడుతున్నారు.దంచుతున్న జైస్వాల్.. రాజస్తాన్ 56/0221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఛేదనను ధాటిగా ఆరంభించింది. యశస్వి జైస్వాల్ దూకుడుతో 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. జైస్వాల్ (38), వైభవ్ (11) పరుగులతో ఆడుతున్నారు.రాజస్తాన్ టార్గెట్ 221 పరుగులుజైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 109 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన పూరన్ (16) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. అయితే లక్నో చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో యష్ రాజ్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.మరో వికెట్..లక్నో మరో వికెట్ కోల్పోయింది. యశ్రాజ్ బౌలింగ్లో ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి నికోలస్ పూరన్ (16) ఔటయ్యాడు. స్కోరు 13 ఓవర్లకు 156-2గా ఉంది.12 ఓవర్లలో స్కోరు 151-1లక్నో స్కోరు 12 ఓవర్లలో 151-1గా ఉంది. మార్ష్ హాఫ్ సెంచరీ బాదాడు. ప్రస్తుతం మార్ష్ 67, నికోలస్ పూరన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నోరాజస్తాన్తో మ్యాచ్లో ధాటిగా ఆడుతున్న లక్నో 109 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోస్ ఇంగ్లిస్ (29 బంతుల్లో 60) యష్ రాజ్ పుంజా బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 9 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. మార్ష్ (46), పూరన్ (7) పరుగులతో ఆడుతున్నారు.8 ఓవర్లలో రాజస్తాన్ 105/0రాజస్తాన్తో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ ధాటిగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇంగ్లిస్ (56), మార్ష్ (46) పరుగులతో ఆడుతున్నారు.6 ఓవర్లలో రాజస్తాన్ 83/0రాజస్తాన్తో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ ధాటిగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. ఇంగ్లిస్ (49), మార్ష్ (31) పరుగులతో ఆడుతున్నారు.3 ఓవర్లలో రాజస్తాన్ 38/0రాజస్తాన్తో మ్యాచ్లో మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (20), మిచెల్ మార్ష్ (15) పరుగులతో ఆడుతున్నారు.టాస్ గెలిచిన రాజస్తాన్టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ పరాగ్ దూరం కావడంతో జైస్వాల్ స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మ్యాచ్కు రాజస్తాన్, లక్నో జట్లు చెరో మూడు మార్పులతో బరిలోకి దిగాయి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఏడుసార్లు తలపడితే రాజస్తాన్ ఐదుసార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. చివరి మూడు మ్యాచ్లు చూసుకుంటే లక్నోదే పైచేయిగా ఉంది.తుది జట్లు:లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్.రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్ (కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.🚨 Toss 🚨@rajasthanroyals have won the toss and elected to bowl first against @LucknowIPL Yashasvi Jaiswal is leading #RR in the absence of injured Riyan Parag.#TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/kDsCjdWhIO— IndianPremierLeague (@IPL) May 19, 2026ఇప్పటికే ప్లేఆఫ్స్కు సంబంధించి మూడు బెర్తులు ఖరారు కాగా మిగిలి ఉన్న ఒకే బెర్తు కోసం ఐదు జట్లు (రాజస్తాన్, పంజాబ్, సీఎస్కే, ఢిల్లీ, కేకేఆర్) పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఐదింటిలో రాజస్తాన్ రాయల్స్కు ఎక్కువ అవకాశాలున్నాయి. తాము ఆడే రెండు మ్యాచ్ల్లోనూ రాజస్తాన్ గెలిస్తే మాత్రం ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరుకోవచ్చు.ఈ నేపథ్యంలో ఇవాళ లక్నోతో మ్యాచ్ రాజస్తాన్కు కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్లో రాజస్తాన్ ఓడితే మాత్రం ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. -
అఫ్గాన్తో సిరీస్కు భారత జట్టు ప్రకటన
ఐపీఎల్ 2026 సీజన్లో వేర్వేరు జట్లలో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు మళ్లీ ఒక్కటిగా కలిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో అప్గానిస్తాన్తో ఒక టెస్టు సహా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది.ఏకైక టెస్టు మ్యాచ్కు కెప్టెన్ గిల్కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్కు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.ఇక టీమిండియా సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు అఫ్గాన్తో సిరీస్కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్తో ఒకే టెస్టు మ్యాచ్ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్ నుంచి బిజీగా క్రికెట్ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక సీనియర్ ఆటగాడు కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా సీనియర్ భువనేశ్వర్ కుమార్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు మహ్మద్ షమీ విషయంలో సెలెక్షన్ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అగార్కర్ తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.అఫ్గాన్తో ఏకైక టెస్టుకు టీమిండియా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.మ్యాచ్ల షెడ్యూల్..జూన్ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్ పూర్, ఛండీగఢ్)తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే : జూన్ 17 (లక్నో)మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)🚨 News 🚨Presenting #TeamIndia's squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld— BCCI (@BCCI) May 19, 2026📸The Men's Selection Committee Meeting for #TeamIndia's squad announcement for the upcoming @IDFCFIRSTBank Test match and the three-match ODI series against Afghanistan is underway in Guwahati.#INDvAFG pic.twitter.com/VlA94h1nFC— BCCI (@BCCI) May 19, 2026చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది! -
ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!
ఎంఎస్ ధోని.. ఈ పేరు సీఎస్కే ఫ్రాంచైజీలో చిరస్థాయిగా మిగిలిపోనుంది. సీఎస్కేకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ధోని ఈ సీజన్లో సొంత ఇలాఖాలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే అభిమానులకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన ధోని (మధ్యలో సీఎస్కేపై నిషేధంతో రెండు సీజన్లు మినహాయింపు) సోమవారం సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడేశాడు. అదేంటి ధోని తుది జట్టులో లేడు కదా అన్న అనుమానం మీకు కలగొచ్చు. అయితే సీఎస్కేకు చెపాక్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ చివరిది. ఆ తర్వాత మే 21న అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.ఈ నేపథ్యంలో హోంగ్రౌండ్లో చివరి మ్యాచ్ కావడంతో ధోనికి సీఎస్కే జట్టు ఫేర్వెల్ ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్లో ధోనీ ఆడనప్పటికీ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జట్టుతో ధోని గ్రూప్ ఫొటో దిగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన జెర్సీ నెంబర్ 7తో స్టేడియంలోకి ధోని ఎంట్రీ ఇవ్వగానే మైదానం హోరెత్తిపోయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణచివేసుకున్న ధోని జట్టుతో గ్రూప్ ఫొటో దిగాడు. ఆ తర్వాత ఆటగాళ్లతో కాసేపు సంభాషించాడు. అనంతరం అభిమానుల వైపు ఒక లుక్ ఇచ్చిన ధోని చేతులూపుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు భారంగా అడుగులు వేయడం కనిపించింది. ధోని పెవిలియన్ వెళుతున్న క్రమంలో సీఎస్కే ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఈ సమయంలో చెపాక్ స్టేడియంలో కాసేపు నిశబ్దం అలుముకుంది. అభిమాన ఆటగాడైన ధోని సీఎస్కే సొంత స్టేడియంలో తన చివరి మ్యాచ్ ఆడకుండానే ఇలా సైలెంట్గా వీడ్కోలు పలకడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓవరాల్గా ధోని ఐపీఎ ల్లో 278 మ్యాచ్లాడి 5,439 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్థసెంచరీలు ఉన్నాయి.Thank You for all memories- Thala MS dhoni 🥲- भाऊक कर देने वाला पल है लेकिन एक ना एक दिन सबको जाना होता है !- बहुत सी अच्छी यादे , क्रिकेट में भारत का नाम आपके नाम से याद रखा जाएगा - Number 7 जो सिर्फ आपके नाम से जाना जाएगा !Updates: - धोनी को देखके ऐसा लग रहा है शायद वो… pic.twitter.com/aLbnQ8jHw4— Mahi (@M17vibes) May 18, 2026FINALLY, END OF A LEGENDARY ERA 🥺🫶❤️MS Dhoni is set to receive a farewell at M. A. Chidambaram Stadium as fans prepare to witness an emotional goodbye to one of cricket’s greatest icons. The atmosphere at Chepauk is expected to be filled with tears, chants, and unforgettable… pic.twitter.com/NS4xEsOq1F— Muffatball vikrant (@Vikrant_1589) May 18, 2026చదవండి: టెన్నిస్ దిగ్గజం పేస్ ఇంట్లో విషాదం -
ధోనీ రిటైర్మెంట్పై రుతురాజ్ క్లారిటీ!
సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పష్టతనిచ్చాడు. ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ సోమవారం చెన్నైలోని సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో ధోనీ ఆడుతాడని అభిమానులు ఆశించారు. టాస్ సమయంలో ధోనీ ఆడుతున్నాడా లేదా అని రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు రుతురాజ్ సమాధానమిచ్చాడు. ఎంఎస్ ధోనీ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడడం లేదని తెలిపాడు. దీంతో అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. అయితే ధోనీ మ్యాచ్ ఆడకపోయినప్పటికీ జట్టుతో పాటు చెపాక్ స్టేడియానికి రావడం అభిమానులకు ఊరట కలిగించే అంశం. ఎటూ ధోనీ మ్యాచ్ ఆడడం లేదు కాబట్టి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం సైలెంట్గా స్టేడియంలోకి వచ్చి అభివాదం చేస్తూ సీఎస్కేకు గుడ్బై చెబుతాడేమోనని అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఇలా సైలెంట్గా రిటైర్ అవ్వడాన్ని తాము భరించలేమని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ధోనీ ఇవాళ తన రిటైర్మెంట్పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం మే 21 వరకు ఆగాల్సిందే. ఇక సొంత గ్రౌండ్లో చివరి మ్యాచ్ ఆడుతున్న సీఎస్కే మే 21న గుజరాత్ టైటాన్స్తో ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.దీంతో అహ్మదాబాద్లోనే ధోనీకి సీఎస్కే ఘనంగా సెండాఫ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఎస్కే ప్లేఆఫ్స్ చేరితే అప్పటికప్పుడు ప్రణాళికలను మార్చేందుకు సీఎస్కే యాజమాన్యం సిద్ధమవుతోంది.Ravi Shastri asked: "MS Dhoni, where is he? Is he playing?"Ruturaj Gaikwad replied and send the Chepauk Crowd into frenzy#CSKvsSRHpic.twitter.com/rM2zXo0koz— Farrago Abdullah Parody (@abdullah_0mar) May 18, 2026🚨 Toss update from Chennai 🚨@ChennaiIPL won the toss and elected to bat first against @SunrisersUpdates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH pic.twitter.com/u4gjxRo6HK— IndianPremierLeague (@IPL) May 18, 2026 -
IPL 2026: సీఎస్కేపై సన్రైజర్స్ ఘన విజయం
ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ అధికారికంగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. సీఎస్కే విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 70) టాప్ స్కోరర్గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(26 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు నితీశ్ కుమార్ రెడ్డి.. ముఖేష్ చౌదరి బౌలింగ్లో ఔటయ్యాడు. సన్రైజర్స్ విజయానికి 17 బంతుల్లో 27 పరుగులు కావాలి.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్క్లాసెన్ రూపంలో సన్రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన క్లాసెన్.. నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న కిషన్, క్లాసెన్హెన్రిచ్ క్లాసెన్(43), ఇషాన్ కిషన్(48) దూకుడుగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్: 126/2అభిషేక్ శర్మ (26) ఔట్.. రెండో వికెట్ డౌన్సీఎస్కేతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అకిల్ హొసెన్ బౌలింగ్లో స్పెన్సర్ జాన్సన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.7 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 53/1ఏడు ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అబిషేక్ శర్మ (25), ఇషాన్ కిషన్ (22) పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ (6) రూపంలో 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ చౌదరీ బౌలింగ్లో హెడ్ కాట్ అండ్ బౌల్డ్గా వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ టార్గెట్ 181 పరుగులుసొంతగడ్డపై జరుగుతున్న ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (44), కార్తిక్ శర్మ (32), శివమ్ దూబే (26) తలా కొన్ని పరుగులు చేయడంతో సీఎస్కే గౌరవప్రదమైన స్కోరును అందుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీయగా, సాకిబ్ హుసేన్ 2, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ చెరొక వికెట్ తీశారు. టాపార్డర్ విఫలం కావడం సీఎస్కే కొంపముంచింది.16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (35), శివమ్ దూబే (16) పరుగులతో ఆడుతున్నారు.4 వికెట్లు డౌన్చెన్నై సూపర్ కింగ్స్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. కార్తీక్ శర్మ 32, రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు తీసి ఔటయ్యారు. క్రీజులో బ్రెవిస్ 11, శివం దూబె 7 పరుగులతో ఉన్నారు. స్కోరు 13 ఓవర్లకు 105-4గా ఉంది. 9 ఓవర్లలో సీఎస్కే 89/29 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. కార్తిక్ శర్మ (32), రుతురాజ్ గైక్వాడ్ (14) క్రీజులో ఉన్నారు.ఉర్విల్ క్లీన్బౌల్డ్.. రెండో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో సీఎస్కే 48 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించిన ఉర్విల్ పటేల్ను సాకిబ్ హుస్సేన్ క్లీన్బౌల్డ్గా పెవిలియన్ చేర్చాడు.తొలి వికెట్ కోల్పోయిన చెన్నైసంజూ శాంసన్ (27) రూపంలో చెన్నై సూపర్కింగ్స్ 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్లో కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్లో సీఎస్కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గుర్జన్పీత్ సింగ్ స్థానంలో అకిల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ధోనీ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో మ్యాచ్కు దూరంగా ఉన్నట్లు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ తెలిపాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగుతోంది.తుది జట్లు:సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేచెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్ -
ధోని రిటైర్మెంట్.. ఐదేళ్ల క్రితం ప్రకటన వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే)కు రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆడిన 12 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్తో పోటీ పడుతున్న సీఎస్కే తన చివరి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టే అవకాశముంది. మరోవైపు సీఎస్కేకు ఐదు టైటిల్స్ అందించిన ఎంఎస్ ధోని మాత్రం ఈ సీజన్లో పిక్క కండరాల గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎస్కే తమ సొంత హోంగ్రౌండ్లో ఎస్ఆర్హెచ్తో సీజన్లో చివరి మ్యాచ్ ఆడనుంది. ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న వేళ సీఎస్కే అభిమానులు అతడిని చివరిసారిగా మైదానంలో చూడాలని ఆశపడుతున్నారు. అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? లేదా అన్నది పక్కనబెడితే ఐదేళ్ల క్రితం ధోని తన రిటైర్మెంట్పై చేసిన ప్రకటన తాజాగా వైరల్గా మారింది. 2021లో చాంపియన్గా నిలిచిన సీఎస్కే టైటిల్ వేడుక సందర్భంగా అప్పటి కెప్టెన్ హోదాలో ధోనీ మాట్లాడాడు. తన చివరి టీ20 మ్యాచ్ను చెన్నైలో ఆడాలని ఆశిస్తున్నట్లు ధోనీ తెలిపాడు. 'నేను నా క్రికెట్ను ఎప్పుడూ ప్రణాళికబద్దంగానే ఆడాను. నా కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ను సొంతఊరు రాంచీలో ఆడడం ఎన్నటికీ మరిచిపోను. ఇక నాకు రెండో హోంగ్రౌండ్ అయిన చెన్నై స్టేడియంలో సీఎస్కే తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడుతానని ఆశిస్తున్నా. అది వచ్చే ఏడాదో లేక ఐదేళ్లలోనా అనేది కచ్చితంగా తెలియదు' అని ధోనీ ఐదేళ్ల క్రితం తన రిటైర్మెంట్ గురించి ముందే సూచించాడు. చెన్నై వేదికగా తలపడనున్న సీఎస్కే, ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ధోని ఆడితే గనుక అతని ఐదేళ్ల ప్రకటన ఇవాళ నిజమయ్యే అవకాశముంది. సీఎస్కేతో తన సుదీర్ఘ ప్రయాణం కూడా ముగియనుంది. మరి ధోనీ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది మరో రెండు గంటల్లో తేలిపోనుంది.ఇదే మంచి తరుణం: అశ్విన్ధోనీకి అనుచర గణంలో ఒకడిగా గుర్తింపు పొందిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పిక్క కండరాల గాయం నుంచి కోలుకున్న ధోనీ సీఎస్కే తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. 'సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ధోనీ ఆడేందుకు ఇదే మంచి అవకాశమని నాకు అనిపిస్తోంది. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి. నేను విన్నంత వరకు, అతను గత రెండు మూడు మ్యాచ్లుగా మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. 44 ఏళ్ల ధోని సీఎస్కే జట్టుకు దూరంగా ఉండడం వెనుక ఒక ప్రణాళిక దాగుంది. ఈ సీజన్లో ధోనీ లేకుండానే సీఎస్కే తమ ప్రయాణాన్ని కొనసాగించింది. ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో స్థిరంగా కొనసాగుతున్న సీఎస్కే తుది జట్టులో మార్పులు చేయడం కష్టతరమే. అయితే ధోనికి ఇది చివరి మ్యాచ్ అని ప్రచారం జరుగుతుండడంతో ఎస్ఆర్హెచ్తో పోరులో ధోనీ ఫ్యాన్స్ అతడిని చివరిసారి చూసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.చదవండి: బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్కు క్లీన్స్వీప్ గండం! -
బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్కు క్లీన్స్వీప్ గండం!
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ ఆ జట్టు తరఫున టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీ మార్క్ అందుకోవడం ద్వారా బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితా లో ముష్ఫికర్ రహీమ్ చోటు సంపాదించాడు. 39 ఏళ్ల ముష్ఫికర్ రహీమ్కు టెస్టుల్లో ఇది 14వ సెంచరీ.తద్వారా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బంగ్లా క్రికెటర్గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ తరపు 100కు పైగా టెస్టు మ్యాచ్లు ఆడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 14 సెంచరీలు, 29 అర్థసెంచరీలు ఉండడం విశేషం. జింబాబ్వేతో టెస్టులో 219 పరుగులు కెరీర్ బెస్ట్ స్కోరు సాధించిన ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా, అలాగే బంగ్లా తరఫున మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో ముష్ఫికర్ రహీమ్ తర్వాత మోమినుల్ హక్ (13 సెంచరీలు), ప్రస్తుత బీసీబీ తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ (10 సెంచరీలు), నజ్ముల్ హొసేన్ షాంటో (9 సెంచరీలు), లిటన్ దాస్ (6 సెంచరీలు) ఉన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. పాకిస్తాన్ ముందు బంగ్లాదేశ్ 437 పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించింది. అంతకముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (137) సెంచరీ చేయగా.. ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ (52), లిటన్ దాస్ (69) అర్థసెంచరీలు సాధించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 4 వికెట్లు తీయగా, సాజిద్ ఖాన్ 3, హసన్ అలీ 2 వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 232 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ కలుపుకొని ప్రత్యర్థి ముంగిట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజుల ఆట ముగిసేసరికి పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు. చేతిలో పది వికెట్లు ఉన్నప్పటికీ రెండు రోజులు ఆట మిగిలి ఉండడంతో అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టును కోల్పో యిన పాక్ ఇప్పుడు రెండో టెస్టులోనూ ఓడిపోతే క్లీన్స్వీప్ అయినట్లే. Built on class and consistency 💪Mushfiqur Rahim among the finest in Tests. Celebrates in style pic.twitter.com/DN6067jYjc— Bangladesh Cricket (@BCBtigers) May 18, 2026చదవండి: IPL: లిటన్ దాస్ సంచలన ఆరోపణలు -
సాయి సుదర్శన్ అరుదైన ఫీట్!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ సాయి సుదర్శన్ది ప్రత్యేకమైన స్థానం. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఒకే జట్టుకు ఆడుతూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్న అరుదైన క్రికెటర్లలో సాయి సుదర్శన్ కూడా ఒకడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ తన బ్యాటింగ్తో అలరిస్తున్న సాయి సుదర్శన్ మంగళవారం సన్రైజర్స్తో మ్యాచ్లోనూ 61 పరుగులతో మెరిశాడు. తద్వారా ఐపీఎల్లో ఒక అరుదైన ఫీట్ను సాధించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో అర్థశతకం సాధించడం ద్వారా ఐపీఎల్లో తాను ఎదుర్కొన్న అన్ని జట్లపై కనీసం ఒక ఫిఫ్టీ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా, ఓవరాల్గా ఐదో ప్లేయర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. గతంలో గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్తో పాటు ఎస్ఆర్హెచ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ ఫీట్ను సాధించారు. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ సీఎస్కేపై నాలుగు అర్థశతకాలు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్తాన్లపై మూడు ఫిఫ్టీలు, కేకేఆర్, ముంబై, ఆర్సీబీలపై రెండు హాఫ్ సెంచరీలు, లక్నో, ఎస్ఆర్హెచ్లపై ఒక్కో అర్థశతకం సాధించాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ ఫీట్ను అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్ 500 పరుగుల మార్క్ను దాటాడు. తద్వారా వరుసగా మూడో సీజన్లోనూ ఐదొందల పరుగుల మార్క్ను దాటిగా ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం సాయి సుదర్శన్ 12 మ్యాచ్ల్లో 501 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం ఎస్ఆర్హెచ్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ (19) టాప్ స్కోరర్గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ చెరో 3 వికెట్లతో చెలరేగగా.. ప్రిసిధ్ క్రిష్ణ 2, సిరాస్ ఒక వికెట్ పడగొట్టాడు. వరుసగా ఐదో విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకోగా, ఎస్ఆర్హెచ్ మూడో స్థానానికి పడిపోయింది.చదవండి: ‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’ -
‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’
ఐపీఎల్ 2026 సీజన్ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో మాత్రం పంజాబ్ తడబడుతూ వస్తోంది. వరుసగా నాలుగు పరాజయాలతో పంజాబ్ పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. బౌలింగ్లో విఫలమవ్వడంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ ఆ జట్టు ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు క్యాచ్ డ్రాప్లు ఎక్కువగా చేయడం కూడా ఆ జట్టు కొంపముంచుతోంది. మైదానంలో పరిస్థితి ఇలా ఉంటే బయట కూడా పంజాబ్ జట్టు చిక్కుల్లో పడింది. ఇటీవలే విమానంలో పంజాబ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వేప్ (ఈ-సిగరేట్) పీల్చడం వివాదంగా మారింది. వేప్ను అందించిన అర్ష్దీప్తో పాటు చాహల్, మరికొంత మంది పంజాబ్ ఆటగాళ్లపై వేటు పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పంజాబ్ ఓపెనర్ ప్రబ్సిమ్రన్ బరువు పెరిగాడన్న వార్తలతో పాటు జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా స్పందించింది. ఎక్స్ వేదికగా ప్రీతి జింటా మాట్లాడుతూ..'మాటలు జాగ్రత్త. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగొద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ప్రతిష్టకు నష్టం కలుగుతోంది. విమర్శలకు, తప్పుడు కథనాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటలో తప్పులకు సంబంధించి ఎలాంటి చర్చనైనా స్వాగతిస్తాం. కానీ వ్యక్తులకు, జట్టుకు, ఫ్రాంచైజీ బ్రాండ్కు నష్టం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే ఎంతమాత్రం సహించము. వీటిని తేలికగా తీసుకోలేము. సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వ్యక్తులు, మీడియా నిపుణులు, సోషల్ మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా' అని పేర్కొంది. There’s a difference between criticism & calculated misinformation. Healthy debate around the game is welcome, but the deliberate spread of fake narratives to damage individuals, the team, or the brand should not & will not be taken lightly. I urge everyone including verified… https://t.co/yeqbsTwLBd— Preity G Zinta (@realpreityzinta) May 12, 2026ఇదే విషయమై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదికగా స్పందించిది. 'విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు క్రీడలో భాగమే. కానీ టీఆర్పీ, వ్యూస్ కోసం నకిలీ వార్తలు, కథనాలు రాయడం సరికాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు వాస్తవాలు ఏంటన్నది గ్రహించాలని మేము కోరుతున్నాము' అని తెలిపింది.Criticism, banter, and opinions are part of sport. Fake stories and made-up narratives for cheap engagement are not. We urge everyone to verify facts before spreading misinformation for attention or traction.— Punjab Kings (@PunjabKingsIPL) May 12, 2026చదవండి: హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? -
హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? కావాలని తప్పించారా?
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం అయిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణ ఆటతీరుతో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ముంబై ఆడిన గత రెండు మ్యాచ్లకు వెన్నునొప్పి గాయంతో పాండ్యా దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా మే 14న (గురువారం) పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు పాండ్యా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలని అతడిని జట్టు నుంచి తప్పించారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాండ్యా తన ప్రాక్టీస్లో బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ కసితీరా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పాండ్యాకు ఏమాత్రం అసౌకర్యంగా కనిపించలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మహేల జయవర్దనే మాత్రం పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు పాండ్యా త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీం ప్రయత్నాలు చేస్తుందని తెలిపాడు. పాండ్యా పూర్తిగా కోలుకునేంతవరకు రిస్క్ చేయకూడదని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. పాండ్యా తాను ఫిట్గా ఉన్నట్లు ఒకవైపు వీడియో రిలీజ్ చేయడం, అదే సమయంలో జయవర్దనే పాండ్యా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం చూస్తుంటే పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలనే జట్టు నుంచి తప్పించారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పాండ్యా కూడా తన అగ్రెసివ్ ప్రవర్తనతో జట్టులో పూర్తిగా నెగెటివిటీని మూటగట్టుకోవడం కూడా అతడికి ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు.ఇటీవలే పాండ్యా.. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీని అన్ఫాలో చేయడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఇదే విషయమై ముంబై ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి 'ఈ సీజన్లో పాండ్యా ముంబై తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడని, వచ్చే సీజన్లో వేరే జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడంటూ' కామెంట్లు చేస్తున్నారు. 'పాండ్యా జట్టులోకి రావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. అతడి రాక వల్ల ఉపయోగం లేదు' అని మరికొందరు పేర్కొన్నారు. ఈ సీజన్లో 11 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ముంబై తన తర్వాతి మ్యాచ్లు పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది.Hardik pandya practicing in the nets. He just put a stop on alll the rumours 🌚 pic.twitter.com/AjG8Fg9gW9— Gagan Choudhary (@trigguuuu) May 12, 2026చదవండి: ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ! -
ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 82 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. గుజరాత్ విధించిన 169 పరుగులను ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 86 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవి ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.👉గుజరాత్తో మ్యాచ్లో 89 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్కు ఐపీఎల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో 96 పరుగులు, 2015లో ముంబైతో మ్యాచ్లో 113 పరుగులు, 2024లో కేకేఆర్తో మ్యాచ్లో 113 పరుగులు, 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 114 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా (గుజరాత్ చేతిలో 82 పరుగుల తేడాతో) చూసుకుంటే ఎస్ఆర్హెచ్కు ఇదే అతిపెద్ద ఓటమి. 2025లో కేకేఆర్ చేతిలో 80 పరుగులు, 2024లో సీఎస్కే చేతిలో 78 పరుగులు, 2013లో సీఎస్కే చేతిలో 77 పరుగులు, 2014లో పంజాబ్ చేతిలో 72 పరుగులు, 2023లో రాజస్తాన్ చేతిలో 72 పరుగులతో భారీ ఓటములు చవిచూసింది.👉అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ చేసిన 86 పరుగులే అత్యల్ప స్కోరు. గతంలో గుజరాత్ టైటాన్స్ (2024లో ఢిల్లీతో మ్యాచ్లో 89 పరుగులు) ఇప్పటిదాకా అత్యల్పం. అంతకముందు ఇదే సీజన్లో ముంబైతో మ్యాచ్లో గుజరాత్ వంద పరుగులకు ఆలౌటైంది. 2014లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రాజస్తాన్ 102 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా గుజరాత్ టైటాన్స్కు (82 పరుగులు) ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ సీజన్లో రాజస్తాన్పై 77 పరుగులతో, 2023లో ముంబైపై 62 పరుగులతో, 2022లో లక్నోపై 62 పరుగులతో, 2025లో రాజస్తాన్పై 58 పరుగులతో భారీ విజయాలు అందుకుంది.👉ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచి ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఎస్ఆర్హెచ్ మిగిలిన రెండు మ్యాచ్లను సీఎస్కే, ఆర్సీబీతో ఆడనుంది. ఇందులో ఆర్సీబీతో మ్యాచ్ను సొంత గ్రౌండ్లో ఆడనుండడం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చే అంశం. ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఎస్ఆర్హెచ్ నెగ్గితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్కు చేరనుంది.చదవండి: ‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక! -
‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 200 ప్లస్ స్కోర్లు కూడా ఈజీగా ఛేదిస్తున్న ఈ సీజన్లో 160 ప్లస్ స్కోరును కాపాడుకోవడం గుజరాత్కు మాత్రమే చెల్లింది. మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడాడు. ‘అహ్మదాబాద్ వికెట్ పై 170 పరుగులు చేయడం కూడా కష్టమే. మేం 160-170 పరుగులు చేస్తే.. మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్ను ఛేదించడం అంత సులువు కాదని ముందే అంచనా వేశాం. ఈ మ్యాచ్లో మా వ్యూహం కూడా అదే. సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాపార్డర్ను పడగొట్టడానికి మేం వేసిన ప్రణాళికలు పక్కాగా పనిచేశాయి.సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఈ స్లో పిచ్పై అద్భుతంగా రాణించారు. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. వారిద్దరూ నిలబడి జట్టుకు ఆ స్కోర్ను అందించారు. మేము ఒక బ్రాండ్ క్రికెట్కు మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. మేము ఒక నిర్దిష్ట శైలి లేదా బ్రాండ్ క్రికెట్ ఆడే జట్టు కాదని మీకు తెలుసు. వరుస విజయాలు ఊరికే రాలేదు. రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ కొట్టబోతున్నాం. పిచ్ను చూసి, పరిస్థితులను అంచనా వేసి ఆడి గెలిచే జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే కచ్చితంగా ఆ స్కోర్ కోసం ప్రయత్నిస్తాం. ముఖ్యంగా జాసన్ హోల్డర్.. మా టీమ్ గెలుపు సీక్రెట్. అతడు వేస్తున్న లెంగ్త్లు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్లో హోల్డర్ వరుసగా నాలుగు ఓవర్లు వేస్తూ రాణిస్తూ మాకు గెలుపు మంత్రంగా మారిపోయాడు.’ అని గిల్ వెల్లడించాడు.చదవండి: ‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’ -
‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’
జర్మన్ మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ పెట్టిన పోస్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ లైక్ కనిపించకపోవడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో లిజ్ లాజ్ మరోసారి బాంబు పేల్చింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలంటూ కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారని, అందుకు భారీగా డబ్బులు కూడా ఆఫర్ చేశారని లిజ్ లాజ్ వెల్లడించింది. తనను పావులా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాలని భావించారని, కానీ డబ్బు కోసం లేదా పాపులర్ అవ్వడానికి కోహ్లీ పేరును వాడుకొని అతడి ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఆసక్తి తనకు లేదని తెలిపింది. అందుకే వాళ్లు (జర్నలిస్టులు) ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలో లిజ్ లాజ్ మాట్లాడుతూ.. ‘మొదట విరాట్ కోహ్లీ నా ఫొటో లైక్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రపంచస్థాయి క్రికెటర్ నా పోస్టును గమనించడం గర్వంగా అనిపించింది. కానీ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతిగా చూపించడం బాధ కలిగించింది. ఒక సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీని పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతను ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, అతడిని ఫుట్బాల్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డోలతో పోల్చింది. ‘కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ఒకరు. ఆయనపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఒక చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం బాధాకరం’ అని ఆమె పేర్కొంది. ఈ వివాదం తర్వాత భారత్లో లిజ్ లాజ్కు విపరీతమైన గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు భారీగా పెరిగారు. పలు బ్రాండ్ ప్రమోషన్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, తాను సంచలన ప్రచారం కోసం ఎవరి ప్రతిష్ఠతో ఆడుకోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తాను ఐపీఎల్కు పెద్ద అభిమానినని, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును క్రమం తప్పకుండా ఫాలో అవుతానని స్పష్టం చేసింది.ఎవరీ లిజ్లాజ్?లిజ్ లాజ్ దక్షిణాఫ్రికాలో జన్మించింది. ఆమె తండ్రిది సౌతాఫ్రికా కాగా.. తల్లిది జర్మనీ. దీంతో లిజ్ లాజ్ జర్మన్, ఆఫ్రికా, డచ్, ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. సైకాలజీ విభాగంలో ఎంఎస్సీ పట్టా పొందింది. లైఫ్సేవింగ్ స్విమ్మర్ కూడా లిజ్ లాజ్ గుర్తింపు పొందింది. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్, పాటల రచన లిజ్ లాజ్ హాబీలు.చదవండి: చీర్గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు! -
చీర్గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు!
ఐపీఎల్ 2026 సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికీ ప్లేఆఫ్స్కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ముంబై, లక్నో ఎలిమినేట్ కాగా ప్లేఆఫ్స్ స్థానం కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. అయితే అందులో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్, గుజరాత్కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టీ20 మ్యాచ్లు కావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టం. అందుకే సీజన్లో అన్ని లీగ్ మ్యాచ్లు పూర్త య్యాకే ప్లేఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ రానుంది. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించడానికి వచ్చే అభిమానులకు, ఆటగాళ్లకు చీర్గర్ల్స్ తమ నృత్యాలతో అలరించడం చూస్తూనే ఉంటాం. అయితే ఆదివారం రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. ఈ సమయంలో ముంబై ఇండియన్స్కు చెందిన చీర్ గర్ల్స్ ఫోడియంపై చిందులు వేస్తున్నారు. అందులో ఒక చీర్గర్ల్ అక్కడే ఉన్న పోలీసులను చూస్తూ నృత్యం చేసింది. దీంతో అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు చీర్ గర్ల్స్ నృత్యాలను కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్లో కేకేఆర్ను ఎదుర్కోనుండగా, ముంబై ఇండియన్స్ పంజాబ్తో తలపడనుంది.Raipur police enjoying watching the Mumbai Indians cheerleaders during the MI vs RCB match.😅 pic.twitter.com/xichgo4HEw— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 11, 2026చదవండి: అక్షర్ పటేల్కు భారీ జరిమానా! -
అక్షర్ పటేల్కు భారీ జరిమానా!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అక్షర్ పటేల్పై బీసీసీఐ భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలమైనందుకు అక్షర్ పటేల్కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.పంజాబ్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ను ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది తొలి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్కు మాత్రమే జరిమానా విధించారు. ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే కెప్టెన్తో పాటు జట్టు సభ్యులపై కూడా జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 56 పరుగులతో రాణించగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 59 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్కార్ట్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీశారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ 56 పరుగులతో అర్ధసెంచరీ చేసి జట్టును ఆదుకోగా, డేవిడ్ మిల్లర్ 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ మెరుపు బ్యాటింగ్తో మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పేశారు. కేవలం 19 ఓవర్లలోనే 216 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘బౌలర్లకు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’ -
‘బౌలర్లకు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్లతో పాటు బౌలర్లకు సమాన అవకాశాలు రావాలంటే బౌలర్లు నాలుగు ఓవర్లకు పరిమితం కాకుండా ఐదు ఓవర్లు వేసేలా నిబంధనలను సవరించాలని బీసీసీఐకి కీలక సూచన చేశారు. దీనివల్ల జట్టులోని బెస్ట్ బౌలర్ సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు అవకాశమంటుందని తెలిపారు.మిడ్-డే కాలమ్లో గావస్కర్ స్పందిస్తూ..'ఈ సీజన్ సగానికి పైగా పూర్తయింది. ఇప్పటికే 46 సార్లు 200-పైగా స్కోర్లు నమోదయ్యాయి, ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ 8 సార్లు ఈ ఘనతను సాధించింది. ఆశ్చర్యకరంగా 26 సార్లు కనీసం ఒక జట్టు 200 పరుగుల మార్కును దాటగా, 20 సందర్భాలలో ఇరు జట్లు 200 పరుగుల మార్కును దాటాయి. జట్టు అవసరమని భావిస్తే, ఒక మ్యాచ్లో బౌలర్ను ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించే నిబంధనను అమలు చేస్తే బాగుంటుంది. టీ20ల్లో బౌలర్లకు కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసేందుకు అవకాశమున్నప్పటికీ, ఒక అదనపు ఓవర్ను వేయించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. అయితే ఒక బ్యాటర్ మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు అవకాశమున్నప్పుడు, బౌలర్కు మాత్రం ఒక ఓవర్ ఎక్కువగా వేసేందుకు ఎందుకు అనుమతించకూడదన్నది నా ప్రశ్న.ఈ మేరకు నిబంధనలు సవరించి బౌలర్లకు న్యాయం చేయాలి. దీనివల్ల ఆయా జట్లు కేవలం పరుగులు కాపాడుకోవడానికే కాకుండా, వికెట్లు తీసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ఒక జట్టులో ముగ్గురు బెస్ట్ బౌలర్లు ఉన్నప్పుడు వారితో తలా ఐదు ఓవర్లు బౌలింగ్ చేయించేందుకు మార్గం సుగమం అవుతోంది' అంటూ తన కాలమ్లో రాసుకొచ్చారు. ఈ నిబంధనను ఐపీఎల్లో ప్రయత్నించడానికి ముందు దేశీయ స్థాయిలో అమలు చేస్తే బాగుంటుందని గావస్కర్ అభిప్రాయపడ్డారు. టీ20 ఫార్మాట్ అయిన ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయత్నిచడం ద్వారా ఫలితాలు చూడవచ్చన్నారు. వచ్చే సీజన్ లేదా ఐపీఎల్ 2028 సీజన్ నుంచి ఈ నిబంధనను ఉపయోగిస్తే చూడాలని ఉందని గావస్కర్ తెలిపారు.చదవండి: పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు! -
'చపాతీల కంటే బౌలర్లను ఉతకడం మేలు'
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. జట్టు వరుస ఓటములు చవిచూస్తున్నప్పటికీ వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్లో దనాధన్ ఆటను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి పునాది వేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ 11 మ్యాచ్ల్లో 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచిన రాజస్తాన్ క్రమంగా ఓటములు ఎదుర్కొంది. 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 5 ఓటములతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 17న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. మ్యాచ్కు వారం రోజులు గ్యాప్ రావడంతో రాజస్తాన్ ఆటగాళ్లు బ్రేక్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ యాజమాన్యం తాజాగా ఆటగాళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలను తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. దీనిలో భాగంగా వైభవ్ సూర్యవంశీ చపాతీలు కాలుస్తున్న వీడియోనూ పంచుకుంది. ఆ వీడియోలో వైభవ్ మాస్టర్ చెఫ్ అవతారంలో చపాతీలు కాలుస్తూ కనిపించాడు.'నేను చేసే చపాతీలతో పోలిస్తే మా అమ్మ చేసే చపాతీలు భిన్నంగా ఉంటాయి. చపాతీలు కాల్చడం కంటే బౌలర్లను ఉతకడం మేలు' అని నవ్వుతూ పేర్కొన్నాడు. వైభవ్ చపాతీలు కాలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది.𝘔𝘶𝘮𝘮𝘺 𝘬𝘦 𝘳𝘰𝘵𝘪 𝘴𝘦 𝘻𝘺𝘢𝘥𝘢 𝘨𝘰𝘭 𝘳𝘰𝘵𝘪 𝘩𝘢𝘪 😂💗 pic.twitter.com/qOqthFPWXU— Rajasthan Royals (@rajasthanroyals) May 12, 2026చదవండి: ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత! -
పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు!
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే టెస్టుల్లో 400 వికెట్ల మార్క్తో షాహిన్ అఫ్రిది కొత్త రికార్డు నెలకొల్పగా.. తాజాగా పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీ టెస్టులో వంద వికెట్ల మార్క్ను సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 69.1 ఓవర్లో మెహదీ హసన్ మిరాజ్ను పెవిలియన్ చేర్చడం ద్వారా నోమన్ అలీ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్లో వంద వికెట్ల మార్క్ సాధించిన పెద్ద వయస్కుడిగా నోమన్ అలీ నిలిచాడు. 22 టెస్టుల్లో వంద వికెట్ల మార్క్ అందుకున్న నోమన్ అలీ ప్రస్తుత వయస్సు 39 ఏళ్ల 213 రోజులు. నోమన్ అలీ కంటే ముందు ఈ రికార్డు బాబీ పీల్ (39 ఏళ్ల 180 రోజులు) పేరిట ఉండేది. రే విల్లింగ్టన్ (39 ఏళ్ల 30 రోజులు), క్లారీ గ్రిమ్మెట్ (39 ఏళ్ల 22 రోజులు), సిడ్నీ బార్న్స్ (38 ఏళ్ల 310 రోజులు) కూడా పెద్ద వయసులోనే వంద వికెట్ల మార్క్ సాధించారు. అంతేకాదు పాక్ తరఫున తక్కువ టెస్టుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న నోమన్ అలీ ఆ జట్టు మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ రికార్డును సవరించాడు. 2021లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నోమన్ అలీ 100 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన తర్వాత కానీ అతడికి తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. 2024లో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ను 1-0తో పాకిస్తాన్ గెలవడంలో నోమన్ అలీ పాత్ర కీలకం. 22 మ్యాచ్ల్లో 101 వికెట్లు సాధించిన నోమన్ అలీ 9 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇందులో మూడు మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి పది వికెట్ల ఫీట్ను అందుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే చివరి రోజు ఆటలో పాకిస్తాన్ విజయం కోసం కష్టపడుతోంది. బంగ్లా విధించిన 268 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో తడబడుతున్న పాకిస్తాన్ ప్రస్తుతం 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులతో ఆడుతోంది. సాద్ షకీల్ (10), రిజ్వాన్ (7) క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి మరో 128 పరుగులు అవసరం.చదవండి: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’ -
‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. 200 పరుగులకు పైగా టార్గెట్ నిర్దేశించి కూడా పంజాబ్ ఓడిపోవడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే ధర్మశాల పిచ్పై పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ఒక్క ఓవర్ కూడా స్పిన్నర్లతో వేయించకపోవడం ఆ జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. మరోవైపు ఢిల్లీ కూడా ఒక్క స్పిన్నర్తోనై బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ‘ధర్మశాల వంటి ఫ్లాట్ పిచ్పై 210 పరుగుల లక్ష్యం చాలా ఎక్కువ. కానీ సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్పై మరో 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే బాగుండేదేమో. చాహల్తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం వెనుక ఒకటే కారణం. బంతి సీమర్లకు బాగా అనుకూలిస్తుందని భావించాను. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు హార్డ్ లెంగ్త్లో బౌలింగ్ చేయడం ఉత్తమం. అక్కడ నిలకడగా బౌలింగ్ చేస్తే కనీసం ఒక్క బంతయినా మిస్-హిట్ అయ్యి వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మా సీమర్లు లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసరడంలో విఫలమయ్యారు. మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఫీల్డింగ్లో లోపాలు మా కొంపముంచాయి. మా ప్రణాళికలన్నీ ఆచరణలో దారుణంగా విఫలమయ్యాయి.’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోగా, ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’ -
‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’
2026 టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. తమ దేశంలో మతపరమైన ఉద్రిక్తతల కారణంగా ముస్తాఫిజుర్ను కేకేఆర్ తొలగించడంపై బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్ల భద్రతకు సంబం ధించి కారణాలు ఎత్తిచూపుతూ ప్రపంచకప్లో తమ మ్యాచ్ వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. అయితే ఆటగాళ్ల భద్రతపై ఆందోళన అవసరం లేదని పేర్కొన్న ఐసీసీ మ్యాచ్ వేదికలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్ నుంచి వైదొలుగున్నట్లు బీసీబీ ప్రకటన విడుదల చేసింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలోకి స్కాట్లాండ్ రావడం, ఆ తర్వాత ప్రపంచకప్ సజావుగా సాగిపోయింది. తాజాగా ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాత్కాలిక అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ స్పందించాడు. ఆనాడు ఐసీసీ మాటను వినకుండా బీసీబీ తప్పు చేసిందని, ఆ టోర్నీ ఆడకపోవడం వల్ల ఆర్థికంగా తాము చాలా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు వైదొలగడం వెనుక అప్పటి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తప్పుబట్టాడు. ‘టీ20 ప్రపంచకప్ వివాదం జరిగినప్పుడు మొదట నేనే గళం విప్పాను. నిజానికి గత బీసీబీ పరిపాలన విభాగం వ్యవహరించిన తీరు సరైనది కాదు. ఈ విషయంలో ఐసీసీ కూడా ఉదాసీనంగా వ్యవహరించింది. అప్పుడే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక పరిష్కారం కనుగొనడానికి ఆస్కారం ఉండేది. కానీ బీసీబీ ఐసీసీ మాట వినకుండా తప్పు చేసింది. దీనివల్ల బంగ్లాదేశ్ జట్టు తీవ్రంగా నష్టపోయింది. ఇక 1996-97 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించడం కోసం కెన్యాపై ఐసీసీ ట్రోఫీని గెలిచినప్పుడు బంగ్లాదేశ్ అంతటా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆనాటి సంబరాలు మమ్మల్ని క్రికెట్వైపు ఆకర్షించాయి. ప్రతీ ఒక్కరు మిన్హాజుల్ అబెదిన్ నన్ను, ఖలీద్ మషూద్, అక్రమ్ ఖాన్ లాగా తయారవ్వాలనుకున్నారు. అప్పటి నుంచే బంగ్లా క్రికెట్ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. సరైన చర్చ జరగకుండానే 2026 టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడం బాధాకరం. ఆ జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్ల వచ్చే ప్రపంచకప్లో ఆడకపోవచ్చు. అయితే ఇప్పుడు సమస్యలు అన్నీ సమసిపోయాయి. బీసీసీఐతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్తో నాకు మంచి అనుబంధముంది. ఇద్దరం కలిసి ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడాం. ఢాకా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఆయన చాలాసార్లు బంగ్లాదేశ్కు వచ్చారు. నేను అధ్యక్ష హోదాలో ఇంకా ఆయన్ను కలవలేదు. బహుశా అది త్వరలో జరగవచ్చు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్లో భద్రత చాలా బాగుంది. త్వరలోనే బీసీసీఐతో సమావేశం జరిపి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలోనే భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్తో ఇరు దేశాల మధ్య క్రీడా బంధం బలపడుతుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం! -
మిల్లర్, అక్షర్ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ఐపీఎల్ 2026లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జూలు విదిల్చింది. సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్థసెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోశ్ శర్మ (24) , మాధవ్ తివారి (18 నాటౌట్), అకిబ్ నబీ (10 నాటౌట్) హిట్టింగ్తో ఢిల్లీకి విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్, యష్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. కూపర్ కనోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇది ఐదో విజయం కాగా, పంజాబ్కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.Ice in their veins and pure fire in their bats! 🧊🔥Madhav Tiwari & Ashutosh Sharma with match-winning clutch cameos to seal the deal for #DC 🫡Updates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC | @DelhiCapitals pic.twitter.com/ZqwSxTCrhj— IndianPremierLeague (@IPL) May 11, 2026 -
కనోలి చర్యకు చాహల్ పిచ్చి చూపులు!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 210 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట ప్రియాన్ష్ ఆర్య మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, చివర్లో శ్రేయస్, కన్నోలి, సూర్యాంశ్లు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో కూపర్ కన్నోలి కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవతల పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చర్య సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 14.3 ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని కనోలి ఫ్రంట్ ఫుట్ వచ్చి భారీ సిక్సర్ సంధించాడు. పవర్ స్ట్రోక్ ఉపయోగించడంతో బంతి స్టేడియం అవతల పడింది. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ డగౌట్లో ఉన్న చాహల్.. కనోలి కొట్టిన భారీ సిక్స్ను కన్నార్పకుండా చూస్తూ.. ‘పోయింది.. బంతి పోయింది’ అన్న తరహాలో చేతితో సైగలు చేయడం కెమెరా కంటికి చిక్కింది. చాహల్ చర్య అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. చాహల్ వీడియోపై మీరు ఒక లుక్కేయండి. మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. కూపర్ కనోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం! -
ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చప్పగా సాగుతున్న వేళ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్కిక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినప్పటికీ ఆద్యంతం ఆర్సీబీ, ముంబై మధ్య విజయం చేతులు మారుతూ వచ్చింది. చివరకు ముంబై తప్పిదాలు, పేలవ ఫీల్డింగ్తో ఓటమిని కొనితెచ్చుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగుల కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు రాజ్ బవా వచ్చాడు. ఓవర్లో మూడు వైడ్లు, ఒక నోబ్ వేశాడు. ఇది చాలదన్నట్లు భువనేశ్వర్ చేత సిక్సర్ కొట్టించాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగుల అవసరమైన దశలో ఆర్సీబీ బ్యాటర్ రసిక్ సలామ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే రాజ్ బవా తన వైపు వచ్చిన బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని ఎక్స్లో పంచుకోవడంతో వైరల్గా మారింది. బంతి అతని కాలు తాకి మరో దిశలో వెళ్లింది. ఈ గ్యాప్లో ఆర్సీబీ రెండు పరుగులు తీసి విజయం సాధించింది. అయితే రాజ్ బవా బంతిని ఆపే ప్రయత్నం చేసి ఉంటే ముంబై గెలవడం లేదా సూపర్ ఓవర్కు దారి తీసి ఉండేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘రాజ్ బవా బంతిని కావాలనే ఆపలేదని, కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ’ కొంతమంది ఫ్యాన్స్ తెలిపారు. ‘అప్పటికే ఆ ఓవర్లో తొమ్మిది బంతులు వేసి రాజ్ బవా అలసిపోయాడని, అందుకే బంతిని ఆపే ప్రయత్నం చేయలేకపోయి ఉండొచ్చని, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వాటికి ఆస్కారం ఉండదని’ కొంతమంది కామెంట్లు చేశారు. ఇంకొందరు మాత్రం.. ‘ముంబై ఐదుసార్లు టైటిల్ గెలవడంతోనే ఆ జట్టు పూర్తిగా నీరుగారిపోయిందని.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఆర్సీబీతో ముంబై జట్టును కూడా ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని’ కొందరు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఏది ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి అటుంచితే చాన్నాళ్లుకు ఐపీఎల్లో ఒక థ్రిల్లర్ మ్యాచ్ మంచి అనుభూతి కలిగించిందని చెప్పొచ్చు. ఈ విజయంతో ఆర్సీబీ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది.RCB vs MI match is completely fixed. This mdc franchise needs to be banned from IPL forever pic.twitter.com/xCrf6JcHOc— Vishnu (@WorshipRohit) May 11, 2026🎥 𝙍𝙖𝙬 𝙍𝙚𝙖𝙘𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling night 🥳Down to the absolute wire in a contest of incredibly fine margins ⏳Watch the pure passion pour out from #RCB's unforgettable last-ball win ❤️ #TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/H0PNbJSVY6— IndianPremierLeague (@IPL) May 11, 2026చదవండి: టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది! -
టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది!
