breaking news
India vs England
-
ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?
టీమిండియాతో వన్డే సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అదరగొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 76 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ వన్డౌన్ బ్యాటర్.. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. సహచరుడికి మ్యాచ్ ముగించే అవకాశం ఇచ్చి.. హుందాగా వ్యవహరించాడు.ఈ మ్యాచ్లో రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ జయభేరి మోగించి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 48 బంతుల్లో తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ తొలి క్రికెటర్గా రికార్డుఇక మూడో వన్డేలో గెలిచి ఇంగ్లండ్ సిరీస్ 2-1తో కైవసం చేసుకోగా.. టీమిండియా ఓటమితో నిరాశగా వెనుదిరిగింది. రూట్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.నిజానికి గత కొంతకాలంగా రూట్ వన్డేల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ముప్పై ఐదేళ్ల బ్యాటర్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్లో చేసిన పరుగులు వరుసగా.. 61, 75, 111*, 76*, 99*, 74*. తద్వారా ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో వరుసగా ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన తొలి క్రికెటర్గా రూట్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ టీమిండియా యాజమాన్యం వైఖరిని విమర్శించాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ జో రూట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. మంచి ఫలితాలు రాబడుతోందన్నాడు. అదే సమయంలో భారత జట్టు యాజమాన్యం మాత్రం దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలో తప్పు చేస్తోందని మండిపడ్డాడు.కాగా ఇప్పటికే రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ను కెప్టెన్సీ తప్పించిన యాజమాన్యం.. రో-కో ప్రపంచకప్ ఆడతారో లేదోనన్న అంశంపై తమకు స్పష్టత లేదన్నారు.రోహిత్ భారీ శతకంఈ క్రమంలోనే లార్డ్స్లో ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోడుతన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ భారీ శతకం (138)తో రాణించి ఊహాగానాలకు చెక్ పెట్టాడు. తాను రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు.మీరు తప్పు చేస్తున్నారుఈ పరిణామాల నేపథ్యంలో నేపథ్యంలో రమేశ్ స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు యాజమాన్యం మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్లిద్దరు ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-5లో ఉన్న సత్తా కలవారు. ఓసారి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ను చూడండి. జో రూట్కు వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు.అతడిపై ఏమాత్రం ఒత్తిడి పెట్టడం లేదు. ఇంగ్లండ్ రూట్ను తమ బలంగా భావిస్తోంది. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం రోహిత్- విరాట్లనే తమ వెన్నెముకగా భావించాల్సింది పోయి వారి విషయంలోనే స్పష్టత లేకుండా చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 11, 26, 138 పరుగులు చేయగా.. కోహ్లి 5, 74, 65 పరుగులు సాధించాడు.చదవండి: లార్డ్స్ వన్డేలో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్ -
లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరిందంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు.. ‘హిట్మ్యాన్’ లార్డ్స్లో శతకంతో చెక్ పెట్టాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా క్రికెట్ ‘మక్కా’లో సెంచరీ బాది తన బ్యాట్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కాగా ఇంగ్లండ్తో లార్డ్స్ వన్డేనే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ 110 బంతుల్లోనే పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 138 పరుగులతో అదరగొట్టాడు.లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్అనంతరం తన రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. తాను క్రికెట్ ఆడుతున్నంత కాలం... రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తూ ఉంటాయని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వార్తలతో పోరాడటం కంటే... మైదానంలో పరుగులు సాధించడంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సైతం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. గేమ్ ప్లాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్లో గెలిచేందుకు ఇంగ్లండ్కు అర్హత ఉంది. అయితే, ఆ విషయం కంటే కూడా రోహిత్ శర్మ సెంచరీ చేయడమే లార్డ్స్ మ్యాచ్కు హైలైట్. ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తానూ ఒకడినని.. ఇప్పటికీ తన ఆటలో పదును తగ్గలేని రోహిత్ తన ఇన్నింగ్స్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడి భవిష్యత్తు గురించి చాలా వదంతులు వస్తున్నాయి. వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో అతడు లేడని చాలా మంది అంటున్నారు. వాళ్లు తలచుకుంటేనే..అయితే, తనను విమర్శించే వాళ్లందరికీ రోహిత్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. రోహిత్, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లను ఎవరూ జట్టు నుంచి బయటకు పంపలేరు. ఆటకు వీడ్కోలు పలకడానికి సరైన సమయం వచ్చిందని భావిస్తే వాళ్లే స్వయంగా తప్పుకొంటారు. రిటైర్మెంట్ అనేది కేవలం వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. భారత క్రికెట్కు వీరిద్దరు చేసిన సేవలు వెలకట్టలేనివి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మిగతా ఫార్మాట్ల నుంచి వారే తప్పుకొన్నారు. అందుకే వాళ్లు నేటికీ సూపర్స్టార్లుగానే కొనసాగుతున్నారు’’ అని కమ్రాన్ అక్మల్ రో-కోలపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయింది.ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత.. రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. గతేడాది వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ టెస్టులకూ గుడ్బై చెప్పారు. వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా వన్డేల్లో కొనసాగుతున్నారు.చదవండి: ఆటకు గుడ్బై చెప్పు... భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
గంభీర్ చేతుల్లో అతడి కెరీర్ కూడా నాశనమేనా!
టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో కేఎల్ రాహుల్ను బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ఆరో స్థానంలో పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు రాహుల్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ను ఆరో స్థానంలో కాకుండా ఇషాన్ కిషన్ స్థానంలో పంపించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. Photo Credit: BCCI Twitterరాహుల్ క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ విజయానికి 36 బంతుల్లో 84 పరుగులు కావాలి. కానీ రాహుల్ ఔటైతే ఆ తర్వాత స్పెషలిస్ట్ బ్యాటర్లు ఎవరూ లేరని, దీంతో ఒత్తిడికి లోనయ్యి వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఇది ముమ్మాటికి గంభీర్ తప్పిదమేనని, కేఎల్ రాహుల్ ఏమైనా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చేవాడిలా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆలోచనలేమితో వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ కెరీర్లు భ్రష్టు పట్టించిన గంభీర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ కెరీర్ను కూడా నాశనం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి మూడో వన్డేలో 387 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్కు బట్లర్లాగే ఆ స్థానంలో మనకు కీ ప్లేయర్ ఉండాలి. శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తే.. అప్పుడు నాలుగో స్థానంలో ఇషాన్ కిషన్కు బదులు కేఎల్ రాహుల్ను పంపించాల్సింది. Photo Credit: BCCI Twitter2023 వన్డే ప్రపంచకప్లో కేఎల్ రాహుల్ ఎక్కువగా ఐదో స్థానంలోనే బ్యాటింగ్కు వచ్చి కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. నిన్నటి మ్యాచ్లో అది జరిగి ఉంటే టీమిండియా పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్ను ఆరో స్థానంలో ఆడించడం వల్ల మరో ఉపయోగం కూడా ఉండేది. ఆఖర్లో ధాటిగా ఆడాల్సిన సమయంలో అక్షర్ పటేల్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ను నడిపించగలడని పేర్కొన్నాడు. నిజానికి టాప్ క్లాస్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ శైలిని మార్చుకోగల నేర్పరి అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక 2023 వన్డే ప్రపంచకప్లో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 10 ఇన్నింగ్స్ ల్లో 452 పరుగులు బాదాడు. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ను ఎక్కువగా ఆరో స్థానంలోనే బ్యాటింగ్కు పంపుతున్నాడు. అక్షర్ పటేల్ను అతని కంటే ముందుగా పంపే వ్యూహాన్ని టీమ్ మేనేజ్మెంట్ అమలు చేస్తోంది. ఈ ప్రయోగం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫలితాన్ని ఇచ్చినా.. ఇంగ్లండ్ సిరీస్లో మాత్రం తీవ్రంగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం రాహుల్ బ్యాటింగ్ స్థానం, టీమ్ మేనేజ్మెంట్ వ్యూహాలపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో 2 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. Before recording this video, I honestly thought KL RAHUL might get out, and here he is..... Bowled😭 pic.twitter.com/fjrGLx96Vo— Vipin Tiwari (@Vipintiwari952) July 19, 2026Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు -
ఆటకు గుడ్బై చెప్పు.. భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇంగ్లండ్తో కీలక మూడో మ్యాచ్లో ఓటమిపాలైన టీమిండియా వన్డే సిరీస్నూ కోల్పోయింది. లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన వన్డేలో గిల్ సేన 27 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం భారత బౌలర్ల వైఫల్యమే అని చెప్పడంలో సందేహం లేదు.నలుగురు సీమర్లు అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ కృష్ణలతో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్లను టీమిండియా బరిలోకి దించింది. ఈ మ్యాచ్కు ముందు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. దీంతో వాషీ స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారని విశ్లేషకులు భావించారు. అయితే, ఇక్కడ మధ్య ఓవర్లలో స్పిన్నర్ల కంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపుతారన్న కెప్టెన్ శుబ్మన్ గిల్.. కుల్దీప్ను కాదని ప్రిన్స్ యాదవ్ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.మూకుమ్మడిగా విఫలంఅయితే, ఈ వ్యూహం బెడిసి కొట్టింది. బౌలర్లంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. గుర్నూర్ బ్రార్ అయితే పది ఓవర్ల కోటాలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకుని లార్డ్స్లో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇక అర్ష్దీప్ తన కోటా పూర్తి చేసి 72 పరుగులు ఇవ్వగా.. ప్రసిద్ కృష్ణ 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు.అత్యధిక స్కోరుమరోవైపు.. ప్రిన్స్ యాదవ్ పది ఓవర్ల కోటా పూర్తి చేసి 79 రన్స్ ఇచ్చుకుని ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్ పది ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులతో లార్డ్స్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 360 పరుగులు మాత్రమే చేసి ఓటమిని ఆహ్వానించింది.రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడిఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుల్దీప్ యాదవ్ పట్ల మేనేజ్మెంట్ వైఖరి సరిగ్గా లేదని విమర్శించాడు. ‘‘కుల్దీప్ కెరీర్ ముగిసిపోయింది.. ఇక బ్యాగులు సర్దుకోవడమే తరువాయి.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలి’ అనేలా కుల్దీప్ను గందరగోళంలో పడేస్తున్నారు.లార్డ్స్ మ్యాచ్లో బుమ్రా, వాషింగ్టన్, వరుణ్ చక్రవర్తి.. ఈ ముగ్గురూ లేరు. మరి వాషీ స్థానంలోనైనా కుల్దీప్ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు కదా!.. లార్డ్స్లో వైవిధ్యంగా బౌలింగ్ చేసేవాళ్లు కావాలి. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన కుల్దీప్ ఇక్కడ గొప్పగా బౌలింగ్ చేయగలడు.118 వన్డేల్లోనే అతడు 194 వికెటుల కూల్చాడు. అయినా సరే ఈ గణాంకాలను మీరు పరిగణనలోకి తీసుకోరు అనిపిస్తోంది. ఇక భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సైతం కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడాన్ని తప్పుబట్టాడు. అశూ ఆగ్రహంఇంగ్లండ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడించకుండా అతడిని పక్కనపెట్టారని.. ఇది కుల్దీప్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అశూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా యూకే పర్యటనలో టీ20 సిరీస్లలో ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్స్వీప్ అయింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో 2-1తో ఓటమిపాలైంది.చదవండి: అందుకే అతడు బెంచ్కే పరిమితం: గిల్ -
లార్డ్స్లో సెంచరీ.. రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
రిటైర్మెంట్ వార్తల నడుమ లార్డ్స్ మైదానంలో టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ అద్భుత శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్తో ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా 138 పరుగులు సాధించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన హిట్మ్యాన్ ఆ తర్వాత గేరు మార్చి.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ఈ క్రమంలో 110 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేశాడు. అయితే, జేకబ్ బెతెల్ అనూహ్య రీతిలో రోహిత్ను బౌల్డ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (77), వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (74) అర్ధ శతకాలు సాధించినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణయాత్మక మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఓడి టీమిండియా సిరీస్ను 1-2తో ఇంగ్లండ్కు కోల్పోయింది.The name is Rohit Gurunath Sharma. 🫡The occasion? A Lord's century. 💯Watch #ENGvIND 3rd ODI LIVE NOW on Sony Sports Network TV channels. #SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/G5HoYMO0BV— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026రూమర్లు కొత్తేం కాదుఇదిలా ఉంటే.. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ‘‘మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేయడం నా ముఖ్య విధి. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. నా అరంగేట్రం రోజు నుంచి నేటి దాకా అదే నిబద్ధత, అంకితభావంతో ముందుకు సాగుతున్నాను.అంతేకాదు నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నాటి నుంచే ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాను. నేను మళ్లీ గ్రౌండ్లోకి వెళ్లే దాకా ఈ వదంతులు ఆగవు. అయినా.. ఇలాంటి రూమర్లు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. మైదానంలో నా ఆట తీరు ఎలా ఉందన్నదే ముఖ్యం.జట్టు విజయం కోసం నా వంతు కృషి చేస్తాను. కేవలం ఆ ఒక్క విషయంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. అయినా ఇలాంటి వదంతులు ఉంటేనే కదా.. మనకూ కాస్త సరదాగా అనిపిస్తుంది. నా పని నాదే. బయట ఎవరి పని వాళ్లదే. వాళ్లు ఇలాంటి రూమర్లతో ప్రాచుర్యం పొందాలనుకుంటారు’’ అని రోహిత్ శర్మ గాసిప్రాయుళ్లకు కౌంటర్ వేశాడు.కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, లార్డ్స్లో రోహిత్ చివరి మ్యాచ్ ఆడబోతున్నాడనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశాడు. కెప్టెన్ గిల్ సైతం ఇవన్నీ కేవలం ఊహాగానాలే అన్నాడు.మా మధ్య అవగాహన ఉందిఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి కలిసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 400 మ్యాచ్లలో కలిసి ఆడిన తొలి భారత జోడీగా చరిత్రకెక్కారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్పందిస్తూ.. ‘‘మా కెరీర్ తొలి నాళ్ల నుంచి మేము కలిసి ఆడుతున్నాం. ఇప్పటికే మేమిద్దరం కలిసి ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాము.మధ్య ఓవర్లలో కోహ్లి వస్తే అతడితో కలిసి ఆడటం నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు కూడా ఇద్దరం కలిసే ఆడాము. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఆట మధ్యలో మేము ఎక్కువగా చర్చించుకుంటాము. ఒకరి ఆలోచనలు ఒకరం పంచుకుంటూ.. ఒకరినొకరం అర్థం చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తూ ఉంటాము’’ అని కోహ్లితో ఉన్న అనుబంధం, సమన్వయం గురించి చెప్పుకొచ్చాడు.చదవండి: మెరుగుపడాల్సిందే: శుబ్మన్ గిల్ వార్నింగ్ -
మెరుగుపడాల్సిందే: బుమ్రాతో పాటు వాళ్లకు గిల్ వార్నింగ్!
ఇంగ్లండ్తో నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. లార్డ్స్లో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ దారుణంగా విఫలమైంది. టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఇంగ్లండ్ రికార్డు స్థాయిలో 387 పరుగులు చేసింది.గాయాల వల్ల ఇద్దరూ దూరంలక్ష్య ఛేదనలో భారత్ 360 పరుగులకే పరిమితమై.. 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 2-1తో ఇంగ్లండ్ సొంతమైంది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా మ్యాచ్ ఆడలేకపోయాడు.గిల్ కీలక వ్యాఖ్యలుబుమ్రా, వాషీ స్థానాల్లో అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మూడో వన్డే ఆడారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందన్నాడు. ఈ మేరకు.. ‘‘ఒక ఆటగాడు గాయపడితే కూర్పు ఒకలా ఉంటుంది.ఒకరి కంటే ఎక్కువ మంది గాయపడితే జట్టు కాంబినేషన్లో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రతీ మ్యాచ్ తర్వాత ఒక ఆటగాడు గాయపడతున్నాడంటే మేము ఎక్కడో ట్రిక్ మిస్ అవుతున్నామని అనిపిస్తోంది.ఎక్కడో చోట తేడా కొడుతుందిప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము 11 మ్యాచ్లు వరుసగా ఆడాల్సి ఉంది. అయితే, తరచూ గాయాల బారిన పడే ఆటగాళ్లు ఈ సిరీస్లో రెండు లేదంటే మూడు మ్యాచ్లు మిస్ కావొచ్చు. ఇలా ఎక్కడో చోట తేడా కొడుతుంది. తరచూ గాయపడే ప్లేయర్ ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడతాడు.ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యల వల్ల దూరమవుతాడు. అలాంటి సమయంలో కొత్త ప్లేయర్ను ఆడించాల్సి ఉంటుంది. నిజానికి తుదిజట్టును తరచూ మార్చాలనే ఆలోచన మాకు లేదు. కానీ గాయాల వల్ల తప్పక ఇలా చేయాల్సి వస్తోంది.ఎప్పుడు ఎవరు గాయపడతారో తెలియదు. కొంతమంది 80 శాతం ఫిట్గా ఉన్నా సరే ఆడటానికి ముందుకు వస్తారు. అయితే, మేము ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే.. అందులో ఒకరు కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌల్ చేస్తామంటే కుదరదు కదా!మెరుగుపడాల్సిందేపూర్తి ఫిట్గా ఉంటేనే వారు పది ఓవర్లు బౌల్ చేయగలరు. కాబట్టి మేము రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఏదేమైనా జట్టుగా మేము ఫిట్నెస్ ప్రమాణాలను మరింతగా మెరుగపరచుకోవాల్సి ఉంది’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు. తరచూ గాయాలుకాగా పేస్ దళ నాయకుడు బుమ్రా తరచూ గాయపడుతున్న సంగతి తెలిసిందే. చాలా నెలల తర్వాత ఇంగ్లండ్తో తొలి వన్డే సందర్భంగా ఇటీవలే అతడు యాభై ఓవర్ల ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు. రెండు మ్యాచ్లు ఆడగానే.. మోకాలి గాయంతో కీలకమైన మూడో వన్డేకు దూరమయ్యాడు.అంతేకాదు బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో మేనేజ్మెంట్ అతడికి తరచూ విశ్రాంతినిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గిల్ ఒక రకంగా బుమ్రా ఫిట్నెస్ ప్రమాణాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ప్రస్తావన తేవడం ద్వారా ఈ పేస్ గుర్రానికి గిల్ పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా యూకే పర్యటనలో భాగంగా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. తాజాగా వన్డే సిరీస్నూ కోల్పోయి ఓటమితో నిష్క్రమించింది.చదవండి: వారి వల్లే ఓడిపోయాం.. అతడు అద్భుతం: గిల్ -
లార్డ్స్లో చరిత్ర తిరగరాసిన బెన్ డకెట్
భారత్తో మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ శతక్కొట్టాడు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ భారీ సెంచరీతో అలరించాడు. ఈ క్రమంలో క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానంలో డకెట్ చరిత్ర తిరగరాశాడు. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న 47 ఏళ్ల రికార్డును ఈ లెఫ్టాండ్ బ్యాటర్ బద్దలు కొట్టాడు.141 పరుగులులార్డ్స్ వేదికగా టీమిండియాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ బెన్ డకెట్ 135 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 141 పరుగులు సాధించాడు. అయితే, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇవ్వడంతో డకెట్ శతక ఇన్నింగ్స్ ముగిసిపోయింది.లార్డ్స్లో ప్రపంచ రికార్డుఅయితే, ఈ భారీ శతకం ద్వారా డకెట్ లార్డ్స్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ ‘మక్కా’లో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు వివియన్ రిచర్డ్స్ పేరిట ఉండేది. ఇక మ్యాచ్ విషయానికొస్తే..Nailed to the boundary!A superb hundred for Ben Duckett at Lord's 💯🤝 @IGcom pic.twitter.com/NwS3IH5tMJ— England Cricket (@englandcricket) July 19, 2026డకెట్ శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్ జేకబ్ బెతెల్ (91) సెంచరీ మిస్ అయ్యాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి బెతెల్ అవుటయ్యాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ జో రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. వన్డేల్లో వరుసగా ఆరో అర్ధ శతకం (48 బంతుల్లోనే 74 నాటౌట్) బాదాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుకెప్టెన్ హ్యారీ బ్రూక్ (14) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 315కు పైగా స్ట్రైక్రేటు నమోదు చేశాడు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 387 పరుగులు సాధించింది. లార్డ్స్లో వన్డేల్లో ఇదే హయ్యస్ట్ స్కోరు.లార్డ్స్ మైదానంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు👉బెన్ డకెట్ (ఇంగ్లండ్)- టీమిండియా మీద 2026లో 141 పరుగులు👉వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- ఇంగ్లండ్ మీద 1979 వరల్డ్కప్ ఫైనల్లో 138 నాటౌట్👉డెనిస్ ఆమిస్ (ఇంగ్లండ్)- టీమిండియా మీద 1975లో 137 పరుగులు👉మార్కస్ ట్రెస్కోతిక్ (ఇంగ్లండ్)- పాకిస్తాన్ మీద 2001లో 137 పరుగులు👉గ్రాహమ్ గూచ్ (ఇంగ్లండ్)- ఆస్ట్రేలియా మీద 1989లో 136 పరుగులు.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్- కోహ్లి -
IND vs ENG: ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు
టీమిండియాతో మూడో వన్డేలో ఇంగ్లండ్ టాపార్డర్ అదరగొట్టింది. ఓపెనర్లు బెన్ డకెట్, జేకబ్ బెతెల్.. వన్డౌన్ బ్యాటర్ జో రూట్ భారత బౌలింగ్ను చితక్కొట్టారు. వీరికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.Nailed to the boundary!A superb hundred for Ben Duckett at Lord's 💯🤝 @IGcom pic.twitter.com/NwS3IH5tMJ— England Cricket (@englandcricket) July 19, 2026ఈ క్రమంలో క్రికెట్ ‘మక్కా’గా పేరొందిన లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కాగా సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో డకెట్ భారీ శతకం (135 బంతుల్లో 141) సాధించగా.. బెతెల్ (93 బంతుల్లో 91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.Joe Root reaches 𝑨𝑵𝑶𝑻𝑯𝑬𝑹 ODI half-century 🤯🤝 @IGcom pic.twitter.com/a4G4KmkxKP— England Cricket (@englandcricket) July 19, 2026ఇక జో రూట్ వన్డేల్లో వరుసగా ఆరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 48 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (14) విఫలం కాగా బట్లర్ మెరుపులు మెరిపించాడు. కేవలం 13 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 41 పరుగులు రాబట్టాడు. రూట్తో కలిసి ఐదో వికెట్కు 19 బంతుల్లోనే 63 పరుగులు జోడించి అజేయంగా నిలిచాడు.Miss any of that? Don't worry, our catch-up highlights have the very best of that ridiculous first innings at Lord's 👇— England Cricket (@englandcricket) July 19, 2026ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. వన్డేల్లో ఇంగ్లండ్కు టీమిండియాపై ఇదే అత్యధిక స్కోరు. అంతేకాదు క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానంలో వన్డే ఫార్మాట్లో ఇదే హయ్యస్ట్ స్కోరు కావడం విశేషం. తద్వారా లార్డ్స్లో వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ తమ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తాజాగా సవరించింది.లార్డ్స్ మైదానంలో వన్డేల్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే👉ఇంగ్లండ్- 2026 జూలై 19న టీమిండియాపై 50 ఓవర్లలో 387/3👉ఇంగ్లండ్- 1975 జూన్ 7న టీమిండియాపై 60 ఓవర్లలో 334/4👉సౌతాఫ్రికా- 2025 సెప్టెంబరు 4న ఇంగ్లండ్పై 50 ఓవర్లలో 330/8👉ఇంగ్లండ్- 2017 మే 7న ఐర్లాండ్పై 50 ఓవర్లలో 328/6👉ఇండియా- 2002 జూలై 13న ఇంగ్లండ్పై 49.3 ఓవర్లలో 326/8. -
IND vs ENG: ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం.. ఇంగ్లండ్ స్కోరెంతంటే?
టీమిండియాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జేకబ్ బెతెల్ నిలకడగా ఆడుతూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 181 బంతుల్లో ఏకంగా 192 పరుగులు జోడించారు.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలవగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోఇరుజట్ల మధ్య ఆదివారం నాటిక నిర్ణయాత్మక మూడో వన్డేకు ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా మారింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.బెతెల్ సెంచరీ మిస్కాస్త నెమ్మదిగా ఆరంభించినప్పటికీ ఇంగ్లండ్ ఓపెనర్లు డకెట్, బెతెల్ నెమ్మదిగా క్రీజులో పాతుకుపోయారు. ఈ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో 93 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేశాడు బెతెల్.అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 31వ ఓవర్లో తొలి బంతికే ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇవ్వడంతో బెతెల్ అవుటయ్యాడు. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక నెమ్మదిగా ఆడుతూ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డకెట్.. 36వ ఓవర్లో రెండో బంతికి ఫోర్ బాది శతక మార్కు అందుకున్నాడు. మొత్తానికి 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.డకెట్ భారీ శతకంఆ తర్వాత కూడా డకెట్, రూట్తో కలిసి జోరు కొనసాగించాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్కు 80 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, 44వ ఓవర్లో మూడో బంతికి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇవ్వడంతో డకెట్ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 18 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 141 పరుగులు సాధించాడు.Nailed to the boundary!A superb hundred for Ben Duckett at Lord's 💯🤝 @IGcom pic.twitter.com/NwS3IH5tMJ— England Cricket (@englandcricket) July 19, 2026రూట్, బట్లర్ మెరుపులుఇక 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వన్డౌన్ బ్యాటర్ జో రూట్.. 48 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులు రాబట్టాడు. నాలుగో నంబర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (14) విఫలం కాగా.. ఐదో స్థానంలో వచ్చిన జోస్ బట్లర్ టీ20 తరహాలో దంచికొట్టాడు. కేవలం 13 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్స్లు బాది 41 పరుగులతో రూట్తో కలిసి అజేయంగా నిలిచాడు. రూట్, బట్లర్ కలిసి 19 బంతుల్లోనే 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 387 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. కాగా వన్డే ఫార్మాట్లో భారత్పై ఇంగ్లండ్కు ఇదే అత్యధిక స్కోరు. Joe Root reaches 𝑨𝑵𝑶𝑻𝑯𝑬𝑹 ODI half-century 🤯🤝 @IGcom pic.twitter.com/a4G4KmkxKP— England Cricket (@englandcricket) July 19, 2026భారత బౌలర్లు పూర్తిగా విఫలంనలుగురు సీమర్లు అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్తో బరిలోకి దిగిన టీమిండియా వ్యూహం బెడిసి కొట్టింది. గుర్నూర్ పది ఓవర్ల కోటాలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకోగా.. అర్ష్దీప్ తన కోటా పూర్తి చేసి 72 పరుగులు ఇచ్చుకున్నాడు.ఇక ప్రసిద్ కృష్ణ 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రిన్స్ యాదవ్ కోటా పూర్తి చేసి 79 రన్స్ ఇచ్చుకుని ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పది ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన రో-కో! -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా రో-కో ఈ ఫీట్ నమోదు చేశారు.అగ్రస్థానంలో ఎవరంటే?ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార్ సంగక్కర- మహేళ జయవర్ధనె కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచ్లలో భాగమయ్యారు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ లంక దిగ్గజాలే ఉండటం విశేషం. ఇక రోహిత్- కోహ్లి జోడీ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ 67 టెస్టులు, 159 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇప్పటికి 287 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇప్పటికి 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి సంయుక్తంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అదే విధంగా గతేడాది రోహిత్ టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పగా.. వారం రోజుల వ్యవధిలోనే కోహ్లి సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇద్దరూ ప్రస్తుతం వన్డే వరల్డ్కప్-2027లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీ20 సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైంది టీమిండియా. ఈ క్రమంలో వన్డే సిరీస్ను విజయంతో ఆరంభించిన భారత జట్టు.. రెండో వన్డేలో తడబడింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం కాగా.. లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేతో విజేత ఎవరో తేలుతుంది.ఇంగ్లండ్తో తొలి వన్డేలో రోహిత్ 11 పరుగులు చేయగా.. కోహ్లి 5 పరుగులకే అవుటయ్యాడు. ఇక రెండో వన్డేలో రోహిత్ 28 పరుగులు చేయగా.. కోహ్లి అర్ధ శతకం (65)తో అలరించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జోడీలు👉కుమార్ సంగక్కర- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 550 మ్యాచ్లు👉తిలకరత్నె దిల్షాన్- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 426 మ్యాచ్లు👉కుమార్ సంగక్కర- తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక): 418 మ్యాచ్లు👉సనత్ జయసూర్య- ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక): 408 మ్యాచ్లు👉జాక్వెస్ కలిస్- మార్క్ బుచర్ (సౌతాఫ్రికా): 407 మ్యాచ్లు👉రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి (ఇండియా): 400* మ్యాచ్లు.చదవండి: టీమిండియాకు భారీ షాక్! -
IND vs ENG: అందుకే అతడు బెంచ్కే పరిమితం: గిల్
ఇంగ్లండ్తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్కు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. రెండో వన్డే సందర్భంగా ఎడమ మోకాలు ఉబ్బిపోవడం వల్ల అతడు లార్డ్స్ మ్యాచ్కు దూరమయ్యాడని ప్రకటన విడుదల చేసింది.కుల్దీప్ను ఆడిస్తారనుకుంటే..ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో వన్డే సందర్భంగానే గాయపడ్డాడు. దీంతో అతడి స్థానాన్ని బీసీసీఐ హర్ష్ దూబేతో భర్తీ చేసింది. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే.. వాషీ దూరం కావడంతో.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో వన్డే ఆడతాడని అంతా భావించారు.కానీ యాజమాన్యం మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషీకి బదులు.. పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్కు తుదిజట్టులో చోటు ఇచ్చింది. దీంతో కుల్దీప్ యాదవ్కు మరోసారి అన్యాయం చేశారంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఈ విషయం గురించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘బుమ్రా మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. శివం దూబే కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదు.అందుకే అతడు బెంచ్కు పరిమితంఈ ముగ్గురి స్థానాల్లో కేఎల్ రాహుల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ తుదిజట్టులోకి వచ్చారు. మేము లార్డ్స్ మైదానంలో నలుగురు సీమర్లను ఆడించాలని నిర్ణయించుకున్నాము. ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఇక్కడ మధ్య ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపరు అనిపించింది’’ అని గిల్ పేర్కొన్నాడు. తద్వారా కుల్దీప్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని పరోక్షంగా వెల్లడించాడు.వైట్వాష్ల తర్వాత..కాగా యూకే పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో తలపడి.. ఆతిథ్య జట్టు చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. అనంతరం ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ అయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికి భారత్- ఇంగ్లండ్ చెరో వన్డే గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్ మైదానం ఆతిథ్యమిస్తుండగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో భారత్ నలుగురు పేసర్లు గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణను ఆడిస్తోంది.ఇంగ్లండ్తో మూడో వన్డేకు భారత తుదిజట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాకు భారీ షాక్! -
IND vs ENG: టీమిండియాకు భారీ షాక్!
ఇంగ్లండ్తో మూడో వన్డేకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు.. ‘‘కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. కాబట్టి మూడో వన్డే కోసం సెలక్షన్కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. అతడి ఎడమ మోకాలు ఉబ్బిపోయింది’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. రెండు వికెట్లుకాగా చాన్నాళ్ల తర్వాత బుమ్రా ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో పునరాగమనం చేశాడు. ఎడ్జ్బాస్టన్లో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1) రూపంలో కీలక వికెట్ తీసి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కార్డిఫ్ వేదికగా రెండో వన్డేలో బెన్ డకెట్ను డకౌట్ చేశాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే అతడు గాయపడినట్లు సమాచారం.ఇక ఇప్పటికే చెరో విజయంతో టీమిండియా- ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి ఆఖరి వన్డే కీలకంగా మారింది. అయితే, బుమ్రా గాయం కారణంగా ఈ నిర్ణయాత్మక మ్యాచ్కు దూరమయ్యాడు. కాగా బుమ్రా గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు.మూడు మార్పులుమరోవైపు.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో వన్డే సందర్భంగా గాయపడి.. మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్తో ఆఖరి వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్ తిరిగి రాగా.. శివం దూబేపై వేటు పడింది. బుమ్రా, వాషీ స్థానాల్లో అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు.మూడో వన్డేకు తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణఇంగ్లండ్బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.చదవండి: టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరిన టీమిండియా -
మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్దే
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(138), శుబ్మన్ గిల్(77), విరాట్ కోహ్లి వంటి టాపార్డర్ బ్యాటర్లు రాణించినప్పటికి, మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్, జాకబ్ బెతల్, ఆర్చర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (141), జేకబ్ బెతెల్ (91) దుమ్ములేపగా.. జో రూట్ (48 బంతుల్లో 74), జోస్ బట్లర్ (13 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు. ఓటమి దిశగా భారత్భారత్ వరుస ఓవర్లలో కేఎల్ రాహుల్(12), అక్షర్ పటేల్(2) వికెట్లను కోల్పోయింది. టీమిండియా విజయానికి 10 బంతుల్లో 47 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి అవుట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి 28 బంతుల్లో 73 పరుగులు కావాలి. క్రీజులో రాహుల్, అక్షర్ పటేల్ ఉన్నారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కిషన్.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అదే ఓవర్లో శ్రేయస్ అయ్యర్(0) డకౌటయ్యాడు. క్రీజులో కోహ్లి(65) ఉన్నారు. భారత విజయానికి 82 పరుగులు కావాలి.టీమిండియా ట్రిపుల్ సెంచరీటీమిండియా స్కోర్ 300 పరుగులు దాటింది. భారత విజయానికి 39 బంతుల్లో ఇంకా 84 పరుగులు కావాలి.రోహిత్ అవుట్రోహిత్ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. భారీ సెంచరీతో సత్తాచాటిన రోహిత్.. బెతల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138 పరుగులు చేశాడు. 39 ఓవర్లకు భారత్ స్కోర్: 262/2రోహిత్ సెంచరీలార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. కేవలం 84 బంతుల్లో తన 34వ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 33 ఓవర్లకు భారత్ స్కోర్: 218/1సెంచరీకి చేరువలో రోహిత్రోహిత్ శర్మ 92 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. 29 ఓవర్లకు భారత్ స్కోర్: 187/1భారత్ తొలి వికెట్ డౌన్147 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 77 పరుగులు చేసిన కెప్టెన్ శబ్మన్ గిల్.. అదిల్ రషీద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.రోహిత్ హాఫ్ సెంచరీరోహిత్ శర్మ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 21 ఓవర్లకు భారత్ స్కోర్: 117/0ఇరవై ఓవర్లలో భారత్ స్కోరు: 109-0రోహిత్ 42, గిల్ 65 పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి 279 పరుగులు కావాలి. సెంచరీ కొట్టిన టీమిండియా18.3: ఆదిల్ రషీద్ బౌలింగ్లో రోహిత్ సింగిల్ తీయడంతో.. టీమిండియా వంద పరుగుల మార్కును చేరుకుంది. భారత్ స్కోరు: 103-0 (19). గిల్ 60, రోహిత్ 41 పరుగులతో ఉన్నారు. విజయానికి 285 పరుగులు కావాలి.గిల్ అర్ధ శతకం14.3వ ఓవర్: ఆదిల్ రషీద్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. 54 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి. భారత్ స్కోరు: 89-0 (15). గిల్ 52, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-0గిల్ 49, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.టీమిండియా హాఫ్ సెంచరీ10.2: సామ్ కరన్ బౌలింగ్లో గిల్ సింగిల్ తీయగా.. టీమిండియా యాభై పరుగుల మార్కు పూర్తి చేసుకుంది. స్కోరు: 60-0(11). రోహిత్ 34, గిల్ 26 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో భారత్ స్కోరు: 49-0 (10)కట్టుదిట్టమైన బంతులతో పదో ఓవర్ను మెయిడెన్ చేసిన టంగ్.రోహిత్ శర్మ 24, గిల్ 25 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 40 ఓవర్లలో 339 పరుగులు కావాలి.గేరు మార్చిన రోహిత్ఎనిమిదో ఓవర్లో జోష్ టంగ్ బౌలింగ్లో తొలి రెండు బంతుల్లో ఫోర్లు బాదిన రోహిత్ శర్మ. పుల్ షాట్తో ఐదో బంతిని సిక్సర్గా మలిచిన హిట్మ్యాన్. భారత్ స్కోరు: 43-0 (8). రోహిత్ 23, గిల్ 20 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 17-0రోహిత్ మూడు, గిల్ 14 పరుగులతో ఉన్నారు.టార్గెట్ 388.. లక్ష్య ఛేదనకు దిగిన భారత్మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 9-0ఓపెనర్లు రోహిత్ ఒకటి , గిల్ ఎనిమిది పరుగులతో ఉన్నారు.ఇంగ్లండ్ భారీ స్కోరుఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. టీమిండియాకు 388 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా వన్డే ఫార్మాట్లో భారత్పై ఇంగ్లండ్కు ఇదే అత్యధిక స్కోరు. బట్లర్ మెరుపులు49 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 371-3బట్లర్ 10 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. రూట్ 65 పరుగులతో ఉన్నాడు.బ్రూక్ అవుట్46.5వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్ (14) మూడో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 324-3. రూట్ 55 పరుగులతో ఉన్నాడు. జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు.రూట్ హాఫ్ సెంచరీ45.3వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రూట్. 39 బంతుల్లోనే యాభై పరుగులు సాధించిన రూట్. వన్డేల్లో అతడికి ఇది వరుసగా ఆరో హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్ స్కోరు 315-2 (46). రూట్ 50, బ్రూక్ పది పరుగులతో ఉన్నారు.45 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 305-2హ్యారీ బ్రూక్ 5, రూట్ 45 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్43.3వ ఓవర్: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ శతక వీరుడు బెన్ డకెట్ రెండో వికెట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొన్న డకెట్ 18 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 141 పరుగులు చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. నలభై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 261-1డకెట్ 125 బంతుల్లో 127, రూట్ 22 బంతుల్లో 23 పరుగులతో ఉన్నారు.డకెట్ సెంచరీ35.2వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్. 108 బంతుల్లో శతక మార్కు అందుకున్న డకెట్. 36 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోరు: 226-1(36). డకెట్ 102, రూట్ 13 పరుగులతో ఉన్నారు.200 పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్33 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 206-1.డకెట్ 90, రూట్ ఐదు పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. సెంచరీ మిస్30.1వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన బెతెల్ (93 బంతుల్లో 91). ఆద్యంతం నిలకడగా ఆడి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు.ఇంగ్లండ్ ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యంముప్పై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 192-0. టీమిండియాపై ఇంగ్లండ్కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. బెతెల్ 91, డకెట్ 81 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 180 బంతుల్లో 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.25 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 163-0బెతెల్ 79, డకెట్ 65 పరుగులతో ఉన్నారు. లార్డ్స్ మైదానంలో వన్డేల్లో తొలి వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం (163).డకెట్ ఫిఫ్టీ21.3: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి.. యాభై పరుగుల మార్కు అందుకున్న డకెట్. 64 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన డకెట్. ఇంగ్లండ్ స్కోరు: 136- 0 (21.5)20 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 125-0బెతెల్ 61, డకెట్ 46 పరుగులతో ఉన్నారు.బెతెల్ అర్ధ శతకం15.4వ ఓవర్: అర్ష్దీప్ బౌలింగ్లో ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ బెతెల్. ఇంగ్లండ్ స్కోరు: 101-0(16). బెతెల్ 53, డకెట్ 34 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 96-0(15)బెతెల్ 48, డకెట్ 34 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 58-0(10)బెతెల్ 25, డకెట్ 22 పరుగులతో ఉన్నారు.హాఫ్ సెంచరీ కొట్టిన ఇంగ్లండ్బెతెల్ 23, డకెట్ 18 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు: 51-0 (8.1).నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లుఅర్ష్దీప్ సింగ్ టీమిండియా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జేకబ్ బెతెల్ నిలకడగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 31-0. డకెట్ 15, బెతెల్ 14 పరుగులతో ఉన్నారు.భారత్కు ఎదురుదెబ్బభారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టాస్ సమయంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం వల్ల దూరం కాగా.. భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది.కేఎల్ రాహుల్ తిరిగి రాగా శివం దూబే బెంచ్కే పరిమితం కాగా.. బుమ్రా స్థానంలో అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. వాషీకి బదులు ప్రిన్స్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.దిగ్గజానికి నివాళిగ్యారీ సోబర్స్కు నివాళిగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్లతో బరిలోకి దిగారు.గంట మోగించిన యువీలార్డ్స్ మ్యాచ్కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గంట మోగించి మ్యాచ్ను ఆరంభించాడు.Yuvraj Singh rings the iconic Lord's Bell to signal the start of the series decider. 🔔 Watch #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/OcQ6C2e7du— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణఇంగ్లండ్బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్. -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
సిరీస్ విజయంపై గురి.. లార్డ్స్లో టీమిండియాకు ఘన చరిత్ర!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భాగంగా టీమిండియా తమ చివరి వన్డేను ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-1తో కైవసం చేసుకోవాలని గిల్ సేన భావిస్తోంది. మరి లార్డ్స్ గడ్డపై టీమిండియా రికార్డు ఎలా ఉంది, ఎన్ని మ్యాచ్లు ఆడింది? గెలిచినవెన్నీ, ఓడినవెన్ని అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. లార్డ్స్లో భారత జట్టు అంతర్జాతీయంగా 31 మ్యాచ్లు (అన్ని ఫార్మాట్లు) ఆడితే ఏడు గెలిచి 19 ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా, 14 డ్రాగా ముగిశాయి. లార్డ్స్ వేదికలో భారత్ ఓవరాల్ విన్నింగ్ శాతం 22.58 పర్సంటైల్గా ఉంది. వన్డేల్లో మాత్రం టీమిండియాకు లార్డ్స్ వేదికలో మంచి రికార్డే ఉంది. ఓవరాల్గా లార్డ్స్లో ఏడు గెలిస్తే అందులో మూడు వన్డేల నుంచే రావడం విశేషం. మొత్తంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య 8 వన్డేలు జరిగితే టీమిండియా మూడు, ఇంగ్లండ్ నాలుగు చొప్పున గెలిచాయి. ఒక మ్యాచ్ టై అయింది. వన్డేల్లో లార్డ్స్ వేదికలో భారత విజయాల శాతం 37.5 పర్సంటైల్గా ఉంది. ఈ వేదికలో 2022, జూలై 14న భారత్, ఇంగ్లండ్ చివరిసారిగా వన్డే ఆడాయి.ఈ వన్డేలో టీమిండియా 100 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మోయిన్ అలీ 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, డేవిడ్ విల్లే 41 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో పూర్తిగా తడబడిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. పాండ్యా, జడేజా చెరో 29 పరుగులు చేశారు. మ్యాచ్లో రీస్ టోప్లే ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు.లార్డ్స్ వేదికపై జరిగిన వన్డేలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సౌరవ్ గంగూలీ (208 పరుగులు) తొలి స్థానంలో ఉండగా, యువరాజ్ సింగ్ (170) రెండు, ఎంఎస్ ధోని (165) మూడు, రాహుల్ ద్రవిడ్ (149), సురేశ్ రైనా (130)లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే చాహల్, ఆర్పీ సింగ్ ఐదేసి వికెట్లతో తొలి స్థానంలో ఉండగా, మొహిందర్ అమర్నాథ్, జహీర్ ఖాన్, మదన్లాల్లు తలా 4 వికెట్లు పడగొట్టారు.చదవండి: ఫిఫా ఫైనల్ ఆఖరిదా?.. రిటైర్మెంట్పై మెస్సీ స్పందన! -
IND vs ENG: వాషీ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
ఇంగ్లండ్తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్కు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో హర్ష్ దూబేను ఎంపిక చేసినట్లు శనివారం ప్రకటించింది. కాగా మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్- భారత్ చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. అర్ధ శతకాలతో రాణించితొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (80)తో కలిసి ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ (52), వాషింగ్టన్ సుందర్ (57 )జట్టును గెలిపించారు. ఇద్దరూ అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో వాషీ సిక్సర్ బాది విజయ లాంఛనం పూర్తి చేశాడు.గాయపడ్డ వాషీఅయితే, రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్ పరంగా అక్షర్ (1)తో పాటు వాషీ (2) పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా వాషీ గాయపడ్డాడు. అతడి చీలమండకు గాయమైంది. దీంతో అతడు బౌలింగ్కు రాలేదు. తాజా సమాచారం ప్రకారం అతడి గాయం తీవ్రమైనట్లు తెలుస్తోంది.జట్టులోకి హర్ష్ దూబేఈ నేపథ్యంలోనే వాషీ స్థానంలో యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబేను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా మహారాష్ట్రకు చెందిన హర్ష్ దూబే.. ఇటీవల అఫ్గానిస్తాన్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి రెండు వన్డేలు ఆడిన లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ ప్లేయర్.. నాలుగు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్ వేదిక.చదవండి: IND vs ENG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! -
‘బాధ ఎందుకు? అతడి వీడ్కోలు వేడుకలా జరపాల్సిందే!’
ఇంగ్లండ్తో ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు ఆఖరిదని, ఆ తర్వాత అతడు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని, జట్టులో కొనసాగినంతకాలం రోహిత్ శర్మ టీమిండియాకు ఆడుతాడని, అతడి రిటైర్మెంట్ ఇప్పుడే ఉండదని పేర్కొంటూ ఊహాగానాలకు తెరదించాడు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై భారత దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలికినా అతడి రిటైర్మెంట్ను ఒక వేడుకలా సెలబ్రేట్ చేయాలని బీసీసీఐకి సూచించారు. 19 ఏళ్ల కెరీర్లో కెప్టెన్గా, ప్లేయర్గా ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్న రోహిత్ శర్మకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరముందన్నారు. రిటైర్మెంట్ అనేది క్రికెటర్లకు కామన్ అని, దాని గురించి బాధపడొద్దని, ఆ ప్రక్రియను ఒక వేడుకలా జరుపుకోవాలని కపిల్ హితవు పలికారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘రిటైర్మెంట్ అనే పదం వినగానే ఎందుకు బాధపడాలి. సమయం వచ్చింది కాబట్టే అంతా రోహిత్ వీడ్కోలు గురించి మాట్లాడుకుంటున్నారు. 19 ఏళ్లుగా రోహిత్ తన ఆటతో ఎంతో సంతోషాన్ని పంచాడు. ఏదోఒక రోజు అందరూ రిటైర్ అవ్వాల్సిందే. నాతో పాటు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఇలా అందరం ఆటకు వీడ్కోలు పలికినవాళ్లమే. ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్కు సమయం వచ్చినప్పుడు మనమంతా దానిని ఒక వేడుకగా జరుపుకోవాలి. రోహిత్ వీడ్కోలు ఎప్పుడు పలికినా ఆ మ్యాచ్లో మాత్రం సెంచరీ సాధించాలని బలంగా కోరుకుంటున్నా.’ అని కపిల్ దేవ్ తెలిపారు.ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ ఆడిన రెండు వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంతకముందు అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 16, 48, 79 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి. Greater Noida, Uttar Pradesh: When asked about speculation that this match at Lord's could be Rohit Sharma's last ODI, Former Indian cricket team captain and President of PGTI, Kapil Dev says, "... He has entertained the nation immensely, something very few players have… pic.twitter.com/ytrOdnUipk— IANS (@ians_india) July 18, 2026Read: వరుస ఓటములు.. విండీస్ జట్టులో భారీ మార్పులు! -
IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
వన్డే సిరీస్లో ఇప్పటికి చెరో మ్యాచ్ గెలిచి టీమిండియా- ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్లో గిల్ సేన గెలవగా.. కార్డిఫ్లో గురువారం జరిగిన మ్యాచ్లో బ్రూక్ బృందం జయభేరి మోగించింది. రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగి 44 ఓవర్లలోనే ఆలౌట్ అయింది.99 పరుగులతో అజేయంగావన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (65), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (66) అర్ధ శతకాల కారణంగా.. 233 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్లు బెన్ డకెట్ (0), జేకబ్ బెతెల్ (4) వికెట్లు కోల్పోయినా.. జో రూట్ ఒంటిచేతో జట్టును గెలిపించాడు.మూడో స్థానంలో ఆడిన రూట్.. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఆదివారం లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది.అతడిని తొందరగా అవుట్ చేయాలిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ కీలక సూచనలు చేశాడు. రూట్ను ఎంత త్వరగా అవుట్ చేశామన్న అంశం మీదే భారత జట్టు విజయం ఆధారపడి ఉంటుందన్నాడు. ఈ క్రమంలో భారత తుదిజట్టులో పలు మార్పులు సూచించాడు.స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘జో రూట్ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలి. అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరం. కాబట్టి కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదు. లేదంటే.. శివం దూబే స్థానంలో ప్రిన్స్ యాదవ్ను ఆడించవచ్చు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.అయ్యర్ నాలుగు.. రాహుల్ ఐదో స్థానంలోఇక తాను ఎంపిక చేసుకున్న తుదిజట్టులో అభిషేక్ నాయర్ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లకు చోటిచ్చాడు. అయితే, శ్రేయస్ అయ్యర్ రెగ్యులర్గా వచ్చే నాలుగో స్థానంలోనే రావాలని.. రెండో వన్డేలో మాదిరి ఇషాన్ కోసం అతడిని డిమోట్ చేయవద్దన్నాడు.అదే విధంగా కేఎల్ రాహుల్ను ఐదో స్థానంలో ఆడించి.. ఇషాన్ను ఆరో నంబర్ బ్యాటర్గా పంపాలని అభిషేక్ నాయర్ సూచించాడు. కాగా అనారోగ్యం కారణంగా కేఎల్ రాహుల్ రెండో వన్డేకు దూరంకాగా ఇషాన్ కిషన్ తుదిజట్టులోకి వచ్చాడు.నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్.. ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో వచ్చి అర్ధ శతకం బాదాడు. ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్లో తొలిసారి ఆడే అవకాశం ఉంది.ఇంగ్లండ్తో మూడో వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్/ప్రిన్స్ యాదవ్.చదవండి: విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం! -
ఏం తప్పు చేశాడని.. అతడిని పక్కనపెడుతున్నారు?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి విషయంలో యాజమాన్యం వైఖరి అస్సలు బాగాలేదని విమర్శించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పేస్ విభాగం నుంచి ఎవరినైనా తప్పించాలంటే సెలక్టర్లు ముందుగా అతడిపైనే వేటు వేస్తారన్నాడు.అవకాశం వస్తే ఇరగదీస్తాడుఅయితే, ఒక్కసారి అవకాశం దొరికితే సిరాజ్ తనను తాను నిరూపించుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. కాగా 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు సిరాజ్. ఈ హైదరాబాదీ స్టార్ ఇప్పటికి 46 టెస్టులు, 50 వన్డేలు, 17 టీ20 మ్యాచ్లు ఆడాడు.ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్ ఇప్పటికి టెస్టుల్లో 140, వన్డేల్లో 76, టీ20 మ్యాచ్లలో 17 వికెట్లు కూల్చాడు. ఇక ఈ ఏడాది సొంతగడ్డపై జనవరిలో న్యూజిలాండ్తో చివరగా వన్డే మ్యాచ్ ఆడిన సిరాజ్.. ప్రపంచకప్ టోర్నీ-2026లో భాగంగా అమెరికాతో ఆఖరిగా టీమిండియా తరఫున టీ20 బరిలో దిగాడు.వన్డే జట్టులో దక్కని చోటుఅదే విధంగా అఫ్గానిస్తాన్ జూన్లో జరిగిన ఏకైక టెస్టులో పాల్గొన్న సిరాజ్కు.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. అయితే, ఇంగ్లండ్తో వన్డేలకు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. సిరాజ్కు బదులు ప్రసిద్ కృష్ణకు టీ20, వన్డేలలో అవకాశం ఇచ్చారు.సైలెంట్గా పక్కన పెట్టేస్తున్నారుఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సిరాజ్ విషయంలో మేనేజ్మెంట్ ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తోందని విమర్శించాడు. ‘‘అతడిని సైలెంట్గా పక్కన పెట్టేస్తున్నారు. బంతి పాతబడే కొద్దీ ప్రభావం చూపలేడంటూ వన్డేల నుంచి మెల్లమెల్లిగా అతడిని పక్కనపెట్టారు.ఇక టీ20 ఫార్మాట్కు కూడా చాలాకాలం దూరంగా ఉంచారు. కానీ వరల్డ్కప్ జట్టులో మాత్రం చోటిచ్చారు. అలా తుదిజట్టులోకి వచ్చిన తొలిరోజే అతడు మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచేలా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ టోర్నీలో ఆడించలేదు.అయితే, ఇప్పుడు అతడిని వన్డేల నుంచి పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. నిజానికి అతడి విషయంలో మేనేజ్మెంట్కు స్పష్టత లేనట్లు అనిపిస్తోంది. ఎప్పుడైనా వన్డే, టీ20 జట్ల పేస్ విభాగం నుంచి ఓ బౌలర్ను పక్కనపెట్టాలనుకుంటే ముందుగా అతడినే తప్పిస్తారు.వన్డే వరల్డ్కప్ జట్టులో అతడు ఉంటాడుఅయితే, మున్ముందు అతడి అవసరం కచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. అతడిని మీరు ఎక్కువకాలం పక్కనపెట్టలేరు. ఎందుకంటే టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో తరచూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒక రకంగా గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. కాబట్టి సిరాజ్ కచ్చితంగా వన్డే జట్టులోకి వస్తాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్ జట్టులో అతడు ఉంటాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో బీసీసీఐ అతడికి ఎక్కువగా విశ్రాంతినిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ సందర్భంగా గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశారు. ప్రసిద్ కృష్ణకు కూడా అవకాశం దొరికింది. అయితే, సిరాజ్ను మాత్రం ఎక్కువగా టెస్టులకే పరిమితం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం -
బద్దలు కొట్టలేని రోహిత్ శర్మ రికార్డులు ఇవే..!
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే, భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వన్డే బ్యాటర్ శకం ముగిసినట్లే. ఈ సందర్భంగా చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా నిలిచే అతని అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి 513 మ్యాచ్ల్లో 657 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మరే బ్యాటర్ ఇప్పటివరకు ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 553 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలువన్డేల్లో ఒక డబుల్ సెంచరీ చేయడమే గొప్ప ఘనతగా భావిస్తారు. అలాంటిది రోహిత్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 2013లో ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264, 2017లో శ్రీలంకపైనే అజేయంగా 208 పరుగులు చేశాడు. ఇప్పటివరకు మరే బ్యాటర్ రెండు డబుల్ సెంచరీలు కూడా నమోదు చేయలేదు.వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు2014లో కోల్కతాలో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఇప్పటికీ వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతోంది. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.ఒకే ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు2019 ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకపై శతకాలు నమోదు చేసి ఒకే ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ టోర్నీలో మొత్తం 648 పరుగులతో టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు.ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలుప్రపంచకప్ల్లో రోహిత్ ఇప్పటివరకు ఏడు సెంచరీలు సాధించాడు. డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ తలో ఆరు సెంచరీలతో అతని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.వన్డేల్లో అత్యధిక 150+ స్కోర్లువన్డేల్లో 150కు పైగా ఎనిమిది ఇన్నింగ్స్లు ఆడిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. వీటిలో మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ ఏడు 150+ స్కోర్లతో రెండో స్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ తలో ఐదు సార్లు ఈ ఘనత సాధించారు.ఈ గణాంకాలు చూస్తే రోహిత్ శర్మ పేరు మీద ఉన్న కొన్ని రికార్డులను సమీప భవిష్యత్తులో బద్దలు కొట్టడం అత్యంత కష్టమనే విషయం స్పష్టమవుతోంది. రోహిత్ పేరిట లిఖించిబడిన ఈ రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. -
కోహ్లిని అధిగమించిన రూట్
ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఓ రికార్డుకు సంబంధించి టీమిండియా దిగ్గజ బ్యాటర్, ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లిని అధిగమించాడు. నిన్న భారత్తో జరిగిన రెండో వన్డేలో అజేయంగా 99 పరుగులు చేసి తన జట్టుకు నాలుగు వికెట్ల విజయాన్ని అందించిన అతడు.. విజయవంతమైన వన్డే లక్ష్యఛేదనల్లో 2000కుపైగా పరుగులు చేసి, అత్యధిక సగటు కలిగిన బ్యాటర్ల జాబితాలో కోహ్లిని వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. విజయవంతమైన వన్డే ఛేజింగ్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్లు (కనీసం 2000 పరుగులు)ఎంఎస్ ధోని- 75 ఇన్నింగ్స్ల్లో 2876 పరుగులు- సగటు 102.71జో రూట్- 47 ఇన్నింగ్స్ల్లో 2473 పరుగులు- సగటు 91.59విరాట్ కోహ్లి- 105 ఇన్నింగ్స్ల్లో 6235 పరుగులు- సగటు 89.07మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (65), శ్రేయస్ (66) రాణించడంతో 233 పరుగులు చేసింది. అనంతరం 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా, రూట్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ హ్యారీ బ్రూక్, సామ్ కరన్, జోస్ బట్లర్, విల్ జాక్స్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు.99 నాటౌట్తో అరుదైన ఘనత45వ ఓవర్ తొలి బంతికే గస్ అట్కిన్సన్ విజయం సాధించే బౌండరీ కొట్టడంతో రూట్కు మరో బంతి ఆడే అవకాశం రాలేదు. దీంతో అతను 99 పరుగుల వద్ద అజేయంగా నిలిచిపోయాడు. వన్డే చరిత్రలో 99 నాటౌట్తో అజేయంగా నిలిచిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా రూట్ ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు. అలాగే భారత్పై 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్గా నిలిచాడు.సెంచరీ మిస్పై స్పందనసెంచరీ చేజారినప్పటికీ తనకు ఎలాంటి నిరాశ లేదని జో రూట్ తెలిపాడు. వ్యక్తిగత మైలురాయి కంటే జట్టు విజయం ముఖ్యమని, అందుకే గస్ అట్కిన్సన్ను స్వేచ్ఛగా షాట్లు ఆడమని తానే ప్రోత్సహించినట్లు వెల్లడించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 1-1తో సమం చేయగా, నిర్ణయాత్మక మూడో వన్డే జూలై 19న లార్డ్స్లో జరగనుంది. -
రోహిత్ భవితవ్యంపై టీమిండియా కోచ్ స్పందన!
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ అతడి భవితవ్యంపై టీమిండియా మేనేజ్మెంట్ తొలిసారి స్పందించింది. 2027 వన్డే ప్రపంచకప్కు సంబంధించి ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్ను తప్పించినట్లు బీసీసీఐ ఇప్పటికే హిట్మ్యాన్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. లార్డ్స్ వన్డే రోహిత్ కెరీర్లో చివరిదని ప్రచారం నడుస్తోన్న వేళ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ రిటైర్మెంట్పై సమాధానాన్ని దాటవేసిన సితాన్షు అతడి పేలవ బ్యాటింగ్ ప్రదర్శనపై మాత్రం స్పందించాడు. రోహిత్ శర్మపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.అతడు పెద్ద ప్లేయర్ అని... అలాంటోడు భారత జట్టుకు అవసరమని పేర్కొన్నారు. రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్, యశస్వి జైష్వాల్ లకు ఓపెనర్ గా అవకాశాలు ఇస్తారా ? అని మీడియా అడిగిన ప్రశ్నలకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సమాధానం ఇచ్చారు. వరుసగా రెండు వన్డేల్లో విఫలమైనంత మాత్రానా రోహిత్ ఆటను జడ్జ్ చేయలేమని కుండబద్దలు కొట్టారు. నిజానికి రోహిత్ శర్మ ఒక టాప్ క్లాస్ ఆటగాడని కితాబిచ్చాడు. హిట్మ్యాన్ ఒకసారి టచ్ లోకి వచ్చాడంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. ఇది ఇలా ఉండగా లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ శర్మకు చివరిది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ భాగంగా జట్టులో కూడా రోహిత్ శర్మ లేడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్మెంట్పై ప్రశ్న వేయగా.. దీనికి మాత్రం సితాన్షు కోటక్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం ఆసక్తి కలిగించింది.పేలవ ప్రదర్శన39 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తాను ఫిట్గా ఉండేదుకు 10 కిలోల బరువు కూడా తగ్గాడు. ఫిట్నెస్ నిరూపించుకున్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం వరుసగా విఫలమవుతూనే వస్తున్నాడు. స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో మూడు వన్డేలు కలిపి 143 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. తొలి వన్డేలో 69 బంతుల్లో 79 పరుగులు చేసిన రోహిత్ రెండు, మూడు వన్డేల్లో వరుసగా 48, 16 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్తో సిరీస్లో వరుసగా రెండు వన్డేల్లో 11, 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.Batting coach Sitanshu Kotak has thrown his weight behind Rohit Sharma despite a slow start to the series for the former skipper 🗣️#ENGvIND pic.twitter.com/VuNEOojFDP— Cricbuzz (@cricbuzz) July 17, 2026Read: ‘రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై కోహ్లి రియాక్షన్!’ -
కోహ్లి, శ్రేయస్ రాణించినా.. స్వల్ప స్కోర్కే టీమిండియా ఆలౌట్
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (65), శ్రేయస్ అయ్యర్ (66) రాణించడంతో భారత్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓ దశలో (178-3) భారీ స్కోర్ చేసేలా కనిపించిన భారత్.. విరాట్ కోహ్లి ఔటయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ క్రీజ్లో పాతుకుపోయినప్పటికీ.. అతడికి ఎవరు పెద్దగా సహకరించలేదు. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 230 పరుగుల మార్కును తాకగలిగింది. అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్లో బుమ్రా 3 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.అంతకుముందు భారత ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ (26), శుభ్మన్ గిల్ (31) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచారు. గత మ్యాచ్లో అద్భుత అర్ద శతకాలతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1) ఈ మ్యాచ్లో చేతెల్తేశారు. విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యారు. జోఫ్రా ఆర్చర్ వరుస బంతుల్లో అక్షర్, దూబేలను ఔట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే గుర్నూర్ బ్రార్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ప్రసిద్ద్ కృష్ణ (0) ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్ మహమూద్ 2, సామ్ కర్రన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అరుదైన మైలురాయిని తాకిన రో-కో
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా మరో ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఇద్దరు 8000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత జోడీగా, ఓవరాల్గా తొమ్మిదో జోడీగా రికార్డుల్లోకెక్కారు.వీరికి ముందు భారత్ తరఫున గంగూలీ-టెండూల్కర్ (12400), ద్రవిడ్-టెండూల్కర్(11037) ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు శ్రీలంక స్టార్ ద్వయం మహేళ జయవర్దనే-కుమార సంగక్కర (13368) పేరిట ఉంది.కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో రో-కో జోడీ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. గిల్ (31), రోహిత్ (26), ఇషాన్ కిషన్ (1) ఔట్ కాగా.. విరాట్ (65), శ్రేయస్ (33) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్, అట్కిన్సన్, జాక్స్ తలో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డు
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు.కార్డిఫ్ వేదికగా ఆతిథ్య జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ ద్రవిడ్ (2645) పేరిట ఉన్న రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1996 నుంచి 2011 వరకు ద్రవిడ్ ఇంగ్లండ్లో 46 మ్యాచ్ల్లో 2645 పరుగులు చేయగా.. కోహ్లి 59 మ్యాచ్ల్లో ద్రవిడ్ రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్ (2646*), ద్రవిడ్ తర్వాతి స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (2626), రోహిత్ శర్మ (2308*), సౌరవ్ గంగూలీ (1949) ఉన్నారు.రిచర్డ్స్ రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు..!ఓవరాల్గా ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్గా వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ కొనసాగుతున్నాడు. 1975 నుంచి 1991 మధ్య అతడు 3402 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. గిల్ (31), రోహిత్ (26), ఇషాన్ కిషన్ (1) ఔట్ కాగా.. విరాట్ (45), శ్రేయస్ (6) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్, అట్కిన్సన్, జాక్స్ తలో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
రెండో వన్డేలో భారత్ ఓటమి
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినప్పటికి, సీనియర్ బ్యాటర్ జోరూట్(133 బంతుల్లో 99 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన విల్ జాక్స్.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.విజయం దిశగా ఇంగ్లండ్కార్డిఫ్ వన్డేలో ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకుపోతుంది. 39 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 191-5. జోట్ రూట్ 87 పరుగులతో బ్యాటింగ్ కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్జోస్ బట్లర్(17) రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో బట్లర్ క్లీన్ బౌల్డయ్యాడు. 30 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 148/5. క్రీజులో జో రూట్(69), విల్ జాక్స్(4) ఉన్నారు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్సామ్ కుర్రాన్(26) రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో కుర్రాన్ ఔటయ్యాడు. ఇంగ్లండ్ విజయానికి 140 పరుగులు కావాలి. క్రీజులో జో రూట్(40), జోస్ బట్లర్(0) ఉన్నారు.ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్53 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన కెప్టెన్ హ్యారీ బ్రూక్.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.కష్టాల్లో ఇంగ్లండ్234 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. 8 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డకెట్ డకౌట్ కాగా.. బేతెల్ 4 పరుగులకు ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరారు.తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్234 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి డకెట్ ఔటయ్యాడు. 233 పరుగులకు ఆలౌటైన భారత్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (65), శ్రేయస్ అయ్యర్ (66) రాణించడంతో భారత్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 230 పరుగుల మార్కును తాకగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్ మహమూద్ 2, సామ్ కర్రన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు.వరుస బంతుల్లో అక్షర్, దూబే ఔట్36వ ఓవర్లో భారత్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతికి అక్షర్ పటేల్ (1), దూబే (0) ఔటయ్యారు. దీంతో భారత్ 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.5 వికెట్లు కోల్పోయిన టీమిండియా32.4వ ఓవర్- 181 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. సాకిబ్ మహమూద్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి సుందర్ (2) ఔటయ్యాడు. కోహ్లి (65) ఔట్31.4వ ఓవర్- 178 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (65) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన భారత్20.3వ ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (1) ఔటయ్యాడు. రోహిత్ ఔట్17.5వ ఓవర్- 104 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (26) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్7.4వ ఓవర్- 44 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అట్కిన్సన్ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (31) ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న రోహిత్, గిల్భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (9), శుభ్మన్ గిల్ (19) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 30-0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కార్డిఫ్ వేదికగా భారత్తో జరుగనున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్ స్వల్ప అస్వస్థతకు లోను కావడంతో, అతడి స్థానంలో ఇషాన్ కిషన్ను బరిలోకి దించారు. ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆ జట్టు రెండు మార్పులు చేసింది. టంగ్, డాసన్ స్థానాల్లో సాకిబ్ మహమూద్, అట్కిన్సన్ జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.తుది జట్టు..భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ -
గుర్నూర్ బ్రార్పై క్రమశిక్షణ చర్యలు
ఇంగ్లండ్తో రెండో వన్డేకు ముందు భారత యువ ఫాస్ట్ బౌలర్ గర్నూర్ బ్రార్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తొలి వన్డేలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బ్రార్కు ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తూ, అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది.ఏం జరిగిందంటే..?ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ గర్నూర్ బ్రార్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతిని ఫాలోత్రూ సమయంలో అందుకున్న బ్రార్, ఆవేశంతో డకెట్ వైపు వేగంగా విసిరాడు. డకెట్ అప్రమత్తంగా తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.ఈ ఘటనను పరిశీలించిన మ్యాచ్ రిఫరీ, బ్రార్ చర్యను ప్రమాదకరంగా పరిగణించి ఐసీసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. బ్రార్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినట్లు తెలిపారు. ఈ నిబంధన ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్లో ఆటగాడిపై లేదా అతడి సమీపంలో ప్రమాదకరంగా బంతిని విసరడం క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తారు.బ్రార్ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా కేసును ముగించారు. ఈ ఘటనకు సంబంధించి బ్రార్పై ఆర్థిక జరిమానా విధించలేదు. అయితే అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ నమోదు చేయడంతో పాటు అధికారిక హెచ్చరిక జారీ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో బ్రార్కు ఇదే తొలి క్రమశిక్షణా ఉల్లంఘనగా నమోదైంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపోంది, 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్లో అక్షర్ పటేల్ (4-62), బ్రార్ (2-61), ప్రసిద్ద్ (2-50), బుమ్రా (1-31).. బ్యాటింగ్లో గిల్ (80), సుందర్ (52 నాటౌట్), అక్షర్ (57 నాటౌట్) సత్తా చాటి భారత్ను గెలిపించారు. -
IND vs ENG: అతడు గొప్పగా ఏమీ బౌలింగ్ చేయలేదు.. కానీ
ఇంగ్లండ్తో తొలి వన్డేలో గెలుపొందిన టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య గురువారం నాటి రెండో వన్డేకు కార్డిఫ్ వేదికకాగా.. ఇక్కడా గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో టీమిండియా సీమ్ విభాగం గురించి.. ముఖ్యంగా గుర్నూర్ బ్రార్ గురించి భారత మాజీ కోచ్ అభిషేక్ నాయర్ కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి వన్డేలో ఆకట్టుకున్నాడు.డకెట్ అవుట్ కాకపోయి ఉంటే..నిజానికి తను మొదటి ఓవర్లో కాస్త ఎక్కువగానే పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత దూకుడు ప్రదర్శిస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. ముఖ్యంగా బెన్ డకెట్ క్రీజులోకి పాతుకుపోయినపుడు.. గుర్నూర్ తన మొమెంటమ్ను మార్చి ఎట్టకేలకు వికెట్ పడగొట్టాడు.ఒకవేళ గుర్నూర్ గనుక డకెట్ను అవుట్ చేయకపోయినా.. అతడు ఇంకో నాలుగు నుంచి ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. మ్యాచ్ ఫలితం కచ్చితంగా వేరుగానే ఉండేది. డకెట్తో పాటు మరో ఓపెనర్, డేంజరస్ బ్యాటర్ జేకబ్ బెతెల్ను అవుట్ చేసి గుర్నూర్ మంచి బ్రేక్ ఇచ్చాడు.గొప్పగా ఏమీ బౌలింగ్ చేయలేదు..కానీఅయితే, ఈ రెండు వికెట్ల కోసం గుర్నూర్ అంత గొప్పగా ఏమీ బౌలింగ్ చేయలేదు. అయితే, ఆ సమయంలో అతడు చూపిన ఆత్మవిశ్వాసం గొప్పది. ఎలాగైనా వికెట్ తీయాలనే కసి మీద ఉన్నాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టి అనుకున్నది సాధించాడు’’ అని అభిషేక్ నాయర్ ప్రశంసించాడు.ప్రసిద్ కూడా సూపర్కాగా ఈ మ్యాచ్లో రైటార్మ్ పేసర్ గుర్నూర్ బ్రార్ తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. ఇక ప్రసిద్ కృష్ణ గురించి అభిషేక్ నాయర్ ప్రస్తావిస్తూ.. ‘‘వన్డే ఫార్మాట్లో అతడొక అసాధారణమైన బౌలర్. అఫ్గనిస్తాతో మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ గడ్డ మీదా రాణించాడు’’ అని కొనియాడాడు.ఇంగ్లండ్తో తొలి వన్డేలో ప్రసిద్ 10 ఓవర్ల కోటా పూర్తి చేసి 50 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ను 258 పరుగులకు కట్టడి చేసిన భారత్.. 45.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఇంగ్లండ్ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. అంతకుముందు టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది.చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్పై వివాదం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్పై వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలం ఉపయోగించాడని ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.సోషల్మీడియా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఓ జర్నలిస్టు భారత జట్టు బస్సు బయలుదేరే దృశ్యాలను (కోహ్లి బస్సులోకి ఎక్కుతుండగా) అధికారిక మీడియా పాయింట్లో నిలబడి చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్ అక్కడికి వచ్చి సదరు జర్నలిస్టును అక్కడి నుంచి వెళ్లిపోవాలని తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.జర్నలిస్టు తన వద్ద అధికారిక అక్రిడిటేషన్ కార్డు ఉందని చెప్పినా, బాడీగార్డ్ పట్టించుకోకుండా అవమానకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలువురు మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో వెల్లడించడంతో వివాదం ముదిరింది.బీసీసీఐ నిబంధనలపై ప్రశ్నలుఈ ఘటనతో మరో అంశం కూడా చర్చనీయాంశమైంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు విదేశీ పర్యటనల్లో వ్యక్తిగత బాడీగార్డులు, వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.బీసీసీఐ అమల్లో ఉన్న క్రమశిక్షణ మార్గదర్శకాల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల భద్రతను బోర్డు, స్థానిక నిర్వాహకులు ఏర్పాటు చేసిన అధికారిక భద్రతా సిబ్బందే చూసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత భద్రతా సిబ్బందికి సాధారణంగా అనుమతి ఉండదు.బీసీసీఐ స్పందన కోసం ఎదురుచూపుఈ ఘటనపై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే విరాట్ కోహ్లీ కూడా స్పందించలేదు. అయితే ఆరోపణలు నిజమని తేలితే, బీసీసీఐ అంతర్గతంగా విచారణ జరిపే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్లో ఉన్నాడు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగగా.. ఆ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ మాత్రం విఫలమయ్యాడు. రెండో వన్డే జులై 16న కార్డిఫ్ వేదికగా జరుగనుంది. -
అతడికి అన్యాయం.. అక్షర్, వాషీ.. ఇద్దరూ ఎందుకు?
ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ దుమ్ములేపారు. కెప్టెన్ శుబ్మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్)తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అక్షర్ (57*), వాషీ (52*) ఇద్దరూ అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.ఆల్రౌండ్ ప్రతిభముఖ్యంగా అక్షర్ ఆల్రౌండర్గా తన పూర్తి నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకుని.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తొలుత 9.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ 62 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటర్గానూ సత్తా చాటాడు.అయితే, వాషీ కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి పదమూడు పరుగులు ఇచ్చి.. వికెట్ లేకుండానే ముగించాడు. మరోవైపు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడికి అన్యాయంఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లనే ఆడించడం సరికాదని.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు కూడా తుదిజట్టులో చోటు ఇవ్వాలని అశూ యాజమాన్యానికి సూచించాడు. ‘‘జట్టు కోసం చాలా కాలం కష్టపడ్డ ఆటగాడికి కూడా విలువనివ్వాలి. కానీ మేనేజ్మెంట్ ఇంగ్లండ్లో అతడి (కుల్దీప్)ని ఎందుకో పక్కనపెట్టేసింది.PC: BCCIఒక బ్యాటర్ ఆత్మవిశ్వాసం పెరగాలంటే అతడు ఫామ్లో ఉండటం ఎలా ముఖ్యమో.. ఒక బౌలర్ కూడా రిథమ్, లైన్ అండ్ లెంగ్త్ కొనసాగించాలంటే అతడికి అవకాశాలు ఇవ్వడమూ అంతే ముఖ్యం. నాకైతే కుల్దీప్ విషయంలో మేనేజ్మెంట్ పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరిస్తున్నట్లు అనిపించడం లేదు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సింది.బెంచ్కే పరిమితం చేయడం సరికాదుముఖ్యంగా ఈసారి ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరుగబోతోంది. కుల్దీప్ అవసరం అక్కడ కచ్చితంగా ఉంటుంది. కాబట్టి అతడిని బెంచ్కే పరిమితం చేయడం సరికాదు. నిజానికి హార్దిక్ పాండ్యా లేడన్న కారణంగా యాజమాన్యం అతడి స్థానంలో శివం దూబేను ఆడిస్తోంది. బౌలర్గానూ అతడి సేవలు వాడుకోవాలనుకుంటోంది.టీ20 ఫార్మాట్ మాదిరి ఇద్దరు బౌలర్లే ఇక్కడ (వన్డే) నాలుగు ఓవర్లు వేయాల్సిన పనిలేదు. జట్టులో ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లు వాషీ, అక్షర్ ఉన్నారు. ఇద్దరూ బ్యాటింగ్ చేయగలరు. కాబట్టి ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకుని.. కుల్దీప్ యాదవ్ను ఆడించవచ్చు కదా!’’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. చదవండి: అతడిని ఆరోస్థానంలో ఎందుకు ఆడించారు? -
ODI WC: రోహిత్ విఫలం.. ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.రో- కో విఫలంఅయితే, ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 21 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసి.. సామ్ కరన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్డౌన్ బ్యాటర్ కోహ్లి.. ఆరు బంతుల్లో ఒక ఫోర్ బాది.. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027 టోర్నీలో రో-కో ఆడటంపై మరోసారి చర్చమొదలైంది.ప్రయోగాలు చేస్తాంఇప్పటికే ప్రయోగాలు చేస్తామంటూ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పష్టం చేసిన తరుణంలో.. రోహిత్- కోహ్లిని పక్కనపెట్టే సాహసం చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పోర్ట్స్ టాక్తో మాట్లాడుతూ రోహిత్ విషయంలో మేనేజ్మెంట్ వైఖరి గురించి కీలక విషయాలు వెల్లడించాయి.ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ ఇప్పటికే ఎంతో గొప్పగా సేవ చేశాడు. కాబట్టి కోచ్ (గంభీర్) అతడికి స్వేచ్ఛనిచ్చాడు. ఇన్నాళ్లుగా ఎలా ఆడాడో.. ఇప్పుడు కూడా అలాగే ఆడేమని స్వేచ్ఛగా వదిలేశాడు.అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం కోచ్ అతడి పట్ల సానుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా రోహిత్ ఒత్తిడి లేకుండా.. ప్రశాంతమైన మనసుతో మ్యాచ్ ఆడేలా చూస్తున్నారు. అలా అయితేనే రోహిత్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని యాజమాన్యం నమ్ముతోంది.మేనేజ్మెంట్కు ఆ విషయం తెలుసునిజానికి రోహిత్ ఒత్తిడిలో ఉంటే ఏం జరిగిందో చూశాం కదా!.. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ అతడి ప్రతి ఇన్నింగ్స్ను భూతద్దంలో పెట్టి చూడాలనుకోవడం లేదు. అతడి స్థాయి ఏమిటో యాజమాన్యానికీ తెలుసు. రోహిత్ ప్రశాంతంగా.. ఒత్తిడి లేకుండా ఆడితే ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికి మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. టెక్నిక్లో ఉన్న చిన్నపాటి లోపాలు సరిచేసుకుంటే హిట్మ్యాన్కు తిరుగు ఉండదు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా హెడ్కోచ్ గౌతం గంభీర్ రోహిత్ శర్మ పట్ల సానుకూలంగానే ఉన్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. అతడి అనుభవం, దూకుడైన ఆట జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న గంభీర్.. వరల్డ్కప్లో హిట్మ్యాన్ను ఆడించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా? -
మిచెల్కు గిల్ గట్టి సవాల్
భారత్-ఇంగ్లండ్ తొలి వన్డే అనంతరం ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ రేటింగ్ పాయింట్లు పెంచుకుని ప్రపంచ నంబర్-1 బ్యాటర్ స్థానానికి మరింత చేరువయ్యాడు.ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించిన గిల్కు 12 రేటింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుతం అతను ప్రపంచ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అగ్రస్థానంలో ఉన్న డారిల్ మిచెల్ను (814) అధిగమించేందుకు గిల్కు (803) ఇంకా 12 రేటింగ్ పాయింట్లు మాత్రమే అవసరం. మరో మంచి ఇన్నింగ్స్ గిల్ను అగ్రపీఠంపై కూర్చోబెట్టడం ఖాయం.తొలి వన్డేలో విఫలమైనప్పటికీ భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (3వ స్థానం), రోహిత్ శర్మ (4వ స్థానం) తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.భారత ఆటగాళ్లకు భారీ లబ్దిదీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్పై కట్టుదిట్టమైన బౌలింగ్తో ర్యాంకింగ్స్లో 24వ స్థానానికి చేరుకున్నాడు.అలాగే తొలి వన్డేలో అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్ ఆల్రౌండర్ల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించాడు. బ్యాట్తో అజేయ అర్ధశతకం సాధించిన వాషింగ్టన్ సుందర్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 73వ స్థానానికి చేరుకున్నాడు.ఇంగ్లండ్ ఆటగాళ్లకు కూడా మెరుగైన ర్యాంకులుఇంగ్లండ్ తరఫున తొలి వన్డేలో 76 పరుగులు చేసిన జో రూట్ 12వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే అర్ధశతకంతో ఆకట్టుకున్న లియామ్ డాసన్ బ్యాటర్ల జాబితాలో 81 స్థానాలు ఎగబాకి 262వ స్థానంలో నిలిచాడు.ఇతర దేశాల ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్, వెస్టిండీస్ బ్యాటర్ కీసీ కార్టీ, జింబాబ్వే ఆటగాళ్లు బెన్ కర్రన్, బ్రాడ్ ఇవాన్స్ కూడా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో గణనీయమైన పురోగతి సాధించారు. -
రెండో వన్డేలో రోహిత్, కోహ్లికి విశ్రాంతి..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో రెండో వన్డే కార్డిప్ వేదికగా 16వ తేదీ జరుగనుంది.ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు రోటేషన్ విధానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని జట్టులో పలు కాంబినేషన్లను పరీక్షిస్తున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు.తొలి వన్డే అనంతరం మాట్లాడిన అతడు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన సమతుల్యత కలిగిన జట్టును ఎంపిక చేసేందుకు విభిన్న కాంబినేషన్లను పరిశీలిస్తున్నామని తెలిపాడు.ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరుగనుండగా, అక్కడి పరిస్థితులకు ఇంగ్లండ్ పిచ్లు కొంతవరకు సమానంగా ఉంటాయని.. అందుకే ఈ సిరీస్ను ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నామని వివరించాడు.ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇవ్వొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు.ఒకవేళ వీరిలో ఎవరికైనా విశ్రాంతినిస్తే, వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. అవసరానికి అనుగుణంగా బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేసి జట్టు సమతుల్యతను కొనసాగించే అవకాశం ఉంది. కాగా, తొలి వన్డేలో రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లి 5 పరుగులకు ఔటై నిరాశపరిచారు. -
ఇంగ్లండ్తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేను భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సతీసమేతంగా వీక్షించాడు. ఈ సందర్భంగా ధోని చెవిలో కనిపించిన ఓ పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పరికరం ఏంటని అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.పరిశోధనల అనంతరం దాని రేడియో ఇయర్విగ్ (Radio Earwig) అని తెలిసింది. ఇది ఒక చిన్న వైర్లెస్ రేడియో రిసీవర్. దీని ద్వారా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ జరుగుతుండగానే ప్రత్యక్ష రేడియో కామెంటరీని వినొచ్చు.రేడియో ఇయర్విగ్ ప్రత్యేకతలు* ప్రత్యక్ష రేడియో కామెంటరీ వినేందుకు ఉపయోగించే చిన్న పరికరం.* సుమారు 20 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.* ఇంగ్లండ్లో దీని ధర సుమారు 20 పౌండ్లు.* లార్డ్స్ సహా ఇంగ్లండ్లోని పలు ప్రముఖ స్టేడియాల్లో అభిమానులకు విక్రయిస్తారు.* క్రికెట్తో పాటు ఫార్ములా-1, గుర్రపు పందేలు, రగ్బీ వంటి క్రీడల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు.ధోనీ ఒక్కరే కాదుగతంలో భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కూడా ఇంగ్లండ్ పర్యటనలో డ్రెస్సింగ్రూమ్లో కూర్చొని ఈ రేడియో ఇయర్విగ్ ద్వారా ప్రత్యక్ష కామెంటరీ విన్నారు. అలాగే రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ కూడా ఈ పరికరాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి.భారత్లో ఎందుకు కనిపించదు..?భారత్లో క్రికెట్కు సంబంధించిన రేడియో ప్రసారాలు ప్రస్తుతం పెద్దగా ప్రాచుర్యంలో లేకపోవడంతో స్టేడియాల్లో ఈ పరికరాలు అందుబాటులో ఉండవు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో రేడియో కామెంటరీ ఇప్పటికీ ప్రజాదరణ పొందినందున అక్కడి స్టేడియాల్లో రేడియో ఇయర్విగ్ వినియోగం కొనసాగుతోంది.ఇదిలా ఉంటే, తొలి వన్డేలో ఇంగ్లండ్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 45.2 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత గెలుపులో అక్షర్ పటేల్ (4 వికెట్లు, 57 నాటౌట్), శుభ్మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) కీలకపాత్ర పోషించారు. రెండో వన్డే కార్డిఫ్ వేదికగా జులై 15న జరుగనుంది. -
అక్షర్ పటేల్ అరుదైన ఫీట్.. ఆ ఇద్దరి సరసన చోటు
టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన అక్షర్ పటేల్ బౌలింగ్లో నాలుగు వికెట్లు, ఆ తర్వాత బ్యాటింగ్లో (57 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా తరఫున వన్డే మ్యాచ్లో నాలుగు వికెట్లతో పాటు అర్ధసెంచరీ లేదా సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ అక్షర్ పటేల్ రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సరసన చోటు సంపాదించాడు. 1998లో ఢాకా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ (141 పరుగులు) సెంచరీతో చెలరేగడంతో పాటు బౌలింగ్లో 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ఆనాటి మ్యాచ్లో హీరోగా నిలిచాడు. ఆ తర్వాత 2022లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో పాండ్యా బ్యాటింగ్లో 71 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 24 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు.మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. కార్డిఫ్లో రేపు రెండో వన్డే జరుగుతుంది. 𝐏𝐚𝐫𝐭𝐧𝐞𝐫𝐬𝐡𝐢𝐩 𝐛𝐫𝐞𝐚𝐤𝐞𝐫. 𝐅𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐫. 𝐌𝐚𝐭𝐜𝐡-𝐰𝐢𝐧𝐧𝐞𝐫. A brilliant all-round performance from #AxarPatel powered India to a winning start in the ODI series. 💪#ENGvIND 2nd ODI 👉 THU, 16th JULY, 4:30 PM on JioHotstar! pic.twitter.com/vsi2CAv9Hk— Star Sports (@StarSportsIndia) July 15, 2026Read: బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం! -
అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ తాజా పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయిన భారత్.. వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం అందుకుంది. బర్మింగ్హామ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో శుబ్మన్ గిల్ సేన.. ఇంగ్లండ్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ముగ్గురూ అదరగొట్టారుఇంగ్లండ్ విధించిన 259 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ గిల్ 80 పరుగులతో అదరగొట్టగా.. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (52), అక్షర్ పటేల్ (57) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలిపించారు.A Sundar finish to a near-perfect chase. 💙Washington Sundar seals the win with a towering hit as India take a 1-0 lead in the ODI series. Watch the #ENGvIND 2nd ODI on 16th July, 4:30 PM onwards, LIVE on Sony Sports Network TV channels #SonySportsNetwork #MamlaPersonalHai pic.twitter.com/CXC40cayCn— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026రాహుల్ విఫలంఇక ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెగ్యులర్గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగాడు. అతడి స్థానంలో వాషీ ఐదో స్థానానికి ప్రమోట్ అయి సక్సెస్ కాగా.. రాహుల్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జోష్ టంగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యంపై మండిపడ్డాడు. రాహుల్కు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి రాహుల్కు కూడా ఇలా డిమోట్ అవ్వడం నచ్చి ఉండదు.ఇలాగే బలి చేస్తారా?ఏదేమైనా ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ సేవలను మీరు సరిగ్గా ఉపయోగించుకోకుండా.. అతడి ప్రతిభను వృథా చేస్తున్నారు. ఇకముందు కూడా వరల్డ్ బెస్ట్ బ్యాటర్ను ఇలాగే బలి చేస్తారా?లెఫ్ట్- రైట్ కాంబినేషన్ గురించి మీరు ఆలోచించి ఉండవచ్చు. కానీ దీని వల్ల కేఎల్ రాహుల్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అతడు మ్యాచ్ విన్నర్. ఒంటిచేత్తో జట్టును గెలిపించగలడు. అలాంటి ఆటగాడి పట్ల ఇలాంటి వైఖరి ఎంతమాత్రం సరికాదు.ఇలా చేస్తే మున్ముందు కష్టమేరాహుల్ను ఆరు లేదంటే ఏడో స్థానంలో ఎలా పంపగలరు?.. భారత క్రికెట్కు ఇది మంచిదికాదు. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్-2027కు ముందు రాహుల్ విషయంలో ఇలాంటి ఆటలు వద్దు. సౌతాఫ్రికాలో పిచ్లు ఇంతకంటే బౌన్సీగా ఉంటాయి. కాబట్టి రాహుల్ కంటే ముందు వాషీని బ్యాటింగ్కు పంపడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్లో ఇప్పటికి బ్యాటింగ్ ఆర్డర్లో తొలి ఏడు స్థానాల్లోనూ ఆడాడు. సగటు 50తో పరుగులు రాబట్టాడు. ఎనిమిది సెంచరీలు కూడా చేశాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్గా 35 ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ అత్యుత్తమంగా 63.20 సగటుతో పరుగులు చేశాడు. ఇక ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 14 ఇన్నింగ్స్లో ఆరో స్థానంలో బరిలోకి దిగినపుడు అతడి సగటు కేవలం 37 మాత్రమే కావడం గమనార్హం.చదవండి: గిల్ గాయంపై అప్డేట్ -
మాట తప్పిన బీసీసీఐ!?
టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే రాజీనామా అంశంలో బిగ్ ట్విస్ట్..! వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు తన పదవి నుంచి తప్పుకొన్నాడని తొలుత వార్తలు వచ్చాయి. ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత డస్కటే తన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.మాట తప్పిన బీసీసీఐ!అయితే, కేవలం వ్యక్తిగత కారణాలు కాకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యాజమాన్యం తనకు ఇచ్చిన మాట తప్పినందు వల్లే డస్కటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం. కాగా రెండేళ్ల క్రితం గౌతం గంభీర్ భారత హెడ్ కోచ్గా నియమితుడైన తర్వాత డస్కటే టీమ్ అసిస్టెంట్ కోచ్గా ఎంపికైన సంగతి తెలిసిందే. గంభీర్ ఏరికోరి తెచ్చుకుంటే..గతంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ.. కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కలిసి పని చేసిన అనుభవంతో డస్కటేను గంభీర్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికీ తన బాధ్యతలపై స్పష్టత లేకపోవడంతో డస్కటే జట్టుకు దూరం కావడమే సరైందిగా భావిస్తున్నట్లు తెలిసింది. టీమ్తో చేరినప్పుడు తనకు స్పెషలిస్ట్ ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారట. కానీ హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ను చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా కొనసాగించడంతో డస్కటేకు ఆ అవకాశం దక్కలేదు.పని లేదు.. అందుకే‘బ్యాటింగ్ బాధ్యతలను గంభీర్తో పాటు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ చూస్తున్నారు. పేసర్ల కోసం మోర్నీ మోర్కెల్, స్పిన్నర్లకు సాయిరాజ్ బహుతులే కోచ్లుగా ఉన్నారు. ఇక డస్కటేకు పని ఏముంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. లండన్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న డస్కటే తన కుటుంబంతో తగిన సమయం గడిపేందుకు కూడా భారత జట్టును వీడాలని భావిస్తున్నట్లు క్రిక్బజ్ పేర్కొంది.అంతర్జాతీయ జట్టుకంటే ఫ్రాంచైజీ లీగ్లతో కలిసి పని చేయడం తనకు సౌకర్యంగా ఉంటుందని కూడా డస్కటే అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు లీగ్ల యాజమాన్యాలు డస్కటేను సంప్రదించినట్లు సమాచారం. ఇక డస్కటే నిజంగా తప్పుకొంటే దిలీప్ను బీసీసీఐ మరికొంత కాలం పాటు ఫీల్డింగ్ కోచ్గా కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ రికార్డు -
బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం!
ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ విఫలమయ్యాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు దొరికిపోయాడు. మ్యాచ్ ఓటమి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైన బ్రూక్కు బుమ్రా గురించి ప్రశ్న వేయడంపై అసహనం వ్యక్తం చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఔటవ్వడంపై మీ స్పందనేంటి అని విలేకరులు బ్రూక్కు ప్రశ్న వేశారు. దీనిపై బ్రూక్ స్పందిస్తూ.. ‘బుమ్రా మంచి బౌలర్. నాకు వేసిన బంతి బౌన్స్ కావడం వల్ల షాట్ ఆడే క్రమంలో మిస్ అయ్యాను. దీంతో ఔట్ కావాల్సి వచ్చింది’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత రిపోర్టర్లు మరో ప్రశ్న అడుగుతుండగానే బ్రూక్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే వన్డే సిరీస్ కంటే ముందు జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో హ్యారీ బ్రూక్ 229 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఐదో టీ20 మ్యాచ్లో తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ (45 బంతుల్లో 95 నాటౌట్) ఆడడం విశేషం. అయితే వన్డే ఫార్మాట్కు రాగానే హ్యారీ బ్రూక్ ఆట మారిపోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసి బుమ్రాకు దొరికిపోయాడు. అయితే వన్డేల్లో బ్రూక్, బుమ్రా ఎదురుపడడం ఇదే తొలిసారి. 2026 టీ20 ప్రపంచకప్ సెమీస్లో కూడా బ్రూక్.. బుమ్రాకే వికెట్ సమర్పించుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో కూడా బ్రూక్ను బుమ్రా ఒకసారి ఔట్ చేశాడు. తాజాగా వన్డేలోనూ బ్రూక్ను ఔట్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా అతడి వికెట్ తీసిన బౌలర్గా నిలిచాడు. మ్యాచ్ ఓటమిపై బ్రూక్ స్పందిస్తూ.. తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్లో పిచ్ మారిపోయిందన్నాడు. తొలి ఇన్నింగ్స్లో తరహాలోనే స్పందించి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. బ్యాటర్లు ఈజీగా పరుగులు చేసేలా మారిందన్నాడు. ఓవర్కు 5 నుంచి 6 పరుగులే చేయాల్సి ఉండడంతో ప్రత్యర్థి బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడి పరుగులు సాధించారన్నాడు. ఇక తాము ఎప్పుడూ కూడా పిచ్ పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేస్తామన్నాడు. బ్యాటర్లు ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే తమ స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడి చేసి ఉండేవారని అభిప్రాయపడ్డాడు. ఇక రెండో వన్డేలో జట్టు కాంబినేషన్ గురించి ఇంకా ఆలోచిం చలేదన్నాడు. ఆ మ్యాచ్కు వేదిక అయిన కార్డిఫ్ కు వెళ్లిన తరువాత అక్కడి పిచ్ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నాడు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా కార్డిఫ్ వేదికగా రెండో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్లోనే గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. Harry Brook keeping things short when asked about Jasprit Bumrah’s delivery that outsmarted the England captain:“Good bowler. Bounced a little. Nicked it to sleep.” 😂#ENGvIND pic.twitter.com/sKDdeY4w1a— Siddharth Thakur (@fvosid) July 14, 2026Read: ఫిఫా వీఏఆర్పై ప్రపంచవ్యాప్త నిరసనలు.. ఆ దేశంలో మాత్రం! -
తొలి వన్డేలో రిటైర్డ్ హర్ట్.. గిల్ గాయంపై కీలక అప్డేట్
ఇంగ్లండ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్ 80 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సెంచరీ దిశగా సాగుతున్న గిల్కు కుడి కండరాలు పట్టేయడంతో అసౌకర్యంగా ఫీలయ్యాడు. వెంటనే భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో అతడు నడుస్తున్నంత సేపు నొప్పితో ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. నొప్పితో బాధపడుతున్న గిల్ రెండో వన్డే ఆడుతాడా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా గిల్ గాయానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కేవలం కండరాలు పట్టేయడంతోనే నొప్పి వచ్చినట్లు భారత మెడికల్ బృందం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికైతే గిల్ బాగానే ఉన్నాడని, రెండో వన్డేలో ఆడుతాడని టీమిండియా మేనేజ్మెంట్ తెలిపింది. రెండో వన్డేకు ఒకరోజు గ్యాప్ ఉండడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. గిల్ కూడా తన గాయంపై స్పందించాడు. ‘నేను బాగానే ఉన్నాను. కండరాల నొప్పితో కాస్త బాధపడ్డాను. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. రెండో వన్డేకు నేను ఫిట్గానే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్లో కోహ్లి, రోహిత్లు వెనువెంటనే ఔటైన తర్వాత గిల్, అయ్యర్తో కలిసి బాధ్యతగా ఆడాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ వెళ్లిన కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ 35 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా కేవలం ఒక్క పరుగుకే ఔటవడంతో భారత్పై మరోసారి ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ఆల్ రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ ను మట్టికరిపించారు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఒక దశలో 107/6తో కష్టాల్లో పడింది. అయితే జో రూట్, లియామ్ డాసన్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకుని 258 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించి ఇంగ్లండ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. తొలి వన్డేలో గెలిచి మూడు వన్డేల సిరీస్లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే గురువారం కార్డిఫ్ వేదికగా జరగనుంది.చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ అరుదైన ఫీట్ -
ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ అరుదైన ఫీట్
ఇంగ్లండ్తో తొలి వన్డేలో విజయం ద్వారా టీమిండియా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలి విజయంతో కెప్టెన్ శుబ్మన్ గిల్ చరిత్ర సృష్టించగా, ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. గత 12 ఏళ్లలో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లండ్ను ఓడించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఎడ్జ్బాస్టన్లో 2015 నుంచి తాము ఆడిన ఏడు వన్డేల్లో ఇంగ్లండ్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. 2014లో ఇదే ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ను చిత్తు చేసింది కూడా టీమిండియానే. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ కంచుకోటను మరోమారు గిల్ కెప్టెన్సీలోని టీమిండియానే బద్దలు కొట్టడం విశేషం.👉మరో రికార్డు ఏంటంటే.. ఇంగ్లండ్పై వన్డేల్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. తన లాంగ్ స్ట్రీక్ను భారత జట్టు విజయవంతంగా కొనసాగిస్తోంది. గతంలో మూడు వివిధ సందర్భాల్లో ఇంగ్లండ్పై వన్డేల్లో వరుసగా ఐదేసి విజయాలు నమోదు చేసింది.👉 కోహ్లి, రోహిత్ విఫలమైన వేళ టీమిండియా వన్డేల్లో 250 ప్లస్ స్కోరును ఛేదించడం 2016 నుంచి ఇది రెండోసారి మాత్రమే. 2022లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో 260 పరుగుల టార్గెట్ను టీమిండియా ఛేదించింది. ఈ మ్యాచ్లో కోహ్లి, రోహిత్లు 17 పరుగులు చేసి ఔటయ్యారు.చదవండి: తొలి వన్డేలో రిటైర్డ్ హర్ట్.. గిల్ గాయంపై కీలక అప్డేట్ -
‘ఇది మంచి ఆరంభం.. అతడొక అద్భుతం’
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బౌలింగ్తో, ఆపై బ్యాటింగ్ ఇలా సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడాడు. ఇది తమకు మంచి ఆరంభమని, దీనిని తర్వాతి మ్యాచ్ల్లోనూ కొనసాగిస్తామని గిల్ తెలిపాడు. ‘నిజానికి నేను టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాడినేమో. ఎందుకంటే బౌలింగ్తో పోలిస్తే బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్లో బుమ్రా మినహా మిగతావారికి ఇంగ్లండ్ గడ్డపై పెద్దగా అనుభవం లేదు. మా ముందు ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా దానిని ఛేదించేందుకు మా దగ్గర బ్యాటింగ్ అస్త్రాలు నిండుగా ఉన్నాయి. కానీ మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 50కి పైగా పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టం చేయడంతో వారికి పరుగులు రావడం కష్టమైపోయింది. చివరి పవర్ ప్లేలో ఇంగ్లండ్ కాస్త దూకుడుగా ఆడడంతో 250 ప్లస్ స్కోరును దాటగలిగారు లేదంటే 220 నుంచి 230కి పరిమితమయ్యేవాళ్లేమో. 2027 వన్డే ప్రపంచకప్కు ఇంకా సమయం ఉండడంతో ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. బ్యాటింగ్, బౌలింగ్ సమపాళ్లలో ఉండేలా వర్కౌట్ చేస్తున్నాం. ఇంగ్లండ్ గడ్డపై ఉండే వికెట్ పరిస్థితులు దక్షిణాఫ్రికాలోని పరిస్థితులకు కొంత సారూప్యత ఉంటుందని భావిస్తున్నా. అక్షర్ పటేల్ తన ఆల్రౌండ్ పాత్రకు న్యాయం చేశాడు. రాబోయే రోజుల్లో ఈ విజయాలను కంటిన్యూ చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు.ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ 107/6తో ఇబ్బందుల్లో ఉన్న దశలో రూట్, డాసన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 22.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్ ఐదో వికెట్కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్లో భారత్ 1–0తో పైచేయి సాధించగా... కార్డిఫ్లో రేపు రెండో వన్డే జరుగుతుంది. -
బట్లర్ డబుల్ సెంచరీ.. కేవలం రెండో ప్లేయర్
భారత్తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆట పరంగా అతడు ఈ మ్యాచ్లో నిరాశపరిచినా (14 బంతుల్లో 5 పరుగులు), తన దేశం తరఫున అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ జోస్కు వన్డేల్లో 200వది. ఇతనికి ముందు కేవలం ఇయాన్ మోర్గాన్ (225) మాత్రమే ఇంగ్లండ్ తరఫున 200 వన్డేల మార్కును తాకాడు.చివరిగా భారత్తోనే జరిగిన టీ20లో మెరుపు శతకం బాదిన జోస్, ఆ ఫామ్ను తొలి వన్డేలో ప్రదర్శించలేకపోయాడు. వన్డేల్లో ఇతనికిది వరుసగా ఏడో వైఫల్యం (కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడం).బట్లర్ వన్డే కెరీర్ విషయానికొస్తే.. 2012లో పాకిస్థాన్పై అరంగేట్రం చేసి తొలి మ్యాచ్లోనే డకౌటయ్యాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ అత్యుత్తమ పరిమిత ఓవర్ల బ్యాటర్లలో ఒకరిగా ఎదిగాడు.ఇప్పటివరకు 172 ఇన్నింగ్స్ల్లో 38.87 సగటున 5520 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 29 అర్ధశతకాలు ఉన్నాయి. పరుగుల పరంగా జో రూట్, ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్గా కొనసాగుతున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్–డాసన్ పోరాటంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది.పేసర్లకు అనుకూలించిన పిచ్పై 107 పరుగులకే 6 వికెట్లు పోయిన ఆ జట్టును జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు జీవం పోశారు.ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు తీయగా.. ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2, బుమ్రా, దూబే తలో వికెట్ తీశారు. -
గుర్నూర్ దెబ్బకు కిందపడ్డ గిల్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం నాటి తొలి వన్డేకు బర్మింగ్హామ్ వేదిక. ఎడ్జ్బాస్టన్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఈ క్రమంలో 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ 61 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బ్రార్ రెండో బాల్కు జేకబ్ బెతెల్ (14), నాలుగో బంతికి బెన్ డకెట్ (43)ను అవుట్ చేశాడు. తద్వారా ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.ఘోరంగా ఢీకొట్టుకున్నారుఇదిలా ఉంటే.. పదహారో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో జోస్ బట్లర్ బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్యాచ్ను అందుకునేందుకు బ్రార్, కెప్టెన్ శుబ్మన్ గిల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఘోరంగా ఢీకొట్టుకున్నారు. అయితే, బ్రార్ సురక్షితంగా క్యాచ్ పట్టడంతో బట్లర్ (5) వెనుదిరిగాడు.ఇక కిందపడ్డ గిల్ను చేయిచ్చి పైకి లేపిన బ్రార్.. అతడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో ప్రసిద్ కృష్ణతో కలిసి వికెట్ను సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. బ్రార్ వైపుగా వచ్చి డాన్స్ చేస్తూ అతడిని టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Gurnoor Brar completes the catch to send Jos Buttler back 🚶➡️ Watch the 1st ODI of #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/W2lmSrbZE4— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026258 పరుగులకు ఆలౌట్కాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ చేశారు. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలా రెండు.. జస్ప్రీత్ బుమ్రా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ టాప్ రన్ స్కోరర్ (76 నాటౌట్)గా నిలవగా.. లియామ్ డాసన్ (68) కూడా అర్ధ శతకం చేశాడు. మిగిలిన వారిలో బెన్ డకెట్ (43), విల్ జాక్స్ (20) రాణించారు. చదవండి: వాళ్లిద్దరికి అస్సలు పడటం లేదు.. డీకే సంచలన వ్యాఖ్యలు -
రూట్, డాసన్ అద్భుత పోరాటం.. ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.పేసర్లకు అనుకూలించిన పిచ్పై 107 పరుగులకే 6 వికెట్లు పోయిన ఇంగ్లండ్ ను జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు జీవం పోశారు.అంతకుముందు ఓపెనర్ బెన్ డకెట్ (43) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ప్లేయర్లలో జేకబ్ బేతెల్ 14, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 1, జోస్ బట్లర్ 5, సామ్ కర్రన్ డకౌట్, విల్ జాక్స్ 20, జోఫ్రా ఆర్చర్12, ఆదిల్ రషీద్ 1, టంగ్ డకౌటాయ్యారు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు తీయగా.. ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2, బుమ్రా, దూబే తలో వికెట్ తీశారు. -
భారత్తో వన్డేలు.. ఇంగ్లండ్ జట్టులో మరో ఫాస్ట్ బౌలర్
భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కీలక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.ఐపీఎల్ 2026 సందర్భంగా చేతికి గాయం కావడంతో కార్స్ కొంతకాలం క్రికెట్కు దూరమయ్యాడు. అనంతరం మోచేతి సమస్య నుంచి కోలుకుని డర్హమ్ తరఫున వైటాలిటీ బ్లాస్ట్లో మూడు మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న తొలి వన్డేలో పేస్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు కనిపించడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి 30 ఓవర్లలో భారత్ బౌలింగ్లో స్పిన్నర్లకు కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఇవ్వగా, మిగిలిన 27 ఓవర్లు పేసర్లు వేశారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఆరు వికెట్లు కూడా అన్నీ పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి.ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ గాయాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, పేస్ దళాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కార్స్ను జట్టులో చేర్చినట్లు సమాచారం.భారత్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ తాజా జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జో రూట్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేకబ్ బెథెల్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమ్స్ కోల్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహ్మూద్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, బ్రైడన్ కార్స్.కార్స్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 30 వన్డేలు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతని ప్రదర్శన మెరుగ్గా ఉండటంతో, భారత్తో మిగిలిన రెండు మ్యాచ్ల్లో అతను కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రెండు, మూడు వన్డేలు జులై 16, 19 తేదీల్లో కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జరుగనున్నాయి.ఇవాళ జరుగుతున్న తొలి వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, భారత పేసర్ల ధాటికి 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. రూట్ (56), డాసన్ (65) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు అజేయమైన 115 పరుగులు జోడించి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. 42.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 222-6గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2 వికెట్లు తీయగా.. బుమ్రా, శివమ్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. -
టీమిండియా అసిస్టెంట్ కోచ్ రాజీనామా..!
టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అంగీకారం లభిస్తే, ఇంగ్లండ్తో మూడో వన్డే అనంతరం ఆయన భారత జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.క్రిక్బజ్ అందించిన సమాచారం ప్రకారం, డష్కటే ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. వ్యక్తిగత కారణాల చేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. లండన్లో నివసిస్తున్న తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్ అయిన డష్కటే రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన ఒప్పందం ఈ నెలతో ముస్తుంది. అందుకే ఇంగ్లండ్ పర్యటన పూర్తయ్యాక విధుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.గంభీర్ అంగీకరిస్తాడా..?డష్కటేను భారత జట్టు కోచింగ్ సిబ్బందిలోకి తీసుకురావడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఇద్దరి మధ్య మంచి వ్యక్తిగత, వృత్తిపరమైన అనుబంధం ఉంది. దీంతో ఆయన రాజీనామాను గంభీర్ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న నేపథ్యంలో, డష్కటే కొనసాగాలని గంభీర్ కోరే అవకాశం కూడా ఉంది.మరోపక్క ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా జట్టును వీడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ హయాంలో నియమితులైన దిలీప్ భారత జట్టుతోనే కొనసాగనున్నారని సమాచారం. -
అరుదైన మైలురాయిని తాకిన బుమ్రా
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని తాకాడు. హ్యారీ బ్రూక్ వికెట్ తీయడంతో వన్డేల్లో 150 వికెట్ల ఘనత సాధించాడు. ఈ మైలురాయిని అతడు కేవలం 90 వన్డే మ్యాచ్ల్లోనే అందుకున్నాడు. తద్వారా భారత తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. రీఎంట్రీలోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఇప్పటివరకు 5 ఓవర్లు వేసిన అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి బ్రూక్ వికెట్ పడగొట్టాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. బెన్ డకెట్ (43), జేకబ్ బేతెల్ (14), బ్రూక్ (1) ఔట్ కాగా.. రూట్ (1), బట్లర్ (40 క్రీజ్లో ఉన్నారు. బ్రూక్ వికెట్ బుమ్రాకు దక్కగా.. డకెట్, బేతెల్ వికెట్లు యువ పేసర్ గుర్నూర్ బ్రార్ పడగొట్టాడు. భారత్ తరపున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 150 వన్డే వికెట్లు సాధించిన బౌలర్లు4,070 – మహమ్మద్ షమీ4,513 – కుల్దీప్ యాదవ్4,605 – జస్ప్రీత్ బుమ్రా* -
వాళ్లిద్దరికి అస్సలు పడట్లేదు!.. డీకే సంచలన వ్యాఖ్యలు
గతంలో ఎన్నడూ లేని విధంగా పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు ఇటీవల ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. టీ20 ప్రపంచకప్ చాంపియన్గా ఐర్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత్.. పసికూన అయిన ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది.తీవ్రస్థాయిలో విమర్శలుఅనంతరం ఇంగ్లండ్కు వెళ్లి అక్కడా ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తుదిజట్టులో తరచూ మార్పులు, వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను పక్కనపెట్టడం విమర్శలకు కారణమయ్యాయి.అంతేకాదు.. అంతకుముందు టీ20 జట్టు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించే విషయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రధాన పాత్ర పోషించినట్లు.. హెడ్కోచ్ గౌతం గంభీర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వరుస ఓటముల నేపథ్యంలో ఈ విషయం కూడా మరోసారి తెరమీదకు వచ్చింది.దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్- అగార్కర్ మధ్య విభేదాల వల్లే భారత జట్టుకు ఈ దుస్థితి వచ్చిందని పరోక్షంగా దుయ్యబట్టాడు. వీరి వైఖరి కారణంగా ఆటగాళ్లలో ఒక రకమైన గందరగోళం నెలకొందని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పటిష్ట జట్టును తయారు చేయాలని భావిస్తున్నాడు. అయితే, కోచ్ గంభీర్ మాత్రం అలా కాదు. ప్రతి ఒక్క మ్యాచ్, ప్రతి ఒక్క సిరీస్ గెలవాలనే లక్ష్యంతో ఉన్నాడు.ఆటగాళ్లకు మంచిది కాదుఒకరేమో దీర్ఘకాలిక ప్రయోజనాలు.. మరొకరు ఇప్పటికిప్పుడు వచ్చే ఫలితాల గురించి ఆలోచించడం వల్ల బహుశా ఇద్దరి మధ్య ఒక రకమైన ఘర్షణ జరిగి ఉంటుంది. దీంతో ఆటగాళ్ల మనసుల్లో గందరగోళం నెలకొంది. చీఫ్ సెలక్టర్, కోచ్ ఆలోచనల మధ్య వ్యత్యాసం ఆటగాళ్లకు మంచిదేనా? అంటే అస్సలు కాదనే చెప్తాను.ఇలాంటి సమయంలో వారికి జట్టులో తమ స్థానం గురించి అభద్రతాభావం ఏర్పడుతుంది. అది ఫలితాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభేదాలు పరిష్కరించుకుంటే జట్టుకు మంచిది’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
IND vs ENG: ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత్ ఘన విజయంఎడ్జ్బాస్టన్ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(85) టాప్ స్కోరర్గా నిలిచాడు. నిలకడగా ఆడిన గిల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. గిల్తో పాటు అక్షర్ పటేల్(55 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.విజయం దిశగా భారత్ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 66 బంతుల్లో 43 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(35), వాషింగ్టన్ సుందర్(29) ఉన్నారు.గిల్ రిటైర్డ్ హర్ట్80 పరుగుల వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. 34 పరుగులతో శ్రేయస్ అప్పటిక క్రీజ్లో ఉన్నాడు. 26.1 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 151-2గా ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ మరో 108 పరుగులు చేయాలి. నిలకడగా ఆడుతున్న గిల్, శ్రేయస్గిల్ (74), శ్రేయస్ అయ్యర్ (32) నిలకడగా ఆడుతున్నారు. 24 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 141-2గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాలి. రోహిత్, కోహ్లి ఔట్ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (5) ఘోరంగా విఫలమయ్యారు. సామ్ కర్రన్ బౌలింగ్లో రోహిత్ ఔట్ కాగా.. ఆర్చర్ బౌలింగ్లో విరాట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 8.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 48-2గా ఉంది. రోహిత్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 259 పరుగుల ఛేదనలో టీమిండియా 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో ఫోర్ సాయంతో 11 పరుగులు చేసిన రోహిత్ సామ్ కర్రన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. గిల్కు (26) జతగా విరాట్ కోహ్లి క్రీజ్లోకి వచ్చాడు. బర్మింగ్హామ్ వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎడ్జ్బాస్టన్లో 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ (43) రాణించగా.. జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మిగిలిన వారిలో విల్ జాక్స్ (20) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ తలా రెండు.. బుమ్రా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. 259 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్కు దిగింది. అప్డేట్స్..ఇంగ్లండ్ ఆలౌట్47.5: అక్షర్ బౌలింగ్లో జోష్ టంగ్ బౌల్డ్ (0)తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్47.3:అక్షర్ బౌలింగ్లో ఆదిల్ రషీద్ స్టంపౌట్ (1)ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్45.6: అక్షర్ పటేల్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన జోఫ్రా ఆర్చర్ (12). స్కోరు 250-8 (46). క్రీజులోకి ఆదిల్ రషీద్ రాగా.. రూట్ 69 పరుగులతో ఉన్నాడు.ఏడో వికెట్ డౌన్43.6: అక్షర్ పటేల్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన డాసన్. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్. క్రీజులోకి జోఫ్రా ఆర్చర్. రూట్ 59 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 228-7 (44).డాసన్, రూట్ హాఫ్ సెంచరీలు42 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 214-6రూట్ 51, డాసన్ 63 పరుగులతో ఉన్నారు.కుదురుగా ఆడుతున్న రూట్, డాసన్జో రూట్ (30), లియామ్ డాసన్ (34) కుదురుగా ఆడుతున్నారు. 32 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 160-6గా ఉంది. 27 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-627 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-6గా ఉంది. రూట్ 21, లియామ్ డాసన్ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్21.4వ ఓవర్- 107 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విల్ జాక్స్ (20) ఔటయ్యాడు. 100 దాటిన ఇంగ్లండ్ స్కోర్21 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్ 104-5గా ఉంది. జో రూట్ (9), విల్ జాక్స్ (19) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.4: ప్రసిద్ బౌలింగ్లో సామ్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో బ్రార్కు క్యాచ్ ఇచ్చి బట్లర్ అవుట్ (5). కేవలం 19 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్. సామ్ కర్రాన్ క్రీజులోకి రాగా.. రూట్ 6 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 80-4.మూడో వికెట్ డౌన్13.1: బుమ్రా బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1). క్రీజులోకి జోస్ బట్లర్. రూట్ సున్నా పరుగులతో ఉన్నాడు. స్కోరు: 64-3.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.4: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చిన డకెట్. హాఫ్ సెంచరీకి ఏడు పరుగులదూరంలో నిలిచిన డకెట్ (43).తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.2: గుర్నూర్ బ్రార్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన జేకబ్ బెతెల్ (14).పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 51-0 (10)ఓపెనర్లు బెన్ డకెట్ 41, జేకబ్ బెతెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.రో-కో రాకఇక ఈ సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. ఏడు మ్యాచ్లలో ఇంగ్లండ్దే గెలుపు! 👉ఈ ఇద్దరు చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో జనవరిలో జరిగిన వన్డే సిరీస్లో పాల్గొన్నారు. ఇక ఎడ్జ్బాస్టన్లో జరిగిన గత ఏడు వన్డేల్లోనూ ఇంగ్లండ్ గెలుపొందడం విశేషం. అయితే, చివరగా 2014లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. బట్లర్ @ 200👉మరోవైపు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ కెరీర్లో ఇది 200వ వన్డే. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ మోర్గాన్ (225 వన్డేలు) తర్వాతి స్థానాన్ని బట్లర్ ఆక్రమించాడు. ఇదిలా ఉంటే.. ముందుగా టీ20 సిరీస్ జరగగా ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను 4-0తో వైట్వాష్ చేసింది. తుదిజట్లుఇంగ్లండ్జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్ఇండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ. -
వరల్డ్కప్ ప్రణాళికలు వేరు.. కోహ్లితో ఏం మాట్లాడానంటే?: గిల్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా వన్డే సిరీస్కు సన్నద్ధమైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్ వేదికగా తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్తో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు.ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదుఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. శిక్షణ సందర్భంగా కోహ్లితో జరిగిన సంభాషణ గురించి వివరించాడు. ‘‘అత్యుత్తమ కాంబినేషన్తో ముందుకు వెళ్లడమే మా ప్రధాన ప్రణాళిక. దీని గురించే మేము మాట్లాడుకున్నాము.కొంతమంది ప్రస్తుతం జట్టులో లేకపోవచ్చు. వీరిలో పేస్ బౌలర్లు, ఆల్రౌండర్లు, స్పిన్నర్లు.. ఇలా ఎవరైనా సరే ఆయా విభాగం నుంచి భవిష్యత్తులో సేవలు అందించేందుకు జట్టులోకి రావొచ్చు. ఇక విరాట్ భాయ్, రోహిత్ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.గత దశాబ్ద కాలంగా వారిద్దరు టీమిండియా బ్యాటింగ్ లైనప్ వెన్నెముకగా ఉన్నారు. వారు జట్టులో అంతర్భాగం. వారి అనుభవం, నైపుణ్యం మా జట్టు విలువను పెంచుతాయి. అయితే, వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు కాస్త భిన్నంగా ఉంటాయి.ఇక్కడి వికెట్ల మాదిరే వీలైనన్ని వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరల్డ్కప్ వేదికైన సౌతాఫ్రికాలోని పిచ్లు.. ఇక్కడి (ఇంగ్లండ్) వికెట్ల మాదిరే ఉంటాయి. కాబట్టి మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో ఇది అత్యంత కీలకమైన సిరీస్గా మారింది. కొత్త వాళ్లకు అవకాశం నిజానికి మా తుదిజట్టులో ఎప్పుడూ పెద్దగా మార్పులు జరగలేదు. అయితే, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఒత్తిడిలో వారు ఏమేరకు రాణించగలరో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రపంచకప్ టోర్నీకి ముందే జట్టు కూర్పు గురించి మాకు ఒక అవగాహన వస్తుంది’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు.ఇక టీ20 సిరీస్లో ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ కావడం తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని గిల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘‘ఈ రెండూ వేర్వేరు ఫార్మాట్లు. వేర్వేరు జట్లు. వేర్వేరు లక్ష్యాలు. కాబట్టి ఈ సిరీస్పై గత టీ20 సిరీస్ ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని గిల్ అన్నాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
తొలి వన్డే.. కోహ్లిని ఆకాశానికి ఎత్తిన ఇంగ్లండ్ కోచ్
ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా మరికొన్ని గంటల్లో తొలి వన్డే మొదలుకానుంది. జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ తర్వాత వన్డేలు ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు జట్టులోకి తిరిగొచ్చారు. రో-కో ద్వయం తిరిగి రావడంతో పాటు గిల్, కేఎల్ రాహుల్ కూడా జాయిన్ కావడంతో టీమిండియా సరికొత్తగా కనిపిస్తుంది. అయితే ఇంగ్లండ్తో తొలి వన్డే నేపథ్యంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కోహ్లిని ఆకాశానికి ఎత్తాడు. 'క్రీడా ప్రపంచంలో కోహ్లి ఒక నిజమైన చాంపియన్. తన దూకుడైన ఆటతో క్రీడకు సరికొత్త నిర్వచనం చెప్పి ట్రెండ్సెట్టర్గా నిలిచాడు. కోహ్లి కేవలం క్రికెట్ ప్రపంచంలోనో లేక భారతదేశంలోనో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల రంగాలకు కూడా సుపరిచితుడిగా మారిపోయాడు. ప్రజలు క్రికెట్ను ప్రేమించేలా చేయడంలో కోహ్లి స్ఫూర్తినిచ్చాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లి వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అతడు నిజమైన ఛాంపియన్.' అని పొగడ్తల వర్షం కురిపించాడు.ఇటీవలే ఇంగ్లండ్ వరుస టెస్టు సిరీస్ పరాజయాలు చవిచూడడంతో టెస్టు కోచ్ పదవికి బ్రెండన్ మెక్కల్లమ్ గుడ్బై చెప్పాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20 ఫార్మాట్)లో మాత్రం హెడ్కోచ్గా కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. తాజాగా టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై స్పందించిన మెక్కల్లమ్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణ తెలిపాడు. టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం బాధించినప్పటికీ పరిస్థితుల ప్రభావంతోనే అలా చేయాల్సి వచ్చిందన్నాడు. అయితే తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మెక్కల్లమ్ పేర్కొన్నాడు. తన నిర్ణయం పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపాడు. టెస్టు కోచ్గా తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయానని, అందుకే తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించాడు. మెక్కల్లమ్ టెస్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో బెన్స్టోక్ కెప్టెన్సీలో 'బజ్బాల్' ఆటతో ఇంగ్లండ్ 11 టెస్టుల్లో 10 విజయాలు సాధించి కొత్త శకానికి నాంది పలికింది. కానీ రానురాను బజ్బాల్ ఆట ఇంగ్లండ్ కొంపముంచింది. ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ ఆడిన 9 టెస్టుల్లో ఏడింటిలో పరాజయం చవిచూసి డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో చాలా వెనుకబడిపోయింది. ఆ తర్వాత స్టోక్స్ ఉదంతం అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించేలా చేసింది. ఆ వెంటనే మెక్కల్లమ్ టెస్టు కోచ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. Brendon McCullum has apologised to England fans for the poor string of Test results that led to his dismissal 💬 pic.twitter.com/zxNyHAvC7y— Sky Sports Cricket (@SkyCricket) July 13, 2026Read: ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్తో బరిలోకి అర్జెంటీనా! -
జై షాకు శుభ్మన్ గిల్ ప్రత్యేక విజ్ఞప్తి
భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను పునరుద్ధరించాలని కోరాడు.ఇంగ్లండ్తో తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన గిల్, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 50 ఓవర్ల క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు."ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను మళ్లీ ప్రారంభించాలి. జట్లు కొత్త పరిస్థితుల్లో ఆడే అవకాశం లభిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల క్రికెట్ చూస్తూ పెరిగాను. వన్డేలను 40 ఓవర్లకు కుదించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం" అని అన్నాడు.ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ట్రై-సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలు ఎంతో ఆదరణ పొందేవి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రతి ఏడాది నిర్వహించే ట్రై-సిరీస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే టీ20 క్రికెట్ విస్తరణతో అలాంటి టోర్నీలు క్రమంగా అంతరించిపోయాయి.కాగా, ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.తాజాగా భారత్ ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లు కోల్పోవడంతో ఈ సిరీస్ను ప్రాధాన్యత మరింత పెరిగింది. శుభ్మన్ గిల్ అయినా టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించగా.. భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. -
వారిని చూసి నేర్చుకోండి.. టీమిండియాపై భారీ ట్రోలింగ్
చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్, ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో 270 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా లార్డ్స్లో నిర్వహించిన తొలి మహిళల టెస్టులో విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర పుటల్లోకెక్కింది.ఈ విజయానంతరం సోషల్ మీడియాలో భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు సమిష్టి ప్రదర్శనను అభిమానులు కొనియాడుతున్నారు. ముఖ్యంగా హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వాన్ని, యస్తిక భాటియా, క్రాంతి గౌడ్, స్మృతి మంధాన, స్నేహ్ రాణా ప్రదర్శనలను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.కొందరు అభిమానులు ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ను 0-4తో కోల్పోయిన భారత పురుషుల జట్టును ప్రస్తావిస్తూ, "మహిళల జట్టును చూసి నేర్చుకోండి" అంటూ చురకలంటిస్తున్నారు.కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో క్రాంతి గౌడ్ 5 వికెట్లతో.. రెండో ఇన్నింగ్స్లో యస్తిక భాటియా సూపర్ శతకంతో.. స్మృతి మంధాన రెండు ఇన్నింగ్స్ల్లో రెండు అర్ధశతకాలతో.. రెండో ఇన్నింగ్స్లో స్నేహ్ రాణా నాలుగు వికెట్ల ప్రదర్శనలతో అదరగొట్టి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన 83 పరుగులతో రాణించగా, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అర్ధశతకాలతో జట్టును బలమైన స్థితిలో నిలబెట్టారు.తర్వాత బౌలింగ్లో యువ పేసర్ క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ను 170 పరుగులకే ఆలౌట్ చేసింది. మహిళల టెస్టుల్లో లార్డ్స్లో తొలి ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్గా ఆమె రికార్డు సృష్టించింది.రెండో ఇన్నింగ్స్లో భారత్ 341/7 వద్ద డిక్లేర్ చేసింది. యస్తిక భాటియా 113 పరుగుల శతకం సాధించి లార్డ్స్లో మహిళల టెస్టులో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించగా, స్మృతి మంధాన మరో అర్ధశతకంతో ఆకట్టుకుంది. దీంతో భారత్ ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.చివరి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు మరోసారి చెలరేగారు. స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ను ఘోరంగా దెబ్బకొట్టింది. దీంతో ఆతిథ్య జట్టు 186 పరుగులకే ఆలౌటై, 270 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.ఈ విజయంతో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై 12 సంవత్సరాల తర్వాత టెస్టు విజయం సాధించింది. -
చారిత్రక మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం
‘క్రికెట్ మక్కా’ లార్డ్స్లో భారత్ చారిత్రక విజయం సాధించింది. ఈ మైదానంలో మహిళల టెస్టు ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్ సేన చరిత్రకెక్కింది.స్మృతి మంధాన అర్ధ శతకంలండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్- భారత్ మహిళా జట్ల మధ్య శుక్రవారం ఏకైక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లలో షఫాలీ వర్మ డకౌట్ కాగా.. స్మృతి మంధాన అర్ధ శతకం (83)తో మెరిసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారిలో జెమీమా రోడ్రిగ్స్ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ అర్ధ శతకం (52)తో రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది.క్రాంతికి ఐదు వికెట్లుఇక భారత బౌలర్లలో పేసర్ క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. తద్వారా లార్డ్స్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన మహిళా బౌలర్గా చరిత్ర సృష్టించింది. మిగిలిన వారిలో సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.యస్తికా సెంచరీఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (115 పరుగులు) కలుపుకొని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. ఏడు వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా సెంచరీ (113)తో సత్తా చాటింది.ఇంగ్లండ్ లక్ష్యం 457ఫలితంగా టీమిండియా ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి నాలుగో రోజు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ కేవలం 130 పరుగులు చేసింది. ఈ క్రమంలో 130/6 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి చివరి రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మరో 56 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.ఆఖరి రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లిస్టోన్ టెస్టుల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకుంది. యాభై పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె పదో వికెట్గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. భారత్ 270 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు కూల్చారు.సంక్షిప్త స్కోర్లుభారత్ : 285 &3 41/7 డిక్లేర్డ్ఇంగ్లండ్ : 170 & 186ఫలితం : ఇంగ్లండ్పై 270 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపు.చదవండి: టీమిండియాలోకి సూర్య! -
టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కానీ ఈ మెగా టోర్నీ తర్వాత జట్టు ఆడిన తొలి సిరీస్లోనే ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్పై వేటు పడింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. కెప్టెన్గా తప్పించడమే కాకుండా.. జట్టులోనే అతడికి స్థానం లేకుండా చేసింది.గత ఏడాదిన్నర కారణంగా బ్యాటర్గా సూర్యకుమార్ వ్యక్తిగత వైఫల్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది.ఘోర పరాభవం!అయితే, అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీస్లోనే భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లో 2-0తో టీమిండియా వైట్వాష్కు గురైంది. ఇక ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్స్వీప్ అయింది. దీంతో తాజా యూకే టూర్ భారత క్రికెట్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో సూర్యను గుర్తు చేసుకుంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అతడిని కొనసాగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు కరిష్మా సింగ్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!.. కానీ ఓ కండిషన్!సూర్యకు టీమిండియా తలుపులు శాశ్వతంగా ఏమీ మూసుకుపోలేదన్నారు. అతడు త్వరలోనే తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే, అందుకోసం సూర్య దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున.. అదే విధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫునా కచ్చితంగా రాణించాల్సి ఉంటుందని కరిష్మా చెప్పుకొచ్చారు.అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు కరిష్మా తెలిపారు. బంతి ఇప్పుడు సూర్య కోర్టులోనే ఉందన్నారు. దేశీ క్రికెట్లో రాణిస్తే తప్పక అతడు తిరిగి టీమిండియాలో అడుగుపెడతారని జోస్యం చెప్పారు. కాగా మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, దినేశ్ కార్తిక్ తదితరులు కొన్నాళ్లపాటు జాతీయ జట్టుకు దూరమైనా.. దేశీ క్రికెట్లో సత్తా చాటి తిరిగి జట్టులో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్తో తొలి వన్డేకు భారత జట్టు ఇదే! -
‘అందుకే వైభవ్ను తప్పించి.. సంజూను ఆడించాము’
టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లలో క్లీన్స్వీప్ కావడమే ఇందుకు కారణం. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ గురైన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్నూ విజయమన్నదే లేకుండా ముగించింది. ఇంగ్లిష్ జట్టు చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను పక్కనపెట్టడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా సంజూ ఐర్లాండ్తో రెండు టీ20లు (5, 0).. అదే విధంగా ఇంగ్లండ్తో తొలి టీ20 (1)లో విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే సంజూను తప్పించి.. అతడి స్థానంలో ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20తో అరంగేట్రం చేశాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన వైభవ్.. 13, 14, 15 పరుగులు చేశాడు. అంతేగాక వైభవ్ రాకతో టాపార్డర్లో ముగ్గురూ (ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్) లెఫ్టాండర్లే అయ్యారు.ఈ నేపథ్యంలో నామమాత్రపు ఐదో టీ20లో మాత్రం వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్ను తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ..‘‘సౌతాంప్టన్ పిచ్ పరిస్థితికి తగ్గట్లు మేము అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్తో ముందుకు వెళ్లాలని అనుకున్నాము. అభిషేక్ శర్మతో కలిసి కుడిచేతి వాటం బ్యాటర్తో ఓపెనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాము. అందుకే వైభవ్ను తప్పించాము. ఈ మ్యాచ్కు ఇలా చేయడమే సరైన నిర్ణయం. సంజూ గన్ బ్యాటర్. గతంలో ఒంటిచేత్తో ఎన్నో సిరీస్లు గెలిపించాడు’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐదో టీ20లో సంజూ 27 పరుగులు చేయగా.. అభిషేక్ 3 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది. -
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే!
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో దారుణ పరాజయం తర్వాత శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే జట్టుతో కలిశారు. ఇక తొలి వన్డేకు తుది జట్టు అంచనా ఒకసారి పరిశీలించి చూద్దాం.వీరితో పాటు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ కావడంతో టీమిండియా బలం పెరిగింది. 20 ఓవర్ల ఫార్మాట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్కు ఆట మారడానికి తోడు, సీనియర్లు అంతా జట్టులోకి రావడంతో టీమిండియా ఇప్పుడు పేపర్పై దుర్భేద్యంగా కనిపిస్తోంది. 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లికి 2027 వన్డే ప్రపంచకప్ ఆఖరిది కానుండడంతో వీరిద్దరు రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీ20 సిరీస్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్లు తమ బౌలింగ్తో టీమిండియా బ్యాటర్లను బెంబెలెత్తించారు. కానీ వన్డే ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ వంటి అనుభవజ్ఞులు రావడంతో ఈ ఇద్దరు బౌలర్ల ఆటలు సాగకపోవచ్చని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్తో పాటు కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు.ఆల్రౌండ్ విభాగంలో అక్షర్పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లు ఉన్నప్పటికీ వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనుండగా.. టీ20 సిరీస్లో విఫలమైనప్పటికీ అర్ష్దీప్కు మరో చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో స్పిన్నర్ అవసరమనుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు. లేదంటే ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్లలో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. మొత్తానికి టీ20 సిరీస్లో ఓటమి పాలైనప్పటికీ వన్డే సిరీస్కు మాత్రం సీనియర్ల రాకతో టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. మ్యాచ్ సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.తుదిజట్టు అంచనా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణ/ గుర్నూర్ బ్రార్ -
ఇంగ్లాండ్ తో ఓటమికి వైభవే కారణం
-
శ్రేయస్ అయ్యర్ను తొలగించండి.. ఈజీ ఆప్షన్ అదే!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియాకు.. విదేశీ గడ్డ మీద ఘోర పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత తొలి ప్రయత్నంగా ఐర్లాండ్తో తలపడ్డ భారత్ ఊహించని రీతిలో.. ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్స్వీప్నకు గురైంది.శ్రేయస్ అయ్యర్కు చేదు అనుభవంఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ అయింది. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం మిగిలింది. ఈ రెండు టీ20 సిరీస్లలో భారత్ క్లీన్స్వీప్ కావడంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈజీ ఆప్షన్ అదే!అదే సమయంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ రెండు సిరీస్లలో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను తొలగించడమనేది అత్యంత సులువైన ఆప్షన్.అయితే, ఆ విషయం పక్కనపెట్టి భారత జట్టు ఓటమికి అసలు కారణాలు ఏమిటో ముందు విశ్లేషించండి. నిజానికి ఐర్లాండ్, ఇంగ్లండ్.. అంటే విదేశీ గడ్డ మీద ఈ మ్యాచ్లు జరగడమే భారత్ ఓటమికి ప్రధాన కారణం.వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు విదేశీ పిచ్ల మీద ఆడేందుకు ఏమాత్రం సన్నద్ధం కాలేదు. ఎందుకంటే.. మన సెలక్టర్లు కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వీరిని విదేశీ టూర్కు ఎంపిక చేశారు. ఐపీఎల్ మన బ్యాటర్లకు ఓ కవచం వంటిది. ఇక్కడ రాణిస్తే చాలు జాతీయ జట్టులోకి వచ్చేస్తామనే నమ్మకం కుదిరింది.అయితే, ఐపీఎల్ రూపొందించినటువంటి ఫ్లాట్ పిచ్లను నేను జీవితంలో ఇంత వరకు చూడనేలేదు. వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు.. ముఖ్యంగా టాపార్డర్లో వచ్చిన వాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు రాబడుతున్నారు.మరి విదేశాల్లో వికెట్లు ఇలా ఉండవు కదా. అక్కడ మార్బుల్ షీట్పై బ్యాటింగ్ చేయడం కుదరదు. ఇలాంటపుడే సెలక్టర్లు మరింత తెలివిగా ఆలోచించాల్సింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన శుబ్మన్ గిల్ వంటి ఆటగాళ్లను సెలక్ట్ చేయాల్సింది.దిక్కుమాలిన ఐడియా ఇచ్చిన వారిపైనే వేటుఈ పరాజయాల నేపథ్యంలో లోతుగా విచారణ, విశ్లేషణ జరపాలి. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లు రూపొందించమని బీసీసీఐకి సలహా ఇచ్చిన వారిని ముందుగా తొలగించాలి. ఐపీఎల్ను మరింత పాపులర్ చేయాలని.. వాణిజ్యపరంగా లాభాలు పొందాలని చూస్తే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయి’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా వరుస సిరీస్లలో వైట్వాష్ నేపథ్యంలో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని ఇంగ్లండ్కు కోల్పోయింది.చదవండి: ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్కోచ్గా ద్రవిడ్? -
‘వైభవ్ కోసం అతడిని బలిపశువును చేశారు’
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వైభవ్ సూర్యవంశీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడికి వచ్చిన హైప్ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ జట్టుకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. వైభవ్ చేత అంత త్వరగా అంతర్జాతీయ అరంగేట్రం చేయించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. కేవలం మీడియా సృష్టించిన హైప్, ప్రజల్లోని ఎమోషన్స్ చూసి సెలెక్టర్లు తొందరపడ్డారని పేర్కొన్నాడు.ఐర్లాండ్తో టీ20 సిరీస్కు అవకాశం లభించని వైభవ్కు ఇంగ్లండ్ పర్యటనలో రెండో టీ20లో అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్ ఆడిన సంజు శాంసన్ను రెండో మ్యాచ్లో పక్కన పెట్టి అతడి స్థానంలో వైభవ్కు అవకాశం ఇచ్చారు. అయితే వరుసగా మూడు మ్యాచ్ల్లో వైభవ్ కేవలం 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ఐదో టీ20 మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి మళ్లీ శాంసన్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రయోగాలపై స్పందించిన వసీం జాఫర్.. అసలు శాంసన్ ఫామ్లో లేడనే బలమైన నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి మార్పులు చేయకూడదని హితవు పలికాడు. సంజు శాంసన్ లాంటి మ్యాచ్ విన్నర్కు జట్టులో క్రమబద్ధమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్న వయస్కుడని, అతనికి ఇంకా చాలా సమయం ఉందని జాఫర్ గుర్తుచేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే ముందే కేవలం టీమ్తో ప్రయాణిస్తూ, వెలుపల నుండి ఆటను గమనిస్తూ అతను ఎంతో నేర్చుకోవచ్చని సూచించాడు. 2026 టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన శాంసన్ను కేవలం వైభవ్ కోసం పక్కనబెట్టి అతడిని బలిపశువును చేయడం సరైన చర్య కాదన్నాడు.కేవలం మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో కంగారుగా జట్టులోకి తెచ్చి ఒత్తిడి పెంచడం పద్ధతి కాదన్నాడు. తదుపరి జింబాబ్వే టూర్ కోసం వైభవ్ను ఎంపిక చేసి, కేవలం ఒకే ఫార్మాట్ ఆడే సంజు శాంసన్ను పక్కన పెట్టడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వసీం జాఫర్ తెలిపాడు.చదవండి: సెమీస్ సమరం.. ఎవరి బలమెంత? -
లార్డ్స్లో శతకం.. 11వ ప్లేయర్గా యస్తిక భాటియా రికార్డు
ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ సేన విజయానికి చేరువలో ఉంది. 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం 130 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత జట్టు గెలుపు లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో భారత వికెట్ కీపర్ యస్తిక భాటియా లార్డ్స్ స్టేడియంలో అరుదైన రికార్డు సాధించింది. మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో (113; 14 ఫోర్లు) సూపర్ సెంచరీ సాధించిన యస్తిక భాటియా లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డులకెక్కింది. సెంచరీతో లార్డ్స్ స్టేడియంలోని బ్యాటింగ్ హానర్స్ బోర్డులో యస్తిక తన పేరును లిఖించుకుంది. లార్డ్స్ స్టేడియంలో మహిళల క్రికెట్లో ఇదే తొలి టెస్టు కావడంతో ఇప్పటివరకు భారత క్రికెటర్ స్మృతి మంధాన సాధించిన 83 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. తాజాగా యస్తికా ఆ రికార్డును సవరించింది. ఇక ఓవరాల్గా భారత క్రికెట్లో (పురుషులు, మహిళలు) కలిపి లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో ఇప్పటివరకు 11 మంది ప్లేయర్లు శతకాలు సాధించారు.లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన భారత క్రికెటర్ల జాబితా👉వినూ మన్కడ్ (184 పరుగులు, 1952)👉గుండప్ప విశ్వనాథ్ (113 పరుగులు, 1979)👉దిలీప్ వెంగ్సర్కార్ (103 పరుగులు 1979లో; 157 పరుగులు 1982లో; 126 నాటౌట్ 1986లో)👉రవిశాస్త్రి (100 నాటౌట్, 1990)👉మహ్మద్ అజారుద్దీన్ (121, 1990)👉సౌరవ్ గంగూలీ (131, 1996)👉అజిత్ అగార్కర్ (109 నాటౌట్, 2002)👉రాహుల్ ద్రవిడ్ (103 నాటౌట్, 2011)👉అజింక్య రహానే (103, 2014)👉కేఎల్ రాహుల్ (129, 2025)👉యస్తిక భాటియా (105, 2026) A maiden Test hundred for Yastika Bhatia at the Home of Cricket.👏🏻👏🏻Watch #ENGWvINDW LIVE on #SonyLIV & #SonySportsNetwork 📺🔥 pic.twitter.com/PaKcZzu6rn— Sony LIV (@SonyLIV) July 12, 2026 History at the Home of Cricket. Yastika Bhatia becomes the first woman ever to score a Test century at Lord’s.The first woman. Ever.And with that, her name goes straight onto the Lord’s Honours Board.What a place to score your maiden Test hundred. 👏 pic.twitter.com/wBA7mOsjRd— CofCricket (@CofCricket) July 12, 2026చదవండి: ఇంగ్లండ్ టెస్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్! -
ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా
చరిత్రాత్మక లార్డ్స్ టెస్ట్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్మాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 341-7 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్కు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యస్తిక భాటియా (113) సూపర్ సెంచరీతో, ఆఖర్లో రిచా ఘోష్ (50 నాటౌట్) మెరుపు అర్ద శతకంతో చెలరేగారు. స్మృతి మంధాన (70) అర్ద సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 5 వికెట్లతో రాణించింది.అంతకుముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్లో జరుగతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ఘనత, సెంచరీ చేసి క్రాంతి గౌడ్, యస్తిక భాటియా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారు. లార్డ్స్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్గా క్రాంతి.. తొలి సెంచరీ చేసిన బ్యాటర్ యస్తిక రికార్డు సృష్టించారు. -
భారత్పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి
భారత్పై చరిత్రాత్మక టీ20 సిరీస్ విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రత్యేక బహుమతి ఇచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మద్యపానంపై కఠిన నిబంధనలు అమలు చేసినప్పటికీ, భారత్పై 4-0తో సిరీస్ గెలిచిన సందర్భంగా ఆటగాళ్లు విజయోత్సవాలు జరుపుకునేందుకు తాత్కాలికంగా ఆంక్షలను సడలించాడు.ఇటీవల హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్లకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఈసీబీ ఆటగాళ్లపై కఠిన మార్గదర్శకాలు అమలు చేసింది. అర్ధరాత్రి కర్ఫ్యూ, టెస్టు మ్యాచ్ల మధ్య లేదా మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు మద్యం సేవించకూడదనే నిబంధనలను తీసుకొచ్చింది. అలాగే మద్యం మత్తులో బహిరంగ ప్రదేశాల్లో కనిపించవద్దని కూడా హెచ్చరించింది.అయితే భారత్పై అద్భుత విజయంతో ఆటగాళ్ల కృషిని గుర్తించిన మెకల్లమ్, విజయానందాన్ని ఆస్వాదించేందుకు వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడు. "ఆటగాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. విజయం సాధించిన తర్వాత ఆ ఆనందాన్ని ఆస్వాదించే హక్కు వారికి ఉంది. ఎవరికైనా బీర్ తాగాలనిపిస్తే ఈ రోజు అందుకు సరైన సందర్భమే. అయితే అది పరిమితంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతిగా ప్రవర్తించకూడదు. ముఖ్యంగా రేపటి పత్రికల మొదటి పేజీలో తప్పు కారణాలతో కనిపించకూడదు" అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు.భారత్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించి 4-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల టీ20 జట్టు ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్
చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు వికెట్కీపర్-బ్యాటర్ యస్తిక భాటియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మూడో రోజు ఆటలో అద్భుత సెంచరీ సాధించింది. తద్వారా లార్డ్స్లో తొలి టెస్ట్ శతకం నమోదు చేసిన మహిళా బ్యాటర్గా రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరును చిరస్థాయిగా లిఖించుకుంది.మూడో రోజు స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించిన యస్తిక, ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. మంధానా 70 పరుగుల వద్ద ఔటైన తర్వాత ఇన్నింగ్స్ను చక్కగా నిర్మిస్తూ భారత్ ఆధిక్యాన్ని 350 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించింది.భోజన విరామ సమయానికి 99 పరుగులతో నాటౌట్గా నిలిచిన యస్తిక, విరామం అనంతరం కేవలం ఆరు బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసింది. ఇస్సీ వాంగ్ వేసిన 68వ ఓవర్ చివరి బంతిని కవర్స్ వైపు సింగిల్ తీసి 145 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీని అందుకుంది.ఈ సెంచరీతో యస్తిక మరో అరుదైన రికార్డును కూడా నెలకొల్పింది. లార్డ్స్లో టెస్టు సెంచరీ చేసిన రెండో భారత ఎడమచేతి బ్యాటర్గా (పురుషులు, మహిళలు) నిలిచింది. 1996లో తన అరంగేట్రం టెస్టులో సౌరవ్ గంగూలీ చేసిన 131 పరుగుల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత ఎడమచేతి బ్యాటర్ యస్తికనే.ఇదే మ్యాచ్లో భారత యువ పేసర్ క్రాంతి గౌడ్ కూడా ఆనర్స్ బోర్డులో తన పేరు లిఖించుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్తో ఆమె ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఈ ఘనత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు రెండో సెషన్ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి 402 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యస్తిక సెంచరీ (113) అనంతరం ఔటైంది. రిచా ఘోష్ (15), స్నేహ్ రాణా (0) క్రీజ్లో ఉన్నారు. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. -
ఇషాన్ కిషన్ గొప్ప మనసు
భారత వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మానవత్వాన్ని చాటుతూ పాకిస్థాన్కు చెందిన ప్రత్యేక అవసరాలున్న (శారీరక వైకల్యం) ఓ అభిమానికి మరపురాని అనుభూతిని అందించాడు. ఇంగ్లండ్తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్కు ముందు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.VIDEO OF THE DAY.....!!!! ❤️ - Ishan Kishan specially came over to meet a Pakistan fan. A lovely gesture. 👏 pic.twitter.com/xwjPxiX3dz— Sheri. (@CallMeSheri1_) July 12, 2026మ్యాచ్కు ముందు వార్మప్కు వెళ్లే క్రమంలో స్టేడియంలో ఉన్న సదరు అభిమానిని గమనించిన ఇషాన్ కిషన్ స్వయంగా అతడి వద్దకు వెళ్లాడు. అతడితో చేతులు కలిపి, చిరునవ్వుతో పలకరిస్తూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. ఈ అనూహ్యమైన ఆత్మీయతతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు ఇషాన్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. దేశాల మధ్య విభేదాలను పక్కకు పెట్టి మంచి మనసు చాటుకున్నాడని అంటున్నారు.ఇదిలా ఉంటే, ఐదో టీ20లోనూ టీమిండియాకు ఇంగ్లండ్ చేతిలో భంగపాటే ఎదురైంది. ఈ ఓటమితో భారత జట్టు 0-4 తేడాతో సిరీస్ను కోల్పోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ తరఫున జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. -
టీ20 సిరీస్ ఓటమి.. నంబర్వన్ ర్యాంక్ గోవిందా
నాలుగు నెలల కిందట జరిగిన టీ20 ప్రపంచకప్ను మూడోసారి కైవసం చేసుకొని నంబర్వన్ స్థానాన్ని అధిరోహించిన టీమిండియా తాజాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఓటమితో ఆ స్థానాన్ని కోల్పోయింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో ఇంగ్లండ్కు అప్పగించి దారుణ పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు సిరీస్తో పాటు నంబర్వన్ స్థానాన్ని కూడా ఇంగ్లండ్కు అప్పగించేసింది. 1605 రోజుల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.పాయింట్ల పరంగా మార్పు లేనప్పటికీ మ్యాచ్ల పరంగా తేడా ఉండడంతో ఇంగ్లండ్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో భారత్ (268 పాయింట్లు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (260 పాయింట్లు) కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో నంబర్వన్ ర్యాంకు కోల్పోవడంతో పాటు రెండు వరుస టీ20 సిరీస్లు ఓడడం కూడా టీమిండియాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఓటమి ద్వారా పలు చెత్త రికార్డులను కూడా భారత్ తన పేరిట లిఖించుకుంది.👉టీమిండియాకు పరుగుల పరంగా (56 పరుగులు) ఇది నాలుగో అతిపెద్ద ఓటమి. గతంలో 2026లో ఇంగ్లండ్ చేతిలోనే 125 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 2091లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగులు, 2026లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.👉ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఓడడం ద్వారా ఒక సిరీస్లో అత్యధిక ఓటములు చవిచూసినట్లయింది. గతంలో 2009 మహిళల ప్రపంచకప్లో మూడు ఓటములు, 2010 మహిళల ప్రపంచకప్లో మూడు ఓటములు, 2023 వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో మూడు ఓటములు చవిచూసింది.👉కెప్టెన్గా తొలి ఏడు టీ20 మ్యాచ్ల్లో గెలుపు లేని ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ చోటు సంపాదించాడు. గతంలో బ్రెండన్ టేలర్ (జింబాబ్వే), ఎల్టన్ చిగుంబరా (జింబాబ్వే), తిసారా పెరీరా (శ్రీలంక) ఈ ఫీట్ సాధించారు. ఇక భారత కెప్టెన్లలో రెండు వరుస టీ20 సిరీస్లతో పాటు ఏడు మ్యాచ్ల్లో గెలుపు రుచి చూడని తొలి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు నమోదు చేశాడు.👉 భారత క్రికెటర్ ప్రిన్స్ యాదవ్ ఒక చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంబటి రాయుడు తర్వాత తాను ఆడిన మొదటి నాలుగు మ్యాచ్ల్లోనూ ప్రిన్స్ యాదవ్ ఓటమి చవిచూడడం గమనార్హం. 🚨 INDIA’S REIGN AS THE NO.1 RANKED T20I TEAM IS OVER AFTER 1,605 DAYS. 🚨 pic.twitter.com/LOr51llcdt— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2026చదవండి: 'ఇది మాకు గుణపాఠం.. ఓటమికి కారణం అదే' -
'ఇది మాకు గుణపాఠం.. ఓటమికి కారణం అదే'
ఐర్లాండ్ టూర్లో 0-2తో క్లీన్స్వీప్ అయిన టీమిండియా ఇంగ్లండ్ టూర్లోనూ అదే కంటిన్యూ చేసింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో ఇంగ్లండ్కు అప్పజెప్పి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. శనివారం రాత్రి జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఇది వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఆరో ఓటమి (ఒక మ్యాచ్ వర్షంతో రద్దు) కావడం గమనార్హం. ఏడు మ్యాచ్లుగా గెలుపు మొహం చూడని శ్రేయస్ అయ్యర్ టీమిండియా తరఫున అత్యంత చెత్త కెప్టెన్గా రికార్డులకెక్కాడు. మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్తో సిరీస్ ఓటమి తమకు ఒక గుణపాఠం లాంటిదని పేర్కొన్నాడు. బ్యాటింగ్లో రాణించినప్పటికీ పేలవ ఫీల్డింగ్తో పాటు నాణ్యత లేని బౌలింగ్ జట్టు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపాడు. అయ్యర్ మాట్లాడుతూ.. 'నిజాయితీగా చెప్పాలంటే ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. ఐదు మ్యాచ్ల సిరీస్లో మేము ఆడిన ప్రతి మైదానంతో పోలిస్తే మేము ఆడిన వికెట్లలో ఇదే బహుశా అత్యుత్తమమైనది కావొచ్చు. మ్యాచ్ మ్యాచ్కు పరిస్థితులు మారిపోతున్నాయి. తొలుత ఇంగ్లండ్ గడ్డపై బ్యాటింగ్ చేయడానికే చాలా కష్టపడ్డాం. కానీ ఇవాళ్టి మ్యాచ్లో బ్యాటింగ్లో చాలా మెరుగయ్యామనిపించింది. ప్రొఫెషనల్ ఆటలో ఓటములు సహజమే. కానీ ఈ సిరీస్ ఓటమి మాకు గుణపాఠం లాంటిది. మ్యాచ్లు గెలవడంలో ఫీల్డింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. నేటి మ్యాచ్లో మూడు క్యాచ్లు జారవిడవడంతో పాటు పేలవంగా ఫీల్డింగ్ చేశాము. 200-210 పరుగుల టార్గెట్ను ఈ గ్రౌండ్లో ఈజీగా ఛేదించవచ్చు. 200 నుంచి 225 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ మా తప్పిదాల వల్ల మరో 25 నుంచి 30 పరుగులు అదనంగా రాబట్టింది. పేలవ ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక బ్యాటింగ్ సమయంలో పవర్ ప్లేలో వెనువెంటనే వికెట్లు కోల్పోవడం కూడా విజయాన్ని దూరం చేసినట్లయింది. మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యాం. బౌలింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుమ్రా, పాండ్యా వంటి అనుభవజ్ఞలైన బౌలర్లు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇంగ్లండ్ మ్యాచ్ విజయానికి అర్హులు. మొదట బట్లర్.. ఆ తర్వాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ వేగంగా ఆడి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఏది ఏమైనా ఈ సిరీస్ ఓటమి మాకు గుణపాఠం లాంటిది. ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చినప్పుడు మా కుర్రాళ్లు జాగ్రత్తగా ఆడతారని నేను అనుకుంటున్నా. కెప్టెన్గా సిరీస్ ఓటమి నాకు బాధ కలిగించింది. కానీ కెప్టెన్గా మాత్రం చాలా విషయాలు నేర్చుకున్నా.' అని ముగించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్స్లు) టీ20ల్లో రెండో సెంచరీతో చెలరేగగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్లు) త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు), సంజు సామ్సన్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఇప్పటి వరకు ఐసీసీ టి20 టీమ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్న భారత్ను వెనక్కి నెట్టి తాజా ఫలితంతో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జూలై 14న ప్రారంభం కానుంది.చదవండి: ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ సెమీస్కి.. నార్వే ఇంటికి.. -
మంధాన మరోసారి.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి, మొత్తంగా 269 పరుగుల ఆధిక్యంలో (117 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది) కొనసాగుతోంది. షఫాలీ వర్మ (33) ఔట్ కాగా.. స్మృతి మంధాన (69), యస్తికా భాటియా (39) క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.వీరితో పాటు మయా బౌచియర్ (23), మ్యాడీ విల్లియర్స్ (10), సోఫీ ఎక్లెస్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులకు ఆలౌటైంది.స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. -
బట్లర్ సుడిగాలి శతకం.. ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమి
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ గెలుపు లేకుండానే ముగించింది. సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జులై 11) జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఇంగ్లండే గెలుపొందింది. తద్వారా 4-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.నేటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (4-0-60-0), అక్షర్ పటేల్ (4-0-63-0), సూర్యాంశ్ షేడ్గే (3-0-39-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్ దూబే ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-0), ప్రసిద్ద్ కృష్ణ (4-0-38-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ చేయాల్సిన ప్రయత్నమంతా చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో టీమిండియా చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. తద్వారా 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో సంజూ శాంసన్ (27), శ్రేయస్ అయ్యర్ (28), శివమ్ దూబే (14) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3, ఆదిల్ రషీద్ 2, ఆర్చర్, టంగ్, డాసన్ తలో వికెట్ తీశారు. -
170 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. చరిత్ర సృష్టించిన భారత పేసర్
భారత మహిళల క్రికెట్ జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అరుదైన ఘనత సాధించింది. ఈ మైదానంలో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టిస్తూ ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరు లిఖించుకుంది. ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో క్రాంతి 17 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. ఫలితంగా భారత్ ఇంగ్లండ్ను 170 పరుగులకే కుప్పకూల్చి, 117 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.ఈ ప్రదర్శనతో క్రాంతి మరో ఘనత కూడా సాధించింది. టెస్టు క్రికెట్లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా ఫాస్ట్ బౌలర్గా రికార్డు నెలకొల్పింది.లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు నమోదు కావడం ఏ క్రికెటర్కైనా ఓ కల. అలాంటి అరుదైన గౌరవాన్ని తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకున్న క్రాంతి గౌడ్ భారత మహిళల క్రికెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించింది.మ్యాచ్ విషయానికొస్తే.. క్రాంతి గౌడ్ ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది. వీరితో పాటు మయా బౌచియర్ (23), మ్యాడీ విల్లియర్స్ (10), సోఫీ ఎక్లెస్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్
భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక సార్లు (వరుసగా) టాస్ గెలిచిన కెప్టెన్గా ధోని రికార్డు సమం చేశాడు. శ్రేయస్, ధోని వరుసగా ఏడు మ్యాచ్ల్లో టాస్ గెలిచారు. ఈ జాబితాలో శ్రేయస్, ధోని తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (6), రోహిత్ శర్మ (5) ఉన్నారు.ఇంగ్లండ్తో ఇవాళ (జులై 11) జరుగుతున్న ఐదో టీ20లో టాస్ గెలవడం ద్వారా శ్రేయస్ కోహ్లి రికార్డును అధిగమించి, ధోని రికార్డును సమం చేశాడు.భారత టీ20 కెప్టెన్గా అత్యధిక వరుస టాస్ విజయాలు..శ్రేయస్ అయ్యర్ – 7* (2026)ఎంఎస్ ధోని – 7 (2010-12)విరాట్ కోహ్లీ – 6 (2019)ఎంఎస్ ధోని – 5 (2007)రోహిత్ శర్మ – 5 (2020-22)మళ్లీ టాస్ గెలిచిన శ్రేయస్.. ఆసారైనా మ్యాచ్ గెలిచేనా..?భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏడో మ్యాచ్లో టాస్ గెలిచాడు. అయితే ఈ ఏడు మ్యాచ్ల్లో అతడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాడు. ఐర్లాండ్ సిరీస్తో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఆ సిరీస్లోని రెండు మ్యాచ్ల్లో టాస్ గెలిచి, సిరీస్ను మాత్రం 0-2తో కోల్పోయాడు. ఆతర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లోనూ టాస్ గెలవగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ తర్వాత మూడు మ్యాచ్ల్లోనూ శ్రేయస్ టాస్ గెలిచినా, ఒక్క మ్యాచ్లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు.దీంతో ఈసారైనా మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రేయస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షేడ్గే జట్టులోకి వచ్చారు.భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్ల -
టీమిండియా ఓటమి
ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిఐదో టీ20లోనూ టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా సిరీస్ను 0-4తో కోల్పోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇషాన్ కిషన్ (56) ఔట్12.4వ ఓవర్- ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు). స్కోర్ 131-4. మూడో వికెట్ కోల్పోయిన భారత్10.1వ ఓవర్- శ్రేయస్ అయ్యర్ (28) ఔట్సంజూ శాంసన్ ఔట్5.1వ ఓవర్- 55 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్లో జేకబ్ బేతెల్కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (27) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్2.3వ ఓవర్- 25 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (3) ఔటయ్యాడు. బట్లర్ సెంచరీ.. ఇంగ్లండ్ భారీ స్కోర్సౌతాంప్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లండ్ అతి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (4-0-60-0), అక్షర్ పటేల్ (4-0-63-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్ దూబే ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్లను చీల్చిచెండాతున్న బ్రూక్బ్రూక్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 నాటౌట్బట్లర్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 నాటౌట్14 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 168-1అర్ద సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రూక్, బట్లర్హ్యారీ బ్రూక్ (56), జోస్ బట్లర్ (72) ధాటిగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 146-1గా ఉంది.ధాటిగా ఆడుతున్న బ్రూక్వన్డౌన్లో వచ్చిన హ్యారీ బ్రూక్ ధాటిగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 40 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 73-1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్1.4వ ఓవర్- ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సూర్యాంశ్ షేడ్గేకు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (6) ఔటయ్యాడు.మళ్లీ టాస్ గెలిచిన శ్రేయస్.. ఈసారైనా మ్యాచ్ గెలిచేనా..?శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏడో మ్యాచ్లో టాస్ గెలిచాడు. ఈసారైనా మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టాస్ గెలిచిన శ్రేయస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షేడ్గే జట్టులోకి వచ్చారు.భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్7:15 గంటలకు టాస్భారత జట్టు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం 7:15 గంటలకు టాస్ పడుతుంది. టాస్ ఆలస్యం.. కారణమిదే..!భారత్, ఇంగ్లండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జులై 11) ఐదో టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. భారత జట్టు ట్రాఫిక్లో ఇరుక్కోవడం చేత ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే కొద్ది క్షణాల క్రితం టీమిండియా స్టేడియంకు చేరుకున్నట్లు అప్డేట్. మరికొద్ది నిమిషాల్లో టాస్ పడే అవకాశం ఉంది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్ను భారత్ ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. తర్వాత మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. ఇవాళ నామమాత్రపు చివరి మ్యాచ్ జరుగనుంది. -
టీమిండియాను అవమానించిన పోర్చుగల్ క్రికెట్
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో ఓ భారత అభిమానికి పోర్చుగల్ క్రికెట్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోర్చుగల్ క్రికెట్ చేసిన కామెంట్ క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.పోర్చుగల్ క్రికెట్ జట్టు తమ చివరి 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో కేవలం రెండు పరాజయాలు మాత్రమే చవిచూసిందంటూ క్రికెట్ పోర్చుగల్ సోషల్మీడియాలో ఓ పోస్టు షేర్ చేసింది. దీనిపై స్పందించిన ఓ భారత అభిమాని, "ఈ పోర్చుగల్ అకౌంట్ ఐర్లాండ్ నుంచి నడుస్తున్నట్టుంది" అంటూ కామెంట్ చేశాడు.దీనిపై పోర్చుగల్ క్రికెట్ స్పందిస్తూ, "ఐర్లాండ్ గురించి నిజంగానే మాట్లాడాలనుకుంటున్నావా..?" అంటూ ఒక్క వాక్యంతోనే కౌంటర్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్య భారత జట్టు ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఎదుర్కొన్న టీ20 సిరీస్ పరాజయాన్ని ఉద్దేశించిందని అభిమానులు భావిస్తున్నారు. ఆ సమాధానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతుంది.టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత యూరప్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు, డబ్లిన్లో జరిగిన రెండు టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో ఓడి చరిత్రలో తొలిసారి ఆ జట్టు చేతిలో టీ20 సిరీస్ కోల్పోయింది. అనంతరం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆతర్వాతి మూడు మ్యాచ్ల్లో భారత్ వరుసగా పరాజయాలు చవిచూసి, ఇప్పటికే 0-3తో సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్లో నామమాత్రను చివరి టీ20 ఇవాళ జరుగునుంది.శ్రేయస్ అయ్యర్ టీ20 జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్ భారీ ప్రెషర్ను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి తరుణంలో క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న పోర్చుగల్ లాంటి దేశం టీమిండియాకు కౌంటరివ్వడం గమనార్హం. -
నిషేధం ఎత్తివేసినా!.. ఐపీఎల్ ఆడే ప్రసక్తే లేదు!
ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ జోష్లో ఉన్నాడు. స్వదేశంలో అతడి సారథ్యంలో.. ఇంగ్లండ్ తొలిసారి టీమిండియాపై టీ20 సిరీస్ను 3-0తో గెలిచింది. ఇటు సారథిగా.. అటు బ్యాటర్గా ఈ విజయంలో బ్రూక్ది కీలక పాత్ర.ఈ క్రమంలో ఇంగ్లండ్- టీమిండియా మధ్య శనివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలని బ్రూక్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్ మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.గొప్ప అనుభవం.. కానీ ఆడలేను‘‘ఐపీఎల్లో ఆడటం నిజంగా గొప్ప అనుభవం. ఐపీఎల్ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అయితే, దురదృష్టవశాత్తూ నేనిప్పుడు అక్కడ ఆడేందుకు సమయం కేటాయించే పరిస్థితిలో లేను.నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం నేను మూడు ఫార్మాట్లు ఆడుతూ.. రెండు ఫార్మాట్ల (వన్డే, టీ20)కు కెప్టెన్గా ఉంటూ.. ఐపీఎల్ కూడా ఆడటం అంటే కష్టమే. ప్రస్తుతం నా షెడ్యూల్ కిక్కిరిసి పోయి ఉంది. మహా అయితే ఓ మూడు నెలల విరామం దొరుకుతుంది.అప్పుడు నేను ఆ సమయాన్ని ఐపీఎల్ కోసం పెట్టలేను. కాస్త విరామం తీసుకుని.. ఆ తర్వాత ఫిట్నెస్, ఆటపై దృష్టి పెడతాను. ఇంగ్లిష్ క్రికెట్ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను’’ అని స్వదేశీ, జాతీయ క్రికెట్ పట్ల తనకు ఉన్న అంకితభావాన్ని హ్యారీ బ్రూక్ వివరించాడు.నిషేధం ఎత్తివేసినా సరే కుదరదుకాగా 2023లో హ్యారీ బ్రూక్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున మొత్తంగా 11 మ్యాచ్లలో కలిపి 190 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలివేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది.అయితే, 27 ఏళ్ల హ్యారీ బ్రూక్ 2024, 2025 సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఫ్రాంఛైజీకి హ్యాండిచ్చాడు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అతడిపై 2028 వరకు ఐపీఎల్ నిర్వాహకులు నిషేధం విధించారు. అయితే, బ్రూక్ తాజా వ్యాఖ్యలను బట్టి.. ఒకవేళ గడువు తీరి నిషేధం ఎత్తివేసినా సరే తాను ఇప్పట్లో ఐపీఎల్ ఆడే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఉన్న బ్రూక్.. త్వరలోనే టెస్టు సారథిగానూ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.చదవండి: వెస్టిండీస్ క్రికెటర్ రిటైర్మెంట్ -
వాళ్లిద్దరినీ తొలగించారు.. గంభీర్పైనా వేటు వేయండి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో బీసీసీఐ అతడి స్థానాన్ని గౌతం గంభీర్తో భర్తీ చేసింది. అయితే, గంభీర్ మార్గదర్శనంలో తొలుత శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ను గెలిచిన భారత్.. రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ను లంకకు కోల్పోయింది.ఇక ఆ తర్వాత కూడా గంభీర్ మార్గదర్శనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్గా నిలిచినప్పటికీ.. అందుకు ద్రవిడ్కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని.. నాటి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.ఆ రెండూ మినహా...ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లోనూ టీమిండియా విజేతగా నిలిచినప్పటికీ.. స్వదేశంలో సిరీస్ జరగడం సానకూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు మెగా టోర్నీలు గెలిచినప్పటికీ.. గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా అత్యంత ఘోర పరాభవాలు చవిచూసింది.సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్లో వైట్వాష్ కావడం.. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరకపోవడం ఇందులో ప్రధానమైనవి. అంతేకాదు స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కూడా భారత్ కోల్పోయింది.వ్యంగ్యాస్త్రాలు తాజాగా టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ హోదాలో ఐర్లాండ్లో అడుగుపెట్టి.. పసికూన చేతిలో ఏకంగా 2-0తో వైట్వాష్ అయింది. అనంతరం ఇంగ్లండ్కు కూడా 0-3తో టీ20 సిరీస్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్, జట్టు యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.‘‘అయినా అతడి (గంభీర్)ని ప్రశ్నించేందుకు ఎవరైనా ఉన్నారా?.. అతడిని తప్పుకోమని చెప్పగల ధైర్యం ఉందా?.. ఈరోజు ఇంతజరిగినా ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే అతడు ప్రపంచకప్ గెలిచాడని చెబుతారు.వాళ్లిద్దరినీ తొలగించారు.. అతడిపైనా వేటు వేయండి!మరి సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్గా కప్పు గెలిచాడు. అయినా సరే అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేశారు. జట్టు చాంపియన్గా నిలవడంలో సంజూ శాంసన్ది కీలక పాత్ర. అయినా కూడా అతడిని తుదిజట్టు నుంచి తప్పించారు.మరి వాళ్లిద్దరిలాగే గంభీర్పై వేటు వేయలేరా?.. మీ ఆలోచనా విధానం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుందా?’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ యాజమాన్యం తీరును తూర్పారబట్టాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓడిపోయినప్పటికీ గంభీర్ ముఖంలో కాస్తైనా బాధ కనిపించలేదని చిక్కా మండిపడ్డాడు.కొంచెం కూడా బాధ లేదు‘‘తననూ ఎవరు టచ్ చేయలేరని అతడికి తెలుసు. అందుకే డగౌట్లో కూర్చుని నవ్వులు చిందిస్తున్నాడు. అసలు జట్టు ఓడిపోతోందన్న బాధ అతడిలో కొంచెం కూడా కనిపించలేదు. ఎన్నో సిరీస్లలో వైట్వాష్లు, ఘోర పరాభవాలు.అయినా సరే అతడిని కదిలించేవారే లేరు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న నమ్మకంతోనే అతడు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వాటి గురించి నిర్భయంగా మాట్లాడుతున్నాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs ENG 5th T20I: భారత తుదిజట్టు ఇదే! -
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్పై వేటు!
టీ20 ప్రపంచకప్ చాంపియన్ టీమిండియాకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్కూ సిరీస్ను 0-3తో కోల్పోయింది. ఇక సౌతాంప్టన్ వేదికగా శనివారం నాటి ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో వైట్వాష్ నుంచి టీమిండియా బయటపడుతుంది.పరువు దక్కాలంటేఈ నేపథ్యంలో కనీస పరువు దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నాకౌట్ మ్యాచ్లలో వరుసగా 97*, 89, 89 పరుగులతో రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజూ శాంసన్. అయితే, ఐర్లాండ్తో రెండు టీ20లలో 5, 0 పరుగులు చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్తో తొలి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.సంజూ శాంసన్పై వేటు వేసిఈ నేపథ్యంలో సంజూ శాంసన్పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీతో అరంగేట్రం చేయించింది. అయితే, పదిహేనేళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇంగ్లండ్తో వరుసగా మూడు మ్యాచ్లలో 13, 14, 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇందుకు తోడు జట్టు సైతం వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయింది.తిరిగి తుదిజట్టులోకి ఇక వైభవ్తో పాటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం విఫలమవుతున్నారు. ఇలాంటి తరుణంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ను తిరిగి తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాపార్డర్లో ముగ్గురూ లెఫ్టాండర్లే (అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్) ఉండటం కూడా సమస్యగా మారిందని.. ఈసారి సంజూను చేర్చి లెఫ్ట్- రైట్ కాంబినేషన్తో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. లేదంటే వైభవ్ను కొనసాగించి.. తిలక్ వర్మ లేదంటే ఇషాన్ కిషన్ను తప్పిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.అయితే, తిలక్ ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్నాడు. కాబట్టి అతడిని తుదిజట్టు నుంచి తీసేయడం కష్టం. మరోవైపు.. ఇషాన్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్నప్పటికీ.. వన్డౌన్లో సంజూ ఆడగలడు కాబట్టి అతడు ఇషాన్ను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ స్థానంలో రవి బిష్ణోయి, సూర్యాంశ్ షెడ్గే రానున్నట్లు సమాచారం.ఇంగ్లండ్తో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయి. -
భారత టీ20 జట్టులోకి ఊహించని ప్లేయర్!
ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆఖరి టీ20 మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. కాగా విదేశీ గడ్డ మీద టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.తొలుత పసికూన చేతిలోటీ20 ప్రపంచకప్-2026 చాంపియన్గా ఐర్లాండ్లో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో భారత్ ఓటమిపాలైంది.ఫలితంగా ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మూడో టీ20 జరుగనున్న నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.అనుచిత నిర్ణయాల వల్లే సెలక్షన్ విషయంలో అనుచిత నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ గతి పట్టిందని చిక్కా మండిపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడైన కేఎల్ రాహుల్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యానికి సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..గిల్కు ఛాన్స్ ఇచ్చారు..‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ను భారత టీ20 జట్టులోకి తిరిగి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి శుబ్మన్ గిల్కు ఓ అవకాశం దక్కింది. వన్డే, టెస్టు కెప్టెన్ అయిన అతడిని నేరుగా టీ20 జట్టు వైస్ కెప్టెన్గా నియమించారు.అతడిని టీ20 ఫార్మాట్లోనూ ఆడించండికానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ తర్వాత గిల్ను పక్కనపెట్టేశారు. అయితే, కేఎల్ రాహుల్కు కనీసం అలాంటి ఒక్క అవకాశం కూడూ దక్కలేదు. రాహుల్ను కేవలం టెస్టు, వన్డేలకే పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తోంది.ఫ్లాట్ పిచ్ల మీదే మనోళ్ల ప్రతాపంనిజానికి అతడి టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. ఎలాంటి పిచ్ మీద అయినా రాహుల్ ఆడగలడు. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ లైనప్ కేవలం ఫ్లాట్ పిచ్ల మీద మాత్రమే పరుగుల వరద పారిస్తోంది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ టోర్నీలో సౌతాఫ్రికా భయపెట్టగానే.. వెంటనే పిచ్లు మార్చమని మనోళ్లు అడిగారు. ఇక ఐపీఎల్లో లక్నో పిచ్ మీద భారత బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. మన బ్యాటర్లు తడి టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేస్తూ పేస్, బౌన్సీ కండిషన్లకు మరింతగా అలవాటు పడాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పొట్టి ఫార్మాట్లో కేఎల్ రాహుల్ చివరగా 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడాడు. ఇప్పటికి మొత్తంగా 72 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2265 పరుగులు సాధించాడు. సగటు 37.7 కాగా స్ట్రైక్రేటు 139.13. రాహుల్ ఖాతాలో 22 టీ20 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి -
కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ఆరంభించిన కోహ్లి తొలి వన్డేలో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. తాజాగా కోహ్లికి సంబంధించి ఒక సీక్రెట్ సంభాషణను ఇంగ్లండ్ క్రికెటర్ జోర్డాన్ కాక్స్ లీక్ చేయడం వైరల్గా మారింది. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ కోహ్లితో జరిపిన పర్సనల్ సంభాషణకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటికి వచ్చాయి. దీనిపై జోర్డాన్ కాక్స్ స్పందించాడు. 'గత నెలలో కోహ్లిని లండన్లో కలిశాను. అయితే కోహ్లితో సమావేశాన్ని గోప్యంగా ఉంచాలని భావించాను. కానీ మేమిద్దరం మాట్లాడుకుంటున్న ఫొటోలు ఎవరో రహస్యంగా చిత్రీకరించారు. తాజాగా ఆ ఫొటోలు బయటికి లీకయ్యాయి. మేమిద్దరం మాట్లాడుకుంటున్న సమయంలో కొందరు మా పక్క నుంచి మాట్లాడుకుంటూ వెళ్లారు. నాకు తెలిసి వాళ్లలోనే ఎవరో ఒకరు మా ఫొటోలు తీసి సోషల్ మీడియలో షేర్ చేశారనిపించింది. నిజానికి కోహ్లి లండన్లో ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకున్నాడంట. కానీ ఇక్కడ కూడా తనకు పాపులారిటీ రావడంతో ఇకపై లండన్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు కోల్పోతానేమో అని కోహ్లి నాతో చెప్పాడు. ఇక ఐపీఎల్ సమయంలో కోహ్లి నాకు అండగా నిలబడ్డాడు. కొంతమంది ఆటగాళ్లు తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. కానీ కోహ్లి మాత్రం తనతో పాటు ఉండే సహచరులకు సంబంధించి అన్ని విషయాలపై దృష్టి పెట్టడమే గాక అవసరమైతే సలహాలు కూడా ఇస్తుంటాడు. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలిపింది' అని జోర్డాన్ కాక్స్ చెప్పుకొచ్చాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్కు, ఆ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం కూడా ఉంది. కోహ్లితో పాటు రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్పై ఒక నిర్ణయానికి వచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్ గెలుచుకుంది. సిరీస్లో చివరి మ్యాచ్ నేడు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి వైట్వాష్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా భావిస్తోంది.ఇక జూలై 14 నుంచి 19 మధ్య ఇంగ్లండ్, భారత్ మధ్య మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకు 311 వన్డేల్లో 14,797 పరుగులు సాధించాడు. ఇందులో 54 సెంచరీలు, 77 అర్ధసెంచరీలు ఉన్నాయి.చదవండి: ఇంగ్లండ్తో సిరీస్ ఓటమి.. తొలి దెబ్బ అతడికేనా? -
హాఫ్ సెంచరీతో మంధాన ప్రపంచ రికార్డు
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో మెరిసింది. లార్డ్స్ వేదికగా మహిళల క్రికెట్లో ఇదే తొలి టెస్టు కావడంతో మంధాన అరుదైన ఫీట్ సాధించింది. లార్డ్స్ వేదికలో అర్ధసెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా మంధాన రికార్డులకెక్కింది. 50 బంతుల్లో ఫిఫ్టీ సాధించిందిన మంధాన ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతేకాదు మంధాన తన ఫిఫ్టీతో మరో రికార్డు కూడా అందుకుంది. టెస్టు క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో మంధాన చోటు దక్కించుకుంది. గతంలో 2021లో ఆస్ట్రేలియాతో టెస్టులో 51 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన మంధాన ఇంగ్లండ్తో టెస్టులో 50 బంతుల్లో ఆ మార్క్ను చేరుకుంది. భారత క్రికెటర్లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మూడో క్రికెటర్గా నిలిచింది. మంధాన కంటే ముందు సంగీతా డాబిర్ (1995లో ఇంగ్లండ్తో మ్యాచ్లో 42 బంతులు), శుభా సతీశ్ (2023లో ఇంగ్లండ్తో మ్యాచ్లో 49 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మంధాన ఐదో స్థానంలో ఉంది. తొలి స్థానంలో సంగీతా డాబిర్ ఉండగా, ఇంగ్లండ్కు చెందిన నట్ సివర్ బ్రంట్ (46 బంతులు, 48 బంతులు) రెండుసార్లు ఈ ఫీట్ అందుకోగా, శుభా సతీశ్ నాలుగో స్థానంలో ఉంది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 25 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మంధాన (56), హర్మన్ప్రీత్ (15) పరుగులతో క్రీజులో ఉన్నారు. First Test FIFTY in women's cricket at Lord's 🏟️And it's none other than #TeamIndia vice-captain Smriti Mandhana 👏👏Updates ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND pic.twitter.com/Z2oaM5vqsz— BCCI Women (@BCCIWomen) July 10, 2026చదవండి: చెప్పి మరీ ఔట్ చేశాడు.. వైభవ్కు ఆర్చర్ స్ట్రోక్! -
చెప్పి మరీ ఔట్ చేశాడు.. వైభవ్కు ఆర్చర్ స్ట్రోక్!
ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్తో అలరించిన వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇదే జట్టులో సహచరుడిగా ఉన్న జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ సమయంలో వైభవ్ను ఔట్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి అస్త్రాలున్నాయని అడిగినప్పుడు, అదేంటనేది ఐపీఎల్ ముగిసిన తర్వాత మీకే తెలుస్తోందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీని జోఫ్రా ఆర్చర్ రెండుసార్లు ఔట్ చేయడం గమనార్హం. షార్ట్ పిచ్ బంతులు ఆడడంలో తన బలహీనతను బయటపెట్టుకున్న వైభవ్ ఆర్చర్కు దొరికిపోయాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఆర్చర్ షార్ట్ పిచ్ బంతులు ఆడలేక వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్చర్ చెప్పి మరీ వైభవ్కు స్ట్రోక్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఐపీఎల్లో ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై ఇబ్బంది పడడం వెనుక ప్రధాన కారణం ఇంగ్లండ్, ఇండియాలోని పిచ్ల మధ్య ఉన్న తేడానే. ఈ సిరీస్ లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఆర్చర్ బౌలింగ్లో రెండు సార్లు ఔటయ్యాడు. ఈ రెండు సార్లు కూడా వైభవ్ బంతి ఎక్కువగా బౌన్స్ అవ్వడం వల్ల ఇబ్బంది పడ్డాడు. మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ ఓ షార్ట్ బాల్కు తన బ్యాట్ తగిలి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో టీ20లో బంతి మంచి లెంగ్త్లో రాగా.. వైభవ్ సూర్యవంశీ ఓ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి.. బ్యాట్ పైభాగానికి తగిలి 30 గజాల సర్కిల్ లోపల క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. Jofra Archer was asked about how to bowl against Vaibhav Suryavanshi & he said, I will tell you after the IPL as he knew India & England will play after IPL.& here, he got Vaibhav out in 2 consecutive games🔥🔥pic.twitter.com/O3aiDalTQh— Rajiv (@Rajiv1841) July 9, 2026 Does Jofra Archer really have the secret to stop Vaibhav Sooryavanshi? 🤔😅Scorecard ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/MN65hq2gH9— IndianPremierLeague (@IPL) May 27, 2026Read: ఒళ్లు మండిన గాఫ్.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక! -
BCCI సంచలన నిర్ణయం? అప్పుడు గిల్.. ఇప్పుడు తిలక్
-
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు.. శ్రీ చరణి అరంగేట్రం
మహిళల టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరకుండానే హర్మన్ సేన ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఈ మ్యాచ్ ద్వారా ఇరుజట్ల తరఫున ముగ్గురు ఆటగాళ్లు టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. భారత్ తరఫున తెలుగుతేజం శ్రీ చరణి టెస్టు క్రికెట్లో డెబ్యూ చేసినట్లు కెప్టెన్ హర్మన్ప్రీత్ తెలిపింది. ఇక శ్రీ చరణితో పాటు యస్తిక బాటియా కూడా తుది జట్టులోకి తిరిగివచ్చినట్లు పేర్కొంది. ఇంగ్లండ్ తరఫున ఎలీస్ కాప్సీ, మాడీ డివిలియర్స్ అరంగేట్రం చేశారు.పురుషుల క్రికెట్ మాదిరి కాకుండా మహిళల టెస్టు మ్యాచ్ నాలుగురోజులు మాత్రమే జరుగుతుంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 15 టెస్టు మ్యాచ్లు జరిగితే.. ఇందులో భారత్ మూడు గెలవగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలిచింది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, సయాలీ సత్ఘరే, శ్రీ చరణీ, క్రాంతి గౌడ్ఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, మైయా బౌచియర్, హెదర్ నైట్, నాట్ సైవర్-బ్రంట్(కెప్టెన్), ఆలిస్ క్యాప్సీ, అమీ జోన్స్(వికెట్ కీపర్), మాడీ విలియర్స్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్, లారెన్ బెల్, లారెన్ ఫైలర్ -
తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!.. గంభీర్కు గండం!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చాంపియన్గా నిలిచిన టీమిండియా.. మెగా ఈవెంట్ తర్వాత దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారిగా టీ20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.అత్యంత చేదు అనుభవంవరల్డ్కప్లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై అనూహ్యంగా వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఈ టూర్ నుంచి శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. అయితే, శ్రేయస్కు సారథిగా తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది.ఇంగ్లండ్ పర్యటనలోనూఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్స్వీప్ అయింది. ఐరిష్ జట్టు చేతిలో ఓటమి చెందడం.. సిరీస్ను భారత్ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో టీమిండియా ఓటమి పాలైంది.తీవ్ర స్థాయిలో విమర్శలుఈ క్రమంలో ఇంగ్లండ్ 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టు ఎంపికలో గంభీర్దే అంతిమ నిర్ణయం అని.. తరచూ మార్పులు చేస్తూ కెప్టెన్ను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం గంభీర్కు ఇష్టం లేదని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిడితోనే అతడు ఇందుకు అంగీకరించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్లు కోల్పోవడం సందేహాలకు తావిస్తోంది.తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం వరుస ఓటములపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సేనతో పాటు.. గంభీర్ టీమ్పైనా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.వేటు పడుతుందా?ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా స్వదేశానికి తిరిగి రాగానే వరుస ఓటములపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. గంభీర్పై కూడా స్క్రుటినీ ఉంటుంది’’ అని తెలిపాయి. కాగా గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్గా సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్గా ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఉన్నారు.ఇక తాజా సిరీస్లలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో ఎవరిపైనైనా వేటు పడుతుందా? లేదంటే గంభీర్ చెప్పినట్లు సంధి దశ కాబట్టి పదవీకాలం పూర్తయ్యేంత వరకు వీరిని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గంభీర్ కాంట్రాక్టు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే.గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా డిజాస్టర్లు ఇవే👉స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్👉పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)ని చేజార్చుకున్న భారత్👉పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో 2-0తో వైట్వాష్ 👉అరంగేట్రం నుంచి మూడు సీజన్లలో డబ్ల్యూటీసీ ప్రపంచకప్ ఫైనల్కు చేరకపోవడం ఇదే తొలిసారి (2023-25)👉సొంతగడ్డపై న్యూజిలాండ్కు తొలిసారి వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్👉ఐర్లాండ్కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన భారత్👉ఇంగ్లండ్కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి (ఇంగ్లండ్తో రెండో టీ20లో 125 పరుగుల తేడాతో చిత్తు) etc.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ -
‘శ్రేయస్ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’
ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై అదే దారుణ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా, ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన టీమిండియా 0-3తో ఇంగ్లండ్కు సిరీస్ను కోల్పోయింది. కనీసం చివరి టీ20లోనైనా విజయం సాధించి గౌరవప్రదంగా సిరీస్ను ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఇక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటర్గా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్గా వరుస ఓటములు అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట ఓటమి (ఒక మ్యాచ్ రద్దు) పాలయ్యింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా టీ20ల్లో ఇప్పటిదాకా గెలుపు రుచి చూడలేదు. అటు టీమిండియా కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి అయ్యర్తో పాటు కోచ్ గంభీర్పై కూడా కత్తి వేలాడుతోందనే వార్తలు వస్తున్నాయి. అదీగాక జింబాబ్వే టూర్తో పాటు ఆసియా గేమ్స్కు హెడ్కోచ్ గంభీర్కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ను టీమిండియా వెంట పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ రెయాన్ టెన్డెస్కటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో టెన్ డస్కటే మాట్లాడాడు. 'టీమిండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియాకు వెంటనే విజయాలు రావాలంటే ఎలా? కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. మ్యాచ్ ఓటములకు శ్రేయస్ను నిందించడం ఆపండి. అతడు కెప్టెన్గా నిలుదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు వచ్చే ఓటములే తర్వాత గెలుపుకు బాటలు వేస్తాయి. నిజానికి శ్రేయస్ తన నాయకత్వాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం కొన్ని మ్యాచ్లకే అతడు కెప్టెన్గా వైఫల్యం చెందాడని పేర్కొనడం సరికాదు. అంతకముందు సూర్యకుమార్ కూడా ఆరంభంలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకాలం ఒక కెప్టెన్సీలో ఆడి ఇప్పుడు మరో కొత్త కెప్టెన్తో ఆడుతుండడంతో జట్టులో సమతుల్యం లోపించింది. రాబోయే రోజుల్లో అది చక్కబడి మళ్లీ అంతా సవ్యంగా సాగుతుంది. ఇక జట్టులో పాండ్యా, బుమ్రా లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 190 పరుగులు సాధించడమే గాక కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. టీమిండియా మ్యాచ్లు ఓడుతున్నప్పటికీ అయ్యర్ మాత్రం బ్యాటర్గా విఫలం కాలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్, టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా ఆడనున్నాయి. 🔴 STOP BLAMING SHREYAS IYER – COACH SAYS HE NEEDS TIME 🤯🎙️: Ryan ten Doeschate backed Shreyas, saying he deserves time as captain. He praised Iyer's leadership, accountability, and batting, urging everyone not to judge him after just a few matches.pic.twitter.com/tqNDEQAXEm— Sam (@cricsam02) July 10, 2026Read: అరుదైన ఫీట్తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ గడ్డపై గత రెండు టీ20 సిరీస్లను సొంతం చేసుకున్న టీమిండియా ఈసారి మాత్రం తేలిపోయింది. బ్రిస్టల్ వేదికగా గురువారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు 0–3తో కోల్పోయింది. సిరీస్లోని తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా... తర్వాతి మూడు మ్యాచ్ల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. దీంతో కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు తీవ్ర నిరాశే మిగిలింది.అయితే, ఇంగ్లండ్తో నాలుగో టీ20లో వ్యక్తిగతంగా మాత్రం శ్రేయస్ అయ్యర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 49 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలుఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్ హోదాలో ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు.కాగా ఇంగ్లండ్తో సిరీస్లో భాగంగా తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20లో 37 పరుగులు చేసిన కెప్టెన్ సాబ్.. మూడో టీ20లో మాత్రం ఐదు పరుగులకే అవుటయ్యాడు. తాజాగా నాలుగో టీ20లో 80 పరుగులతో సత్తా చాటి.. ఇప్పటికి మొత్తంగా 190 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టీ20 సిరీస్లో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు👉శ్రేయస్ అయ్యర్ (ఇండియా)- 2026లో నాలుగు మ్యాచ్లలో కలిపి 190 పరుగులు (రెండు అర్ధ శతకాలు)👉ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా)- 2017లో మూడు మ్యాచ్లలో కలిపి 146 పరుగులు (ఒక అర్ధ శతకం)👉ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)- 2020లో మూడు మ్యాచ్లలో కలిపి 125 పరుగులు👉జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 2024లో రెండు మ్యాచ్లలో కలిపి 123 పరుగులు (రెండు అర్థ శతకాలు)👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- 2021లో మూడు మ్యాచ్లలో కలిపి 118 పరుగులు (ఒక అర్ధ శతకం)కోహ్లి రికార్డు సమంఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద టీ20 సిరీస్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్గానూ శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టుపై అత్యధిక వ్యక్తిగత టీ20 స్కోరు నమోదు చేసిన కెప్టెన్గా విరాట్ కోహ్లి (80 నాటౌట్) రికార్డును కూడా శ్రేయస్ సమం చేశాడు. కాగా ఐర్లాండ్ పర్యటనతో టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది. కనీవినీ ఎరుగని రీతిలో ఐరిష్ జట్టు చేతిలో టీమిండియా 2-0తో వైట్వాష్ అయింది. తాజాగా ఇంగ్లండ్కు సిరీస్ను చేజార్చుకుంది.చదవండి: ఆఖరి బంతికి సింగిల్... భారత్కు షాకిచ్చిన శ్రీలంక -
నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?: శ్రేయస్ అయ్యర్
టీమిండియా వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్తో నాలుగో టీ20లోనూ భారత జట్టు పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్ సొంతం చేసుకోగా.. టీమిండియా వరుసగా రెండో టీ20 సిరీస్ను చేజార్చుకుంది.ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమిండియా ఓటమిపై స్పందించాడు. ‘‘మరోసారి మాకు నిరాశే మిగిలింది. ఈ పిచ్పై 158 అనేది కచ్చితంగా కాపాడుకోగలిగే స్కోరైతే కాదు. అందుకు తగ్గట్లుగానే ఇంగ్లండ్ వేగంగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ మీదకు బంతులు వేయమని మా బౌలర్లకు చెప్పాను. అలా అయితే బ్యాటర్లు బౌండరీలు రాబట్టడం కష్టతరమవుతుంది. అయితే, మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాము. ఎప్పుడైతే మా వ్యూహాన్ని కొద్దిగా మార్చామో ఆ సమయంలో వాళ్లు పరుగులు పిండుకున్నారు.నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?అయితే, నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల మాత్రం నేను సంతోషంగానే ఉన్నాను. కానీ గెలుపునకు నా ఇన్నింగ్స్ ఉపయోగపడలేదంటే దానికి ఎటువంటి అర్థం ఉండదు. నిజానికి నేను బాగా ఆడిన దాదాపు ప్రతిసారీ జట్టు గెలిచేది. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అలా జరగలేదు. తదుపరి మ్యాచ్లోనైనా ఆటంకాలు అధిగమించి అనుకున్న ఫలితం రాబట్టగలమనే అనుకుంటున్నాం.When the chips were down, the skipper stood tallest. 💙A magnificent innings from Shreyas Iyer. 🙌 Watch #ENGvIND LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/E5Lx13kGYs— Sony Sports Network (@SonySportsNetwk) July 9, 2026పొరపాట్లు సహజమేప్రస్తుతం జట్టు సంధి దశలో ఉంది. మా వల్ల చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. యువ క్రికెటర్లలో చాలా మంది తొలిసారి ఇలాంటి పిచ్లపై ఆడుతున్నారు. కాబట్టి తప్పులు సహజమే. అయితే, వీటి నుంచి ఎంత తొందరగా పాఠాలు నేర్చుకుంటామనేదే ముఖ్యం.బలంగా తిరిగి వస్తాముమా జట్టులో క్విక్ లెర్నర్స్ ఉన్నారు. కచ్చితంగా విదేశీ గడ్డ మీది పరిస్థితులను అర్థం చేసుకుని.. వికెట్ను సరిగ్గా అంచనా వేసి మరింత బలంగా తిరిగి వస్తారని నమ్ముతున్నా’’ అని శ్రేయస్ అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా బ్రిస్టల్ వేదికగా గురువారం రాత్రి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.శ్రేయస్ మెరిసినా..నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 158 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో శివం దూబే (22) మాత్రమే ఇరవై పరుగులు దాటాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిల్ సాల్ట్ అజేయ అర్ధ శతకం (59*)తో రాణించగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 79 నాటౌట్)తో మెరిశాడు. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు.. తాజాగా నాలుగో టీ20లో గెలిచి ఆతిథ్య జట్టు 3-0తో సిరీస్ గెలుచుకుంది. కాగా అంతకుముందు టీమిండియా ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్కు గురైన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ సూర్యవంశీ అట్టర్ఫ్లాఫ్ -
జట్టులో దండగ.. అతడినే టీమిండియా కెప్టెన్ని చేస్తారేమో!
విదేశీ పర్యటనలో టీమిండియా టీ20 వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక రెండు, మూడు మ్యాచ్లలో ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచి 2-0తో ఆధిక్యంలో నిలిచింది.వైస్ కెప్టెన్గా తిలక్ వర్మఈ నేపథ్యంలో బ్రిస్టల్ వేదికగా గురువారం జరిగే నాలుగో టీ20లో టీమిండియా చావోరేవో తేల్చుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ టూర్తో భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు.అయితే, ఈ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేయడం లేదు. శ్రేయస్ బ్యాటర్గా ఫర్వాలేదనిపిస్తున్నా.. సారథిగా వరుస పరాజయాలతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. మరోవైపు.. తిలక్ వర్మ ఆటగాడిగా ఫెయిల్ అవుతూ ఒక రకంగా జట్టుకు భారమయ్యాడని పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా ఇంగ్లండ్తో మూడో టీ20లో తిలక్ రెగ్యులర్గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్లో బ్యాటింగ్కు చేయడం ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తిలక్ వర్మపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. సంజూ శాంసన్ పేరును ప్రస్తావిస్తూ తిలక్ వర్మ స్థానాన్ని ప్రశ్నించాడు.అతడిని కెప్టెన్ను కూడా చేస్తారేమోఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘తిలక్ ఇప్పటికే వైస్ కెప్టెన్గా ఉన్నాడు. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే అతడిని కెప్టెన్ను కూడా చేస్తారేమో అనిపిస్తోంది. కాబట్టి జట్టులో తన స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని అతడు భావిస్తున్నాడేమో!..ఏదేమైనా ఇంగ్లండ్తో మ్యాచ్లో అతడు పేస్, బౌన్స్ను ఎదుర్కొనే ధైర్యం లేక కాస్త ఆలస్యంగా బ్యాటింగ్కు వెళ్లినట్లు అనిపిస్తోంది. క్రీజులోకి వెళ్లాక కూడా.. దూకుడుగా ఆడలేక అతడు బిక్కమొఖం వేశాడు.బలహీనత మీకు తెలుసుతిలక్ వర్మ ప్రధాన బ్యాటర్గా భావించే అతడిని వైస్ కెప్టెన్ని చేశారు కదా!.. అయినా సరే ఫాస్ట్ బౌలింగ్ను ఎదుర్కోకుండా మీరే (యాజమాన్యం) అతడిని కాపాడుతున్నారు. అతడి బలహీనత మీకు తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారు.అందుకే తిలక్కు బదులు అక్షర్ను ముందుగా పంపి బలిచేశారు. షార్ట్ పిచ్ బంతులను తిలక్ ఎదుర్కోలేడని మీకు ముందుగానే తెలుసు. అందుకే అతడి బలహీనతను కప్పిపుచ్చేందుకు అక్షర్ను ముందుకు తోశారు. ఆడలేక ఇబ్బంది పడుతున్నపుడు అతడిని జట్టు నుంచి తప్పించాలి. నేను పదే పదే ఈ మాట చెబుతున్నాను. తిలక్ వర్మకు బదులు సంజూ శాంసన్ను ఆడిస్తే బాగుంటుంది. కానీ యాజమాన్యం మాత్రం తిలక్ను తప్పించడం లేదు’’ అని క్రిస్ శ్రీకాంత్ చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రెండో మ్యాచ్లో 24*, మూడో టీ20లో 3 పరుగులు చేసి నిష్క్రమించాడు.చదవండి: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్! -
IND vs ENG: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్!
ఇంగ్లండ్తో నాలుగో టీ20 రూపంలో టీమిండియా కఠిన సవాలు ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే శ్రేయస్ అయ్యర్ సేన పోటీలో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆతిథ్య ఇంగ్లండ్ 3-0తో సొంతం చేసుకుంటుంది.లెఫ్టాండర్లు ఎక్కువయ్యారుఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మరోసారి చర్చ మొదలైంది. సంజూ శాంసన్ తిరిగి ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువైందని.. ఇది కూడా ఓ సమస్యగా పరిణమించిందని అభిప్రాయపడుతున్నారు.సంజూను కాదని వైభవ్కు అవకాశంకాగా ఐర్లాండ్తో రెండు టీ20లు, ఇంగ్లండ్తో తొలి మ్యాచ్లో సంజూ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్లలో అతడు చేసిన పరుగులు వరుసగా 5, 0, 1. ఈ నేపథ్యంలో సంజూను తప్పించి.. అతడి స్థానంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా బరిలోకి దించింది యాజమాన్యం.రెండు మ్యాచ్లలోనూ విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్.. ఇప్పటికి రెండు మ్యాచ్లలో వరుసగా 14, 13 పరుగులు చేశాడు. ఇక వైభవ్ రాకతో టాపార్డర్ మొత్తం లెఫ్లాండర్లతో నిండిపోయింది. ఈ పదిహేనేళ్ల పిల్లాడితో పాటు అభిషేక్ శర్మ, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా లెఫ్లాండరే.అదే విధంగా.. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, అర్ష్దీప్ సింగ్ కూడా ఎడమచేతి వాటం గల ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో కుడిచేతి వాటం గల సంజూ అవసరం ఎంతగానో ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.సంజూను ఆడించాల్సిందేఓపెనర్గా కాకపోయినా.. మిడిల్ ఆర్డర్లోనైనా సంజూను ఆడించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టాపార్డర్లో ఆడిస్తే మాత్రమే సంజూకు తిరిగి తుదిజట్టులో చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.అలా అయితేనే తుదిజట్టులోకి తీసుకోండి‘‘ఒకవేళ నిజంగా సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. అతడు ఏ స్థానంలోనైతే సక్సెస్ అయ్యాడో ఆ స్థానంలోనే ఆడించాలి. అంతేగానీ సంజూను మళ్లీ తీసుకువచ్చి.. నాలుగు, ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడిస్తామంటే ఫలితం ఉండదు.లేదంటే ఆడించకపోవడమే మంచిదిఅతడు మళ్లీ ఇబ్బంది పడతాడు. నిజానికి సంజూ టాప్-3లో మాత్రమే విజయవంతంగా బ్యాటింగ్ చేయగలడు. ఒకవేళ అతడి పట్ల నిజంగానే మీకు నమ్మకం ఉంటే.. టాపార్డర్లో ఆడించండి. లేదంటే అసలు ఆడించకపోవడమే మంచిది’’ అని అభిషేక్ నాయర్ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ఓపెనర్గా ఇలా..కాగా సంజూ ఇప్పటికి టీమిండియా టాప్-3 బ్యాటర్గా 36 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 1023 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్గా నాకౌట్ మ్యాచ్లలో ఏకంగా 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొత్తంగా టాప్-3లో 36 ఇన్నింగ్స్లో ఆడి ఏకంగా 171కి పైగా స్ట్రైక్రేటుతో సంజూ పరుగులు రాబట్టడం విశేషం.మిడిలార్డర్లో అలామరోవైపు.. టాప్-3 బ్యాటర్గా కాకుండా మిడిలార్డర్లో వచ్చి సంజూ 21 ఇన్నింగ్స్లో కేవలం 382 పరుగులే చేశాడు. స్ట్రైక్రేటు 124. ఈ నేపథ్యంలోనే అభిషేక్ నాయర్ సంజూను ఓపెనర్గా మాత్రమే పంపాలని నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా టీ20 సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 వైట్వాష్ అయింది టీమిండియా. అనంతరం ఇంగ్లండ్తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్లలో ఆతిథ్య జట్టు గెలిచింది. తద్వారా 2-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉండగా.. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: గంభీర్ -
ఇంగ్లండ్తో మ్యాచ్.. గాయంతో కీలక ప్లేయర్ దూరం!
ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో టీమిండియా పురుషుల జట్టు 0-2తో వెనుకబడి ఒత్తిడిలో ఉంది. ఈ వారం చివర్లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్కు ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. లండన్ వేదికగా జరగనున్న టెస్టు మ్యాచ్కు భారత ప్లేయర్ ప్రతీకా రావల్ గాయంతో దూరమైంది. ఆమె స్థానంలో టాపార్డర్ బ్యాటర్ ప్రియా పూనియాకు అవకాశం కల్పిస్తున్నట్లు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా పర్యటనలో ప్రతీకా రావల్ పెర్త్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో 81 పరుగులతో రాణించింది. ఆ తర్వాత ఇండియా-ఏ వుమెన్ టీం తరఫున హోవ్, టాంటన్లతో జరిగిన అనధికారిక మ్యాచ్ల్లోనూ ఆడింది. అయితే ఇంగ్లండ్తో ఏకైక టెస్టు మ్యాచ్కు ముందు ప్రతీకా రావల్కు గాయమైంది. దీంతో ఈ మ్యాచ్కు దూరమైనట్లు భారత మహిళల జట్టు కోచ్ అమోల్ మజుందార్ తెలిపాడు. ఆమె స్థానంలో టాపార్డర్ బ్యాటర్ ప్రియా పూనియాను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు.ఎవరీ ప్రియా పూనియా?2019లో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా ప్రియా పూనియా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. గతేడాది వడోదర వేదికగా జరిగిన వన్డేలోనూ ఆడిన ప్రియా పూనియా మొత్తంగా భారత్ తరఫున 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడింది. ఇక టీ20 ప్రపంచకప్లో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన టీమిండియా వుమెన్స్ ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడనుంది. టీ20 ప్రపంచకప్కు ముందే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను హర్మన్ సేన 1-2తో ఇంగ్లండ్కు కోల్పోయింది. లండన్లోని లార్డ్స్ వేదికగా జరగనున్న మొట్టమొదటి మహిళల టెస్టు మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.ఇంగ్లండ్తో టెస్టుకు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యాస్తిక భాటియా (వికెట్ కీపర్), శ్రీ చరణి, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, సయాలీ సత్ఘరే, దీప్తి శర్మ, నందాని శర్మ, రేణుకా సింగ్, షఫాలీ వర్మ Shifting gears to red-ball cricket 🔄Preps underway as #TeamIndia get ready for a historic #ENGvIND Test 🤍 pic.twitter.com/wdzv7O5tn2— BCCI Women (@BCCIWomen) July 6, 2026pic.twitter.com/z1Fjap9Z4e— BCCI Women (@BCCIWomen) July 6, 2026 -
ఒకే ఒక్క ఓటమితో చెత్త రికార్డు లిస్టులో టీమిండియా
-
మేం చెప్పాల్సిన పని లేదు ఎలా ఆడాలో వైభవ్ కు తెలుసు
-
ముందుగా రాకుండా దాక్కున్నాడు: మొయిన్ అలీ ఫైర్
టీమిండియా ఆట తీరుపై ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఓపెనర్లను తప్పుపట్టాల్సిన పని లేదని.. సమస్యంతా లోయర్ ఆర్డర్లోనే ఉందన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో మూడో టీ20లో శివం దూబే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు రావడం వారి వ్యూహాత్మక తప్పిదాలకు నిదర్శనమని విమర్శించాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా... తొలి టీ20 వర్షార్పణమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా రెండో మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా.. తాజాగా మూడో టీ20లోనూ పరాజయం పాలైంది. నాటింగ్హామ్లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (10), వైభవ్ సూర్యవంశీ (13), వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (13) పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.ఇక ఐదో స్థానంలో రావాల్సిన తిలక్ వర్మ (3) ఆరో స్థానంలో రాగా.. అక్షర్ పటేల్ (10) ఐదో నంబర్లో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. హర్షిత్ రాణా (9) ఏడో స్థానానికి ప్రమోట్ అయి విఫలం కాగా.. ఎనిమిదో స్థానంలో వచ్చి శివం దూబే (2) ఫెయిల్ అయ్యాడు.ఫలితంగా 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11.4 ఓవర్లలోనే కేవలం 76 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.‘‘భారత బ్యాటింగ్ ఆర్డర్లోనే సమస్య ఉంది. అక్షర్ పటేల్ మరీ ముందుగా వచ్చాడు. తిలక్ వర్మ లేటయ్యాడు. ఇక శివం.. అతడు కేవలం స్పిన్నర్ల బౌలింగ్లోనే ఆడతాడు. అందుకే ముందుగా బ్యాటింగ్కు రాకుండా దాక్కుండిపోయాడు.నిజానికి జట్టు కోసం అతడు అన్నీ చేయాలి. కానీ స్పిన్నర్ల బౌలింగ్లో మాత్రమే ఆడితే ఎలా?.. టీమిండియా ఓపెనర్లను తప్పుపట్టాల్సిన పనిలేదు. నిజానికి వాళ్లిద్దరు ఆడతున్న తీరు నాకు ముచ్చటగొలుపుతుంది.ఒకవేళ అభిషేక్ ఆరు ఓవర్లు ఆడాడంటే.. అతడు అర్ధ శతకానికి చేరువకావడం ఖాయం. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి మనకు తెలిసిందే. అతడు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీకి మరిన్ని అవకాశాలు వస్తాయని.. అప్పుడు కూడా విఫలమైతే మాత్రం పరిస్థితి చేజారిపోతుందని అభిప్రాయపడ్డాడు. -
టీమిండియాకు ఆర్చర్ చురకలు.. ‘వైభవ్కు ఇదే నా సవాల్’
ఇంగ్లండ్ గడ్డపై తేలిపోతున్న టీమిండియాకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చురకలు అంటించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడడమంటే ఐపీఎల్లో ఆడినంత తేలిక కాదని, ఇక్కడి పిచ్లు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని, గుడ్లెంగ్త్తో బంతులు విసిరితేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నాడు. టీమిండియాకు చురకలు అంటించడంతో పాటు వైభవ్ సూర్యవంశీకి కూడా ఓపెన్ చాలెంజ్ విసిరడం ఆసక్తిగా మారింది. మూడో టీ20లో ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆర్చర్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ గడ్డపై పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో బౌలర్లకు కఠినంగా ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలంగా అక్కడి మైదానాల్లోని బౌండరీలను తక్కువ దూరంలోనే ఉంటాయి. కానీ ఇంగ్లండ్లో పరిస్థితులు అలా ఉండవు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసిరితేనే ఇక్కడ వికెట్లు లభిస్తాయి. ఇక్కడి మైదానాల్లో బౌండరీల దూరం తక్కువ ఉన్నప్పటికీ బంతి వికెట్ల మీదకు వస్తుంది కాబట్టే ఆడడం కాస్త కష్టతరంగా ఉంటుంది. ఐపీఎల్లో 200 స్కోరు చేసినా కూడా ఓడిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంగ్లీష్ పిచ్లపై 200 స్కోరు అంటే ఆషామాషీ కాదు. జాగ్రత్తగా ఆడకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే వైభవ్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆర్చర్ బౌలింగ్లో సిక్సర్లు కొట్టడంపై ఆర్చర్ను ప్రశ్నించగా.. ‘రాబోయే మ్యాచ్ల్లో అతడిని ఎదుర్కొనే సమయంలో స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నా. వైభవ్కు ఇదే నా సవాల్ (నవ్వుతూ)* అని ఆర్చర్ తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 125 పరుగుల తేడాతో టీమిండియాపై భారీ విజయాన్ని సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పూర్తి ఓవర్లు ఆడకుండానే 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఆర్చర్ 29 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, జోష్ టంగ్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (70), సామ్ కరన్ (44 నాటౌట్) రాణించారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టల్ వేదికగా జరగనుంది.Read: IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు -
IND vs ENG: హర్షిత్ రాణాపై ప్రశంసలు
టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణాపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు గొప్పగా ఆడుతున్నాడని కొనియాడాడు. ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్.. ఇటు బంతితోనూ.. అటు బ్యాట్తోనూ రాణిస్తున్నాడని ప్రశంసించాడు.గంభీర్కు ప్రియశిష్యుడిగా పేరుఅయినప్పటికీ హర్షిత్ రాణాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోందని ఆకాశ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్కు ప్రియశిష్యుడిగా హర్షిత్ రాణాకు పేరు. గంభీర్ అండతోనే అతడు అరంగేట్రం చేయగలిగాడని.. అర్హులను కాదని మరీ హర్షిత్కు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా కొనసాగుతున్నాయి.ఇక తాజాగా ఇంగ్లండ్తో మూడో టీ20 సందర్భంగా బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో శివం దూబేను కాదని.. హర్షిత్ను పంపించారు. అతడు 13 బంతుల్లో 9 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. దూబే 2 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ను ముందుగా ఎందుకు పంపించారనే ప్రశ్నలు వచ్చాయి.అవకాశం వచ్చిన ప్రతిసారీఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘హర్షిత్ రాణా గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అతడిని మనందరం చాలాసార్లు చాలా రకాలుగా ట్రోల్ చేశాము. కానీ అతడు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారీ జట్టు కోసం ఎంతగానో కృషి చేస్తున్నాడు.క్లిష్ట పరిస్థితుల్లో బంతిని అతడి చేతికిచ్చినా మెరుగ్గానే రాణిస్తున్నాడు. బ్యాట్తోనూ అదరగొడుతున్నాడు. అయితే, కొన్నిసార్లు విఫలం కావడం సహజం. ఏదేమైనా నిందలు, తిట్లకు హర్షిత్ అర్హుడు కాదు.నిజానికి ఐర్లాండ్తో రెండో టీ20లో దాదాపు అతడు జట్టును గెలిపించినంత పని చేశాడు. పది బంతుల్లో 21 పరుగులు చేశాడు (ఈ మ్యాచ్లో టీమిండియా ఒకే ఒక్క పరుగుతో ఓడి వైట్వాష్ అయింది). హర్షిత్ రాణా కొత్త, పాత బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. లోయర్ ఆర్డర్ నుంచి కాస్త టాప్నకు ప్రమోట్ చేసినా బ్యాట్తో రాణించగలడు.సెలక్షన్లో అతడి తప్పేమీ లేదే!తుదిజట్టుకు ఎంపిక కావడం అతడి తప్పేమీ కాదే. అతడిని తరచూ విమర్శించే వారు బాగా ఆడినప్పుడు ఎందుకు ప్రశంసించడం లేదు. అనవసరంగా ట్రోల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు’’ అని ఆకాశ్ చోప్రా ట్రోలర్స్కు చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో హర్షిత్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: గంభీర్ -
సంజూతో పోల్చుకుంటే 'ఆ ముగ్గురు' మరీ దారుణం..!
భారత టీ20 జట్టులో సంజూ శాంసన్కు చోటు దక్కకపోవడంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంజూ శాంసన్ను నిలకడలేని ప్రదర్శన కారణంగానే పక్కన పెట్టారని అభిమానులు పేర్కొంటూ, అందుకు విరుద్ధంగా గణాంకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అభిమానులు షేర్ చేస్తున్న వివరాల ప్రకారం..సంజూ శాంసన్ చివరి పది ఇన్నింగ్స్లో 107, 109, 22, 24, 97, 89, 89, 5, 0, 1 పరుగులు చేయగా..ఇషాన్ కిషన్ 10, 36, 11, 8, 3, 13, 12, 0, 49, 13 పరుగులు.. తిలక్ వర్మ 1, 44, 27, 21, 8, 19, 55, 13, 24, 3 పరుగులు..అభిషేక్ శర్మ 68, 0, 10, 9, 52, 49, 0, 59, 43, 10 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్లో 14, 13 పరుగులే చేశాడు.ఈ గణాంకాలను ఉదహరిస్తూ, "అసలు నిలకడ లేని బ్యాటర్ ఎవరు..?" అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంజూ శాంసన్కు పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందని, ఒకసారి క్రీజులో నిలదొక్కుకుని 30 పరుగుల మార్క్ దాటితే అతడు భారీ స్కోరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సంజూ పెద్ద స్కోర్లు చేసిన మ్యాచ్ల్లో భారత జట్టు విజయాలు కూడా ఎక్కువగా వచ్చాయని పోస్టుల్లో పేర్కొంటున్నారు.ఇతర బ్యాటర్లు ఒక మ్యాచ్లో రాణించి, తర్వాత వరుసగా విఫలమవుతున్నారని వాదిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్ను మాత్రమే 'నిలకడలేని ఆటగాడి'గా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత బ్యాటింగ్ వైఫల్యాల నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం సంజూ శాంసన్ విషయంలో మరోసారి పునరాలోచించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.కాగా, తాజగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్లో నిలవాలంటే బ్రిస్టల్లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి. -
తిలక్ వర్మపై అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు మరో పరాజయం ఎదురైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా సిరీస్లో 0–2తో వెనుకబడింది. నాటింగ్హామ్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో అదరగొట్టగా... జోస్ బట్లర్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు), సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బ్యాట్లెత్తేశారుఅనంతరం భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరీ దారుణంగా 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ (5 బంతుల్లో 13; 2 సిక్స్లు), అభిషేక్ శర్మ (10; 1 సిక్స్), ఇషాన్ కిషన్ (13; 1 ఫోర్, 1 సిక్స్) పూర్తిగా విఫలమయ్యారు. ఇక సారథి శ్రేయస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10), తిలక్ వర్మ (3), హర్షిత్ రాణా (9), శివమ్ దూబే (2) కూడా బ్యాట్లెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి మనవాళ్లు పెవలియన్కు వరుస కట్టారు.దారుణ వైఫల్యంకనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలిచే ప్రయత్నం చేయకుండా... షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్కు మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి చెత్త ప్రదర్శన మునుపెన్నడూ చూడలేదని.. తుదిజట్టులో తరచూ మార్పులే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు. జియోహాట్స్టార్ షోలో మాట్లాడుతూ.. నాలుగో టీ20లో మాత్రం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో ఎలాంటి మార్పులు చేయవద్దని సూచించాడు. ముఖ్యంగా మూడు మ్యాచ్లలో విఫలమైనప్పటికీ తిలక్ వర్మను కొనసాగించాలని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో మార్పులు వద్దు‘‘తుదిజట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని నేను భావిస్తున్నాను. అలా చేస్తేనే జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందించగలరు. ఇక తిలక్ వర్మ.. అతడు ఇప్పుడు వైస్ కెప్టెన్. అతడికి ఓ బాధ్యత అప్పగించారు. కాబట్టి అతడికి మరొక్క అవకాశం ఇవ్వాల్సిందేనని నా భావన.బౌలర్లు మారాలిమన బౌలర్లు కూడా తమ ఆట తీరును మార్చుకోవాల్సి ఉంది. మనోళ్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న చోట.. ప్రత్యర్థి జట్టు మాత్రం 76 పరుగులకే మనోళ్లను ఆలౌట్ చేసింది. ఇక్కడే తేడా స్పష్టంగా తెలుస్తోంది. మన ప్రణాళికలు, వ్యూహాలు పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుకోవాలి’’ అని అనిల్ కుంబ్లే హితవు పలికాడు.కాగా ఇంగ్లండ్తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రెండో టీ20లో 24 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, మంగళవారం నాటి మూడో మ్యాచ్లో మాత్రం 11 బంతులు ఎదుర్కొని మూడు పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. తొలి టీ20లో ఆడిన సంజూ శాంసన్పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని కొనసాగిస్తోంది. ఇక రెండో టీ20లో దారుణంగా విఫలమైన రవి బిష్ణోయిని తప్పించి.. అతడి స్థానంలో మూడో టీ20లో ప్రిన్స్ యాదవ్ను ఆడించారు. ఇరుజట్ల మధ్య గురువారం జరిగే నాలుగో టీ20కి బ్రిస్టల్ వేదిక.ఇంగ్లండ్తో మూడో టీ20 ఆడిన భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, శివం దూబే, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
గంభీర్పై జనాగ్రహం
ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. నాటింగ్హమ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వెలుపల భారత జట్టు బయలుదేరుతున్న సమయంలో అభిమానులు "వీ వాంట్ సంజూ" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంజూ శాంసన్ను జట్టులోకి తిరిగి తీసుకోవాలంటూ గంభీర్ను లక్ష్యంగా చేసుకుని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.‘We want Sanju’ chants outside the stadium when team India leaves. pic.twitter.com/bzqljBakTG— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2026ఐర్లాండ్ సిరీస్లో రెండు మ్యాచ్ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్, ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా ఒక్క పరుగు మాత్రమే చేయడంతో జట్టు యాజమాన్యం అతడిని తప్పించింది. అతని స్థానంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించింది.అయితే ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో సంచలన ప్రదర్శనలతో భారీ అంచనాలు పెంచుకున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. మూడో టీ20లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో సంజూను తప్పించి వైభవ్కు అవకాశం ఇవ్వడంపై అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు.మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు బస్సు వైపు వెళ్తున్న సమయంలో గౌతమ్ గంభీర్, తిలక్ వర్మతో పాటు ఆటగాళ్లు స్టేడియం వెలుపల అభిమానుల నినాదాల మధ్య బయటకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.ఇదిలా ఉంటే, సంజూ శాంసన్కు జట్టు తలుపులు పూర్తిగా మూసేయలేదని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "సంజూ శాంసన్ మళ్లీ జట్టులోకి రాకూడదనే ఎలాంటి నిబంధన లేదు. ప్రతి ఆటగాడు తన స్థానాన్ని తన ప్రదర్శనతో సంపాదించుకోవాలి" అని వ్యాఖ్యానించాడు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్తో సిరీస్లోనూ చెత్త ప్రదర్శన కొనసాగిస్తోంది. నాటింగ్హామ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో శ్రేయస్ సేన ఇంగ్లండ్ చేతిలో మట్టికరిచింది.ఇంగ్లండ్ భారీ స్కోరుఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా ట్రెంట్బ్రిడ్జ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.చతికిల పడ్డ టీమిండియాఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ రెండంకెల స్కోరు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (13), వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (13) పరుగులతో టాప్ రన్ స్కోరర్లుగా నిలిచారు.ఇక ఈ మ్యాచ్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 10 పరుగులు చేసి నిష్క్రమించాడు. జోష్ టంగ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, ఇంతటి ఫ్లాప్ షోలోనూ అభిషేక్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ జట్టుపై టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్పై టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 28🏏హార్దిక్ పాండ్యా- 27🏏విరాట్ కోహ్లి- 19🏏రోహిత్ శర్మ- 18🏏సూర్యకుమార్ యాదవ్ -18.మూడో టీ20 సందర్భంగా టీమిండియా నమోదు చేసిన చెత్త రికార్డులు ఇవే👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. (125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తు)👉ఇంగ్లండ్లో టీ20 మ్యాచ్లో అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా టీమిండియా (76/10).👉ఐదు టీ20 మ్యాచ్లలో విజయమన్నదే లేకుండా టీమిండియా పరాజయాల పరంపర కొనసాగించడం ఇదే తొలిసారి. ఐర్లాండ్ చేతిలో రెండు, ఇంగ్లండ్ చేతిలో రెండు మ్యాచ్లు ఓడిన టీమిండియా. ఇక వర్షం వల్ల ఇంగ్లండ్తో తొలి టీ20 రద్దు కాగా.. మొత్తంగా వరుసగా ఐదు మ్యాచ్లలో టీమిండియాకు గెలుపున్నదే లేకుండా పోయింది.👉టీ20 మ్యాచ్లో 11.4 (అతి తక్కువ) ఓవర్లలో టీమిండియా ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
గంభీర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కార్తీక్
ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఛేదనలో శివమ్ దూబే కంటే ముందు పేసర్ హర్షిత్ రాణాను బ్యాటింగ్కు పంపడంపై మాజీ భారత వికెట్కీపర్, వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కామెంట్రీ సమయంలోనే ఆయన ఈ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుబట్టాడు."శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణా బ్యాటింగ్కు రావడమా..? నిజంగానేనా..? దేశవాళీ క్రికెట్లో కూడా హర్షిత్ రాణా పవర్ప్లేలో బ్యాటింగ్ చేసిన సందర్భం నాకు గుర్తులేదు. ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కాంబినేషన్ కోసం కొన్ని మార్పులు చేయొచ్చు. కానీ అందుకే శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను పంపడం సమంజసం కాదు" అని వ్యాఖ్యానించాడు.గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వకపోగా.. భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ కేవలం 76 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టుకు రెండో అత్యల్ప స్కోరు కాగా, 125 పరుగుల తేడాతో ఓడిపోవడం టీమిండియా చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నమోదైంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో రాణించగా, భారత బౌలర్లు పరుగులను నియంత్రించలేకపోయారు.202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్ కొత్త బంతితో చెలరేగగా, జోష్ టంగ్ మధ్య, చివరి వరుస బ్యాటర్లను కట్టడి చేశాడు. పవర్ప్లే ముగిసేలోపే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లు కోల్పోవడంతో భారత్ కోలుకోలేకపోయింది.ఈ దశలో అందరూ శివమ్ దూబే బ్యాటింగ్కు వస్తాడని భావించినా, జట్టు యాజమాన్యం అనూహ్యంగా హర్షిత్ రాణాను పంపింది. ఈ నిర్ణయంపైనే దినేశ్ కార్తీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్లో నిలవాలంటే బ్రిస్టల్లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్
విదేశీ గడ్డ మీద భారత టీ20 జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తాజాగా మూడో టీ20లో మరీ ఘోరంగా ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ముందంజ వేయగా.. మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూ గురించి నాకు క్లారిటీ ఉందిముఖ్యంగా సంజూ శాంసన్ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వరల్డ్కప్ హీరోనే పక్కనపెట్టడానికి గల కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై హెడ్కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా సంజూ గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. హెడ్కోచ్, ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ గురించి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ బయటకు రాదు.సంజూ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. అతడు టీమిండియా కోసం ఏం చేశాడో మాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు ఫామ్ విషయంలో ఏ ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. దానర్థం అతడు ఇక జట్టులోకి తిరిగి రాడని కాదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కుండబద్దలు కొట్టిన గంభీర్ఇక వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలు అత్యంత ముఖ్యమైనవి. అనుకున్న ఫలితం రాబట్టడం కోసమే అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేసుకుంటాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను’’ అని గంభీర్ సమర్థించుకున్నాడు. కొత్త కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని.. అందుకే వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తు న్నామంటూ కుండబద్దలు కొట్టాడు.అందుకే ఓడిపోతున్నాంఇక విదేశీ గడ్డ మీద పిచ్లకు తాము ఇంకా పూర్తిగా అలవాటు పడలేదని.. అందుకే వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నామని గంభీర్ జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో కలిపి వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడాన్ని బట్టే తమ ఆట తీరు ఎలా ఉందో తెలుస్తోందన్నాడు. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్ వేదిక. చదవండి: టీమిండియా ఆట తీరుపై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం -
విదేశాల్లో మరోసారి బయటపడ్డ టీమిండియా బలహీనతలు
ఇంగ్లండ్తో మూడో టీ20లో భారత్ ఎదుర్కొన్న 125 పరుగుల భారీ ఓటమి కేవలం ఒక్కరోజు పేలవ ప్రదర్శన మాత్రమే కాదు. విదేశీ పర్యటనల్లో భారత బ్యాటింగ్లో పదేపదే కనిపిస్తున్న సాంకేతిక లోపాన్ని మరోసారి స్పష్టంగా బయటపెట్టింది. ముఖ్యంగా పేసర్లు గుడ్ లెంగ్త్, బ్యాక్ ఆఫ్ లెంగ్త్ (6 నుంచి 10 మీటర్ల మధ్య) ప్రాంతంలో సంధించే బంతులను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శనను "అత్యంత దారుణం"గా అభివర్ణించాడు. భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌటవడం నిజంగానే చాలా దారుణం. ప్రపంచ ఛాంపియన్ అయిన జట్టు ఏకంగా 125 పరుగుల తేడాతో ఓడిపోవడం మరీ దారుణం.ఈ సమస్య ఒక్క మ్యాచ్కే పరిమితం కాలేదు. 2025 ఆసియా కప్, 2026 ఐర్లాండ్ పర్యటన, ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్లలో హార్డ్ లెంగ్త్ బంతులపై భారత బ్యాటర్ల సగటు వరుసగా 18.42, 17.17, 14.29 మాత్రమే ఉంది. అదే సమయంలో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో ఇదే తరహా బంతులపై భారత బ్యాటర్లు 47.70 సగటుతో, 165.63 స్ట్రైక్రేట్తో పరుగులు చేశారు. ఈ గణాంకాలు స్వదేశం, విదేశాల్లో భారత బ్యాటింగ్ మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూపిస్తున్నాయి.వ్యక్తిగత ప్రదర్శనలను పరిశీలిస్తే తిలక్ వర్మ మాత్రమే హార్డ్ లెంగ్త్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ కొంత మేర పర్వాలేదనిపించినా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా వంటి బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. ముఖ్యంగా సంజూ శాంసన్ ఐదు సార్లు ఔటై కేవలం 20 పరుగులే చేయడం ఆందోళన కలిగించే అంశం.విశేషమేమిటంటే, ఇదే పిచ్పై భారత పేసర్లు తొలుత హార్డ్ లెంగ్త్ బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగారు. ఆరంభంలో స్వింగ్, ఆ తర్వాత గుడ్ లెంగ్త్ బంతులతో పరుగులను నియంత్రించారు. అయితే ఆ వ్యూహాన్ని ఇంగ్లండ్ బౌలర్లు మరింత సమర్థంగా అమలు చేశారు.జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వరుసగా హార్డ్ లెంగ్త్ బంతులు సంధించారు. ఆర్చర్ మొదట వైభవ్ సూర్యవంశీకి వైడ్గా బంతి వేసి సిక్సర్ ఇచ్చినా, వెంటనే లైన్ మార్చి బౌన్సర్తో అతడిని ఔట్ చేశాడు.టంగ్ కూడా పూర్తి లెంగ్త్తో ప్రారంభించి వెంటనే హార్డ్ లెంగ్త్కు మారి అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. అనంతరం ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే కూడా ఈ లెంగ్త్కు ఇబ్బంది పడ్డారు. ఆర్చర్, టంగ్ కలిసి 6 నుంచి 10 మీటర్ల లెంగ్త్లో వేసిన 26 బంతుల్లో ఐదు వికెట్లు తీసి కేవలం 24 పరుగులే ఇచ్చారు.ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. "ఈ పిచ్పై గుడ్ లెంగ్త్లో బంతులు వేస్తే షాట్లు ఆడటం చాలా కష్టమని మేం ముందే గుర్తించాం. అందుకే అదే వ్యూహాన్ని అమలు చేశాం" అని వెల్లడించాడు.ట్రెంట్ బ్రిడ్జ్ ఓటమిని ఒక్క మ్యాచ్ ఫలితంగా మాత్రమే చూడలేం. గత కొంతకాలంగా విదేశాల్లో హార్డ్ లెంగ్త్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యకు ఇది మరో ఉదాహరణ. ఈ బలహీనతను సరిదిద్దుకోకపోతే, రానున్న విదేశీ పర్యటనల్లో ప్రత్యర్థి జట్లు ఇదే వ్యూహాన్ని మరింత దూకుడుగా అమలు చేసి టీమిండియాను ఘోరంగా దెబ్బతీసే అవకాశం ఉంది. -
టీమిండియా ఆటతీరుపై శ్రేయస్ ఆగ్రహం
నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శనను "అత్యంత దారుణం"గా అభివర్ణించాడు. ఇలాంటి ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని స్పష్టం చేశాడు.అతడి మాటల్లో.. "ఈ ప్రదర్శనను వర్ణించడానికి 'అత్యంత దారుణం' అనే పదం తప్ప మరోటి కనిపించడం లేదు. ఇంత పెద్ద తేడాతో ఓడిపోవడం అసలు అంగీకారయోగ్యం కాదు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇది 200 పరుగులు చేసే పిచ్ కాదని నా అభిప్రాయం. పవర్ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం మాకు భారీ ఎదురుదెబ్బగా మారింది.బౌలింగ్లో కూడా జట్టు ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయింంది. జట్టు సమావేశాల్లో ఎంత ప్రణాళిక రూపొందించినా, మైదానంలో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయాలి. ఈ వికెట్పై హార్డ్ లెంగ్త్ బంతులు ప్రభావవంతంగా ఉన్నాయి. కానీ మేము వాటిని తగినంతగా వేయలేదు.అలాగే 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాటర్లు ప్రణాళికాబద్ధంగా ఆడాలి. మొత్తంగా మా అమలు చాలా పేలవంగా సాగింది" అని అన్నాడు.అయితే మిగిలిన రెండు మ్యాచ్ల్లో బలంగా పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. "గతాన్ని తలచుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. మేం చాలా పేలవమైన క్రికెట్ ఆడాం. అయినా ఈ ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మళ్లీ జట్టుకు ఊపు తీసుకొచ్చేందుకు ప్రతి ఆటగాడు తన వంతు బాధ్యత ఎలా నిర్వర్తించాలనే దానిపై ఆలోచించాలి" అని తెలిపాడు.కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, జోస్ బట్లర్ 36, సామ్ కరన్ 24 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు.202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు రెండో అత్యల్ప స్కోరు కాగా, 125 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టు చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నిలిచింది. ఇప్పుడు సిరీస్లో నిలవాలంటే జూలై 9న బ్రిస్టల్లో జరిగే నాలుగో టీ20లో భారత్ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అయ్యర్ నాయకత్వంలో భారత్కు ఇది వరుసగా నాలుగో ఓటమి. అంతకుముందు ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ పరాజయం పాలైంది. -
టీమిండియాపై ఇంగ్లండ్ భారీ విజయం
నేడు ఇంగ్లండ్కు భారత్కు మధ్య జరిగిన మూడో టి20లో టీమిండియాపై 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్తో మెరిశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 36) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 43 పరుగులో జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్ స్కోరు మందగించింది. ఒక దశలో 160 నుంచి 170 పరుగులకు పరిమితమవుతుందనుకున్న ఇంగ్లండ్.. చివర్లో సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపులతో 200 పరుగుల మార్క్ను దాటింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.అనంతరం 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి భారత భ్యాట్స్మెన్స్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. జోష్ టంగ్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్ రెండు, విల్ జాక్స్ ఒక వికెట్టు తీశారు. కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. భారత భ్యాట్స్మెన్స్లో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఇద్దరూ చెరో 13 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. -
చెలరేగిన సాల్ట్, సామ్ కరన్.. టీమిండియా టార్గెట్ 202 రన్స్
ట్రెంట్బ్రిడ్జి వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్తో మెరిశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 36) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 43 పరుగులో జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్ స్కోరు మందగించింది. ఒక దశలో 160 నుంచి 170 పరుగులకు పరిమితమవుతుందనుకున్న ఇంగ్లండ్.. చివర్లో సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపులతో 200 పరుగుల మార్క్ను దాటింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. -
అతడికి ముందుగా ఏం చెప్పలేదు.. వరల్డ్కప్ ప్లాన్లో భాగమే!
విదేశీ పర్యటనలో టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్తో సిరీస్ను కూడా ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. మాంచెస్టర్ వేదికగా రెండో టీ20లో శ్రేయస్ సేన ఓటమి పాలైంది.ఇక ఇరుజట్ల మధ్య మంగళవారం నాటింగ్హామ్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ‘‘మేము బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో బాగా మెరుగుపడాల్సి ఉంది.వరల్డ్కప్ ప్లాన్లో భాగమే!టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. మరో వరల్డ్కప్ గెలవడమే లక్ష్యంగా రెండేళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. మేము మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. ఇందుకోసం అన్ని విభాగాలూ కలిసి కట్టుగా కృషి చేస్తున్నాయి.గత రెండేళ్లలో మేము ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే, ఇప్పుడు మూడు మ్యాచ్లు ఓడిపోగానే అందరూ మా వైఫల్యాల గురించే మాట్లాడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజం. జట్టులో మార్పులు జరుగుతున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు.ముందుగా ఏం చెప్పలేదుఇక వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఎంపికైన నాటి నుంచే అతడు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు. అంతేగానీ రెండో టీ20కి ముందే అతడిని సిద్ధంగా ఉండమని మాత్రం చెప్పలేదు.అతడి ఆట ఎలా ఉంటుందో మాకు తెలుసు. అతడి ఆలోచనా విధానం, దూకుడు గురించి మాకు అవగాహన ఉంది. అయితే, ఇలా ఆడాలి.. అలా ఆడాలి అని మాత్రం అతడికి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’’ అని సితాన్షు కొటక్ తెలిపాడు.కాగా ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సంజూ శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగాడు. కానీ.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. వైభవ్ను ఆడించేందుకు సంజూను తప్పించడం అన్యాయం అంటూ యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. -
టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
టీమిండియాతో మూడో టీ20 మ్యాచ్కు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. రెండో మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్నే కొనసాగిస్తామని తెలిపింది. కాగా సొంతగడ్డపై భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం అందుకున్న సంగతి తెలిసిందే.ఇరుజట్ల మధ్య చెస్టర్ లీ వేదికగా జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండానే వర్షం వల్ల రద్దైపోయింది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఆతిథ్య ఇంగ్లండ్ అదరగొట్టింది. టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ముందంజ వేసింది.టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్ను 190 పరుగులకు కట్టడి చేయగలిగింది. సామ్ కర్రాన్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, విల్ జాక్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పనిపూర్తి చేసింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ డకౌట్ అయినా.. హ్యారీ బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ (15 బంతుల్లో 39) ఆడి జట్టును ఆదుకున్నాడు. జేకబ్ బెతెల్ ధనాధన్ దంచికొట్టి (46 బంతుల్లో 76 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. టామ్ బాంటన్ (39) కూడా రాణించాడు. ఈ క్రమంలో రెండో మ్యాచ్లో గెలిపించిన తుదిజట్టునే ఇంగ్లండ్ మూడో మ్యాచ్కూ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.టీమిండియాతో మూడో టీ20కి భారత తుదిజట్టుఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.బెంచ్: రెహాన్ అహ్మద్, సాకిబ్ మహమూద్, సోనీ బేకర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, ల్యూక్ వుడ్. -
గాయమా?.. వేటు వేశారా?.. అదే నిజమైతే: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ సంజూ శాంసన్ను గనుక కావాలని తప్పించి ఉంటే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో సంజూ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఈవెంట్ ఆరంభంలో తుదిజట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన సంజూ.. ఆ తర్వాత వచ్చి నాకౌట్ మ్యాచ్లో దుమ్ములేపాడు. 97*, 89, 89 పరుగులతో రాణించి... ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. ఐపీఎల్-2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తా చాటాడు.అయితే, ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో మాత్రం సంజూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్లలో వరుసగా 5, 0 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ఒక్క పరుగే చేసి అవుటయ్యాడు. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం గురించి డిమాండ్లు వెల్లువెత్తాయి.ఓవైపు గత మూడు మ్యాచ్లలో సంజూ వైఫల్యాలు.. మరోవైపు వైభవ్ విషయంలో ఒత్తిడి.. ఇలాంటి తరుణంలో ఇంగ్లండ్తో రెండో టీ20 నుంచి సంజూను తప్పించి.. వైభవ్ను అరంగేట్రం చేయించింది యాజమాన్యం. అయితే, సంజూ మాదిరే విఫలమైన వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను మాత్రం కొనసాగించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటుగా స్పందించాడు. ‘‘వైభవ్ను టీమిండియా జెర్సీలో చూడటం సంతోషంగా అనిపించింది. కానీ సంజూ శాంసన్ సంగతేంటి? అతడిపై వేటు వేశారా? మీరు నాతో జోక్ చేయడం లేదు కదా!నేనైతే ఇది జోక్ కాదనే అనుకుంటున్నా. బహుశా సంజూ గాయపడి ఉంటాడని నా సందేహం. ఇదే నిజమవ్వాలని కోరుకుంటున్నా. అలా కాకుండా అతడిని తప్పించారంటే మాత్రం ఇంతకంటే విచిత్రమైన, దారుణమైన సెలక్షన్ మరొకటి ఉండదు.ఎందుకంటే వైభవ్ సూర్యవంశీని తప్పకుండా తుదిజట్టులో ఆడించాలంటే.. సంజూ మూడో స్థానంలోనైనా సులువుగా బ్యాటింగ్ చేసేవాడు’’ అని సంజయ్ మంజ్రేకర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
వైభవ్ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా ఈ బిహారీ పిల్లాడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.సంజూ స్థానంలో...కేవలం పదిహేనేళ్ల 99 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈ ఘనత సాధించాడు. గత మూడు మ్యాచ్లలో విఫలమైన ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ తుదిజట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ పది బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, వైభవ్ను ఐర్లాండ్ పర్యటనలోనే అరంగేట్రం చేయాల్సిందంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. యాజమాన్యం కావాలనే అతడిని వేచి చూసేలా చేస్తోందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.విమర్శలపై బీసీసీఐ స్పందనవైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నేపథ్యంలో ANIతో మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీకి శుభాభినందనలు. గొప్ప అవకాశం అందుకున్నావు. బీసీసీఐ ఎవరి విషయంలోనూ అన్యాయంగా ప్రవర్తించదు. వివక్ష చూపించదు.అర్హత ఉన్న వాళ్లకు కచ్చితంగా అవకాశం ఇస్తుంది. అయితే, వైభవ్ అరంగేట్రానికి ముందు సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అతడికి అవకాశాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది గగ్గోలు పెట్టారు. కోచ్, కెప్టెన్ను నిందించారు. కానీ అందులో అర్థం లేదు.సరైన సమయం వచ్చినపుడు వైభవ్ తప్పకుండా అరంగేట్రం చేస్తాడని నేను ముందు నుంచే చెప్తున్నాను. అందుకు తగ్గట్లుగా శనివారం అతడు తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గొప్పగా ఆడుతూ భవిష్యత్తును బంగారం చేసుకుంటాడని నమ్ముతున్నాను. వైభవ్ విషయంలో యాజమాన్యం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అందుకు వారిని తప్పక ప్రశంసించాల్సిందే’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ తప్పు చేశాడు: గావస్కర్An incredibly special moment in the #TeamIndia camp today 🥹💙🎥 Presenting T20I cap no. 122, Vaibhav Sooryavanshi 🧢#ENGvIND pic.twitter.com/hvOZdSN3Ow— BCCI (@BCCI) July 4, 2026 -
చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత స్నిన్నర్గా (ఓవరాల్గా నాలుగో భారత బౌలర్గా) రికార్డుల్లోకెక్కాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓడినా అక్షర్ బంతితో రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి కీలకమైన హ్యారీ బ్రూక్ వికెట్ తీశాడు.బ్రూక్ వికెట్ అక్షర్కు టీ20ల్లో 100వ వికెట్. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 98 మ్యాచ్లు ఆడిన అతడు.. ఓ హాఫ్ సెంచరీ సాయంతో 736 పరుగులు కూడా చేశాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్దీప్ సింగ్ 134 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, జస్ప్రీత్ బుమ్రా 121 వికెట్లు, హార్దిక్ పాండ్యా 114 వికెట్లు, అక్షర్ పటేల్ 100 వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.టీమిండియా కొంపముంచిన బిష్ణోయ్191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 49 పరుగుల దూరంలో ఉండింది. ఈ దశలో బౌలింగ్కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు నోబాల్స్ వేయగా, ఫ్రీ హిట్లను జేకబ్ బేతెల్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. అదే ఓవర్లో మరో సిక్స్, ఒక ఫోర్తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ ఆధీనంలోకి వెళ్లింది. చివరకు ఆతిథ్య జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. -
బిష్ణోయ్ను నిందించని శ్రేయస్
ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో కీలక సమయంలో ఖరీదైన ఓవర్ వేసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడైన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెనుకేసుకొచ్చాడు. జట్టు ఓటమికి ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ.. మ్యాచ్ ఎక్కడ మా చేతుల్లో నుంచి జారిపోయిందో నాకు తెలుసు. కానీ ఒకే ఆటగాడిని చూపించి అతనినే నిందించాలనుకోవడం లేదు. 16వ ఓవర్ తర్వాత మ్యాచ్ మొమెంటం పూర్తిగా మారిపోయిందని అన్నాడు.బిష్ణోయ్ వేసిన వరుస నోబాల్స్ గురించి ప్రశ్నించగా.. ఒక నోబాల్ వేసినా అతను మరింత బలంగా తిరిగి వస్తాడని నమ్ముతున్నాను. 17వ ఓవర్లో మ్యాచ్ మా చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. అతను ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది.ఈ పిచ్పై 190 పరుగులు చాలామంచి స్కోరు. ముఖ్యంగా చివరి ఓవర్లో తిలక్ వర్మ ఆడిన అజేయ 24 పరుగుల ఇన్నింగ్స్ అసాధారణం. అదే సమయంలో జేకబ్ బేతెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని పేర్కొన్నాడు.టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా శ్రేయస్ ప్రశంసలు కురిపించాడు. "అతనిలో ఏమాత్రం భయం కనిపించలేదు. గత కొన్ని నెలలుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. అరంగేట్రం ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అతని ఆత్మవిశ్వాసం చూడటానికి చాలా ఆనందంగా ఉంది" అని అన్నాడు.కాగా, 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 49 పరుగుల దూరంలో ఉండింది. ఈ దశలో బౌలింగ్కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు నోబాల్స్ వేయగా, ఫ్రీ హిట్లను జేకబ్ బేతెల్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. అదే ఓవర్లో మరో సిక్స్, ఒక ఫోర్తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ ఆధీనంలోకి వెళ్లింది. చివరకు ఆతిథ్య జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. -
టీమిండియా కొంపముంచిన బిష్ణోయ్
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న (జులై 4) జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది.కాగా, రెండో టీ20లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీమిండియా కొంపముంచాడు. ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు వదులుకున్న దశలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఏకంగా 29 పరుగులిచ్చి మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేశాడు. ఆ ఓవర్కు ముందు ఇంగ్లండ్ గెలవాలంటే 4 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. పైగా అప్పటికి క్రీజ్లో ఉన్న జేకబ్ బేతెల్ కూడా పరుగులు చేసుందుకు ఇబ్బంది పడుతున్నాడు. అతడికి జతగా ఉన్న సామ్ కర్రన్ అప్పుడే క్రీజ్లోకి వచ్చాడు.ఈ దశలో బంతినందుకున్న బిష్ణోయ్ నో బాల్తో ఓవర్ ప్రారంభించి వరుసగా 6, మరో నో బాల్, 6, 2, 4, 6, 2 పరుగులిచ్చాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. సమీకరణలు 3 ఓవర్లలో 20 పరుగులకు మారిపోయాయి. దీంతో మరింత ఫ్రీగా ఆడిన బేతెల్ (76 నాటౌట్).. జోఫ్రా ఆర్చర్ (10 నాటౌట్) సహకారంతో మ్యాచ్ను సునాయాసంగా ముగించాడు.ఈ ఓటమి తర్వాత బిష్ణోయ్పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. టీమిండియా ఓటమికి కారకుడంటూ సోషల్మీడియా వేదికగా దుర్భాషలాడుతున్నారు. ఈ చెత్త స్పెల్ కారణంగా బిష్ణోయ్ వ్యక్తిగతంగానూ ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ (29) వేసిన స్పెషలిస్ట్ బౌలర్గా అపఖ్యాతి పాలయ్యాడు.అంతేకాకుండా, 2020లో న్యూజిలాండ్పై శివమ్ దూబే ఇచ్చిన 34 పరుగులు, 2016లో వెస్టిండీస్పై స్టువర్ట్ బిన్నీ ఇచ్చిన 32 పరుగుల తర్వాత మూడో అత్యంత ఖరీదైన ఓవర్గా వేసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. -
శ్రేయస్ అయ్యర్కు ఘోర అపఖ్యాతి
భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన తొలి భారత కెప్టెన్గా అపఖ్యాతి పాలయ్యాడు. కొద్ది రోజుల కిందట ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్లో భారత టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్.. ఆ సిరీస్లో రెండు మ్యాచ్లు, ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. ఇంగ్లండ్తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇలా చూస్తే శ్రేయస్ భారత టీ20 కెప్టెన్గా తన కెరీర్ను హ్యాట్రిక్ ఓటములతో మొదలుపెట్టాడు.ఈ అవాంఛనీయ రికార్డులతో పాటు శ్రేయస్ మరో అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నాడు. కెప్టెన్గా చివరి 11 మ్యాచ్ల్లో ఏకంగా 9 మ్యాచ్ల్లో తన జట్టును గెలిపించలేకపోయాడు. భారత టీ20 కెప్టెన్గా కెరీర్ ప్రారంభించడానికి ముందు అతడు ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఎడిషన్లో శ్రేయస్ తన చివరి 7 మ్యాచ్ల్లో ఏకంగా ఆరింట తన జట్టును పరాజయాలబాట పట్టించాడు. ఆ ఒక్క గెలుపు చివరి లీగ్ మ్యాచ్లో వచ్చింది.ఈ లెక్కన శ్రేయస్ తన చివరి 11 ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించాడు. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కెప్టెన్గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉందన్న కారణంగా టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న శ్రేయస్ ఇలాంటి చెత్త ప్రదర్శనలు చేస్తుండటం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. భారత కెప్టెన్గా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన శ్రేయస్ ఖాతా కూడా తెరవలేకపోవడం ఫ్యాన్స్ను విస్మయానికి గురి చేస్తుంది.శ్రేయస్ తాజా ఓటమి విషయానికొస్తే.. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అభిషేక్ శర్మ (43), ఇషాన్ కిషన్ (49), శ్రేయస్ అయ్యర్ (37), తిలక్ వర్మ (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఈ మ్యాచ్తో టీమిండియా అరంగేట్రం చేసిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు సిక్సర్లు బాదినా, 14 పరుగులకే పరిమితమై నిరాశపరిచాడు.అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. జేకబ్ బేతెల్ (78 నాటౌట్) చెలరేగి ఆడి అద్భుత విజయాన్నందించాడు. అతడికి కెప్టెన్ హ్యారీ బ్రూక్ (39), టామ్ బాంటన్ (39) సహకరించారు. ఓ దశలో ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు వదులుకున్నప్పటికీ.. రవి బిష్ణోయ్ వేసిన ఓ ఓవర్ ఆ జట్టును గెలుపు ట్రాక్ ఎక్కించింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు సమర్పించుకొని టీమిండియా కొంపముంచాడు. ఆతర్వాత ఒత్తిడి తగ్గడంతో ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 5 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది. -
టాస్ గెలిచిన టీమిండియా: అతడిపై వేటు.. వైభవ్ అరంగేట్రం
ఇంగ్లండ్తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఓపెనర్గా సంజూ శాంసన్ స్థానాన్ని పదిహేనేళ్ల వైభవ్ భర్తీ చేశాడు.టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ఈసారి కూడా తొలుత బ్యాటింగ్ చేస్తాం. మా తుదిజట్టులో ఒక మార్పు. సంజూ స్థానంలో వైభవ్ ఆడతాడు. గత రెండు నెలలుగా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.అత్యుత్తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతడు ఒత్తిడికి లోనుకాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలకడగా ఆడగలడు’’ అని వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. కాగా 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్.. అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. మరోవైపు.. గత మూడు మ్యాచ్లలో విఫలమైన సంజూ (5, 0, 1)పై యాజమాన్యం వేటు వేసింది.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.చదవండి: శ్రీలంకతో వన్డే.. భారత్ ఘన విజయం -
టీం ఇండియా ఊపిరి పీల్చుకో.. బుడ్డాడు వస్తున్నాడు
-
‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఈ చిచ్చరపిడుగును వీలైనంత త్వరగా టీమిండియాకు ఆడించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్ను బెంచ్కే పరిమితం చేస్తూ వస్తోంది.వాళ్లు విఫలమవుతున్నా..ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ రెండు మ్యాచ్లలోనూ ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మొండిచేయే ఎదురైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టీ20లోనూ పదిహేనేళ్ల ఈ పిల్లాడిని పక్కనపెట్టేశారు. మరోవైపు.. టాపార్డర్లో ఓపెనర్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వరుసగా విఫలమవుతున్నారు.ఇలాంటి తరుణంలో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని కావాలనే పక్కనపెడుతున్నారనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలిస్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ సిరీస్లో ఏదో ఒక మ్యాచ్లో వైభవ్కు కచ్చితంగా ఆడే అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే, ప్రస్తుతానికి కోచింగ్ సిబ్బంది అతడికి సరైన రీతిలో కమ్యూనికేట్ చేయాలి. నిరాశ చెందిన బ్యాటర్కు.. ‘నువ్వు రేసులోనే ఉన్నావు’ అనే విషయాన్ని తెలియజేయాలి.ఇలా చేయడం ద్వారా అతడిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఒకవేళ అతడిని ఆడించడం కుదురలేదంటే.. ఆ నిజాన్ని కూడా నేరుగా అతడితోనే చెప్పాలి. వైభవ్ పదిహేనేళ్ల పిల్లాడు. అతడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.తను నిరాశ చెందకుండా చూసుకోవాలి. తుదిజట్టులో స్థానం కోసం ఓపికతో ఎదురుచూడాల్సి ఉంటుందని సానుకూలంగా తెలియజెప్పాలి. అప్పుడే అతడి మనసు కాస్త స్థిమితంగా ఉంటుంది’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.ఇప్పుడు వైభవ్ను ఆడించడం కుదరదుఅదే విధంగా.. ‘‘సంజూ శాంసన్ ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్నాడు. అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి తరుణంలో కచ్చితంగా వైభవ్కు టాపార్డర్లో చోటు ఉండదు. ఇదే విషయాన్ని అతడికి అర్థమయ్యేలా చెప్పాలి’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందికి పార్థివ్ పటేల్ విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఇరుజట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఇందుకు మాంచెస్టర్ వేదిక.చదవండి: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్ పోస్ట్ వైరల్! -
అరంగేట్రంపై హింట్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ఎట్టకేలకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో శనివారం (జులై 4) జరగనున్న రెండో టీ20లో వైభవ్కు తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.వైభవ్ తన అంతర్జాతీయ అరంగేట్రం విషయాన్ని సోషల్మీడియా వేదికగా పరోక్షంగా వెల్లడించాడు. రెండో టీ20కి ముందు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో "New Chapter" అంటూ పోస్ట్ చేసి అరంగేట్రంపై పరోక్ష సంకేతాన్నిచ్చాడు. ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరలవుతోంది. వాస్తవానికి వైభవ్ టీమిండియా అరంగేట్రం కోసం అభిమానులు గత కొద్ది రోజులుగా వేచి చూస్తున్నారు. ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో వైభవ్ అరంగేట్రం ఖాయమని అంతా అనుకున్నారు. తీరా చూస్తే రెండో మ్యాచ్లోనూ అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఆతర్వాత ఇంగ్లండ్ సిరీస్ తొలి మ్యాచ్లోనూ వైభవ్ ఎంట్రీ కోసం భారత క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ మ్యాచ్లోనూ అతడిని అవకాశం దక్కలేదు. తాజాగా వైభవ్ స్వయంగా తన అరంగేట్రంపై హింట్ ఇవ్వడంతో అభిమానులంతా ఈ రోజు మ్యాచ్లో అతడి మెరుపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే, వైభవ్ అరంగేట్రంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాడిని తొందరపడి జట్టులోకి తీసుకురావడంపై జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్-2 బ్యాటర్గా ఉన్న అభిషేక్ శర్మ, టీ20 ప్రపంచకప్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి వైభవ్కు వెంటనే అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు.వైభవ్పై కూడా ఎంతో నమ్మకం ఉందని.. అవకాశం వచ్చినప్పుడు అతడు తప్పకుండా సిద్ధంగా ఉంటాడని అన్నాడు.మరోవైపు సంజూ శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో అతని చివరి మూడు ఇన్నింగ్స్ల్లో వరుసగా 5, 0, 1 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టీ20లో సంజూకు విశ్రాంతి ఇచ్చి, వైభవ్ సూర్యవంశీకి తొలి అవకాశం ఇవ్వాలని చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. -
భారత్తో రెండో టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! యువ ప్లేయర్కు చోటు
మాంచెస్టర్ వేదికగా శనివారం భారత్తో జరగనున్న రెండో టీ20 కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టీ20కు విశ్రాంతి తీసుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. పేసర్లు ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్ స్థానాల్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్లకు తుది జట్టులో చోటు దక్కింది.ఈ మ్యాచ్తో జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున టీ20 అరంగేట్రం చేయనున్నాడు. టంగ్ ఇప్పటికే టెస్ట్ జట్టులో రెగ్యులర్ బౌలర్గా కొనసాగుతున్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 12 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. టీ20ల్లో మాత్రం అతడికి పెద్దగా అనుభవం లేదు. ఇప్పటివరకు కేవలం 21 టీ20లు మాత్రమే ఆడాడు. అతడి పేరిట 29 టీ20 వికెట్లు ఉన్నాయి.సాకిబ్పై వేటుకాగా తొలి మ్యాచ్లో సాకిబ్ మహమూద్ 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టినప్పటికి.. ఆర్చర్ కోసం అతన్ని పక్కన పెట్టడం గమనార్హం. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత ఆర్చర్కు ఇదే మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. కచ్చితంగా పవర్ప్లేలో అతడి నుంచి భారత బ్యాటర్లకు కఠిన సవాల్ ఎదురు కానుంది.ఇంగ్లండ్ తుది జట్టుఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్. -
IND vs ENG: ఇంగ్లండ్ కెప్టెన్పై మాజీ క్రికెటర్ ఫైర్!
ఇంగ్లండ్తో తొలి టీ20లో టీమిండియా ఆదిలో తడబడినా మెరుగైన స్కోరు సాధించింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్లలో సంజూ శాంసన్ (1) మరోసారి విఫలం కాగా.. అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ (24 బంతుల్లో 59) సాధించాడు.21 బంతుల్లో 42వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం (47 బంతుల్లో 68)తో రాణించి.. అభిషేక్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మిగిలిన వారిలో ఆల్రౌండర్ శివం దూబే దూకుడుగా ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగింది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ శివం దూబేపై ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఫినిషర్గా దూబే నిలకడగా రాణిస్తున్నాడని కొనియాడాడు.SHIVAM DUBE HAS 69 FOURS & 68 SIXES IN JUST 51 INNINGS 🥶🔥- A T20 machine for India, Dube.pic.twitter.com/XOop15dsiS— Johns. (@CricCrazyJohns) July 2, 2026అదే సమయంలో దూబే విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అనుసరించిన వ్యూహాలను పార్థివ్ పటేల్ విమర్శించాడు. స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ స్వరూపాన్ని మార్చడానికి ఒక్క ఆటగాడు చాలు. టీమిండియా ఫినిషర్గా దూబే గత కొన్నాళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. అతడు తన పాత్రను చక్కగా పోషించాడు.ఇంగ్లండ్ వ్యూహం చెత్తగా ఉందికానీ ఇంగ్లండ్ వ్యూహమే చెత్తగా ఉంది. శివం దూబే బ్యాటింగ్కు వచ్చాడని తెలిసీ.. వాళ్లు స్పిన్నర్ లియామ్ డాసన్కు బంతిని ఇచ్చారు. ఇక 19వ ఓవర్లో కూడా స్పిన్నర్తోనే బౌలింగ్ వేయించారు. ఇదేమన్నా రాకెట్ సైన్సా?శివం దూబే స్పిన్నర్ల బౌలింగ్లో చితక్కొడతాడన్న విషయం కూడా తెలియదా? ఐపీఎల్ చూస్తేనైనా ఈ విషయం అర్థం కావాలి. లేదంటే అంతర్జాతీయ మ్యాచ్లను పరిశీలించినా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.స్పిన్ బౌలింగ్లో అతడికి ఉన్న రికార్డు గురించి ఆ మాత్రం తెలియదా?.. ఇంగ్లండ్ బౌలర్లకు అతడు చుక్కలు చూపించాడు. చక్కటి (200) స్ట్రైక్రేటుతో పరుగులు పిండుకున్నాడు’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 భారీ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మొదట టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేయగా... ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగే అవకాశం ఇవ్వకుండా వర్షం దంచికొట్టింది. దీంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఇరు జట్ల మధ్య శనివారం రెండో టీ20 జరగనుంది. ఇందుకు మాంచెస్టర్ వేదిక.చదవండి: IND vs SL: టెస్టు సిరీస్ నుంచి కీలక ప్లేయర్ అవుట్! -
పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్
-
నా సేవల్ని సరిగ్గా వాడుకోలేదు.. అందుకే: టీమిండియా స్టార్
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో యాజమాన్యం తన సేవలను సరిగ్గా వాడుకోలేదని ఆరోపించాడు. కాగా గతేడాది టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే.ఈ సిరీస్తోనే భారత జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. గౌతం గంభీర్ మార్గదర్శనంలో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. ఇక ఈ సిరీస్లో భాగంగా ముంబైకర్ శార్దూల్ ఠాకూర్ రెండు టెస్టులు ఆడాడు. మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్ చేసి 144 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ఆరు ఓవర్లు వేసిన శార్దూల్.. 38 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.అదే విధంగా మాంచెస్టర్లో నాలుగో టెస్టులో పదకొండు ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ 55 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. ఈ మ్యాచ్ డ్రా అయింది. అయితే, ఈ మూడు ఇన్నింగ్స్లోనూ శార్దూల్ కంటే మిగతా బౌలర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశారు.ఈ విషయాన్ని శార్దూల్ ఠాకూర్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ 2026-27 సీజన్ లాంచ్లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘2024-25 సీజన్లో నేను అద్భుతంగా ఆడాను (తొమ్మిది మ్యాచ్లలో కలిపి 35 వికెట్లు). కానీ తగినన్ని మ్యాచ్లు ఆడే అవకాశాలు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నపుడు నా సేవల్ని యాజమాన్యం సరిగ్గా ఉపయోగించుకోలేదు.ఇందులో నా తప్పు కూడా ఉంది. లీడ్స్ టెస్టులో నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఒక్క పరుగుకే అవుటయ్యాను. మాంచెస్టర్లో మాత్రం నేను అద్భుతంగా బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్లో 41 పరుగులు చేశాను. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులు చేయగలిగింది. అందులో నా పాత్ర కూడా ఉంది. అయితే, నేను రెండో ఇన్నింగ్స్లో సరిగ్గా ఆడలేదు. ఒకవేళ బాగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. -
‘వైభవ్ సూర్యవంశీ ఇప్పుడే వద్దు.. అతడికే నా మద్దతు’
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సత్తా చాటిన టీమిండియా స్టార్ సంజూ శాంసన్.. ఈ మెగా ఈవెంట్ తర్వాత మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్లలో 5, 0 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.తాజాగా ఇంగ్లండ్ పర్యటనను కూడా సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.అతడిని తప్పించండిఇలా వరుసగా గత మూడు మ్యాచ్లలో సంజూ శాంసన్ విఫలమైన నేపథ్యంలో అతడిని తుదిజట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. సంజూకు బదులు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పంపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాత్రం భిన్నంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ విషయంలో తొందరపాటు తగదని.. సంజూ- అభిషేక్నే ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.సంజూకే నా మద్దతు.. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ మరోసారి విఫలమైన మాట వాస్తవమే. గత మూడు ఇన్నింగ్స్లో అతడు దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి మద్దతు మరింతగా పెరుగుతోంది. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. సంజూ శాంసన్ ఓపెనర్గా సరైనోడే.ప్రపంచకప్ టోర్నీలో తీవ్రమైన ఒత్తిడిలోనూ అతడు రాణించి.. జట్టును గెలిపించాడు. చాలా మంది వైభవ్ ఇంకెప్పుడు ఆడతాడంటూ చర్చోపర్చలు చేస్తున్నారు. వారి ఆవేదన, ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను. వైభవ్ ఆ హక్కు సంపాదించుకోవాలికానీ నేను ఇప్పటికీ సంజూ శాంసన్కే మద్దతు ప్రకటిస్తాను. ప్రపంచకప్ టోర్నీలో అతడు రాణించిన తీరు అద్భుతం. అలా అని నేనేమీ వైభవ్కు వ్యతిరేకం కాదు. అయితే, వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకునే హక్కును సంపాదించుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఈ పిల్లాడు అద్భుతంగా రాణిస్తాడు’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2026 నాకౌట్ మ్యాచ్లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా భారత్ చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: IND vs ENG: ఇషాన్ రనౌట్.. తప్పు నీదే! -
IND vs ENG: నువ్వసలు ఏం చేస్తున్నావు?.. తప్పు నీదే!
ఇంగ్లండ్తో తొలి టీ20లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ పూర్తిగా విఫలమయ్యాడు. తన తొందరపాటు చర్యతో మూల్యం చెల్లించుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఇషాన్ కిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా బుధవారం తొలి టీ20 ఆడింది. చెస్టర్ లీ స్ట్రీట్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (1) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (24 బంతుల్లో 59) సాధించాడు.నువ్వసలు ఏం చేస్తున్నావు?ఇక వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సకీబ్ మహ్మూద్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇషాన్.. అక్కడ పరుగుకు ఆస్కారం లేకున్నా సింగిల్ కోసం పరిగెత్తాడు.మరో ఎండ్లో ఉన్న అభిషేక్ శర్మ బంతిని గమనించి సింగిల్కు అవకాశం లేదని అక్కడే ఉండిపోయాడు. ‘‘నువ్వసలు ఏం చేస్తున్నావు?’’ అంటూ ఒకింత అసహనంతో ఇషాన్ను హెచ్చరించాడు కూడా!.. దీంతో ఇషాన్ క్రీజులోకి చేరుకునేందుకు డైవ్ కూడా చేశాడు.A costly mix-up in the middle. 🫣Moments after the run-out: Abhishek Sharma and Ishan Kishan share a brief conversation.#ENGvIND 1st T20I 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/1kagvrBjV9— Star Sports (@StarSportsIndia) July 1, 2026కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వికెట్లను గిరాటేయడంతో ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇషాన్- అభిషేక్లలో తప్పెవరిది అన్న చర్చ జరుగుతుండగా.. సునిల్ గావస్కర్ అభిషేక్కు మద్దతుగా నిలిచాడు.ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే‘‘వీలైనంత త్వరగా క్రీజులోకి చేరుకోవాల్సింది. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో అన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. ఇందులో అభిషేక్ శర్మ తప్పేమీ లేదు. ఇది ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదం. ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే’’ అని గావస్కర్ తీవ్ర స్థాయిలో ఇషాన్ను విమర్శించాడు.కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇషాన్ కిషన్ బుధవారమే నంబర్వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు రెండో ర్యాంక్లో ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఒక స్థానం మెరుగుపర్చుకొని 876 పాయింట్లతో టాప్ ర్యాంక్ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నంబర్వన్గా ఉన్న ఇషాన్ సహచరుడు అభిషేక్ శర్మ (869) రెండో స్థానానికి పడిపోయాడు.గంటల్లోనే హీరో నుంచి జీరోగా..అయితే, నంబర్ వన్గా ఎదిగిన కొన్ని గంటల్లోనే ఇషాన్ కిషన్ ఇలా ‘జీరో’ స్కోరుతో పెవిలియన్ చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- టీమిండియా మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది. ఈ మ్యాచ్లో అభిషేక్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68), శివం దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) రాణించారు.చదవండి: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్Another Disappointing start for Team India.Sanju Samson again fails to score.Followed by a run out of in-form Ishan Kishan.Not the Start we imagined.#ENGvINDpic.twitter.com/y9H3qfFIh7— TheFakeFakeer (@TheFakeFakeer) July 1, 2026 -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం పలు రికార్డులు తమ పేరిట లిఖించుకున్నారు. ఇప్పటికే అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో అరుదైన ఫీట్ సాధించగా, తాజాగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్తో తొలి టీ20లో అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో విఫలమైన శ్రేయస్ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం బ్యాట్ ఝలిపించాడు. ఈ క్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరఫున 5వేల పరుగులు పూర్తి చేసుకున్న 29వ బ్యాటర్గా అయ్యర్ నిలిచాడు. 147 ఇన్నింగ్స్ల్లో (అన్ని ఫార్మాట్లు) అయ్యర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇందులో ఆరు సెంచరీలు, 37 అర్ధసెంచరీలున్నాయి. ఇక తొలి టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన అయ్యర్ ఇంగ్లండ్ గడ్డపై కెప్టెన్గా ఫిఫ్టీ సాధించిన తొలి ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. గతంలో టీ20 కెప్టెన్గా కోహ్లి చేసిన 47 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. 8 ఏళ్ల తర్వాత కోహ్లి రికార్డును అయ్యర్ బద్దలు కొట్టాడు. అంతేకాదు టీ20 కెరీర్లో శ్రేయస్ అయ్యర్కు ఇది మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్హిట్టింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు. -
వర్షం కారణంగా తొలి టీ20 రద్దు.. భారత్కు అచ్చిరాని వేదిక
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ను వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జోరందుకున్న వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు తెలిపారు. అయితే చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా భారత్ ఆడిన మూడు మ్యాచ్లు కూడా వర్షం కారణంగా రద్దవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఈ వేదిక టీమిండియాకు అంతగా కలసిరాలేదు. 2002లో తొలిసారి ఈ వేదికలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వర్షార్ప ణమైంది. ఆ తర్వాత 2011లో మరోసారి ఇరుజట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. తాజాగా మూడోసారి అదే ఫలితం పునరావృతం కావడం గమనార్హం. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్హిట్టింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది.తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభిషేక్, శ్రేయస్లు కలిసి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. అప్పటివరకు స్లోగా ఆడిన అయ్యర్ వేగం పెంచాడు. ఈ దశలో 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్కోరును పెంచే క్రమంలో అయ్యర్ ఔటైనప్పటికీ ఫినిషర్ రోల్కు న్యాయం చేస్తూ శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడడంతో టీమిండియా 180 పరుగుల మార్క్ను దాటింది.The 1st #ENGvIND T20I in Durham has been called off due to rains.Scorecard ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia pic.twitter.com/cjIdYQcHUR— BCCI (@BCCI) July 1, 2026 -
ఇంగ్లండ్ గడ్డపై అభిషేక్ అరుదైన రికార్డు
టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ తన ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అభిషేక్ మాత్రం తన బ్యాటింగ్లో దూకుడు కొనసాగించాడు. తద్వారా 20 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకున్న అభిషేక్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై టీ20ల్లో టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ 2018లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టీ20లో 27 బంతుల్లో ఫిఫ్టీ సాధించడమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా అభిషేక్ కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో పాటు అభిషేక్ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా వచ్చి చేరింది. టీ20 క్రికెట్లో అభిషేక్ శర్మ వంద సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ కంటే ముందు టీమిండియా తరఫున రోహిత్ శర్మ (205 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (179 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (126 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (124 సిక్సర్లు) ఉన్నారు. అయితే టీమిండియా తరఫున టీ20ల్లో వంద సిక్సర్లు కొట్టిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. 49 మ్యాచ్ల్లోనే అభిషేక్ వంద సిక్సర్లు పూర్తి చేసుకోవడం మరో విశేషం. ఇక అభిషేక్ శర్మకు టీ20ల్లో 48 ఇన్నింగ్స్ల్లో ఇది పదకొండో ఫిఫ్టీ కావడం గమనార్హం. Milestone unlocked 🔓1️⃣0️⃣0️⃣ T20I sixes and counting for the power-packed Abhishek Sharma 👏Updates ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia | #ENGvIND | @OfficialAbhi04 pic.twitter.com/lAohcmYvOG— BCCI (@BCCI) July 1, 2026 -
నాకు సూర్య అవన్నీ చెప్పాడు: శ్రేయస్ అయ్యర్
టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు.. హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా విమర్శల వర్షం కురుస్తోంది.ఇక ఐర్లాండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా ఇంగ్లండ్లో అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్కు.. మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రశ్న ఎదురైంది.సూర్య నాతో మాట్లాడాడుఇందుకు బదులిస్తూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్, నేనూ దాదాపుగా ఒకేలా ఆలోచిస్తాము. దేశవాళీ క్రికెట్లో అతడితో కలిసి చాలా ఏళ్లు ఆడాను. ఇక్కడికి వచ్చేముందు కూడా సూర్య నాతో మాట్లాడాడు.యాజమాన్యం ఎలా పనిచేస్తుంది.. వివిధ సందర్భాల్లో ఆటగాళ్లు ఎలా స్పందిస్తారు.. వారి ఆలోచనలు ఏవిధంగా ఉంటాయన్న అంశాలపై నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు. మా మధ్య సంభాషణ అర్థవంతంగా సాగింది. అతడి నుంచి నేర్చుకోవాల్సి చాలానే ఉంది’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.అనూహ్య రీతిలో వేటు కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసింది. కెప్టెన్గా రాణించినా బ్యాటర్గా విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, సూర్యకు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మరొక్క అవకాశం ఇస్తారని భావించినా.. యాజమాన్యం మాత్రం అతడిని సారథ్య బాధ్యతల నుంచే కాకుండా.. జట్టు నుంచీ తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.చదవండి: IND vs ENG: షెడ్యూల్, జట్లు.. టైమింగ్స్.. పూర్తి వివరాలు -
బౌలర్లను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 బుధవారం డర్హమ్ వేదికగా జరనగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు మరోసారి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురుంచి క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ 15 ఏళ్ల చిచ్చరపిడుగు సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేస్తాడా లేదా అన్నదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ఐర్లాండ్తో సిరీస్కు ఎంపికైనప్పటికి వైభవ్కు మాత్రం డెబ్యూ చేసే అవకాశం లభించలేదు. సంజూ శాంసన్, అభిషేక్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉండడంతో వైభవ్ను మేనెజ్మెంట్ బెంచ్కే పరిమితం చేసింది.ఈ క్రమంలో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లపై చాలా మంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఐపీఎల్లో దుమ్ములేపిన వైభవ్కు ఓ అవకాశం ఇవ్వాలని మేనెజ్మెంట్ను సూచించారు. కానీ ఇంగ్లండ్ టూర్లో కూడా వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపించడం లేదు.Vaibhav Suryavanshi is taking out his frustration from the Ireland T20 series loss in the nets at Durham.😭🔥 pic.twitter.com/80T3ovtnRY— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 30, 2026సీనియర్లకు తమ మద్దతు ఉంటుందని కెప్టెన్ అయ్యర్ మరోసారి స్పష్టం చేశాడు. ఏదేమైనప్పటికి వైభవ్ మాత్రం తన ప్రాక్టీస్ను ఆపడం లేదు. తొలి టీ20కు ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత బౌలర్లపై వైభవ్ విరుచుకుపడ్డాడు. ప్రసిద్ద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, అర్ష్దీప్ సింగ్ వంటి సీనియర్ పేసర్లను సూర్యవంశీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.తుది జట్లుభారత్(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్చదవండి: మ్యాచ్ రద్దయినా రూ.8 లక్షలు ఫిక్స్! అంపైర్ల సంపాదన ఎంతంటే? -
భారత్తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
ఐర్లాండ్ చేతిలో దారుణ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్, టీమిండియా మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోమవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్లో ఆడే ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించింది.అయితే టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఇంగ్లండ్ బోర్డు 17 మందితో కూడిన సభ్యుల బృందాన్ని ప్రకటించింది. హ్యారీ బ్రూక్ జట్టును నడిపించనుండగా, జాస్ బట్లర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బట్లర్తో పాటు సీనియర్లు సామ్ కరన్, ఆదిల్ రషీద్తో పాటు టీ20 సంచలన ఆటగాళ్లు జాకనబ్ బెథెల్, టామ్ బాంటన్, లియామ్ డాసన్లకు అవకాశం కల్పించింది. అయితే స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కు తొలి టీ20 మ్యాచ్కు విశ్రాంతి ఇచ్చినట్లు బోర్డు తెలిపింది. అయితే ఆర్చర్కు ఎందుకు రెస్ట్ ఇచ్చారనే దానిపై మాత్రం ఈసీబీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇటీవలే న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆర్చర్ నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన ఆర్చర్ 25 వికెట్లు తీశాడు. అయితే ఐర్లాండ్తో సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఇంగ్లండ్తో సిరీస్లో దానిని పునరావృతం చేయకూడదనే సంకల్పంతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో సెమీస్లో టీమిండియా చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అందుకే సొంతగడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ను ఓడించి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20కి చెస్టర్ లె స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్ వేదిక కానుంది.తొలి టీ20కి ఇంగ్లండ్ తుది జట్టు:ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.Our XI is IN! 🦁Click below to see our team for our series opener with India...— England Cricket (@englandcricket) June 30, 2026 -
డ్రెస్సింగ్ రూమ్లోకి వైభవ్కు నో ఎంట్రీ
వండర్కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియాకు ఎంపికైనా, అతడికి జట్టు డ్రెస్సింగ్ రూమ్లోకి మాత్రం ప్రవేశం లేదు. ఎందుకంటే, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమలు చేస్తున్న బాలల భద్రతా నిబంధనల ప్రకారం, 16 ఏళ్ల లోపు ఆటగాళ్లు పూర్తిస్థాయి పెద్దల డ్రెస్సింగ్ రూమ్లను ఉపయోగించకూడదు. ఈ నిబంధనల నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ కోసం ఈసీబీ ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ కేటాయించింది.మ్యాచ్ల సమయంలో మాత్రం వైభవ్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లవచ్చు. సహచర ఆటగాళ్లతో మాట్లాడడం, జట్టు సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ మ్యాచ్కు ముందు, తర్వాత దుస్తులు మార్చుకోవడం వంటి కార్యక్రమాల కోసం తప్పనిసరిగా ప్రత్యేక గదినే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈసీబీ ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.ప్రస్తుతం వైభవ్ ఎదుర్కొంటున్న పరిస్థితినే 15 ఏళ్ల మ్యాక్స్ డౌమన్ అనే స్టార్ ఫుట్బాలర్ ఎదుర్కొంటున్నాడు. ఆర్సెనల్ క్లబ్కు ఆడే డౌమన్కు కూడా వైభవ్లాగే ప్రత్యేక నిబంధనలు వర్తిస్తున్నాయి. అతనికి కూడా క్లబ్లో ప్రత్యేక మార్పిడి గది ఏర్పాటు చేశారు.ఇదిలా ఉంటే, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ల కోసం వైభవ్ భారత జట్టుతో కలిసి యూకేకు చేరుకున్నాడు. ఈ సిరీస్లలో అతడు ఏ మ్యాచ్లో బరిలోకి దిగినా, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అతి పిన్న వయస్కుడైన భారత అంతర్జాతీయ క్రికెటర్ రికార్డును బద్దలు కొడతాడు.వైభవ్ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు శ్రీలంకలో జరిగిన ఏ-జట్ల ట్రై సిరీస్లోనూ చెలరేగి ఆడాడు. లంకతో జరిగిన ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్తో భారత జట్టుకు టైటిల్ అందించాడు.ఈ ప్రదర్శన తర్వాత అభిమానులంతా వైభవ్ భారత సీనియర్ జట్టు అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ జూన్ 26, 28 తేదీల్లో జరుగనుంది. అనంతరం జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూలైంది.బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందివైభవ్ యూకే పర్యటన నేపథ్యంలో బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైభవ్ సంరక్షణ, మానసిక సౌకర్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అతడి తల్లిదండ్రులను కూడా యూకే పర్యటనకు అనుమతిచ్చింది. టీమిండియాలో అందరూ పెద్దవారే ఉండటంతో, వైభవ్ కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం ఉపయోగపడుతుందని బీసీసీఐ భావించింది. -
ఇంగ్లండ్తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచరీ వీరుడికి నో చాన్స్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసి జోష్ మీదున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై టీ20లతో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఇంగ్లండ్ టూర్కు ముందు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే, ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కోహ్లి ఆడుతాడా లేదా అనే సందేహం ఉండేది. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడని తెలిపిన బీసీసీఐ ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో ఆడబోయే టీమిండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ తుదిజట్టులో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఆఫ్గన్తో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ శతకం బాదిన సంగతి తెలిసిందే. అంతకముందు ఐపీఎల్లోనూ ఇషాన్ ఎస్ఆర్హెచ్ తరఫున తన బ్యాటింగ్తో అలరించిన సంగతి తెలిసిందే.ఇక జట్టు విషయానికొస్తే.. టాపార్డర్లో ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ, వన్డౌన్లో కోహ్లి రానున్నారు. ఆఫ్గన్తో వన్డే సిరీస్లో కెప్టెన్ గిల్ అదరగొట్టాడు. మూడు వన్డేలు కలిపి 238 పరుగులు చేసిన గిల్ ఖాతాలో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో బ్యాటర్ రోహిత్ శర్మ తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించనప్పటికీ మూడో వన్డేలో తనదైన ఇన్నింగ్స్తో అలరించాడు. ఆఫ్గన్తో సిరీస్లో 143 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి గాయం కారణంగా ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇక మిడిలార్డర్లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్తో పాటు ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్లను ఎంపిక చేశారు. ఇక వన్డేల్లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కు రానుండగా, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. నితీశ్కుమార్ రెడ్డి ప్రస్తుతానికి జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, గాయంతో అతడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. ఆల్రౌండర్ కోటాలో అక్షర్పటేల్ ఏడో స్థానంలో ఆడడం గ్యారంటీ, బౌలింగ్ కోటాలో బుమ్రా, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణలకు చోటు కల్పించింది. ఇంగ్లండ్ వన్డేలకు భారత ప్లేయింగ్ ఎలెవన్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, నితీశ్కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ మధ్యాహ్నం 3:302వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:303వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30Read: నితీశ్రెడ్డికి గాయం.. ఇంగ్లండ్ టూర్కు దూరం! -
బుమ్రా పునరాగమనం
న్యూఢిల్లీ: పనిభారం నేపథ్యంలో గత కొంతకాలంగా వన్డే క్రికెట్కు దూరంగా ఉంటున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అతడిని... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో తిరిగి జట్టుకు ఎంపిక చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా గాయపడి అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు అందుబాటులో లేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కూడా ఇంగ్లండ్ సిరీస్కు ఎంపిక చేశారు. అయితే దానికి ముందు అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. వచ్చే నెలలో ఇంగ్లండ్తో టీమిండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. దాని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం శుబ్మన్ గిల్ సారథ్యంలో... 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అఫ్గాన్తో చివరి వన్డేలో సెంచరీతో చెలరేగినప్పటికీ యశస్వి జైస్వాల్కు అవకాశం దక్కలేదు. గాయం నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పేరును పరిశీలించలేదు. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు జూలై 14న తొలి వన్డే (ఎడ్జ్బాస్టన్), 16న రెండో వన్డే (సోఫీ గార్డెన్స్), 19న మూడో వన్డే (లార్డ్స్) ఆడనుంది. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, ఇషాన్ కిషన్, సుందర్, అక్షర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్, బుమ్రా, ప్రసిధ్, హర్షిత్ రాణా, అర్‡్షదీప్, గుర్నూర్ బ్రార్. -
భారత జట్టు ప్రకటన.. సెంచరీ హీరోకు నో ఛాన్స్
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్తో వన్డేలకు గాయం కారణంగా దూరమైన స్టార్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు స్టార్ సేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేశాడు. విరాట్ను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది.ఇక అఫ్గాన్తో ఆఖరి వన్డేలో సెంచరీతో సత్తాచాటిన యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు మాత్రం చోటు దక్కలేదు. తన చివరి మూడు వన్డేలలో రెండు శతకాలు సాధించినప్పటికీ జైస్వాల్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. జూలై 14 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్తో వన్డేల కోసం భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ మధ్యాహ్నం 3:302వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:303వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు -
ఇంగ్లండ్ సిరీస్కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) శిబిరంలో ఉన్న పాండ్యా అఫ్గానిస్తాన్తో సిరీస్కు కూడా దూరమయ్యాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో అప్పటివరకు పాండ్యా కోలుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ, బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న పాండ్యా ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడని, అతడు కోలుకునేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని సమాచారం. అయితే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. ఈ లెక్కన హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావడం కష్టమే. ఇక గాయంతో బాధపడుతున్న కోహ్లీ కూడా ఇంగ్లండ్ సిరీస్లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న (సోమవారం) తేలనుంది. ఆరోజు కోహ్లికి ఫిట్నెస్ టెస్టు జరగనుంది.అయితే అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ టూర్లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్కప్ రోడ్మ్యాప్ ప్రక్రియలో భాగంగా పాండ్యా కీలకం కానున్నాడని అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్ను గాయంతో బాధపడ్డ పాండ్యా సీవోఈకి చేరుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండరాల గాయం కావడంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.2027 వన్డే వరల్డ్కప్ ఆడేనా?వరుస గాయాలతో సతమతమవుతున్న పాండ్యా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్లో ఆడుతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం మళ్లీ సెప్టెంబర్లో వెస్టిండీస్ టూర్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. అప్పటికి కోలుకొని పాండ్యా జట్టులోకి వస్తే మంచిదే, కానీ మళ్లీ ఏదైనా గాయం బారిన పడితే మాత్రం వన్డే ప్రపంచకప్కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానమే.Read: నోరు మూసుకున్నందుకు రెడ్కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి! -
ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (జూన్ 10) జరిగిన తొలి మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.భారత్ను గెలిపించేందుకు రిచా ఘోష్ (36 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. శ్రీచరణి తొలి బంతికి సింగిల్ తీసి రిచాకు స్ట్రయిక్ ఇచ్చింది. అప్పటికే జోష్లో ఉన్న రిచా.. రెండో బంతిని బౌండరీకి, మూడో బంతిని సిక్సర్కు తరలించి భారత్ను గెలుపు వాకిటి వరకు చేర్చింది.అయితే తొందరగా మ్యాచ్ను ముగిద్దామనే క్రమంలో నాలుగో బంతికి లిండ్సే స్మిత్ బౌలింగ్లో స్టంపౌటయ్యింది. అప్పటికీ భారత్కు గెలిచే అవకాశం ఉండింది. మిగిలిన రెండు బంతుల్లో ఆరు పరుగులు సాధిస్తే టీమిండియాదే గెలుపు. చేతిలో ఓ వికెట్ ఉండింది. అయితే ఐదో బంతికి రేణుకా సింగ్ కూడా ఔట్ కావడంతో భారత్ ఆలౌటై, మ్యాచ్ను చేజార్చుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (64), కెప్టెన నాట్ సీవర్ బ్రంట్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో డేనియెలా గిబ్సన్ (30 నాటౌట్) బ్యాట్ను ఝులిపించింది. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, షఫాలీ, రేణుకా, శ్రీ చరణి, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.భారత ఇన్నింగ్స్ విషయానికొస్తే.. రిచా మినహా జట్టులో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేదు. షఫాలీ (13), యస్తికా (15), హర్మన్ (17), భారతి (18), రాధా యాదవ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ 3, డీన్, కోల్మన్, గిబ్సన్ తలో 2, వాంగ్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్లు జూర్ 12 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్-శ్రీలంక తలపడనున్నాయి. భారత్ జూన్ 14న జరిగే తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. -
BCCI: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫామ్లేమితో బాధపడుతున్న సూర్యను తప్పించి.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని జట్టును ఎంపిక చేయడమే కాకుండా.. కెప్టెన్గా నియమించింది.ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా జూన్ 26 నుంచి ఐర్లాండ్లో పర్యటించనుంది. తొలుత ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడి.. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. వైభవ్ సూర్యవంశీకి చోటుఇందుకోసం ప్రకటించిన జట్టులో తొలిసారిగా పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడని యాజమాన్యం తొలుత ప్రకటించింది.అందుకే సిరాజ్ను తప్పిస్తు న్నాంతాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘‘మా వైద్య బృందంతో చర్చల అనంతరం.. సిరాజ్కు విశ్రాంతి కావాలని భావించాము. పనిభారాన్ని తగ్గించే క్రమంలో అతడిని ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన నుంచి తప్పిస్తున్నాము. సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.సిరాజ్ స్థానంలో ప్రసిద్ కృష్ణను సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్కు బదులు ఐర్లాండ్, ఇంగ్లండ్లలో అతడు టీ20 సిరీస్లలో పాల్గొంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాలో చోటివ్వరా? సెంచరీతో కదంతొక్కాడు! -
మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడు: అగార్కర్
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో పర్యటించే భారత టీ20 జట్టుకు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు-2026 జట్టులోనూ అతడికి చోటు ఇచ్చారు.తండ్రిగా నేను సాధించే గొప్ప రికార్డు అదేఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆజ్తక్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రికార్డుల గురించి వైభవ్ అస్సలు పట్టించుకోడు. ఇప్పుడిక టీమిండియా తరఫున మ్యాచ్లు గెలవడంపైనే అతడి దృష్టి ఉంటుంది.వైభవ్ టీమిండియా గెలుపులో భాగమైతే తండ్రిగా నేను సాధించే అత్యంత గొప్ప రికార్డు అదే అవుతుంది’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు. కాగా గతేడాది నుంచి ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పరుగుల వరదరాజస్తాన్ రాయల్స్ తరఫున 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లోనూ 36 బంతుల్లో సెంచరీతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించి.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతకు ముందు భారత్ అండర్-19 వరల్డ్కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ‘‘తనను కచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అనేలా వైభవ్ తన ఆటతో ఒక రకంగా మమ్మల్ని బలవంతపెట్టాడు. పదిహేనేళ్ల పిల్లాడని మాకూ తెలుసు.మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడుఅయితే, చిన్న వయసులోనే రెండు ఐపీఎల్ సీజన్లలో వరుసగా సత్తా చాటడం మామూలు విషయం కాదు. కేవలం ఐపీఎల్ ఒక్కటనే కాదు.. భారత్ అండర్-19 జట్టు తరఫునా అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడి ప్రతిభను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకున్నాము.టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తే అతడు తప్పక తన ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. మున్ముందు కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, వాటిని ఎదుర్కోగల సత్తా, టెంపర్మెంట్ వైభవ్కు ఉన్నాయి. ఒకరకంగా వైభవ్ తన ప్రదర్శనలతో తనకు తానే టీమిండియాకు ఎంపిక చేసుకున్నాడు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లోనూ అడుగుపెట్టాడు. సూపర్ ఫామ్ కొనసాగిస్తూ పదిహేనేళ్ల వయసుకే ఇప్పుడిలా టీమిండియాకు ఎంపికయ్యాడు.చదవండి: అందుకే సూర్యను తప్పించాము: అగార్కర్ -
BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే!
ఊహించిందే జరిగింది.. రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సువర్ణావకాశం వచ్చింది. ఐపీఎల్-2026లో సత్తా చాటిన ఈ చిచ్చరపిడుగుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతడిని ఏకంగా టీమిండియాకు ఎంపిక చేసింది.సచిన్ రికార్డు బద్దలుజూన్లో ఐర్లాండ్, ఇంగ్లండ్లలో పర్యటించే భారత టీ20 జట్టుకు వైభవ్కు ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులోనూ అతడికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు.అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేశాడు. ఇక వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్పై అతడు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది.నిలకడైన ఆట.. విధ్వంసకర బ్యాటింగ్గతేడాది రాజస్తాన్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో శతకాల మోత మోగించాడు.అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులతో రాణించి.. భారత్ విజేతగా నిలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.అత్యధిక పరుగుల వీరుడిగా ఘనతఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పూర్తి స్థాయి ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 36 బంతుల్లో శతక్కొట్టాడు. ఓవరాల్గా పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు.తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు వైభవ్. ఇప్పటికే అత్యంత పిన్న వయస్సులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ను కూడా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పైసా వసూల్ ప్రదర్శన.. టీమిండియాకు ఎంపికఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన బీసీసీఐ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదిహేనేళ్ల వయస్సులోనే అతడిని ఎంపిక చేయడం విశేషం. ఓవరాల్గా రాజస్తాన్ ప్లే ఆఫ్స్ను చేర్చి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చిన వైభవ్.. ఇప్పుడు టీమిండియా తరఫున దుమ్ములేపేందుకు సిద్ధమయ్యాడు. చిన్న వయస్సులోనే భారత జట్టుకు ఎంపికైన వైభశ్ సూర్యవంశీకి శుభాభినందనలు.. అతడి బంగారు భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్!! చదవండి: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు జట్లు ఇవే -
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో జూలైలో ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది. దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్లో తేలింది.' అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ఇంత వరకు ఏ ప్లేయర్కూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. టీమిండియా తరఫున 2009లో అరంగేట్రం చేసింది హర్మన్.అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్ స్థాయికి చేరుకున్న హర్మన్.. మహిళా క్రికెట్లో భారత్కు మొట్టమొదటి వన్డే వరల్డ్కప్ అందించింది. స్వదేశంలో గతేడాది జరిగిన మెగా టోర్నీలో జట్టును చాంపియన్గా నిలిపి.. దిగ్గజ కెప్టెన్ల సరసన చేరింది.ఇంగ్లండ్ పర్యటనలో..ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకున్న 37 ఏళ్ల హర్మన్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టు తొలి టీ20కి దూరమైన ఆమె.. రెండో మ్యాచ్ నుంచి జట్టుతో చేరింది. అయితే, హర్మన్ సారథ్యంలో రెండో టీ20తో పాటు.. తాజాగా మూడో టీ20లోనూ ఓటమిపాలైంది.సిరీస్ ఇంగ్లండ్దేటాంటన్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ కేవలం 18.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో హర్మన్ 40 బంతులు ఎదుర్కొని 56 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్కాగా హర్మన్ అంతర్జాతీయ కెరీర్లో ఇది 368వ మ్యాచ్. తద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా హర్మన్ ప్రపంచ రికార్డు సాధించింది. కాగా గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. ఆమె తన కెరీర్లో 367 మ్యాచ్లు ఆడింది.ఇక టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సుజీ బేట్స్ రిటైర్ కానుండగా.. హర్మన్ప్రీత్ కౌర్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. తద్వారా మరికొన్ని మ్యాచ్లలో పాల్గొని.. అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా హర్మన్ తన పేరును సుస్థిరం చేసుకునే అవకాశం లేకపోలేదు.మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు🏏హర్మన్ప్రీత్ కౌర్ (భారత్)- 368🏏సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 367🏏ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)- 357🏏మిథాలీ రాజ్ (భారత్)- 333🏏సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 313.చదవండి: కెప్టెన్గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ! -
‘ఇంగ్లండ్ టూర్కు వైభవ్ను ఎంపిక చేయాల్సిందే’
క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. పదిహేనేళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న ఈ చిచ్చరపిడుగును చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్న వైభవ్.. ఐపీఎల్-2026లోనూ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.ఆకాశమే హద్దుగారాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా ఈసారి పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన వైభవ్ (Vaibhav Suryavanshi).. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసే సరికి 680 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో గ్రూప్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్పై శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ (103).. ఎలిమినేటర్ మ్యాచ్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.దిగ్గజాలు ఫిదాకేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఏదేమైనా ఈ సీజన్లో ఈ బిహారీ పిల్లాడి ఆట చూసి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్, సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే భారత దిగ్గజ కెప్టెన్ సునిల్ గావస్కర్ సైతం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వయసుతో పనిలేదని.. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అతడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా టీమిండియాకు అతడికి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?స్పోర్ట్స్ టాక్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 క్రికెట్ ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టీమిండియాలో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నా. ఇంతటి అత్యద్భుతమైన ప్రదర్శన తర్వాత సెలక్టర్లు అతడికి తప్పక చోటివ్వాలి కూడా!..అతడి వయసుతో పనిలేదు. 15 ఏళ్ల కంటే పెద్ద వారి కంటే కూడా అతడు శక్తిమంతంగా సిక్సర్లు బాదుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన బౌలర్ల బౌలింగ్లోనూ బంతిని బౌండరీ అవతలకు పంపిస్తున్నాడు.దేవుడిని ప్రార్థిస్తున్నాప్రత్యర్థి ఎవరైనా అతడికి అసలు భయమే లేదు. గల్లీల్లో పిల్లలు ఎలా ఆడతారో ఐపీఎల్లో ఈ పిల్లాడు అలాగే ఆడుతున్నాడు. మనం కూడా చిన్నపుడు డిఫెన్సివ్గా కాకుండా దూకుడుగా ఆడేవాళ్లము. ఇప్పుడు వైభవ్ అదే పని చేస్తున్నాడు.అయితే, అతడు మెగా వేదికపై ఇలా ఆడటం ఆశ్చర్యకరం. అతడి బ్యాటింగ్ శైలి, ఆట తీరు ఇలాగే కొనసాగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్లు ఆడిన తర్వాత.. టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లండ్, పర్యటనలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఎంపిక గురించి చర్చ నడుస్తోంది. చదవండి: ‘జైస్వాల్ రాయల్స్ను వదిలేయాలి’Universe Boss 🤝 Universe Boss Baby#VaibhavSooryavanshi smashes another fifty in #TATAIPL 2026 and breaks Chris Gayle’s record for most sixes in a season (59)🔥👊🏻#TATAIPL Playoffs Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/dF7JsFwXro— Star Sports (@StarSportsIndia) May 27, 2026 -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చెమ్స్ఫోర్డ్ వేదికగా తొలి టీ20లో 38 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత ఈసీబీ డెవలప్మెంట్ వుమెన్స్ ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక అసలు పోటీలో భాగంగా గురువారం రాత్రి మ్యాచ్లో.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది.రాణించిన యస్తికా, జెమీమాఓపెనర్లు స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (2) తీవ్రంగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా అర్ధ శతకం (40 బంతుల్లో 54)తో రాణించింది. ఇక నాలుగో స్థానంలో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 69)తో ఆకట్టుకుంది.మిగిలిన వారిలో ఆల్రౌండర్ దీప్తి శర్మ (13 బంతుల్లో 22) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.చెలరేగిన బౌలర్లుఓపెనర్లు అలిస్ క్యాప్సీ (6), సోఫియా డంక్లీ (16)లను క్రాంతి గౌడ్ వెనక్కి పంపగా.. అర్ధ శతకం (67)తో జోరు మీదున్న అమీ జోన్స్ (67)ను నందిని శర్మ అవుట్ చేసింది. మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లలో హీదర్ నైట్ (21) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 150 పరుగుల వద్ద నిలిచిపోయింది.భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. నందిని శర్మ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. శ్రీచరణి, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక తొలి టీ20లో ఇంగ్లండ్పై 38 పరుగుల తేడాతో గెలిచిన మంధాన సేన.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.చదవండి: ‘అతడు ప్లే ఆఫ్స్లో విఫలమవుతూనే ఉన్నాడు’ -
ఏడు వికెట్ల తేడాతో భారత్ జయభేరి
చెమ్స్ఫోర్డ్: ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఈసీబీ డెవలప్మెంట్ ఉమెన్ ఎలెవన్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఈసీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఫ్లోరెన్స్ మిల్లర్ (48; 7 ఫోర్లు), జోన్ గార్డ్నర్ (36; 3 ఫోర్లు, 1 సిక్స్), సోఫియా స్మేల్ (27; 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ అరుంధతి రెడ్డి 3 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు సాధించింది. 17వ ఓవర్ రెండో బంతికి భారత్ 155 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకున్నా...మరింత ప్రాక్టీస్ కోసం ఇన్నింగ్స్ను 20 ఓవర్ల వరకు కొనసాగించారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 50 రిటైర్డ్ అవుట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... భారతి ఫుల్మలి (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్లు), యస్తిక భాటియా (35 బంతుల్లో 47; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య ఈ నెల 28, 30 తేదీల్లో చెమ్స్ఫోర్డ్, బ్రిస్టల్లలో తొలి రెండు టీ20లు జరగనుండగా... జూన్ 2న టాంటన్లో చివరి టి20 నిర్వహిస్తారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్లో భారత బృందం బరిలోకి దిగుతుంది. చదవండి: నకిలీ నవ్వులు.. వాళ్లిద్దరు చెత్త కెప్టెన్లు: సౌతాఫ్రికా దిగ్గజం -
చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో కోహ్లితో గొడవపడిన వ్యక్తి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి యుక్త వయసులో ఉన్నప్పుడు అతనితో కయ్యానికి కాలు దువ్విన ఓ ఇంగ్లీష్ క్రికెటర్ ఇప్పుడు అతని దేశ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో ముందున్నాడు. ఇంగ్లండ్కు చెందిన 37 ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ 2012లో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లీతో తీవ్రస్థాయిలో గొడవ పడ్డాడు. ఆ సందర్భంగా కోహ్లి-ఫిన్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి వెళ్లింది. తనను రెచ్చగొట్టిన ఫిన్కు కోహ్లీ బ్యాట్తో సమాధానం చెప్పాడు. ఫిన్ సైతం తనకు అవకాశం వచ్చినప్పుడు కోహ్లిని ఔట్ చేశాడు. వీరిద్దరి మధ్య వైరం అప్పట్లో కొంతకాలం సాగింది.అయితే ఫిన్ 2023లో మోకాలి గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కామెంటేటర్ అవతరామెత్తాడు. ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు, 21 టీ20లు ఆడిన ఫిన్, కామెంటేటర్గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తాజాగా ఫిన్ ఇంగ్లండ్ క్రికెట్లో అత్యంత కీలకమైన చీఫ్ సెలెక్టర్ పదవికి ప్రధాన పోటీదారుడిగా మారాడు. ఈ పదవి రేసులో ఫిన్ పేరు ప్రధానంగా వినినిస్తుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ లూక్ రైట్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత రైట్ తన పదవికి రాజీనామా చేశాడు.ఈ క్రమంలో చీఫ్ సెలెక్టర్ పదవికి ఎన్నిక అనివార్యం కాగా.. ఫిన్తో పాటు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు డారెన్ గాఫ్, నిక్ నైట్ కూడా పోటీపడుతున్నారు. వీరిలో ఫిన్కు ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 4న ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే కొత్త సెలెక్టర్ను నియమించే అవకాశం ఉంది. తుది నిర్ణయం ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబర్ట్ కీ తీసుకోనున్నారు. ఇంగ్లండ్ చీఫ్ సెలెక్టర్ పదవికి సంవత్సరానికి సుమారు 150,000 పౌండ్ల వేతనం లభించనుంది. -
BCCI: టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ మండిపడ్డాడు. ‘డబ్బు కోసం కక్కుర్తి పడి.. ఆటగాళ్లను చంపకండి’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. బోర్డు మెదడుతో కాకుండా మనసుతో స్పందించి తమ ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.బిజీ షెడ్యూల్కాగా గత కొన్నేళ్లుగా టీమిండియా బిజీ షెడ్యూల్తో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టెస్టు మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, జింబాబ్వే తదితర టూర్లు.ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్ మే 31న ముగియనుండగా.. జూన్ 6న అఫ్గన్తో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) బిజీ షెడ్యూల్పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ‘‘జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మే 31 వరకు ఐపీఎల్తోనే బిజీగా గడపుతారు.స్వల్ప వ్యవధిలోనే జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరడం ఒత్తిడిని పెంచుతుంది’’ అని గంభీర్ బోర్డు వద్ద తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తను ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు.టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?‘‘గంభీర్ వాదనతో నేను ఏకీభవిస్తాను. విరామం లేని షెడ్యూల్తో బీసీసీఐ తమ ఆటగాళ్లను చంపినంత పని చేస్తోంది. ఇలాంటి భయంకరమైన విధానాన్ని ఆపేయండి. ఆటగాళ్లను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాస్త ఆనందంగా గడపనివ్వండి.భారీ ఆదాయానికి బీజం వేశానుఅయినా మీకు ఇప్పుడు అంతగా డబ్బు అవసరం ఏముంది? నేను ఇప్పటికే ఐపీఎల్ ద్వారా ఏడాదికి కావాల్సినంత ఆదాయం వచ్చేలా బీజం వేశాను కదా! ప్రపంచంలో అందరి కంటే బీసీసీఐ సంపన్న బోర్డు కావడానికి ఇదో కారణం. కాబట్టి మీరు డబ్బు గురించి బెంగ పడకండి.ఆటగాళ్ల క్షేమం గురించి కూడా ఆలోచించండి. ప్రొఫెషనల్ సీఈఓను నియమించండి. భారీగా జీతం ఇచ్చి HRను పెట్టుకోండి. ఆటగాళ్ల సెల్ఫ్ డెవలప్మెంట్పై కూడా కొంచెం ఖర్చు చేయండి. స్టేడియాలను మరింత గొప్పగా తీర్చిదిద్దండి. ప్రేక్షకులకు వరల్డ్క్లాస్ ఎక్స్పీరియన్స్ అందించండి.మనసుతో ఆలోచించండిఆటగాళ్లేమీ యంత్రాలు కాదు. మీరు మెదడుతో కాకుండా మనసుతో కూడా ఆలోచించండి’’ అని ఎక్స్ వేదికగా లలిత్ మోదీ బీసీసీఐ తీరును తూర్పారబట్టాడు. కాగా లలిత్ మోదీ ఆలోచనతో 2008లో ఐపీఎల్ రూపుదిద్దుకోగా.. లీగ్ తొలి చైర్మన్గా అతడే వ్యవహరించాడు. కానీ కొన్నేళ్లకే మనీ లాండరింగ్ ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. లండన్కు పారిపోయి దశాబ్దకాలానికిపైగా అక్కడే నివాసం ఉంటున్నాడు. చదవండి: ఇప్పటికీ బాధపడుతున్నా: రోహిత్కు మాజీ కెప్టెన్ క్షమాపణలు -
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ!
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం నాటి మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్మురేపాడు. మెరుపు అర్ధ శతకం బాది శెభాష్ అనిపించుకున్నాడు.ప్రశంసల వర్షంగువాహటి వేదికగా కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అతడి విధ్వంసకర ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక వైభవ్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా రాజస్తాన్ చెన్నైపై అలవోక విజయం సాధించింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే ఓ అడుగు ముందుకేసి.. వైభవ్ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెచ్చాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ..నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే‘‘అతడు ఎప్పుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడు? అని నేనెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇది కాస్త తొందరపాటే అని అనిపించవచ్చు. ఐపీఎల్ తాజా ఎడిషన్లో అతడికి ఇదే తొలి ఇన్నింగ్స్. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.ఒకవేళ నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే వైభవ్ను ఈ టూర్కు కచ్చితంగా ఎంపిక చేస్తా. ప్రస్తుతానికి అతడికి జట్టులో చేరాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ జట్టుకు అతడి అవసరం ఉంటుందేమో!.. పదిహేనేళ్ల పిల్లాడిని టూర్కు అనుమతిస్తారా? అంటే నేనేమీ చెప్పలేను.కానీ అతడు ఇప్పటికే ఆటగాడిగా పరిణతి సాధించాడు. టీమిండియా తరఫున కూడా కచ్చితంగా సత్తా చాటగలడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు.చదవండి: Ravindra Jadeja: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
T20 WC Semis: నరాలు తెగే ఉత్కంఠ.. నాకు వాళ్ల మద్దతు
ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేకబ్ బెతెల్ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ తనకు ఊహించని విధంగా మద్దతు లభించిందన్నాడు. భారత్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీ రెండో సెమీస్ మ్యాచ్లో టీమిండియా- ఇంగ్లండ్ (IND vs ENG) తలపడిన విషయం తెలిసిందే.253 పరుగుల భారీ స్కోరుముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.టాపార్డర్లో ఫిల్ సాల్ట్ (5), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook- 7) పూర్తిగా విఫలం కాగా.. జోస్ బట్లర్ 25 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ జేకబ్ బెతెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రేపాడు.బెతెల్ విధ్వంసకర సెంచరీకేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 105 పరుగలతో బెతెల్ సత్తా చాటాడు. అయితే, అతడు రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు అడియాసలయ్యాయి. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ నాలుగు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచినా.. విజయానికి ఇంగ్లండ్ ఏడు పరుగుల దూరంలో నిలిచింది. ఫలితంగా గెలుపు జెండా ఎగురవేసిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి చాంపియన్గా నిలిచింది.ఇదిలా ఉంటే.. వాంఖడేలో తాను విధ్వంసకర రీతిలో విరుచుకుపడుతున్న వేళ ఎదురైన అనుభవాన్ని జేకబ్ బెతెల్ తాజాగా పంచుకున్నాడు. అతడు మ్యాచ్ను ఇంగ్లండ్ను తిప్పేస్తాడనే భయంతో మైదానం నిశ్శబ్దంగా మారిన వేళ.. కొంతమంది మాత్రం ఆర్సీబీ నామస్మరణ చేశారట.వాళ్లు నాకు మద్దతుగా నిలిచారుఈ విషయం గురించి బెతెల్ మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవరించిన తరుణంలో కొంతమంది ఆర్సీబీ అని అరవడం నా చెవిన పడింది. అలా వాళ్లు నాకు మద్దతుగా నిలిచారు’’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తనపై ప్రేమ చూపించారంటూ పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా 22 ఏళ్ల బెతెల్ గతేడాది ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రెండు మ్యాచ్లలో కలిపి 67 పరుగులు చేశాడు. మినీ వేలానికి ముందు ఆర్సీబీ బెతెల్ను అట్టిపెట్టుకోగా ఈసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రపంచ రికార్డు -
టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్ పందొమ్మిదో ఎడిషన్తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది.ముందుగా ఐర్లాండ్ టూర్కు!ఇందులో భాగంగా భారత్- అఫ్గన్ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్ టూర్కు వెళ్లనున్నట్లు సమాచారం.ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రాహమ్ వెస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఐర్లాండ్ కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.మంచి బూస్ట్ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్ స్టెర్లింగ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్ స్టెర్లింగ్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్కు జూన్లో టీమిండియాతో జరిగే సిరీస్తో మంచి బూస్ట్ లభిస్తుంది’’ అని గ్రాహమ్ వెస్ట్ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్- ఐర్లాండ్ సిరీస్ విషయాన్ని ఖరారు చేశాడు.కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు.మరింత బిజీగాఅయితే, తాజాగా ఐర్లాండ్ టూర్తో భారత జట్టు షెడ్యూల్ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్గా మూడోసారి టీ20 వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
WC: ఫీల్డింగ్లో ‘వరస్ట్’!.. భారత మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
సొంతగడ్డపై టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచింది. గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి.. స్వదేశంలో తొలిసారి టీ20 వరల్డ్కప్ గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.కానీ.. లీగ్ దశలో అజేయంగా నిలిచినా టీమిండియా ప్రదర్శన సగటు అభిమానితో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్కు కూడా సంతృప్తినివ్వలేదు. ఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తుగా ఓడింది.చాంపియన్గాఆ తర్వాత వరుస విజయాలతో టైటిల్ దిశగా అడుగులు వేసి చాంపియన్గా అవతరించింది టీమిండియా. అయితే, ఫీల్డింగ్ మాత్రం చెత్తగా ఉందనే విమర్శలు మూటగట్టుకుంది. సెమీస్, ఫైనల్లో భారత ఫీల్డర్లు కాస్త ఫర్వాలేదనిపించగా.. అంతకు ముందు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.ఫీల్డింగ్లో ‘వరస్ట్’!ముఖ్యంగా సూపర్-8 చేరిన జట్లలో Catching Efficiencyలో ఇంగ్లండ్ అత్యుత్తమంగా 87.2 శాతం నమోదు చేయగా.. టీమిండియా 72.7 శాతంతో అత్యంత చెత్త రికార్డుతో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.భారత మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలుఇన్సైడ్ స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సింది. క్యాచ్లు పట్టడంలో సఫలమైన విషయంలో మిగతా జట్లతో పోలిస్తే మరీ వెనుకబడి ఉందన్నది బహిరంగ రహస్యమే.ఒత్తిడిలో ఒక్కోసారి ఇలాంటివి జరగవచ్చు. అలాంటపుడు కూర్చుని చర్చించుకుని లోపాలు సరిచేసుకోవాలి. అలా కాకుండా పదే పదే అవే తప్పులు పునరావృతం చేస్తే ముందుకు సాగడం కష్టమవుతుంది. కొన్నిసార్లు అద్భుతమైన క్యాచ్లు అందుకున్నారు. కొన్నిసార్లు అత్యంత సులువైన క్యాచ్లు వదిలేశారు.ఫీల్డింగ్ విషయంలో మనం కాస్త వెనుబడి ఉన్నామనే చెప్పవచ్చు. ఏదేమైనా పగటి పూట ఫీల్డింగ్ చేయడానికి.. రాత్రి లైట్ల వెలుగులో ఫీల్డింగ్ చేయడానికి తేడా ఉంటుంది. అయితే, ఇప్పటికే ప్రొఫెషనల్ అనిపించుకున్న ఆటగాళ్లు ఇలాంటి కారణాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు’’ అని అంజుమ్ చోప్రా చెప్పుకొచ్చింది.టీ20 ప్రపంచకప్-2026లో సూపర్-8 జట్ల క్యాచింగ్ సామర్థ్యంఇంగ్లండ్- 87.2%జింబాబ్వే- 85.4%వెస్టిండీస్- 84.6%న్యూజిలాండ్- 83.9%పాకిస్తాన్- 83.3%సౌతాఫ్రికా- 81.1%శ్రీలంక- 77.8%ఇండియా- 72.7%.చదవండి: T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు -
‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’
జట్టులో చోటే లేని దుస్థితి నుంచి టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నీరాజనాలు అందుకునే స్థాయికి ఎదిగాడు సంజూ శాంసన్. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఓపెనర్గా తుదిజట్టులో సంజూ స్థానం గల్లంతైంది. వరుస వైఫల్యాలే ఇందుకు కారణం. అదే సమయంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూను రీప్లేస్ చేశాడు. వరుస మ్యాచ్లలో అదరగొడుతూ తుదిజట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు.అలా వచ్చిఇక సంజూ ఈసారి కూడా వరల్డ్కప్ ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు అని అభిమానులు నిరాశచెందిన వేళ.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కడుపునొప్పితో లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్కు దూరం అయ్యాడు. ఆ మ్యాచ్లో ఇషాన్తో పాటు సంజూ ఓపెనర్గా బరిలో దిగాడు. నాకౌట్ మ్యాచ్లలో ఆకాశమే హద్దుగాఅనంతరం సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లోనూ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు చోటు దక్కింది. ఈ రెండు మ్యాచ్లలో వేగంగా ఆడే క్రమంలో సంజూ అవుటైనా.. నాకౌట్ మ్యాచ్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సూపర్-8లో వెస్టిండీస్తో మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్.. జట్టును సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో 89 పరుగులు చేసిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. న్యూజిలాండ్తో ఫైనల్లోనూ 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో కేవలం ఐదు మ్యాచ్లే ఆడి ఏకంగా 321 పరుగులతో సంజూ సత్తా చాటాడు.అతడు తలచుకుంటే మూడూ సెంచరీలు అయ్యేవిఈ నేపథ్యంలో సంజూ శాంసన్పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా ప్రశంసలు కురిపించాడు. ‘‘తుది జట్టులో శాంసన్కు చోటు ఇవ్వలేనప్పుడు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇది కఠిన సమయం కావచ్చు కానీ దేవుడు దయతలిస్తే నీకూ అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వేంటో చూపించాలి అన్నాను.దాని కోసం మాత్రం అతడు ఎప్పుడూ సిద్ధమవుతూనే వచ్చాడు. చివరి వరుస మూడు మ్యాచ్లలో శాంసన్ ప్రతాపం ఏమిటో చూశాం. అతడు అనుకుంటే ఈ మూడు ఇన్నింగ్స్లు కూడా సెంచరీలుగా మారేవి. కానీ అతను మాత్రం జట్టు కోసమే ఆడాడు’’ అని ‘చెట్టా (మలయాళంలో పెద్దన్న అనే అర్థం)’ సంజూను సూర్య కొనియాడాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జట్టు గెలుపే లక్ష్యంగా నిస్వార్థంగా ఆడాడని ప్రశంసించాడు.చదవండి: రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త -
T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆదివారం ముగిసింది. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి జగజ్జేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. సూపర్–8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్ మ్యాచ్లు అయిపోయి పది రోజులు దాటిపోయింది. సెమీస్లో వెనుదిరిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసి వారం రోజులకు పైనే.పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులుకానీ ఇన్ని రోజులైనా ఈ రెండు జట్లు భారత్లోనే గడపాల్సి వచ్చింది. ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ గగన తలం మూసివేయగా, వందల సంఖ్యలో భారత్ నుంచి రోజువారీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. చార్టర్ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రయత్నాలు కూడా విఫలమవడంతో గల్ఫ్ మీదుగా వెళ్లాల్సిన కరీబియన్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి.చివరకు మంగళవారం కూడా ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను స్వదేశాలకు చేర్చాలనుకున్నా... వీలుపడలేదు. ఎట్టకేలకు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లయిట్లలో పంపించడంతో క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్కు ప్రాధాన్యం ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సెమీస్లోనే వెనుదిరగగా.. మరుసటి రోజే స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాము భారత్లోనే చిక్కుకుపోవడం పట్ల విండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ, ప్లేయర్ ఆకీల్ హొసేన్ తదితరులు ఐసీసీ తీరును విమర్శించారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఇంగ్లండ్కు ఇచ్చిన ప్రాధాన్యత.. విండీస్, సౌతాఫ్రికా జట్లకు ఇవ్వలేదని.. ఇది వివక్షే అంటూ ఐసీసీపై ఆరోపణలు చేశాడు.మేము అర్థం చేసుకోగలంఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు వరల్డ్కప్లో ఆయా జట్ల ప్రయాణం ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి చేరుకోకపోవడం పట్ల అసంతృప్తి చెందిన తీరును మేము అర్థం చేసుకోగలం.వారి కోపంలో అర్థం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం వల్లే ఈ పరిస్థితి. అంతర్జాతీయ గగనతల ప్రయాణాలకు ఇబ్బంది కలిగింది. క్షిపణుల ప్రయోగాలు, ప్రతీకార చర్యల వల్ల పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే చార్టర్ ఫ్లైట్లు ఏర్పాటు చేయడంలోనూ ఆలస్యం జరిగింది.మా ఆధీనంలో లేవుఈ పరిస్థితులన్నీ ఐసీసీ ఆధీనంలో లేనివి. యుద్ధం వల్లే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు చార్టర్ ఆపరేటర్లు, ఎయిర్పోర్టు అధికారులు, ప్రభుత్వాలతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశాము. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే బయల్దేరగా.. వెస్టిండీస్ బృందంలోని చాలా మంది సభ్యులు ఇంటికి చేరుకున్నారు’’ అని ఐసీసీ పేర్కొంది.ఇక ఐసీసీ వర్గాలు మైకేల్ వాన్ (Michael Vaughan) విమర్శలపై స్పందిస్తూ.. గగనతలంలో ఉన్న పరిస్థితులను బట్టే ఇంగ్లండ్ జట్టును ముందుగా స్వదేశానికి పంపించామని పేర్కొన్నాయి. మిగతా జట్ల ప్రయాణం గల్ఫ్ ప్రాంతం గుండా సాగాల్సినందునే ఆలస్యం అయిందని స్పష్టం చేశాయి.వారు మాత్రం ఇక్కడేఇదిలా ఉంటే.. ఐపీఎల్ సీజన్ కోసం పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్లోనే ఉండిపోయారు. రావ్మన్ పావెల్ (కోల్కతా నైట్రైడర్స్), రూథర్ఫర్డ్ (ముంబై ఇండియన్స్), హెట్మైర్ (రాజస్తాన్ రాయల్స్), రొమారియో షెఫర్డ్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)లు మాత్రం జట్టు వెంట బయలుదేరలేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు త్వరలోనే తమ శిబిరాలను ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఆటగాళ్లు ఆయా జట్లతో చేరనున్నారు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'


