cricket news
-
చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బద్దలు
ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్ చేసిన ఆటగాళ్లుఆయుశ్ మాత్రే 17 ఏళ్ల 168 రోజులుయశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజులురాబిన్ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులుటామ్ ప్రెస్ట్ 19 ఏళ్ల 136 రోజులుమాత్రే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. నాగాలాండ్తో మ్యాచ్లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్లో మాత్రే.. అంగ్క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్కు 156 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ (28 బంతుల్లో 73 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్ చేసింది. శార్దూల్ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్లో బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్తో మెరిసిన శార్దూల్ ఠాకూర్ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్స్టన్ డయాస్ రెండు, సుయాన్ష్ షేడ్గే ఓ వికెట్ దక్కించుకున్నారు. నాగాలాండ్ ఇన్నింగ్స్లో డేగా నిశ్చల్ (5), హేమ్ చెత్రి (2), యుగంధర్ సింగ్ (0), కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ (0), చేతన్ బిస్త్ (0) ఔట్ కాగా.. రుపేరో (22), జే సుచిత్ (9) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో నాగాలాండ్ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.ఈ మ్యాచ్లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్మెంట్ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే..!
మెల్బోర్న్ టెస్ట్లో ఓటమితో 2024 సంవత్సరాన్ని ముగించిన టీమిండియా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది. సిడ్నీ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సాగనుంది. అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్జనవరి 22- తొలి టీ20 (కోల్కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి.మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 జరుగుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జూన్ 20న మొదలవుతుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఇలా ఉండనుంది.జూన్ 20-24: తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6: రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14: మూడో టెస్ట్ (లండన్, లార్డ్స్)జులై 23-27: నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4: ఐదో టెస్ట్ (లండన్, కెన్నింగ్స్టన్ ఓవల్)షెడ్యూల్ ప్రకారం టీమిండియా వచ్చే ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.2025లో టీమిండియా ఆడే వన్డేలుఇంగ్లండ్తో 3ఛాంపియన్స్ ట్రోఫీలో 5బంగ్లాదేశ్తో 3 (బంగ్లాదేశ్తో)ఆస్ట్రేలియాతో 3 (ఆస్ట్రేలియాలో)సౌతాఫ్రికాతో 3 (భారత్లో)వచ్చే ఏడాది టీమిండియా ఆడే టెస్ట్లుఆస్ట్రేలియాతో ఒకటి (బీజీటీ)క్వాలిఫై అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ఇంగ్లండ్తో 5 (ఇంగ్లండ్లో)వెస్టిండీస్తో 2 (భారత్లో)సౌతాఫ్రికాతో 2 (భారత్లో) -
నిప్పులు చెరిగిన డఫీ.. లంకను చిత్తు చేసిన కివీస్.. సిరీస్ కైవసం
మౌంట్ మాంగనూయ్ వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ సిరీస్ను కివీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ (డిసెంబర్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. టిమ్ రాబిన్సన్ (41), మార్క్ చాప్మన్ (42), మిచెల్ హే (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 23, డారిల్ మిచెల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో మిచెల్ హే (Mitchell Hay) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మతీశ పతిరణ తలో వికెట్ దక్కించుకున్నారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. జేకబ్ డఫీ (Jacob Duffy) (4-0-15-4) నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో రెండు.. మైఖేల్ బ్రేస్వెల్, జకరీ ఫోల్క్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లంక ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా (48) టాప్ స్కోరర్గా నిలువగా.. పథుమ్ నిస్సంక (37), చరిత్ అసలంక (20), కుసాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కమిందు మెండిస్ (7), అవిష్క ఫెర్నాండో (5), వనిందు హసరంగ (1), మహీశ్ తీక్షణ (0), బినుర ఫెర్నాండో (3), మతీశ పతిరణ (0) విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 నెల్సన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 2న జరుగనుంది.తొలి మ్యాచ్లోనూ ఇబ్బంది పెట్టిన డఫీన్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ తలో టీ20లోనూ లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్లో డఫీ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. తద్వారా ఛేదనలో శ్రీలంక ఇబ్బంది పడి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (62), మైఖేల్ బ్రేస్వెల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ, బినుర తలో రెండు వికెట్లు తీయగా.. పతిరణ ఓ వికెట్ దక్కించుకున్నాడు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు నిస్సంక (90), కుసాల్ మెండిస్ (46) రాణించడంతో ఓ దశలో గెలుపు దిశగా సాగింది. అయితే డఫీ సహా కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ (2/28), జకరీ ఫోల్క్స్ (2/41) ఒక్కసారిగా విజృంభించడంతో శ్రీలంక ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లంక ఇన్నింగ్స్లో ఓపెనర్లు మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. -
IND VS AUS 4th Test: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియా ముందు భారీ లక్ష్యంమెల్బోర్న్ టెస్ట్లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాథన్ లయోన్ (41), స్కాట్ బోలాండ్ (10) చివరి వికెట్కు 50కు పైగా పరుగులు (100కు పైగా బంతులు ఎదుర్కొని) జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్టార్క్ రనౌట్ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్148 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న లబూషేన్ను (70) సిరాజ్ సూపర్ డెలివరీతో ఎల్బీడబ్ల్యూ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 253 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. గాడిలో పడుతున్న ఆస్ట్రేలియాలంచ్ తర్వాత వడివడిగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీ విరామానికి ముందు కాస్త కుదుటపడింది. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆ ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. టీ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 135/6గా ఉంది. లబూషేన్ (65).. కమిన్స్తో (21) కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్91 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన బంతితో అలెక్స్ క్యారీని (2) క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 196 పరుగుల లీడ్లో ఉంది. బుమ్రా ఆన్ ఫైర్.. 85 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. తొలుత డేంజర్ మ్యాన్ ట్రవిస్ హెడ్ను (1) పెవిలియన్కు పంపిన బుమ్రా అదే ఓవర్ చివరి బంతికి మిచెల్ మార్ష్ను (0) ఔట్ చేశాడు. మొత్తంగా ఆసీస్ 10 బంతుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. జోరు మీదున్న బుమ్రా, సిరాజ్.. కష్టాల్లో ఆసీస్భారత పేసర్లు బుమ్రా, సిరాజ్ జోరు మీదున్నారు. వీరి ధాటికి ఆసీస్ ఆరు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్ను (13) సిరాజ్.. డేంజర్ మ్యాన్ ట్రవిస్ హెడ్ను (1) బుమ్రా పెవిలియన్కు పంపారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 85/4గా ఉంది. లబూషేన్ (39), మిచెల్ మార్ష్ క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 190 పరుగుల ఆధిక్యంలో ఉంది.లంచ్ బ్రేక్.. 158 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియారోజు లంచ్ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 53/2గా ఉంది. 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని ప్రస్తుతం ఆసీస్ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబూషేన్ (20), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్లో ఉన్నారు.43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్తొలి ఇన్నింగ్స్లో టీమిండియాను 369 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కొన్స్టాస్ను బుమ్రా.. ఖ్వాజాను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. లబూషేన్ (16), స్టీవ్ స్మిత్ క్రీజ్లో ఉన్నారు.భారత్ 369 ఆలౌట్358/9 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఓవర్నైట్ స్కోర్కు మరో 11 పరుగులు జోడించి 369 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి (114) చివరి వికెట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
IND Vs AUS 4th Test: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్
IND VS AUS 4th Test Day 3 Live Updates And Highlights:మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట ముందుగానే ముగిసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 358/9గా ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి (105), సిరాజ్ (2) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ గడ్డపై సత్తా చాటిన తెలుగోడు.. నితీశ్ సూపర్ సెంచరీఆసీస్ గడ్డపై తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటాడు. మెల్బోర్న్ టెస్ట్లో నితీశ్ సూపర్ సెంచరీ చేశాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు బరిలోకి దిగిన నితీశ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. బోలాండ్ బౌలింగ్లో బౌండరీ బాది నితీశ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ నంబర్ ఆటగాడు సిరాజ్ సహకారంతో నితీశ్ సెంచరీ పూర్తి చేశాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్.. బుమ్రా డకౌట్ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సుందర్ ఔట్348 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లయోన్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి సుందర్ పెవిలియన్ బాట పట్టాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్.. సెంచరీకి చేరువగా నితీశ్లయోన్ బౌలింగ్లో సింగిల్ తీసి వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్ 146 బంతుల్లో సింగిల్ బౌండరీతో హాఫ్ సెంచరీ మార్కు తాకాడు. మరో ఎండ్లో నితీశ్కుమార్ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం నితీశ్ స్కోర్ 94 నాటౌట్గా ఉంది. భారత్ స్కోర్ 345/7. నితీశ్, సుందర్ ఇద్దరూ క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది. తిరిగి ప్రారంభమైన ఆట10:30- వెలుతురు లేమి కారణంగా కాసేపు నిలిచిపోయిన ఆట తిరిగి ప్రారంభమైంది. వెలుతరు లేమి కారణంగా నిలిచిపోయిన ఆట.. సెంచరీకి చేరువగా నితీశ్వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా స్కోర్ 326/7గా ఉంది. భారత్ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన నితీశ్ కుమార్ (85) సెంచరీకి చేరువగా ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ (40) నితీశ్కు అండగా క్రీజ్లో ఉన్నాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 100కు పైగా పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం నితీశ్కుమార్ రెడ్డి చేసుకున్న పుష్ప తరహా సెలబ్రేషన్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.లంచ్ విరామం.. ఎదురీదుతున్న టీమిండియా మూడో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఎదురీదుతుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 230 పరుగులు వెనుకపడి ఉంది. నితీశ్కుమార్ రెడ్డి (40), సుందర్ (5) క్రీజ్లో ఉన్నారు. భారత్ స్కోర్ 244/7గా ఉంది.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా221 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. లయోన్ బౌలింగ్లో రవీంద్ర జడేజా (17) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్191 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బాగా సెట్ అయ్యాడనుకున్న తరుణంలో రిషబ్ పంత్ (28) బోలాండ్ బౌలింగ్లో లయోన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మూడో రోజు మొదలైన ఆట310 పరుగులు వెనుకపడి టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభించింది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్లో ఉన్నారు.రెండో రోజు ముగిసిన ఆటబాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా 6 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 164/5గా ఉంది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 310 పరుగులు వెనుకపడి ఉంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, నైట్ వాచ్మన్ ఆకాశ్దీప్ 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్మన్ గిల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ఆసీస్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కొంటాస్ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ -
విధ్వంసం సృస్టించిన సురేశ్ రైనా
బిగ్ క్రికెట్ లీగ్-2024 ఎడిషన్లో ఇవాళ (డిసెంబర్ 22) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సథరన్ స్పార్టన్స్తో జరుగుతున్న అంతిమ పోరులో ముంబై మెరైన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సథరన్ స్పార్టన్స్కు టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా సారథ్యం వహిస్తుండగా.. ముంబై మెరైన్స్కు టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఫిల్ మస్టర్డ్ ఊచకోత.. సురేశ్ రైనా విధ్వంసంతొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ స్పార్టన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 78; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోయగా.. సురేశ్ రైనా (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, సిక్సర్) విధ్వంసం సృష్టించాడు. స్పార్టన్స్ ఇన్నింగ్స్లో సోలొమన్ మైర్ 7, అభిమన్యు మిధున్ 25, ఫయాజ్ ఫజల్ 30, అమాన్ ఖాన్ 10 పరుగులు చేశారు. మెరైన్స్ బౌలర్లలో మన్ప్రీత్ గోని, మనన్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే కీలకమైన వైట్బాల్ సిరీస్లకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్థార్ ఆటగాడు, టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా పై రెండు ఈవెంట్లకు దూరమయ్యాడు. 33 ఏళ్ల స్టోక్స్ ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. భారత్తో జరిగే టెస్ట్ సిరీస్, యాషెస్ సిరీస్ 2025-26 దృష్ట్యా స్టోక్స్కు విశ్రాంతి కల్పించారని తెలుస్తుంది.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే వైట్బాల్ సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. టెస్ట్ జట్టు కీలక సభ్యుడు జో రూట్, 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలి సారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. వికెట్కీపర్లు జేమీ స్మిత్, ఫిల్ సాల్ట్.. రైజింగ్ స్టార్ జేకబ్ బేతెల్ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.భారత్తో సిరీస్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్గా మెక్కల్లమ్కు ఇవే తొలి అసైన్మెంట్స్ అవుతాయి. ఇప్పటివరకు మెక్కల్లమ్ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే హెడ్ కోచ్గా ఉన్నాడు.భారత్తో జరిగే వన్డే సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీల కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్తో జరిగే టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్లో ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ వివరాలు..జనవరి 22- తొలి టీ20 (కోల్కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. టోర్నీకి సంబంధించిన మ్యాచ్ తేదీలను, వేదికలను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు తటస్థ వేదికలపై జరుగనున్నాయి. -
విండీస్ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లాదేశ్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 18) ఉదయం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో షమీమ్ హొస్సేన్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. షమీమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. మెహిది హసన్ మిరాజ్ (26), జాకిర్ అలీ (21), మెహిది హసన్ (11), సౌమ్య సర్కార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో మోటీ 2, అకీల్ హొసేన్, రోస్టన్ ఛేజ్, అల్జరీ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు.130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 18.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ 3, మెహిది హసన్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొసేన్ తలో 2, హసన్ మహమూద్ ఓ వికెట్ తీసి విండీస్ను దెబ్బకొట్టారు. బంగ్లా బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని ఔరా అనిపించారు. విండీస్ ఇన్నింగ్స్లో రోస్టన్ ఛేజ్ (32), అకీల్ హొసేన్ (31), జాన్సన్ ఛార్లెస్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్కు వెస్టిండీస్పై ఆరేళ్ల తర్వాత తొలి సిరీస్ విజయం ఇది. బంగ్లాదేశ్ చివరిసారి 2018లో వెస్టిండీస్పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది. బంగ్లాదేశ్.. వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై చిత్తు చేయడం విశేషం. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 19న జరుగనుంది. -
ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
-
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తొలి వన్డే రద్దు
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 17) జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. అయితే మధ్యలో వరుణుడు కాసేపు శాంతించడంతో 28 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించింది.సామ్ కర్రన్ సోదరుడు అరంగేట్రంఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ పెద్ద సోదరుడు బెన్ కర్రన్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. బెన్ తన తండ్రి దేశమైన జింబాబ్వే తరఫున తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్లో బెన్ 22 బంతులు ఎదుర్కొని ఓ బౌండరీ సాయంతో 15 పరుగులు చేశాడు. అనంతరం బెన్ అజ్మతుల్లా బౌలింగ్లో ఇక్రమ్ అలీఖిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నిప్పులు చెరిగిన ఒమర్జాయ్తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిప్పులు చెరగడంతో విలవిలలాడిపోయింది. ఒమర్జాయ్ ధాటికి జింబాబ్వే 41 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒమర్జాయ్ 4.2 ఓవర్లలో 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. జింబాబ్వే స్కోర్ 44/5 వద్ద నుండగా (9.2 ఓవర్లు) వర్షం మళ్లీ మొదలైంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో బెన్ కర్రన్ 15, మరుమణి 6, బ్రియాన్ బెన్నెట్ 0, డియాన్ మైర్స్ 12, సీన్ విలియమ్స్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (1),సికందర్ రజా (1) క్రీజ్లో ఉన్నారు. -
శిఖర్ ధవన్ సుడిగాలి శతకం
బిగ్ క్రికెట్ లీగ్లో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ చెలరేగి ఆడుతున్నాడు. ఈ లీగ్లో నార్తర్న్ ఛార్జర్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధవన్.. యూపీ బ్రిడ్జ్ స్టార్స్తో జరిగిన మ్యాచ్లో సుడిగాలి శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్లో 49 బంతుల్లోనే శతక్కొట్టిన ధవన్.. ఓవరాల్గా 63 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. SHIKHAR DHAWAN CENTURY. 🙇♂️🔥pic.twitter.com/CntrgLAf4L— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024ధవన్కు జతగా మరో ఎండ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ సమీవుల్లా షెన్వారీ కూడా విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. షెన్వారీ 46 బంతుల్లో 11 సిక్స్లు, 7 ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్-షెన్వారీ జోడీ తొలి వికెట్కు 207 పరుగులు జోడించింది. ధనవ్, షెన్వారీ సుడిగాలి శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది.పరుగుల వరద పారిస్తున్న ధవన్బిగ్ క్రికెట్ లీగ్లో శిఖర్ ధవన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ధవన్ 170కి పైగా స్ట్రయిక్రేట్తో 301 పరుగులు చేశాడు. ఈ లీగ్లో ధవన్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా కూడా ధవన్లో జోరు ఏమాత్రం తగ్గలేదు. రిటైర్మెంట్ అనంతరం ధవన్ ప్రతి చోటా లీగ్లు ఆడుతున్నాడు. ఇటీవలే అతను నేపాల్ క్రికెట్ లీగ్లోనూ పాల్గొన్నాడు. ధవన్ అక్కడ కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడి అభిమానులను అలరించాడు. -
WI Vs BAN: వెస్టిండీస్పై చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. కింగ్స్టౌన్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 16) జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ గడ్డపై టీ20ల్లో బంగ్లాదేశ్కు ఇది తొలి విజయం. తద్వారా ఈ మ్యాచ్కు చారిత్రక గుర్తింపు దక్కింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (43), జాకెర్ అలీ (27), మెహిది హసన్ (26 నాటౌట్), షమీమ్ హొసేన్ (27) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, ఓబెద్ మెక్కాయ్ తలో రెండు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. మెహిది హసన్ 4 వికెట్లు తీసి విండీస్ను దెబ్బకొట్టాడు. హసన్ మహహూద్, తస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ హసన్, రిషద్ హొసేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రోవ్మన్ పావెల్ (60) విండీస్ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో రోవ్మన్ పావెల్తో పాటు రొమారియో షెపర్డ్ (22), జాన్సన్ ఛార్లెస్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్ వికెట్కీపర్ లిట్టన్ దాస్ ఐదుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 17న జరుగనుంది.కాగా, టీ20 సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆతిథ్య వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. -
ముగిసిన మినీ వేలం.. అత్యంత ఖరీదైన ప్లేయర్ ఎవరంటే..?
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ మినీ వేలంలో బెంగళూరు నగరంలో ఇవాళ (డిసెంబర్ 15) జరిగింది. ఈ వేలంలో దేశ విదేశాలకు చెందిన 120 మంది ప్లేయర్లు పాల్గొనగా.. ఖాళీగా ఉన్న 19 స్థానాలు భర్తీ అయ్యాయి. వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్గా షేక్ సిమ్రన్ నిలిచింది. సిమ్రన్ను గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది. సిమ్రన్ తర్వాత అత్యధిక ధర విండీస్ ఆల్రౌండర్ డియాండ్రా డొట్టిన్కు దక్కింది. డొట్టిన్ను గుజరాత్ జెయింట్స్ రూ.1.7 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో మరో ఇద్దరు భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లకు కోటి పైన ధర లభించింది. జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు.. ప్రేమా రావత్ను ఆర్సీబీ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకున్నాయి.డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్లుషేక్ సిమ్రన్-1.9 కోట్లు (గుజరాత్ జెయింట్స్)డియాండ్రా డొట్టిన్-1.7 కోట్లు (గుజరాత్ జెయింట్స్)జి కమలిని-1.6 కోట్లు (ముంబై ఇండియన్స్)ప్రేమా రావత్-1.2 కోట్లు (ఆర్సీబీ)నల్లపురెడ్డి చరణి-55 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే..!ముంబై ఇండియన్స్:జి కమిలిని-1.6 కోట్లునడినే డి క్లెర్క్-30 లక్షలుఅక్షిత మహేశ్వరి-20 లక్షలుసంస్కృతి గుప్తా-10 లక్షలుఆర్సీబీ:ప్రేమా రావత్-1.2 కోట్లుజోషిత-10 లక్షలురాఘ్వి బిస్త్-10 లక్షలుజాగ్రవి పవార్-10 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్:నల్లపురెడ్డి చరణి-55 లక్షలునందిని కశ్యప్-10 లక్షలుసారా బ్రైస్-10 లక్షలునికీ ప్రసాద్-10 లక్షలుయూపీ వారియర్జ్:అలానా కింగ్-30 లక్షలుఆరుషి గోయెల్-10 లక్షలుక్రాంతి గౌడ్-10 లక్షలుగుజరాత్ జెయింట్స్:షేక్ సిమ్రన్-1.9 కోట్లుడియాండ్రా డొట్టిన్-1.7 కోట్లుడేనియెల్ గిబ్సన్-30 లక్షలుప్రకాషిక నాయక్-10 లక్షలు -
ఘనంగా ప్రారంభమైన బిగ్బాష్ లీగ్.. తొలి మ్యాచ్లో స్టోయినిస్ జట్టు ఓటమి
ఈ ఏడాది బిగ్బాష్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో మార్కస్ స్టోయినిస్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్.. పెర్త్ స్కార్చర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. స్టోయినిస్ (37), టామ్ కర్రన్ (37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్లో జో క్లార్క్ 0, థామస్ రోజర్స్ 14, సామ్ హార్పర్ 1, కార్ట్రైట్ 18, వెబ్స్టర్ 19, హెచ్ మెక్కెంజీ 4, ఆడమ్ మిల్నే 2, బ్రాడీ కౌచ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. స్కార్చర్స్ బౌలర్లలో జై రిచర్డ్సన్ 3, లాన్స్ మోరిస్ 2, బెహ్రెన్డార్ఫ్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన స్కార్చర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కూపర్ కన్నోలీ (64) మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్టార్చర్స్ విజయానికి బీజం వేశాడు. ఆస్టన్ టర్నర్ (37 నాటౌట్), నిక్ హాబ్సన్ (27 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్లతో స్కార్చర్స్ను విజయతీరాలకు చేర్చారు. స్కార్చర్స్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (6), కీటన్ జెన్నింగ్స్ (4), మాథ్యూ హర్స్ట్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మెల్బోర్న్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, పీటర్ సిడిల్, టామ్ కర్రన్, బ్రాడీ కౌచ్ తలో వికెట్ పడగొట్టారు. రేపు జరుగబోయే మ్యాచ్లో సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. -
మినీ వేలం.. విండీస్ అల్రౌండర్కు భారీ మొత్తం
మహిళల ఐపీఎల్ (WPL) మినీ వేలం బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) జరుగుతుంది. ఈ వేలంలో విండీస్ ఆల్రౌండర్, లేడీ యూనివర్సల్ బాస్గా పిలువబడే డియాండ్రా డొట్టిన్ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.7 కోట్ల భారీ మొత్తనికి సొంతం చేసుకుంది. ఇవాళ జరుగుతున్న మినీ వేలంలో మొదటిగా సోల్డ్ ఔటైన ప్లేయర్ డొట్టినే. డొట్టిన్ను 2023 డబ్ల్యూపీఎల్ ఇనాగురల్ ఎడిషన్లో కూడా గజరాత్ జెయింట్సే సొంతం చేసుకుంది. ఆ సీజన్లో జెయింట్స్ డొట్టిన్ను రూ. 60 లక్షలకు దక్కింంచుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ లీగ్ ప్రారంభానికి ముందే జెయింట్స్ డొట్టిన్ను వదిలేసింది. డొట్టిన్ తొలుత 2022లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కలు పలికింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్కప్కు ముందు డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ యేడు పొట్టి ప్రపంచకప్లో డొట్టిన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఐదు ఇన్నింగ్స్ల్లో 120 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసింది.కాగా, ఈసారి మెగా వేలంలో గుజరాత్ జెయింట్సే అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగింది. జెయింట్స్ వద్ద రూ.4.4 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో జెయింట్స్ కేవలం నాలుగు స్లాట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. డొట్టిన్ కోసం జెయింట్స్తో పాటు యూపీ వారియర్జ్ తీవ్రంగా పోటీపడింది. అయితే అంతిమంగా డొట్టిన్ను జెయింట్సే దక్కించుకుంది. డొట్టిన్కు విధ్వంసకర బ్యాటర్గానే కాకుండా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్గానూ పేరుంది. అందుకే డొట్టిన్కు వేలంలో భారీ మొత్తం దక్కింది.ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో తమిళనాడు అమ్మాయి జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు సొంతం చేసుకుంది. నల్లపురెడ్డి చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. నందిని కశ్యప్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. సిమ్రన్ షేక్కు గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. సౌతాఫ్రికాకు చెందిన నదినే డి క్లెర్క్ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఆఫ్ఘనిస్తాన్
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే వేదికగా ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దర్విష్ రసూలీ (58) అర్ద సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా (28), గుల్బదిన్ (26 నాటౌట్), సెదికుల్లా అటల్ (18), గుర్బాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ట్రెవర్ గ్వాండు, ర్యాన్ బర్ల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.154 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 17.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, ఒమర్జాయ్, ఫరీద్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో సికందర్ రజా (35) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రియాన్ బెన్నెట్ (27), తషింగ ముసేకివా (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14న జరుగనుంది. -
పాకిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం
పాకిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు రెడ్ బాల్ (టెస్ట్) కోచ్ జేసన్ గిల్లెస్పీ జట్టుతో పాటు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చోటు చేసుకుంటున్న పరిణామాలే గిల్లెస్పీ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది.పీసీబీ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలతో గిల్లెస్పీ కలత చెందాడని సమాచారం. గిల్లెస్పీ ఇవాళ (డిసెంబర్ 12) పాక్ టెస్ట్ జట్టుతో కలిసి దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. అయితే పాక్ జట్టు ప్రయాణించిన విమానంలో గిల్లెస్పీ జాడ కనబడలేదు. దీంతో ఆయన తన రాజీనామాను పీసీబీకి పంపినట్లు ప్రచారం జరుగతుంది. ఈ అంశంపై పీసీబీ వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు.గిల్లెస్పీ ఈ ఏడాది ప్రారంభంలో పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. గిల్లెస్పీ-పీసీబీ మధ్య రెండేళ్లకు ఒప్పందం కుదిరింది. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. అయితే బంగ్లా సిరీస్ తర్వాత పాక్ స్వదేశంలోనే ఇంగ్లండ్పై సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా పీసీబీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల పట్ల గిల్లెస్పీ అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది.పాక్ వైట్ బాల్ కోచ్గా గ్యారీ కిర్స్టన్ నిష్క్రమించిన కొద్ది రోజుల్లోనే గిల్లెస్పీ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్లో గిల్లెస్పీతో పాటు కిర్స్టన్ పాక్ హెడ్ కోచ్లుగా నియమించబడ్డారు. పాక్ జట్టుకు ఇద్దరు విదేశీ కోచ్లు ఆరు నెలలు కూడా నిలదొక్కుకోలేకవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిల్లెస్పీ గైర్హాజరీలో పాక్ రెడ్ బాల్ టీమ్ తాత్కాలిక బాధ్యతలను కూడా ఆకిబ్ జావిదే మొయవచ్చు. జావిద్ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాక్ తాత్కాలిక వైట్ బాల్ కోచ్గా నియమించబడ్డ విషయం తెలిసిందే.ప్రస్తుతం పాక్ పరిమిత ఓవర్ల జట్లు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్నాయి. టీ20, వన్డే సిరీస్ల అనంతరం పాక్ సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. రెండు టెస్టులు సెంచూరియన్ (డిసెంబర్ 26 నుంచి), కేప్ టౌన్ (జనవరి 3 నుంచి) వేదికలుగా జరుగనున్నాయి. -
ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్పై జింబాబ్వే విజయం
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరి బంతికి ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. తషింగ సింగిల్ తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లో జింబాబ్వే 11 పరుగులు రాబట్టి గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ను కరీమ్ జనత్ (54 నాటౌట్), మహ్మద్ నబీ (44) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 79 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, మసకద్జ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49) జింబాబ్వేను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చి ఔటయ్యాడు. ఇక్కడే ఆఫ్ఘన్లు జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. 11 పరుగుల వ్యవధిలో జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం చివరి బంతి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తషింగ (16 నాటౌట్), మసకద్జ (6 నాటౌట్) సాయంతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ (4-1-33-3), రషీద్ ఖాన్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ నబీకి ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 13న జరుగనుంది. -
అభిషేక్ శర్మ విధ్వంసం
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ ఓ లోకల్ టీ20 టోర్నమెంట్లో (టైమ్స్ షీల్డ్ టోర్నీ) చెలరేగిపోయాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్లో అభిషేక్ 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అభిషేక్ భారీ షాట్లు అడుతున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలొ అభిషేక్ ఆడిన షాట్లు చూస్తుంటే ఐపీఎల్ 2025 సీజన్ కోసం గట్టిగానే కసరత్తు చేస్తున్నాడనిపిస్తుంది.ABHISHEK SHARMA SHOW IN TIMES SHIELD TOURNAMENT...!!! 🙇- While playing in the red ball, Abhishek smashed 60 runs from just 22 balls, preparing hard for the 2025 season. pic.twitter.com/smqEHcOxNl— Johns. (@CricCrazyJohns) December 10, 2024అభిషేక్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లోనూ పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన అభిషేక్.. చివరి రెండు మ్యాచ్ల్లో తన ప్రతాపం చూపించాడు. మూడో టీ20లో 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసిన అభిషేక్.. నాలుగో మ్యాచ్లో 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఈ సిరీస్ను సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది.అభిషేక్ ఐపీఎల్ ప్రదర్శన విషయానికొస్తే.. గత సీజన్లో అభిషేక్ చెలరేగిపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరడంలో అభిషేక్ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 204.22 స్ట్రయిక్ రేట్తో 484 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ గత మూడు ఐపీఎల్ సీజన్లుగా రాణిస్తూ వస్తున్నాడు. అందుకే సన్రైజర్స్ అతన్ని వేలానికి వదిలి పెట్టకుండా అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 63 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 155.24 స్ట్రయిక్రేట్తో 1377 పరుగులు చేశాడు. -
గాయం రేపిన చిచ్చు.. రోహిత్-షమీ మధ్య విభేదాలు..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మొహమ్మద్ షమీ మధ్య విభేదాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా సోషల్మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలకు షమీ గాయం కారణమని తెలుస్తుంది. దైనిక్ జాగారణ్ నివేదిక మేరకు.. రోహిత్-షమీ మధ్య విభేదాలకు భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ సందర్భంగా బీజం పడింది. ఆ సిరీస్లోని తొలి టెస్ట్కు ముందు షమీ గురించి రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ ఫిట్గా లేడని, అతడి మోకాలి భాగంలో వాపు వస్తుందని రోహిత్ మీడియాకు వివరణ ఇచ్చాడు. మరోవైపు షమీ మాత్రం తాను పూర్తిగా ఫిట్గా ఉన్నట్లు సోషల్మీడియా వేదికగా ప్రకటించాడు. ఇదే విషయమై రోహిత్-షమీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. తాను పూర్తిగా ఫిట్గా ఉన్నప్పుడు తప్పుడు స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నావని షమీ రోహిత్ను నిలదీశాడట.తాజాగా మరోసారి అదే స్టేట్మెంట్అడిలైడ్ టెస్ట్లో టీమిండియా పరాజయం అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. షమీ మోకాలు మళ్లీ వాచిందని, గాయాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పాడు. షమీ కోసం టీమిండియా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నాడు. అయితే గాయం పూర్తిగా తగ్గకముందే బరిలోకి దింపి షమీని ఒత్తిడిలోకి నెట్టదలచుకోవడం లేదని అన్నాడు. రోహిత్ గతంలోనూ షమీపై ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ వ్యాఖ్యలకు భిన్నంగా..ఓ పక్క రోహిత్ శర్మనేమో షమీ పూర్తిగా ఫిట్గా లేడని స్టేట్మెంట్లు ఇస్తుంటే షమీ మాత్రం మైదానంలో అదరగొడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో షమీ దుమ్మురేపుతున్నాడు. అంతకుముందు రంజీ ట్రోఫీలోనూ షమీ సత్తా చాటాడు. తాను ఫిట్గా ఉండటమే కాకుండా మంచి ఫామ్లో కూడా ఉన్నట్లు షమీ మెసేజ్ పంపుతున్నాడు. తాజాగా చండీఘడ్తో జరిగిన ఓ మ్యాచ్లో షమీ ఆల్రౌండ్షోతో అదరగొట్టాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు చేయడటమే కాకుండా బౌలింగ్లో 13 డాట్ బాల్స్ వేసి ఓ వికెట్ తీశాడు. రోహిత్ చెబుతున్నట్టు షమీకి గాయం తిరగబెడితే అతను విశ్రాంతి తీసుకోవాలి కాని, బరిలోకి దిగి ఇంత మెరుగ్గా ఎలా ఆడగలడు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. -
రెండో టెస్ట్లోనూ సౌతాఫ్రికాదే విజయం.. సిరీస్ కైవసం
గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 205/5 వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక ఓవర్నైట్ స్కోర్కు మరో 33 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఛేదనలో శ్రీలంక 238 పరుగులకే చాపచుట్టేసింది. కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. రబాడ, డేన్ పీటర్సన్ తలో రెండు వికెట్లు.. జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. లంక సెకెండ్ ఇన్నింగ్స్లో ధనంజయ డిసిల్వ (50) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కుసాల్ మెండిస్ (46), కమిందు మెండిస్ (35), ఏంజెలో మాథ్యూస్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అంతకుముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 317 పరుగులకు ఆలౌటైంది. ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బేశాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్ (55), బవుమా (66) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులు చేసింది. 89 పరుగులు చేసిన పథుమ్ నిస్సంక టాప్ స్కోరర్గా నిలిచాడు. డేన్ పీటర్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (101), కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. లంక బౌలర్లలో లహీరు కుమార అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి టెస్ట్లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే. -
భారత క్రికెట్కు దుర్దినం.. ఒకే రోజు మూడు పరాభవాలు
భారత క్రికెట్కు సంబంధించి ఇవాళ (డిసెంబర్ 8) దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు భారత క్రికెట్ జట్లకు మూడు పరాభవాలు ఎదురయ్యాయి. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 122 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఇవాళే జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో యంగ్ ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. ఫైనల్లో భారత్పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్గా అవతరించింది. ఇలా ఒకే రోజు భారత క్రికెట్ జట్లు మూడు పరాభవాలు ఎదుర్కోవడంతో సగటు భారత క్రికెట్ అభిమాని బాధ పడుతున్నాడు. భారత క్రికెట్కు ఇవాళ దుర్దినం అని అభిప్రాయపడుతున్నాడు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో టీమిండియా గెలుపొందగా.. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరుగనుంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. తద్వారా ఆసీస్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది.అండర్-19 ఆసియా కప్ విషయానికొస్తే.. ఇవాళ జరిగిన ఫైనల్లో భారత్పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. -
పాక్ గడ్డపై భారత జట్టుకు మానని గాయాలు!
దాయది దేశాల క్రికెట్ పోరు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. కొన్ని కోట్ల మందికి, ముఖ్యంగా ఇరుదేశాల క్రికెట్ అభిమానుల్ని ఒకచోటుకు చేర్చి.. విపరీతమైన మజాను అందిస్తుంటుంది. అయితే ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు సన్నగిల్లడం, సరిహద్దు వివాదం, ఉగ్రదాడుల నేపథ్యాలు పరస్పర పర్యటనలకు ఇరుదేశాలను దూరం చేస్తూ వస్తున్నాయి. ఈ కారణంగానే వచ్చే ఏడాదిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్కు ఫిక్స్ అయ్యింది. అయితే..క్రికెట్ రంగంలోనే రిచ్చెస్ట్ బోర్డు అని.. ఐసీసీనే ప్రభావితం చేయగల సత్తా ఉందనే పేరుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)కి. అంతటి శక్తివంతమైన బోర్డు.. పాక్ గడ్డకు తమ ఆటగాళ్లను పంపించేందుకు, అక్కడి పిచ్లపై ఆడించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తోంది. దీనికి కొంత సమాధానం భారత మాజీ క్రికెటర్ రాసిన పుస్తకంలో దొరికింది.👉80వ దశకం చివర్లో.. పాక్-భారత్ మధ్య కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఉగ్రవాదాన్ని పైసలు, ఆశ్రయమిచ్చి మరీ పోషిస్తోందంటూ పాక్ను అంతర్జాతీయ సమాజంలో భారత్ ఎండగట్టడం మొదలుపెట్టింది అప్పుడే. అలాంటి టైంలో అనూహ్యంగా.. భారత జట్టు పాక్ పర్యటన వెళ్లాల్సి వచ్చింది.👉1989-90 సీజన్లో కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్వంలోని భారత జట్టు.. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు పాక్కు వెళ్లింది. అన్ని టెస్టులు డ్రాగా ముగియగా.. వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది. అయితే.. కరాచీ స్టేడియంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఎవరూ ఊహించని ఓ ఘటన జరిగింది. పాక్ జట్టు బ్యాటింగ్.. భారత్ ఫీల్డింగ్ చేస్తోంది. ఆ సమయంలో పథాన్ దుస్తుల్లో ఓ వ్యక్తి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. బహుశా ఎవరైనా అభిమాని తమ ఫేవరెట్ ప్లేయర్ను కలవడానికి అయ్యి ఉంటారేమో!.. సిబ్బంది అతన్ని అడ్డుకుంటారులే అనుకుంటూ భారత ఫీల్డర్లు తమతమ స్థానాల్లో ఉండిపోయారు. అయితే పిచ్ను సమీపించే కొద్దీ.. అతని ఉద్దేశం ఏంటో ఆటగాళ్లకి అర్థమైంది. ప్రోకశ్మీర్, భారత వ్యతిరేక స్లోగన్లతో దూసుకొచ్చాడతను. అసలు ఈ పర్యటనకు రాకుండా ఉండాల్సిందంటూ భారత ఆటగాళ్లు దూషిస్తున్నాడతను. ఇంతలో అంపైర్లు జోక్యం చేసుకుని.. అతన్ని అడ్డగించే మైదానం నుంచి వెనక్కి పంపే ప్రయత్నం చేయబోయారు. అయితే ఆ వ్యక్తి సరాసరి కృష్ణమాచారి శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఏదో అన్నాడు. అంతే.. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఒకరి గల్లా ఒకరు పట్టుకుని లాగేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ షర్ట్ చినిగిపోయింది. దీంతో జట్టు సభ్యులంతా దగ్గరికి పరిగెత్తారు. ఈలోపు.. సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని అక్కడి నుంచి లాక్కెల్లారు. క్రికెటర్ నుంచి కామెంటేటర్గా మారిన సంజయ్ మంజ్రేకర్ తన ‘ఇంపర్ఫెక్ట్’లో ఈ ఘటన గురించి రాసుకొచ్చారు. మంజ్రేకర్కు మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్కు కూడా ఈ మ్యాచ్ టెస్ట్ డెబ్యూ కావడం గమనార్హం.అయితే ఈ ఘటన తర్వాత..శ్రీకాంత్ తన షర్ట్ మార్చుకుని వచ్చాడు. అసలేం జరగనట్లు ఆట యధావిధిగా జరిగింది. కానీ ఇదే మ్యాచ్లో.. మరో భారతీయ ఆటగాడు ముహమ్మద్ అజారుద్దీన్పైనా మెటల్ హుక్తో దాడి జరిగింది. ఒకవేళ.. ఇవాళ అలాంటి ఘటనలే గనుక ఈనాడు జరిగి ఉంటే.. ఆ మ్యాచ్, సిరీస్..మొత్తం పర్యటనే రద్దు అయ్యి ఉండేదేమో!.👉ఇక.. అదే టూర్లో జరిగిన మరో ఘటన గుర్తు చేసుకుంటే.. మూడో వన్డే సందర్భంగా పెద్ద రచ్చే చెలరేగింది. కరాచీ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరుగుతుండగా.. 28 పరుగులకు పాక్ మూడు వికెట్లు పొగొట్టుకుంది. అది సహించలేని అభిమానులు భారత జట్టు ఆటగాళ్ల మీదకు రాళ్లు విసిరారు. పాక్ కెప్టెన్ జావెద్ మియాందాద్ అభిమానుల్ని శాంతపర్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు టియర్ గ్యాస్ ప్రయోగించి చెల్లాచెదురు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో మ్యాచ్ను రద్దు చేసి.. తిరిగి లాహోర్లో నిర్వహించారు.👉ఈ ఘటన తర్వాత ఇరు కూడా దేశాలు పర్యటనలను కొనసాగించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే సిరీస్లు నిర్వహించుకున్నాయి. తటస్థ వేదికల్లోనూ మ్యాచ్లు ఆడాయి.. ఇంకా ఆడుతున్నాయి. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భద్రతా కారణాల వల్లే తమ జట్టును పాక్కు పంపలేమని బీసీసీఐ కుండబద్ధలు కొట్టేసింది. ఇందుకు పైన చెప్పుకున్న కారణాలే కాదు.. ఇంకో ముఖ్యమైన ఘటన ఉంది.2009 శ్రీలంక జట్టుపై పాక్ పర్యటనలో జరిగిన దాడి.. క్రికెట్ చరిత్రలో ‘బుల్లెట్’ అక్షరాలతో లిఖించబడింది. టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా ముసుగులతో వచ్చిన కొందరు తూటాల వర్షం కురిపించారు. ఆరుగురు పోలీసాఫీసర్లు చనిపోగా.. లంక టీంకు ఆటగాళ్లు, అధికారులు ఏడుగురు గాయపడ్డారు. ఘటన తర్వాత ఎయిర్లిఫ్ట్ ద్వారా క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. క్రికెట్ చరిత్రలోనే అదొక చీకటి దినంగా మిగిలిపోయింది.ఈ ఘటన తర్వాత చాలా దేశాలు తమ జట్లను పాక్కు పంపేందుకు భయపడ్డాయి. అయితే భారత్ మాత్రం 2008 తర్వాతి నుంచి పాక్ గడ్డపై సిరీస్ ఆడలేదు. ముంబై 26/11 దాడులే అందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.👉పాక్ క్రికెట్ జట్టు ఇప్పటిదాకా పదిసార్లు.. భారత్లో పర్యటించింది. 1989 ఘటనలు పాక్ గడ్డపై భారత్కు మానని గాయం. అయితే ఆ ఘటనల తర్వాత కూడా భారత జట్టు మూడుసార్లు పాక్ పర్యటనకు వెళ్లింది. కానీ, మునుపటిలా పరిస్థితులు లేవిప్పుడు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగితే పర్వాలేదు. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కానీ, పాక్లో ఇప్పుడు పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్తో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. పైగా.. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత రాజకీయంగానూ పాక్లో సంక్షోభం నడుస్తోంది. ఒకవైపు ఉగ్రదాడులు.. ఇంకోవైపు అనుమానాస్పద రీతిలో ఉగ్ర నేతలు హతమవుతుండడం తీవ్ర చర్చనీయాంశంమైంది. అలాంటప్పుడు భారత ఆటగాళ్లకు భద్రత కల్పించడం ప్రశ్నార్థకమే!. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే ఇటు బీసీసీఐ, అటు కేంద్రప్రభుత్వం టీమిండియాను పాక్ పర్యటనకు అనుమతించడం లేదన్నది అర్థమవుతోంది. -
పాకిస్తాన్పై సంచలన విజయం సాధించిన పసికూన
బులవాయో వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్పై పసికూన జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే పాక్ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించి 132 పరుగులకే పరిమితం చేశారు. పాక్ ఇన్నింగ్స్లో టాపార్డర్ విఫలం కాగా.. సల్మాన్ అఘా (32), తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే అష్టకష్టాలు పడి ఎట్టకేలకే విజయతీరాలకు చేరింది. జింబాబ్వే మరో బంతి మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో బ్రియాన్ బెన్నెట్ (43) టాప్ స్కోరర్గా నిలువగా.. మరుమణి (15), డియాన్ మైర్స్ (13), సికంబర్ రజా (19) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. జహన్దాద్ ఖాన్ 2, సల్మాన్ అఘా, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్తాన్పై జింబాబ్వేకు టీ20ల్లో ఇది మూడో గెలుపు మాత్రమే.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాక్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్ నామమాత్రంగా సాగింది. ఈ మ్యాచ్లో గెలిచి జింబాబ్వే క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. అంతకుముందు వన్డే సిరీస్లోనూ జింబాబ్వే ఓ మ్యాచ్ గెలవగా.. పాక్ మిగతా రెండు మ్యాచ్లు గెలిచి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. -
రాణించిన జింబాబ్వే బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన పాకిస్తాన్
జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పాకిస్తాన్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు. పాక్ ఇన్నింగ్స్లో సల్మాన్ అఘా (32) టాప్ స్కోరర్గా నిలువగా.. తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ టాపార్డర్ బ్యాటర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (4), ఒమైర్ యూసఫ్ (0), ఉస్మాన్ ఖాన్ (5) విఫలమయ్యారు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో గెలిచిన పాక్ ఇదివరకే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ను సైతం పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లలో జింబాబ్వే తొలి వన్డేలో మాత్రమే గెలిచింది.