ఐపీఎల్ 2026 సీజన్ వన్సైడ్ మ్యాచ్లో చప్పగా సాగుతున్న వేళ ఆదివారం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ థ్రిల్లర్ను తలపించింది. అసలు సిసలు టీ20 మజాను చాలా రోజుల తర్వాత రుచి చూపించింది. ఆఖరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు డగౌట్లో సంబరాల్లో మునిగితేలారు. కానీ ఆర్సీబీ స్టార్ టిమ్ డేవిడ్ మాత్రం అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ముంబై ఇండియన్స్ ఓటమిని వెక్కిరిస్తూ టిమ్ డేవిడ్ ఆ జట్టుకు మిడిల్ ఫింగర్ చూపించడం కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా టిమ్ డేవిడ్ చర్యను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.6 ప్రకారం అనుమతి లేకుండా ఒక జట్టు లేదా వ్యక్తిని ఉద్దేశించి అసభ్యకరమైన సంజ్ఞ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఉల్లంఘన చర్య కింద అతడిపై చర్యలు తీసుకుంటున్నాం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల కింద ఆ సంజ్ఞ అసభ్యకరంగా ఉండడంతో పాటు వ్యక్తి లేదా జట్టును ఉద్దేశపూర్వకంగా అవమా నించడం కిందకు వస్తుంది. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఇక టిమ్ డేవిడ్ ఆర్సీబీలోకి రాకముందు ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి 2024 వరకు ముంబై తరఫున ఆడాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా టిమ్ డేవిడ్ సొంతం. ముంబై ఇండియన్స్ తరఫున 37 మ్యాచ్లాడిన టిమ్ డేవిడ్ 171 స్ట్రైక్రేట్ 658 పరుగులు సాధించాడు. 2025 సీజన్కు ముందు ఆర్సీబీలోకి వచ్చిన టిమ్ డేవిడ్ ఆ సీజన్లో లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్కు వచ్చి 187 పరుగులు చేశాడు. తద్వారా ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో సమీకరణం మూడు బంతుల్లో 10 పరుగులకు మారింది. ఈ దశలో భువనేశ్వర్ సిక్సర్ కొట్టడంతో ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో రసిక్ సలామ్ ఆఖరి బంతికి రెండు పరుగులు సాధించి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది.🚨👀🔥Former Mumbai Indians player Tim David was caught showing a middle finger during the match while playing for Royal Challengers Bengaluru 😳The clip instantly went viral, with fans debating💥#TimDavid #RCBvsMI #MumbaiIndians #RCB #IPL2026 #12BETIndia #KnowTheGame 🔥 pic.twitter.com/i7MNqTt3CT— 12BET India (@12B_India) May 11, 2026#breaking RCB's batter Tim David has been booked under Article 2.6 (showing an offensive gesture) during @RCBTweets match vs @mipaltan yesterday at Raipur. He will be penalized 30% of his match fees and given 2 demerit points..@IPL official media release will be out soon!— Gaurav Gupta (@toi_gauravG) May 11, 2026 -
IPL 2026: పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ విజయం
ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్థసెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోశ్ శర్మ (24) , మాధవ్ తివారి (18 నాటౌట్), అకిబ్ నబీ (10 నాటౌట్) హిట్టింగ్తో విజయాన్ని అందించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీఅర్థసెంచరీ సాధించిన అక్షర్ పటేల్ (56) మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో బెన్ ద్వార్సుస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (39), అశుతోశ్ శర్మ (7) పరుగులతో ఆడుతున్నారు.ఆశలు రేపుతున్న అక్షర్, మిల్లర్211 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 44, డేవిడ్ మిల్లర్ 26 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఇద్దరు 28 బంతుల్లోనే 50 పరుగులు జోడించి ఢిల్లీ శిబిరంలో ఆశలు పెంచుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీపంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. 12 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్ కావడంతో ఢిల్లీ 74 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ 25 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ211 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అభిషేక్ పొరేల్ (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. యశ్ ఠాకూర్ బౌలింగ్లో పొరేల్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 2 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.ఢిల్లీ లక్ష్యం 211 పరుగులుఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. కూపర్ కన్నోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.శ్రేయస్ అర్థశతకం17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 50), కన్నోలి (34) పరుగులతో ఆడుతున్నారు. హాఫ్ సెంచరీ బాది ప్రియాన్ష్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా ఔటయ్యాడు. 33 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 56 పరుగులు బాదిన ప్రియాన్ష్ ఆ తర్వాత మాధవ్ తివారీ బౌలింగ్లో సాహిల్ పరాఖ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (13), కూపర్ (5) ఉన్నారు. స్కోరు107-2 (10 ఓవర్లకు)గా ఉంది.ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్లో ఔక్విబ్ నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ప్రియాన్ష్ ఆర్యా (51), శ్రేయాస్ అయ్యర్ (0) ఉన్నారు. స్కోరు 7 ఓవర్లకు 78-1గా ఉంది.ప్రియాన్ష్ ఫిఫ్టీ.. పంజాబ్ 72/0ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఫిఫ్టీ మార్క్ సాధించాడు. 24 బంతుల్లో అర్థశతకం సాధించిన ప్రియాన్ష్ ఇన్నింగ్స్లో ఒక బౌండరీ సహా ఆరు సిక్సర్లు ఉండడం విశేషం. 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ప్రబ్సిమ్రన్ 15 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ప్రియాన్ష్.. 3 ఓవర్లలో 51/0ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ను పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టోకుండా 51 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ (5) పరుగులతో ఆడుతున్నాడు.టాస్ ఓడిన పంజాబ్టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తరఫున బెన్ ద్వార్షుయిస్ ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్ పొరేల్, సాహిల్ పరాక్, డేవిడ్ మిల్లర్, అకిబ్ నబీ, మాధవ్ తివారి తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్లో గెలిచి పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ అందుకోవాలని చూస్తోంది. మరోవైపు పంజాబ్తో మ్యాచ్ ఢిల్లీకి చావో రేవో లాంటిది. ప్రస్తుతం ఢిల్లీ 11 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఢిల్లీకి ప్లేఆఫ్ అవకాశాలు మిగిలి ఉంటాయి. ఓడితే మాత్రం ముంబై, లక్నో తర్వాత ఎలిమినేట్ అవనున్న మూడో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలవనుంది. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్లతో విజయాన్ని అందుకుంది. మొదట ఢిల్లీ 264 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలోనే 265 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలడిపతే 18 సార్లు పంజాబ్, 17 సార్లు ఢిల్లీ నెగ్గింది. 2023 నుంచి చూసుకుంటే ఈ రికార్డు 3-2గా ఉంది. ఇక ధర్మశాలలో ఇరుజట్లు చెరో 2 విజయాలతో సమానంగా ఉన్నాయి.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, బెన్ ద్వార్షుయిస్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్లు: పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, త్రిపురాన విజయ్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: హర్ప్రీత్ బ్రార్, యష్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే🚨Toss update from Dharamshala 🚨@DelhiCapitals won the toss and elected to bowl first against @punjabkingsiplUpdates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC pic.twitter.com/uia9sh01xL— IndianPremierLeague (@IPL) May 11, 2026 -
తిరోగమనంలో ముంబై ఇండియన్స్.. ఆ ముగ్గురిపై వేటు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ది ఘన చరిత్ర. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం తిరోగమనం దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఆ జట్టు పూర్తిగా గాడి తప్పింది. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన మాజీ చాంపియన్స్ అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఆదివారం ఆర్సీబీతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను ముంబై చేజేతులా ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో అనుభవం లేని రాజ్బవా చేతికి బంతిని అందించి కెప్టెన్ సూర్యకుమార్ మూల్యం చెల్లించుకున్నాడు. అనుభవలేమితో ఒత్తిడికి లోనైన రాజ్బవా వైడ్లు, నోబ్ వేసి ముంబై ఓటమికి కారణమయ్యాడు. ఈ ఓటమితో ముంబై 11 మ్యాచ్ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించడంతో లీగ్ దశలో మరో మూడు మ్యాచ్లు ఉన్నప్పటికీ రెండు వారాల ముందే ముంబై ఐపీఎల్ 19వ సీజన్లో ఎలిమినేట్ అయింది. అయితే ఐపీఎల్కు ముందు జరిగిన టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యులుగా ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ సహా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా ముంబై జట్టులో ఉండడం గమనార్హం. అయితే ఈ సీజన్లో ముంబై దారుణ వైఫల్యంతో వచ్చే సీజన్కు జట్టులో ప్రక్షాళన తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో ముంబై జట్టులో ముగ్గురు ఆటగాళ్లను మాత్రం విడుదల చేయనుంది. వారే ప్రస్తుత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, ట్రెంట్ బౌల్ట్.సూర్యకుమార్35 ఏళ్ల వయసున్న సూర్యకుమార్ టీ20 క్రికెట్లో మిస్టర్ 360 ప్లేయర్గా గుర్తింపు ఉంది. కేవలం టీ20 స్పెషలిస్ట్గానే టీమిండియాకు ఆడిన సూర్యకుమార్ గత నాలుగేళ్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ ఈ సీజన్లో మాత్రం సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 మ్యాచ్లాడి కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సీజన్లో రోహిత్ శర్మ గాయంతో చాలా మ్యాచ్లకు దూరం కావడంతో జట్టులో సీనియర్గా బ్యాటర్గా బాధ్యతగా ఆడాల్సిన సూర్యకుమార్ తన పాత్రకు న్యాయం చేయడంలో విఫలమయ్యాడు. పైగా పాండ్యా దూరమవ్వడంతో కెప్టెన్సీ బాధ్యతలు అతడిని మరింత ఒత్తిడిలోకి నెట్టేశాయి. దీంతో వచ్చే సీజన్లో సూర్యకు ముంబై టాటా చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.హార్దిక్ పాండ్యాఒకప్పుడు ముంబై ఇండియన్స్లో ఆడిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత 2022 సీజన్లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. గుజరాత్ ఆడిన తొలి సీజన్లోనే పాండ్యా ఆ జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. మరుసటి సీజన్లోనూ గుజరాత్ను రన్నరప్గా నిలపడంతో పాండ్యా పేరు మార్మోగిపోయింది. దీంతో ఉన్నపళంగా 2024సీజన్లో రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. కానీ ముంబైలోకి వచ్చినప్పటి నుంచి పాండ్యా అటు కెప్టెన్గా.. ఇటు ఆల్రౌండర్గా పూర్తిగా విఫలమవుతూ వచ్చాడు. 2025 సీజన్లో పాండ్యా సారథ్యంలో ముంబై ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఇతర జట్ల సమీకరణాల ఆధారంగా చేరడంతో ముంబై స్థాయికి ఇది తగదు. ఇక 2024 సీజన్తో పాటు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఈ సీజన్లో పాండ్యా 8 మ్యాచ్లాడి 146 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లోనూ విఫలమైన పాండ్యా కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీనికి తోడు తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. గాయంతో ఈ సీజన్కు దూరమైన పాండ్యా వచ్చే సీజన్లో వేరే జట్టుకు ఆడే అవకాశముంది.ట్రెంట్ బౌల్ట్అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన ట్రెంట్ బౌల్ట్ను ముంబై ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్లో బౌల్ట్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్లాడిన బౌల్ట్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.బుమ్రాతో కలిసి ప్రత్యర్థులను బెంబెలెత్తిస్తాడనుకుంటే బౌల్ట్ మాత్రం తన దారుణ ప్రదర్శనతో ముంబై ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారాడు. వచ్చే సీజన్లో బౌల్ట్ స్థానంలో యంగ్ పేసర్ను తీసుకోవాలని ఇప్పటికే ముంబై భావిస్తోంది.చదవండి: పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు! -
పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు!
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి ప్లేఆఫ్స్ రేసు రసతవత్తరంగా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్పై ఉత్కంఠ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. ముంబై బౌలర్ రాజ్బవా ఒత్తిడికి తోడు వైడ్లు, నోబ్ వేయడంతో చివరి ఓవర్లో 15 పరుగులు చేసి ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకోవడంతో పాటు టేబుల్ టాపర్గా నిలిచింది. ఇప్పటికే వరుస ఓటములతో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే టాప్-4లో నిలిచేందుకు 8 జట్లు పోటీలో ఉండడం గమనార్హం.అగ్రస్థానంలో ఆర్సీబీ:ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉన్న ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. (+1.103) నెట్ రన్రేట్తో ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే ఇంకా రెండు విజయాలు అవసరం. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్కు సరిపోతాయి. కాబట్టి ఆర్సీబీ ఒక్క విజయం సాధించినా సరిపోతుంది. కానీ ఎస్ఆర్హెచ్, పంజాబ్ల నుంచి పోటీ వద్దనుకుంటే మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచి నేరుగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించే అవకాశం ఉంది.హైదరాబాద్ రెండు గెలిస్తే:సన్రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్రేట్ (+0.737) విషయంలో ఆర్సీబీ కంటే వెనుకబడి ఉంది. చివరి మూడు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. మే 22న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ టాప్-2 స్థానాలపై కీలక ప్రభావం చూపే అవకాశముంది. గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లతో పోటీలో ఉంది. అయితే వారి నెట్ రన్ రేట్ (+0.228) తక్కువగా ఉండటంతో మరో రెండు విజయాలు అవసరం. మే 12న ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ గుజరాత్కు కీలకంగా మారనుంది.అనుకూల స్థితిలో పంజాబ్:పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అత్యంత అనుకూల స్థితిలో ఉన్న జట్టుగా కనిపిస్తోంది. 10 మ్యాచ్ల్లోనే 13 పాయింట్లు సాధించిన పంజాబ్కు మరో నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. నాలుగులో కనీసం రెండు గెలిస్తే చాలు 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తును పంజాబ్ దాదాపు ఖాయం చేసుకుంటుంది.చెన్నైకి కనీసం రెండు విజయాలు:ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం కఠిన పరిస్థితుల్లో ఉంది. సీఎస్కే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్లో కనీసం రెండు గెలవాల్సిన అవసరముంది. అయితే వారి నెట్ రన్రేట్ (+0.185) పెద్దగా మెరుగ్గా లేకపోవడంతో అన్ని మ్యాచ్లు గెలిస్తేనే అవకాశం ఉంది.ఒత్తిడిలో రాజస్థాన్:రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో సీఎస్కేతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్దేట్ (+0.082) తక్కువగా ఉంది. గత నాలుగు మ్యాచ్ ల్లో మూడు ఓటములు చవిచూడడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. సీఎస్కేతో కలిసి నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం రాజస్థాన్ పోరాడే అవకాశం ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మిగిలిన నాలుగు మ్యాచ్లు కేకేఆర్ కచ్చితంగా గెలవాల్సిన అవసరముంది. అప్పుడు కేకేఆర్ 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరే అవకాశముంటుంది. అయితే మ్యాచ్లో ఒక్క ఓటమి ఎదురైనా కేకేఆర్ ఇంటిబాట పట్టాల్సిందే.ఢిల్లీ క్యాపిటల్స్కు కష్టమే..ఢిల్లీ క్యాపిటల్స్కు అవకాశాలు అంతంతమాత్రమే. ప్రస్తుతం వారి నెట్ రన్ రేట్ (-1.154) దారుణంగా ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాల్సిన అవసరముంటుంది.ముంబై, లక్నో అవుట్:ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పోరు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.చదవండి: ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం! -
ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట కృనాల్ పాండ్యా వీరోచిత పోరాటం ఆర్సీబీని విజయం వైపు తీసుకెళ్లింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73) తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించగా.. చివర్లో భువనేశ్వర్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. జాకబ్ బెతెల్ (27) పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో కార్బిన్ బోస్క్ 4 వికెట్లు తీయగా, దీపక్ చాహర్ 2, గజన్ఫర్, రాజ్ బవాలు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను ముంబై చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఫీల్డింగ్లో తప్పిదాలు, ఆఖరి ఓవర్లో రాజ్ బవా ఒత్తిడి లోనయ్యి వరుస వైడ్లు, నోబాల్ వేయడం కూడా ముంబై కొంపముంచింది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ చేరకుండానే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 11 మ్యాచ్ల్లో ఏడో విజయంతో 14 పాయింట్లు సాధించి మెరుగైన రన్రేట్తో టేబుల్ టాపర్గా నిలిచింది.WHAT ON EARTH HAVE WE JUST WITNESSED! 🤯Bhuvneshwar Kumar & Rasikh Dar, take a bow ❤️Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/tqkuPMEsHR— IndianPremierLeague (@IPL) May 10, 2026 -
సిల్వర్ టు గోల్డెన్ డక్.. కోహ్లీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతిని మిడాఫ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ కాచుకు కూర్చున్న రాజ్బవాకు స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ డకౌట్ల విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో తొలిసారి గోల్డెన్ డక్ అయిన కోహ్లీకి ఓవరాల్గా ఐపీఎల్లో ఎనిమిదో గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. అంతేకాదు ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్గా వెనుదిరిగాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత రెండు వరుస మ్యాచ్ల్లో డకౌట్ అయిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. లక్నోతో జరిగిన గత మ్యాచ్లోనూ కోహ్లీ 2 బంతులెదుర్కొని సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. 2022 సీజన్లో కోహ్లీ లక్నో, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ల్లో ఇదే మాదిరిగా డకౌట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు కోహ్లీని ట్రోల్ చేశారు. 'సిల్వర్ డక్ను గోల్డెన్ డక్గా మార్చుకున్న ఘనత కోహ్లీ సొంతం' అంటూ కామెంట్లు చేశారు. ఇక తాజా డకౌట్తో కోహ్లీ మరిన్ని చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.👉ముంబై ఇండియన్స్పై కోహ్లీ డకౌట్ కావడం ఇది మూడోసారి. గతంలో ఎస్ఆర్హెచ్పై కూడా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. ఇక లక్నోపై రెండుసార్లు, పంజాబ్, గుజరాత్, కేకేఆర్, రాజస్తాన్లపై ఒక్కోసారి డకౌట్గా వెనుదిరిగాడు.👉 ఐపీఎల్లో కోహ్లీ గోల్డెన్ డకౌటవ్వడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. 2022 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్తో ఆడిన తర్వాతి మ్యాచ్లోనూ కోహ్లీ డకౌట్ అయ్యాడు. తాజా సీజన్లోనూ వరుసగా లక్నో, ముంబైతో మ్యాచ్ల్లోనూ మరోసారి రిపీట్ చేశాడు.👉 ఐపీఎల్ల్లో అత్యధిక సార్లు గోల్డెన్డక్ అయిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (8 సార్లు).. ఇషాన్ కిషన్, సునీల్ నరైన్లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరి కంటే ముందు రషీద్ ఖాన్ (12 సార్లు), మ్యాక్స్వెల్ (10 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.👉ఈ సీజన్లో కోహ్లీ బ్యాటింగ్లో మెరుపులు తగ్గినప్పటికీ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 379 పరుగులు సాధించాడు. అయితే గత నాలుగు ఇన్నింగ్స్లు కలిపి కోహ్లీ చేసిన పరుగులు 51 మాత్రమే కావడం గమనార్హం.Virat Kohli goes for a Golden Duck 😯Courtesy Deepak Chahar 🤌💙Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @mipaltan pic.twitter.com/LxCP62qvVJ— IndianPremierLeague (@IPL) May 10, 2026Silver duck now has been upgraded to golden duck 😂 pic.twitter.com/wxhEbgDBHC— Hitman (@Vijay456V60026) May 10, 2026చదవండి: లేటు వయసులో భువనేశ్వర్ కొత్త చరిత్ర! -
లేటు వయసులో భువనేశ్వర్ కొత్త చరిత్ర!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ లేటు వయసులోనూ తన బౌలింగ్తో ఇరగదీస్తున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఈ వెటరన్ బౌలర్ నాలుగు వికెట్లు పడగొట్టి బౌలింగ్లో ఇంకా పదును తగ్గలేదని మరోసారి నిరూపించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 19వ సీజన్లో 20 వికెట్లు పూర్తి చేసుకున్న భువనేశ్వర్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 20 వికెట్లు తీయడం భువనేశ్వర్కు ఇది నాలుగోసారి. తొలిసారి 2014లో 20 వికెట్ల మార్క్ దాటిన భువనేశ్వర్, ఆ తర్వాత 2016, 2017లోనూ ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజాగా నాలుగోసారి 20 ప్లస్ వికెట్ల మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్గా భువనేశ్వర్ నిలిచాడు. భువనేశ్వర్ కంటే ముందు యజ్వేంద్ర చాహల్ ఐదుసార్లు, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలు నాలుగేసిసార్లు ఈ ఫీట్ను సాధించారు. ముంబైతో మ్యాచ్లో భువనేశ్వర్ తాను వేసిన తొలి రెండు ఓవర్లలోనే 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత అర్థసెంచరీతో ముంబై ఇన్నింగ్స్ను నిలబెట్టిన తిలక్ వర్మను క్లీన్బౌల్డ్ చేసి నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు.𝘽𝙝𝙪𝙫𝙞-𝙛𝙪𝙡 exhibition of new-ball magic! 🤌🎥 Just sit back and admire the swing of things! ❤️Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/STbZ16mzbj— IndianPremierLeague (@IPL) May 10, 2026The 𝘀𝘁𝘂𝗺𝗽𝘀 𝗹𝗶𝗴𝗵𝘁 𝘂𝗽 courtesy of the Purple Cap holder 👏🔥🎥 Bhuvneshwar Kumar with his 4️⃣th wicket tonight 🙇Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/7q5TqfkHNs— IndianPremierLeague (@IPL) May 10, 2026చదవండి: ఉర్విల్ సిక్సర్ల సునామీ.. ‘ఇది నీకోసం పప్పా’ -
ఉర్విల్ సిక్సర్ల సునామీ.. ‘ఇది నీకోసం పప్పా’
ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ జూలు విదిల్చింది. లక్నో సూపర్జెయింట్స్పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అయితే సీఎస్కే విజయంలో ఉర్విల్ పాత్ర కీలకం. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఉర్విల్ పటేల్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 8 బంతుల్లోనే 41 పరుగులు చేసిన ఉర్విల్ టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన అర్థసెంచరీ సాధిస్తాడనిపించింది. కానీ ఆ తర్వాత రెండు బంతుల్లో సింగిల్స్ తీయడంతో 13 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. అయితే ఉర్విల్ ఫిఫ్టీ మార్క్ చేరిన ఆనందంలో అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. A record knock 🤯A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶Urvil Patel, thank you for the entertainment today 💛 Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid— IndianPremierLeague (@IPL) May 10, 2026హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగానే ఉర్విల్ తన ప్యాంటు జేబులో నుంచి ఒక కాగితాన్ని బయటకు తీశాడు. ఆ కాగితంలో ఉన్న సందేశాన్ని అభిమానులకు చూపించాడు. అందులో 'ఇది నీకోసం పప్పా' అని రాసి ఉన్న మెసేజ్ కెమెరా కంటికి చిక్కింది.👉 ఇదే మ్యాచ్లో ఉర్విల్ పటేల్ మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఉర్విల్ తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. తద్వారా ఒక ఇన్నింగ్స్లో తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ఉర్విల్ నిలిచాడు. అంతకముందు ఐపీఎల్లో తొలి 8 బంతుల్లో 33 పరుగులు రావడమే ఉత్తమంగా ఉంది. తాజాగా ఉర్విల్పటేల్ దానిని బద్దలు కొట్టాడు.6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣6️⃣❗🔥Urvil Patel is unleashing absolute carnage at Chepauk! 💥🏏Will he script the fastest fifty in #TATAIPL? 👀🔥#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvLSG | LIVE NOW 👉 https://t.co/niGR0vFDDY pic.twitter.com/86xCo1SXsh— Star Sports (@StarSportsIndia) May 10, 2026👉 సీఎస్కే తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన జాబితాలో ఉర్విల్ రెండో స్థానంలో నిలిచాడు. లక్నోతో మ్యాచ్లో ఉర్విల్ 282.6 స్ట్రైక్రేట్ 23 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో సురేశ్ రైనా (348 స్ట్రైక్రేట్, 25 బంతుల్లో 87 పరుగులు) ఉన్నాడు. అంబటి రాయుడు (266.6 స్ట్రైక్రేట్, 27 బంతుల్లో 72 నాటౌట్), ఎంఎస్ ధోని (255 స్ట్రైక్రేట్, 20 బంతుల్లో 51 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (247.82 స్ట్రైక్రేట్, 23 బంతుల్లో 57 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉 మ్యాచ్ విజయం అనంతరం ఉర్విల్ మాట్లాడుతూ.. ‘నా మనసులో ఏమీ లేదు, కానీ నేను పరిస్థితికి తగినట్లుగా బ్యాటింగ్ చేయాలని భావించాను. స్థిరమైన బేస్ ఉంచుకుని బ్యాటింగ్ ఆడమని కోచ్ సలహా ఇచ్చారు. నేను అదే పాటించాను. వికెట్ పల్లంగా ఉందని, దానికి సిద్ధంగా ఉండమని రుతురాజ్ చెప్పాడు. ఇది మినహా నాకు ఏమీ చెప్పలేదు. నన్ను స్వేచ్ఛగా ఆడనిచ్చాడు. అందుకే ఇది సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: వైభవ్పై రబాడ సంచలన వ్యాఖ్యలు -
వైభవ్పై రబాడ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బౌలర్లను ఉతికారేస్తుండడంతో అతడికి బౌలింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు. హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కమిన్స్, షమీ లాంటి టాప్ పేసర్లు కూడా అతడి పరుగుల వరదని ఆపలేకపోయారు. అయితే గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ మాత్రం వైభవ్ సూర్యవంశీని పెద్దగా పట్టించుకోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అతడికి బంతులు వేసే క్రమంలో 11 ఏళ్లుగా తనకు తెలిసిన విధానాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు కొట్టడంపై మ్యాచ్ అనంతరం రబాడ స్పందించాడు. ‘11 ఏళ్లుగా బౌలింగ్ చేస్తున్నా. అదే విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది. బౌలర్లు తమ ప్రణాళికలపై నమ్మకం ఉంచాలి. బ్యాటర్ల బలహీనతలపై విశ్లేషణ చేస్తాం. చాలా కష్టపడి సిద్ధమవుతాం. కానీ చివరికి అదే ప్రాసెస్ను కొనసాగించాలి’ అని పేర్కొన్నాడు. శరీరం బాగానే ఉంది. కానీ మానసిక అలసట కూడా ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్గా మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని తెలిపాడు.ఐపీఎల్ 2026 సీజన్లో తొలి అంచె పోటీల్లో వరుస విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రెండో అంచెలో మాత్రం ఓటములు చవిచూస్తూ వస్తోంది. అయితే వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్లో మినిమం గ్యారంటీ ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్లో నాలుగోసారి సిక్సర్తో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన వైభవ్ పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మ్యాచ్లో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి.. 18 వికెట్లు తీసి అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. రాజస్తాన్పై విజయంతో గుజరాత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.చదవండి: సీఎస్కే అడ్డాలో జోస్ ఇంగ్లిస్ అరుదైన ఫీట్! -
IPL 2026: ముంబైపై ఆర్సీబీ ఉత్కంఠ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73) తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించగా.. చివర్లో భువనేశ్వర్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. జాకబ్ బెతెల్ (27) పర్వాలేదనిపించాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.కార్బిన్ బాష్కు నాలుగు వికెట్లుముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ కష్టాల్లో పడింది. కార్బిన్ బాష్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 18 పరుగులు చేసిన జితేశ్ శర్మ కార్బిన్ బోష్ బౌలింగ్లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే టిమ్ డేవిడ్ కూడా గోల్డెన్ డక్గా వెనుదిరగడంతో ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. అంతకముందు కృనాల్ పాండ్యా అర్థశతకంతో మెరిశాడు. 33 బంతుల్లో అర్థశతకం సాధించిన కృనాల్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీజాకబ్ బెతెల్ (27) రూపంలో ఆర్సీబీ 94 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కార్బిన్ బోష్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి బెతెల్ పెవిలియన్ చేరాడు. 13 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (41) పరుగులతో ఆడుతున్నాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీకెప్టెన్ పటీదార్ (8) రూపంలో ఆర్సీబీ 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కార్బిన్ బోస్క్ బౌలింగ్లో షాట్కు యత్నించి రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీముంబైతో మ్యాచ్లో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముంబై స్కోరు 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్ చాహర్ బౌలింగ్లో 12 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ కీపర్ రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ గోల్డెన్ డక్.. తొలి వికెట్ డౌన్167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్లో రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చిన కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.ఆర్సీబీ టార్గెట్ 167 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు.ఐదో వికెట్ కోల్పోయిన ముంబైవిల్ జాక్స్ (10) రూపంలో ముంబై ఇండియన్స్ 132 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. షెపర్డ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన విల్ జాక్స్ జాకబ్ బెతెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 15.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.నమన్ ధిర్ హాఫ్ సెంచరీ మిస్ ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. నమన్ ధిర్ 47 పరుగులు చేసి రసిఖ్ సలాం దార్ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ 41, విల్ జాక్ 5 పరుగులతో ఉన్నారు. స్కోరు 114-4 (13 ఓవర్లకు)గా ఉంది. 10 ఓవర్లకు 82 పరుగులు ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు ముగిసేనాటికి మూడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో నమన్ ధిర్ 34, తిలక్ వర్మ 25 పరుగులతో ఉన్నారు. క్రీజులో నమన్, తిలక్ వర్మ 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. నమన్ ధిర్ (16), తిలక్ వర్మ (13) పరుగులతో ఆడుతున్నారు.సూర్య గోల్డెన్ డక్.. మూడో వికెట్ డౌన్ఆర్సీబీతో మ్యాచ్లో స్టాండ్ ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్గా వెనుదిరగడంతో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్లో తాను ఆడిన తొలి బంతికే సూర్య కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు రోహిత్ శర్మ (28)ను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. నమన్ ధిర్ (5), తిలక్ వర్మ (1) పరుగుతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబైఆర్సీబీతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న రికెల్టన్ 2 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్లో పటీదార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.టాస్ గెలిచిన ఆర్సీబీటాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ స్టాండ్ ఇన్ కెప్టెన్గా ఉన్నాడు. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు 35 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 19 సార్లు, ఆర్సీబీ 16 సార్లు గెలిచాయి. 2023 నుంచి ఐదు మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ మూడు గెలిస్తే, ముంబై రెండు విజయాలు సాధించింది. తొలి అంచె పోటీలో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పరంగా చూసుకుంటే ఆర్సీబీ 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ముంబైపై గెలిస్తే 14 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ను వెనక్కి నెట్టి టేబుల్ టాపర్గా నిలవనుంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు క్లిష్టం చేసుకున్న ముంబై 10 మ్యాచ్ల్లో మూడు విజయాలతో పట్టికలో 9వ స్థానంలో ఉంది.తుది జట్లు:ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: ట్రెంట్ బౌల్ట్, రఘు శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, శార్దూల్ ఠాకూర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, జోర్డాన్ కాక్స్, మంగేష్ యాదవ్, స్వప్నిల్ సింగ్, వెంకటేష్ అయ్యర్🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @mipaltan in Raipur.Surya Kumar Yadav continues to lead #MI in Hardik Pandya's absence.Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI pic.twitter.com/TilnplTivN— IndianPremierLeague (@IPL) May 10, 2026 -
సీఎస్కే అడ్డాలో జోస్ ఇంగ్లిస్ అరుదైన ఫీట్!
లక్నో సూపర్జెయింట్స్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఆదివారం సీఎస్కేతో మ్యాచ్లో దనాధన్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లిస్ 33 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ సాధించిన ఇంగ్లిస్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తక్కువ బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న తొలి క్రికెటర్గా ఇంగ్లిస్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సామ్ బిల్లింగ్స్ (21 బంతులు) పేరిట ఉండేది. సీఎస్కే సొంత గ్రౌండ్ అయినప్పటికీ ఇప్పటివరకు ఆ జట్టులో కూడా ఎవరు తక్కువ బంతుల్లో అర్థసెంచరీ సాధించలేకపోయారు. ఇక సామ్ బిల్లింగ్స్ 21 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. 2018 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్పై బిల్లింగ్స్ దీనిని సాధించాడు. తాజాగా జోస్ ఇంగ్లిస్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సీఎస్కే బ్యాటర్లకు కూడా సాధ్యం కానిది తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ఇంగ్లిస్ ఉన్నంతసేపు లక్నో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఆరు ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ను దాటిన లక్నో.. ఇంగ్లిస్ ఔటయ్యాక జట్టు ఇన్నింగ్స్ పేక మేడను తలపించింది. చివర్లో సషాబాజ్ అహ్మద్ (25 బంతుల్లో 43 నాటౌట్) రాణించడంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.North, South, East, or West 📍Josh Inglis was at his best 👏Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/rAgC15cqmw— IndianPremierLeague (@IPL) May 10, 2026చదవండి: లక్నో డగౌట్లో ఫోన్.. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు! -
లక్నో డగౌట్లో ఫోన్.. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు!
ఐపీఎల్ 2026 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడడం, ఆ ఫోన్ను వైభవ్ సూర్యవంశీ చూడడం పెద్ద వివాదంగా మారింది. ఈ ఘటన మరువకముందే తాజాగా ఆదివారం చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్జెయింట్స్ డగౌట్లో ఒక వ్యక్తి అదే పనిగా మొబైల్ ఫోన్ వాడడం కనిపించింది. సీఎస్కేతో మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో స్క్వేర్ లెగ్వైపు మిచెల్ మార్ష్ బౌండరీ కొట్టాడు. ఈ సమయంలో రిప్లేలో లక్నో డగౌట్లో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. అతడు పదే పదే ఫోన్లో మాట్లాడుతుండడం కనిపించడంతో, అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, మ్యాచ్ సమయంలో డగౌట్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణ చేపట్టే అవకాశం ఉంది.పీఎంవోఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి?ఐపీఎల్లో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పీఎంవోఏ) ప్రొటోకాల్ ప్రకారం, టీమ్ మేనేజర్లు తమ ఫోన్లను కేవలం డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే వాడేందుకు అనుమతి ఉంది. డగౌట్ ఏరియా సహా మైదానంలో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ పరికరాలు ఉపయోగించేందుకు వీలు లేదు. అయితే రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ చర్య తర్వాత బీసీసీఐ కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా పీఎంవోఏ నిబంధనలు ఉల్లంఘించిన భిందర్కు రూ. లక్ష జరిమానా విధించడంతో పాటు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే రోమీ భిందర్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ మరోసారి ఇది రిపీట్ చేయొద్దని హెచ్చరించింది. తాజాగా మరోసారి నిబంధనలకు విరుద్ధంగా డగౌట్లో ఫోన్ వాడడంపై బీసీసీఐ ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి.భద్రత, నియమ నిబంధనల ఉల్లంఘన, హనీ ట్రాప్ వంటి ఉదంతాలతో బీసీసీఐ ఆటగాళ్లు, ఫ్రాంచైజీల యాజమాన్యాలకు కఠిన మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.చదవండి: పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్దీప్పై వేటు! -
దుమ్ములేపిన రషీద్, గిల్.. టాప్-2కు దూసుకొచ్చిన గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 36 పరుగులు) మరోసారి ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావారు విఫలం కావడంతో రాజస్తాన్ లక్ష్య ఛేదనలో పూర్తిగా చతికిలపడింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా, జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు వరుసగా రెండో ఓటమి చవిచూసిన రాజస్తాన్ ఐదో స్థానానికి పడిపోయింది.గుజరాత్ ఓపెనర్ల దూకుడు..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ శుభారంబాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు ఈ ఇద్దరు శతక భాగస్వామ్యం (118 పరుగులు) జోడించి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశారు. అర్థసెంచరీ అనంతరం సాయి సుదర్శన్ వెనుదిరిగినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన బట్లర్, వాషింగ్టన్ సుందర్లతో కలిసి గిల్ భాగస్వామ్యాలు నిర్మించాడు. చివర్లో సుందర్, తెవాటియా ధాటిగా ఆడడంతో గుజరాత్ 220 ప్లస్ స్కోరును దాటింది.చేధనలో చతికిలపడి..230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్కు వైభవ్ సూర్యవంశీ తన దనాధన్ ఇన్నింగ్స్తో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే సూర్యవంశీ ఔటైన తర్వాత రాజస్తాన్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. జురేల్, జడేజాలు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం మినహా ఏం చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ ఓటమి దిశగా పయనించింది. ఈ సీజన్లో గుజరాత్ చేతిలో రాజస్తాన్కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.A 𝙏𝙞𝙩𝙖𝙣𝙞𝙘 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 by 7⃣7⃣ runs✌️4⃣th consecutive win for @gujarat_titans as they move to no.2⃣ in the Points Table 🔢This is also #GT's biggest #TATAIPL win (by runs) 👏👏Scoreboard ▶️ https://t.co/t7CEEL9Bzp#KhelBindaas | #RRvGT pic.twitter.com/jXKWcdBfru— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్గా! -
వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్గా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో వైభవ్ 3 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ సీజన్లో అతడి సిక్సర్ల సంఖ్య 40కి చేరుకుంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మొదటి స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ 2024 సీజన్లో ఓవరాల్గా కొట్టిన సిక్సర్ల సంఖ్య 42. అయితే ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్లు పూర్తవ్వలేదు. దీంతో మిగిలిన మ్యాచ్లు పూర్తయ్యేసరికి వైభవ్ ఇంకా ఎన్ని సిక్సర్లు కొడుతాడో చూడాలి. ఇప్పటికైతే వైభవ్ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (2025 సీజన్లో 39 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (2016 సీజన్లో 38 సిక్సర్లు, 2024 సీజన్లో 38 సిక్సర్లు), సూర్యకుమార్ (2025 సీజన్లో 38 సిక్సర్లు), రిషబ్ పంత్ (2024 సీజన్లో 37 సిక్సర్లు) ఉన్నారు.👉ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లే (1-6 ఓవర్లు) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో వైభవ్ సూర్యవంశీ 30 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ ( 29 సిక్సర్లు, 2024 సీజన్), అభిషేక్ శర్మ (27 సిక్సర్లు, 2026 సీజన్*), జయసూర్య (22 సిక్సర్లు, 2008 సీజన్), ట్రావిస్ హెడ్ (22 సిక్సర్లు, 2024 సీజన్), జైస్వాల్ (22 సిక్సర్లు, 2025 సీజన్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉 ఐపీఎల్ సీజన్లో ఇన్నింగ్స్ను సిక్సర్తో ప్రారంభించడం వైభవ్ సూర్యవంశీకి ఇది ఏడోసారి. ఈ సీజన్లో ఇది నాలుగోసారి కావడం విశేషం.👉 ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.MAKING IT A HABIT 🤩🎥 Just Vaibhav Sooryavanshi with yet another high-intent knock 🙌Updates ▶️ https://t.co/t7CEEL9Bzp#TATAIPL | #KhelBindaas | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/LYEfiG4wnZ— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: ఆర్చర్ 11 బంతుల ఓవర్.. హనీ ట్రాప్ నిజమేనా? -
ఆర్చర్ 11 బంతుల ఓవర్.. హనీ ట్రాప్ నిజమేనా?
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఆర్చర్ 5 వైడ్లు వేశాడు. ఆరు బంతులు వేయాల్సిన చోట 11 బంతులు వేసిన ఆర్చర్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా ఆర్చర్ నిలిచాడు. ఇక ఆర్చర్ మరో రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో బంతుల పరంగా అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన ఏడో బౌలర్గా ఆర్చర్ నిలిచాడు. గతంలో మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ 11 బంతుల ఓవర్ వేశారు.👉మహ్మద్ సిరాజ్ (11 బంతులు, 2023లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో)👉 తుషార్ దేశ్పాండే (11 బంతులు, 2023లో లక్నోతో మ్యాచ్లో)👉 శార్దూల్ ఠాకూర్ (11 బంతులు, 2025లో కేకేఆర్తో మ్యాచ్లో)👉 సందీప్ శర్మ (11 బంతులు, 2025లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో)👉 హార్దిక్ పాండ్యా (11 బంతులు, 2025లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో)👉 అర్ష్దీప్ సింగ్ (11 బంతులు, 2026లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో)అయితే సోషల్ మీడియాలో జోఫ్రా ఆర్చర్ను క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. ఇటీవలే హనీట్రాప్ అంశం తెరమీదకు రావడం, ఆర్చర్ కూడా గుజరాత్ తో మ్యాచ్కు ముందు ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపించారు. ఒక అభిమాని శ్రుతి మించి ఆర్చర్పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆర్చర్ శనివారం ఉదయం జైపూర్ హోటల్లో అమ్మాయితో కనిపించాడని.. సాయంత్రానికి నోబాల్ సహా ఐదు వైడ్లు వేయడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది* అంటూ పేర్కొన్నాడు. ఆర్చర్ తన కెరీర్లోనే అత్యంత చెత్త ఓవర్ వేసి జైస్వాల్ కెరీర్ నాశనం చేశాడంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేశారు.హనీట్రాప్ అంటే..'హనీ ట్రాపింగ్' అంటే క్రికెటర్లను ప్రేమ సంబంధమైన లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా మోసగించడం, లొంగదీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం లేదా ఉచ్చులో పడేయడం వంటి పరిస్థితులను సూచిస్తుంది. తాజాగా జోఫ్రా ఆర్చర్ 11 బంతుల ఓవర్ వేసిన తర్వాత, అతని పేరు హనీ ట్రాప్ వివాదంతో ముడిపడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ఆటగాళ్లు హనీ ట్రాప్కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని బీసీసీఐ భయపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యను అరికట్టడానికి, టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా అనధికార వ్యక్తులు ఎవరూ హోటల్ గదుల్లోకి ప్రవేశించకుండా చూసుకోవాలని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసింది.Not a very good start for Rajasthan and for Jofra Archer😬😬 17 runs in 1 over for Gujarat 🔥 A lot of Freebies from Archer😐 pic.twitter.com/EARUdGdnWp— STUMP THEORY (@SANIL__18) May 9, 2026చదవండి: పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్దీప్పై వేటు! -
IPL 2026: రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం
శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓటమి దిశగా రాజస్తాన్ రాయల్స్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దాసున్ షనక 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో రాజస్తాన్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఫెరీరా (4)ను క్లీన్బౌల్డ్ చేసిన రషీద్ ఖాన్ అంతకముందు 24 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ను కూడా క్లీన్బౌల్డ్గా పెవిలియన్ చేర్చాడు. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్మూడు పరుగులు చేసిన స్టాండ్ ఇన్ కెప్టెన్ జైస్వాల్ రబాడ బౌలింగ్లో వెనుదిరగడంతో రాజస్తాన్ 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సూర్యవంశీ (38) ఔట్.. రాజస్తాన్ 38/1230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఛేదనను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ సృష్టించాడు. అయితే సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీ 36 పరుగులు చేసి అర్షద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో రాజస్తాన్ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.రాజస్తాన్ లక్ష్యం 230 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ ముందు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.గిల్ (84) ఔట్.. మూడో వికెట్ డౌన్84 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ బ్రిజేశ్ శర్మ బౌలింగ్లో తుషార్ దేశ్పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో గుజరాత్ టైటాన్స్ 185 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గిల్ (78), వాషింగ్టన్ సుందర్ 17 పరుగులతో ఆడుతున్నాడు.మరో వికెట్ డౌన్జోస్ బట్లర్ కూడా ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో డోనోన్కు క్యాచ్ ఇచ్చి 13 పరుగులకే జోస్ బట్లర్ వెనుదిరిగాడు. స్కోరు 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 166గా ఉంది.సాయి సుదర్శన్ ఔట్ సాయి సుదర్శన్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరోవైపు, శుభ్మన్ గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. క్రీజులో బట్లర్ 6 పరుగులతో ఉన్నాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ గుజరాత్ టైటాన్స్ స్కోరు 10 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 114గా ఉంది. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ బాదాడు. 32 బంతుల్లో 52 పరుగుల చేశాడు. శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. గుజరాత్ ఓపెనర్లు దూకుడురాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. 6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (39), శుబ్మన్ గిల్ (32) పరుగులతో ఆడుతున్నారు.4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (34), గిల్ (7) పరుగులతో ఆడుతున్నారు.ఒకే ఓవర్లో 18 పరుగులిచ్చిన ఆర్చర్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే వైడ్ల రూపంలో 18 పరుగులు సమర్పించుకున్నాడు. 2 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. సుదర్శన్ (14), గిల్ (2) పరుగులతో ఆడుతున్నారు.టాస్ నెగ్గిన రాజస్తాన్..టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. పరాగ్ తొడ కండరాల గాయంతో దూరం కావడంతో ఈ మ్యాచ్కు రాజస్తాన్ను జైస్వాల్ నడిపించనున్నాడు. ఇక గుజరాత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. మానవ్ సుతర్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్మైర్తో పాటు యష్రాజ్ పుంజా తుదిజట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్ గుజరాత్పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు తొమ్మిది మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ ఆరుసార్లు నెగ్గితే.. రాజస్తాన్ మూడుసార్లు విజయాన్ని అందుకుంది. జైపూర్లో కూడా గుజరాత్దే పైచేయి. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గుజరాత్ గెలుపొందింది.తుది జట్లు:గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్.రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కుమార్ కుశాగ్రారాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్లు: వైభవ్ సూర్యవంశీ, ఆడమ్ మిల్నే, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్ -
పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్దీప్పై వేటు!
ఐపీఎల్ 2026 సీజన్లో ఊహించని సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇటీవలే రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్తో పాటు పంజాబ్ కింగ్స్ ఆటగాడు యజ్వేంద్ర చాహల్ నిషేధిత ప్రాంతాల్లో ఈ-సిగరేట్ తాగడం పెను దుమారం రేపింది. ఇప్పటికే పరాగ్పై యాక్షన్ తీసుకున్న బీసీసీఐ రూ. 25 లక్షల జరిమానా విధించింది. అయితే చాహల్ విషయంలో బీసీసీఐ ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఈ వివాదంలో చాహల్తో పాటు పంజాబ్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అర్ష్దీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ వీడియో లీకవ్వడం, అతడే వేప్ (ఈ-సిగరేట్)ను చాహల్కు అందించడం వీడియోలో కనిపించింది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ బయటికి వచ్చింది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అర్ష్దీప్ను డ్రెస్సింగ్ రూమ్లో జరిగే పరిణామాలను వ్లాగ్గా తీయడం ఆపేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యల వల్ల డ్రెస్సింగ్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా శనివారం ధర్మశాల స్టేడియంలో ప్రాక్టీస్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆటగాళ్లందరితో సమావేశమైనట్లు తెలిసింది. ఐపీఎల్ ముగిసేవరకు ఆటగాళ్లు వ్లాగ్ చేయడం, దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ మీటింగ్లో అర్ష్దీప్ హైలైట్ అయ్యాడు. చాహల్ చర్యకు పరోక్షంగా అర్ష్దీప్ కారణమయ్యాడు. కాగా అర్ష్దీప్కు ఇన్స్టాలో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరోసారి ఇలాంటి చర్యకు పాల్పడితే జట్టు నుంచి నిషేధం ఎదుర్కోవాల్సి వస్తోందని అర్ష్దీప్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ-సిగరేట్ తాగిన చాహల్ను కూడా పంజాబ్ మందలించినట్లు సమాచారం. ఇక నుంచి పంజాబ్ కింగ్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే ఆటగాళ్లంతా తమ వీడియోలను షేర్ చేసుకోవాలని ఆదేశించింది. అందుకు ఆటగాళ్లందరి నుంచి ఇప్పటికే సంతకాలు కూడా తీసుకోవడంతో పాటు ఏ ప్లేయర్ కూడా తమ వ్యక్తిగత అకౌంట్స్లో వీడియోలు పంచుకోవద్దని సూచించింది. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో వరుస విజయాలతో టేబుల్టాపర్గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో పరాజయాలు చవిచూసి ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: అయ్యర్కు షాక్.. శాంసన్కు డబుల్ ప్రమోషన్! -
అయ్యర్కు షాక్.. శాంసన్కు డబుల్ ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్పై త్వరలో వేటు పడనుంది. ఈ మేరకు బీసీసీఐ కొత్త టీ20 కెప్టెన్ను ఎంపిక చేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. అయితే శ్రేయస్ అయ్యర్ తదుపరి భారత టీ20 కెప్టెన్గా బాధ్యతలు తీసుకుంటాడంటూ వార్తలు వస్తున్న వేళ.. తాజాగా కెప్టెన్సీ రేసులోకి అనూహ్యంగా సంజూ శాంసన్ పేరు తెరమీదకు రావడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఎందుకంటే అయ్యర్ కెప్టెన్ అయితే సంజూ శాంసన్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఊహాగానాలు వ్యక్తమయిన వేళ శాంసన్ ఏకంగా కెప్టెన్ కుర్చీపై కర్చీఫ్ వేసి అయ్యర్కే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ అయ్యర్కే అధిక ప్రాధన్యమిచ్చే అవకాశమున్నప్పటికీ శాంసన్ రేసులోకి వస్తే అతడిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో కెప్టెన్ కావాలనుకున్న అయ్యర్కు ఇప్పుడు శాంసన్ రూపంలో పెద్ద గండం వచ్చి పడింది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు ట్రేడింగ్ అయిన సంజూ శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సీఎస్కేకు అతడు కెప్టెన్ కాకపోయినప్పటికీ గతంలో రాజస్తాన్ రాయల్స్కు నాయకత్వం వహించిన అనుభవం శాంసన్కు ఉపయోగపడనుంది. అనుభవానికి తోడు కెప్టెన్గా రాజస్తాన్ను విజయవంతంగా నడిపించడమే శాంసన్ను కెప్టెన్సీ రేసులో నిలబెట్టినట్లు కనిపిస్తోంది. ఇక టీమిండియా వచ్చే జూన్, జూలై నెలల్లో ఇంగ్లండ్, ఐర్లాండ్లో వైట్బాల్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. ముంబై బ్యాటర్గా సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడు చోటు కోల్పోయే అవకాశముంది. ఇప్పటికే పరుగుల పరంగా శాంసన్, శ్రేయస్ అయ్యర్ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు.శాంసన్ ఎందుకంటే?భారత తదుపరి టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో శాంసన్కు అనుకూలంగా ఉన్న అంశం ఏంటంటే.. అతను భారత టీ20 జట్టులో నిలకడగా ఉండటమే. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి జట్టుతో పాటు కొనసాగుతున్న శాంసన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. 62 మ్యాచ్లాడి మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 1,399 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ టీ20 ప్రపంచ కప్ విజయంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో కెప్టెన్గా రాణిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా టీమిండియా ఆడే టీ20 జట్టులో ఇప్పటివరకు చోటు లేకపోవడం మైనస్గా మారింది. అయ్యర్ భారత్ తరఫున తన చివరి టీ20 మ్యాచ్ను 2023 డిసెంబర్ 3న ఆడాడు. ఒకవేళ అయ్యర్ పొట్టి ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇస్తే మాత్రం అతడికి బూస్టప్ అని చెప్పొచ్చు. దీనికి తోడు అతను టీ20 కెప్టెన్ అయితే అతని కెరీర్ గ్రాఫ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20ల కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత టీ20 కెప్టెన్గా సూర్యకుమార్నే కొనసాగించే అవకాశం ఉందని, అయితే మరోసారి పేలవ ఫామ్ కనబరిస్తే మాత్రం సూర్య స్థానంలో బీసీసీఐ కొత్త కెప్టెన్ను ఎంపిక చేయనుంది.చదవండి: చిక్కుల్లో జైస్వాల్, షఫాలీ.. నిషేధం పడే అవకాశం! -
చిక్కుల్లో జైస్వాల్, షఫాలీ.. నిషేధం పడే అవకాశం!
టీమిండియా క్రికెటర్లు జైస్వాల్, షఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) భారత క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరు డోపింగ్ టెస్టుకు అందుబాటులోకి రాకపోవడంపై నాడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జైస్వాల్, షఫాలీ వర్మల పేర్లపై ‘మిస్ టెస్ట్’ నమోదు చేసింది. దీనిపై ఏడు రోజల్లోగా సమాధానమివ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఐసీసీతో పాటు బీసీసీఐకి కూడా నాడా నివేదించింది. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే ఈ ఇద్దరు క్రికెటర్లపై నిషేధం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. నాడా నిబంధనల ప్రకారం.. 'రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్స (ఆర్టీపీ)లో ఉన్న ఆటగాళ్లు తాము ఎక్కడ ఉంటున్నామో ముందే సమాచారం అందించాలి. దీనినే 'వేర్ అబౌట్ క్లాజ్' అంటారు. గతేడాది డిసెంబర్ 17న డోప్ కంట్రోల్ ఆఫీసర్ పరీక్ష కోసం వెళ్లగా, జైస్వాల్ తాను చెప్పిన చోట అందుబాటులో లేరు. అలాగే నవంబర్ 7న షెఫాలీ వర్మ కూడా తాను ఇచ్చిన అడ్రస్లో లేకపోవడంతో ఆమె టెస్ట్ కూడా మిస్ అయ్యింది. కేవలం టెస్టుకు గైర్హాజరు కావడమే కాకుండా, దీనిపై వివరణ ఇవ్వాలని నాడా పంపిన నోటీసులను కూడా వీరిద్దరూ నిర్లక్ష్యం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 18, 20 తేదీల్లో సమాధానం చెప్పాలని కోరినప్పటికీ, వీరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నాడా తాజాగా వీరిద్దరికీ నోటీసులు జారీ చేసింది.నిషేధం పడనుందా?ప్రస్తుతానికి వీరిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఎందుకంటే నాడా/వాడా నిబంధనల ప్రకారం.. ఒక ఏడాదిలో (12 నెలలు) మూడుసార్లు టెస్టుకు అందుబాటులో లేకపోతేనే దానిని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరు కేవలం ఒకసారి మాత్రమే టెస్ట్ మిస్ అయ్యారు. అయితే మరో రెండుసార్లు ఇలాగే జరిగితే మాత్రం సదరు ఆటగాళ్లపై 2 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.చదవండి: ఫిన్ అలెన్ చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా! -
ఫిన్ అలెన్ సెంచరీ.. ఢిల్లీపై కేకేఆర్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఫిన్ అలెన్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విధించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫిన్ అలెన్ (47 బంతుల్లోనే 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కామరున్ గ్రీన్ 33 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్క వికెట్ తీశాడు. అంతకముందు కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.విఫలమైన బ్యాటర్లు..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు ఈ జోడీ 4.6 ఓవర్లలో 49 పరుగులు సాధించారు. రాహుల్ ఔటైన తర్వాత నిస్సాంక ఒక ఎండ్లో నిలబడినప్పటికీ ఢిల్లీ క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన నిస్సాంక ఔటైన తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. ఆఖర్లో అశుతోశ్ శర్మ 28 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సాధించింది.ఆడుతూ పాడుతూ..143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు ఆరంభంలో దురదృష్టం వెంటాడింది. అజింక్యా రహానే రనౌట్ కాగా, అంగ్క్రిష్ రఘువంశీ వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరిగారు. ఈ ఇద్దరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరున్ గ్రీన్తో కలిసి ఫిన్ అలెన్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ ఆ తర్వాత గేర్ మార్చాడు. ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడిన అలెన్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలి 50 పరుగులకు 32 బంతులు తీసుకున్న ఫిన్ అలెన్ రెండో ఫిఫ్టీకి కేవలం 15 బంతులే తీసుకోవడం విశేషం. ఫిన్కు తోడు గ్రీన్ కూడా రెచ్చిపోవడంతో 34 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్ని అంందుకుంది. సెంచరీతో విధ్వంసం సృష్టించిన ఫిన్ అలెన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో కేకేఆర్ 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో పట్టికలో ఏడో స్థానానికి చేరుకోగా, అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ల్లో ఏడు ఓటములతో 8వ స్థానానికి పడిపోయింది.A 𝙆night of sheer dominance 🔥@KKRiders chase down the 🎯 with 34 deliveries to spare and make it 4⃣ wins on the trot 👊💜Scorecard ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR pic.twitter.com/e3cpW0J2Xq— IndianPremierLeague (@IPL) May 8, 2026చదవండి: వెంటాడిన దురదృష్టం.. పాపం రహానే, రఘువంశీ! -
వెంటాడిన దురదృష్టం.. పాపం రహానే, రఘువంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లను దురదృష్టం వెంటాడింది. కెప్టెన్ రహానేతో పాటు వన్డౌన్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ తమ తప్పు లేకున్నా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ముందుగా రహానే విషయానికొస్తే.. అప్పటికే రహానే ఒక ఫోర్, ఒక సిక్సర్తో మంచి టచ్లో కనిపించాడు. అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్ మిచెల్ స్టార్క్ వేయగా.. ఆ ఓవర్ చివరి బంతిని ఫిన్ అలెన్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టార్క్ తన చేతుల్ని అడ్డుపెట్టడంతో బంతి అతని చేతులకు తగిలి వికెట్లను గిరాటేసింది. నాన్స్ట్రైక్ఎండ్లో ఉన్న రహానే అప్పటికే క్రీజు దాటి బయటికి వచ్చేశాడు. అతను తిరిగి క్రీజులోకి చేరుకునేలోపే బంతి వికెట్లను తాకడంతో చేసేదేం లేక రనౌట్గా వెనుదిరిగాడు. అలా రహానే ఆట ముగిసింది. అక్షర్ పటేల్ వేసిన మరుసటి ఓవర్ నాలుగో బంతిని అంగ్క్రిష్ రఘువంశీ స్వీప్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి వికెట్ల మీదకు వెళ్లింది. అంగ్క్రిష్ బంతిని అడ్డుకునేలోపే వికెట్లను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో అంపైర్ రఘువంశీని క్లీన్బౌల్డ్ అయినట్లు ప్రకటించాడు. ఇలా వరుస ఓవర్లలో ఇద్దరు కేకేఆర్ టాపార్డర్ బ్యాటర్లను దురదృష్టం వెక్కిరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.𝗖𝗮𝗻 𝘆𝗼𝘂 𝗯𝗲𝗹𝗶𝗲𝘃𝗲 𝗶𝘁? 😮🎥 2⃣ of the unluckiest dismissals you will ever see in the space of 5⃣ deliveries 🫣Delight for #DC 💙Updates ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR pic.twitter.com/sScNewgsFK— IndianPremierLeague (@IPL) May 8, 2026 చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ వింత రికార్డు! -
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ వింత రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వింత రికార్డు నమోదు చేసింది. ఢిల్లీ ఇవాళ్టితో కలిపి ఆడిన ఐదు మ్యాచ్లను పరిశీలిస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒక మ్యాచ్లో భారీ స్కోరు చేస్తే మరో మ్యాచ్లో వంద పరుగుల్లోపే ఆలౌటవ్వడం ఢిల్లీకి మాత్రమే చెల్లింది. విషయంలోకి వెళితే కేకేఆర్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఒక దశలో 74 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన ఢిల్లీ మిగతా 9 వికెట్లను కేవలం 68 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. ఇక చెన్నైసూపర్కింగ్స్తో మ్యాచ్లో 155 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. ఇక రాజస్తాన్ రాయల్స్ విధించిన 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడం విశేషం. దానికి ముందు ఆర్సీబీతో మ్యాచ్లో సొంతగడ్డపై 75 పరుగులకే కుప్పకూలింది. ఇక పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలవ్వడం గమనార్హం. పంజాబ్తో మ్యాచ్లోనే కేఎల్ రాహుల్ (67 బంతుల్లో 152 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా వరుసగా ఐదు మ్యాచ్ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరికీ సాధ్యం కాని ఆటతీరుతో వింత రికార్డును మూటగట్టుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఏకైక బ్యాటర్గా -
కాలర్ పట్టుకున్న పూరన్.. కృనాల్ వివరణ!
ఐపీఎల్ 2026 సీజన్లో గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో లక్నో జట్టు డబుల్ హ్యాట్రిక్ ఓటములకు చెక్ పెట్టినట్లయింది. అయితే లక్నో ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ నికోలస్ పూరన్, ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. కృనాల్ విసిరిన బౌన్సర్ను లాంగ్ ఆన్ దిశగా ఆడి సింగిల్ తీశాడు. నాన్స్ట్రైక్ ఎండ్కు చేరుకున్న పూరన్తో కృనాల్ మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరూ సీరియస్గా ఒకరినొకరు చూసుకోవడం కనిపించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో పూరన్ కృనాల్ కాలర్ను పట్టుకొని నెట్టివేయడం కనిపించింది. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడంతో వివాదం సమసిపోయింది. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా పూరన్ తన కాలర్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందో, అసలు పూరన్తో గొడవేంటనే విషయాన్ని కృనాల్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు. ‘ఇద్దరి మధ్య గొడవేం లేదు. కేవలం మా మాధ్య ఉన్నది ప్రేమ మాత్రమే. 100 ఐపీఎల్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న నా సోదరుడు నికోలస్ పూరన్కు అభినందనలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లక్నో ఇన్నింగ్స్ సమయంలో నేను పూరన్ అడిగింది ఏంటో తెలుసా?.. ‘ నా బౌన్సర్ ఎలా ఉంది’ అని అడిగాను. అంతకుమించి మా మధ్య ఏం జరగలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వర్షం అంతరాయంతో 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ సెంచరీతో చెలరేగగా, పూరన్ (38), పంత్ (32 నాటౌట్) రాణించారు. అనంతరం 213 పరుగుల రివైజ్డ్టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులకు పరిమితమైంది. పటీదార్ (61), పడిక్కల్ (34) రాణించగా, ఆఖర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ (28 నాటౌట్), షెపర్డ్ (23 నాటౌట్) ధాటిగా ఆడినా ఆర్సీబీని గెలిపించలేకపోయారు. ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు.Things are heating up in this Revenge Week clash! 🔥A contest within the contest is brewing between #NicholasPooran and #KrunalPandya! 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #LSGvRCB | LIVE NOW 👉 https://t.co/gEprGnf2A7 pic.twitter.com/C2oqmrYF0X— Star Sports (@StarSportsIndia) May 7, 2026 Nicholas Pooran and Krunal Pandya having a friendly banter? 😳 pic.twitter.com/hyYoj2J0d7— Deepu (@deepu_drops) May 8, 2026చదవండి: శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం! -
దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య!
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అరవింద డి సిల్వా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీలంక ఎయిర్లైన్స్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తోన్న కపిల చంద్రసేన అరవింద డి సిల్వా ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. అరవింద డిసిల్వా భార్య అనుష్క డి సిల్వా, కపిల చంద్రసేన భార్య ప్రియాంక నియోమలి స్వయానా అక్కా చెల్లెల్లు కావడం గమనార్హం.విషయంలోకి వెళితే.. మే 7న (గురువారం) కపిల చంద్రసేన కొల్లుపిటియాలోని పెడ్రిస్ ప్లేస్లో ఉన్న అరవింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున అరవింద డిసిల్వా ఇంట్లోని బెడ్రూమ్లో కపిల చంద్రసేన నిర్జీవ స్థితిలో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం రిపోర్ట్లో బయటపడనుంది.ఇటీవలే చంద్రసేన విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఒక కంపెనీ నుంచి 2 మిలియన్ డాలర్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మరణించడానికి ఒక్కరోజు ముందు కొలంబో ప్రధాన న్యాయమూర్తి కపిల చంద్రసేనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దాన్ని తప్పించకునేందుకు అరవింద డిసిల్వా ఇంటికి వచ్చారా లేక వేరే కారణం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక కపిల చంద్రసేన మరణ వార్త తెలియగానే లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అరవింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శ్రీలంక క్రికెట్లో మూలస్తంభాల్లో ఒకడిగా అరవింద డిసిల్వా గుర్తింపు పొందాడు. లంక జట్టు 1996 వన్డే వరల్డ్కప్ గెలవడంలో అరవింద డిసిల్వాది కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్లోని లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 1996 ప్రపంచకప్ ఫైనల్లో చేజింగ్లో అజేయ సెంచరీతో మెరిసిన డిసిల్వా తన జట్టుకు తొలి టైటిల్ను అందించాడు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అరవింద డిసిల్వా లంక తరఫున 93 టెస్టులు, 308 వన్డే మ్యాచ్లు ఆడాడు. రెండు ఫార్మాట్లు కలిపి 15వేలకు పైగా పరుగులు సాధించిన అరవింద డిసిల్వా 31 సెంచరీలు, 86 అర్థసెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్లోనూ డిసిల్వా రెండు ఫార్మాట్లు కలిపి 135 వికెట్లు పడగొట్టాడు. 2003 వన్డే వరల్డ్కప్లో సెమీస్లో శ్రీలంక ఓటమి అనంతరం అరవింద డిసిల్వా తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు.చదవండి: ఆర్సీబీ ఓటమి.. వరుస ఓటములకు లక్నో చెక్! -
ఆర్సీబీ ఓటమి.. వరుస ఓటములకు లక్నో చెక్!
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు ఆరు వరుస ఓటములకు పుల్స్టాప్ పెట్టింది. గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. 213 పరుగుల రివైజ్డ్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్లు నష్టాపోయి 203 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ పటీదార్ (61) అర్థసెంచరీతో రాణించగా, పడిక్కల్ (34) పర్వాదలేదనిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ పాండ్యా (28 నాటౌట్) పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లతో మెరవగా, షమీ, షాబాజ్ అహ్మద్లు చెరొక వికెట్ తీశారు.అంతకముందు లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. పూరన్ (29) రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాదన్ ఇన్నింగ్స్తో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, రసిక్ సలామ్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. కాగా లక్నో ఆరు వరుస ఓటముల తర్వాత గెలుపును అందుకోవడం విశేషం. -
కంగ్రాట్స్ సూర్యా భాయ్.. తండ్రిగా ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి భార్య దేవీషా షెట్టీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త తెలియడంతో, కుటుంబంతో సమయం గడిపేందుకు సూర్య జట్టుకు దూరమయ్యాడు. దీంతో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన కీలక మ్యాచ్కు అతడి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. బిడ్డ పుట్టిన కారణంగా, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి సూర్య ఈ వారం జట్టుతో కలిసి రాయ్పూర్కు ప్రయాణించలేదు. 2016లో వివాహం చేసుకున్న సూర్య-దేవీషా జంట, తమ కుమార్తె రాకతో ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సూర్యకుమార్ దంపతులకు అభిమానులు కంగ్రాట్స్ తెలిపారు. ‘ కంగ్రాట్స్ సూర్యా భాయ్’ అని కామెంట్లు పెడుతున్నారు.సూర్య క్రికెట్ ప్రయాణంలో దేవీషా నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభ సందర్భంలో క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ను కెప్టెన్సీ సమస్య వెంటాడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో గత మ్యాచ్లో (లక్నో సూపర్జెయింట్స్పై) సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడం, సూర్య కుటుంబ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ఆర్సీబీతో మ్యాచ్కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశముంది. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) చదవండి: తొలి క్రికెటర్గా మిచెల్ మార్ష్! -
తొలి క్రికెటర్గా మిచెల్ మార్ష్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తద్వారా లక్నో తరఫున ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి క్రికెటర్గా మిచెల్ మార్ష్ అరుదైన ఘనత సాధించాడు. రొమారియో షెపర్డ్ వేసిన యార్కర్ బంతిని బౌండరీ తరలించడం ద్వారా ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే గతంలో లక్నో తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రిషబ్ పంత్ పేరిట ఉంది. గతేడాది ఇదే స్టేడియంలో ఆర్సీబీపైనే పంత్ 54 బంతుల్లో శతకం సాధించాడు. తాజాగా పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్ ఫాస్టెస్ట్ సెంచరీతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్గా మార్ష్కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. తొలి సెంచరీ కూడా లక్నో తరఫునే సాధించాడు. గతేడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సెంచరీ సాధించిన మార్ష్ 64 బంతుల్లో 117 పరుగులు సాధించాడు. ఇక లక్నో తరఫున రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. డికాక్, స్టోయినిస్, పంత్లు తలా ఒక సెంచరీ బాదారు.Crunched, clobbered, Celebrations 💯🎥 Mitchell Marsh brings up a 𝘀𝗶𝘇𝘇𝗹𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 in some style 🔥🫡Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/xQxi3buH6j— IndianPremierLeague (@IPL) May 7, 2026చదవండి: ‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్పై సంచలన ఆరోపణలు! -
‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్పై సంచలన ఆరోపణలు!
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై భారత మాజీ క్రికెటర్ అతుల్ వస్సన్ సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్ దూకుడు స్వభావం, అతడి కఠిన వైఖరితో జట్టులోని కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నాడు. అయితే వస్సన్ ఆ ఆటగాళ్ల పేర్లను వెల్లడించడానికి నిరాకరించాడు. అతుల్ వస్సన్ మాట్లాడుతూ.. 'గంభీర్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. గంభీర్ ఎప్పుడూ తాను చెప్పిందే జరగాలి, ఇంకేమీ చేయకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు. మొదటి నుంచి గంభీర్ స్వభావం అలాగే ఉంటుంది. ధనిక కుటుంబం నుంచి వచ్చినప్పటికీ గంభీర్ ఆటలో మంచి టెక్నిక్ ఉండడంతో పాటు మంచి తెలివిమంతుడు. అయితే అతనికి ఉండే ఈగో వేరే లెవెల్లో ఉంటుంది. అదెలా అంటే అతను ఏదైనా అనుకుంటే అవతలి వ్యక్తుల కూడా తనకు మద్దతు ఇవ్వాల్సిందే అన్నంత కఠినంగా ఉండేవాడు. ఆ కఠినత్వం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాకా కూడా గంభీర్లో అలాగే కొనసాగడం ఆటగాళ్లతో గొడవలు పడేలా చేసింది. అందుకే ఐపీఎల్లో కోహ్లీతో ఢీ అంటే ఢీ అన్నాడు. ఇక భారత జట్టుకు ప్రధాన కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అతడి కఠినత్వ వైఖరి పట్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తితోనే ఉన్నారు. వారి పేర్లు చెప్పడం నాకిష్టం లేదు. కానీ వాళ్లు మాత్రం గంభీర్ ప్రవర్తనతో కచ్చితంగా సంతోషంగా లేరని చెప్పగలను.'అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తరఫున అతుల్ వస్సన్ 4 టెస్టు మ్యాచ్ల్లో 10 వికెట్లు, 9 వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: భువనేశ్వర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్గా! -
భువనేశ్వర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్గా!
ఐపీఎల్ 2026 సీజన్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లక్నోతో మ్యాచ్లో అరుదైన రికార్డు సాధించాడు. లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ భువనేశ్వర్కు 200వ మ్యాచ్ కావడం విశేషం. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి పేసర్గా భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 200 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ 12 మంది భారత ఆటగాళ్లే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇక భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఐపీఎల్లో 199 మ్యాచ్ల్లో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరఫున 10 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో లీడింగ్లో ఉన్నాడు. 2011లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన భువనేశ్వర్ తొలుత పుణే వారియర్స్ (2011-2013 వరకు) 26 మ్యాచ్లు, ఎస్ఆర్హెచ్ (2014-2024 వరకు) 129 మ్యాచ్లు, ఆర్సీబీ (2025 నుంచి) 44 మ్యాచ్లు ఆడాడు.అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితా..మహేంద్ర సింగ్ ధోని: 278 మ్యాచ్లు (2008-2025)రోహిత్ శర్మ: 277 మ్యాచ్లు (2008-2026)విరాట్ కోహ్లీ: 276 మ్యాచ్లు (2008-2026)రవీంద్ర జడేజా: 264 మ్యాచ్లు (2008-2026)దినేష్ కార్తీక్: 257 మ్యాచ్లు (2008-2024)శిఖర్ ధావన్: 222 మ్యాచ్లు (2008-2024)రవిచంద్రన్ అశ్విన్: 221 మ్యాచ్లు (2009-2025)అజింక్య రహానే: 207 మ్యాచ్లు (2008-2026)సురేష్ రైనా: 205 మ్యాచ్లు (2008-2021)రాబిన్ ఊతప్ప: 205 మ్యాచ్లు (2008-2022)అంబటి రాయుడు: 204 మ్యాచ్లు (2010-2023)భువనేశ్వర్ కుమార్: 200 మ్యాచ్లు (2011-2026)చదవండి: దొరికిపోయిన చాహల్.. పంజాబ్ జట్టుకు శిక్ష తప్పదా? -
IPL 2026: ఆర్సీబీపై లక్నో విజయం
గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. 213 పరుగుల రివైజ్డ్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టాపోయి 203 పరుగులకు పరిమితమైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.టిమ్ డేవిడ్ ఔట్.. ఆరో వికెట్ డౌన్ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (40) ఔట్ కావడంతో ఆర్సీబీ 158 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 21 బంతుల్లో 55 పరుగులు అవసరం.ఒకే ఓవర్లు రెండు వికెట్లు తీసిన ప్రిన్స్ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఓవర్ తొలి బంతికి పడిక్కల్ (34)ను పెవిలియన్ చేర్చిన ప్రిన్స్ ఐదో బంతికి జితేశ్ శర్మను ఔట్ చేశాడు. దీంతో ఆర్సీబీ 107 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 48 బంతుల్లో 106 పరుగులు అవసరం.పటీదార్ ఫిఫ్టీ.. వంద దాటిన ఆర్సీబీ213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ (60) అర్థసెంచరీ సాధించగా, పడిక్కల్ 34 పరుగులతో ఆడుతున్నాడు.7 ఓవర్లలో ఆర్సీబీ 60/2ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. పడిక్కల్ (26), పటీదార్ (25) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ జాకబ్ బెథెల్ 4 పరుగులు చేసి షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది.ఆర్సీబీ టార్గెట్ 213 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. పూరన్ (29) రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాదన్ ఇన్నింగ్స్తో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, రసిక్ సలామ్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. మ్యాచ్కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 19 ఓవర్లకు కుదించి ఆర్సీబీ ముందు 213 పరుగుల రివైజ్డ్ టార్గెట్ నిర్దేశించింది.రెండో వికెట్ కోల్పోయిన లక్నో111 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హాజిల్వుడ్ బౌలింగ్లో బెతెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో లక్నో 165 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.లక్నో, ఆర్సీబీ మ్యాచ్కు వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం లక్నో సూపర్జెయింట్స్ 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 165 పరుగులు చేసింది. మార్ష్ (111), పూరన్ (29) పరుగులతో ఆడుతున్నారు.మిచెల్ మార్ష్ సెంచరీ.. లక్నో 139/1ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ సెంచరీతో మెరిశాడు. 49 బంతుల్లోనే శతకం మార్క్ అందుకున్న మార్ష్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. పూరన్ 14 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన లక్నోవర్షం అంతరాయం తర్వాత మొదలైన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అర్షిన్ కులకర్ణి కృనాల్ పాండ్యా బౌలింగ్లో పటీదార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. వరుణుడి అడ్డంకి ఆటకు వరుణుడు అడ్డంకి కలిగించాడు. 9 ఓవర్ల నాటికి లక్నో స్కోరు వికెట్ నష్టపోకుండా 95గా ఉంది. మిచెల్ మార్ష్ అర్థ సెంచరీ బాదాడు. మిచెల్ మార్ష్ 76, అర్షిన్ కులకర్ణి 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచుతున్న మిచెల్ మార్ష్లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ దంచికొడుతున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (46), అర్షిన్ కులకర్ణి (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లలో లక్నో 39/04 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (30), అర్షిన్ కులకర్ణి (8) పరుగులతో ఆడుతున్నారు.మ్యాచ్కు వర్షం అంతరాయంలక్నో, ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం పడే సమయానికి లక్నో 1.3 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 12 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (7), అర్షిన్ కులకర్ణి (4) పరుగులతో ఆడుతున్నారు.టాస్ నెగ్గిన ఆర్సీబీటాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టు ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు లక్నో జట్టు మాత్రం మూడు మార్పులతో ఆడుతోంది. జోస్ ఇంగ్లిస్ స్థానంలో అర్షిల్ కులకర్ణి, మనిరమన్ స్థానంలో షాబాజ్ అహ్మద్, మోసిన్ ఖాన్ స్థానంలో దిగ్వేష్ రాఠీ జట్టులోకి వచ్చారు.ముఖాముఖి పోరులో ఇరజట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ ఐదు సార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. ఏక్నా స్టేడియంలో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం విశేషం. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో లక్నో సూపర్ జె యింట్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.తుది జట్లు:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్, జోష్ హేజిల్వుడ్.లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @LucknowIPL in Lucknow.Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB pic.twitter.com/Z5DSxyelwt— IndianPremierLeague (@IPL) May 7, 2026 -
దొరికిపోయిన చాహల్.. పంజాబ్ జట్టుకు శిక్ష తప్పదా?
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన చర్యతో పంజాబ్ కింగ్స్ జట్టు మొత్తాన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ ప్రయాణం చేస్తున్న విమానంలో చాహల్..వేప్( ఈ-సిగరేట్) తాగిన వీడియో ఫుటేజీ బయటికి వచ్చింది. వీడియోలో చాహల్ వేప్ను పీల్చుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు ముందు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ సహచర క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒక వ్లాగ్ గా దర్శనమిచ్చింది. అయితే అసలు వ్లాగ్లోని వీడియోలో చాలా ఫుటేజీని ఎడిట్ చేసి కుదించినట్లు ఇన్స్టా ఖాతాదారులు పేర్కొన్నారు. అసలు వీడియోలో చాహల్ ఒక్కడే కాకుండా అతడి పక్కన ఉన్న శశాంక్ సింగ్, ఇతర పంజాబ్ ప్లేయర్లు కూడా ఈ-సిగరేట్ తాగే అవకాశం లేకపోలేదని కామెంట్లు చేశారు. అయితే విమాన ప్రయాణంలో సిగరేట్ (ఈ-సిగరెట్ అయినా) తాగడం నిషేధం. సిగరేట్ పొగ వల్ల ప్రమాదం జరిగేందుకు ఆస్కారముంది. చాహల్ ప్రవర్తన విమాన భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లోనే పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్రూమ్లో వేప్ను ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. దీనిపై పెద్ద వివాదం నెలకొంది. అయితే బీసీసీఐ మాత్రం పరాగ్ను మందలిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో సరిపెట్టింది. కానీ ఈసారి చాహల్ వేప్ ఉపయోగించినట్లు తేలితే మాత్రం అతడితో పాటు పంజాబ్ జట్టు మొత్తానికి శిక్ష పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చాహల్తో పాటు పంజాబ్ జట్టు మొత్తం అదే విమానంలో ఉండడం గమనార్హం.చాహల్ చర్య నిజమని తేలితే ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై చాహల్ నుంచి కానీ, అటు పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం కానీ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వీడియో నకిలీదా లేక నిజమైనదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అదరగొడుతోంది. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్లోనూ ఓడిన పంజాబ్ రెండో అంచె పోటీల్లో హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. బుధవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 236 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో పంజాబ్ చతికిలపడింది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. Look at Yuzvendra Chahal, man. He was risking everyone’s safety by vaping an e-cigarette inside the flight while Shashank Singh and other Punjab Kings players were around him. 👀This is totally unacceptable and highly risky for everyone. Such behavior violates flight safety… pic.twitter.com/YnXlPmPhjr— Sonu (@Cricket_live247) May 7, 2026చదవండి: కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఆఫర్! -
కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఆఫర్!
ఆస్ట్రేలియా క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్గా ఉన్న కమిన్స్ను ప్రైవేటు లీగ్లు ఆడకుండా జట్టుతోనే ఎక్కువగా అట్టిపెట్టుకోవాలని భావిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి మూడేళ్ల కాలానికి గాను 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 113 కోట్లు) అందించనుంది. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొంది. ఈ ఆఫర్కు కమిన్స్ ఓకే చెబితే మాత్రం ఏడాదికి 4 మిలియన్ డాలర్ల చొప్పున అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడడం మానేసి గ్లోబల్ టీ20 లీగ్ల్లో తమకు ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ కమిన్స్కు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.62.22కోట్లు) ఆఫర్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం కమిన్స్ ఆడే మ్యాచ్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం అందుతుంది. ప్రస్తుతం ప్రపం చవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్ల (ముఖ్యంగా బిగ్బాష్, ఐపీఎల్, ఎంఎల్సీ) హవా పెరిగిపోవడంతో, టాప్ క్లాస్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.ముఖ్యంగా ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్ను ఇతర లీగ్ల వైపు వెళ్లకుండా, కేవలం జాతీయ జట్టు అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మెగా డీల్ను రూపొందించినట్లు తెలుస్తోంది.ఇదే విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్ ఆల్సోప్ స్పందించారు. ‘కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను కాపాడుకోవడం మాకు అవసరం. మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) ఆడే పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ వంటి స్టార్లకు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే వారిని ఇతర క్రికెట్ లీగ్లవైపు ఆకర్షణకు గురవ్వకుండా ఆస్ట్రేలియా క్రికెట్కు కట్టుబడి ఉండేలా చూడటం మా ప్రధాన లక్ష్యం’ అని వివరించారు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పాట్ కమిన్స్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్కు లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కమిన్స్ తన విలువను చూపిస్తున్నాడు. సీజన్లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కమిన్స్ రెండు కీలక వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్పై విజయంతో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టేబుల్ టాపర్గా నిలిచింది. చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్ను శ్రేయస్ సాధిస్తాడు’ -
ప్రతీకార విజయం.. టేబుల్ టాపర్గా ఎస్ఆర్హెచ్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పంజాబ్ కింగ్స్పై ప్రతీకార విజయం సాధించింది. బుధవారం సొంతగడ్డపై పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్లు చెరో రెండు వికెట్లు తీయగా, నితీశ్కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.ఇషాన్, క్లాసెన్ మెరుపులుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు అభిషేక్, హెడ్లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 54 పరుగులు జోడించారు. అనంతరం వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్కు క్లాసెన్ తోడవ్వడంతో ఎస్ఆర్హెచ్ పరుగుల వరద పారింది. 55 పరుగులు చేసి ఇషాన్ ఔటైనా చివర్లో క్లాసెన్, నితీశ్రెడ్డిలు ధాటిగా ఆడడంతో ఎస్ఆర్హెచ్ 230 ప్లస్ స్కోరు సాధించింది.కొంపముంచిన టాపార్డర్..భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రబ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్యలు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, ఫామ్లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 5 పరుగులు చేసి ఔటవ్వడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్ కన్నోలి, స్టోయినిస్లు కాసేపు వికెట్లు పతనం అడ్డుకున్నారు. స్టోయినిస్, సూర్యాంశ్ ఔటైనప్పటికీ కూపర్ కన్నోలీ ఆఖరిదాకా నిలిచి అజేయ సెంచరీతో రాణించినప్పటికీ లాభం లేకపోయింది.పట్టికలో ఫస్ట్ ప్లేస్కుఇది ఎస్ఆర్హెచ్కు ఏడో విజయం కాగా.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలు, మూడు ఓటమలు కలిపి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.A win that takes the team to the 𝘁𝗼𝗽 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘁𝗮𝗯𝗹𝗲 🧡A comfortable 33-run victory at home that takes @Sunrisers to not just 2️⃣ more points but the first spot on the points table 👊🔥SCORECARD ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS pic.twitter.com/gjgBIMUhG0— IndianPremierLeague (@IPL) May 6, 2026 -
ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్, హెడ్లు శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ కుమార్లు మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఇక ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జంట ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఈ సీజన్లో అభిషేక్, ట్రావిస్ హెడ్ జంట 627 పరుగులు సాధించింది. పంజాబ్తో మ్యాచ్లో తొలి వికెట్కు ఈ జంట 54 పరుగులు జోడించడం ద్వారా 600 ప్లస్ మార్కును దాటింది. తద్వారా ఒక సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన జోడీగా అభిషేక్-హెడ్ నిలిచారు. రెండో స్థానంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ (457 పరుగులు), గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్మన్ గిల్-సాయి సుదర్శన్ జంట (402 పరుగులు) సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.More than 600 runs as a pair when no one else has gone past 500 😲Abhishek Sharma and Travis Head miles ahead of everyone else 👏#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/MAw6RNVxem— IndianPremierLeague (@IPL) May 6, 2026Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026 -
రికార్డులు బద్దలు కొట్టిన క్లాసెన్
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. పంజాబ్తో మ్యాచ్లో 43 బంతుల్లో 69 పరుగులు సాధించిన క్లాసెన్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో క్లాసెన్ చోటు సంపాదించాడు.ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెస్కు ఇది 14వ అర్థశతకం కాగా.. అభిషేక్ శర్మతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. 18 హాఫ్ సెంచరీలతో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, 19 అర్థశతకాలతో శిఖర్ దావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మొదటి స్థానంలో డేవిడ్ వార్నర్ 42 అర్థశతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.అంతేకాదు క్లాసెన్ ఈ మ్యాచ్ ద్వారా మరో రికార్డు కూడా సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటి దాకా 5 హాఫ్ సెంచరీలు బాది తొలి స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ప్రబ్సిమ్రన్, అయ్యర్లు నాలుగు హాఫ్ సెంచరీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.Finishing the innings with finesse 🤌🎥 Some delightful shots in the final over from Heinrich Klaasen to finish 69 (43) 👏👏Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/jbmQ02eo0h— IndianPremierLeague (@IPL) May 6, 2026 చదవండి: పంజాబ్ అంటేనే అభిషేక్కు పూనకం! -
పంజాబ్ అంటేనే అభిషేక్కు పూనకం!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి చెలరేగింది. తొలి అంచె పోటీలో అభిషేక్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు సాధించినప్పటికీ ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితే రెండో అంచె పోటీలో భాగంగా సొంతగడ్డపై ఎలాగైనా పంజాబ్పై పైచేయి సాధించాలని భావిస్తున్న ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్తో మ్యాచ్లో మరోసారి చెలరేగాడు. పంజాబ్తో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నాడు. మ్యాచ్లో ఎక్కువ సేపు నిలవనప్పటికీ ఉన్నంత సేపు అభిషేక్ (13 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దడదడలాడించాడు. 👉 ఈ నేపథ్యంలో పంజాబ్పై గత నాలుగు మ్యాచ్ల్లోనూ అభిషేక్ పరుగుల వరద పారించాడు. అభిషేక్ వరుసగా 66, 141, 74, 35 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్పై 200 ప్లస్ స్కోరు సాధించడం ఎస్ఆర్హెచ్కు ఇది ఎనిమిదోసారి. 👉ముంబై ఇండియన్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్పై ఎనిమిది సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 17 సిక్సర్లు కొట్టింది. ఐపీఎల్లో పంజాబ్తో మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ అత్యధిక సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.👉 ఇక ఐపీఎల్లో 220 ప్లస్ స్కోరు చేయడం ఎస్ఆర్హెచ్కు ఇది పదోసారి. అయితే ఈ పదిసార్లు ఎస్ఆర్హెచ్నే విజయం వరించడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్ను శ్రేయస్ సాధిస్తాడు’ -
‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్ను శ్రేయస్ సాధిస్తాడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్లు విజయవంతమైన కెప్టెన్లుగా ముద్రపడ్డారు. ఇందులో ధోని, రోహిత్లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సారథ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి సరసన చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిద్ధమవుతున్నాడు. 2024లో కేకేఆర్కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయస్ లక్కీ కెప్టెన్గా మారిపోయాడు. జట్లు మారినప్పటికీ తన కెప్టెన్సీ, ఆటతీరుతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా అయ్యర్ పేరు సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ను అయ్యర్ విజేతగా నిలబెడితే ధోని, రోహిత్ శర్మను కూడా అధిగమిస్తాడని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జియో హాట్స్టార్కు ఇంటర్య్వూ ఇచ్చిన పఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్, గంభీర్ వంటి అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్లను దాటుకొని మరీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్, గంభీర్లు ఒకే జట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్యర్ మాత్రం ఇప్పటికే కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జట్లకు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్గా అయ్యర్ నిలవనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జట్లను కూడా ఐపీఎల్లో ఫైనల్ చేర్చిన ఘనత అయ్యర్ సొంతం. ఒకవేళ అయ్యర్ ఈ సీజన్లో అది సాధిస్తే మాత్రం అతడి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని పఠాన్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న అయ్యర్ 2020 సీజన్లో ఆ జట్టును రన్నరప్గా నిలిపాడు. ఆ తర్వాత కేకేఆర్కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్లో ఆ జట్టును చాంపియన్గా నిలిపాడు. 2025 సీజన్లో పంజాబ్ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్లోనూ ఆ జట్టును టైటిల్ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.చదవండి: ‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ!’ -
IPL 2026: పంజాబ్పై ఎస్ఆర్హెచ్ గెలుపు
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్లు రెండు వికెట్లు తీయగా.. నితీశ్కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సూర్యాంశ్ కమిన్స్ బౌలింగ్లో అభిషేక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 114 పరుగులుచేసింది.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో పంజాబ్ కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ శివాంగ్ కుమార్ బౌలింగ్లో కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.శ్రేయస్ (5) ఔట్.. మూడో వికెట్ డౌన్భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 5 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇషాన్ మలింగ బౌలింగ్లో ఔట్ అవ్వడంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.పంజాబ్కు షాక్.. ఓపెనర్లిద్దరు ఔట్236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కమిన్స్ బౌలింగ్లో ఒక్క పరుగు చేసిన ప్రియాన్ష్ ఆర్య మలింగకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ తొలి బంతికే నితీశ్ కుమార్ బౌలింగ్ ప్రబ్సిమ్రన్ (3) ఔట్ అయ్యాడు.పంజాబ్ టార్గెట్ 236 పరుగులుఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు.అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.క్లాసెన్ అర్థసెంచరీ.. ఎస్ఆర్హెచ్ 212-3పంజాబ్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్లాసెన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. నితీశ్కుమార్ (26) పరుగులతో ఆడుతున్నాడు.అర్ధ శతకం బాది ఇషాన్ ఔట్ ఇషాన్ కిషన్ అర్ధ శతకం బాది ఔటయ్యాడు. 32 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు. స్కోరు 174-3 (15 ఓవర్లలో)గా ఉంది.9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 107-2పంజాబ్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 8వ ఓవర్లో వంద పరుగుల మార్క్ను దాటింది. 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇషాన్ (17), క్లాసెన్ (14) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్పంజాబ్తో మ్యాచ్లో ధాటిగా ఆడుతున్న హెడ్ (38) చాహల్ బౌలింగ్లో మార్కో జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.దంచికొడుతున్న హెడ్6 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (35) పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఇషాన్ కిషన్ (7) పరుగులతో ఆడుతున్నాడు.అభిషేక్ శర్మ (35) ఔట్పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతుల్లో 35 పరుగులతో దూకుడు ప్రదర్శించిన అభిషేక్ శర్మ ఫెర్గూసన్ బౌలింగ్లో అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.టాస్ పంజాబ్దేటాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. ఎస్ఆర్హెచ్ జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వగా.. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఎస్ఆర్హెచ్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఎస్ఆర్హెచ్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 25 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 17 సార్లు, పంజాబ్ 8 సార్లు నెగ్గింది. ఇక హైదరాబాద్లో పంజాబ్తో ఆడిన 10 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 9 సార్లు నెగ్గితే.. పంజాబ్ ఒకసారి మాత్రమే గెలిచింది.తుదిజట్లు:పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రియాంష్ ఆర్య, హర్ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్సన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్లు: అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్ -
సంజూ విధ్వంసం.. సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. స్టబ్స్ (38), సమీర్ రిజ్వీ (40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్లు తలా ఒక వికెట్ తీశారు. కాగా టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.సీఎస్కే ఆడుతూ పాడుతూ..156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగింది. కెప్టెన్ రుతురాజ్, వన్డౌన్లో వచ్చిన ఉర్విల్ పటేల్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ మరో ఎండ్లో ఓపెనర్ సంజూ శాంసన్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు శాంసన్కు జత కలిసిన కార్తిక్ శర్మ తోడయ్యాడు. ఈ ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లు బాది సీఎస్కేకు విజయాన్ని కట్టబెట్టారు. శాంసన్ సునామీ ఇన్నింగ్స్తో అలరిస్తే.. కార్తిక్ తన హిట్టింగ్ను ఢిల్లీ బౌలర్లకు రుచి చూపించాడు. ఈ సీజన్లో సీఎస్కేకు ఇది ఐదో విజయం కాగా పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 10 మ్యాచ్ల్లో 4 విజయాలు, ఆరు ఓటములతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. -
బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు!
క్రికెట్లో ఒకప్పుడు బ్యాటర్లకు భయం పుట్టించిన యార్కర్లు ఇప్పుడు కనిపించడం లేదు. చేజింగ్ సమయంలో బ్యాటింగ్ చేసే జట్టులో ఆందోళన పెరిగి, సమీకరణం ఉత్కంఠభరితంగా మారినప్పుడు, ఆయా కెప్టెన్లు ఒక బంతినే నమ్ముకునేవారు. అదే సంప్రదాయ యార్కర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మలింగ, బుమ్రా లాంటి యార్కర్ల స్పెషలిస్టులు విసిరే యార్కర్లకు బ్యాటర్లకు ఫ్యూజులు ఎగిరేవి. ఐపీఎల్లోనూ యార్కర్లకు స్వర్ణయుగం నడిచింది. ఆఖరి బంతి దాకా విజయం దోబుచులాడే టీ20 క్రికెట్లో ఇటీవలే కాలంలో మ్యాచ్లన్నీ వన్సైడ్గా మారిపోవడం చూస్తున్నాం. ఐపీఎల్లోనూ ఈ తరహా మ్యాచ్లు ఎక్కువైపోయాయి. ఐపీఎల్ 2026 సీజన్లోనూ అన్ని జట్లు 200 పరుగుల టార్గెట్ను అవలీలగా ఛేదించేస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో యార్కర్ బంతులు కనిపించకపోవడంతో అటు డ్రెస్సింగ్ రూమ్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఒకటే చర్చ జరుగుతుంది. అదేంటంటే ఒకప్పుడు భయం పుట్టించిన యార్కర్లకు క్రమంగా కనుమరుగవుతున్నాయా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజానికి ఈ సీజన్లో ముంబై తరఫున ఆడుతున్న బుమ్రా కావొచ్చు.. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న నటరాజన్ వీరంతా యార్కర్ల స్పెషలిస్టులే. కానీ ఈ సీజన్లో ఒక్కసారి కూడా వీరు తమ యార్కర్లతో ప్రభావం చూపలేకపోయారు.బ్యాటర్లు ఫినిషింగ్ను ఒక శాస్త్రంగా మార్చుకోవడంతో, గత కొన్నేళ్లుగా డెత్ ఓవర్లలో పరుగుల రేట్లు క్రమంగా పెరిగాయి. వారు బంతి కదలికను, ముందుచూపును ఉపయోగించి చిన్నపాటి పొరపాట్లను కూడా బౌండరీలుగా మారుస్తున్నారు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్లో డెత్ ఓవర్ల (17వ నుండి 20వ ఓవర్ల వరకు) సగటు రన్ రేట్ 9.41గా ఉండగా, అది క్రమంగా పెరిగి 2025 నాటికి 11.5కు చేరుకుంది. అదేవిధంగా, జట్టు సగటు స్కోరు 2008లో 157 నుండి 2025 నాటికి 180కి పెరిగింది.2023లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టడం కూడా స్లాగ్ ఓవర్లలో యార్కర్కు ప్రాధాన్యత తగ్గడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే ఇంపాక్ట్ నిబంధనపై కూడా సీనియర్ క్రికెటర్లు, బౌలర్లు వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఒకప్పుడు యార్కర్లు బ్యాటర్లు బెంబెలెత్తించాయి. కానీ ఇప్పుడు అదే యార్కర్లు కనిపించకుండా పోతున్నాయి.చదవండి: బెదిరింపులకు దిగిన టెన్నిస్ స్టార్! -
ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్ సాధించింది. సీఎస్కేతో మ్యాచ్లో బ్యాటింగ్లో ఢిల్లీ టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ఏ ఒక్కరు కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్లో టాప్-4 బ్యాటర్లు రెండంకెల స్కోరు అందుకున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరు 20 పరుగుల మార్క్ను దాటకపోవడం గమనార్హం.నిస్సాంక (19), రాహుల్ (12), నితీశ్రానా (15), కరుణ్ నాయర్ (13).. ఈ నలుగురు 20 పరుగుల్లోపే ఔటయ్యారు. ఇలా ఒక మ్యాచ్లో టాప్ నలుగురు బ్యాటర్లు డబుల్ డిజిట్ మార్క్ను అందుకున్నప్పటికీ 20 పరుగులు దాటకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. మొదటిసారి కూడా ఈ ఫీట్ను సాధించింది ఢిల్లీ జట్టే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. 2011లో కొచ్చి టస్కర్స్తో మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున టాప్ నలుగుల బ్యాటర్లు సెహ్వాగ్ (15), వార్నర్ (13), నమన్ ఓజా (13), యోగేశ్ నగర్ (18) 20 పరుగుల మార్క్ దాటకుండానే ఔటయ్యారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కేతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (40 నాటౌట్), స్టబ్స్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్లు తలా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చదవండి: తృణముల్ చాప్టర్ ముగిసింది: మాజీ క్రికెటర్ -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విజయం దిశగా సీఎస్కేఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే విజయం దిశగా కొనసాగుతోంది. 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శాంసన్ (84), కార్తిక్ శర్మ (23) పరుగులతో క్రీజులో ఉన్నారు. శాంసన్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే 96/2ఢిల్లీతో మ్యాచ్లో సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 32 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న శాంసన్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్కే 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే8 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. శాంసన్ (22), కార్తిక్ శర్మ (5) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 17 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ అక్షర్ పటేల్ బౌలింగ్లో వెనుదిరగడంతో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది.రుతురాజ్ ఔట్..ఆరు పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎన్గిడి బౌలింగ్లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సీఎస్కే 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. శాంసన్ (10), గైక్వాడ్ (6) పరుగులతో ఆడుతున్నారు.సీఎస్కే టార్గెట్ 156 పరుగులుసీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (40 నాటౌట్), స్టబ్స్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్లు తలా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (30), సమీర్ రిజ్వీ (16) పరుగులతో ఆడుతున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీసీఎస్కేతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ల పరంపర కొనసాగుతోంది. 2 పరుగులు చేసిన కెప్టెన్ అక్షర్ పటేల్ గుర్జ్ప్నీత్ సింగ్ బౌలింగ్లో అకిల్ హొసేన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (4), ట్రిస్టన్ స్టబ్స్ (12) పరుగులతో ఆడుతున్నారు.4 వికెట్లు డౌన్నితీశ్ రాణా, కరుణ్ నాయర్ ఔటయ్యారు. నితీశ్ రాణా 15 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్లో కార్తీక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 13 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్లో గుర్జప్నీత్ సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కేఎల్ రాహుల్ ఔట్..12 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ అకిల్ హొసేన్ బౌలింగ్లో వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది.తొలి వికెట్ డౌన్సీఎస్కేతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక ముకేశ్ చౌదరీ బౌలింగ్లో బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రాహుల్ (10) క్రీజులో ఉన్నాడు.టాస్ నెగ్గిన ఢిల్లీ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కైల్ జేమీసన్ స్థానంలో లుంగి ఎన్గిడి జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్కే రెండు మార్పులు చేసింది. అకిల్ హొసేన్, గుర్జప్నీత్ సింగ్ జట్టులోకి వచ్చారు. సీజన్ తొలి అంచె పోటీలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయాన్ని అందుకుంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంతగడ్డపై చెన్నైని ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో మాత్రం చెన్నై సూపర్కింగ్స్దే పైచేయి. 32 మ్యాచ్ల్లో 20 సార్లు సీఎస్కే, 12 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. 2022 నుంచి చూసుకుంటే సీఎస్కే నాలుగుసార్లు నెగ్గితే, ఢిల్లీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, లుంగీ ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్. -
చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజస్తాన్ రాయల్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రాంచైజీగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు ఇటీవలే చేతులు మారిన సంగతి తెలిసిందే. ఆదివారం లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే కొనుగోలు మురిపెం తీరకుండానే రాజస్తాన్ రాయల్స్ చిక్కుల్లో పడింది. తెర ముందు డీల్ ముగిసినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది. రాజస్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు దాదాపు అదే ధరకు చర్చలు జరిపిన అమెరికాకు చెందిన కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం, ఇప్పుడు ఈ ఒప్పందంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. తమ చేతుల్లోకి రావాల్సిన డీల్ చివరి నిమిషంలో చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కల్ సోమని బృందం ఇప్పటికే తమ న్యాయ, పబ్లిక్ రిలేషన్స్ బృందాలతో చర్చలు జరిపింది. ‘ఈ ఉదయం అమెరికాలోని మా లీగల్ టీమ్తో మాట్లాడాము. ఇవాళే దీనిపై అధికారికంగా లీగల్ నోటీసు పంపబోతున్నాము’ అని కల్ సోమని బృందం వెల్లడించింది. పరిస్థితిని బట్టి తాము ఎంత బహిరంగంగా ముందుకు వెళ్లాలనేది త్వరలోనే నిర్ణయించుకుంటామని తెలిపారు. ఈ వివాదం ముదిరితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకునే అవకాశముంది.మిట్టల్ గ్రూప్ కంటే ముందు కల్ సోమని గ్రూప్తో కుదరాల్సిన డీల్ ఆగిపోవడం వెనుక సకాలంలో సోమని బృందం చెల్లింపులు చేయలేకపోవడమే కారణమని తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను సోమని బృందం కొట్టిపారేసింది. తమ వెనుక రాబ్ వాల్టన్, హాంప్ ఫ్యామిలీ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఉన్నారని, నిధులు తమకు ఎప్పుడూ సమస్య కాదని వారు స్పష్టం చేశారు. మరి ఈ సమస్య ఎలా కొలిక్కి వస్తుందన్నది చూడాలి.ఐపీఎల్ 2026 సీజన్ తొలి అంచె పోటీల్లో వరుస విజయాలతో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో చతికిలపడుతోంది. ప్రస్తుతం 10 మ్యాచ్లాడిన రాజస్తాన్ 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో మూడింట గెలిస్తే రాజస్తాన్ ప్లేఆఫ్ బెర్తు దక్కించుకుంటుంది. మే 1న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి చవిచూసిన రాజస్తాన్ తమ తర్వాతి మ్యాచ్ మే 9న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది. ఆ తర్వాత మే 17న ఢిల్లీ క్యాపిటల్స్తో, మే 19న లక్నోతో, మే 24న ముంబైతో ఆడాల్సి ఉంది.చదవండి: బాంబు పేల్చిన కేఎల్ రాహుల్! -
బీసీసీఐపై కేఎల్ రాహుల్ ఆగ్రహం!
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బాంబు పేల్చాడు. టీ20 క్రికెట్లో తనకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండేవి కావని తెలిపాడు. బీసీసీఐ తనను టీ20 క్రికెట్లో ఎప్పుడూ ఆటగాడిగా పరిగణించలేదని, కేవలం ఒక టెస్టు ప్లేయర్గానే తనపై ముద్ర వేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్కు చెందిన సూపర్స్టార్స్ షోలో కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ‘పదేళ్ల క్రితం టీ20 జట్టులో భాగం కావడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ నన్ను ఎప్పుడూ ఒక టీ20 ఆటగాడిగా పరిగణించలేదు. కనీసం ఒక మంచి వైట్బాల్ ఆటగాడిగా కూడా చూడలేదు. కేవలం ఒక టెస్టు ప్లేయర్గానే నాపై ముద్రను వేశారు. అయితే ఐపీఎల్ ద్వారా టెస్టు ప్లేయర్ అనే ముద్ర నుంచి బయటపడి వైట్బాల్ క్రికెట్లో నా ఆటను మరింత మెరుగుపరుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉంది.అయితే ఈ ప్రయాణంలో ఎన్నో తప్పులు చేసినప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశాను. జట్టుకు ఆడినప్పుడల్లా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఫలితంతో సంబంధం లేకుండా నా ఆటను నేను ఆడుకుంటూ సమతుల్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అయితే ఆటగాడిగా నాకు ఇంకా సమయం మిగిలి ఉంది. కాబట్టి నేను నా వంతుగా జట్టుకు తరఫున మ్యాచ్లు ఆడుతూ స్కోర్లు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక గతేడాది నేను తండ్రి కావడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ కొత్త పాత్ర నా క్రికెట్ కెరీర్కు కూడా ఎంతో సహాయపడింది. నా కూతురు నవ్వినప్పుడు అప్పటివరకు నేను బాధపడిన క్షణాలన్నీ మాయమౌతాయి.’ అని చెప్పుకొచ్చాడు.ఇక కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. సూపర్ఫామ్లో ఉన్న రాహుల్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికీ 64 బంతుల్లోనే 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో రికార్డు సృష్టించాడు. అంతేకాదు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 9 మ్యాచ్ల్లో 433 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2022లో టీమిండియా తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ అప్పటినుంచి కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.చదవండి: మాట తప్పిన రిషబ్ పంత్! -
మాట తప్పిన రిషబ్ పంత్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్లో ఎంట్రీ ఇచ్చి వరుసగా తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరి లక్నో సూపర్జెయింట్స్ సంచలనం సృష్టించింది. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం లక్నో దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించిన లక్నో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. తాజాగా సోమవారం ముంబై ఇండియన్స్తో లక్నో సూపర్జెయింట్స్ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో లక్నో కెప్టెన్ పంత్ ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పేరును ప్రస్తావించాడు. తాను పేలవ ఫామ్ను అధిగమించి ముంబైతో మ్యాచ్లో పరుగులు సాధిస్తానని సంజీవ్ గోయెంకాకు మాట ఇచ్చినట్లు స్పష్టం చేశాడు. అయితే మ్యాచ్లో కేవలం 15 పరుగులు చేసిన పంత్ సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘టాస్ మేము గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. ఎందుకంటే వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎంత లక్ష్యాన్నైనా అవలీలగా ఛేదించొచ్చు. నిజానికి ఈ సీజన్ను మేము మంచి ఈజ్తో ప్రారంభించాము. కానీ మధ్యలో నిలకడ కోల్పోయి వరుస ఓటములు చవిచూస్తూ వచ్చాం. జట్టుగా విఫలమైనప్పటికీ సంజీవ్ గోయెంకా మాపై నమ్మకముంచారు. ఆయనకు క్రికెట్ అంటే అపారమైన ఇష్టం. అయితే ఆయన అంచనాలను, అభిమానుల ఆశలను అందుకోవడంలో విఫలమయ్యాం. కానీ ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్లో భారీ స్కోర్లు సాధించి సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టకుంటాం. 200 శాతం కష్టపడి విజయాలు సాధించి అభిమానులను, ఫ్రాంచైజీని సంతృప్తి పరుస్తామని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇక లక్నో కెప్టెన్ పంత్ ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 204 పరుగులు సాధించాడు.అయితే ముంబైతో మ్యాచ్లో పంత్ 15 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. పూరన్ (21 బంతుల్లో 63), మార్ష్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్తో అలరించారు.చదవండి: లక్నోతో మ్యాచ్కు హార్దిక్ దూరం.. కారణమిదే! -
లక్నోతో మ్యాచ్కు హార్దిక్ దూరం.. కారణమిదే!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్ల్లో ఏడు ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు కోల్పోయింది. పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు కెప్టెన్ హార్దిక్ దూరమవ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే టాస్ సమయంలో స్టాండ్ ఇన్ కెప్టెన్గా వచ్చిన సూర్యకుమార్.. పాండ్యా ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. అందుకే మ్యాచ్కు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక కెప్టెన్గా జట్టును నడిపించడంలో విఫలమైన హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గానూ పూర్తిగా తేలిపోయాడు. 8 ఇన్నింగ్స్ల్లో 146 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా బౌలింగ్లోనూ కేవలం నాలుగు వికెట్లు తీశాడు. అంతేకాదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై కూడా విమర్శలు వచ్చాయి. జట్టు ఆటగాళ్ల పట్ల దురుసు ప్రవర్తనతో చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు. ఒక దశలో పాండ్యాను తప్పించి రోహిత్కు మళ్లీ పగ్గాలు అప్పగించాలని ముంబై అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.🚨 Toss Update 🚨@mipaltan won the toss and elected to field against @LucknowIPL. Surya Kumar Yadav is captaining #MI as Hardik Panyda is unwell. Updates ▶️https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/eQjzr2GXrm— IndianPremierLeague (@IPL) May 4, 2026చదవండి: ‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్! -
పాక్ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్మనీనా!
పాకిస్తాన్ సూపర్లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ విజేతగా బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ జాల్మి నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ కింగ్స్మెన్ను ఓడించిన పెషావర్ జాల్మి టైటిల్ గెలిచింది. ఈ సీజన్లో బాబర్ టాప్ స్కోరర్గా నిలిచి ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుతో పాటు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అవార్డుతో పాటు ఆయన అందుకున్న బహుమతి విలువ కేవలం పీకేఆర్ 3,500 మాత్రమే అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.1200 మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ‘ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నందునే పీఎస్ఎల్ నిర్వాహకులు ఆటగాళ్లకు తక్కువ ప్రైజ్మనీ అందించింది’.. ‘పాపం పీసీబీ దగ్గర డబ్బులేవనుకుంటా.. అందుకే ఇంత తక్కువ ప్రైజ్మనీ ఇస్తున్నట్లున్నారు’ అని కామెంట్లు చేశారు. అయితే నిజానికి బాబర్ ఆజం అందుకున్న బహుమతి విలువలో అంకెల సంఖ్యను సోషల్ మీడియాలో తప్పుగా చూపించినట్లు పీఎస్ఎల్ నిర్వాహకులు తెలిపారు. ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కింద బాబర్ ఆజం పీకేఆర్ 3,500,000 ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు 11,90, 790 రూపాయలు. ఇక టీ20 ప్రపంచకప్లో విఫలమైన బాబర్ ఆజం పీఎస్ఎల్ 2026 సీజన్లో మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. 11 ఇన్నింగ్స్లు కలిపి 588 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉండడం విశేషం. అయితే కీలకమైన ఫైనల్లో బాబర్ ఆజం తొలి బంతికే ఔటైనప్పటికీ, ఓవరాల్గా ఒక పీఎస్ఎల్ సీజన్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. పీఎస్ఎల్ ముగిసిన మరుక్షణమే బాబర్ ఆజం టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ చేరుకున్నాడు. మీర్పూర్ వేదికగా మే 8 నుంచి 12 వరకు తొలి టెస్టు, మే 16 నుంచి 20 వరకు రెండో టెస్టు జరగనుంది. View this post on Instagram A post shared by 🚶🏻 (@talks.cric__) చదవండి: షాక్లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి! -
షాక్లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సీజన్లో 9 మ్యాచ్లాడిన ఆర్సీబీ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారి సీజన్లో ఆర్సీబీ సక్సెస్ వెనుక చాలా మంది ఆటగాళ్ల కృషి దాగుంది. బ్యాటింగ్ విభాగంలో కోహ్లితో పాటు కెప్టెన్ పటీదార్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్లు అదరగొడుతుంటే, బౌలింగ్లో హాజిల్వుడ్, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇక 19 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్న కింగ్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 2026 సీజన్లోనూ బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. 9 మ్యాచ్ల్లో కోహ్లి 165.50 స్ట్రైక్రేట్తో 379 పరుగులు సాధించాడు. గతేడాది తొలిసారి చాంపియన్స్గా నిలిచిన ఆర్సీబీ వరుసగా ఈ సీజన్లోనూ కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఒక వార్త మాత్రం ఆర్సీబీని తెగ బాధపెట్టేస్తోంది. అదేంటంటే 18 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫిజియోగా సేవలందించిన ఎవన్ స్పీచ్లీకి ఆర్సీబీ ఘనంగా ఫేర్వెల్ ఇచ్చింది. ఆర్సీబీ జట్టు వెనుక ఎవన్ స్పీచ్లీ పాత్ర మరువలేనిది. 2008 నుంచి 2025 సీజన్ వరకు ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీకి ఫిజియోగా పనిచేశాడు. ఈ 18 ఏళ్లలో ఎంతో మంది ఆర్సీబీ ఆటగాళ్ల ఫిట్నెస్తో పాటు వాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు ఎవన్ ఎంతో కృషి చేశారు. అయితే గత సీజన్ ముగిసిన అనంతరం ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీ ఫిజియోగా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎవన్ స్పీచ్లీకి ‘ఒక అధ్యాయం ముగిసింది’ (ఎండ్ ఆఫ్ ఎరా) పేరుతో ఫేర్వెల్ ఘనంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఆర్సీబీ తమ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసుకుంది. ఫిజియోగా రిటైర్ అయిన తర్వాత స్వదేశంలో ఉండిపోయిన ఎవన్ స్పీచ్లీ ఈ ఫేర్వెల్ వేడుక కోసం బెంగళూరుకు రావడం విశేషం. కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ఎవన్కు గార్డ్ ఆఫ్ హానర్తో గౌరవించారు. ‘ ఎండ్ ఆఫ్ ఎరా, ఎవన్ స్పీచ్లీ’. నీ లెగసీని ఆర్సీబీ ఎప్పటికీ గుర్తుం చుకుంటుంది. 18 ఏళ్లుగా ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీకి హెడ్ ఫిజియోగా వ్యవహరించారు. అందుకే అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాం.’ అని క్యాప్షన్ జత చేసింది.𝙀𝙣𝙙 𝙤𝙛 𝙖𝙣 𝙚𝙧𝙖, 𝙀𝙫𝙖𝙣 𝙎𝙥𝙚𝙚𝙘𝙝𝙡𝙮! Your legacy at RCB will always be remembered. 🙌❤️Evan Speechly was our Head Physio for 18 long years, from 2008 to 2025 - one of the OGs of RCB. He flew down to Bengaluru for a special farewell, and we were all teary eyed!… pic.twitter.com/fjVJR80V1j— Royal Challengers Bengaluru (@RCBTweets) May 4, 2026 చదవండి: ‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’ -
‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట దాదాపు ముగిసినట్లే. ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ చేరే అవకాశాలు కోల్పోయింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. శనివారం సీఎస్కే చేతిలో ఓటమి చవిచూసిన తర్వాత ముంబై ఇండియన్స్ విషయంలో ఒక అంశం చర్చకు దారి తీసింది. టీమిండియాకు ఆడుతున్న ఆటగాళ్లలో ఎక్కువ మంది ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు కీలక ఆటగాళ్లు. ఇందులో రోహిత్ గాయంతో డగౌట్కే పరిమితమయ్యాడు. ఇక మిగిలిన ఆటగాళ్లలో కెప్టెన్ పాండ్యా సంగతి పక్కనబెడితే సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రాలు దారుణంగా విఫలమవ్వడం ముంబై కొంప ముంచుతుంది. ఈ సీజన్లో బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున 9 మ్యాచ్లాడి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక సూర్యకుమార్ పేలవ ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. తొమ్మిది మ్యాచ్లు కలిపి కేవలం 20 సగటుతో పరుగులు సాధించాడు. తిలక్ వర్మ సెంచరీ సాధించినప్పటికీ ఆ మురిపెం ఒక్క మ్యాచ్కే పరిమితమైంది. ఈ ముగ్గురు అగ్రశ్రేణి ఆటగాళ్లు విఫలం కావడంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్దనే స్పందించాడు. సీఎస్కేతో మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో జయవర్దనే మాట్లాడాడు. ‘నిజానికి ఈ ముగ్గురి వల్లే ముంబై ఇండియన్స్ దారుణ ఆటతీరు ప్రదర్శిస్తోందని చెప్పలేం. ఎందుకంటే సూర్య, తిలక్, బుమ్రాలు ఇప్పటికే వారేంటో నిరూపించుకున్నారు. ఒక్కసారి సూర్యకుమార్ టచ్లోకి వస్తే ఎంత డేంజర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అతడు కుదురుకోవడానికి రెండు, మూడు ఇ న్నింగ్స్లు చాలు. కానీ ఈ సీజన్లో మాకు ఆ సమయం దాటిపోయింది. ఇక తిలక్ వర్మ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. తనదైన రోజున ధాటిగా ఆడగల సత్తా ఉన్న తిలక్ వర్మ అనుభవం పెరిగిన కొద్దీ ఆటలో మరింత రాటుదేలుతాడన్న నమ్మకం నాకుంది. అయితే తిలక్ వర్మ టీ20 క్రికెట్లో అన్ని రకాల పాత్రలను పోషిస్తున్నాడు. టీ20 క్రికెట్ ఆడడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి పరిస్థితి చేయి దాటిపోతుంది. బుమ్రా రాణించకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ను ఇబ్బంది పెట్టే అంశం. కానీ బుమ్రా ఒక్కడే కాదు ముంబై బౌలర్లంతా కలిసికట్టుగా ఆడడంలో విఫలమయ్యారు. మిగతా బౌలర్లు కూడా వికెట్లు తీస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడంతో పాటు వికెట్లు తీసే అవకాశముంటుంది.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: అదే జరిగితే ప్లేఆఫ్స్కు ముంబై ఇండియన్స్! -
అదే జరిగితే ప్లేఆఫ్స్కు ముంబై ఇండియన్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం సీఎస్కేతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన ఐపీఎల్ మాజీ చాంపియన్ ఇప్పుడు ప్లేఆఫ్ చేరడం దాదాపు అసాధ్యమే. అయితే కొంత అదృష్టం కలిసి రావడంతో మిగిలిన 5 మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే మాత్రం ముంబైకి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. కానీ ప్లేఆఫ్స్ చేరే క్రమంలో ముంబై ఇండియన్స్ ముందున్న దారి చాలా కఠినమని చెప్పొచ్చు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్ల్లో 2 విజయాలతో, 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. జట్టు నెట్ రన్ రేట్ (-0.803) సైతం చాలా దారుణంగా ఉండటం గమనార్హం. ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. అయితే ప్రస్తుతం ముంబై వద్ద ఉన్నది కేవలం 5 మ్యాచ్లు మాత్రమే. అంటే, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై తన మిగిలిన 5 మ్యాచ్ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ముంబై అదృష్టం కలిసి వచ్చి ఐదు మ్యాచ్లు గెలిచి నప్పటికీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ మిగిలిన మ్యాచ్ల్లో ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. అదే సమయంలో ముంబై తాము ఆడబోయే ఐదింటిలో ఒక్కటి ఓడినా సీజన్లో వారి ప్రయాణం ముగిసినట్లే. ముంబై తమ తర్వాతి మ్యాచ్ల్లో భాగంగా సోమవారం లక్నో సూపర్జెయింట్స్తో, మే 10న రాయ్పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 14న టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్తో ధర్మశాలలో తలపడాల్సి ఉంది. ఆ తర్వాత మే 20న కోల్కతా నైట్ రైడర్స్, మే 24న రాజస్తాన్ రాయల్స్తో ఆడాల్సి ఉంది. ఈ ఐదింటిలో గెలవడంతో పాటు రన్రేట్ను భారీగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరముంది. గణాంకాల పరంగా అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ప్రస్తుత ఫామ్ చూసుకుంటే మాత్రం అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.చదవండి: ఐపీఎల్కు ధోని గుడ్బై.. వీడియో వైరల్! -
‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్కు ఘనమైన రికార్డు ఉంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అత్యధిక టైటిల్స్ విషయంలో సీఎస్కేతో కలిసి సమానంగా ఉంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే 9 మ్యాచ్లాడిన ముంబై ఏడు పరాజయాలు చవిచూసింది. శనివారం సీఎస్కేతో మ్యాచ్లోనూ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకున్నట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబై ప్లేఆఫ్ చేరడం కష్టం. ఇక కెప్టెన్గా హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. మ్యాచ్ ఓటములను తట్టుకోలేక సహచరులపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ జట్టులో విద్వేశం పెరిగిపోయిందని, అతడికి జట్టులో కనీస మద్దతు కరువయిందంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. జట్టు పేలవ ప్రదర్శనకు పాండ్యాను ఒక్కడినే నిందించడం తగదని పేర్కొన్నాడు. క్రిక్బజ్తో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. జట్టు వైఫల్యాలకు కెప్టెన్ పాండ్యాను విమర్శిస్తున్నారు. కానీ అతడికి జట్టు నుంచి సరైన మద్దతు లేదనిపిస్తోంది. కెప్టెన్గా పాండ్యా చేయాల్సింది చేస్తున్నాడు. జట్టులో ఆటగాళ్లు సరిగ్గా ఆడడం లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో సూపర్స్టార్గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాణించింది లేదు. జట్టులో నిలకడ ప్రదర్శన లేనప్పుడు పాండ్యాను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం లేదు. కలిసికట్టుగా ఆడినప్పుడే జట్టుకు విజయాలు లభిస్తాయి. కానీ ముంబై ఇండియన్స్లో ఇప్పుడు అది మిస్సయింది. రోహిత్ గాయంతో డగౌట్కు పరిమితమవ్వడం, బుమ్రా, సూర్య, తిలక్ వంటి ఆటగాళ్లు ఫామ్లో లేకపోవడం ముంబైని దెబ్బకొట్టాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ పాండ్యాను విమర్శించడం తగదు. అతడి ప్రవర్తనతో ఆటగాళ్లు క్రమంగా విద్వేషం పెంచుకుంటున్నారనిపిస్తుంది. అందుకే అతడికి జట్టు నుంచి మద్దతు కరువయ్యింది. ఇక 9 మ్యాచ్ల్లో ఏడు పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకున్న ముంబై ఇండియన్స్కు అదృష్టం తోడవ్వాలి. ఎందుకంటే ప్రతీ జట్టు 14 మ్యాచ్లు ఆడుతుంది. మరోవైపు టాప్-4లో ఉన్న పంజాబ్కు ఆరు మ్యాచ్లు, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లకు ఐదేసీ మ్యాచ్లు, రాజస్తాన్కు నాలుగు మ్యాచ్లు ఉన్నాయి. ముంబై ప్లేఆఫ్ చేరాలంటే ఈ జట్లు తమ మ్యాచ్లన్నీ ఓడిపోవాలి. కానీ 99 శాతం ఇది జరగని పని. కాబట్టి ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ప్లేఆఫ్ ఆశలు పక్కనబెట్టి విజయాలు సాధించి గౌరవంగా నిష్క్రమించడం మంచిది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘నేను క్రెడిట్ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్’ -
‘నేను క్రెడిట్ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ అజేయ అర్థసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కార్తిక్ శర్మ కూడా అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సీజన్లో నాలుగో విజయం అందుకున్న సీఎస్కే 8 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. నిజానికి ఈ మ్యాచ్ విన్నర్ తాను కాదని, ఇంపాక్ట్గా వచ్చి అజేయ అర్థసెంచరీతో అదరగొట్టిన కార్తిక్ శర్మకు క్రెడిట్ ఇవ్వాలని రుతురాజ్ తెలిపాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పాడు. రుతురాజ్ మాట్లాడుతూ..'చాలా సంతోషంగా ఉంది. మేం మొదట బాగానే ప్రారంభించాం. కానీ మధ్యలో ముంబై ఇండియన్స్ పుంజు కుంది. అయితే మేం మళ్లీ మ్యాచ్ను మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. మొదటి కొన్ని ఓవర్లను తట్టుకుని నిలబడటం.. ఆపై టాప్ త్రీ బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఉండటం కీలకమని మేం భావించాం. ఇక అన్షుల్ కంబోజ్ చాలా నిలకడగా రాణిస్తున్నాడు. తన ప్రక్రియను అనుసరిస్తున్నాడు. అతని ఆలోచనా తీరు ఒక బ్యాటర్ లాగా ఉంటుంది. నూర్ కూడా కొన్ని మార్పులు చేసుకుని బాగా రాణిస్తున్నాడు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే అఖీల్ హుస్సేన్ను ఆడించలేదు. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని, అదనపు బౌలర్ ఉండాలని ఆలోచించాం. ప్రశాంత్ వీర్, ఘోష్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగలరు. మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ చెబుతున్నట్లుగా.. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అయితే ఇది టీ20 క్రికెట్. సరైన సమయం కోసం వేచి చూశాను. కార్తీక్ శర్మకు ఈ ఇన్నింగ్స్ మంచి బూస్ట్లాంటిది. అతను సిక్సర్లు కొట్టగలడు. కానీ అతను బంతులను ఎంచుకొని ఆడిన తీరు బాగుంది. అతను ఫామ్ కొనసాగిస్తే జట్టుకు ప్రయోజనం. మేం ఆటను చాలా సింపుల్గా ఉంచుతున్నాం. తప్పులు జరుగుతుంటాయి కానీ బలంగా తిరిగి రావాలి. ఈ జెర్సీ, అభిమానుల కోసం మా సర్వస్వం ఇస్తాం.’ అని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.Trusting the process and letting the bat do the talking 💛🎥 Skipper Ruturaj Gaikwad talks about finding his rhythm and the match-winning knock 🗣️#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL | @Ruutu1331 pic.twitter.com/VZ2T0hqcYZ— IndianPremierLeague (@IPL) May 2, 2026చదవండి: ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు! -
ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన 9 మ్యాచ్ల్లో ఏడు పరాజయాలతో ప్లేఆఫ్ ఆశలను దాదాపు గల్లంతు చేసుకుంది. శనివారం చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఓడినప్పటికీ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డును నమోదు చేయడం విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో 50 వేల పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. సీఎస్కేతో మ్యాచ్లో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 50వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి ముంబై ఇండియన్స్కు 114 పరుగులు అవసరం కాగా.. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఆ మైలురాయిని అందుకుంది. ముంబై ఇండియన్స్కు ఇది 308వ టీ20 మ్యాచ్. ఇందులో 286 ఐపీఎల్ మ్యాచ్లు కాగా.. మరో 22 మ్యాచ్లు ఛాంపియన్స్ లీగ్వి ఉన్నాయి. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత ఇంగ్లండ్కు చెందిన సోమర్సెట్ (48,244 పరుగులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (47,304 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్ (46,438 పరుగులు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (6,286 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (3,933), కీరన్ పొలార్డ్ (3,915) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ మ్యాచ్ ఫలితం మాత్రం ముంబై ఇండియన్స్కు చేదు అనుభవం మిగిల్చింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57) అర్థసెంచరీతో రాణించాడు. రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), కార్తిక్ శర్మ (54 నాటౌట్) సీఎస్కేను గెలిపించారు. సీజన్లో చెన్నై సూపర్కింగ్స్కు ఇది నాలుగో విజయం కాగా.. ముంబైకి ఇది ఏడో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: ఇంపాక్ట్ నిబంధనపై బీసీసీఐ కీలక నిర్ణయం! -
ఇంపాక్ట్ నిబంధనపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలు, వివాదాస్పద 'ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 సహా ఫైనల్కు సంబంధించి ముఖ్య విషయం వెల్లడించారు. ఈ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే వేదికలను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సైకియా తెలిపారు. ప్లేఆఫ్స్, ఫైనల్ నిర్వహణకు తగిన వేదికల ఎంపికపై బోర్డు ప్రస్తుతం కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఇక 2023లో ప్రవేశపెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సైకియా స్పందించారు. ఈ నిబంధన వల్ల అభిమానులు మ్యాచ్లను బాగా ఎంజాయ్ చేస్తున్నారని, కొన్ని జట్లు 260 పరుగులు చేస్తే, మరికొన్ని తక్కువ స్కోర్లకే పరిమితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇంపాక్ట్ రూల్పై ఫ్రాంచైజీల నుంచి ఎటువంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని, జట్లు దీనితో సౌకర్యవంతంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఐపీఎల్లో లీగ్ మ్యాచ్లు మే 24తో ముగియనున్నాయి. ఇప్పటికైతే పాయింట్ల పరంగా పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.చదవండి: తిలక్ వర్మకు చేదు అనుభవం! -
సీఎస్కేను గెలిపించిన కార్తిక్ శర్మ.. ముంబై ఓటమి
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్పై సీఎస్కే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అంచె పోటీల్లో ముంబైని చిత్తుగా ఓడించిన సీఎస్కే శనివారం రెండో అంచె పోటీలోనూ మరోసారి ముంబైని ఓడించింది. శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కార్తిక్ శర్మ (54 నాటౌట్) అజేయంగా నిలిచి సీఎస్కేను గెలిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.అజేయ అర్థసెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సీజన్లో చెన్నై సూపర్కింగ్స్కు ఇది నాలుగో విజయం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.An unorthodox finishing touch to a classic rivalry! 🎬🎥 @ChennaiIPL complete the double over their arch-rivals #MI in style 💛Scorecard ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/yeBWsXZ6Lu— IndianPremierLeague (@IPL) May 2, 2026 -
తిలక్ వర్మకు చేదు అనుభవం.. 28 వేల వాచ్ గోవిందా!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ క్రికెటర్ తిలక్ వర్మకు చేదు అనుభవం ఎదురయ్యింది. ముంబై ఇన్నింగ్స్ సమయంలో సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ వేసిన బంతి తిలక్ వర్మ చేతికున్న రిస్ట్ వాచ్ను రెండు ముక్కలు చేసింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఓవర్టన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడే క్రమంలో తిలక్ వర్మ మిస్ చేశాడు. దీంతో బంతి తిలక్ వర్మ చేతికి బలంగా తాకింది. నొప్పితో బాధపడిన తిలక్ను ఫిజియో వచ్చి పరిశీలించాడు. అదే సమయంలో చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్కలు కావడం గమనార్హం. కాగా తిలక్వర్మ తన చేతికి ధరించిన రిస్ట్ వాచ్ ధర రూ.28 వేలు కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో తిలక్ వర్మ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్లో వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57) అర్థసెంచరీతో రాణించగా.. రికెల్టన్ 37 పరుగులు చేశాడు.𝗧𝗜𝗠𝗘 𝗢𝗨𝗧 ⌚🤐#TilakVarma’s wrist-watch, too, now has a #BiggestRivalry story to tell 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvMI | LIVE NOW 👉https://t.co/wLcMjiCsSi pic.twitter.com/cCLwL6SYux— Star Sports (@StarSportsIndia) May 2, 2026చదవండి: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోదీ చరిత్ర సృష్టించాడు. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో వికెట్ తీయడం ద్వారా సోదీ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. బంగ్లా బ్యాటర్ షమ్మీ హొసేన్ను ఔట్ చేయడం ద్వారా ఇష్ సోదీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్ల్లో 8.16 ఎకానమీ రేటుతో 165 వికెట్లు తీశాడు. అంతేకాదు కివీస్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్గానూ ఇష్ సోదీ నిలిచాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇక రెండో స్థానంలో టిమ్ సౌతీ ఉన్నాడు. సౌతీ 126 మ్యాచ్ల్లో 164 వికెట్లు పడగొట్టాడు.ఆ తర్వాతి స్థానంలో మిచెల్ సాంట్నర్ (138 మ్యాచ్ల్లో 142 వికెట్లు), నాలుగో స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (83 వికెట్లు), లోకి ఫెర్గూసన్ (76 వికెట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (33) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో జోష్ క్లార్క్సన్ 3 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, బెన్ సియర్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. బెవన్ జాకబ్స్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. మూడు మ్యాచ్లో టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్ను సమం చేశాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా బెవన్ జాకబ్స్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా తౌహిద్ హృదోయ్ నిలిచాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. -
సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భువనేశ్వర్ కుమార్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల వయసులోనూ తన పేస్ పదును చూపిస్తూ ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున వికెట్లు తీస్తోన్న భువనేశ్వర్ను టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుందని మాజీ డాషింగ్ ఓపెనర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వయసును కాకుండా ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు వయసు కేవలం ఒక అంకె మాత్రమే అనిపిస్తుంది. అతనికి 35-36 ఏళ్లు ఉంటే ఏంటి? అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు, టీ20 ఫార్మాట్లో తన పునరాగమనం గురించి అతను ఆలోచించాలి లేదా సెలక్టర్లు ఆలోచించాలి. మనం పాత భువనేశ్వర్ను మళ్లీ చూస్తున్నాం. అతని బౌలింగ్లో ఆ వాడి, వేడి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త బంతితో, పాత బంతితో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు’ అని ప్రశంసించాడు.ఈ ఐపీఎల్ సీజన్లో భువనేశ్వర్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఆడిన కేవలం 9 మ్యాచ్లలోనే 17 వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. గతేడాది (2025) ఆర్సీబీ టైటిల్ గెలిచిన సీజన్ మొత్తం మీద అతను 17 వికెట్లు తీయగా, ఈసారి కేవలం 9 మ్యాచ్లలోనే ఆ మార్కును అందుకోవడం అతని ఫామ్కు నిదర్శనం. ఆర్సీబీ ఆడిన గత ఐదు మ్యాచ్లలో నాలుగింటిలో అతను కనీసం మూడు వికెట్లు తీశాడు.ఇటీవలే అతను టీ20 క్రికెట్లో ఒక అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో 350 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్గా, రెండో భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 325 టీ20 మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్, 24.51 సగటుతో 352 వికెట్లు పడగొట్టాడు. అతని కంటే ముందు భారత్ నుంచి స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (391 వికెట్లు) మాత్రమే ఉన్నాడు.చదవండి: చిక్కుల్లో పడిన క్రికెటర్ షమీ సోదరుడు! -
IPL 2026: ముంబైపై సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ శర్మ (54 నాటౌట్) అజేయంగా నిలిచి సీఎస్కేను గెలిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.గైక్వాడ్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్థసెంచరీ సాధించాడు. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న రుతురాజ్ ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్కే 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే160 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సీఎస్కే 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ గజన్ఫర్ బౌలింగ్లో బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (11) ఔట్.. తొలి వికెట్ డౌన్160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్కింగ్స్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన శాంసన్ బుమ్రా బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 160 పరుగులుసీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.ఆరో వికెట్ డౌన్..5 పరుగులు చేసిన రాబిన్ మింజ్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్ 139 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నమన్ ధిర్ (48), పాండ్యా (9) పరుగులతో ఆడుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్కేతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్లో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నమన్ ధిర్ 44, పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నమన్ ధిర్ 42, తిలక్ వర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నమన్ ధిర్ 25, సూర్యకుమార్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రికిల్టన్ 15, నమన్ ధిర్ 13 పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్కేతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన ఓపెనర్ విల్జాక్స్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో రామక్రిష్ణ ఘోష్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది.టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. రఘుశర్మ సీజన్లో తొలి మ్యాచ్ ఆడనుండగా, అశ్వనీ స్థానంలో క్రిష్ భగత్ జట్టులోకి వచ్చాడు. ఇక చెన్నై సూపర్కింగ్స్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అకిల్ హొసేన్ స్థానంలో ప్రశాంత్ వీర్, గుర్జప్నీత్ సింగ్ స్థానంలో రామక్రిష్ణ ఘోష్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోరులో సీఎస్కే 103 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరిముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్ -
చిక్కుల్లో పడిన క్రికెటర్ షమీ సోదరుడు!
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చిక్కుల్లో పడ్డాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఒక మహిళ షమీ సోదరుడిపై ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. ఉమ్మడి స్నేహితుడు ఇమ్రాన్ ద్వారా మహమ్మద్ కైఫ్ను బాధితురాలు కలిసింది. వారి తొలి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయడం మొదలుపెట్టిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత బాధితురాలు కైఫ్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పటినుంచి కైఫ్ ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇక మహ్మద్ షమీ సోదరుడైన మహమ్మద్ కైఫ్ దేశవాలీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ సహా విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీయ టోర్నమెంట్లలో ఆడాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన కైఫ్ తన కెరీర్లో మొత్తం మహమ్మద్ కైఫ్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 43 వికెట్లు, 9 లిస్ట్ -ఏ మ్యాచ్ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. షమీ కుటుంబానికి వివాదాలు కొత్త కాదు. షమీ భార్య హసీన్ జహాన్తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ భారత క్రికెటర్ తరచూ వార్తల్లో నిలిచాడు. గత జనవరిలో ఓటర్ల జాబితాలో అవకతవకల కారణంగా షమీతో పాటు కైఫ్ను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇక నిలకడైన ఆటతీరుకు మారుపేరైన షమీ 2023 వన్మింన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. అయితే ఐపీఎల్ 19వ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ తరఫున ఆడుతున్న షమీ ఇప్పటివరకు 8 మ్యాచ్లాడి 7 వికెట్లు తీశాడు.చదవండి: టీ20 ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన -
టీ20 ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్కు సంబంధించి బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అమితా శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, మహిళల జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్లతో సమావేశమైంది. సుదీర్ఘ చర్చ అనంతరం భారత జట్టును ప్రకటించారు.హర్మన్ప్రీత్ కౌర్ రికార్డు స్థాయిలో ఐదోసారి కెప్టెన్గా జట్టును నడిపించనుండడం విశేషం. కెప్టెన్ హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్లు బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక ఆల్రౌండర్ దీప్తి శర్మ, రేణుకాసింగ్లు బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించనున్నారు. తెలుగు క్రికెటర్లు శ్రీచరణి, అరుంధతి రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక గాయం కారణంగా దూరమైన అమన్జ్యోత్ కౌర్ స్థానంలో భారతి పుల్మాలిని ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. బ్యాటర్ హర్లీన్ డియోల్, స్పిన్నర్ స్నేహ్రాణాలకు జట్టులో చోటు దక్కలేదు.15 మందితో కూడిన జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనున్నారు. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. గ్రూప్-ఏలో భారత్తో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడనుంది.ఆ తర్వాత 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక గ్రూప్-బిలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. కాగా జూన్ 30న తొలి సెమీఫైనల్, జూలై 2న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక జూలై 5న జరగనున్న ఫైనల్ మ్యాచ్కు లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది.ఇక గతేడాది భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. హర్మన్ప్రీత్ నేతృత్వంలోని టీమిండియా ఆనాటి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది.భారత్ మ్యాచ్ల షెడ్యూల్ వివరాలు..జూన్ 14: భారత్ వర్సెస్ పాకిస్తాన్, వేదిక: ఎడ్జ్బాస్టన్జూన్ 17: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్, వేదిక: హెడ్డింగేజూన్ 21: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్జూన్ 25: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్జూన్ 28: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, వేదిక: లార్డ్స్భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) చదవండి: ఒక్క హగ్కు ఇంత రాద్ధాంతమా! -
ఒక్క హగ్కు ఇంత రాద్ధాంతమా!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్లో గురువారం హైదరాబాద్ కింగ్స్మెన్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఎలిమినేటర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా, ఆసీస్ మహిళా మాజీ క్రికెటర్ లీసా స్తాలేకర్ కామేంటేటర్లుగా వ్యవహరించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లీసా స్తాలేకర్ మాటల సందర్భంగా రమీజ్ రాజాను హగ్ చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇది సరదాగా చేసినప్పటికీ బహిరంగంగా ఇలా ప్రవర్తించడం పట్ల క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అంతేకాదు రమీజ్ రాజా, లీసా స్తాలేకర్ హగ్ వీడియో క్షణాల్లో వైరల్గా మారిపోయింది. ఏఐ పుణ్యమా అని లీసా హగ్ ఇవ్వగానే రమీజ్ రాజా ఆమె నుదుటిపై ముద్దు పెట్టినట్లుగా వీడియో, ఫొటోలు బయటికి వచ్చాయి. అయితే ఇవన్నీ నకిలీ ఫొటోలని కాసేపటికే తేలిపోయింది. ఎందుకంటే వీరిద్దరు హగ్ చేసుకున్న అనంతరం రమీజ్ రాజా ముద్దు పెట్టినట్లుగా వీడియోలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అది ఏఐతో రూపొందించిన వీడియో అని క్లియర్గా అర్థమైంది. అయితే రమీజ్ రాజాకు హగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారడంతో లీసా స్తాలేకర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ‘ఒక చిన్న కౌగిలింత ఇంత చర్చకు దారి తీయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఇందులో తప్పేముంది. ఏదో సరదాగా హగ్ చేసుకున్నా. దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా’ అంటూ స్టోరీ షేర్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ను చిత్తు చేసిన హైదరాబాద్ కింగ్స్మెన్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో పెషావర్ జాల్మితో హైదరాబాద్ కింగ్స్మెన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (69 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. మహ్మద్ నవాజ్ 18 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్మెన్ 15.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మాజ్ సదాఖత్ (64 నాటౌట్), ఉస్మాన్ ఖాన్ (64) జట్టును గెలిపించారు.ఇక లీసా స్తాలేకర్ ఆస్ట్రేలియా తరఫున 2001 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్గా సేవ లందించిన ఈ ఆల్రౌండర్ 125 వన్డేల్లో 2,728 పరుగులు చేయడంతో పాటు 146 వికెట్లు పడగొట్టింది. ఇక 8 టెస్టు మ్యాచ్లు ఆడి 416 పరుగులతో పాటు 23 వికెట్లు తీసింది.Lisa Sthalekar's Instagram story. pic.twitter.com/N7C4JVOBtq— Sheri. (@CallMeSheri1_) May 2, 2026WTFFFF pic.twitter.com/293RiGywFW— Invader🇵🇸- (@sshayaannn) April 29, 2026 -
వైభవ్ సూర్యవంశీ పొరపాటు.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వినిపిస్తున్నపేరు వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం సీజన్లో వరుస విజయాలతో ఎదురులేకుండా సాగుతున్న పంజాబ్ కింగ్స్కు చెక్పెట్టిన రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా జైస్వాల్, వైభవ్ మరోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. చివర్లో ఫెరీరా, శుభమ్ దూబే ఫినిషింగ్ టచ్తో రాజస్తాన్ను గెలిపించారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైభవ్ సూర్యవంశీ ఫీల్డింగ్కు వెళ్లే సమయంలో షూ వేసుకోకుండానే మైదానంలోకి వచ్చాడు. అయితే పొరపాటును గ్రహించిన వైభవ్ వెంటనే తన షూ పంపించాలంటూ డ్రెసింగ్ రూమ్కు సైగలు చేయడం కనిపించింది. పక్కనే ఉన్న రోమి భిందర్ కూడా వైభవ్కు సహాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 6 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.Vaibhav Sooryavanshi forgot to wear his shoes and then asked someone to bring them onto the ground 😭Romi Bhinder is literally taking care of him like a father 🫡 pic.twitter.com/3TayVsGf78— TEJASH (@Tejashyyyyy) April 29, 2026చదవండి: లంక క్రికెట్లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా! -
రెండో టీ20 వర్షార్పణం
న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఈ సిరీస్లో బంగ్లాదేశ్ ఆధిక్యం 1-0తో కొనసాగుతోంది. ఏప్రిల్ 27న జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లోని నిర్ణయాత్మక మూడో టీ20 ఢాకా వేదికగా మే 2న జరుగనుంది.కాగా, 3 మ్యాచ్ల వన్డే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లలో తొలుత జరిగిన వన్డే సిరీస్ను ఆతిథ్య బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.న్యూజిలాండ్కు షాకిచ్చిన బంగ్లాదేశ్చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్కు ఊహించని షాకిచ్చింది. ఆ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ న్యూజిలాండ్ను 182 పరుగులకు పరిమితం చేసింది. అనంతరం 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కేటీన్ క్లార్క్ (51), డేన్ క్లీవర్ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్ క్లార్క్సన్ (27 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 2, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకీబ్, మెహిది హసన్ తలో వికెట్ తీశారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తౌహద్ హృదోయ్ (51 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్కు పర్వేజ్ హొసేన్ (28), షమీమ్ హొసేన్ (31 నాటౌట్) సహకరించారు. మిగతా ఆటగాళ్లలో సైఫ్ హసన్ 17, తంజిద్ హసన్ 20, కెప్టెన్ లిటన్ దాస్ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఐష్ సోధి 2, జోష్ క్లార్క్సన్, నాథన్ స్మిత్ తలో వికెట్ తీశారు. -
లంక క్రికెట్లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా!
శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బోర్డు సంక్షోభంలో కూరుకుపోయింది. లంక క్రికెట్ అధ్యక్షుడు షమీ సిల్వా సహా బోర్డు సభ్యులంతా తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో వీరు తమ రాజీనామా లేఖలను శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, క్రీడల శాఖ మంత్రి సునీల్ కుమార గమాగేలకు పంపినట్లు తెలుస్తోంది. అయితే జాతీయ జట్టు వరుస వైఫల్యాలు, బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో షమీ సిల్వాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇటీవల భారత్తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్లో శ్రీలంక జట్టు కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకోలేకపోయింది. ఈ పేలవ ప్రదర్శనే అనూహ్య రాజీనామాలకు కారణమని తెలుస్తోంది.65 ఏళ్ల షమీ సిల్వా 2019 నుంచి శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2021, 2023, 2025 సంవత్సరాల్లో ఆయన ఏకగ్రీ వమయ్యారు. 2025లో జై షా తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగానూ సిల్వా బాధ్యతలు చేపట్టారు. అయితే షమీ సిల్వా హయాంలో శ్రీలంక క్రికెట్ బోర్డు వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్లో జట్టు దారుణంగా విఫలం కావడంతో అప్పటి క్రీడల మంత్రి బోర్డును రద్దు చేశారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలకు విరుద్ధం కావడంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తాత్కాలికంగా రద్దు చేసింది. దీని ఫలితంగా శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 ప్రపంచకప్ను దక్షిణాఫ్రికాకు తరలించారు.ఇక శ్రీలంక 1973 క్రీడా చట్టం ప్రకారం క్రీడా సమాఖ్యలను రద్దు చేసే అధికారం మంత్రికి ఉన్నప్పటికీ, ఎన్నికైన సంస్థలలో ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ అంగీకరించదు. ప్రస్తుత పరిణామాలపై ఐసీసీకి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
పాక్ ‘ఏఐ’ చిప్.. వైభవ్ అదిరిపోయే రిప్లై!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. 15 ఏళ్ల వయసులోనే అద్భత బ్యాటింగ్తో అదరగొడుతున్న వైభవ్ ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్పై అనుమానముందని, ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసి ఉండొచ్చని, వెంటనే డోపింగ్ టెస్టుకు పంపించాలంటూ పాక్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ క్రికెట్ అనలిస్ట్కు వైభవ్ తన స్టైల్లో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘దేవుడే నా బ్యాట్కు ఆ ఏఐ చిప్ను జోడించాడు. ఆ భగవంతుడే నా బ్యాట్కు దానిని జత చేసినట్లు నాకు స్వయంగా చెప్పాడు. అందుకే నేను ఆ బ్యాట్ను ఉపయోగించి పరుగులు సాధిస్తున్నా’ అని నవ్వుతూ పేర్కొన్నాడు.అసలేం జరిగింది?ఐపీఎల్ 2026 సీజన్లో అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదాగా పేర్కొన్నారు. వైభవ్కు డోపింగ్ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. ‘వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్ను చెక్ చేస్తే బాగుంటుంది. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసారా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్కు పంపించి పరీక్షించాల్సిందే. వైభవ్ నాకు మనిషిలా అనిపించడం లేదు. అయితే అతడి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏండ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం.’ అని చెప్పుకొచ్చారు.ఐపీఎల్ 19వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ 400 పరుగుల మార్క్ను చేరుకున్నాడు. అయితే ఈ మార్క్ను అందుకునేందుకు వైభవ్కు అవసరమైన బంతులు కేవలం 167 మాత్రమే. ఈ నేపథ్యంలో పరుగుల పరంగా అతి తక్కువ బంతుల్లో 400 పరుగుల మార్క్ చేరుకున్న వేగవంతమైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు సాధించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రీ రసెల్ పేరిట ఉంది. 2019 సీజన్లో రసెల్ 188 బంతుల్లో 400 పరుగుల మార్క్ను అందుకున్నాడు. 2024 సీజన్లో అభిషేక్ శర్మ (195 బంతులు), 2025 సీజన్లో నికోలస్ పూరన్ (197 బంతులు), 2014 సీజన్లో మ్యాక్స్వెల్ (200 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.𝘉𝘢𝘵 𝘱𝘦 𝘈𝘐 𝘤𝘩𝘪𝘱 𝘩𝘢𝘪 𝘬𝘺𝘢 𝘵𝘶𝘮𝘩𝘢𝘳𝘦?Vaibhav answers 😂💗 pic.twitter.com/uZcqABbaGS— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2026చదవండి: ‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’ -
రోహిత్ ఆడడంపై ముంబై క్లారిటీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఆ జట్టు ఆడిన చివరి మూడు మ్యాచ్లకు డగౌట్కే పరిమితమయ్యాడు. అయితే ముంబై ఇండియన్స్ ఇవాళ ఎస్ఆర్హెచ్తో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లోనైనా రోహిత్ బరిలోకి దిగుతాడా లేడా అన్నది అనుమానమే. తాజాగా ఈ విషయమై ముంబై ఇండియన్స్ స్పష్టత ఇచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని ముంబై యాజమాన్యం పేర్కొంది. అయితే ఎస్ఆ ర్హెచ్తో మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ నెట్స్లో ప్రాక్టీస్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు రోహిత్ కచ్చితంగా అందుబాటులో ఉంటాడని ముంబై అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ముంబై యాజమాన్యం మాత్రం రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదనిపిస్తోంది. రోహిత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తోంది. ఈరోజు ఉదయం వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్కు హాజరైన రోహిత్ శర్మ బ్యాటింగ్ జోలికి పోలేదు. వార్మప్, రన్నింగ్ అనంతరం కాసేపు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్తో కాసేపు ముచ్చటించి మైదానం వీడాడు. ఏప్రిల్ 12న ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ సమయంలో రోహిత్కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫిజియో మైదానంలోనే హిట్మ్యాన్కు ట్రీట్మెంట్ చేసినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో మరుసటి ఓవర్లోనే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రోహిత్ మరోసారి బ్యాటింగ్కు రాలేదు. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం మధ్యలో పరాజయాలు చవిచూసినా వరుసగా నాలుగు విజయాలు సాధించి జోరు కనబరుస్తోంది. 8 మ్యాచ్ల్లో 5 విజయాలు, ఒక ఓటమితో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు! -
‘వైభవ్తో పోల్చద్దు’.. జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు రాజస్తాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. పంజాబ్ విధించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభమివ్వగా.. ఆఖర్లో శుభమ్ దూబే, డొనొవన్ ఫెరీరాలు దూకుడుగా ఆడి రాజస్తాన్ను గెలిపించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ను వైభవ్ సూర్యవంశీకి అందించాడు. ఈ సందర్భంగా జైస్వాల్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పాడు. జైస్వాల్ మాట్లాడుతూ.. ‘నేను వయసులో పెద్దోడిని ఎంతమాత్రం కాదు. ఎందుకంటే నేనింకా చిన్నవాడినే. ఇక నా సహచర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో నన్ను పోల్చద్దు. వయసులో అతడు నాకంటే ఇంకా చిన్నవాడు. కాబట్టి అతడితో నన్ను పోలిస్తే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. అతను బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న నేను అలా చూస్తూ ఉండిపోతున్నా. వైభవ్లో ఉన్న ప్రతిభ అసాధారణం.’ అని తెలిపాడు. కాగా జైస్వాల్ వయసు 24 ఏండ్లు కాగా.. వైభవ్ సూర్యవంశీకి 15 ఏండ్లు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మ్యాచ్ గెలవడంపై కూడా జైస్వాల్ స్పందించాడు. ‘ఇది హై-స్కోరింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అందుకే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బంతులను అస్సలు వదలకూడదనే స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగాం. 200 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఆ 'ఇంటెంట్' చాలా ముఖ్యం. అందరూ ప్రతి మ్యాచ్లో రాణించాలంటే కుదరదు. కానీ తమ జట్టులో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంది. మేమంతా ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాం. దానిని ఆచరణలో పెడితే సరైన సమయంలో ఫలితాలు వస్తాయని భావించాం. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉంది. మేమంతా కలిసి ఈ ఆటను ఆస్వాదిస్తున్నాం.’ అని చెప్పుకొచ్చాడు.ఇక సీజన్లో జైస్వాల్ 9 మ్యాచ్ల్లో 306 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్లో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ 9 మ్యాచ్ల్లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అతడి ఖాతాలో ఒక సెంచరీ సహా రెండు హాఫ్ సెంచరీలున్నాయి. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.The duo that is fun to watch on the pitch and even off it 😄 💪🎥 Hear from Yashasvi Jaiswal on how it is batting with Vaibhav Sooryavanshi 🩷🤝#TATAIPL | #KhelBindaas | #PBKSvRR | @rajasthanroyals pic.twitter.com/HICh8l5VIc— IndianPremierLeague (@IPL) April 28, 2026చదవండి: చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్.. ఎందుకంటే? -
చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్.. ఎందుకంటే?
ఐపీఎల్ 2026 సీజన్ రెండో ఫేజ్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి సగం ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్లో నిలవగా.. వరుస పరాజయాలతో లక్నో సూపర్జెయింట్స్ ఆఖరి స్థానానికి పరిమితమైంది. సీజన్ ఆరంభం నుంచి పంజాబ్, ఆర్సీబీ, రాజస్తాన్, ఎస్ఆర్హెచ్ విజయాలతో వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.మరి రెండో సగం కూడా పూర్తయ్యేసరికి ఈ జట్లే టాప్-4లో ఉంటాయా లేక ఏమైనా మార్పులు ఉంటాయా అంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఇదిలా ఉంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ ఐపీఎల్ 19వ సీజన్కు సంబంధించి బెస్ట్ స్టేడియాల జాబితా (ఒకటి నుంచి పది వరకు)ను ఎక్స్ వేదికగా విడుదల చేశాడు. ఆర్సీబీకి ఆడుతున్న హాజిల్వుడ్ తన హోంగ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి నంబర్వన్ స్థానాన్ని ఇచ్చాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మాత్రం హాజిల్వుడ్ 10వ స్థానం కేటాయించడం అతడిని చిక్కుల్లో పడేసినట్లయింది. తాను చెన్నై గ్రౌండ్లో ఆడటాన్ని ఆస్వాదించలేకపోయానని, అక్కడ వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఆఖరి స్థానం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. హాజిల్వుడ్ ఇలా తమ హోంగ్రౌండ్కు ఆఖరి స్థానం ఇవ్వడంపై సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 'నచ్చకపోతే వదిలేయాలి అంతేకాని ఇలా చెన్నై స్టేడియాన్ని అవమానించేలా ర్యాంక్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం' అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మన సన్రైజర్స్ హైదరాబాద్ హొంగ్రౌండ్ అయిన ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి హాజిల్వుడ్ ఏడో ర్యాంక్ కేటాయించాడు.హాజిల్వుడ్ టాప్-10 స్టేడియాలు..1. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు2. నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్3. వాంఖడే స్టేడియం, ముంబై4. హెచ్పీసీఏ స్టేడియం, ధర్మశాల5. పీసీఏ స్టేడియం, మొహలీ6. ఈడెన్ గార్డెన్స్, కోల్కతా7. రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్8. ఎక్నా స్టేడియం, లక్నో9. అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ10. ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నైఐపీఎల్ 19వ సీజన్లో జోష్ హాజిల్వుడ్ ఆర్సీబీకి కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 12 పరుగులిచ్చిన 4 వికెట్లు తీసిన హాజిల్వుడ్ ఐపీఎల్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. మొత్తంగా ఐపీఎల్లో హాజిల్వుడ్ 44 మ్యాచ్లాడి 65 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు నాలుగు వికెట్ల హాల్ అందుకున్నాడు. సీజన్లో ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్ను గురువారం గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.Hazlewood rankings Indian Stadiums: Chinnaswamy is No. 1 ❤️Ahmedabad has to be right up there 🙏Meanwhile, Chennai too hot for me so no. 10 😂 pic.twitter.com/J0VaPtbY5B— Aditya Saha (@Adityakrsaha) April 29, 2026చదవండి: ‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు! -
ప్రీతి జింటా దిమ్మతిరిగే కౌంటర్.. షాక్లో చాహల్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ క్యాంపులో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉండటంతో, యజ్వేంద్ర చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రీతి జింటాను ఉద్దేశించి సరదాగా పోస్టు పెట్టాడు. ‘మేడమ్.. నాకు ఒక మ్యాచ్లో ఓపెనర్గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?’ అని సరదాగా అడిగాడు. దీనికి ప్రీతి జింటా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘తప్పకుండా చాహల్.. నీ కోసం ఏదైనా చేస్తాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రబ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు’ అంటూ లాఫింగ్ ఎమోజీ జత చేస్తూనే తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడంతో చాహల్ షాక్ తినక తప్పలేదు.ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసిన పంజాబ్ పలు రికార్డులు తన పేరిట లిఖించింది. ఇప్పటికే పట్టికలో టాప్ స్థానంలో కొనసా గుతున్న పంజాబ్ ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే ప్లేఆఫ్స్కు చేరే తొలి జట్టుగా కూడా నిలవనుంది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్కే పరిమితమైన పంజాబ్ ఈసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది.Mam ek match mein open batting karne ka chance mil jaaye toh 🥹🤣🤣😁 #pzchat— Yuzvendra Chahal (@yuzi_chahal) April 27, 2026చదవండి: వైరల్గా మారిన జితేశ్ శర్మ చర్య! -
వైరల్గా మారిన జితేశ్ శర్మ చర్య!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కనబరుస్తోంది. సీజన్లో 8 మ్యాచ్లాడిన ఆర్సీబీ 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో స్టాండ్స్లో ఉన్న ఒక ప్రేక్షకుడి చేతిలో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జెండా గాలిలో ఎగురుకుంటూ మైదానంలోకి వచ్చింది. దీనిని గమనించిన ఆర్సీబీ వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆ జెండాను అందుకొని తన జేబులో పెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్ను మే1న రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది. The way Jitesh shows respect towards DC flag he is pure soul 🥺❤️ pic.twitter.com/1nyd5XpPN3— Ankur (@flick_class) April 28, 2026చదవండి: ‘కేఎల్ రాహుల్పై విషం చిమ్మడం ఆపండి!’ -
రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ అభిమాని కొడుకు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్ దేశవాలీ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్ వికెట్కీపర్ బ్యాటర్ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్మీడియాలో బాగా వైరలయ్యాయి.వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బిహేవియర్ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్ దేశవాలీ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్లో సంచలనంగా మారింది.వెస్టిండీస్ ఛాంపియన్షిప్ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్ (522/9) అందించాడు.ఈ ఇన్నింగ్స్తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా నిలిచాడు.అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్ తరఫున చేశాడు.వెస్టిండీస్ తరఫున అడపాదడపా టెస్ట్ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. -
పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!
క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగబడడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఆడింది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ రూం వద్ద ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్తో అతడి వద్దకు పరిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్రయత్నించినప్పటికీ అధికారులు అతడిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని పట్టించుకోలేదు. దీంతో కోహ్లి తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడన్న కోపంతో తన చేతిలోని బ్యాట్ను విసిరేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘటన మ్యాచ్కు ముందు జరిగిందా లేక తర్వాత జరిగిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ బుడ్డోడు మాత్రం తన చర్యతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.Virat Kohli Little fan broke down 😭💔Virat kohli ignored this little fan who was waiting to get his autograph 😭Wait for that child frustration 😭💔 pic.twitter.com/BszA4JX5NW— Jeet (@JeetN25) April 27, 2026చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే? -
ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 19వ సీజన్తో బిజీగా ఉన్నప్పటికీ తన మూలాలను మాత్రం మరిచిపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టు ఢిల్లీ వీడినప్పటికీ కోహ్లి మాత్రం తన స్వస్థలంలోనే ఉండిపోయాడు. దీనికి ఒక ప్రధాన కారణముంది. వెస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ (డబ్ల్యూడీసీఏ) కొత్త బ్రాంచ్ను ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి కోహ్లితో పాటు అతడి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కూడా హాజరయ్యారు. ఇది తన కోచ్ రాజ్కుమార్ శర్మ క్రికెట్ అకాడమీ కావడంతో ఆయన మీద గౌరవంతో కోహ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీలోనే ఉండిపోయాడు. అయితే కార్యక్రమంలో భాగంగా అకాడమీ స్టూడెంట్లకు కోహ్లి అవార్డులు అందజేశాడు. ఈ నేపథ్యంలో ఒక స్టూడెంట్ కోహ్లి కాళ్లను మొక్కే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి వద్దని వారించి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అకాడమీలోని స్టూడెంట్స్ను ఉద్దేశించి కోహ్లి మాట్లాడాడు. ‘నేను నా జీవితంలో చిన్న వయసులోనే క్రీడలను నా కెరీర్గా ఎంచుకున్నాను. కానీ ఏది చేసినా నిజయితీతో చేయాలనుకున్నా. అందుకే క్రికెటర్ కావాలని ధృడంగా నిర్ణయించుకున్నా. ఈ సమయంలో నా కుటుంబం, ఉపాధ్యాయుల వద్ద నిజాయితీగా ఉన్నాను. ఇక వర్ధమాన క్రికెటర్లు తమ ఆశయాల పట్ల పూర్తి నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన అవసరముంది. మీరు కంటున్న కలల పట్ల, ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై పూర్తి క్లారిటీగా ఉంటే మంచింది. ఆ కలను నెరవేర్చుకునేందుకు వందశాతం నిజాయితీతో కష్టపడితే ఫలితం మనల్ని వెతుక్కుంటూ వస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక అకాడమీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లి.. అది తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు. ‘నేను ఎనిమిదేళ్ల వయసులో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా అకాడమీకి వస్తూనే ఉంటాను. ఇది నా బాల్యంలోని ఒక పెద్ద భాగం, ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలందరూ దీనికి విలువ ఇస్తారని నేను ఆశిస్తున్నాను’ అని అతను ముగించాడు.ఐపీఎల్ 19వ సీజన్లో విరాట్ కోహ్లి 8 మ్యాచ్లాడి 351 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 44 బంతుల్లోనే 81 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక సోమవారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కోహ్లి ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్లో 23 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్లో 9వేల పరుగుల మార్క్ను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.#WATCH | Delhi: Cricket star Virat Kohli inaugurated a branch of West Delhi Cricket Academy at DPS RK Puram. His childhood coach, Rajkumar Sharma was also with him. pic.twitter.com/gQumDN5om8— ANI (@ANI) April 28, 2026చదవండి: ‘ఎందుకీ డబుల్ గేమ్?’.. వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహం -
‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైవిధ్యమైన ఆటతో శ్రేయస్ తన ముద్ర ఎప్పుడో వేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో నిలకడగా మారుపేరుగా నిలిచిన శ్రేయస్ టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం అదే టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు అతనొక కెప్టెన్ మాత్రమే కాదు.. బ్యాటర్గా, ఫినిషర్గానూ సత్తా చాటుతూ అన్ని పాత్రలను సమర్థంగా పోషిస్తున్నాడు. అయితే ఈ మార్పు వెనుక తనను చికాకు పెట్టేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తన మైండ్లో ఉన్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఆ వ్యాఖ్యలతో తనను రెచ్చగొట్టారని, జనాలు అనుకుంటున్నది తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు అయ్యర్ తెలిపాడు. జియో హాట్స్టార్ నిర్వహించిన బిలీవ్ కార్యక్రమానికి హాజరైన అయ్యర్ మాట్లాడాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ ను అద్భుతమైన సిక్సర్గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.అయ్యర్ మాట్లాడుతూ.. ‘నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్గా దానిని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు.ఇక వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలపై కూడా అయ్యర్ స్పందించాడు. ‘గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు అన్న మాటలు బాగా వినిపించాయి. అయితే గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించాను. గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్సెట్ పూర్తిగా మారింది. నా జోన్లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఆడుతున్నా. దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్లోకి రావడం (రిథమ్ను) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో కనిపించే ఆ రిథమ్ను నేను కూడా అలవర్చుకున్నాను’ అని అయ్యర్ తన నిలకడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాలను వివరించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్ల్లో నెగ్గి 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పంజాబ్ కింగ్స్ మొదట ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోనుంది. ఇక అయ్యర్ ఏడు మ్యాచ్ల్లో 186 స్ట్రైక్రేట్తో 279 పరుగులు సాధించాడు.చదవండి: చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు


