cricket news
-
కొడుకుతో కలిసి బరిలోకి దిగిన రాహుల్ ద్రవిడ్.. తండ్రి విఫలం.. కొడుకు హాఫ్ సెంచరీ
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 12 ఏళ్ల తర్వాత క్లబ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. చిన్న కొడుకు అన్వయ్తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ద్రవిడ్ విజయా క్రికెట్ క్లబ్కు (మాలుర్) ప్రాతినిథ్యం వహించాడు. యంగ్ లయన్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ద్రవిడ్ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ విఫలమైనా కొడుకు అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్.. 58 బంతుల్లో 8 బౌండరీల సాయంతో 60 పరుగులు చేశాడు. రాహుల్-అన్వయ్ కొద్ది సేపు కలిసి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు 17 బంతుల్లో 15 పరుగులు జోడించారు. క్రికెట్ చరిత్రలో తండ్రి కొడుకులు కలిసి ఆడటం చాలా అరుదుగా జరిగింది.కలిసి క్రికెట్ ఆడిన కొంతమంది తండ్రి కొడుకులు..డబ్ల్యూజీ గ్రేస్-గ్రేస్ జూనియర్లాలా అమర్నాథ్-సురిందర్ అమర్నాథ్డెన్నిస్ లిల్లీ-ఆడమ్ లిల్లీడెనిస్ స్ట్రీక్- హీథ్ స్ట్రీక్శివ్నరైన్ చంద్రపాల్-తేజ్ నరైన్ చంద్రపాల్ఇయాన్ బోథమ్-లియామ్ బోథమ్ఇలా చేయడం ద్రవిడ్కు కొత్తేమీ కాదు..!రిటైర్మెంట్ తర్వాత క్లబ్ క్రికెట్ ఆడటం ద్రవిడ్కు ఇది కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు తన చిన్ననాటి క్లబ్ అయిన బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్కు ఆడాడు. ఈ జట్టుకు ఆడుతూ ద్రవిడ్ ఓ సెంచరీ కూడా చేశాడు.ద్రవిడ్ పెద్ద కొడుకు కూడా క్రికెటరే..!ద్రవిడ్ చిన్న పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటరే. గతేడాది ఆగస్ట్లో సమిత్ భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది మహారాజా టీ20 టోర్నీలోనే సమిత్ పాల్గొన్నాడు.ఇటీవలే బెంగళూరుకు వచ్చిన ద్రవిడ్రాహుల్ ద్రవిడ్ ఇటీవలే తన హో సిటీ బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరుకు రాక ముందు ద్రవిడ్ గౌహతిలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రీ సీజన్ క్యాంప్లో పాల్గొన్నాడు. ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో స్వప్నిల్ అనే ఆటగాడు సుడిగాలి శతంకంతో విజృంభించడంతో విజయ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. స్వప్నిల్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. యంగ్ లయన్స్ బౌలర్లలో ఆధిత్య నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
కేరళ కల సాకారం.. కష్టానికి తోడైన అదృష్టం.. తొలిసారి రంజీ ఫైనల్లోకి ప్రవేశం
‘ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడి కేరళ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... 352 మ్యాచ్ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కేరళ జట్టు... తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ చాంపియన్ గుజరాత్తో జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించి తొలిసారి తుదిపోరుకు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్ను వెనక్కి నెట్టిన కేరళ... ఇప్పుడు సెమీఫైనల్లో గుజరాత్పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఒక్క పరుగే కదా అని తేలికగా తీసుకుంటే ... ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యర్థికి రుచి చూపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ ఫైనల్కు చేరిన కేరళ జట్టు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. సుదీర్ఘ కాలంగా రంజీ ట్రోఫీ ఆడుతున్న కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ మాదిరిగా తమ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా... నిలకడ కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేదు. తాజా సీజన్లో అసాధారణ పోరాటాలు, అనూహ్య ఫలితాలతో ఎట్టకేలకు కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. జమ్మూ కశ్మీర్తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన కేరళ జట్టు... సెమీస్లో మాజీ చాంపియన్ గుజరాత్పై 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ చిరకాల కల నెరవేర్చుకుంది.నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ చివరి రోజు కేరళ జట్టు అద్భుతమే చేసింది. చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు తుదిపోరుకు అర్హత సాధించాలంటే మరో 29 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా... కేరళ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయి మొండిగా పోరాడుతున్న గుజరాత్ బ్యాటర్లు జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్లను కేరళ బౌలర్ ఆదిత్య వెనక్కి పంపాడు. ఇంకేముంది మరో వికెట్ తీస్తే చాలు కేరళ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటే... ఆఖరి వికెట్కు అర్జాన్ నాగ్వస్వల్లా, ప్రియజీత్ సింగ్ జడేజా మొండిగా పోరాడారు.పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంటను చూస్తే ఇక మ్యాచ్ కేరళ చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో అర్జాన్ కొట్టిన షాట్ కేరళకు కలిసొచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్ బలంగా బాదే ప్రయత్నం చేశాడు. బంతి షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్కు తాకి గాల్లోకి లేచి ఫస్ట్ స్లిప్లో ఉన్న కెప్టెన్ సచిన్ బేబీ చేతిలో పడింది. అంతే కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్టార్లు లేకుండానే... స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ భారత జట్టులో ఉండగా... అనుభవజ్ఞులైన విష్ణు వినోద్, బాబా అపరాజిత్ వంటి వాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా ఈ సీజన్లో కేరళ జట్టు స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మిడిలార్డర్లో కెప్టెన్ సచిన్ బేబీతో పాటు సీనియర్ ప్లేయర్ జలజ్ సక్సేనా... యువ ఆటగాళ్లు మొహమ్మద్ అజహరుద్దీన్, సల్మాన్ నిజార్ అసమాన పోరాటం కనబర్చారు.జమ్మూ కశ్మీర్తో క్వార్టర్స్ పోరులో మ్యాచ్ను ‘డ్రా’ చేసేందుకు సల్మాన్, అజహరుద్దీన్ కనబర్చిన తెగువను ఎంత పొగిడినా తక్కువే. 40 ఓవర్లకు పైగా జమ్మూ బౌలర్లను కాచుకున్న ఈ జంట వికెట్ ఇవ్వకుండా మ్యాచ్ను ముగించి తొలి ఇన్నింగ్స్లో దక్కిన ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీఫైనల్కు చేరింది.తాజాగా గుజరాత్తో సెమీస్లోనూ తొలి ఇన్నింగ్స్లో కేరళ బ్యాటర్లు అసాధరణ ప్రదర్శన కనబర్చారు. సచిన్ బేబీ 195 బంతుల్లో 69 పరుగులు, జలజ్ సక్సేనా 83 బంతుల్లో 30 పరుగులు, అజహరుద్దీన్ 341 బంతుల్లో 177 పరుగులు, సల్మాన్ నిజార్ 202 బంతుల్లో 52 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముందు నుంచే చక్కటి గేమ్ ప్లాన్తో మైదానంలో అడుగుపెట్టిన కేరళకు చివర్లో అదృష్టం కూడా తోడవడంతో చక్కటి విజయంతో తొలిసారి రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ చరిత్రలో కేరళ జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమంగా 2018–19 సీజన్లో సెమీఫైనల్కు చేరింది.నిరీక్షణకు తెరదించుతూ.. తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు 1957లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. ఫుట్బాల్కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ వాసులు... క్రికెట్ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో కేరళ క్రికెట్లో అనూహ్య మార్పు వచ్చింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ స్ఫూర్తితో మరెందరో ఆటగాళ్లు క్రికెట్పై మక్కువ పెంచుకున్నారు.అందుకు తగ్గట్లే గత కొన్నేళ్లుగా కేరళలో క్రీడా మౌలిక వసతులు మరింత మెరుగు పడటంతో ప్రతిభావంతులు వెలుగులోకి రావడం మొదలైంది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అందుకే శుక్రవారం సెమీస్లో కేరళ జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ప్రసార మాధ్యమాల్లో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో పెరిగింది. ప్రతిష్టాత్మక టోర్నీలో కేరళ టీమ్ ఫైనల్కు చేరగానే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు... తామే గెలిచినంతగా లీనమైపోయి జట్టును అభినందనల్లో ముంచెత్తారు. మౌలిక వసతుల్లో భేష్.. సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే కేరళలో ఒకప్పుడు నిరంతరం అవుట్డోర్ ప్రాక్టీస్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫస్ట్క్లాస్ మైదానాలు అందుబాటులోకి వచ్చాయంటే కేరళ క్రికెట్లో ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కృషి వల్లే కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా... ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా రంజీ జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నారు.‘ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ఇతర జట్లతో పోల్చుకుంటే... కేరళ జట్టు ఎంపిక విభిన్నంగా ఉండేది. పరిమితమైన వనరులు మాత్రమే ఉండటంతో అందుబాటులో ఉన్నవాళ్లనే ఎంపిక చేసేవాళ్లం. ముందు ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో అకాడమీలను స్థాపించాం. కేవలం ప్లేయర్లకే కాకుండా కోచ్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒకప్పుడు వర్షం వస్తే ప్రాక్టీస్ ఆగిపోయేది. ఇప్పుడు ఇండోర్లోనూ నెట్స్ ఏర్పాటు చేశాం.2005లో రాష్ట్రంలో ఒక్క మైదానంలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం 17 ఫస్ట్క్లాస్ గ్రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలో లేనంతమంది బీసీసీఐ లెవల్1 కోచ్లు కేరళలో ఉన్నారు’ అని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మాథ్యూ తెలిపారు.కేరళ క్రికెట్ సంఘం కృషి వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని... సెమీఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న అజహరుద్దీన్ వెల్లడించాడు. పరస్పర సహకారం, సమష్టితత్వంతో ముందుకు సాగడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నాడు. ఈనెల 26 నుంచి నాగ్పూర్లో జరిగే తుది పోరులోనూ కేరళ విజయం సాధిస్తే 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ చాంపియన్గా నిలిచిన దక్షిణాది జట్టుగా నిలుస్తుంది... ఆల్ ద బెస్ట్ కేరళ..! -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఐర్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (ఫిబ్రవరి 16) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మెదెవెరె (61), సికందర్ రజా (58) అర్ద సెంచరీలతో రాణించి జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వెల్లింగ్టన్ మసకద్జ (35), బ్రియాన్ బెన్నెట్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బెన్ కర్రన్ (18), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (4), జోనాథన్ క్యాంప్బెల్ (2), టి మరుమణి (0), ముజరబానీ (0), ట్రెవర్ గ్వాండు (2) నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ నాలుగు, కర్టిస్ క్యాంఫర్ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించారు. హ్యూమ్, జాషువ లిటిల్, ఆండీ మెక్బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (89), వన్డౌన్ బ్యాటర్ కర్టిస్ క్యాంఫర్ (63) అర్ద సెంచరీలతో రాణించి ఐర్లాండ్ విజయానికి గట్టి పునాదాలు వేశారు. లోర్కాన్ టక్కర్ (36 నాటౌట్), జార్జ్ డాక్రెల్ (20 నాటౌట్) ఐర్లాండ్ను విజయతీరాలకు చేర్చారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ (11), హ్యారీ టెక్టార్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో గ్వాండు 2, నగరవ, ముజరబానీ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐర్లాండ్ మూడు మ్యాచ్ల సిరీస్లో జింబాబ్వే ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 18న జరుగనుంది. -
ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్లో కేకేఆర్ను ఢీకొట్టనున్న ఆర్సీబీ
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL) షెడ్యూల్ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (KKR).. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (RCB) తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో (Eden Gardens) జరుగుతుంది.ఇదే ఈడెన్ గార్డెన్స్లో క్వాలిఫయర్-2 (మే 23) మరియు ఫైనల్ మ్యాచ్లు (మే 25) జరుగనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్లు జరుగుతాయి. గత సీజన్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్.. మార్చి 23న జరిగే తమ తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ను ఎస్ఆర్హెచ్ తమ సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది. అదే రోజు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 65 రోజుల పాటు జరిగే ఐపీఎల్-2025 సీజన్లో 74 మ్యాచ్లు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మెగా లీగ్ నిర్వహించబడుతుంది. -
జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్
జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ (Ireland) జట్టు సంచలన విజయం సాధించింది. బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్.. ఆతిథ్య జట్టును 63 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 260 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆండీ మెక్బ్రైన్ (90 నాటౌట్), మార్క్ అదైర్ (78) అర్ద సెంచరీలు సాధించి ఐర్లాండ్కు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. వీరిద్దరు ఏడో వికెట్కు 127 పరుగులు జోడించారు. మెక్బ్రైన్, అదైర్తో పాటు ఐర్లాండ్ ఇన్నింగ్స్లో పాల్ స్టిర్లింగ్ (10), లోర్కాన్ టక్కర్ (33) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ నగరవ 2, ట్రెవర్ గ్వాండు ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 267 పరుగులు చేసింది. అరంగేట్రం ఆటగాడు నిక్ వెల్చ్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ముజరబానీ 47 పరుగులు చేసి జింబాబ్వే తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతనికి 11వ నంబర్ ఆటగాడు ట్రెవర్ గ్వాండు (18 నాటౌట్) సహకరించాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్కు 67 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యం మూలానా జింబాబ్వేకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్కార్తీ 4, ఆండీ మెక్బ్రైన్ 3, మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఐర్లాండ్.. ఆండీ బల్బిర్నీ (66), లొర్కాన్ టక్కర్ (58) అర్ద సెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్లో 298 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో కర్టిస్ క్యాంఫర్ (39), మూర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 4, ట్రెవర్ గ్వాండు, మధెవెరె తలో 2, ముజరబానీ, జోనాథన్ క్యాంప్బెల్ చెరో వికెట్ పడగొట్టారు.292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా కుప్పకూలింది. మాథ్యూ హంఫ్రేస్ ఆరు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. హంఫ్రేస్ 6, మెక్కార్తీ 2, మార్క్ అదైర్, ఆండీ మెక్బ్రైన్ తలో వికెట్ పడగొట్టడంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో 228 పరుగులకు చాపచుట్టేసింది. వెస్లీ మెదెవెరె (84) జింబాబ్వేను ఓటమి బారి నుంచి గట్టెక్కించేందుకు విఫలయత్నం చేశాడు. మెదెవెరె, జోనాథన్ క్యాంప్బెల్ (33) జింబాబ్వే ఓటమిని కాసేపు అడ్డుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో మెదెవెరె, జోనాథన్ క్యాంప్బెల్తో పాటు బ్రియాన్ బెన్నెట్ (45) రాణించాడు.కాగా, ఐర్లాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 14, 16, 18 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. -
అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా ఓపెనర్ (South Africa Opener) మాథ్యూ బ్రీట్జ్కీ (Matthew Breetzke) వన్డే అరంగేట్రంలోనే (ODI Debut) సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ ట్రై సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్లో బ్రీట్జ్కీ ఈ ఫీట్ను సాధించాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌతాఫ్రికన్ ప్లేయర్గా బ్రీట్జ్కీ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. బ్రీట్జ్కీకి ముందు డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (విండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాకిస్తాన్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కొలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా), మైఖేల్ లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), టెంబా బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హార్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాకిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), మైఖేల్ ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (వెస్టిండీస్) వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.వన్డే అరంగేట్రంలనే సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపైటెంబా బవుమా 2016లో ఐర్లాండ్పైరీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైతటస్థ వేదికపై వన్డే అరంగ్రేటంలో సెంచరీ చేసిన ఆటగాళ్లు..ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపైఇమామ్ ఉల్ హాక్ 2017లో శ్రీలంకపైఆబిద్ అలీ 2018లో ఆస్ట్రేలియాపైరహ్మానుల్లా గుర్బాజ్ 2021లో ఐర్లాండ్పైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైబ్రీట్జ్కీ ప్రపంచ రికార్డున్యూజిలాండ్తో మ్యాచ్లో 148 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కీ 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రదర్శనతో బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో వన్డే అరంగేట్రంలో 150 పరుగులు ఎవ్వరూ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్కు ముందు వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ పేరిట ఉండింది. హేన్స్ తన వన్డే డెబ్యూలో 148 పరుగులు స్కోర్ చేశాడు. తాజా ప్రదర్శనతో వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా బ్రీట్జ్కీ ఖాతాలోకి చేరింది.న్యూజిలాండ్తో మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కీ (150) అరంగేట్రంలోనే సెంచరీతో కదంతొక్కగా.. వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో రాణించాడు. జేసన్ స్మిత్ (41) పర్వాలేదనిపించాడు. టెంబా బవుమా 20, కైల్ వెర్రిన్ 1, సెనూరన్ ముత్తుసామి 2 పరుగులు చేసి ఔటయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ తలో రెండు వికెట్లు.. మైఖేల్ బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
న్యూజిలాండ్ టీ20 టోర్నీ విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్ (Super Smash) విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ (Central Districts) (సెంట్రల్ స్టాగ్స్) అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఫైనల్లో ఆ జట్టు కాంటర్బరీ కింగ్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ సూపర్ స్మాష్ టైటిల్ గెలవడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. ఇనాగురల్ ఎడిషన్లో (2006) టైటిల్ గెలిచిన కాంటర్బరీ కింగ్స్ వరుసగా ఐదోసారి, మొత్తంగా ఏడో సారి రన్నరప్తో సరిపెట్టుకుంది.ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాంటర్బరీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన డారిల్ మిచెల్ (Daryl Mitchell) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెక్కోంచీ (27), చాడ్ బోవ్స్ (16), షిప్లే (10), మ్యాట్ హెన్రీ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్ హే (5), మాథ్యూ బాయిల్ (2), జకరీ ఫౌల్క్స్ (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బౌలర్లలో టాబీ ఫిండ్లే 3 వికెట్లు పడగొట్టగా.. రాండెల్ 2, అంగస్ షా, టిక్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్.. డేన్ క్లీవర్ (43), విల్ యంగ్ (35) రాణించడంతో మరో 16 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్లో జాక్ బాయిల్ 5, కెప్టెన్ టామ్ బ్రూస్ 14 పరుగులు చేసి ఔట్ కాగా.. విలియమ్ క్లార్క్ (17), కర్టిస్ హీపీ (9) సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ను విజయతీరాలకు చేర్చారు. కాంటర్బరీ కింగ్స్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2, విలియమ్ ఓరూర్కీ, హెన్రీ షిప్లే తలో వికెట్ పడగొట్టారు.కాగా, న్యూజిలాండ్లో జరిగే సూపర్ స్మాష్ టీ20 టోర్నీ 2005-06లో తొలిసారి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ టోర్నీ పలు పేర్లతో చలామణి అవుతూ వస్తుంది. తొలుత న్యూజిలాండ్ టీ20 కాంపిటీషన్ అని, ఆతర్వాత స్టేట్ టీ20 అని, 2009-2012 వరకు హెచ్ఆర్వీ కప్ అని, 2013-14 ఎడిషన్లో హెచ్ఆర్వీ టీ20 అని, 2018-19 సీజన్ నుంచి సూపర్ స్మాష్ అని నిర్వహించబడుతుంది. ఈ టోర్నీ పురుషులతో పాటు మహిళల విభాగంలోనూ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ప్రస్తుత సీజన్లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడే చాలామంది ఆటగాళ్లు పాల్గొంటారు. -
శతక్కొట్టిన స్టీవ్ స్మిత్.. 35వ టెస్ట్ సెంచరీ.. ఉస్మాన్ ఖ్వాజా కూడా..!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్ స్మిత్ 179 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) స్మిత్కు ఇది 47వ సెంచరీ. శ్రీలంక గడ్డపై మూడవది (టెస్ట్ల్లో).Steve Smith with yet another 100 It's his 35th test 100✨ pic.twitter.com/4ppbWFEehc— Schrödinger (@srhnation) January 29, 2025టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఏడవ స్థానానికి ఎగబాకాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38), జో రూట్ (36), రాహుల్ ద్రవిడ్ (36) మాత్రమే టెస్ట్ల్లో స్మిత్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు.తాజా సెంచరీతో స్మిత్ ఫాబ్ ఫోర్లో (టెస్ట్ సెంచరీల పరంగా) రెండో స్థానానికి ఎగబాకాడు. 36 సెంచరీలతో రూట్ అగ్రస్థానంలో ఉండగా.. 33 సెంచరీలతో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, 30 సెంచరీలతో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ సెంచరీతో స్మిత్ ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో నాలుగో అత్యధిక సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ (81) అగ్రస్థానంలో నిలువగా.. రూట్ (52) రెండో స్థానంలో, రోహిత్ శర్మ (48) మూడో స్థానంలో, స్మిత్ (47) నాలుగులో, కేన్ విలియమ్సన్ (46) ఐదో స్థానంలో ఉన్నారు.వివిధ దేశాల్లో స్మిత్ చేసిన సెంచరీలుఆస్ట్రేలియాలో 18ఇంగ్లండ్లో 8భారత్లో 3శ్రీలంకలో 3న్యూజిలాండ్లో 1సౌతాఫ్రికాలో 1వెస్టిండీస్లో 135వ సెంచరీకి ముందు స్మిత్ ఇదే మ్యాచ్లో 10000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. ఈ ఇన్నింగ్స్ తొలి బంతికే స్మిత్ ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు.205వ ఇన్నింగ్స్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న స్మిత్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) ఈ ఫీట్ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ మాత్రమే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్లోనే ఉన్నారు.తన టెస్ట్ కెరీర్లో 114 మ్యాచ్లు ఆడిన స్మిత్ 56కు పైగా సగటుతో 10100* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 35 సెంచరీలు, 41 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇదే మ్యాచ్లో మరో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) కూడా సెంచరీ చేశాడు. ఖ్వాజా 135 బంతుల్లో 8 బౌండరీలు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని 147 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలికాలంలో పెద్దగా ఫామ్లో లేని ఖ్వాజాకు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి సెంచరీ. టెస్ట్ల్లో ఖ్వాజాకు ఇది 16వ శతకం. ఇటీవల భారత్తో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖ్వాజా దారుణంగా నిరాశపరిచాడు (కేవలం 20.44 సగటున పరుగులు చేశాడు).16TH TEST CENTURY FOR USMAN KHAWAJA - A TERRIFIC KNOCK. 💯pic.twitter.com/H2jliMrAVy— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2025ఖ్వాజా, స్మిత్ సెంచరీతో కదంతొక్కడంతో లంకతో తొలి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 81.1 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మ్యాచ్ ముగియడానికి కొద్ది సేపటి ముందు వర్షం మొదలుకావడంతో అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 57; 10 ఫోర్లు, సిక్స్) చెలరేగి మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వన్డౌన్ బ్యాటర్ లబూషేన్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రభాత జయసూర్య, జెఫ్రీ వాండర్సేలకు తలో వికెట్ దక్కింది. -
2024 ఐసీసీ అవార్డుల విజేతలు వీరే..!
2024 ఐసీసీ అవార్డుల ప్రకటన ప్రక్రియ జనవరి 24న మొదలై, ఇవాల్టితో (జనవరి 28) ముగిసింది. మూడు ఫార్మాట్లలో పురుషులు, మహిళల విభాగాల్లో వ్యక్తిగత అవార్డులతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రివీల్ చేశారు. గతేడాదికి సంబంధించి మొత్తం 12 వ్యక్తిగత అవార్డులు, 5 ఐదు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ప్రకటించబడ్డాయి.వ్యక్తిగత విభాగాల్లో ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (రేచల్ హెహోయ్ ఫ్లింట్ ట్రోఫీ)-మేలీ కెర్ (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధన (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ (నామినీలు- వనిందు హసరంగ, కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్)ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ (నామినీలు-సస్కియా హోర్లీ, శ్రేయాంక పాటిల్, ఫ్రేయా సర్జెంట్)ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ (నామినీలు-సైమ్ అయూబ్, గస్ అట్కిన్సన్, షమార్ జోసఫ్)ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ (నామినీలు-బాబర్ ఆజమ్, ట్రవిస్ హెడ్, సికందర్ రజా)ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ (నామినీలు- చమారీ ఆటపట్టు, ఓర్లా ప్రెండర్గాస్ట్, లారా వోల్వార్డ్ట్)ఫార్మాట్ల వారీగా టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు..ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
టామ్ బాంటన్ విధ్వంసకర శతకం.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ చెలరేగిపోతున్నాడు. డెజర్ట్ వైపర్స్తో నిన్న (జనవరి 27) జరిగిన మ్యాచ్లో బాంటన్ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ 154 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 228 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 చరిత్రలో ఇది రెండో అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన టామ్ బాంటన్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బాంటన్, ఫ్లెచర్ రెండో వికెట్కు 198 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. యూఏఈ గడ్డపై టీ20ల్లో ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెజర్ట్ వైపర్స్.. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్ల ధాటికి 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. ముహమ్మద్ రోహిద్ ఖాన్, అల్జరీ జోసఫ్ తలో మూడు.. ఫజల్ హక్ ఫారూఖీ, డాన్ మౌస్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టి వైపర్స్ ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. వీరి దెబ్బకు వైపర్స్ ఇన్నింగ్స్లో ఒక్క ఆటగాడు కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయాడు. కెప్టెన్ సామ్ కర్రన్ (11), వికెట్కీపర్ ఆజమ్ ఖాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో ఓడినప్పటికీ వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన వైపర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.రెండో శతకంఈ సీజన్లో టామ్ బాంటన్కి ఇది రెండో శతకం. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 చరిత్రలో ఒకే సీజన్లో రెండు సెంచరీలు ఎవరూ చేయలేదు. తాజా శతకంతో బాంటన్ ఈ సీజన్ లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. బాంటన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 156.36 స్ట్రయిక్రేట్తో 369 పరుగులు చేశాడు. ఈ సీజన్లో బాంటన్తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఆటగాడు షాయ్ హోప్ ఒక్కడే సెంచరీ చేశాడు. -
మిచెల్ ఓవెన్ సునామీ శతకం.. బిగ్బాష్ లీగ్ విజేత హోబర్ట్ హరికేన్స్
బిగ్బాష్ లీగ్ 2024-25 ఎడిషన్లో హోబర్ట్ హరికేన్స్ విజేతగా నిలిచింది. ఇవాళ (జనవరి 27) జరిగిన ఫైనల్లో హరికేన్స్ సిడ్నీ థండర్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ధండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్ సంఘా (42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్) థండర్కు మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే థండర్ మధ్యలో తడబడింది. మాథ్యూ గిల్కెస్ డకౌట్ కాగా.. సామ్ బిల్లింగ్స్ (14 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), ఒలివర్ డేవిస్ (19 బంతుల్లో 26; ఫోర్, సిక్స్), క్రిస్ గ్రీన్ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు) పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, కెప్టెన్ నాథన్ ఇల్లిస్ తలో మూడు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి థండర్ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనలో హరికేన్స్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ విలయతాండవం చేశాడు. ఓవెన్ దెబ్బకు థండర్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓవెన్ విశ్వరూపం దాల్చి 16 బంతుల్లో హాఫ్ సెంచరీని, 39 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఓవెన్ సునామీ ఇన్నింగ్స్ దెబ్బకు హరికేన్స్ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 98 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్ 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవెన్ ఔటయ్యే సమయానికే హరికేన్స్ విజయం ఖరారయ్యింది. ఆఖర్లో మాథ్యూ వేడ్ (17 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), బెన్ మెక్డెర్మాట్ (12 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) మ్యాచ్ను లాంఛనంగా పూర్తి చేశారు. హరికేన్స్ 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హరికేన్స్ ఇన్నింగ్స్లో కాలెబ్ జువెల్ (13), నిఖిల్ చౌదరీ (1) మాత్రమే తక్కువ స్కోర్లకు ఔటయ్యారు.థండర్ బౌలర్లలో తన్వీర్ సంఘా 2, టామ్ ఆండ్రూస్ ఓ వికెట్ పడగొట్టారు. 2011-12 ❌2012-13 ❌2013-14 ❌2014-15 ❌2015-16 ❌2016-17 ❌2017-18 ❌2018-19 ❌2019-20 ❌2020-21 ❌2021-22 ❌2022-23 ❌2023-24 ❌2024-25 🏆The wait is over for @HurricanesBBL.pic.twitter.com/bPufT8V9Ko— CricTracker (@Cricketracker) January 27, 2025హరికేన్స్ 14 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత సొంత ప్రేక్షకుల మధ్య టైటిల్ గెలిచింది. మిచెల్ ఓవెన్ సునామీ శతకంతో మ్యాచ్ను వన్ సైడెడ్గా చేశాడు. ఓవెన్కు ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. ఈ సెంచరీతో ఓవెన్ బీబీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును (39 బంతుల్లో) కూడా సమం చేశాడు. -
పాకిస్తాన్ ప్లేయర్ల సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గొంటున్న పాకిస్తాన్ ప్లేయర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్బార్ రాజ్షాహీ అనే ఫ్రాంచైజీ మ్యాచ్ ఫీజ్ బకాయిలు చెల్లించని కారణంగా బీపీఎల్లో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే కారణంగా పలువురు విదేశీ ప్లేయర్లు కూడా బీపీఎల్కు దూరంగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు ర్యాన్ బర్ల్, మెక్కాలీ కమిన్స్, లహీరు కుమార, మార్క్ డోయల్తో పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు మొహమ్మద్ హరీస్, అఫ్తాబ్ ఆలమ్ దర్బార్ రాజ్షాహీ ఆడిన గత మ్యాచ్ను బాయ్కాట్ చేశారు. విదేశీ ఆటగాళ్లు హ్యాండ్ ఇవ్వడంతో రాజ్షాహీ గత మ్యాచ్లో లోకల్ ప్లేయర్లను బరిలోకి దించింది. రాజ్షాహీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజ్ బకాయిలను డిమాండ్ చేస్తూ తమ ధిక్కార స్వరాన్ని వినిపించడం ఇది తొలిసారి కాదు. ఈ సీజన్ ఆరంభంలో రాజ్షాహీ విదేశీ ఆటగాళ్లు ట్రయినింగ్ సెషన్స్ను బాయ్కాట్ చేశారు. తమ ఫ్రాంచైజీపై చర్యలు తీసుకుని, తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని బీపీఎల్ గవర్నింగ్ బాడీని డిమాండ్ చేశారు. రాజ్షాహీ దర్బార్ ఫ్రాంచైజీ అవళంభిస్తున్న విధానాలు అంతర్జాతీయ క్రికెట్ వేదికపై బంగ్లాదేశ్ పరువును మసకబారేలా చేస్తున్నాయి.ఇదిలా ఉంటే, విదేశీ స్టార్లు లేనప్పటికీ గత మ్యాచ్లో రాజ్షాహీ రంగ్పూర్ రైడర్స్పై విజయం సాధించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్గా నడిచిన ఈ మ్యాచ్లో రాజ్షాహీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ్షాహీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రాజ్షాహీ ఇన్నింగ్స్లో సంజముల్ ఇస్లాం (28 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. రంగ్పూర్ రైడర్స్ బౌలర్లలో ఖుష్దిల్ 3 వికెట్లు పడగొట్టగా.. రకీబుల్ హసన్, సైఫుద్దీన్ తలో రెండు, అకీఫ్ జావెద్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్పూర్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మొహమ్మద్ సైఫుద్దీన్ (52 నాటౌట్), రకీబుల్ హసన్ (20) రైడర్స్ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించారు. రాజ్షాహీ బౌలర్లు మృత్యుంజయ్ చౌధురీ (4-1-18-4), మొహర్ షేక్ (4-1-15-2), కెప్టెన్ తస్కిన్ అహ్మద్ (4-0-2-25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి రైడర్స్ను దెబ్బకొట్టారు. ఈ గెలుపు అనంతరం రాజ్షాహీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో రాజ్షాహీ 11 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్పై కన్నేసింది. -
PAK Vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 21వ శతాబ్దంలో పాక్ గడ్డపై తొలి విజయం
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. ఈ విజయం విండీస్ క్రికెట్ చరిత్రలో చారిత్రక విజయం. 21వ శతాబ్దంలో పాక్ గడ్డపై ఆ జట్టుకు ఇది తొలి టెస్ట్ విజయం. విండీస్ చివరిసారి 1990లో పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ విజయం సాధించింది. మళ్లీ 35 ఏళ్ల తర్వాత విండీస్ పాక్ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది.మ్యాచ్ విషయానికొస్తే.. 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 133 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. స్పిన్నర్లు గోమెల్ వార్రికన్ (5/27), కెవిన్ సింక్లెయిర్ (3/61), గుడకేశ్ మోటీ (2/35) పాకిస్తాన్ పతనాన్ని శాశించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ చేసిన 31 పరుగులే అత్యధికం కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులామ్ (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ అఘా (15) రెండంకెల స్కోర్లు చేశారు. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 76 పరుగులుగా ఉండింది. మూడో రోజు ఆట తొలి సెషన్లోనే పాక్ మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. విండీస్ స్పిన్నర్లు పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు.అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తొలి రోజు ఆటలోనే ఇరు జట్లు తమతమ తొలి ఇన్నింగ్స్లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ (తొలి ఇన్నింగ్స్లో) సహా 10 వికెట్లు తీయగా.. విండీస్ స్పిన్నర్ వార్రికన్ 9 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో పేసర్లకు నాలుగు వికెట్లు మాత్రమే దక్కాయి. మిగతా 36 వికెట్లను ఇరు జట్ల స్పిన్నర్లు షేర్ చేసుకున్నారు. రెండు టెస్ట్ మ్యాచ్ల్లో కలిపి 19 వికెట్లు పడగొట్టిన విండీస స్పిన్నర్ జోమెల్ వార్రికన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. రెండో టెస్ట్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినందుకు గానూ వార్రికన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. కాగా, రెండు మ్యాచ్ ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. -
పాకిస్తాన్ విజయ లక్ష్యం 254
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన 9 పరుగుల లీడ్ కలుపుకుని విండీస్ పాకిస్తాన్ ముందు 255 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రకన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.విండీస్ పరువు కాపాడిన చివరి ముగ్గురు బ్యాటర్లుఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన విండీస్ను చివరి ముగ్గురు బ్యాటర్లు ఆదుకున్నారు. గడకేశ్ మోటీ 55, కీమర్ రోచ్ 25, గోమెల్ వార్రికన్ 36 (నాటౌట్) పరుగులు చేశారు. నౌమన్ అలీ (6/41) విండీస్ను ఆరేశాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు.కష్టాల్లో పాక్255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరిచారు. బాబర్ ఆజమ్ (26), సౌద్ షకీల్ (3) క్రీజ్లో ఉన్నారు. 17 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 59/3గా ఉంది. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలంటే మరో 195 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ, కెవిన్ సింక్లెయిర్, జోమెల్ వార్రికన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి టెస్ట్లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
2024 ఐసీసీ వన్డే జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు..!
టీమిండియాకు అవమానం జరిగింది. 2024 ఐసీసీ పురుషుల వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. టీమిండియా గతేడాది వన్డే ఫార్మాట్లో అతి తక్కువ మ్యాచ్లు ఆడటమే ఇందుకు కారణం.2024లో టీమిండియా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.2024 మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ను ఐసీసీ ఇవాళ (జనవరి 24) ప్రకటించింది. ఈ జట్టులో నలుగురు శ్రీలంక ప్లేయర్లు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చెరి ముగ్గురు.. వెస్టిండీస్కు చెందిన ఓ ఆటగాడు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు సారధిగా లంక కెప్టెన్ చరిత్ అసలంక ఎంపికయ్యాడు. గతేడాది ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ రాణించినందుకు ఐసీసీ అసలంకను కెప్టెన్గా ఎంపిక చేసింది.అసలంక గతేడాది 16 వన్డేల్లో 50.2 సగటున 605 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక గతేడాది 18 వన్డేలు ఆడి 12 మ్యాచ్ల్లో నెగ్గింది. ఏ జట్టూ గతేడాది ఇన్ని వన్డేలు ఆడలేదు.దాయాది పాక్ గతేడాది 9 వన్డేలు ఆడి ఏడింట విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ గతేడాది 14 వన్డేల్లో 8 మ్యాచ్ల్లో నెగ్గింది.ఐసీసీ వన్డే జట్టులో ఏకైక నాన్ ఏషియన్ వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్ఫోర్డ్. 2023లో వన్డే అరంగేట్రం చేసిన రూథర్ఫోర్డ్ గతేడాది 9 మ్యాచ్లు ఆడి 106.2 సగటున 425 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా రూథర్ఫోర్డ్కు ఐసీసీ జట్టులో చోటు దక్కింది.ఐసీసీ జట్టులో భారత్తో పాటు SENA దేశాలైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్కు కూడా ప్రాతినిథ్యం లభించలేదు. రెండోసారి ఇలా..!ఐసీసీ వన్డే జట్లను ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుంచి (2004) భారత్కు ప్రాతినిథ్యం లభించకపోవడం ఇది రెండో సారి మాత్రమే. 2021లో కూడా ఐసీసీ మెన్స్ వన్డే టీమ్లో భారత ఆటగాళ్లకు చోటు లభించలేదు. 2023లో జట్టు నిండా భారతీయులే..!2023 ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్లో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: చరిత్ అసలంక (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్ (వికెట్కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్ -
ఆస్ట్రేలియాకు కొత్త కోచ్
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ కోచ్గా ఆర్సీబీ బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్ నియమితుడయ్యాడు. 46 ఏళ్ల గ్రిఫిత్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్గా ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్ (టస్మానియా తరఫున) ఆడాడు. గ్రిఫిత్ 2019 నుంచి 2024 వరకు ఆర్సీబీ బౌలింగ్ కోచ్గా పని చేశాడు. గ్రిఫిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశవాలీ జట్టు అయిన విక్టోరియాకు అసిస్టెంట్ కోచ్గా సేవలందిస్తున్నాడు. గ్రిఫిత్.. ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో పాటు ఆస్ట్రేలియా-ఏ జట్టుకు కూడా బౌలింగ్ కోచ్గా వ్యవహరించనున్నాడు.గ్రిఫిత్ బ్రిస్బేన్లో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా నేషనల్ క్రికెట్ సెంటర్ను ఆపరేట్ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. గ్రిఫిత్ పేస్ బౌలర్ల అభివృద్ధి మరియు కొత్త పేస్ బౌలర్లను తయారు చేయడంలో భాగమవుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. గ్రిఫిత్ నియామకాన్ని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ స్వాగతించాడు. గ్రిఫిత్ అనుభవం ఆసీస్ పేసర్లను మరింత పదునెక్కించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.గ్రిఫిత్ తన కోచింగ్ కెరీర్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్ స్కార్చర్ జట్లకు సీనియర్ అసిస్టెంట్ కోచ్గా.. టస్మానియా కోచింగ్ డైరెక్టర్గా.. బీబీఎల్ జట్లైన టస్మానియా టైగర్స్, హోబర్ట్ హరికేన్స్ జట్లకు హెడ్ కోచ్గా పని చేశాడు.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జట్టు త్వరలో రెండు టెస్ట్లు, రెండు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ సిరీస్లో టెస్ట్ జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్లో తొలి టెస్ట్ గాలే వేదికగా జనవరి 29న ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ ఇదే వేదికగా ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో రెండు వన్డేలు జరుగనున్నాయి.ఆస్ట్రేలియా ఇటీవలే స్వదేశంలో భారత్తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. మెగా టోర్నీలో ఆసీస్ ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీలో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్ ఇంగ్లండ్ను ఢీకొంటుంది. అనంతరం ఫిబ్రవరి 25న సౌతాఫ్రికాతో (రావల్పిండి), ఫిబ్రవరి 28న ఆఫ్ఘనిస్తాన్తో (లాహోర్) తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న పాకిస్తాన్ను, మార్చి 2న న్యూజిలాండ్ను ఢీకొంటుంది. -
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది. HISTORY IN U-19 WORLD CUP 📢Vaishnavi Sharma becomes the first Indian bowler to take the Hat-trick in Women's U-19 WC history. pic.twitter.com/s9ziyvZjpm— Johns. (@CricCrazyJohns) January 21, 2025మలేసియా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్రేట్తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్లో వెస్టిండీస్పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది. గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది. -
కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.. టీమిండియా నయా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్
కోల్కతా: భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 184 వికెట్లు తీయడంతో పాటు 1,712 పరుగులు కూడా సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్తో జరగబోయే టి20 సిరీస్ కోసం అతను తొలిసారి వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. సుదీర్ఘ కాలం పాటు తనదైన బౌలింగ్, బ్యాటింగ్ శైలిని పోలిన రవీంద్ర జడేజా నీడలోనే ఉండిపోయిన అతను... ఇటీవలే కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎంతో సాధించానని, ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ‘భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్లలో సంధి దశ నడుస్తోందనేది వాస్తవం. అయితే దీనిపై సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు. నాకు సంబంధించి నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అప్పగించిన పనిని సమర్థంగా చేయడమే నాకు తెలుసు. అలా చేస్తే చాలు జట్టులో స్థానం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఫార్మాట్ ఏదైనా అవకాశం లభించిన ప్రతీసారి ఆటను మెరుగుపర్చుకుంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. జట్టులో నా స్థానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందను’ అని అతను అన్నాడు. తాజాగా వైస్ కెప్టెన్సీతో కొంత బాధ్యత పెరిగిందనేది మాత్రం వాస్తవమని అక్షర్ అభిప్రాయపడ్డాడు. ‘టీమ్ నాయకత్వ బృందంలో నాకు కూడా అవకాశం దక్కడం సంతోషం. దీని వల్ల బాధ్యత మరింత పెరుగుతుంది. మన టి20 జట్టు స్థిరంగా ఉంది కాబట్టి కొత్తగా అనూహ్య నిర్ణయాలేమీ ఉండవు. అయితే మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని అతను చెప్పాడు. భారత జట్టులో ఓపెనర్లకు మాత్రమే వారి స్థానాల విషయంలో స్పష్టత ఉంటుందని, మూడు నుంచి ఏడో స్థానం వరకు బ్యాటర్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతను అభిప్రాయ పడ్డాడు. ‘ఏడాది కాలంగా ఇది కొనసాగుతోంది. 3–7 బ్యాటర్లు మ్యాచ్లో ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఆటగాళ్లందరికీ ఇప్పటికే చెప్పేశాం’ అని పటేల్ వెల్లడించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై ఎలాంటి నిరాశ కలగలేదని... 15 మందిని ఎంపిక చేస్తారని, తనకు చోటు దక్కకపోవడం పెద్ద విషయం కాదని అక్షర్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్లో భారత జట్టు ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నామని ఈ గుజరాత్ ఆల్రౌండర్ వ్యాఖ్యానించాడు. -
చాంపియన్స్ ట్రోఫీ పూర్తి జట్లు.. కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు వీరే
క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025) వన్డే సమరానికి సమయం దగ్గర పడుతోంది. మినీ వన్డే వరల్డ్కప్గా భావించే చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటి ఏడు టీమ్లు అర్హత సాధించగా, ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్కు నేరుగా ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఈ మెగాటోర్ని జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2017లో చివరిగా చాంపియన్స్ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే.రౌండ్-రాబిన్ ఫార్మాట్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. 8 జట్లను రెండు గ్రూపులుగా (ఏ, బీ) విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని ప్రతి ఇతర జట్టుతో తలపడుతుంది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్కు చేరుకుంటాయి. సెమీ ఫైనల్లో విజేతలుగా నిలిచిన రెండు టీమ్లు ఫైనల్లో ఢీకొంటాయి. నాకౌట్ చేరేందుకు ప్రతిజట్టు గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఈసారి మ్యాచ్లు క్రికెట్ అభిమానులకు రెట్టింపు వినోదాన్ని పంచనున్నాయి. గ్రూప్ ఏలో ఇండియా, (India) న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ టీమ్లున్నాయి. గ్రూప్ బీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఉన్నాయి.ఫిబ్రవరి 19న కరాచిలో జరిగే తొలి మ్యాచ్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. ఫిబ్రవరి 20 నుంచి టీమిండియా (Team India) మ్యాచ్లు ఉంటాయి. భారత్ ఆడే మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన దుబాయ్లోనే జరుగుతాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఫిబ్రవరి 23న టీమిండియా తలపడుతుంది. మార్చి 2న న్యూజిలాండ్తో మన మ్యాచ్ ఉంటుంది. మార్చి 4న దుబాయ్లో మొదటి సెమీఫైనల్, మార్చి 5న లాహోర్లో రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. టైటిల్ విజేతను తేల్చే ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. కాగా, పాకిస్థాన్ తప్ప మిగతా దేశాలు తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి.Group Aఇండియాకెప్టెన్: రోహిత్ శర్మవైస్ కెప్టెన్: శుభమన్ గిల్స్టార్ ప్లేయర్లు: విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాభారత పూర్తి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిన్యూజిలాండ్కెప్టెన్: మిచెల్ సాంట్నర్కీలక ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీన్యూజిలాండ్ పూర్తి జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.పాకిస్తాన్కెప్టెన్: బాబర్ ఆజంవైస్ కెప్టెన్: మహ్మద్ రిజ్వాన్ కీలక ఆటగాళ్లు: షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్పాకిస్థాన్ జట్టు (అంచనా): బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, నోమన్ అలీ, సాజిద్ ఖాన్, నసీమ్ షా, ఇహ్సానుల్లా, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్, అఘా సల్మాన్, ఉస్మాన్ ఖాదిర్, తయ్యాబ్ తాదిర్, హసన్ అలీబంగ్లాదేశ్కెప్టెన్: నజ్ముల్ హొస్సేన్కీలక ఆటగాళ్లు: ముష్ఫికర్ రహీమ్, తస్కిన్ అహ్మద్, మహ్మదుల్లాబంగ్లాదేశ్ పూర్తి జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, పర్వేజ్ హోస్సై ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రానాGroup Bఇంగ్లండ్కెప్టెన్: జోస్ బట్లర్వైస్-కెప్టెన్: హ్యారీ బ్రూక్కీలక ఆటగాళ్లు: జో రూట్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ఇంగ్లండ్ పూర్తి జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ఆస్ట్రేలియాకెప్టెన్: పాట్ కమిన్స్కీలక ఆటగాళ్లు: స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్ఆస్ట్రేలియా పూర్తి జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, మిషెల్ హార్డీ, హాజిల్వుడ్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాదక్షిణాఫ్రికాకెప్టెన్: టెంబా బావుమాకీలక ఆటగాళ్లు: కగిసో రబడ, హెన్రిచ్ క్లాసెన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్దక్షిణాఫ్రికా పూర్తి జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ర్యాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జేఅఫ్గానిస్థాన్కెప్టెన్: హష్మతుల్లా షాహిదీవైస్ కెప్టెన్: రహమత్ షాకీలక ఆటగాళ్లు: రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఫజల్ హక్ ఫరూఖీఅఫ్గానిస్థాన్ పూర్తి జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీబ్, మహ్మద్ నబీబ్, రహమ్మద్ నబీబ్, గజన్ఫర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దర్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటీ, బిలాల్ సామివేదికలుకరాచీ నేషనల్ స్టేడియంలాహోర్: గడాఫీ స్టేడియంరావల్పిండి క్రికెట్ స్టేడియందుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంమ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2.30కు ప్రారంభమవుతాయి. -
పాక్ గడ్డపై పొట్టి మ్యాచ్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా నిన్న (జనవరి 19) ముగిసిన టెస్ట్ మ్యాచ్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ గడ్డపై అత్యంత పొట్టి మ్యాచ్గా (బంతుల పరంగా) రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోనే ముగిసింది. పాకిస్తాన్ గడ్డపై అతి త్వరగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఇదే. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ల జాబితాలో తాజాగా ముగిసిన పాకిస్తాన్, వెస్టిండీస్ మ్యాచ్ 10వ స్థానంలో నిలిచింది.పాకిస్తాన్ గడ్డపై బంతుల పరంగా అతి పొట్టి టెస్ట్ మ్యాచ్లు..2025- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ముల్తాన్ (1064 బంతుల్లో ముగిసింది)1990- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ఫైసలాబాద్ (1080 బంతుల్లో)1986- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, లాహోర్ (1136)2001- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, ముల్తాన్ (1183)2024- పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, రావల్పిండి (1233)బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లు..624- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (2023,24, కేప్టౌన్)656- సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా (1931-32, మెల్బోర్న్)672- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ (1934-35, బ్రిడ్జ్టౌన్)788- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1888, మాంచెస్టర్)842- భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2020-21, అహ్మదాబాద్)872- న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1945-46, వెల్లింగ్టన్)893- పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (2002-03, షార్జా)920- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా (2022, గాలే)1011- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ (2005, హరారే)1064- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (2025, ముల్తాన్)ఔ1069- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ (2023-24, మీర్పూర్)1423- ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే (2024, బెల్ఫాస్ట్)కాగా, ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) 20 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 157 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. -
శతక్కొట్టిన టామ్ బాంటన్.. ముంబై ఇండియన్స్ తరఫున తొలి సెంచరీ
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025 ఎడిషన్లో రెండో సెంచరీ నమోదైంది. షార్జా వైపర్స్తో నిన్న (జనవరి 19) జరిగిన మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ శతక్కొట్టాడు. ఐఎల్టీ20 (ILT20) చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. బాంటన్కు ముందు ఐఎల్టీ20లో కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీలు చేశారు. లీగ్ చరిత్రలో తొలి సెంచరీని టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) చేయగా.. రెండో సెంచరీని అలెక్స్ హేల్స్ (డెజర్ట్ వైపర్స్) చేశాడు. లీగ్లో మూడో సెంచరీ ఇదే సీజన్లో నమోదైంది. సీజన్ నాలుగో మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్పై షాయ్ హోప్ (దుబాయ్ క్యాపిటల్స్) శతక్కొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వారియర్స్పై ఎంఐ ఎమిరేట్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్, ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్డౌన్ బ్యాటర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. లూక్ వెల్స్ (18), కరీమ్ జనత్ (18), ఎథన్ డిసౌజా (11) రెండంకెల స్కోర్లు చేశారు. జేసన్ రాయ్ (1), రోహన్ ముస్తఫా (6), కీమో పాల్ (4), కెప్టెన్ సౌథీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ రెండు, రొమారియో షెపర్డ్, వకార్ సలామ్కిల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన ఎంఐ ఎమిరేట్స్ 17.4 ఓవర్లలో ఆడుతూపాడుతూ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎమిరేట్స్ ఆదిలోనే ముహమ్మద్ వసీం (12) వికెట్ కోల్పోయినా, టామ్ బాంటన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ కుసాల్ పెరీరా (42 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ రెండో వికెట్కు అజేయమైన 157 పరుగులు జోడించారు. ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. లీగ్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఐఎల్టీ20లో డెసర్ట్ వైపర్స్ ఆటగాళ్లు కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్ నెలకొల్పిన 164 పరుగుల భాగస్వామ్యం ఏ వికెట్కైనా అత్యధికం. 2023 సీజన్లో మున్రో, హేల్స్ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ గెలుపుతో ఎమిరేట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బద్దలు
ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్ చేసిన ఆటగాళ్లుఆయుశ్ మాత్రే 17 ఏళ్ల 168 రోజులుయశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజులురాబిన్ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులుటామ్ ప్రెస్ట్ 19 ఏళ్ల 136 రోజులుమాత్రే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. నాగాలాండ్తో మ్యాచ్లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్లో మాత్రే.. అంగ్క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్కు 156 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ (28 బంతుల్లో 73 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్ చేసింది. శార్దూల్ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్లో బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్తో మెరిసిన శార్దూల్ ఠాకూర్ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్స్టన్ డయాస్ రెండు, సుయాన్ష్ షేడ్గే ఓ వికెట్ దక్కించుకున్నారు. నాగాలాండ్ ఇన్నింగ్స్లో డేగా నిశ్చల్ (5), హేమ్ చెత్రి (2), యుగంధర్ సింగ్ (0), కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ (0), చేతన్ బిస్త్ (0) ఔట్ కాగా.. రుపేరో (22), జే సుచిత్ (9) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో నాగాలాండ్ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.ఈ మ్యాచ్లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్మెంట్ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే..!
మెల్బోర్న్ టెస్ట్లో ఓటమితో 2024 సంవత్సరాన్ని ముగించిన టీమిండియా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది. సిడ్నీ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సాగనుంది. అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్జనవరి 22- తొలి టీ20 (కోల్కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి.మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 జరుగుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జూన్ 20న మొదలవుతుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఇలా ఉండనుంది.జూన్ 20-24: తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6: రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14: మూడో టెస్ట్ (లండన్, లార్డ్స్)జులై 23-27: నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4: ఐదో టెస్ట్ (లండన్, కెన్నింగ్స్టన్ ఓవల్)షెడ్యూల్ ప్రకారం టీమిండియా వచ్చే ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.2025లో టీమిండియా ఆడే వన్డేలుఇంగ్లండ్తో 3ఛాంపియన్స్ ట్రోఫీలో 5బంగ్లాదేశ్తో 3 (బంగ్లాదేశ్తో)ఆస్ట్రేలియాతో 3 (ఆస్ట్రేలియాలో)సౌతాఫ్రికాతో 3 (భారత్లో)వచ్చే ఏడాది టీమిండియా ఆడే టెస్ట్లుఆస్ట్రేలియాతో ఒకటి (బీజీటీ)క్వాలిఫై అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ఇంగ్లండ్తో 5 (ఇంగ్లండ్లో)వెస్టిండీస్తో 2 (భారత్లో)సౌతాఫ్రికాతో 2 (భారత్లో) -
నిప్పులు చెరిగిన డఫీ.. లంకను చిత్తు చేసిన కివీస్.. సిరీస్ కైవసం
మౌంట్ మాంగనూయ్ వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ సిరీస్ను కివీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ (డిసెంబర్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. టిమ్ రాబిన్సన్ (41), మార్క్ చాప్మన్ (42), మిచెల్ హే (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 23, డారిల్ మిచెల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో మిచెల్ హే (Mitchell Hay) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మతీశ పతిరణ తలో వికెట్ దక్కించుకున్నారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. జేకబ్ డఫీ (Jacob Duffy) (4-0-15-4) నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో రెండు.. మైఖేల్ బ్రేస్వెల్, జకరీ ఫోల్క్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లంక ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా (48) టాప్ స్కోరర్గా నిలువగా.. పథుమ్ నిస్సంక (37), చరిత్ అసలంక (20), కుసాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కమిందు మెండిస్ (7), అవిష్క ఫెర్నాండో (5), వనిందు హసరంగ (1), మహీశ్ తీక్షణ (0), బినుర ఫెర్నాండో (3), మతీశ పతిరణ (0) విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 నెల్సన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 2న జరుగనుంది.తొలి మ్యాచ్లోనూ ఇబ్బంది పెట్టిన డఫీన్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ తలో టీ20లోనూ లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్లో డఫీ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. తద్వారా ఛేదనలో శ్రీలంక ఇబ్బంది పడి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (62), మైఖేల్ బ్రేస్వెల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ, బినుర తలో రెండు వికెట్లు తీయగా.. పతిరణ ఓ వికెట్ దక్కించుకున్నాడు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు నిస్సంక (90), కుసాల్ మెండిస్ (46) రాణించడంతో ఓ దశలో గెలుపు దిశగా సాగింది. అయితే డఫీ సహా కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ (2/28), జకరీ ఫోల్క్స్ (2/41) ఒక్కసారిగా విజృంభించడంతో శ్రీలంక ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లంక ఇన్నింగ్స్లో ఓపెనర్లు మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. -
IND VS AUS 4th Test: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియా ముందు భారీ లక్ష్యంమెల్బోర్న్ టెస్ట్లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాథన్ లయోన్ (41), స్కాట్ బోలాండ్ (10) చివరి వికెట్కు 50కు పైగా పరుగులు (100కు పైగా బంతులు ఎదుర్కొని) జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్టార్క్ రనౌట్ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్148 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న లబూషేన్ను (70) సిరాజ్ సూపర్ డెలివరీతో ఎల్బీడబ్ల్యూ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 253 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. గాడిలో పడుతున్న ఆస్ట్రేలియాలంచ్ తర్వాత వడివడిగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీ విరామానికి ముందు కాస్త కుదుటపడింది. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆ ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. టీ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 135/6గా ఉంది. లబూషేన్ (65).. కమిన్స్తో (21) కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్91 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన బంతితో అలెక్స్ క్యారీని (2) క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 196 పరుగుల లీడ్లో ఉంది. బుమ్రా ఆన్ ఫైర్.. 85 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. తొలుత డేంజర్ మ్యాన్ ట్రవిస్ హెడ్ను (1) పెవిలియన్కు పంపిన బుమ్రా అదే ఓవర్ చివరి బంతికి మిచెల్ మార్ష్ను (0) ఔట్ చేశాడు. మొత్తంగా ఆసీస్ 10 బంతుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. జోరు మీదున్న బుమ్రా, సిరాజ్.. కష్టాల్లో ఆసీస్భారత పేసర్లు బుమ్రా, సిరాజ్ జోరు మీదున్నారు. వీరి ధాటికి ఆసీస్ ఆరు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్ను (13) సిరాజ్.. డేంజర్ మ్యాన్ ట్రవిస్ హెడ్ను (1) బుమ్రా పెవిలియన్కు పంపారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 85/4గా ఉంది. లబూషేన్ (39), మిచెల్ మార్ష్ క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 190 పరుగుల ఆధిక్యంలో ఉంది.లంచ్ బ్రేక్.. 158 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియారోజు లంచ్ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 53/2గా ఉంది. 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని ప్రస్తుతం ఆసీస్ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబూషేన్ (20), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్లో ఉన్నారు.43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్తొలి ఇన్నింగ్స్లో టీమిండియాను 369 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కొన్స్టాస్ను బుమ్రా.. ఖ్వాజాను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. లబూషేన్ (16), స్టీవ్ స్మిత్ క్రీజ్లో ఉన్నారు.భారత్ 369 ఆలౌట్358/9 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఓవర్నైట్ స్కోర్కు మరో 11 పరుగులు జోడించి 369 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి (114) చివరి వికెట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
IND Vs AUS 4th Test: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్
IND VS AUS 4th Test Day 3 Live Updates And Highlights:మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట ముందుగానే ముగిసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 358/9గా ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి (105), సిరాజ్ (2) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ గడ్డపై సత్తా చాటిన తెలుగోడు.. నితీశ్ సూపర్ సెంచరీఆసీస్ గడ్డపై తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటాడు. మెల్బోర్న్ టెస్ట్లో నితీశ్ సూపర్ సెంచరీ చేశాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు బరిలోకి దిగిన నితీశ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. బోలాండ్ బౌలింగ్లో బౌండరీ బాది నితీశ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ నంబర్ ఆటగాడు సిరాజ్ సహకారంతో నితీశ్ సెంచరీ పూర్తి చేశాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్.. బుమ్రా డకౌట్ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సుందర్ ఔట్348 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లయోన్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి సుందర్ పెవిలియన్ బాట పట్టాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్.. సెంచరీకి చేరువగా నితీశ్లయోన్ బౌలింగ్లో సింగిల్ తీసి వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్ 146 బంతుల్లో సింగిల్ బౌండరీతో హాఫ్ సెంచరీ మార్కు తాకాడు. మరో ఎండ్లో నితీశ్కుమార్ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం నితీశ్ స్కోర్ 94 నాటౌట్గా ఉంది. భారత్ స్కోర్ 345/7. నితీశ్, సుందర్ ఇద్దరూ క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది. తిరిగి ప్రారంభమైన ఆట10:30- వెలుతురు లేమి కారణంగా కాసేపు నిలిచిపోయిన ఆట తిరిగి ప్రారంభమైంది. వెలుతరు లేమి కారణంగా నిలిచిపోయిన ఆట.. సెంచరీకి చేరువగా నితీశ్వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా స్కోర్ 326/7గా ఉంది. భారత్ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన నితీశ్ కుమార్ (85) సెంచరీకి చేరువగా ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ (40) నితీశ్కు అండగా క్రీజ్లో ఉన్నాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 100కు పైగా పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం నితీశ్కుమార్ రెడ్డి చేసుకున్న పుష్ప తరహా సెలబ్రేషన్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.లంచ్ విరామం.. ఎదురీదుతున్న టీమిండియా మూడో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఎదురీదుతుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 230 పరుగులు వెనుకపడి ఉంది. నితీశ్కుమార్ రెడ్డి (40), సుందర్ (5) క్రీజ్లో ఉన్నారు. భారత్ స్కోర్ 244/7గా ఉంది.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా221 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. లయోన్ బౌలింగ్లో రవీంద్ర జడేజా (17) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్191 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బాగా సెట్ అయ్యాడనుకున్న తరుణంలో రిషబ్ పంత్ (28) బోలాండ్ బౌలింగ్లో లయోన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మూడో రోజు మొదలైన ఆట310 పరుగులు వెనుకపడి టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభించింది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్లో ఉన్నారు.రెండో రోజు ముగిసిన ఆటబాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా 6 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 164/5గా ఉంది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 310 పరుగులు వెనుకపడి ఉంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, నైట్ వాచ్మన్ ఆకాశ్దీప్ 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్మన్ గిల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ఆసీస్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కొంటాస్ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ -
విధ్వంసం సృస్టించిన సురేశ్ రైనా
బిగ్ క్రికెట్ లీగ్-2024 ఎడిషన్లో ఇవాళ (డిసెంబర్ 22) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సథరన్ స్పార్టన్స్తో జరుగుతున్న అంతిమ పోరులో ముంబై మెరైన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సథరన్ స్పార్టన్స్కు టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా సారథ్యం వహిస్తుండగా.. ముంబై మెరైన్స్కు టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఫిల్ మస్టర్డ్ ఊచకోత.. సురేశ్ రైనా విధ్వంసంతొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ స్పార్టన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 78; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోయగా.. సురేశ్ రైనా (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, సిక్సర్) విధ్వంసం సృష్టించాడు. స్పార్టన్స్ ఇన్నింగ్స్లో సోలొమన్ మైర్ 7, అభిమన్యు మిధున్ 25, ఫయాజ్ ఫజల్ 30, అమాన్ ఖాన్ 10 పరుగులు చేశారు. మెరైన్స్ బౌలర్లలో మన్ప్రీత్ గోని, మనన్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే కీలకమైన వైట్బాల్ సిరీస్లకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్థార్ ఆటగాడు, టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా పై రెండు ఈవెంట్లకు దూరమయ్యాడు. 33 ఏళ్ల స్టోక్స్ ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. భారత్తో జరిగే టెస్ట్ సిరీస్, యాషెస్ సిరీస్ 2025-26 దృష్ట్యా స్టోక్స్కు విశ్రాంతి కల్పించారని తెలుస్తుంది.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే వైట్బాల్ సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. టెస్ట్ జట్టు కీలక సభ్యుడు జో రూట్, 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలి సారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. వికెట్కీపర్లు జేమీ స్మిత్, ఫిల్ సాల్ట్.. రైజింగ్ స్టార్ జేకబ్ బేతెల్ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.భారత్తో సిరీస్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్గా మెక్కల్లమ్కు ఇవే తొలి అసైన్మెంట్స్ అవుతాయి. ఇప్పటివరకు మెక్కల్లమ్ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే హెడ్ కోచ్గా ఉన్నాడు.భారత్తో జరిగే వన్డే సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీల కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్తో జరిగే టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్లో ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ వివరాలు..జనవరి 22- తొలి టీ20 (కోల్కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. టోర్నీకి సంబంధించిన మ్యాచ్ తేదీలను, వేదికలను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు తటస్థ వేదికలపై జరుగనున్నాయి. -
విండీస్ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లాదేశ్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 18) ఉదయం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో షమీమ్ హొస్సేన్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. షమీమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. మెహిది హసన్ మిరాజ్ (26), జాకిర్ అలీ (21), మెహిది హసన్ (11), సౌమ్య సర్కార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో మోటీ 2, అకీల్ హొసేన్, రోస్టన్ ఛేజ్, అల్జరీ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు.130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 18.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ 3, మెహిది హసన్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొసేన్ తలో 2, హసన్ మహమూద్ ఓ వికెట్ తీసి విండీస్ను దెబ్బకొట్టారు. బంగ్లా బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని ఔరా అనిపించారు. విండీస్ ఇన్నింగ్స్లో రోస్టన్ ఛేజ్ (32), అకీల్ హొసేన్ (31), జాన్సన్ ఛార్లెస్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్కు వెస్టిండీస్పై ఆరేళ్ల తర్వాత తొలి సిరీస్ విజయం ఇది. బంగ్లాదేశ్ చివరిసారి 2018లో వెస్టిండీస్పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది. బంగ్లాదేశ్.. వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై చిత్తు చేయడం విశేషం. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 19న జరుగనుంది. -
ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
-
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తొలి వన్డే రద్దు
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 17) జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. అయితే మధ్యలో వరుణుడు కాసేపు శాంతించడంతో 28 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించింది.సామ్ కర్రన్ సోదరుడు అరంగేట్రంఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ పెద్ద సోదరుడు బెన్ కర్రన్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. బెన్ తన తండ్రి దేశమైన జింబాబ్వే తరఫున తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్లో బెన్ 22 బంతులు ఎదుర్కొని ఓ బౌండరీ సాయంతో 15 పరుగులు చేశాడు. అనంతరం బెన్ అజ్మతుల్లా బౌలింగ్లో ఇక్రమ్ అలీఖిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నిప్పులు చెరిగిన ఒమర్జాయ్తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిప్పులు చెరగడంతో విలవిలలాడిపోయింది. ఒమర్జాయ్ ధాటికి జింబాబ్వే 41 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒమర్జాయ్ 4.2 ఓవర్లలో 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. జింబాబ్వే స్కోర్ 44/5 వద్ద నుండగా (9.2 ఓవర్లు) వర్షం మళ్లీ మొదలైంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో బెన్ కర్రన్ 15, మరుమణి 6, బ్రియాన్ బెన్నెట్ 0, డియాన్ మైర్స్ 12, సీన్ విలియమ్స్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (1),సికందర్ రజా (1) క్రీజ్లో ఉన్నారు. -
శిఖర్ ధవన్ సుడిగాలి శతకం
బిగ్ క్రికెట్ లీగ్లో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ చెలరేగి ఆడుతున్నాడు. ఈ లీగ్లో నార్తర్న్ ఛార్జర్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధవన్.. యూపీ బ్రిడ్జ్ స్టార్స్తో జరిగిన మ్యాచ్లో సుడిగాలి శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్లో 49 బంతుల్లోనే శతక్కొట్టిన ధవన్.. ఓవరాల్గా 63 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. SHIKHAR DHAWAN CENTURY. 🙇♂️🔥pic.twitter.com/CntrgLAf4L— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024ధవన్కు జతగా మరో ఎండ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ సమీవుల్లా షెన్వారీ కూడా విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. షెన్వారీ 46 బంతుల్లో 11 సిక్స్లు, 7 ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్-షెన్వారీ జోడీ తొలి వికెట్కు 207 పరుగులు జోడించింది. ధనవ్, షెన్వారీ సుడిగాలి శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది.పరుగుల వరద పారిస్తున్న ధవన్బిగ్ క్రికెట్ లీగ్లో శిఖర్ ధవన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ధవన్ 170కి పైగా స్ట్రయిక్రేట్తో 301 పరుగులు చేశాడు. ఈ లీగ్లో ధవన్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా కూడా ధవన్లో జోరు ఏమాత్రం తగ్గలేదు. రిటైర్మెంట్ అనంతరం ధవన్ ప్రతి చోటా లీగ్లు ఆడుతున్నాడు. ఇటీవలే అతను నేపాల్ క్రికెట్ లీగ్లోనూ పాల్గొన్నాడు. ధవన్ అక్కడ కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడి అభిమానులను అలరించాడు. -
WI Vs BAN: వెస్టిండీస్పై చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. కింగ్స్టౌన్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 16) జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ గడ్డపై టీ20ల్లో బంగ్లాదేశ్కు ఇది తొలి విజయం. తద్వారా ఈ మ్యాచ్కు చారిత్రక గుర్తింపు దక్కింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (43), జాకెర్ అలీ (27), మెహిది హసన్ (26 నాటౌట్), షమీమ్ హొసేన్ (27) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, ఓబెద్ మెక్కాయ్ తలో రెండు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. మెహిది హసన్ 4 వికెట్లు తీసి విండీస్ను దెబ్బకొట్టాడు. హసన్ మహహూద్, తస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ హసన్, రిషద్ హొసేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రోవ్మన్ పావెల్ (60) విండీస్ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో రోవ్మన్ పావెల్తో పాటు రొమారియో షెపర్డ్ (22), జాన్సన్ ఛార్లెస్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్ వికెట్కీపర్ లిట్టన్ దాస్ ఐదుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 17న జరుగనుంది.కాగా, టీ20 సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆతిథ్య వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. -
ముగిసిన మినీ వేలం.. అత్యంత ఖరీదైన ప్లేయర్ ఎవరంటే..?
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ మినీ వేలంలో బెంగళూరు నగరంలో ఇవాళ (డిసెంబర్ 15) జరిగింది. ఈ వేలంలో దేశ విదేశాలకు చెందిన 120 మంది ప్లేయర్లు పాల్గొనగా.. ఖాళీగా ఉన్న 19 స్థానాలు భర్తీ అయ్యాయి. వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్గా షేక్ సిమ్రన్ నిలిచింది. సిమ్రన్ను గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది. సిమ్రన్ తర్వాత అత్యధిక ధర విండీస్ ఆల్రౌండర్ డియాండ్రా డొట్టిన్కు దక్కింది. డొట్టిన్ను గుజరాత్ జెయింట్స్ రూ.1.7 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో మరో ఇద్దరు భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లకు కోటి పైన ధర లభించింది. జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు.. ప్రేమా రావత్ను ఆర్సీబీ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకున్నాయి.డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్లుషేక్ సిమ్రన్-1.9 కోట్లు (గుజరాత్ జెయింట్స్)డియాండ్రా డొట్టిన్-1.7 కోట్లు (గుజరాత్ జెయింట్స్)జి కమలిని-1.6 కోట్లు (ముంబై ఇండియన్స్)ప్రేమా రావత్-1.2 కోట్లు (ఆర్సీబీ)నల్లపురెడ్డి చరణి-55 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే..!ముంబై ఇండియన్స్:జి కమిలిని-1.6 కోట్లునడినే డి క్లెర్క్-30 లక్షలుఅక్షిత మహేశ్వరి-20 లక్షలుసంస్కృతి గుప్తా-10 లక్షలుఆర్సీబీ:ప్రేమా రావత్-1.2 కోట్లుజోషిత-10 లక్షలురాఘ్వి బిస్త్-10 లక్షలుజాగ్రవి పవార్-10 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్:నల్లపురెడ్డి చరణి-55 లక్షలునందిని కశ్యప్-10 లక్షలుసారా బ్రైస్-10 లక్షలునికీ ప్రసాద్-10 లక్షలుయూపీ వారియర్జ్:అలానా కింగ్-30 లక్షలుఆరుషి గోయెల్-10 లక్షలుక్రాంతి గౌడ్-10 లక్షలుగుజరాత్ జెయింట్స్:షేక్ సిమ్రన్-1.9 కోట్లుడియాండ్రా డొట్టిన్-1.7 కోట్లుడేనియెల్ గిబ్సన్-30 లక్షలుప్రకాషిక నాయక్-10 లక్షలు -
ఘనంగా ప్రారంభమైన బిగ్బాష్ లీగ్.. తొలి మ్యాచ్లో స్టోయినిస్ జట్టు ఓటమి
ఈ ఏడాది బిగ్బాష్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో మార్కస్ స్టోయినిస్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్.. పెర్త్ స్కార్చర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. స్టోయినిస్ (37), టామ్ కర్రన్ (37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్లో జో క్లార్క్ 0, థామస్ రోజర్స్ 14, సామ్ హార్పర్ 1, కార్ట్రైట్ 18, వెబ్స్టర్ 19, హెచ్ మెక్కెంజీ 4, ఆడమ్ మిల్నే 2, బ్రాడీ కౌచ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. స్కార్చర్స్ బౌలర్లలో జై రిచర్డ్సన్ 3, లాన్స్ మోరిస్ 2, బెహ్రెన్డార్ఫ్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన స్కార్చర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కూపర్ కన్నోలీ (64) మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్టార్చర్స్ విజయానికి బీజం వేశాడు. ఆస్టన్ టర్నర్ (37 నాటౌట్), నిక్ హాబ్సన్ (27 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్లతో స్కార్చర్స్ను విజయతీరాలకు చేర్చారు. స్కార్చర్స్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (6), కీటన్ జెన్నింగ్స్ (4), మాథ్యూ హర్స్ట్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మెల్బోర్న్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, పీటర్ సిడిల్, టామ్ కర్రన్, బ్రాడీ కౌచ్ తలో వికెట్ పడగొట్టారు. రేపు జరుగబోయే మ్యాచ్లో సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. -
మినీ వేలం.. విండీస్ అల్రౌండర్కు భారీ మొత్తం
మహిళల ఐపీఎల్ (WPL) మినీ వేలం బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) జరుగుతుంది. ఈ వేలంలో విండీస్ ఆల్రౌండర్, లేడీ యూనివర్సల్ బాస్గా పిలువబడే డియాండ్రా డొట్టిన్ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.7 కోట్ల భారీ మొత్తనికి సొంతం చేసుకుంది. ఇవాళ జరుగుతున్న మినీ వేలంలో మొదటిగా సోల్డ్ ఔటైన ప్లేయర్ డొట్టినే. డొట్టిన్ను 2023 డబ్ల్యూపీఎల్ ఇనాగురల్ ఎడిషన్లో కూడా గజరాత్ జెయింట్సే సొంతం చేసుకుంది. ఆ సీజన్లో జెయింట్స్ డొట్టిన్ను రూ. 60 లక్షలకు దక్కింంచుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ లీగ్ ప్రారంభానికి ముందే జెయింట్స్ డొట్టిన్ను వదిలేసింది. డొట్టిన్ తొలుత 2022లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కలు పలికింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్కప్కు ముందు డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ యేడు పొట్టి ప్రపంచకప్లో డొట్టిన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఐదు ఇన్నింగ్స్ల్లో 120 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసింది.కాగా, ఈసారి మెగా వేలంలో గుజరాత్ జెయింట్సే అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగింది. జెయింట్స్ వద్ద రూ.4.4 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో జెయింట్స్ కేవలం నాలుగు స్లాట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. డొట్టిన్ కోసం జెయింట్స్తో పాటు యూపీ వారియర్జ్ తీవ్రంగా పోటీపడింది. అయితే అంతిమంగా డొట్టిన్ను జెయింట్సే దక్కించుకుంది. డొట్టిన్కు విధ్వంసకర బ్యాటర్గానే కాకుండా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్గానూ పేరుంది. అందుకే డొట్టిన్కు వేలంలో భారీ మొత్తం దక్కింది.ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో తమిళనాడు అమ్మాయి జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు సొంతం చేసుకుంది. నల్లపురెడ్డి చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. నందిని కశ్యప్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. సిమ్రన్ షేక్కు గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. సౌతాఫ్రికాకు చెందిన నదినే డి క్లెర్క్ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఆఫ్ఘనిస్తాన్
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే వేదికగా ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దర్విష్ రసూలీ (58) అర్ద సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా (28), గుల్బదిన్ (26 నాటౌట్), సెదికుల్లా అటల్ (18), గుర్బాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ట్రెవర్ గ్వాండు, ర్యాన్ బర్ల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.154 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 17.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, ఒమర్జాయ్, ఫరీద్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో సికందర్ రజా (35) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రియాన్ బెన్నెట్ (27), తషింగ ముసేకివా (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14న జరుగనుంది. -
పాకిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం
పాకిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు రెడ్ బాల్ (టెస్ట్) కోచ్ జేసన్ గిల్లెస్పీ జట్టుతో పాటు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చోటు చేసుకుంటున్న పరిణామాలే గిల్లెస్పీ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది.పీసీబీ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలతో గిల్లెస్పీ కలత చెందాడని సమాచారం. గిల్లెస్పీ ఇవాళ (డిసెంబర్ 12) పాక్ టెస్ట్ జట్టుతో కలిసి దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. అయితే పాక్ జట్టు ప్రయాణించిన విమానంలో గిల్లెస్పీ జాడ కనబడలేదు. దీంతో ఆయన తన రాజీనామాను పీసీబీకి పంపినట్లు ప్రచారం జరుగతుంది. ఈ అంశంపై పీసీబీ వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు.గిల్లెస్పీ ఈ ఏడాది ప్రారంభంలో పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. గిల్లెస్పీ-పీసీబీ మధ్య రెండేళ్లకు ఒప్పందం కుదిరింది. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. అయితే బంగ్లా సిరీస్ తర్వాత పాక్ స్వదేశంలోనే ఇంగ్లండ్పై సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా పీసీబీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల పట్ల గిల్లెస్పీ అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది.పాక్ వైట్ బాల్ కోచ్గా గ్యారీ కిర్స్టన్ నిష్క్రమించిన కొద్ది రోజుల్లోనే గిల్లెస్పీ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్లో గిల్లెస్పీతో పాటు కిర్స్టన్ పాక్ హెడ్ కోచ్లుగా నియమించబడ్డారు. పాక్ జట్టుకు ఇద్దరు విదేశీ కోచ్లు ఆరు నెలలు కూడా నిలదొక్కుకోలేకవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిల్లెస్పీ గైర్హాజరీలో పాక్ రెడ్ బాల్ టీమ్ తాత్కాలిక బాధ్యతలను కూడా ఆకిబ్ జావిదే మొయవచ్చు. జావిద్ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాక్ తాత్కాలిక వైట్ బాల్ కోచ్గా నియమించబడ్డ విషయం తెలిసిందే.ప్రస్తుతం పాక్ పరిమిత ఓవర్ల జట్లు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్నాయి. టీ20, వన్డే సిరీస్ల అనంతరం పాక్ సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. రెండు టెస్టులు సెంచూరియన్ (డిసెంబర్ 26 నుంచి), కేప్ టౌన్ (జనవరి 3 నుంచి) వేదికలుగా జరుగనున్నాయి. -
ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్పై జింబాబ్వే విజయం
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరి బంతికి ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. తషింగ సింగిల్ తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లో జింబాబ్వే 11 పరుగులు రాబట్టి గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ను కరీమ్ జనత్ (54 నాటౌట్), మహ్మద్ నబీ (44) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 79 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, మసకద్జ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49) జింబాబ్వేను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చి ఔటయ్యాడు. ఇక్కడే ఆఫ్ఘన్లు జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. 11 పరుగుల వ్యవధిలో జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం చివరి బంతి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తషింగ (16 నాటౌట్), మసకద్జ (6 నాటౌట్) సాయంతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ (4-1-33-3), రషీద్ ఖాన్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ నబీకి ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 13న జరుగనుంది. -
అభిషేక్ శర్మ విధ్వంసం
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ ఓ లోకల్ టీ20 టోర్నమెంట్లో (టైమ్స్ షీల్డ్ టోర్నీ) చెలరేగిపోయాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్లో అభిషేక్ 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అభిషేక్ భారీ షాట్లు అడుతున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలొ అభిషేక్ ఆడిన షాట్లు చూస్తుంటే ఐపీఎల్ 2025 సీజన్ కోసం గట్టిగానే కసరత్తు చేస్తున్నాడనిపిస్తుంది.ABHISHEK SHARMA SHOW IN TIMES SHIELD TOURNAMENT...!!! 🙇- While playing in the red ball, Abhishek smashed 60 runs from just 22 balls, preparing hard for the 2025 season. pic.twitter.com/smqEHcOxNl— Johns. (@CricCrazyJohns) December 10, 2024అభిషేక్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లోనూ పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన అభిషేక్.. చివరి రెండు మ్యాచ్ల్లో తన ప్రతాపం చూపించాడు. మూడో టీ20లో 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసిన అభిషేక్.. నాలుగో మ్యాచ్లో 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఈ సిరీస్ను సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది.అభిషేక్ ఐపీఎల్ ప్రదర్శన విషయానికొస్తే.. గత సీజన్లో అభిషేక్ చెలరేగిపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరడంలో అభిషేక్ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 204.22 స్ట్రయిక్ రేట్తో 484 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ గత మూడు ఐపీఎల్ సీజన్లుగా రాణిస్తూ వస్తున్నాడు. అందుకే సన్రైజర్స్ అతన్ని వేలానికి వదిలి పెట్టకుండా అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 63 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 155.24 స్ట్రయిక్రేట్తో 1377 పరుగులు చేశాడు. -
గాయం రేపిన చిచ్చు.. రోహిత్-షమీ మధ్య విభేదాలు..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మొహమ్మద్ షమీ మధ్య విభేదాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా సోషల్మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలకు షమీ గాయం కారణమని తెలుస్తుంది. దైనిక్ జాగారణ్ నివేదిక మేరకు.. రోహిత్-షమీ మధ్య విభేదాలకు భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ సందర్భంగా బీజం పడింది. ఆ సిరీస్లోని తొలి టెస్ట్కు ముందు షమీ గురించి రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ ఫిట్గా లేడని, అతడి మోకాలి భాగంలో వాపు వస్తుందని రోహిత్ మీడియాకు వివరణ ఇచ్చాడు. మరోవైపు షమీ మాత్రం తాను పూర్తిగా ఫిట్గా ఉన్నట్లు సోషల్మీడియా వేదికగా ప్రకటించాడు. ఇదే విషయమై రోహిత్-షమీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. తాను పూర్తిగా ఫిట్గా ఉన్నప్పుడు తప్పుడు స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నావని షమీ రోహిత్ను నిలదీశాడట.తాజాగా మరోసారి అదే స్టేట్మెంట్అడిలైడ్ టెస్ట్లో టీమిండియా పరాజయం అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. షమీ మోకాలు మళ్లీ వాచిందని, గాయాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పాడు. షమీ కోసం టీమిండియా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నాడు. అయితే గాయం పూర్తిగా తగ్గకముందే బరిలోకి దింపి షమీని ఒత్తిడిలోకి నెట్టదలచుకోవడం లేదని అన్నాడు. రోహిత్ గతంలోనూ షమీపై ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ వ్యాఖ్యలకు భిన్నంగా..ఓ పక్క రోహిత్ శర్మనేమో షమీ పూర్తిగా ఫిట్గా లేడని స్టేట్మెంట్లు ఇస్తుంటే షమీ మాత్రం మైదానంలో అదరగొడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో షమీ దుమ్మురేపుతున్నాడు. అంతకుముందు రంజీ ట్రోఫీలోనూ షమీ సత్తా చాటాడు. తాను ఫిట్గా ఉండటమే కాకుండా మంచి ఫామ్లో కూడా ఉన్నట్లు షమీ మెసేజ్ పంపుతున్నాడు. తాజాగా చండీఘడ్తో జరిగిన ఓ మ్యాచ్లో షమీ ఆల్రౌండ్షోతో అదరగొట్టాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు చేయడటమే కాకుండా బౌలింగ్లో 13 డాట్ బాల్స్ వేసి ఓ వికెట్ తీశాడు. రోహిత్ చెబుతున్నట్టు షమీకి గాయం తిరగబెడితే అతను విశ్రాంతి తీసుకోవాలి కాని, బరిలోకి దిగి ఇంత మెరుగ్గా ఎలా ఆడగలడు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. -
రెండో టెస్ట్లోనూ సౌతాఫ్రికాదే విజయం.. సిరీస్ కైవసం
గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 205/5 వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక ఓవర్నైట్ స్కోర్కు మరో 33 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఛేదనలో శ్రీలంక 238 పరుగులకే చాపచుట్టేసింది. కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. రబాడ, డేన్ పీటర్సన్ తలో రెండు వికెట్లు.. జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. లంక సెకెండ్ ఇన్నింగ్స్లో ధనంజయ డిసిల్వ (50) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కుసాల్ మెండిస్ (46), కమిందు మెండిస్ (35), ఏంజెలో మాథ్యూస్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అంతకుముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 317 పరుగులకు ఆలౌటైంది. ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బేశాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్ (55), బవుమా (66) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులు చేసింది. 89 పరుగులు చేసిన పథుమ్ నిస్సంక టాప్ స్కోరర్గా నిలిచాడు. డేన్ పీటర్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (101), కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. లంక బౌలర్లలో లహీరు కుమార అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి టెస్ట్లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే. -
భారత క్రికెట్కు దుర్దినం.. ఒకే రోజు మూడు పరాభవాలు
భారత క్రికెట్కు సంబంధించి ఇవాళ (డిసెంబర్ 8) దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు భారత క్రికెట్ జట్లకు మూడు పరాభవాలు ఎదురయ్యాయి. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 122 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఇవాళే జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో యంగ్ ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. ఫైనల్లో భారత్పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్గా అవతరించింది. ఇలా ఒకే రోజు భారత క్రికెట్ జట్లు మూడు పరాభవాలు ఎదుర్కోవడంతో సగటు భారత క్రికెట్ అభిమాని బాధ పడుతున్నాడు. భారత క్రికెట్కు ఇవాళ దుర్దినం అని అభిప్రాయపడుతున్నాడు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో టీమిండియా గెలుపొందగా.. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరుగనుంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. తద్వారా ఆసీస్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది.అండర్-19 ఆసియా కప్ విషయానికొస్తే.. ఇవాళ జరిగిన ఫైనల్లో భారత్పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. -
పాక్ గడ్డపై భారత జట్టుకు మానని గాయాలు!
దాయది దేశాల క్రికెట్ పోరు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. కొన్ని కోట్ల మందికి, ముఖ్యంగా ఇరుదేశాల క్రికెట్ అభిమానుల్ని ఒకచోటుకు చేర్చి.. విపరీతమైన మజాను అందిస్తుంటుంది. అయితే ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు సన్నగిల్లడం, సరిహద్దు వివాదం, ఉగ్రదాడుల నేపథ్యాలు పరస్పర పర్యటనలకు ఇరుదేశాలను దూరం చేస్తూ వస్తున్నాయి. ఈ కారణంగానే వచ్చే ఏడాదిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్కు ఫిక్స్ అయ్యింది. అయితే..క్రికెట్ రంగంలోనే రిచ్చెస్ట్ బోర్డు అని.. ఐసీసీనే ప్రభావితం చేయగల సత్తా ఉందనే పేరుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)కి. అంతటి శక్తివంతమైన బోర్డు.. పాక్ గడ్డకు తమ ఆటగాళ్లను పంపించేందుకు, అక్కడి పిచ్లపై ఆడించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తోంది. దీనికి కొంత సమాధానం భారత మాజీ క్రికెటర్ రాసిన పుస్తకంలో దొరికింది.👉80వ దశకం చివర్లో.. పాక్-భారత్ మధ్య కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఉగ్రవాదాన్ని పైసలు, ఆశ్రయమిచ్చి మరీ పోషిస్తోందంటూ పాక్ను అంతర్జాతీయ సమాజంలో భారత్ ఎండగట్టడం మొదలుపెట్టింది అప్పుడే. అలాంటి టైంలో అనూహ్యంగా.. భారత జట్టు పాక్ పర్యటన వెళ్లాల్సి వచ్చింది.👉1989-90 సీజన్లో కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్వంలోని భారత జట్టు.. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు పాక్కు వెళ్లింది. అన్ని టెస్టులు డ్రాగా ముగియగా.. వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది. అయితే.. కరాచీ స్టేడియంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఎవరూ ఊహించని ఓ ఘటన జరిగింది. పాక్ జట్టు బ్యాటింగ్.. భారత్ ఫీల్డింగ్ చేస్తోంది. ఆ సమయంలో పథాన్ దుస్తుల్లో ఓ వ్యక్తి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. బహుశా ఎవరైనా అభిమాని తమ ఫేవరెట్ ప్లేయర్ను కలవడానికి అయ్యి ఉంటారేమో!.. సిబ్బంది అతన్ని అడ్డుకుంటారులే అనుకుంటూ భారత ఫీల్డర్లు తమతమ స్థానాల్లో ఉండిపోయారు. అయితే పిచ్ను సమీపించే కొద్దీ.. అతని ఉద్దేశం ఏంటో ఆటగాళ్లకి అర్థమైంది. ప్రోకశ్మీర్, భారత వ్యతిరేక స్లోగన్లతో దూసుకొచ్చాడతను. అసలు ఈ పర్యటనకు రాకుండా ఉండాల్సిందంటూ భారత ఆటగాళ్లు దూషిస్తున్నాడతను. ఇంతలో అంపైర్లు జోక్యం చేసుకుని.. అతన్ని అడ్డగించే మైదానం నుంచి వెనక్కి పంపే ప్రయత్నం చేయబోయారు. అయితే ఆ వ్యక్తి సరాసరి కృష్ణమాచారి శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఏదో అన్నాడు. అంతే.. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఒకరి గల్లా ఒకరు పట్టుకుని లాగేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ షర్ట్ చినిగిపోయింది. దీంతో జట్టు సభ్యులంతా దగ్గరికి పరిగెత్తారు. ఈలోపు.. సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని అక్కడి నుంచి లాక్కెల్లారు. క్రికెటర్ నుంచి కామెంటేటర్గా మారిన సంజయ్ మంజ్రేకర్ తన ‘ఇంపర్ఫెక్ట్’లో ఈ ఘటన గురించి రాసుకొచ్చారు. మంజ్రేకర్కు మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్కు కూడా ఈ మ్యాచ్ టెస్ట్ డెబ్యూ కావడం గమనార్హం.అయితే ఈ ఘటన తర్వాత..శ్రీకాంత్ తన షర్ట్ మార్చుకుని వచ్చాడు. అసలేం జరగనట్లు ఆట యధావిధిగా జరిగింది. కానీ ఇదే మ్యాచ్లో.. మరో భారతీయ ఆటగాడు ముహమ్మద్ అజారుద్దీన్పైనా మెటల్ హుక్తో దాడి జరిగింది. ఒకవేళ.. ఇవాళ అలాంటి ఘటనలే గనుక ఈనాడు జరిగి ఉంటే.. ఆ మ్యాచ్, సిరీస్..మొత్తం పర్యటనే రద్దు అయ్యి ఉండేదేమో!.👉ఇక.. అదే టూర్లో జరిగిన మరో ఘటన గుర్తు చేసుకుంటే.. మూడో వన్డే సందర్భంగా పెద్ద రచ్చే చెలరేగింది. కరాచీ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరుగుతుండగా.. 28 పరుగులకు పాక్ మూడు వికెట్లు పొగొట్టుకుంది. అది సహించలేని అభిమానులు భారత జట్టు ఆటగాళ్ల మీదకు రాళ్లు విసిరారు. పాక్ కెప్టెన్ జావెద్ మియాందాద్ అభిమానుల్ని శాంతపర్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు టియర్ గ్యాస్ ప్రయోగించి చెల్లాచెదురు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో మ్యాచ్ను రద్దు చేసి.. తిరిగి లాహోర్లో నిర్వహించారు.👉ఈ ఘటన తర్వాత ఇరు కూడా దేశాలు పర్యటనలను కొనసాగించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే సిరీస్లు నిర్వహించుకున్నాయి. తటస్థ వేదికల్లోనూ మ్యాచ్లు ఆడాయి.. ఇంకా ఆడుతున్నాయి. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భద్రతా కారణాల వల్లే తమ జట్టును పాక్కు పంపలేమని బీసీసీఐ కుండబద్ధలు కొట్టేసింది. ఇందుకు పైన చెప్పుకున్న కారణాలే కాదు.. ఇంకో ముఖ్యమైన ఘటన ఉంది.2009 శ్రీలంక జట్టుపై పాక్ పర్యటనలో జరిగిన దాడి.. క్రికెట్ చరిత్రలో ‘బుల్లెట్’ అక్షరాలతో లిఖించబడింది. టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా ముసుగులతో వచ్చిన కొందరు తూటాల వర్షం కురిపించారు. ఆరుగురు పోలీసాఫీసర్లు చనిపోగా.. లంక టీంకు ఆటగాళ్లు, అధికారులు ఏడుగురు గాయపడ్డారు. ఘటన తర్వాత ఎయిర్లిఫ్ట్ ద్వారా క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. క్రికెట్ చరిత్రలోనే అదొక చీకటి దినంగా మిగిలిపోయింది.ఈ ఘటన తర్వాత చాలా దేశాలు తమ జట్లను పాక్కు పంపేందుకు భయపడ్డాయి. అయితే భారత్ మాత్రం 2008 తర్వాతి నుంచి పాక్ గడ్డపై సిరీస్ ఆడలేదు. ముంబై 26/11 దాడులే అందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.👉పాక్ క్రికెట్ జట్టు ఇప్పటిదాకా పదిసార్లు.. భారత్లో పర్యటించింది. 1989 ఘటనలు పాక్ గడ్డపై భారత్కు మానని గాయం. అయితే ఆ ఘటనల తర్వాత కూడా భారత జట్టు మూడుసార్లు పాక్ పర్యటనకు వెళ్లింది. కానీ, మునుపటిలా పరిస్థితులు లేవిప్పుడు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగితే పర్వాలేదు. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కానీ, పాక్లో ఇప్పుడు పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్తో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. పైగా.. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత రాజకీయంగానూ పాక్లో సంక్షోభం నడుస్తోంది. ఒకవైపు ఉగ్రదాడులు.. ఇంకోవైపు అనుమానాస్పద రీతిలో ఉగ్ర నేతలు హతమవుతుండడం తీవ్ర చర్చనీయాంశంమైంది. అలాంటప్పుడు భారత ఆటగాళ్లకు భద్రత కల్పించడం ప్రశ్నార్థకమే!. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే ఇటు బీసీసీఐ, అటు కేంద్రప్రభుత్వం టీమిండియాను పాక్ పర్యటనకు అనుమతించడం లేదన్నది అర్థమవుతోంది. -
పాకిస్తాన్పై సంచలన విజయం సాధించిన పసికూన
బులవాయో వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్పై పసికూన జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే పాక్ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించి 132 పరుగులకే పరిమితం చేశారు. పాక్ ఇన్నింగ్స్లో టాపార్డర్ విఫలం కాగా.. సల్మాన్ అఘా (32), తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే అష్టకష్టాలు పడి ఎట్టకేలకే విజయతీరాలకు చేరింది. జింబాబ్వే మరో బంతి మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో బ్రియాన్ బెన్నెట్ (43) టాప్ స్కోరర్గా నిలువగా.. మరుమణి (15), డియాన్ మైర్స్ (13), సికంబర్ రజా (19) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. జహన్దాద్ ఖాన్ 2, సల్మాన్ అఘా, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్తాన్పై జింబాబ్వేకు టీ20ల్లో ఇది మూడో గెలుపు మాత్రమే.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాక్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్ నామమాత్రంగా సాగింది. ఈ మ్యాచ్లో గెలిచి జింబాబ్వే క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. అంతకుముందు వన్డే సిరీస్లోనూ జింబాబ్వే ఓ మ్యాచ్ గెలవగా.. పాక్ మిగతా రెండు మ్యాచ్లు గెలిచి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. -
రాణించిన జింబాబ్వే బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన పాకిస్తాన్
జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పాకిస్తాన్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు. పాక్ ఇన్నింగ్స్లో సల్మాన్ అఘా (32) టాప్ స్కోరర్గా నిలువగా.. తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ టాపార్డర్ బ్యాటర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (4), ఒమైర్ యూసఫ్ (0), ఉస్మాన్ ఖాన్ (5) విఫలమయ్యారు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో గెలిచిన పాక్ ఇదివరకే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ను సైతం పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లలో జింబాబ్వే తొలి వన్డేలో మాత్రమే గెలిచింది. -
చరిత్రపుటల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ రిస్ట్ స్పిన్నర్ సుఫియాన్ ముఖీమ్ చరిత్రపుటల్లోకెక్కాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ముఖీమ్ 2.4 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తరఫున టీ20ల్ల ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఉమర్ గుల్ రెండు సార్లు 5/6 గణాంకాలు నమోదు చేశాడు. పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్గానూ ముఖీమ్ రికార్డుల్లోకెక్కాడు. ముఖీమ్, గుల్, ఇమాద్ వసీం (5/14) పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించారు. ముఖీమ్ తన ఏడో టీ20లోనే ఈ ఘనత సాధించడం విశేషం.ముఖీమ్ దెబ్బకు జింబాబ్వే టీ20ల్లో తమ అత్యల్ప స్కోర్ను (57) నమోదు చేసింది. ఈ మ్యాచ్లో పాక్ మరో 87 బంతులు మిగిలుండగానే జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని (58) ఛేదించింది. టీ20ల్లో బంతుల పరంగా పాక్కు ఇది భారీ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 12.4 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. ముఖీమ్ 5, అబ్బాస్ అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (21), మరుమణి (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 37 పరుగులు జోడించారు. అనంతరం 20 పరుగుల వ్యవధిలో జింబాబ్వే 10 వికెట్లు కోల్పోయింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 5.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. సైమ్ అయూబ్ (36), ఒమైర్ యూసఫ్ (22) అజేయంగా నిలిచారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 5న జరుగనుంది. -
ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుని.. భారత క్రికెట్ క్వీన్గా క్లాసికల్ డాన్సర్(ఫొటోలు)
-
ఐదేసిన రాణా.. ఆధిక్యంలో బంగ్లాదేశ్
జమైకా వేదికగా వెస్టిండీస్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత వెస్టిండీస్ ఆధిక్యం సాధించినట్లు కనిపించింది. అనంతరం బంగ్లా బౌలర్లు రెచ్చిపోవడం.. బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించడంతో మ్యాచ్పై వెస్టిండీస్ పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 211 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ (0), షద్మాన్ ఇస్లాం (46), షహదత్ హొసేన్ దీపు (28), మెహిది హసన్ మిరాజ్ (42), లిటన్ దాస్ (25) ఔట్ కాగా.. జాకెర్ అలీ (29), తైజుల్ ఇస్లాం (9) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 2, అల్జరీ జోసఫ్, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌటైంది. నహిద్ రాణా (5/61) దెబ్బకు విండీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. హసన్ మహమూద్ 2, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. విండీస్ ఇన్నింగ్స్లో కీసీ కార్తీ (40), క్రెయిగ్ బ్రాత్వైట్ (39), మికైల్ లూయిస్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ అద్భుతమైన స్పెల్తో (15.5-10-5-4) బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు. షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్లో షద్మాన్ ఇస్లాం (64) టాప్ స్కోరర్గా నిలువగా.. మెహిది హసన్ (36), షహాదత్ హొసేన్ (22), తైజుల్ ఇస్లాం (16) రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ తొలి మ్యాచ్లో 201 పరుగుల తేడాతో గెలుపొందింది. -
అబుదాబీ టీ10 లీగ్ విజేత డెక్కన్ గ్లాడియేటర్స్
అబుదాబీ టీ10 లీగ్ 2024 ఎడిషన్ విజేతగా డెక్కన్ గ్లాడియేటర్స్ అవతరించింది. మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో నిన్న (డిసెంబర్ 2) జరిగిన ఫైనల్లో గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సాంప్ ఆర్మీ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్), వికెట్కీపర్ ఆండ్రియస్ గౌస్ (9 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) ఓ మోస్తరు పరుగులు చేశారు. షర్జీల్ ఖాన్ 5, అసలంక 13, జాక్ టేలర్ 1, కరీమ్ జనత్ 16 (నాటౌట్), రోహన్ ముస్తఫా 0, ఇమాద్ వసీం 7, ఖైస్ అహ్మద్ 1 (నాటౌట్) పరుగు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, తీక్షణ, నోర్జే, ఉస్మాన్ తారిక్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేర్స్.. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (21 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (10 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో 6.5 ఓవర్లలోనే 2 వికెట్ల కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. ఆఖర్లో రిలీ రొస్సో (5 బంతుల్లో 12; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. జోస్ బట్లర్ (5 బంతుల్లో 12 నాటౌట్; సిక్స్) సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. అబుదాబీ టీ10 లీగ్లో డెక్కన్ గ్లాడియేటర్స్కు ఇది మూడో టైటిల్. 2021-22, 2022 ఎడిషన్లలో కూడా గ్లాడియేటర్స్ ఛాంపియన్గా నిలిచింది. -
అందమైన వధువుగా నువ్వు.. నాకెంతో సంతోషం: సోదరి పెళ్లి... టీమిండియా కెప్టెన్ భావోద్వేగం(ఫొటోలు)
-
Abu Dhabi T10 League: ఫైనల్లో సాంప్ ఆర్మీ
అబుదాబీ టీ10 లీగ్లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీ జట్టు ఫైనల్కు చేరింది. ఇవాళ (డిసెంబర్ 2) జరిగిన క్వాలిఫయర్-2లో సాంప్ ఆర్మీ.. ఢిల్లీ బుల్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. నిఖిల్ చౌదరీ (16), రోవ్మన్ పావెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇసురు ఉడాన 3, అమీర్ హమ్జా 2, ఇమాద్ వసీం, కరీం జనత్ తలో వికెట్ తీసి ఢిల్లీ బుల్స్ను కట్టడి చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ మరో ఐదు బంతులు మిగిలుండగానే (ఐదు వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆండ్రియస్ గౌస్ (38), జాక్ టేలర్ (23 నాటౌట్) సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్లుగా నిలిచారు. జాక్ టేలర్ తొమ్మిదో ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది సాంప్ ఆర్మీని గెలిపించాడు. ఇవాళ రాత్రి 9 గంటలకు జరిగే ఫైనల్లో సాంప్ ఆర్మీ.. డెక్కన్ గ్లాడియేటర్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న డుప్లెసిస్.. వీడియో
అబుదాబీ టీ10 లీగ్లో భాగంగా ఢిల్లీ బుల్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. అమీర్ హంజా బౌలింగ్లో షాదాబ్ ఖాన్ కొట్టిన బంతిని డుప్లెసిస్ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్గా మలిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇది జరిగింది. ఈ ఓవర్లో డుప్లెసిస్ రెండు క్యాచ్లు పట్టాడు. షాదాబ్ ఖాన్ క్యాచ్కు ముందు డుప్లెసిస్ టామ్ బాంటన్ క్యాచ్ కూడా పట్టుకున్నాడు.WHAT A STUNNER FROM 40-YEAR-OLD FAF DU PLESSIS IN T10 LEAGUE 🤯 pic.twitter.com/LV9KLNHuPt— Johns. (@CricCrazyJohns) December 2, 2024ఈ మ్యాచ్లో డుప్లెసిస్ మొత్తంగా మూడు క్యాచ్లు పట్టాడు. ఇన్నింగ్స్లో ఏడో ఓవర్లో మరో సూపర్ క్యాచ్తో డుప్లెసిస్ రోవ్మన్ పావెల్ను పెవిలియన్కు పంపాడు. 40 ఏళ్ల వయసులోనూ డుప్లెసిస్ మైదానంలో పాదరసంలా కదలడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇసురు ఉడాన 3, అమీర్ హంజా 2, కరీం జనత్, ఇమాద్ వసీం తలో వికెట్ పడగొట్టి ఢిల్లీ బుల్స్ను కట్టడి చేశారు. ఢిల్లీ బుల్స్ ఇన్నింగ్స్లో టిమ్ డేవిడ్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. నిఖిల్ చౌదరీ (16), రోవ్మన్ పావెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. -
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ అద్భుతం.. గడిచిన 46 ఏళ్లలో..!
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ జేడన్ సీల్స్ అద్భుతం చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గడిచిన 46 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యంత పొదుపైన స్పెల్గా రికార్డులు చెబుతున్నాయి. JAYDEN SEALES BOWLED THE MOST ECONOMICAL SPELL IN TEST CRICKET IN LAST 46 YEARS:15.5-10-5-4. 🤯pic.twitter.com/CYoA6ljM6Y— Mufaddal Vohra (@mufaddal_vohra) December 2, 2024ఈ ఇన్నింగ్స్లో సీల్స్ ఎకానమీ రేట్ 0.31గా ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అత్యుత్తమ ఎకానమీ రేట్గా రికార్డుల్లోకెక్కింది. ఈ రికార్డును సాధించే క్రమంలో సీల్స్ దిగ్గజ బౌలర్ జిమ్ లేకర్ రికార్డును అధిగమించాడు. 1957లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో లేకర్ ఓవర్కు సగటున 0.37 పరగులిచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ సగటు భారత దిగ్గజ బౌలర్ బాపు నాదకర్ణి పేరిట ఉంది. నాదకర్ణి 1964లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓవర్కు సగటున 0.15 పరుగులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇందులో 27 మెయిడిన్లు ఉన్నాయి.ఆల్టైమ్ రికార్డుటెస్ట్ క్రికెట్లో సీల్స్ అత్యంత పొదుపైన నాలుగు వికెట్ల (15.5-10-5-4) ఘనత సాధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్కు చెందిన పర్వేజ్ సజ్జద్ పేరిట ఉండేది. 1965లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సజ్జద్ 12 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో సజ్జద్ సగటు 0.41 కాగా.. బంగ్లాతో మ్యాచ్లో సీల్స్ సగటు 0.31గా ఉంది.ఉమేశ్ యాదవ్ రికార్డు బద్దలు కొట్టిన సీల్స్1978 నుంచి టెస్ట్ల్లో అత్యంత పొదుపైన సగటు భారత పేసర్ ఉమేశ్ యాదవ్ పేరిట ఉండేది. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఉమేశ్ 0.42 సగటున బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో 21 ఓవర్లు వేసిన ఉమేశ్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో 16 మెయిడిన్లు ఉన్నాయి. తాజాగా ఉమేశ్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.కుప్పకూలిన బంగ్లాదేశ్జమైకా వేదికగా బంగ్లాదేశ్తో జరుగతున్న రెండో టెస్ట్లో వెస్టిండీస్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 71.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ 4, షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. బంగ్లా తరఫున షద్మాన్ ఇస్లాం (64), మెహిది హసన్ మిరాజ్ (36), షహాదత్ హొసేన్ దీపు (22), తైజుల్ ఇస్లాం (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. మికైల్ లూయిస్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. క్రెయిగ్ బ్రాత్వైట్ (33), కీసీ కార్తీ (19) క్రీజ్లో ఉన్నారు. లూయిస్ వికెట్ నహిద్ రాణాకు దక్కింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ తొలి మ్యాచ్లో 201 పరుగుల తేడాతో నెగ్గింది. -
జింబాబ్వేతో తొలి టీ20.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన పాకిస్తాన్
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ జట్టు నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఒమైర్ యూసఫ్ 16, సైమ్ అయూబ్ 24, ఉస్మాన్ ఖాన్ 39, సల్మాన్ అఘా 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో తయ్యబ్ తాహిర్ (39), ఇర్ఫాన్ ఖాన్ (27) వేగంగా పరుగులు రాబట్టి అజేయంగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, సికందర్ రజా, వెల్లింగ్టన్ మసకద్జ, ర్యాన్ బర్ల్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. సిరీస్లో భాగంగా తొలి టీ20 ఇవాళ (డిసెంబర్ 1) బులవాయోలో జరుగుతుంది. తొలి టీ20కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి వన్డే గెలిచి సంచనలం సృష్టించిన జింబాబ్వే ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. గ్లెన్ ఫిలిప్స్ 58 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.బ్రూక్ భారీ శతకంఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ భారీ సెంచరీతో (171) కదం తొక్కాడు. ఓలీ పోప్ (77), బెన్ స్టోక్స్ (80) అర్ద శతకాలతో రాణించారు. బెన్ డకెట్ (46), గస్ అట్కిన్సన్ (48), బ్రైడన్ కార్స్ (33 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్ మూడు, టిమ్ సౌథీ రెండు, విలియమ్ ఓరూర్కీ ఓ వికెట్ దక్కించుకున్నారు.నిప్పులు చెరిగిన బ్రైడన్ కార్స్తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్కు దెబ్బకొట్టిన బ్రైడన్ కార్స్ సెకెండ్ ఇన్నింగ్స్లోనూ సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్లో కార్స్ 6 వికెట్లు పడగొట్టాడు. కార్స్తో పాటు క్రిస్ వోక్స్ (3/59), అట్కిన్సన్ (1/57) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 254 పరుగులకు చాపచుట్టేసింది. కివీస్ ఇన్నింగ్స్లో విలియమ్సన్ (61), డారిల్ మిచెల్ (84) అర్ద సెంచరీలతో రాణించారు.ఆడుతూపాడుతూ విజయతీరాలకు..!104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 12.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. అరంగేట్రం ఆటగాడు జాకబ్ బేతెల్ 37 బంతుల్లో 50 పరుగులు.. జో రూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. బెన్ డకెట్ 27, జాక్ క్రాలే ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన బ్రైడన్ కార్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. -
లంకతో టెస్ట్ సిరీస్.. సౌతాఫ్రికాకు బిగ్ షాక్
సౌతాఫ్రికా స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కమాండింగ్ పొజిషన్లో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా (70) టాప్ స్కోరర్గా నిలిచాడు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులకే కుప్పకూలింది. జన్సెన్ (7/13) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో లంక పతనాన్ని శాశించాడు. లంక ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (13), లహీరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.కీలక ఆల్రౌండర్కు గాయంఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా కీలక ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ గాయపడ్డాడు. లహీరు కుమార బౌలింగ్ ముల్దర్ బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి చేతి మధ్య వేలు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో అతను తొలి టెస్ట్ మిగతా సెషన్స్తో పాటు రెండో టెస్ట్కు కూడా దూరమయ్యాడు. రెండో టెస్ట్లో ముల్దర్ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కీ భర్తీ చేస్తాడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ముల్దర్ గాయమైనప్పటికీ తొలి ఇన్నింగ్స్తో పాటు రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటింగ్ చేయడం విశేషం. -
పెను విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి.. వీడియో
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ ఆటగాడు మృతి చెందాడు. పూణేలోని ఛత్రపతి సంభాజి నగర్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇమ్రాన్ పటేల్ అనే ఆటగాడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగిన ఇమ్రాన్ పటేల్.. కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అనంతరం ఛాతీ నొప్పి వస్తుందని అంపైర్లకు చెప్పాడు. పెవిలియన్కు వెళ్లే క్రమంలో ఇమ్రాన్ కుప్పకూలిపోయాడు. A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa— Dee (@DeeEternalOpt) November 28, 2024హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఇమ్రాన్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. పైపెచ్చు ఎప్పుడూ ఫిట్గా ఉండేవాడని తోటి క్రికెటర్లు చెప్పారు. ఇమ్రాన్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నాలుగు నెలల పసి గుడ్డు. ఇమ్రాన్ అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ పటేల్కు ఓ క్రికెట్ టీమ్ ఉంది. జీవనోపాధి కోసం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు జ్యూస్ షాప్ నడిపే వాడు. ఇమ్రాన్ మృతి స్థానికంగా విషాద ఛాయలు నింపింది. అచ్చం ఇమ్రాన్లాగే రెండు నెలల క్రితం ఇదే పూణేలో మరో స్థానిక క్రికెటర్ కూడా మృతి చెందాడు. హబీబ్ షేక్ అనే క్రికెటర్ మ్యాచ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.సెప్డెంబర్ 7న ఈ ఘటన జరిగింది. మృతుడు షుగర్ పేషంట్ అని తెలిసింది. -
శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. సెకెండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్గా రికార్డు
క్రైస్ట్చర్చ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. బ్రూక్ తన కెరీర్లో ఏడో టెస్ట్ సెంచరీని 123 బంతుల్లో పూర్తి చేశాడు. బ్రూక్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకోవడం విశేషం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన బ్రూక్.. ఓలీ పోప్తో (77) కలిసి ఐదో వికెట్కు 151 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అనంతరం బ్రూక్.. బెన్ స్టోక్స్తో (32 నాటౌట్) కలిసి ఆరో వికెట్కు అజేయమైన 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం బ్రూక్ 126 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 309 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 39 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్రూక్ఈ మ్యాచ్లో బ్రూక్ 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టెప్ట్ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. బ్రూక్ 2000 పరుగుల మార్కును తాకేందుకు 2300 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో బ్రూక్ సహచరుడు బెన్ డకెట్ టాప్లో ఉన్నాడు. డకెట్ 2293 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితా..బెన్ డకెట్-2293హ్యారీ బ్రూక్-2300టిమ్ సౌథీ-2418అడమ్ గిల్క్రిస్ట్-2483 -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్యాచ్.. నమ్మశక్యం కాని రీతిలో..!
క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన క్యాచ్కు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని రీతిలో ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ ఓలీ పోప్ సహా ఫీల్డ్లో ఉన్న వారందరికి మతి పోయింది. ఫిలిప్స్ విన్యాసం చూసి నెటిజన్లు ముగ్దులైపోతున్నారు. ఇదేం క్యాచ్ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.Glenn Phillips adds another unbelievable catch to his career resume! The 151-run Brook-Pope (77) partnership is broken. Watch LIVE in NZ on TVNZ DUKE and TVNZ+ #ENGvNZ pic.twitter.com/6qmSCdpa8u— BLACKCAPS (@BLACKCAPS) November 29, 2024వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్ బ్యాటింగ్ 53వ ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టిమ్ సౌథీని బౌలింగ్కు దించాడు. అప్పటికే ఓలీ పోప్.. హ్యారీ బ్రూక్తో కలిసి ఐదో వికెట్కు 151 పరుగులు జోడించాడు. సౌథీ వేసిన షార్ట్ పిచ్ డెలివరీకి ఓలీ పోప్ కట్ షాట్ ఆడగా.. గ్లెన్ ఫిలిప్స్ అకస్మాత్తుగా ఫ్రేమ్లోకి వచ్చి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఫలితంగా పోప్ 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓలీ పోప్ ఔటైన అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్లోకి వచ్చాడు. బ్రూక్ 86 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ స్కోర్ 232/5గా ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అందకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. -
SA Vs SL 1st Test: చరిత్ర సృష్టించిన లంక బౌలర్
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో టోనీ డి జోర్జి వికెట్ తీసిన జయసూర్య.. టెస్ట్ల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. జయసూర్యకు టెస్ట్ల్లో 100 వికెట్ల మార్కును తాకేందుకు 17 టెస్ట్లు అవసరమయ్యాయి. జయసూర్యతో పాటు టర్నర్, బార్నెస్, గ్రిమ్మెట్, యాసిర్ షా కూడా 17 టెస్ట్ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకారు. టెస్ట్ల్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఘనత ఇంగ్లండ్కు చెందిన జార్జ్ లోమన్కు దక్కుతుంది. లోమన్ కేవలం 16 టెస్ట్ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జన్సెన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించగా.. కొయెట్జీ 2, రబాడ ఓ వికెట్ తీశారు. లంక ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (13), లహీరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐదుగురు ఆటగాళ్లు డకౌట్లు అయ్యారు.అంతకుముందు లంక బౌలర్లు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కట్టడి చేశారు. అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ బవుమా (70) టాప్ స్కోరర్గా నిలిచాడు.149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టోనీ డి జోర్జి (17), మార్క్రమ్ (47), వియాన్ ముల్దర్ (15) ఔట్ కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (17), బవుమా (24) క్రీజ్లో ఉన్నారు. జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
ఇంగ్లండ్తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న కేన్ మామ
క్రైస్ట్చర్చ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో 33వ సెంచరీ మిస్ అయ్యాడు. కివీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ టామ్ లాథమ్ 47, డెవాన్ కాన్వే 2, రచిన్ రవీంద్ర 34, డారిల్ మిచెల్ 19, టామ్ బ్లండెల్ 17, నాథన్ స్మిత్ 3, మ్యాట్ హెన్రీ 18 పరుగులు చేసి ఔట్ కాగా.. గ్లెన్ ఫిలిప్స్ (41), టిమ్ సౌథీ (10) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో విలియమ్సన్, రచిన్ రవీంద్ర క్రీజ్లో ఉండగా న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే షోయబ్ బషీర్ స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్ను దెబ్బకొట్టాడు. కాగా, గాయం కారణంగా కేన్ విలియమ్సన్ భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ను భారత్ 0-3 తేడాతో న్యూజిలాండ్కు కోల్పోయింది.ఆరేళ్లలో తొలిసారి..ఈ మ్యాచ్లో కేన్ సెంచరీ సాధిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కేన్ అట్కిన్సన్ బౌలింగ్లో టెంప్టింగ్ షాట్ ఆడి జాక్ క్రాలే చేతికి చిక్కాడు. కేన్ 90ల్లో ఔట్ కావడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. విలియమ్సన్ తన చివరి టెస్ట్ సెంచరీని ఇదే ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాపై సాధించాడు. -
3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్న శ్రీలంక బౌలర్
అబుదాబీ టీ10 లీగ్లో శ్రీలంక ఆల్రౌండర్ దసున్ షనక చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ లీగ్లో బంగ్లా టైగర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షనక.. ఢిల్లీ బుల్స్తో జరిగిన మ్యాచ్లో 3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో తొమ్మిదో ఓవర్ వేసిన షనక తొలి నాలుగు బంతులకు బౌండరీలు సమర్పించుకున్నాడు. ఇందులో రెండో నో బాల్స్ ఉన్నాయి. అనంతరం ఐదో బంతి సిక్సర్ కాగా.. ఆరో బంతి నో బాల్ అయ్యింది. తిరిగి ఏడో బంతి కూడా నో బాల్ కాగా.. ఈ బంతి బౌండరీకి తరలివెళ్లింది.మొత్తంగా షనక ఓవర్ తొలి మూడు బంతుల్లో 4 నో బాల్స్ వేశాడు. దీంతో మూడు బంతులు ఏడు బంతులయ్యాయి. ఏడు బంతుల్లో బ్యాటర్ నిఖిల్ చౌదరీ ఐదు బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఓ బాల్ డాట్ బాల్గా మారింది. ఓవర్ చివరి మూడు బంతులకు సింగిల్స్ రావడంతో ఈ ఓవర్లో మొత్తంగా 33 పరుగులు వచ్చాయి.ఢిల్లీ బుల్స్, బంగ్లా టైగర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. బుల్స్ ఇన్నింగ్స్లో ఆడమ్ లిథ్ 1, టామ్ బాంటన్ 8, జేమ్స్ విన్స్ 27, రోవ్మన్ పావెల్ 17, టిమ్ డేవిడ్ 1, షాదాబ్ ఖాన్ 10 (నాటౌట్), ఫేబియన్ అలెన్ 6 పరుగులు చేశారు. ఆఖర్లో నిఖిల్ చౌదరీ మెరుపు వేగంతో 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. లియామ్ లివింగ్స్టోన్ (15 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించడంతో 9.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్కు వర్షం అడ్డంకి
సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. తొలి రోజు ఆటలో కేవలం 20.4 ఓవర్లు మాత్రమే సాధ్యపడ్డాయి. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ ఓడి శ్రీలంక ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్ 4 వికెట్ల నష్టానికి 80 పరుగులుగా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ (9), టోనీ డి జోర్జి (4), ట్రిస్టన్ స్టబ్స్ (16), డేవిడ్ బెడింగ్హమ్ (4) ఔట్ కాగా.. టెంబా బవుమా (28), కైల్ వెర్రిన్ (9) క్రీజ్లో ఉన్నారు. లంక బౌలర్లలో లహీరు కుమార రెండు వికెట్లు పడగొట్టగా.. ఆశిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో తలో వికెట తీశారు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్లో గెలిచిన జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఈ సిరీస్కు ముందు లంక స్వదేశంలో న్యూజిలాండ్ను టెస్ట్, వన్డే సిరీస్ల్లో ఓడించింది. సౌతాఫ్రికా.. ఇటీవలే భారత్ చేతిలో 1-3 తేడాతో టీ20 సిరీస్ను కోల్పోయింది. -
డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక
వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇరకాటంలో పడింది. భద్రతా కారణాల చేత భారత్ ఇప్పటికే పాక్లో పర్యటించబోదని తేల్చి చెప్పగా.. తాజాగా పాక్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు టోర్నీ నిర్వహణను మరింత అడ్డుగా మారాయి. పాక్లో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా పలువురు ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. ఇమ్రాన్ జైలులో ఉండి ప్రభుత్వంపై ఆందోళనకారులను రెచ్చగొడుతున్నాడు. అల్లర్లలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆర్మీ రంగంలో దిగింది. ఆందోళనలు ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంకపాక్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు పాక్ నుంచి వైదొలిగింది. రెండు అనధికారిక టెస్ట్లు, మూడు వన్డేల కోసం శ్రీలంక ఏ జట్టు పాక్లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్ట్లు, ఓ వన్డే ముగిశాయి. ఈలోపు పాక్లో ఆల్లర్లు చెలరేగడంతో శ్రీలంక ఏ జట్టు పాక్ పర్యటన నుంచి అర్దంతరంగా వైదొలిగింది. శ్రీలంక ఏ జట్టు పాక్-ఏ టీమ్తో మరో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ రెండు వన్డేలకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా, శ్రీలంక-ఏతో ఆడిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాక్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. లంక-ఏతో జరిగిన తొలి వన్డేలో కూడా పాకిస్తానే గెలిచింది. -
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఆఫ్ఘన్ ఆటగాడి విధ్వంసం
అబుదాబీ టీ10 లీగ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న జజాయ్ ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు. నార్త్రన్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో జజాయ్ ఈ ఫీట్ను సాధించాడు. వారియర్స్ బౌలర్ అంకుర్ సాంగ్వాన్ జజాయ్ ధాటికి బలయ్యాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఐదో బంతి మినహా మిగిలిన ఐదు బంతులను జజాయ్ సిక్సర్లుగా మలిచాడు. ఈ మ్యాచ్లో జజాయ్ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 53 పరుగులు చేశాడు. జజాయ్తో పాటు మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో నార్త్రన్ వారియర్స్పై బంగ్లా టైగర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్రన్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 28 బంతుల్లో 4 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. వారియర్స్ ఇన్నింగ్స్లో మున్రో మినహా ఎవరూ రాణించలేదు. బ్రాండన్ కింగ్ (12), జాన్సన్ చార్లెస్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ 7, అజ్మతుల్లా 4, జియా ఉర్ రెహ్మాన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ప్రస్తుత ఎడిషన్లో బంగ్లా టైగర్స్కు ఇది వరుసగా రెండో విజయం. -
నా భర్త ఎక్కుడున్నా!..నా హృదయం మాత్రం ఆ జట్టుతోనే: టీమిండియా స్టార్ భార్య(ఫొటోలు)
-
WI Vs BAN: విండీస్తో తొలి టెస్ట్.. ఓటమి దిశగా బంగ్లాదేశ్
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే మరో 225 పరుగుల చేయాలి. చేతిలో మరో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. చివరి రోజు ఆట మిగిలి ఉంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (115) అజేయ శతకంతో కదం తొక్కగా.. మికైల్ లూయిస్ (97), అలిక్ అథనాజ్ (90) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 3, తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ తలో 2, తైజుల్ ఇస్లాం ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మొమినుల్ హక్ (50), జాకెర్ అలీ (53) అర్ద సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ తలో 2, కీమర్ రోచ్, షమార్ జోసఫ్ చెరో వికెట్ పడగొట్టారు.181 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ (6/64) విండీస్ను దెబ్బకొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని వెస్టిండీస్ బంగ్లాదేశ్ ముందు 334 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఛేదనలో (నాలుగో రోజు ఆట ముగిసే) బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జాకెర్ అలీ (15), హసన్ మహమూద్ (0) క్రీజ్లో ఉన్నారు. కీమర్ రోచ్, జేడెన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ను దెబ్బతీశారు. షమార్ జోసఫ్కు ఓ వికెట్ దక్కింది.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. సిరీస్లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది. -
IPL 2025: ఏ ఫ్రాంచైజీలో ఎవరెవరు..?
ఐపీఎల్ 2025కి సంబంధించి రిటెన్షన్ మరియు వేలం ప్రక్రియ ముగిసింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు సాగిన మెగా వేలం నిన్నటితో (నవంబర్ 25) సమాప్తమైంది. మెగా టోర్నీ వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ప్రారంభం కానుంది. ఏ జట్టులో ఎంత మంది..?రిటెయిన్ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (23), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (22), డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (21), రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి.ఏ ఫ్రాంచైజీలో ఎవరెవరు..? సీఎస్కేరుతురాజ్ గైక్వాడ్ (రీటెయిన్డ్, 18 కోట్లు)ఎంఎస్ ధోని (రీటెయిన్డ్, 4 కోట్లు)మతీశ పతిరణ (రీటెయిన్డ్, 13 కోట్లు)శివమ్ దూబే (రీటెయిన్డ్, 12 కోట్లు)రవీంద్ర జడేజా (రీటెయిన్డ్, 18 కోట్లు)నూర్ అహ్మద్ (10 కోట్లు)రవిచంద్రన్ అశ్విన్ (9.75 కోట్లు)డెవాన్ కాన్వే (6.25 కోట్లు)ఖలీల్ అహ్మద్ (4.8 కోట్లు)రచిన్ రవీంద్ర (4 కోట్లు, RTM)అన్షుల్ కంబోజ్ (3.4 కోట్లు)రాహుల్ త్రిపాఠి (3.4 కోట్లు)సామ్ కర్రన్ (2.4 కోట్లు)గుర్జప్నీత్ సింగ్ (2.2 కోట్లు)నాథన్ ఇల్లిస్ (2 కోట్లు)దీపక్ హుడా (1.7 కోట్లు)జేమీ ఓవర్టన్ (1.5 కోట్లు)విజయ్ శంకర్ (1.2 కోట్లు)వన్ష్ బేడీ (55 లక్షలు)ఆండ్రే సిద్దార్థ్ (30 లక్షలు)శ్రేయస్ గోపాల్ (30 లక్షలు)రామకృష్ణ ఘోష్ (30 లక్షలు)కమలేశ్ నాగర్కోటి (30 లక్షలు)ముకేశ్ చౌదరీ (30 లక్షలు)షేక్ రషీద్ (30 లక్షలు)ఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్ (రీటెయిన్డ్, 16.5 కోట్లు)కుల్దీప్ యాదవ్ (రీటెయిన్డ్, 13.25 కోట్లు)ట్రిస్టన్ స్టబ్స్ (రీటెయిన్డ్, 10 కోట్లు)అభిషేక్ పోరెల్ (రీటెయిన్డ్, 4 కోట్లు)కేఎల్ రాహుల్ (14 కోట్లు)మిచెల్ స్టార్క్ (11.75 కోట్లు)టి నటరాజన్ (10.75 కోట్లు)జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (9 కోట్లు, RTM)ముకేశ్ కుమార్ (8 కోట్లు, RTM)హ్యారీ బ్రూక్(6.25 కోట్లు)అషుతోశ్ శర్మ (3.8 కోట్లు)మోహిత్ శర్మ (2.2 కోట్లు)ఫాఫ్ డుప్లెసిస్ (2 కోట్లు)సమీర్ రిజ్వి (95 లక్షలు)డొనొవన్ ఫెరియెరా (75 లక్షలు)దుష్మంత చమీరా (75 లక్షలు)విప్రాజ్ నిగమ్ (50 లక్షలు)కరుణ్ నాయర్ (50 లక్షలు)మాథవ్ తివారి (50 లక్షలు)త్రిపురణ విజయ్ (30 లక్షలు)మాన్వంత్ కుమార్ (30 లక్షలు)అజయ్ మండల్ (30 లక్షలు)దర్శన్ నల్కండే (30 లక్షలు)గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్ (రీటెయిన్డ్, 16.5 కోట్లు)రషీద్ ఖాన్ (రీటెయిన్డ్, 18 కోట్లు)సాయి సుదర్శన్ (రీటెయిన్డ్, 8.5 కోట్లు)రాహుల్ తెవాటియా (రీటెయిన్డ్, 4 కోట్లు)షారుఖ్ ఖాన్ (రీటెయిన్డ్, 4 కోట్లు)జోస్ బట్లర్ (15.75 కోట్లు)మొహమ్మద్ సిరాజ్ (12.25 కోట్లు)కగిసో రబాడ (10.75 కోట్లు)ప్రసిద్ద్ కృష్ణ (9.5 కోట్లు)వాషింగ్టన్ సుందర్ (3.2 కోట్లు)షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (2.6 కోట్లు)గెరాల్డ్ కొయెట్జీ (2.4 కోట్లు)గ్లెన్ ఫిలిప్స్ (2 కోట్లు)సాయి కిషోర్ (2 కోట్లు, RTM)మహిపాల్ లోమ్రార్ (1.7 కోట్లు)గుర్నూర్ సింగ్ బ్రార్ (1.3 కోట్లు)అర్షద్ ఖాన్ (1.3 కోట్లు)కరీమ్ జనత్ (75 లక్షలు)జయంత్ యాదవ్ (75 లక్షలు)ఇషాంత్ శర్మ (75 లక్షలు)కుమార్ కుషాగ్రా (65 లక్షలు)మానవ్ సుతార్ (30 లక్షలు)కుల్వంత్ కేజ్రోలియా (30 లక్షలు)అనూజ్ రావత్ (30 లక్షలు)నిషాంత్ సింధు (30 లక్షలు)కేకేఆర్రింకూ సింగ్ (రీటెయిన్డ్, 13 కోట్లు)వరుణ్ చక్రవర్తి (రీటెయిన్డ్, 12 కోట్లు)సునీల్ నరైన్ (రీటెయిన్డ్, 12 కోట్లు)ఆండ్రీ రసెల్ (రీటెయిన్డ్, 12 కోట్లు)హర్షిత్ రాణా (రీటెయిన్డ్, 4 కోట్లు)రమన్దీప్ సింగ్ (రీటెయిన్డ్, 4 కోట్లు)వెంకటేశ్ అయ్యర్ (23.75 కోట్లు)అన్రిచ్ నోర్జే (6.50 కోట్లు)క్వింటన్ డికాక్ (3.60 కోట్లు)అంగ్క్రిష్ రఘువంశీ (3 కోట్లు)స్పెన్సర్ జాన్సన్ (2.8 కోట్లు)మొయిన్ అలీ (2 కోట్లు)రహ్మానుల్లా గుర్బాజ్ (2 కోట్లు)వైభవ్ అరోరా (1.80 కోట్లు)అజింక్య రహానే (1.5 కోట్లు)రోవ్మన్ పావెల్ (1.5 కోట్లు)ఉమ్రాన్ మాలిక్(75 లక్షలు)మనీశ్ పాండే (75 లక్షలు)అనుకూల్ రాయ్ (40 లక్షలు)లవ్నిత్ సిసోడియా (30 లక్షలు)మయాంక్ మార్కండే (30 లక్షలు)లక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్ (రీటెయిన్డ్, 21 కోట్లు)రవి బిష్ణోయ్ (రీటెయిన్డ్, 21 కోట్లు)మయాంక్ యాదవ్ (రీటెయిన్డ్, 11 కోట్లు)మొహిసిన్ ఖాన్ (రీటెయిన్డ్, 4 కోట్లు)ఆయుశ్ బదోని (రీటెయిన్డ్, 4 కోట్లు)రిషబ్ పంత్ (27 కోట్లు)ఆవేశ్ ఖాన్ (9.75 కోట్లు)ఆకాశ్దీప్ (8 కోట్లు)డేవిడ్ మిల్లర్ (7.5 కోట్లు)అబ్దుల్ సమద్ (4.2 కోట్లు)మిచెల్ మార్ష్ (3.4 కోట్లు)షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు)ఎయిడెన్ మార్క్రమ్ (2 కోట్లు)మాథ్యూ బ్రీట్జ్కీ (75 లక్షలు)షమార్ జోసఫ్ (75 లక్షలు, RTM)ఎం సిద్దార్థ్ (75 లక్షలు)అర్శిన్ కులకర్ణి (30 లక్షలు)రాజవర్దన్ హంగార్గేకర్ (30 లక్షలు)యువరాజ్ చౌదరీ (30 లక్షలు)ప్రిన్స్ యాదవ్ (30 లక్షలు)ఆకాశ్ సింగ్ (30 లక్షలు)దిగ్వేశ్ సింగ్ (30 లక్షలు)హిమ్మత్ సింగ్ (30 లక్షలు)ఆర్యన్ జుయల్ (30 లక్షలు)ముంబై ఇండియన్స్జస్ప్రీత్ బుమ్రా (రీటెయిన్డ్, 18 కోట్లు)సూర్యకుమార్ యాదవ్ (రీటెయిన్డ్, 16.35 కోట్లు)హార్దిక్ పాండ్యా (రీటెయిన్డ్, 16.35 కోట్లు)రోహిత్ శర్మ (రీటెయిన్డ్, 16.30 కోట్లు)తిలక్ వర్మ (రీటెయిన్డ్, 8 కోట్లు)ట్రెంట్ బౌల్ట్ (12.50 కోట్లు)దీపక్ చాహర్ (9.25 కోట్లు)విల్ జాక్స్ (5.25 కోట్లు)నమన్ ధిర్ (5.25 కోట్లు, RTM)అల్లా ఘజన్ఫర్ (4.8 కోట్లు)మిచెల్ సాంట్నర్ (2 కోట్లు)ర్యాన్ రికెల్టన్ (1 కోటీ)లిజాడ్ విలియమ్స్ (75 లక్షలు)రీస్ టాప్లే (75 లక్షలు)రాబిన్ మింజ్ (65 లక్షలు)కర్ణ్ శర్మ (50 లక్షలు)విజ్ఞేశ్ పుథుర్ (30 లక్షలు)అర్జున్ టెండూల్కర్ (30 లక్షలు)బెవాన్ జాన్ జాకబ్స్ (30 లక్షలు)వెంకట సత్యనారాయణ పెన్మత్స (30 లక్షలు)రాజ్ అంగద్ బవా (30 లక్షలు)శ్రీజిత్ కృష్ణణ్ (30 లక్షలు)అశ్వనీ కుమార్ (30 లక్షలు)పంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్ (రీటెయిన్డ్, 5.5 కోట్లు)ప్రభ్సిమ్రన్ సింగ్ (రీటెయిన్డ్, 4 కోట్లు)శ్రేయస్ అయ్యర్(26.75 కోట్లు)యుజ్వేంద్ర చహల్(18 కోట్లు)అర్షదీప్ సింగ్ (18 కోట్లు, RTM)మార్కస్ స్టోయినిస్ (11 కోట్లు)మార్కో జన్సెన్ (7 కోట్లు)నేహల్ వధేరా (4.2 కోట్లు)గ్లెన్ మ్యాక్స్వెల్ (4.2 కోట్లు)ప్రియాన్శ్ ఆర్య (3.8 కోట్లు)జోస్ ఇంగ్లిస్ (2.6 కోట్లు)అజ్మతుల్లా ఒమర్జాయ్ (2.4 కోట్లు)లోకీ ఫెర్గూసన్ (2 కోట్లు)విజయ్కుమార్ వైశాఖ్ (1.8 కోట్లు)యశ్ ఠాకర్ (1.60 కోట్లు)హర్ప్రీత్ బ్రార్ (1.5 కోట్లు)ఆరోన్ హార్డీ (1.25 కోట్లు)విష్ణు వినోద్ (95 లక్షలు)జేవియర్ బార్ట్లెట్ (80 లక్షలు)కుల్దీప్ సేన్ (80 లక్షలు)ప్రవిణ్ దూబే (30 లక్షలు)పైలా అవినాశ్ (30 లక్షలు)సూర్యాంశ్ షెడ్గే (30 లక్షలు)ముషీర్ ఖాన్ (30 లక్షలు)హర్నూర్ పన్నూ (30 లక్షలు)రాజస్థాన్ రాయల్స్సంజూ శాంసన్ (రీటెయిన్డ్, 18 కోట్లు)యశస్వి జైస్వాల్ (రీటెయిన్డ్, 18 కోట్లు)రియాన్ పరాగ్ (రీటెయిన్డ్. 14 కోట్లు)ధృవ్ జురెల్ (రీటెయిన్డ్, 14 కోట్లు)షిమ్రోన్ హెట్మైర్ (రీటెయిన్డ్, 11 కోట్లు)సందీప్ శర్మ (రీటెయిన్డ్, 4 కోట్లు)జోఫ్రా ఆర్చర్ (12.50 కోట్లు)తుషార్ దేశ్పాండే (6.5 కోట్లు)వనిందు హసరంగ (5.25 కోట్లు)మహీశ్ తీక్షణ (4.40 కోట్లు)నితీశ్ రాణా (4.2 కోట్లు)ఫజల్ హక్ ఫారూకీ (2 కోట్లు)క్వేనా మపాకా (1.5 కోట్లు)ఆకాశ్ మధ్వాల్ (1.20 కోట్లు)వైభవ్ సూర్యవంశీ (1.1 కోట్లు)శుభమ్ దూబే (80 లక్షలు)యుద్ద్వీర్ చరక్ (35 లక్షలు)ఆశోక్ శర్మ (30 లక్షలు)కునాల్ రాథోడ్ (30 లక్షలు)కుమార్ కార్తీకేయ (30 లక్షలు)ఆర్సీబీవిరాట్ కోహ్లి (రీటెయిన్డ్, 21 కోట్లు)రజత్ పాటిదార్ (రీటెయిన్డ్, 11 కోట్లు)యశ్ దయాల్ (రీటెయిన్డ్, 5 కోట్లు)జోష్ హాజిల్వుడ్ (12.50 కోట్లు)ఫిల్ సాల్ట్ (11.50 కోట్లు)జితేశ్ శర్మ (11 కోట్లు)భువనేశ్వర్ కుమార్ (10.75 కోట్లు)లియామ్ లివింగ్స్టోన్ (8.75 కోట్లు)రసిఖ్ దార్ (6 కోట్లు)కృనాల్ పాండ్యా (5.75 కోట్లు)టిమ్ డేవిడ్ (3 కోట్లు)జేకబ్ బేతెల్ (2.6 కోట్లు)సుయాశ్ శర్మ (2.6 కోట్లు)దేవ్దత్ పడిక్కల్ (2 కోట్లు)నువాన్ తుషార (1.6 కోట్లు)రొమారియో షెపర్డ్ (1.5 కోట్లు)లుంగి ఎంగిడి (1 కోటీ)స్వప్నిల్ సింగ్ (50 లక్షలు, RTM)మోహిత్ రతీ (30 లక్షలు)అభినందన్ సింగ్ (30 లక్షలు)స్వస్తిక్ చికార (30 లక్షలు)మనోజ్ భాంగడే (30 లక్షలు)సన్రైజర్స్ హైదరాబాద్పాట్ కమిన్స్ (రీటెయిన్డ్, 18 కోట్లు)అభిషేక్ శర్మ (రీటెయిన్డ్, 14 కోట్లు)నితీశ్ కుమార్ రెడ్డి (రీటెయిన్డ్, 6 కోట్లు)హెన్రిచ్ క్లాసెన్ (రీటెయిన్డ్, 23 కోట్లు)ట్రవిస్ హెడ్ (రీటెయిన్డ్, 14 కోట్లు)ఇషాన్ కిషన్ (11.25 కోట్లు)మొహమ్మద్ షమీ (10 కోట్లు)హర్షల్ పటేల్ (8 కోట్లు)అభినవ్ మనోహర్ (3.20కోట్లు)రాహుల్ చాహల్ (3.20 కోట్లు)ఆడమ్ జంపా (2.40 కోట్లు)సిమ్రన్జీత్ సింగ్ (1.50 కోట్లు)ఎస్హాన్ మలింగ (1.2 కోట్లు)బ్రైడన్ కార్స్ (1 కోటీ)జయదేవ్ ఉనద్కత్ (1 కోటీ)కమిందు మెండిస్ (75 లక్షలు)జీషన్ అన్సారీ (40 లక్షలు)సచిన్ బేబి (30 లక్షలు)అనికేత్ వర్మ (30 లక్షలు)అథర్వ తైడే (30 లక్షలు) -
IPL 2025: మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..!
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ 2025 మెగా వేలం నిన్నటితో (నవంబర్ 25) ముగిసింది. మెగా వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. 395 మంది ఆటగాళ్లపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు దేశీయ ఆటగాళ్లు. 8 మంది ఆటగాళ్లను RTM ద్వారా ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 639.15 కోట్లు ఖర్చు చేశాయి. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు రిషబ్ పంత్. పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, మెగా టోర్నీ వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.ఫ్రాంచైజీల వారీగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..!సీఎస్కేనూర్ అహ్మద్ (10 కోట్లు)రవిచంద్రన్ అశ్విన్ (9.75 కోట్లు)డెవాన్ కాన్వే (6.25 కోట్లు)ఖలీల్ అహ్మద్ (4.8 కోట్లు)రచిన్ రవీంద్ర (4 కోట్లు, RTM)అన్షుల్ కంబోజ్ (3.4 కోట్లు)రాహుల్ త్రిపాఠి (3.4 కోట్లు)సామ్ కర్రన్ (2.4 కోట్లు)గుర్జప్నీత్ సింగ్ (2.2 కోట్లు)నాథన్ ఇల్లిస్ (2 కోట్లు)దీపక్ హుడా (1.7 కోట్లు)జేమీ ఓవర్టన్ (1.5 కోట్లు)విజయ్ శంకర్ (1.2 కోట్లు)వన్ష్ బేడీ (55 లక్షలు)ఆండ్రే సిద్దార్థ్ (30 లక్షలు)శ్రేయస్ గోపాల్ (30 లక్షలు)రామకృష్ణ ఘోష్ (30 లక్షలు)కమలేశ్ నాగర్కోటి (30 లక్షలు)ముకేశ్ చౌదరీ (30 లక్షలు)షేక్ రషీద్ (30 లక్షలు)ఢిల్లీ క్యాపిటల్స్కేఎల్ రాహుల్ (14 కోట్లు)మిచెల్ స్టార్క్ (11.75 కోట్లు)టి నటరాజన్ (10.75 కోట్లు)జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (9 కోట్లు, RTM)ముకేశ్ కుమార్ (8 కోట్లు, RTM)హ్యారీ బ్రూక్(6.25 కోట్లు)అషుతోశ్ శర్మ (3.8 కోట్లు)మోహిత్ శర్మ (2.2 కోట్లు)ఫాఫ్ డుప్లెసిస్ (2 కోట్లు)సమీర్ రిజ్వి (95 లక్షలు)డొనొవన్ ఫెరియెరా (75 లక్షలు)దుష్మంత చమీరా (75 లక్షలు)విప్రాజ్ నిగమ్ (50 లక్షలు)కరుణ్ నాయర్ (50 లక్షలు)మాథవ్ తివారి (50 లక్షలు)త్రిపురణ విజయ్ (30 లక్షలు)మాన్వంత్ కుమార్ (30 లక్షలు)అజయ్ మండల్ (30 లక్షలు)దర్శన్ నల్కండే (30 లక్షలు)గుజరాత్ టైటాన్స్జోస్ బట్లర్ (15.75 కోట్లు)మొహమ్మద్ సిరాజ్ (12.25 కోట్లు)కగిసో రబాడ (10.75 కోట్లు)ప్రసిద్ద్ కృష్ణ (9.5 కోట్లు)వాషింగ్టన్ సుందర్ (3.2 కోట్లు)షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (2.6 కోట్లు)గెరాల్డ్ కొయెట్జీ (2.4 కోట్లు)గ్లెన్ ఫిలిప్స్ (2 కోట్లు)సాయి కిషోర్ (2 కోట్లు, RTM)మహిపాల్ లోమ్రార్ (1.7 కోట్లు)గుర్నూర్ సింగ్ బ్రార్ (1.3 కోట్లు)అర్షద్ ఖాన్ (1.3 కోట్లు)కరీమ్ జనత్ (75 లక్షలు)జయంత్ యాదవ్ (75 లక్షలు)ఇషాంత్ శర్మ (75 లక్షలు)కుమార్ కుషాగ్రా (65 లక్షలు)మానవ్ సుతార్ (30 లక్షలు)కుల్వంత్ కేజ్రోలియా (30 లక్షలు)అనూజ్ రావత్ (30 లక్షలు)నిషాంత్ సింధు (30 లక్షలు)కేకేఆర్వెంకటేశ్ అయ్యర్ (23.75 కోట్లు)అన్రిచ్ నోర్జే (6.50 కోట్లు)క్వింటన్ డికాక్ (3.60 కోట్లు)అంగ్క్రిష్ రఘువంశీ (3 కోట్లు)స్పెన్సర్ జాన్సన్ (2.8 కోట్లు)మొయిన్ అలీ (2 కోట్లు)రహ్మానుల్లా గుర్బాజ్ (2 కోట్లు)వైభవ్ అరోరా (1.80 కోట్లు)అజింక్య రహానే (1.5 కోట్లు)రోవ్మన్ పావెల్ (1.5 కోట్లు)ఉమ్రాన్ మాలిక్(75 లక్షలు)మనీశ్ పాండే (75 లక్షలు)అనుకూల్ రాయ్ (40 లక్షలు)లవ్నిత్ సిసోడియా (30 లక్షలు)మయాంక్ మార్కండే (30 లక్షలు)లక్నో సూపర్ జెయింట్స్రిషబ్ పంత్ (27 కోట్లు)ఆవేశ్ ఖాన్ (9.75 కోట్లు)ఆకాశ్దీప్ (8 కోట్లు)డేవిడ్ మిల్లర్ (7.5 కోట్లు)అబ్దుల్ సమద్ (4.2 కోట్లు)మిచెల్ మార్ష్ (3.4 కోట్లు)షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు)ఎయిడెన్ మార్క్రమ్ (2 కోట్లు)మాథ్యూ బ్రీట్జ్కీ (75 లక్షలు)షమార్ జోసఫ్ (75 లక్షలు, RTM)ఎం సిద్దార్థ్ (75 లక్షలు)అర్శిన్ కులకర్ణి (30 లక్షలు)రాజవర్దన్ హంగార్గేకర్ (30 లక్షలు)యువరాజ్ చౌదరీ (30 లక్షలు)ప్రిన్స్ యాదవ్ (30 లక్షలు)ఆకాశ్ సింగ్ (30 లక్షలు)దిగ్వేశ్ సింగ్ (30 లక్షలు)హిమ్మత్ సింగ్ (30 లక్షలు)ఆర్యన్ జుయల్ (30 లక్షలు)ముంబై ఇండియన్స్ట్రెంట్ బౌల్ట్ (12.50 కోట్లు)దీపక్ చాహర్ (9.25 కోట్లు)విల్ జాక్స్ (5.25 కోట్లు)నమన్ ధిర్ (5.25 కోట్లు, RTM)అల్లా ఘజన్ఫర్ (4.8 కోట్లు)మిచెల్ సాంట్నర్ (2 కోట్లు)ర్యాన్ రికెల్టన్ (1 కోటీ)లిజాడ్ విలియమ్స్ (75 లక్షలు)రీస్ టాప్లే (75 లక్షలు)రాబిన్ మింజ్ (65 లక్షలు)కర్ణ్ శర్మ (50 లక్షలు)విజ్ఞేశ్ పుథుర్ (30 లక్షలు)అర్జున్ టెండూల్కర్ (30 లక్షలు)బెవాన్ జాన్ జాకబ్స్ (30 లక్షలు)వెంకట సత్యనారాయణ పెన్మత్స (30 లక్షలు)రాజ్ అంగద్ బవా (30 లక్షలు)శ్రీజిత్ కృష్ణణ్ (30 లక్షలు)అశ్వనీ కుమార్ (30 లక్షలు)పంజాబ్ కింగ్స్శ్రేయస్ అయ్యర్(26.75 కోట్లు)యుజ్వేంద్ర చహల్(18 కోట్లు)అర్షదీప్ సింగ్ (18 కోట్లు, RTM)మార్కస్ స్టోయినిస్ (11 కోట్లు)మార్కో జన్సెన్ (7 కోట్లు)నేహల్ వధేరా (4.2 కోట్లు)గ్లెన్ మ్యాక్స్వెల్ (4.2 కోట్లు)ప్రియాన్శ్ ఆర్య (3.8 కోట్లు)జోస్ ఇంగ్లిస్ (2.6 కోట్లు)అజ్మతుల్లా ఒమర్జాయ్ (2.4 కోట్లు)లోకీ ఫెర్గూసన్ (2 కోట్లు)విజయ్కుమార్ వైశాఖ్ (1.8 కోట్లు)యశ్ ఠాకర్ (1.60 కోట్లు)హర్ప్రీత్ బ్రార్ (1.5 కోట్లు)ఆరోన్ హార్డీ (1.25 కోట్లు)విష్ణు వినోద్ (95 లక్షలు)జేవియర్ బార్ట్లెట్ (80 లక్షలు)కుల్దీప్ సేన్ (80 లక్షలు)ప్రవిణ్ దూబే (30 లక్షలు)పైలా అవినాశ్ (30 లక్షలు)సూర్యాంశ్ షెడ్గే (30 లక్షలు)ముషీర్ ఖాన్ (30 లక్షలు)హర్నూర్ పన్నూ (30 లక్షలు)రాజస్థాన్ రాయల్స్జోఫ్రా ఆర్చర్ (12.50 కోట్లు)తుషార్ దేశ్పాండే (6.5 కోట్లు)వనిందు హసరంగ (5.25 కోట్లు)మహీశ్ తీక్షణ (4.40 కోట్లు)నితీశ్ రాణా (4.2 కోట్లు)ఫజల్ హక్ ఫారూకీ (2 కోట్లు)క్వేనా మపాకా (1.5 కోట్లు)ఆకాశ్ మధ్వాల్ (1.20 కోట్లు)వైభవ్ సూర్యవంశీ (1.1 కోట్లు)శుభమ్ దూబే (80 లక్షలు)యుద్ద్వీర్ చరక్ (35 లక్షలు)ఆశోక్ శర్మ (30 లక్షలు)కునాల్ రాథోడ్ (30 లక్షలు)కుమార్ కార్తీకేయ (30 లక్షలు)ఆర్సీబీజోష్ హాజిల్వుడ్ (12.50 కోట్లు)ఫిల్ సాల్ట్ (11.50 కోట్లు)జితేశ్ శర్మ (11 కోట్లు)భువనేశ్వర్ కుమార్ (10.75 కోట్లు)లియామ్ లివింగ్స్టోన్ (8.75 కోట్లు)రసిఖ్ దార్ (6 కోట్లు)కృనాల్ పాండ్యా (5.75 కోట్లు)టిమ్ డేవిడ్ (3 కోట్లు)జేకబ్ బేతెల్ (2.6 కోట్లు)సుయాశ్ శర్మ (2.6 కోట్లు)దేవ్దత్ పడిక్కల్ (2 కోట్లు)నువాన్ తుషార (1.6 కోట్లు)రొమారియో షెపర్డ్ (1.5 కోట్లు)లుంగి ఎంగిడి (1 కోటీ)స్వప్నిల్ సింగ్ (50 లక్షలు, RTM)మోహిత్ రతీ (30 లక్షలు)అభినందన్ సింగ్ (30 లక్షలు)స్వస్తిక్ చికార (30 లక్షలు)మనోజ్ భాంగడే (30 లక్షలు)సన్రైజర్స్ హైదరాబాద్ఇషాన్ కిషన్ (11.25 కోట్లు)మొహమ్మద్ షమీ (10 కోట్లు)హర్షల్ పటేల్ (8 కోట్లు)అభినవ్ మనోహర్ (3.20కోట్లు)రాహుల్ చాహల్ (3.20 కోట్లు)ఆడమ్ జంపా (2.40 కోట్లు)సిమ్రన్జీత్ సింగ్ (1.50 కోట్లు)ఎస్హాన్ మలింగ (1.2 కోట్లు)బ్రైడన్ కార్స్ (1 కోటీ)జయదేవ్ ఉనద్కత్ (1 కోటీ)కమిందు మెండిస్ (75 లక్షలు)జీషన్ అన్సారీ (40 లక్షలు)సచిన్ బేబి (30 లక్షలు)అనికేత్ వర్మ (30 లక్షలు)అథర్వ తైడే (30 లక్షలు) -
WI Vs BAN: విండీస్తో తొలి టెస్ట్.. వెనుకంజలో బంగ్లాదేశ్
విండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ వెనుకంజలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (50), జాకెర్ అలీ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. మహ్మదుల్ హసన్ జాయ్ 5, జాకిర్ హసన్ 15, షహాదత్ హొసేన్ 18, లిటన్ దాస్ 40, మెహిది హసన్ మిరాజ్ 23, తైజుల్ ఇస్లాం 25, హసన్ మహమూద్ 8 పరుగులు చేశారు. తస్కిన్ అహ్మద్ 11, షొరీఫుల్ ఇస్లాం 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్టిన్ గ్రీవ్స్, జేడన్ సీల్స్ తలో రెండు వికెట్లు.. కీమర్ రోచ్, షమార్ జోసఫ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కగా.. ఓపెనర్ మికైల్ లూయిస్ మూడు పరుగుల తేడాతో.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అలిక్ అథనాజ్ 10 పరుగుల తేడాతో సెంచరీలను చేజార్చుకున్నారు. ఆఖర్లో కీమర్ రోచ్ బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. రోచ్ 144 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేశాడు.విండీస్ ఇన్నింగ్స్లో కవెమ్ హాడ్జ్ (25), జాషువ డసిల్వ (14), జడెన్ సీల్స్ (18), షమార్ జోసఫ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ బ్రాత్వైట్ (4), అల్జరీ జోసఫ్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. కీసి కార్తీ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మీరాజ్ తలో రెండు.. తైజుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. సిరీస్లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది. -
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్కీపర్ బ్యాటర్ జోర్డన్ కాక్స్ కుడి చేతి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యింది. క్వీన్టౌన్లో జరుగుతున్న నెట్ సెషన్ సందర్భంగా కాక్స్ గాయపడ్డాడు. గాయం కారణంగా కాక్స్ న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కాక్స్కు రీప్లేస్మెంట్ను ప్రకటించాల్సి ఉంది.కాగా, క్రైస్ట్ చర్చ్ వేదికగా నవంబర్ 28 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్లో కాక్స్ అరంగేట్రం చేయాల్సి ఉండింది. అయితే ఈ లోపే అతను గాయపడి డెబ్యూ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాక్స్ జేమీ స్మిత్ స్థానంలో స్టాండ్ ఇన్ వికెట్కీపర్గా న్యూజిలాండ్ టూర్కు ఎంపికయ్యాడు. జేమీ స్మిత్ ప్రస్తుతం పితృత్వ సెలవులో ఉన్నాడు.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ ఎలెవెన్తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. జోర్డన్ కాక్స్ ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో పాల్గొన్నాడు. ఆతర్వాత అతను గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కనబర్చింది. తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (94), ఓలీ పోప్ (42).. రెండో ఇన్నింగ్స్లో జో రూట్ (82 నాటౌట్), బెన్ స్టోక్స్ (59) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగింది.న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాకబ్ బేతెల్, రెహాన్ అహ్మద్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, ఓలీ పోప్ (వికెట్కీపర్), , షోయబ్ బషీర్, గస్ అట్కిన్సన్, ఓల్లీ స్టోన్, జాక్ లీచ్, మాథ్యూ పాట్స్ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు న్యూజిలాండ్ జట్టు..గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓ రూర్కీ, టిమ్ సౌథీషెడ్యూల్.. నవంబర్ 28-డిసెంబర్ 2 వరకు- తొలి టెస్ట్ (క్రైస్ట్ చర్చ్)డిసెంబర్ 6-10 వరకు- రెండో టెస్ట్ (వెల్లింగ్టన్)డిసెంబర్ 14-18 వరకు- మూడో టెస్ట్ (హ్యామిల్టన్) -
గ్రీవ్స్ అజేయ సెంచరీ.. విండీస్ భారీ స్కోర్
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కాడు. ఓపెనర్ మికైల్ లూయిస్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అలిక్ అథనాజ్ కూడా 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆఖర్లో కీమర్ రోచ్ బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. రోచ్ 144 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో కవెమ్ హాడ్జ్ (25), జాషువ డసిల్వ (14), జడెన్ సీల్స్ (18), షమార్ జోసఫ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ బ్రాత్వైట్ (4), అల్జరీ జోసఫ్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరమితం కాగా.. కీసి కార్తీ డకౌటయ్యాడు. 144.1 ఓవర్లలో విండీస్ 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మీరాజ్ తలో రెండు.. తైజుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ (5), జకీర్ హసన్ (15) ఔట్ కాగా.. మొమినుల్ హాక్ (7), షాహదత్ హొసేన్ దీపు (10) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్, అల్జరీ జోసఫ్కు తలో వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్లో టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది. -
తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ తనయుడు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తృటిలో ట్రిపుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. బీసీసీఐ ఆథ్వర్యంలో నడిచే కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ 309 బంతుల్లో 51 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 297 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్యవీర్ మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో ఈ స్కోర్ చేశాడు. ఆర్యవీర్ ఔట్ కాగానే ఢిల్లీ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ (623/5) చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 98 పరుగుల వద్ద ఉండిన ధన్య నక్రా ఈ రోజు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నక్రా 122 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఓపెనర్ అర్నవ్ బుగ్రా (114) కూడా సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు లంచ్ సమయానికి మేఘాలయ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. మంధన్ (32), నర్లెంగ్ (11) క్రీజ్లో ఉన్నారు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు మేఘాలయ ఇంకా 293 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్లో 260 పరుగులకే ఆలౌటైంది.తండ్రి బాటలోనే తనయుడుఆర్యవీర్ సెహ్వాగ్ బాటలోనే నడుస్తున్నాడు. ఆర్యవీర్ సైతం తండ్రిలాగే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఎదురుచూడలేదు. ఏ స్కోర్ వద్ద ఉన్న దూకుడే మంత్రంగా ఆడాడు. అందుకే ఈ మ్యాచ్లో ఆర్యవీర్ ట్రిపుల్ సెంచరీని లెక్క చేయలేదు. వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో చాలా సందర్భాల్లో సెంచరీలు, డబుల్, ట్రిపుల్ సెంచరీలు మిస్ అయ్యాడు. 2009లో సెహ్వాగ్ ఓ టెస్ట్ మ్యాచ్లో 293 స్కోర్ వద్ద ఔటయ్యాడు. సెహ్వాగ్ కెరీర్లో అప్పటికే రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. ఆర్యవీర్ ఇప్పుడిప్పుడే క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. అతని నుంచి కూడా తండ్రి లాంటి ఇన్నింగ్స్లే ఆశించవచ్చు. ఆర్యవీర్ ఈ ఏడాది అక్టోబర్లో వినూ మన్కడ్ ట్రోఫీతో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లోనే ఆర్యవీర్ 49 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
ఐపీఎల్ 2025 స్టార్టింగ్ డేట్ వచ్చేసింది..!
ఐపీఎల్లో రాబోయే మూడు సీజన్లకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ (నవంబర్ 22) విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంఛైజీలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14న (శుక్రవారం) మొదలై మే 25న (ఆదివారం) ముగుస్తుంది. 2026 సీజన్ మార్చి 15న (ఆదివారం) మొదలై మే 31న (ఆదివారం) ముగుస్తుంది. 2027 సీజన్ మార్చి 14న (ఆదివారం) మొదలై మే 30న (ఆదివారం) ముగుస్తుంది. కాగా, గతంలో ఐపీఎల్ షెడ్యూల్లను చివరి నిమిషంలో విడుదల చేసే వారు. అయితే ఆ ఆనవాయితీకి బీసీసీఐ స్వస్తి పలికి, ఒకేసారి మూడు సీజన్ల షెడ్యూల్ను ప్రకటించింది. అంతర్జాతీయ షెడ్యూల్తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకుండా ఇది తోడ్పడుతుందని బీసీసీఐ తెలిపింది.మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్..ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. ఆర్చర్ 2025 సీజన్తో పాటు రానున్న మూడు సీజన్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించినట్లు తెలుస్తుంది. మెగా వేలంలో ఆర్చర్ 575వ ఆటగాడిగా జాయిన్ అవుతాడు. ఆర్చర్ రూ. 2 కోట్ల బేస్ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. మెగా వేలంలో ఆర్చర్తో పాటు మరో ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. అమెరికాకు చెందిన సౌరభ్ నేత్రావల్కర్, భారత్కు చెందిన హార్దిక్ తమోర్ వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిద్దరు 576, 577 నంబర్ ఆటగాళ్లుగా వేలం బరిలో ఉంటారు. -
IND VS AUS: నిప్పులు చెరిగిన బౌలర్లు.. తొలి రోజు టీమిండియాదే
IND VS AUS 1st Test Day 1 Live Updates:ముగిసిన తొలి రోజు ఆట..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆతిథ్య జట్టుపై టీమిండియా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(19), మిచెల్ స్టార్క్(6) పరుగులతో ఉన్నారు.ఇక భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటికి బౌలర్లు మాత్రం నిప్పులు చెరిగారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో కంగారులను దెబ్బతీయగా.. సిరాజ్ రెండు, హర్షిత్ రానా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు టీమిండియా కేవలం 150 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(41) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడితో వికెట్ కీపర్ రిషబ్ పంత్(37) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్కెప్టెన్ కమిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో వికెట్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి కమిన్స్(3) పెవిలియన్ చేరాడు. స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 59/7 (24.4). ఆరో వికెట్ డౌన్..భారత బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన లబుషేన్.. సిరాజ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 23 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 48-6ఆసీస్ ఐదో వికెట్ డౌన్..38 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. సిరాజ్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 39-5నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. హర్షిత్ రానా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.కష్టాల్లో ఆసీస్.. 19 పరుగులకే 3 వికెట్లు డౌన్19 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా వరుస బంతుల్లో ఉస్మాన్ ఖ్వాజా (8), స్టీవ్ స్మిత్ను (0) ఔట్ చేశాడు. 7 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్ 19/3గా ఉంది. ట్రవిస్ హెడ్, లబూషేన్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియానాథన్ మెక్స్వినీ రూపంలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేయగలిగాడు. బుమ్రా బౌలింగ్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఖవాజా , లబుషేన్ క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 19-1.150 పరుగులకు ఆలౌటైన టీమిండియా150 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నితీశ్ కుమార్ రెడ్డి (41) చివరి వికెట్గా వెనురిగాడు. కమిన్స్ బౌలింగ్లో ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి నితీశ్ ఔటయ్యాడు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియాబుమ్రా రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి బుమ్రా ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. సిరాజ్ క్రీజులోకి రాగా.. నితీశ్ రెడ్డి 35 పరుగులతో ఆడుతున్నాడు. భారత్స్కోరు: 144-9(49)ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా128 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో లబూషేన్ క్యాచ్ పట్టడంతో హర్షిత్ రాణా (7) ఔటయ్యాడు. నితీశ్ కుమార్కు (27) జతగా బుమ్రా క్రీజ్లోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్ ఔట్121 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (37) ఔటయ్యాడు. నితీశ్కుమార్ రెడ్డికి (27) జతగా హర్షిత్ రాణా క్రీజ్లోకి వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా73 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మిచ్ మార్ష్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (4) పెవిలియన్ బాట పట్టాడు. రిషబ్ పంత్కు (17) జతగా నితీశ్ కుమార్ రెడ్డి క్రీజ్లోకి వచ్చాడు. 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది టీమిండియా. 59 పరుగుల వద్ద మిచ్ మార్ష్ బౌలింగ్లో లబూషేన్కు క్యాచ్ ఇచ్చి జురెల్ (11) ఔటయ్యాడు. రిషబ్ పంత్కు (10) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. కష్టాల్లో టీమిండియాలంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25)పంత్ పది, జురెల్ నాలుగు పరుగులతోక్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా47 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. రిషబ్ పంత్కు (10) జతగా ధృవ్ జురెల్ క్రీజ్లోకి వచ్చాడు.32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా32 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో ఉస్మాన్ ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (5) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా14 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి దేవ్దత్ పడిక్కల్ డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్కు జతగా విరాట్ కోహ్లి క్రీజ్లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగుల టీమ్ స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో నాథన్ మెక్స్వీనికి క్యాచ్ని జైస్వాల్ పెవిలియన్ బాట పట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్పెర్త్లోని అప్టస్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా తరఫున నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్స్వీని డెబ్యూ చేయనున్నాడు. తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
బంతి తగిలి అంపైర్ ముఖంపై తీవ్ర గాయాలు..!
క్రికెట్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంతి తగిలి ఫీల్డ్ అంపైర్ ముఖం వాచిపోయింది. ఆస్ట్రేలియాలోని ఛార్లెస్ వెర్యార్డ్ రిజర్వ్ క్రికెట్ మైదనంలో ఇది జరిగింది. ఓ స్థానిక మ్యాచ్ సందర్భంగా టోనీ డినోబ్రెగా అనే వ్యక్తి వికెట్ల వద్ద అంపైరింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ కొట్టిన బంతి (స్ట్రయిట్ డ్రైవ్) నేరుగా డినోబ్రెగా ముఖంపై తాకింది. బంతి బలంగా తాకడంతో డినోబ్రెగా ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కుడి కన్ను, కుడి వైపు ముఖం అంతా కమిలిపోయి, వాచిపోయింది.అదృష్టవశాత్తు డినోబ్రెగా ముఖంపై ఎలాంటి ఫ్రాక్చర్స్ లేవు. ప్రస్తుతం అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డినోబ్రెగా త్వరగా కోలుకోవాలని స్థానిక అంపైర్ల సంఘం ఆకాంక్షించింది. గాయపడక ముందు డినోబ్రెగా ముఖం.. గాయపడిన తర్వాత డినోబ్రెగా ముఖాన్ని అంపైర్ల సంఘం సోషల్మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. క్రికెట్ మైదానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. అందుకే అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోనే ఓ ఫీల్డ్ అంపైర్ ఇలానే బంతి ముఖంపై తాకడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ బంతి తలకు తాకడంతో తొలుత కోమాలోని వెళ్లి, ఆతర్వాత ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్సర్లు.. వీడియో
స్పెయిన్ టీ10 క్రికెట్లో సంచలనం నమోదైంది. యునైటెడ్ సీసీ గిరోనాతో జరిగిన మ్యాచ్లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్సిలోనాకు మెరుపు ఆరంభం లభించింది. అయితే ఆ జట్టు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. pic.twitter.com/Mpq9PeLddD— Sunil Gavaskar (@gavaskar_theman) November 20, 2024ఈ దశలో బరిలోకి దిగిన అలీ హసన్ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఏడో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా ఐదు సిక్సర్లు.. ఆతర్వాత ఎనిమిదో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న అలీ హసన్ 8 సిక్సర్లు, బౌండరీ సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కడపటి వార్తలు అందేసరికి ఛేదనలో గిరోనా జట్టు ఎదురీదుతుంది. ఆ జట్టు కేవలం 19 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో బార్సిలోనా చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ గెలుపు, మరో పరాజయాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయిన పేర్లలో అల్ హసన్ పేరు లేకపోవడం విచారకరం. -
చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ బ్యాటర్.. 152 బంతుల్లో 419 నాటౌట్
ముంబైలో జరిగే హ్యారిస్ షీల్డ్ టోర్నీలో సంచలనం నమోదైంది. 15 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుశ్ షిండే చరిత్ర సృష్టించాడు. కేవలం 152 బంతుల్లో 43 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 419 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హ్యారిస్ షీల్డ్ టోర్నీ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ జట్టు తరఫున ఆడిన ఆయుశ్.. పార్లే తిలక్ విద్యామందిర్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఆయుశ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్ణీత 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 648 పరుగులు చేసింది. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇన్నింగ్స్లో ఆర్య కార్లే 78, ఇషాన్ పాథక్ 62 (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన తిలక్ విద్యామందిర్ 39.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ 464 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ విద్యామందిర్ తరఫున ఆధేశ్ తవడే (41), దేవరాయ సావంత్ (34) టప్ స్కోరర్లుగా నిలిచారు. మ్యాచ్ అనంతరం క్వాడ్రాపుల్ సెంచరీ హీరో ఆయుశ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో తాను 500 పరుగులు స్కోర్ చేయాలని అనుకున్నానని చెప్పాడు. అయితే ఓవర్లు ముగియడంతో సాధ్యపడలేదని తెలిపాడు. ముంబై తరఫున ఆడాలంటే తాను ఇలానే భారీ స్కోర్లు చేస్తూ ఉండాలని పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడటమే తన కల అని తెలిపాడు. ఆయుశ్ క్రికెటింగ్ జర్నీ ధృడ నిశ్చయం మరియు త్యాగాల మధ్య సాగింది. ఆయుశ్ తండ్రి సునీల్ షిండే తన కొడుకుకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువ చూసి తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబైకి మార్చాడు. ప్రస్తుతం సునీల్ నవీ ముంబైలో ఓ చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఆయుశ్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. ఆయుశ్ ఆరేళ్ల వయసు నుంచి బ్యాట్ పట్టినట్లు సునీల్ గుర్తు చేసుకున్నాడు. -
శ్రీలంక, న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు
పల్లెకెలె వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 19) జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 21 ఓవర్ల పాటు మ్యాచ్ సజావుగా సాగింది. ఆతర్వాత వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. విల్ యంగ్ 56, హెన్రీ నికోల్స 46 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్కు ఓ వికెట్ దక్కింది.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్కు ముందు జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. రెండు మ్యాచ్ల టీ20, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటించింది.