-
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్! వీడియో
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో పరుగుల వరద పారించినా.. భారత జట్టులో చోటు కోసం మాత్రం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది ఈ ముంబై ప్లేయర్కి! అయితేనేం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్, మెంటార్ అన్న విషయం తెలిసిందే. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్. కుమారుడి కోసం తాను చేసిన త్యాగాలు ఫలించినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. కఠిన శ్రమ, ఓపిక ఉండాలి. తండ్రి కంటే తన పిల్లలను ఇంత బాగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి గొప్ప వ్యక్తి నౌషద్ ఖాన్.. ఆయన గనుక ఒప్పుకొంటే.. మహీంద్రా థార్తో సత్కరించాలనుకుంటున్నా’’ అని బహుమతి ప్రకటించారు. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్ర. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్ ఖాన్కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సర్ఫరాజ్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. గ్రేడ్- సీ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్కు అవకాశమిచ్చింది. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి ఇది తగునా కోహ్లి? Anand Mahindra fulfilled his promise and gifted a Mahindra Thar to Sarfaraz Khan's father, Naushad. Mahindra had promised to give the gift following Sarfaraz's Test debut. His father played a key role in Sarfaraz's success and coached him right from childhood. pic.twitter.com/Ktf070Qf5U — Sanjay Kishore (@saintkishore) March 23, 2024 -
సర్ఫరాజ్ తండ్రితో కలిసి ఆడాను: రోహిత్ శర్మ
స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 4-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లి, మహ్మద్ షమీ, రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లు లేకుండానే ఇంగ్లండ్ను రోహిత్ సారథ్యంలోని యంగ్ ఇండియా చిత్తు చేసింది. కాగా ఈ టెస్టు సిరీస్తో నలుగురు యువ క్రికెటర్లు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అందులో ఒకడు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. భారత జట్టులో చోటు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న సర్ఫరాజ్కు రాజ్కోట్ టెస్టు ముందు సెలక్టర్లు పిలుపునిచ్చారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో సర్ఫరాజ్కు భారత జట్టులో చోటు దక్కింది. జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రాజ్కోట్ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో భారత జట్టు ప్రాతినిథ్యం వహించాలన్న అతడి కల నేరవేరింది. కాగా ఇది సర్ఫరాజ్ ఒక్కడి కల మాత్రమే కాదు తన తండ్రి నౌషాద్ ఖాన్ది కూడా. సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ కూడా క్రికెటరే. అతడు భారత జట్టు తరపున ఆడాలని కలలు కన్నాడు. కానీ అతడి కలను తన కొడుకు రూపంలో నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టెస్టు క్యాప్ను అందుకునే సమయంలో నౌషాద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. నౌషాద్ ఖాన్ చిన్న కొడుకు ముషీర్ ఖాన్ కూడా దేశీవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా "టీమ్ రో" మాట్లాడుతూ.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుర్రాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. "యువ క్రికెటర్లతో కలిసి ఆడటాన్ని ఎంజాయ్ చేశాను. వారంతా చాలా అల్లరి చేసే వారు. నాకు వారిలో చాలా మంది తెలుసు. వారి బలాలు ఏంటో, వాళ్లు ఎలా ఆడాలనుకుంటారో తెలుసు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో అనుభవం లేకపోయినప్పటికి దేశీవాళీ క్రికెట్లో ఎలా ఆడారో నాకు తెలుసు. కాబట్టి వారి గత ఇన్నింగ్స్లను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసం నింపడమే నా పని. కుర్రాళ్లు కూడా నా నమ్మకాన్ని వమ్ముచేయలేదు. అద్బుతంగా రాణించారు. అరంగేట్రంలోనే అదరగొట్టారు. వారి డెబ్యూ సమయంలో తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వారు ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. సర్ఫరాజ్ కుటంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నా చిన్నతనంలో కంగా లీగ్లో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి ఆడాను. అతని తండ్రి ఎడమచేతి బ్యాటర్. ఆయన దూకుడుగా ఉండేవాడు. సర్ఫరాజ్ భారత్కు ప్రాతినిథ్యం వహించడం వెనక అతడి తండ్రి కృషి ఎంతో ఉందని" హిట్మ్యాన్ పేర్కొన్నాడు. -
అప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం.. బాకీలన్నీ తీర్చేసా!
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో ధ్రువ్ జురెల్ ఒకడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను ఐపీఎల్-2022 వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది. అయితే, ఆ ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్కు తుదిజట్టులో చోటు దక్కలేదు. బెంచ్కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో వేచి చూసి..గతేడాది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 11 ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ 152 పరుగులు చేశాడు. ఇక దేశవాళీ క్రికెట్లోనూ రాణించిన ఈ యూపీ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసి.. తనదైన ముద్ర వేయగలిగాడు. ముఖ్యంగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించి సత్తా చాటాడు. అయితే, చాలా మంది క్రికెటర్లలాగే ధ్రువ్ జురెల్ కూడా అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. తనలాగే కొడుకును కూడా సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెటర్ అవుతానని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడి తల్లి అండగా నిలిచి.. తన వద్ద ఉన్న చిన్నపాటి బంగారు వస్తువులు కూడా అమ్మేసి కిట్ కొనేందుకు డబ్బులిచ్చారు. ఎల్లవేళలా కొడుకుకు మద్దతుగా నిలిచారు. తండ్రి కూడా అర్థం చేసుకుని బాసటగా నిలవడంతో ధ్రువ్ జురెల్ తన కలలు నెరవేర్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గతాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నాకు మొట్టమొదటిసారి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కిన సమయంలో నా తల్లిదండ్రులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. నేను ఆ బాకీలన్నీ తీర్చేశాను. మా అమ్మ కోసం కొన్ని నగలు కూడా కొన్నాను’’ అని ధ్రువ్ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు తనకోసం పడిన కష్టం వెలకట్టలేనిదని పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా సీజన్ మొదలుకానుండగా.. రాజస్తాన్ మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
రోహిత్ భయ్యా తిడతాడు కానీ... టీమిండియా నయా స్టార్
Seeing Rohit Sharma "Pyaar Sa Aata Hai": ‘‘రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఐపీఎల్లోనూ తొమ్మిది- పదేళ్ల పాటు ఆడాను. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికీ ఆడుతూనే ఉన్నా. అయితే, అన్నింటితో పోలిస్తే రోహిత్ భయ్యా కెప్టెన్సీలో ఆడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన మంచి కప్టెన్. ఆయన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది. జట్టులో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాడు. టీమ్ మీటింగ్ జరుగుతున్నపుడు రోహిత్ భయ్యా మాట్లాడటం చూస్తుంటే నాకు ఆమిర్ ఖాన్ సినిమా ‘లగాన్’ గుర్తుకువస్తూ ఉంటుంది’’ అని టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా ముంబై స్టార్ సర్ఫరాజ్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజ్కోట్ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు.. మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్లలోనూ భాగమై మరో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో తన అనుబంధం, నాయకుడిగా అతడు వ్యవహారశైలి గురించి తాజాగా ఆజ్తక్తో మాట్లాడాడు సర్ఫరాజ్ ఖాన్. ‘‘రోహిత్ భయ్యా మమ్మల్ని మరీ ఎక్కువగా ఏం తిట్టడు. కాకపోతే సరైన సమయంలో సరైన విధంగా ఆడేలా కాస్త గట్టిగానే హెచ్చరిస్తాడు. మాట్లాడటంలో ప్రతి ఒక్కరికి తమదైన స్టైల్ ఉంటుంది. రోహిత్ భయ్యా సరాదాగా అన్న మాటల్ని కూడా కొందరు వేరే విధంగా అనుకుంటారు. నాకైతే ఆయన మమ్మల్ని తిట్టినట్లు అనిపించదు. ముంబైవాళ్లంతా అలాగే మాట్లాడతారు. ఆటగాళ్లతో రోహిత్ భయ్యా ఎంతో కలుపుగోలుగా ఉంటారు. తను సీనియర్, కెప్టెన్ అన్నట్లుగా వ్యవహరించరు’’ అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన సర్ఫరాజ్ను ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టగా.. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. చదవండి: IPL 2024: అభిమానులకు బ్యాడ్న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం? -
నన్ను క్షమించండి సన్నీ సార్.. మరోసారి అలా చేయను: సర్ఫరాజ్
టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన అరంగేట్ర టెస్టు సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. రాజ్కోట్ వేదికగా జరిగిన ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు ద్వారా డెబ్యూ చేసిన సర్ఫరాజ్.. తన బ్యాటింగ్ స్కిల్స్తో అందరని అకట్టుకున్నాడు. సర్ఫరాజ్ తన అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్లలోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అదేవిధంగా ధర్మశాల వేదికగా ఐదో టెస్టులోనూ ఈ ముంబైకర్ సత్తాచాటాడు. అయితే ఆఖరి టెస్టులో మంచి టచ్లో కన్పించిన సర్ఫరాజ్ ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. టీ బ్రేక్ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతికే సర్ఫరాజ్ పెవిలియన్కు చేరాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో బంతిని తప్పుగా అంచనా వేసిన సర్ఫరాజ్.. లేట్ కట్ షాట్ ఆడి స్లిప్లో జో రూట్ చేతికి చిక్కాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ 8 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు. కాగా సర్ఫరాజ్ ఔటైన వెంటనే భారత బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ సమయంలో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. సర్ఫరాజ్ ఔటైన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. "బంతి ఒక్కసారిగా పైకి పిచ్ అయ్యింది. అది షాట్ ఆడాల్సిన బాల్ కాదు. అయినా ఆడేందుకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే ఆవిధంగా ఆడాల్సిన అవసరం లేదు. కాస్త దృష్టి పెట్టి ఆడాల్సింది. ఇటువంటి సమయంలో దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మాన్ మాటలను గుర్తు చేసుకోవాలి. తాను 200 పరుగులు సాధించినా సరే ఎదుర్కొనే తర్వాత బంతిని సున్నా స్కోరు పై ఉన్నాను అని అనుకుని ఆడేవాడినని చెప్పేవారు. కానీ సర్ఫరాజ్ టీ విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్ ఆడి ఔటయ్యాడని" సన్నీ కాస్త సీరియస్ అయ్యాడు. అయితే గవాస్కర్ అంతలా సీరియస్ అవ్వడానికి ఓ కారణముంది. ఎందుకంటే మ్యాచ్కు ముందు షాట్ల ఎంపికపై దాదాపు గంట సేపు సర్ఫరాజ్కు గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. కానీ సర్ఫరాజ్ మాత్రం చెత్త షాట్ ఆడి ఔట్ కావడంతో లిటిల్ మాస్టర్కు కోపం వచ్చింది. అయితే గవాస్కర్ సీరియస్ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ బాధపడ్డాడని, ఆయనకు క్షమాపణలు కూడా చెప్పాడని ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ భాటియా తెలిపారు. ఈయన గవాస్కర్కు అత్యంత సన్నిహితుడు. ‘సన్నీ సార్కు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను తప్పు చేశా. మరోసారి అలాంటి తప్పిదం పునరావృతం కాదు’ అని యువ ఆటగాడు అన్నాడు’’ అని శ్యామ్ భాటియా చెప్పుకొచ్చారు. చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి మరీ.. -
అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి..
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్గా కేఎస్ భరత్ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం. రెండో టెస్టుతో రజత్ పాటిదార్, మూడో టెస్టుతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టుతో ఆకాశ్ దీప్, ఐదో టెస్టుతో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో రజత్ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన జురెల్ను కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్ను ఆడించడంలో అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘జట్టు యాజమాన్యం జురెల్పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్ బాల్ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్ వంటి జట్టుతో కీలక సిరీస్లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే, అగార్కర్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్ మాత్రం పడిక్కల్ వైపే మొగ్గు చూపాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్ వంటి మంచి హైట్ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్ జురెల్ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్ -
సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ టాప్ 10లోకి దూసుకొచ్చారు. హిట్మ్యాన్ ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో ర్యాంక్కు చేరుకోగా..జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వీరిద్దరితో పాటు ధర్మశాల టెస్టులో సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్ సైతం తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్ను పొందాడు. 11 స్ధానాలు ఎగబాకి 20వ ర్యాంక్కు గిల్ చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం వరుసగా రెండు మూడు స్దానాల్లో నిలిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో నిలిచాడు. బుమ్రాను వెనుక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. చదవండి: #David Miller: మూడు మ్యాచ్లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్ -
యశస్వీ జైశ్వాల్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను జైశ్వాల్కు ఈ అవార్డు దక్కింది. స్వదేశలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత నెలలో ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడిన యశస్వీ 112 సగటుతో ఏకంగా 560 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 209 పరుగులు చేసిన జైశ్వాల్.. రాజ్కోట్ టెస్టులో 214 పరుగులతో చెలరేగాడు. ఓవరాల్గా ఇంగ్లండ్ సిరీస్లో జైశ్వాల్ ఏకంగా 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ అవార్డు కోసం జైశ్వాల్తో పాటు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక పోటీపడ్డారు. కానీ ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన జైశ్వాల్నే ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపిక చేసింది. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ఎంపికైంది. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో సదర్లాండ్ అద్భుతంగా రాణించింది. చదవండి: వరల్డ్కప్ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కఠిన నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ Presenting the ICC Player of the Month for February 🙌 Congratulations, Yashasvi Jaiswal 👏👏 🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ — BCCI (@BCCI) March 12, 2024 -
Rohit Sharma: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క మొనగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఓ గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో సెంచరీతో (103) కదంతొక్కిన హిట్మ్యాన్.. తన టెస్ట్ కెరీర్లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ (110), అశ్విన్ (9 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (7 వికెట్లు) చెలరేగడంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ తన కెరీర్లో చేసిన 12 టెస్ట్ సెంచరీలు టీమిండియా విజయానికి దోహదపడ్డాయి. ఇలా ఓ ఆటగాడు చేసిన తన తొలి 12 టెస్ట్ సెంచరీలు జట్టు విజయానికి దోహదపడటం క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ తప్ప ఈ ఘనతను ఎవరూ సాధించలేకపోయారు. లేటు వయసులో టెస్ట్ ఓపెనర్గా ప్రమోషన్ పొందిన రోహిత్.. వయసు మీద పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా ఎవరికీ సాధ్యంకాని ఈ గొప్ప రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో భీకర ఫామ్లో ఉండిన హిట్మ్యాన్ ఈ సిరీస్లో ఆడిన 9 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 44.44 సగటున 400 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో హిట్మ్యాన్ నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. సిరీస్ ఆధ్యాంతం రోహిత్తో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి, సిరీస్ ఎగరేసుకుపోయింది. -
మురళీథరన్ రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్
ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ ప్రదర్శనతో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఇందులో ఓ రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టెస్ట్ సిరీస్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు అత్యధిక సార్లు తీసిన బౌలర్గా అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మురళీథరన్ పేరిట ఉండిన ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (800) సాధించిన మురళీ తన టెస్ట్ కెరీర్లో (ఓ టెస్ట్ సిరీస్లో) 25 అంతకంటే ఎక్కువ వికెట్ల ఘనతను ఆరు సార్లు నమోదు చేయగా.. అశ్విన్ ఏడు సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు. కేవలం 100 టెస్ట్ల్లోనే 516 వికెట్లు (36 ఐదు వికెట్ల ఘనతలు) తీసిన అశ్విన్.. మరో 285 వికెట్లు తీస్తే మురళీథరన్ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొడతాడు. కాగా, ధర్మశాల వేదికగా జరిగిన టెస్ట్లో ఇంగ్లండ్పై ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్ల టెస్ట్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ సిరీస్లో యాష్ రెండు ఐదు వికెట్ల ఘనతలు, ఓ నాలుగు వికెట్ల ఘనత నమోదు చేశాడు. -
పవర్ హిట్టర్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే!
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ఓపెనర్గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్లలో కలిపి (తొమ్మిది ఇన్నింగ్స్లో) ఏకంగా సగటు 89తో.. 712 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. టీమిండియా 4-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు యశస్వి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. యశస్వి జైస్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైస్వాల్ను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్లోనూ తన ఆట తీరును గమనిస్తూనే ఉన్నాం. అతడో అసాధారణ ఆటగాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలతో రాణించి టీ20లలోనూ అడుగుపెట్టాడు. అయితే, ఇంతవరకు వన్డేల్లో మాత్రం అతడికి అవకాశం రాలేదు. 50 ఓవర్ల ఫార్మాట్ క్రికెట్లోనూ యశస్వితో అరంగేట్రం చేయిస్తే మంచిది. అప్పుడు అతడు.. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్ల ప్లేయర్గా జట్టుకు ఉపయోగపడతాడు. బ్యాటర్గా డిఫెన్సివ్గా.. అదే సమయంలో దూకుడుగా ఎలా ఉండాలో తెలిసిన ఆటగాడు. ఆండర్సన్ బౌలింగ్లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన విధానం అతడి పవర్ హిట్టింగ్ నైపుణ్యాలకు నిదర్శనం’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 26 సిక్సర్లు బాదారు. ముఖ్యంగా రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్స్లు కొట్టడం హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టు, అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. చదవండి: శార్దూల్ ఏమన్నాడో విన్నాను: డొమెస్టిక్ క్రికెట్పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
‘బజ్బాల్’ బెడిసికొట్టి.. అవమానభారంతో ఇలా!..
భారత గడ్డపై టెస్టు సిరీస్ను గెలిచి తమ 12 ఏళ్ల నీరిక్షణకు తెరదించాలని భావించిన ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లండ్ కనీస పోటీ ఇవ్వకుండా టీమిండియా ముందు మోకారిళ్లింది. బజ్బాల్ అంటూ వరల్డ్ క్లాస్ జట్లను గడగడలాంచిన ఇంగ్లండ్.. భారత్ దెబ్బకు పసికూనలా వణకిపోయింది. అసలైన టెస్టు క్రికెట్ మజా ఎలా ఉంటుందో ఇంగ్లండ్ జట్టుకు రోహిత్ సేన చూపించింది. ఘన విజయంతో భారత్ టూర్ను ముగించాలని భావించిన స్టోక్స్ సేన.. ఆఖరికి ఘోర పరాభావంతో తమ దేశానికి తిరుగు పయనమైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. భారత గడ్డపై ఇంగ్లండ్ ఘోర ఓటమికి గల ఐదు కారణాలను పరిశీలిద్దాం. బెడిసి కొట్టిన బజ్ బాల్.. ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్ వైఫల్యమే. వారు అవలంభిస్తున్న బజ్బాల్ విధానమే వారి కొంపముంచింది. సాధరణంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బ్యాటరైనా ఆచతూచి ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇంగ్లండ్ జట్టుది మాత్రం వేరే లెక్క. వచ్చామా ఫోరో, సిక్స్ కొట్టి ఔటయ్యామా అన్నట్లు ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కొనసాగింది. ఆఖరి వరల్డ్ క్లాస్ బ్యాటర్ జో రూట్ సైతం అదే తీరును కనబరిచాడు. పరుగులు వేగంగా సాధించాలనే ఉద్దేశ్యంతో తనకు రాని షాట్లను ఆడి పెవిలియన్కు చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థి బౌలర్లపై దాడికి ప్రయత్నించి వికెట్లను కోల్పవడం సంప్రదాయ క్రికెట్ ఉద్దేశ్యం కాదు కద. ఈ సిరీస్లో భారత 9వ నెంబర్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతులు కూడా ఏ ఇంగ్లండ్ ఆటగాడు ఎదుర్కోలేకపోయాడు. టెస్టు క్రికెట్ అంటే కనీస ఓపికతో బ్యాటింగ్ చేయాలనే కామన్ సెన్స్ ఇంగ్లండ్ బ్యాటర్లలో కొరవడింది. బజ్బాల్ అంటూ టెస్టు క్రికెట్ రూపు రేఖలను మార్చేసిన ఇంగ్లండ్కు భారత్ మాత్రం సరైన గుణపాఠం చెప్పిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంగ్లండ్ ఘోర పరభావానికి మరో కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. ఇక తమకు తిరుగులేదని, ఏకంగా సిరీస్ వైట్ వాష్ చేసినట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ అక్కడ ప్రత్యర్ధి భారత్ అన్న విషయం బహుశా ఇంగ్లండ్ మార్చిపోయిందేమో. ఆ తర్వాత వైజాగ్ టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. ఇంగ్లండ్ను చిత్తు చేసింది. అప్పటికి ఇంగ్లండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఏమాత్రం పోలేదు. ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి కదా చూసుకోవచ్చులా అన్నట్లు ఇంగ్లండ్ థీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వైజాగ్ టెస్టు అనంతరం భారత్ నుంచి దుబాయ్ వేకేషన్కు ఇంగ్లండ్ జట్టు వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన ఇంగ్లండ్ ఆటను మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ దాదాపు వారం రోజులు గడిపింది. ఆ తర్వాత రాజ్కోట్కు చేరుకున్న ఇంగ్లండ్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మూడో టెస్టులో బరిలోకి దిగింది. రాజ్కోట్లో కూడా ఇంగ్లండ్ తీరు ఏ మాత్రం మారలేదు. మరోసారి ఇంగ్లండ్ను టీమిండియా చిత్తు చేసింది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. అయితే అప్పటికి ఇంగ్లండ్ మాత్రం సిరీస్ తామే గెలుస్తామన్న థీమాగా కన్పించింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్సీ, కోచ్ మెకల్లమ్ ఆఖరి రెండు టెస్టుల్లో భారత్ను చిత్తు చేస్తామని గొప్పలు పలికారు. కానీ భారత్ ముందు ఇంగ్లండ్ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్ విజయ భేరి మ్రోగించింది. బౌలింగ్ వైఫల్యం. స్పిన్నర్లు కాస్తో కూస్త అకట్టుకున్నప్పటికి ఫాస్ట్ బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్ ఆండర్సన్, వుడ్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు సైతం భారత బ్యాటర్లు ముందు దాసోహం అయ్యారు. ఆండర్సన్ను అయితే భారత యువ ఓపెనర్ జైశ్వాల్ ఊచకోత కోశాడు. స్పిన్నర్ల ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఇంగ్లండ్ బౌలింగ్లో ఎటాక్లో స్పష్టంగా అనుభవం లేమి కన్పించింది. జాక్ లీచ్ వంటి స్టార్ స్పిన్నర్ తొలి టెస్టు తర్వాత జట్టు నుంచి తప్పుకోవడం ఇంగ్లండ్ను బాగా దెబ్బతీసింది. టామ్ హార్లీ, బషీర్ వంటి యువ స్పిన్నర్లు ఆడపదడప వికెట్లు తీసినప్పటికి పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నారు. స్టోక్సీ మిస్ ఫైర్.. తన కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బెన్ స్టోక్స్.. భారత్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. ఈ సిరీస్లో బెన్ స్టోక్స్ దారుణంగా విఫలమయ్యాడు. అస్సలు ఈ సిరీస్లో అతడి వ్యూహం ఎవరికీ అర్ధం కాలేదు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లో కూడా నిరాశపరిచాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో కూడా స్టోక్సీ ఫెయిల్ అయ్యాడు. సిరీస్ మొత్తంగా 5 టెస్టుల్లో 199 పరుగులు స్టోక్స్ చేశాడు. ఇది కూడా ఇంగ్లండ్ ఓటమికి ఓ కారణం. కుర్రాళ్లు కొట్టిపాడేశారు..? కోహ్లి, రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లను ఇంగ్లండ్ తక్కువగా అంచనా వేసింది. వారికి పెద్దగా అనుభవం లేనందన తమ బౌలర్లు పై చేయి సాధిస్తారని ఇంగ్లండ్ మేనెజ్మెంట్ భావించింది. కోహ్లిని ఎలా ఔట్ చేయాలి? రాహుల్ను ఎలా ఔట్ చేయాలని ప్రణాళికలు రచించిన ఇంగ్లండ్.. యువ ఆటగాళ్లు విషయంలో మాత్రం ఎటువంటి ఆలోచన చేయలేదు. అదే వారి కొంపముంచింది. జైశ్వాల్, సర్ఫరాజ్, ధ్రవ్ జురల్ యువ సంచలనాలు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జైశ్వాల్ అయితే ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. 𝐑𝐨𝐡𝐢𝐭 & 𝐂𝐨. conquered the series with ease💪#IDFCFirstBankTestSeries #INDvENG #JioCinemaSports #BazBowled pic.twitter.com/a6HsT0Ikbe — JioCinema (@JioCinema) March 9, 2024 -
ధోని, యువీ కాదు..! భారత్లో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. సిక్సర్లు బాదడంలో హిట్మ్యాన్ తనకు తానే సాటి అని కొనియాడాడు. భారత్లో ఇంత వరకు అలాంటి హిట్టర్ మరొకరు లేరని పేర్కొన్నాడు. కాగా 2007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డేల్లో మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్గా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. టెస్టుల్లో ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు చేశాడు. ఇక సిక్సర్లు కొట్టడంలో రోహిత్ శర్మ ఎప్పుడూ ‘హిట్టే’! ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి అతడి ఖాతాలో 597 సిక్స్లు ఉన్నాయి. ఇక ఇంగ్లండ్తో శనివారం ముగిసిన ఐదో టెస్టులోనూ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఇక ఈ టెస్టులో కూడా టీమిండియా గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఫలితంగా బ్యాటర్గా, కెప్టెన్గా అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. రోహిత్ హిట్టింగ్ పవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా వాళ్లకు నా వీడియోలు చూపించాను. అందుకే అలా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నారు(నవ్వుతూ).. జోక్స్ పక్కన పెడితే.. ఈ ఫార్మాట్లో ఎవరైనా సిక్స్లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. మనకు రోహిత్ శర్మ లాంటి గొప్ప సిక్స్ హిట్టర్ ఉన్నాడు. షాట్ బాదడంలో తన పవర్, నైపుణ్యం అద్భుతం’’ అని కితాబులిచ్చాడు. టీమిండియాలో ఇంతవరకు అతడిలా సిక్సర్లు బాదిన ఆటగాడు మరొకరు లేరని ద్రవిడ్ జియో సినిమా షోలో ఈమేరకు వ్యాఖ్యానించాడు. కాగా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా టీమిండియాలో గొప్ప సిక్స్ హిట్టర్లుగా పేరొందిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఎవరికంటే..?
ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, పటిష్టమైన ఇంగ్లండ్ను మట్టికరిపించింది. విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీ లాంటి సీనియర్లు ఈ సిరీస్కు దూరమైనప్పటికీ వారి స్థానాలకు భర్తీ చేస్తూ యువ ఆటగాళ్లు దుమ్మురేపారు. ఈ సిరీస్లో టీమిండియా కుర్ర బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, దేవ్దత్ పడిక్కల్ లాంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో సీనియర్ల స్థానాన్ని ప్రశ్నార్దకంగా మార్చారు. బౌలింగ్ విషయానికొస్తే.. సీనియర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుంది. కుల్దీప్, బుమ్రా అవకాశం వచ్చిన ప్రతిసారి తమ సత్తా నిరూపించుకున్నారు. దృవ్ జురెల్ బ్యాటర్గానే కాకుండా వికెట్కీపర్గానూ రాణించి పంత్ స్థానానికి ఎసరుపెట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సిరీస్ మొత్తంలో ఒక్క రజత్ పాటిదార్ మినహాయించి టీమిండియాకు అన్ని శుభాలే జరిగాయి. Any guesses who won the Fielding Medal for the series 🤔#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/NxZVWOX422 — BCCI (@BCCI) March 10, 2024 పాటిదార్ ఒక్కడే మూడు మ్యాచ్ల్లో ఆడే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆకాశ్దీప్ సైతం లభించిన అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ఆకాశ్ నాలుగో టెస్ట్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనే కాకుండా ఈ సిరీస్ ఆధ్యాంతం టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్లోనూ మెరుగ్గా రాణించారు. భారత ఆటగాళ్లు దాదాపుగా ప్రతి మ్యాచ్లో మైదానంలో పాదరసంలా కదిలారు. అద్భుతంగా ఫీల్డింగ్ చేసి పరుగులు నియంత్రించడంతో పాటు కొన్ని కళ్లు చెదిరే క్యాచ్లు పట్టారు. సిరీస్ మొత్తంలో ఫీల్డింగ్లో సత్తా చాటిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లకు ఇంపాక్ట్ ఫీల్డర్స్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఫీల్డింగ్కు సంబంధించి కుల్దీప్ యాదవ్కు ప్రత్యేక అవార్డు లభించింది. గతకొంతకాలంగా మైదానంలో రాణించే వారిని ఇంపాక్ట్ ఫీల్డర్ అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. అంతకుముందు జరిగిన రాంచీ టెస్ట్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదారాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్.. ఆతర్వాత రెండో టెస్ట్లో 106 పరుగుల తేడాతో, మూడో టెస్ట్లో 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సిరీస్ ఆధ్యాంతం పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్లో జైస్వాల్ 9 ఇన్నింగ్స్ల్లో 2 డబుల్ సెంచరీలు, 3 అర్దసెంచరీల సాయంతో 712 పరుగులు చేసి సిరీస్ లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. -
టీమిండియా నంబర్ వన్
టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా మళ్లీ అగ్రస్ధానాన్ని కైవసం చేసుకుంది. స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. 122 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకుంది. ఇక ఇప్పటివరకు టాప్ ర్యాంక్లో ఉన్న ఆస్ట్రేలియా 117 రేటింగ్ పాయింట్స్తో రెండో స్థానానికి పడిపోయింది. ఇక భారత్ చేతితో ఘోర పరాభవం పొందిన ఇంగ్లండ్ 111 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ టాప్ ర్యాంక్లోనే నిలవడం గమనార్హం. అదే విధంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలోనూ భారత్ అగ్రస్ధానంలో ఉంది. 68.51 విజయ శాతంతో టీమిండియా తొలి స్ధానంలో ఉంది. భారత్ తర్వాత స్ధానంలో న్యూజిలాండ్(60.00 విజయ శాతం) ఉంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియాకు ఇంకా కేవలం 5 టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్, న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ భారత్ ఆడనుంది. ఈ సిరీస్లలో భారత్ విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దాదాపు ఖరారైనట్లే. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 యేళ్ళ టెస్టు క్రికెట్ హిస్టరీలోనే?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను టీమిండియా ఘన విజయంతో ముగించింది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఈ విజయంతో టీమిండియా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 579 టెస్టులు ఆడిన భారత్.. 178 మ్యాచ్ల్లో గెలవగా, 178 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. 222 మ్యాచ్లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. అయితే భారత జట్టు టెస్టు చరిత్రలో విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా రావడం ఇదే తొలిసారి. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ గెలుపు ఓటముల నిష్పత్తి సమానం కాలేదు. ఇప్పుడు ఈ అరుదైన రికార్డుకు ధర్మశాల వేదికైంది. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. జైశ్వాల్ ఈ సిరీస్ ఆసాంతం అద్బుతమైన కనబరిచాడు. 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: #Shreyas Iyer: ఏమైంది శ్రేయస్? మరోసారి ఫెయిల్! ఇక కష్టమే మరి -
రోహిత్ వార్నింగ్.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న సర్ఫరాజ్!
రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త సీరియస్ అయిన సంగతి తెలిసిందే. హెల్మెట్ ధరించకుండా సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేయడానికి సిద్దమైన సర్ఫరాజ్ను రోహిత్ మందలించాడు. 'నువ్వు ఏమైనా హీరో అవ్వాలనుకుంటున్నవా' అని సర్ఫరాజ్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే శ్రీకర్ భరత్ హెల్మెట్ తీసుకువచ్చి సర్ఫరాజ్కు ఇచ్చాడు. అయితే రోహిత్ సలహానే ఇప్పుడు సర్ఫరాజ్ను పెను ప్రమాదం నుంచి తప్పించింది. ఏమి జరిగిందంటే? ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38 ఓవర్ వేసిన కుల్దీప్ బౌలింగ్లో సర్ఫరాజ్ షార్ట్ లెగ్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్లో మూడో బంతిని కుల్దీప్.. బ్యాటర్ షోయబ్ బషీర్కి షార్ట్ బాల్ సంధించాడు. ఈ క్రమంలో బషీర్ లెగ్ సైడ్ బలంగా ఫ్లిక్ చేశాడు. వెంటనే బంతి నేరుగా సర్ఫరాజ్ హెల్మెట్కు వచ్చి తాకింది. అయితే హెల్మెట్ ఉండడంతో ఈ ముంబైకర్ గాయపడకుండా తప్పించుకున్నాడు. ఒకవేళ హెల్మెట్ లేకపోయింటే తీవ్రమైన గాయం అయి ఉండేది. ఇక ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. And that’s why Rohit Bhai said “Hero banne ki zaroorat naheen hai” pic.twitter.com/41tsvFUXrg — Vishal Misra (@vishalmisra) March 9, 2024 -
బజ్ బాల్ బద్దలైంది.. అతడే ఇంగ్లండ్ కొంపముంచాడు: సెహ్వాగ్
భారత పర్యటనను ఇంగ్లండ్ జట్టు ఘోర ఓటమితో ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బాజ్ బాల్ అంటూ వీరవీగ్రుతన్న ఇంగ్లండ్ జట్టు ఆఖరి టెస్టులో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత దెబ్బకు ఇంగ్లండ్ బజ్ బాల్ పగిలిపోయింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 1-4 తేడాతో భారత్కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బజ్ బాల్ విధానంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. "భారత్ దెబ్బకు ఇంగ్లండ్ బాజ్ బాల్ బద్దలైంది. వారు ఆప్రోచ్ సరైనది కాదు. పిచ్చికి కూడా ఓ పద్దతి ఉంటుంది. ఇంగ్లండ్ తమ స్ధాయికి తగ్గట్టు ఆడలేకపోయింది. రెండో టెస్టు ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు పూర్తిగా తేలిపోయింది. కెప్టెన్ స్టోక్స్ విఫలమవడం వారి కష్టాలను మరింత రెట్టింపు చేసింది. ఇంగ్లండ్ ఇంకా బజ్బాల్ భ్రమలోనే ఉన్నారు. వారు ఈ విధానంతోనే విజయవంతం కావాలంటే ఒక పద్దతి, ప్రణాళిక ఉండాలని" ఎక్స్లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. -
జో రూట్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్తో పాంటింగ్ ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది. భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. చదవండి: IND vs ENG: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.
ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. బాజ్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్కు టీమిండియా సరైన సమాధానమే చెప్పింది. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇక క్రికెట్ ఆడలేనని భావించిన రోజు రిటైర్మెంట్ ప్రకటిస్తానని హిట్మ్యాన్ తెలిపాడు. "నేను క్రికెట్ ఆడేందుకు సరిపోనని భావించిన రోజు నా అంతట నేనే రిటైర్ అవుతాను. కానీ గత 2-3 ఏళ్లలో నా ఆట ఎంతో మెరుగుపడిందని" రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఇటీవలే రోహిత్ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్కు దూకుడుగా ఆడే వయస్సు అయిపోయిందని, అతడు రిటైర్ అయితే బెటర్ అని బాయ్కాట్ విమర్శించాడు. ఈ నేపథ్యంలో బాయ్కాట్ వ్యాఖ్యలకు రోహిత్ కౌంటర్ ఇచ్చినట్లైంది. కాగా ఈ సిరీస్లో రోహిత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్లో రెండు సెంచరీల సాయంతో 400 పరుగులు చేశాడు. చదవండి: IND Vs ENG: ఏంటి బషీర్ ఇది..? బౌల్డ్ అయితే రివ్యూనా? వీడియో వైరల్ -
IND Vs ENG 5th Test Photos: టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం (ఫొటోలు)
-
ప్రపంచంలో మొట్ట మొదటి బౌలర్గా అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచంలో ఏ బౌలర్కూ ఇంత వరకు సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు ఈ చెన్నై ఆటగాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో తన తొలి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో చెలరేగాడు. అలా తన కెరీర్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. తాజాగా తన వందో టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు అశ్విన్. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లకే పరిమితమైన అశూ.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో దుమ్ములేపాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఈ నేపథ్యంలో.. అరంగేట్రంలో, వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్గా అశ్విన్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. కాగా అశ్విన్ తన కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 36 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం విశేషం. తద్వారా టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు(35 సార్లు) బద్దలు కొట్టాడు. అంతేకాదు ఒకే ప్రత్యర్థి జట్టుపైన అత్యధిక టెస్టు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గానూ నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్.. ఆస్ట్రేలియా మీద 114, ఇంగ్లండ్ మీద 114 వికెట్లు తీశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగానే 500 వికెట్లు క్లబ్లో చేరాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 516 వికెట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో ఇంగ్లండ్తో జరిగిన నామమాత్రపు ఆఖరి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 చదవండి: #Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్- బెయిర్స్టో గొడవలో సర్ఫరాజ్.. వైరల్ -
ఏంటి బషీర్ ఇది..? బౌల్డ్ అయితే రివ్యూనా? వీడియో వైరల్
స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను టీమిండియా ఘనంగా ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ యువ ఆటగాడు షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ అయినప్పటికి రివ్యూ కావాలని అడగడం అందరని ఆశ్చర్యపరిచింది. అసలేం జరిగిందంటే? ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్లో ఆఖరి బంతికి షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే బషీర్ తను బౌల్డ్ కాకుండా వికెట్ కీపర్కు దొరికిపోయానని భావించి రివ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రివ్యూ కావాలని సిగ్నల్ ఇచ్చాడు. కానీ నాన్ స్ట్రైక్లో ఉన్న జోరూట్ ఒక్కసారిగా నవ్వుతూ బౌల్డయ్యావని బషీర్తో చెప్పాడు. ఇది చూసిన భారత ఆటగాళ్లు సైతం నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బాబు బషీర్ బౌల్డ్లకు రివ్యూలు ఉండవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!? View this post on Instagram A post shared by TNT Sports (@tntsports) -
ఎందుకంత మిడిసిపడుతున్నావు?.. గిల్- బెయిర్స్టో గొడవలో సర్ఫరాజ్
India vs England, 5th Test- Shubman Gill- Sarfaraz Khan Vs Jonny Bairstow: టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్లో భాగంగా తొలిసారి ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో వాగ్యుద్ధం మొదలుపెట్టగా.. భారత యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ అతడికి ఘాటుగా బదులిచ్చారు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం గొడవను చల్లార్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ధర్మశాల వేదికగా ఐదో టెస్టు శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 473/8 ఓవర్నైట్ స్కోరుతో భారత్ ఆటను మొదలుపెట్టింది. ఈ స్కోరుక కేవలం నాలుగు పరుగులు జతచేసి అంటే.. 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు టాపార్డర్ కుప్పకూలడంతో కష్టాల్లో పడింది. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో జో రూట్, జానీ బెయిర్ స్టోతో కలిసి భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశాడు. ఆది నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన బెయిర్స్టో.. 18 ఓవర్లో కుల్దీప్ యాదవ్ బాల్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్మన్ గిల్ను ఉద్దేశించి.. స్లెడ్జ్ చేశాడు. ఈ క్రమంలో గిల్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా బెయిర్స్టోకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. వారి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైకులో రికార్డైంది. Full sledging encounter between Gill & Bairstow:#INDvsENGTest #INDvsENG #ShubmanGill #JonnyBairstowpic.twitter.com/HjdkESr38z — Ashu 🖤 (@Ashu_x18) March 9, 2024 సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఆ సంభాణ ఇలా జానీ బెయిర్స్టో: ‘‘జిమ్మీతో నువ్వేమన్నావు? తన రిటైర్మెంట్ గురించి.. తుదిజట్టు నుంచి తప్పించడం గురించి మాట్లాడతావా? కానీ అతడి బౌలింగ్లోనే నువ్వు అవుటయ్యావు కదా?’’. శుబ్మన్ గిల్: ‘‘అయితే.. ఏంటి.. నా శతకం పూర్తైన తర్వాతే అతడు నన్ను అవుట్ చేయగలిగాడు. అయినా.. నువ్వు ఇక్కడ ఎన్ని పరుగులు చేశావేంటి?’’. జానీ బెయిర్స్టో: ‘‘బాల్ స్వింగ్ అవుతున్నపుడు నువ్వెన్ని పరుగులు చేయగలిగావు?’’. ధ్రువ్ జురెల్: ‘‘జానీ భాయ్ ఊరుకోండి!’’ సర్ఫరాజ్ ఖాన్: ‘‘ఈరోజు ఏవో కొన్ని పరుగులు చేశాడని.. తెగ ఎగిరెగిరిపడుతున్నాడు’’. కాగా ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ విలువైన 56 పరుగులు చేశాడు. ఇక వందో టెస్టు ఆడిన బెయిర్ స్టో తొలి ఇన్నింగ్స్లో 29, రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులు(31 బంతుల్లో) చేశాడు. . ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. ఇక బెయిర్స్టో- గిల్, సర్ఫరాజ్ వాగ్వాదంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది బయిర్స్టోది తప్పు అంటే.. మరికొందరు వందో టెస్టు ఆడుతున్న క్రికెటర్(బెయిర్స్టో)కు గౌరవం ఇవ్వాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: BCCI: బీసీసీఐ కీలక ప్రకటన.. ఒక్కో మ్యాచ్కు ఏకంగా రూ. 45 లక్షలు That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
పేరంటాలమ్మ తిరునాళ్లు
ప్రాణం తీసిన ఈత సరదా
టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
దాత సహకారంతో నిర్మాణం
సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
తప్పక చదవండి
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement