India vs England
-
టీమిండియాలోకి కరుణ్ నాయర్..?
ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసే భారత జట్టుకు దేశవాలీ స్టార్ క్రికెటర్ కరుణ్ నాయర్ (భారత జట్టుకు) ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. కరుణ్ను నేరుగా భారత జట్టులోకి కాకుండా తొలుత భారత్-ఏ జట్టుకు ఎంపిక చేస్తారని సమాచారం. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు భారత్-ఏ ఇంగ్లండ్ లయన్స్తో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్లకు కరుణ్ను ఎంపిక చేసి, ఇక్కడ సత్తా చాటితే టీమిండియాకు ఎంపిక చేయాలని భారత్ సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనకు, దానికి ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగే మ్యాచ్లకు భారత జట్ల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. కరుణ్ విషయంలో సెలెక్టర్లు సానుకూలంగా ఉన్నారని టాక్ నడుస్తుంది. మరోవైపు ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. రోహిత్ న్యూజిలాండ్, ఆసీస్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో కెప్టెన్గా, ఆటగాడిగా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టెస్ట్ జట్టు నుంచి రోహిత్ను తప్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తాజాగా వెలువడిన రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. తాజాగా జరిగిన సెలెక్టర్ల సమావేశంలో రోహిత్నే ఇంగ్లండ్ టూర్కు కెప్టెన్గా కొనసాగించాలని డిసైడ్ చేశారట.కాగా, ఐపీఎల్ 2025 తర్వాత భారత క్రికెట్ జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జూన్ 20న జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ను ప్రారంభమవుతుంది. దీనికి ముందు భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు నాలుగు రోజుల మ్యాచ్లు జరుగుతాయి. ఇంగ్లండ్ లయన్స్, ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ల కోసం మే చివరి వారంలో భారత జట్లను ప్రకటించే అవకాశం ఉంది.అరివీర భయంకర ఫామ్లో కరుణ్కరుణ్ నాయర్ దేశవాలీ సీజన్లో అరివీర భయంకర ఫామ్లో ఉన్నాడు. తాజాగా ముగిసిన రంజీ సీజన్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి కరుణ్.. విదర్భ జట్టు చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుమందు కరుణ్ విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్లు ఆడిన కరుణ్ 389.50 సగటుతో 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. కరుణ్ ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. -
IND vs ENG: రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం.. జట్టు ప్రకటన అప్పుడే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)- 2025 ముగిసిన వెంటనే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రూపంలో మరో క్రికెట్ పండుగ సందడి మొదలైంది. మార్చి 22న మొదలైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. మే 25న ఫైనల్తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపు రెండు నెలలకు పైగా విరామం లభించింది.ఇక ఐపీఎల్-2025 తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పయనం కానుంది. జూన్ ఆఖరి వారం నుంచి ఇంగ్లిష్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మే చివరి వారంలో జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు.. ఈ కీలక టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా కొనసాగించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బృందం మూకుమ్మడిగా హిట్మ్యాన్కు ఓటువేసినట్లు తెలుస్తోంది.రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం.. జట్టు ప్రకటన అప్పుడే!ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో సిరీస్లో, ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైనప్పటికీ.. ఇంగ్లండ్తో టెస్టులకూ రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించే అవకావాలు ఉన్నాయి. జట్టు ప్రకటనకు చాలా సమయం ఉంది. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల నాటికి సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏ క్షణమైన ప్రకటన రావొచ్చు’’ అని పీటీఐతో పేర్కొన్నాయి.ఘోర పరాభవాలుకాగా టెస్టు క్రికెట్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టులో అతడి నాయకత్వంలో భారత జట్టు.. 3-0తో క్లీన్స్వీప్ అయింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా.. విదేశీ జట్టు చేతిలో సొంతగడ్డపై మూడు మ్యాచ్ల సిరీస్లో వైట్వాష్కు గురికావడం ఇదే తొలిసారి.ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ సేనకు భంగపాటే ఎదురైంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ టీమిండియా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్లో 3-1తో పరాజయం పాలై.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్కు ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)- 2023-25 ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది.ఈ రెండు సిరీస్లలో కెప్టెన్గా.. బ్యాటర్గా రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్గా వచ్చి అక్కడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని టెస్టు కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి.తిరిగి ఫామ్లోకిఅయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ శర్మ ప్రదర్శన తర్వాత సీన్ మారిపోయింది. ఈ వన్డే టోర్నమెంట్లో బ్యాటర్గా, సారథిగా రాణించి భారత్కు టైటిల్ అందించాడు హిట్మ్యాన్. తద్వారా తన ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేర్చుకోవడంతో పాటు.. భారత్కు పుష్కరకాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు టెస్టుల్లోనూ మరొక్క అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొనసాగుతున్న హిట్మ్యాన్.. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి బరిలోకి దిగాడు. చదవండి: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్ -
టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి
టెస్టు ఫార్మాట్ తనకు సరిపడదని టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) అన్నాడు. టీ20, వన్డేల్లో కొనసాగితే చాలని.. అందులోనే తనకు సంతృప్తి దొరుకుతుందని పేర్కొన్నాడు. కాగా 2021లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ కర్ణాటక బౌలర్ చాలాకాలం పాటు జట్టుకు దూరంగానే ఉన్నాడు.రీ ఎంట్రీలో అదుర్స్అయితే, ఐపీఎల్లో సత్తా చాటుతున్న వరుణ్ చక్రవర్తి జాతీయ జట్టులో పునరాగమనం చేయడానికి ప్రధాన కారణం హెడ్కోచ్ గౌతం గంభీర్. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా పనిచేసిన గౌతీ.. ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వరుణ్ నైపుణ్యాలను దగ్గరగా గమనించాడు. ఈ క్రమంలో వరుణ్ టీమిండియా రీఎంట్రీకి మార్గం సుగమమైందని చెప్పవచ్చు.గతేడాది స్వదేశంలో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా అదరగొట్టిన వరుణ్.. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటాడు. అనంతరం సొంతగడ్డపై ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటిఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన వరుణ్.. అనూహ్య రీతిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టుకు ఎంపికయ్యాడు. తొలి రెండు మ్యాచ్లలో తుదిజట్టులో స్థానం దక్కనప్పటికీ.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ఆడిన 33 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సెమీస్లో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా.. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించడంలోనూ తన వంతు సాయం చేశాడు. కేవలం మూడు మ్యాచ్లలోనే తొమ్మిది వికెట్లు తీసి చాంపియన్స్ ట్రోఫీ-2025 అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.టెస్టుల్లో ఆడటం నాకూ ఇష్టమే.. కానీఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లోనూ అతడిని ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరుణ్ స్వయంగా తనకు టెస్టు ఫార్మాట్ సరిపడదని చెప్పడం విశేషం. ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో ఆడటం నాకూ ఇష్టమే. కానీ నా బౌలింగ్ శైలి అందుకు సరిపడదు.నా బౌలింగ్ స్టైల్ ఇంచుమించు మీడియం పేస్లాగే ఉంటుంది. ఇక టెస్టు క్రికెట్లో వరుస విరామాల్లో 20- 30 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. నాకు అది సాధ్యం కాదు. నేను కాస్త ఫాస్ట్గా బౌల్ చేస్తాను కాబట్టి.. 10- 15 ఓవర్ల వరకే నాకు సౌకర్యంగా ఉంటుంది. అదేమో రెడ్ బాల్ క్రికెట్కు సరిపడదు.అందుకే నేను ప్రస్తుతం 20, 50 ఓవర్ల క్రికెట్పై మాత్రమే దృష్టి పెట్టాను. వైట్బాల్ క్రికెట్కే పరిమితం కావాలని భావిస్తున్నాను’’ అని వరుణ్ చక్రవర్తి తన మనసులోని మాటను వెల్లడించాడు.అక్కడన్నీ స్పిన్కు అనుకూలమైన వికెట్లుఇక ఆరంభంలో పేసర్గా ఉన్న తమిళనాడు బౌలర్ వరుణ్.. తర్వాత స్పిన్నర్గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పశ్చాత్తాపం ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నిజమే.. తొలిరోజుల్లో నేను మీడియం పేస్తో బౌలింగ్ చేశా. అక్కడ చాలా మంది పేసర్లు ఉండేవారు.అయితే, తమిళనాడు వికెట్లపై బంతి స్వింగ్ కాదు. అక్కడన్నీ స్పిన్కు అనుకూలమైన వికెట్లు. అందుకే మీరు తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను చూడలేరు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్తో జూన్లో మొదలయ్యే టెస్టు సిరీస్లో వరుణ్ చక్రవర్తిని ఆడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. అతడు తనంతట తానుగా పోటీ నుంచి తప్పుకోవడం గమనార్హం.చదవండి: ఇంగ్లండ్తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్కు శుభవార్త. ఆ జట్టు యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఫిట్నెస్ సాధించాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాడు.ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆదివారం సన్రైజర్స్ జట్టుతో చేరనున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో సత్తా చాటి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు ఈ విశాఖపట్నం కుర్రాడు. రైజర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ 13 మ్యాచ్లలో కలిపి 303 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుఇందులో రెండు అర్ధ శతకాలు ఉండటం విశేషం. అదే విధంగా.. మూడు వికెట్లు కూడా తీశాడు ఈ ఆంధ్ర ఆల్రౌండర్. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన నితీశ్ రెడ్డి గతేడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల ఆటగాడు.. అనూహ్య రీతిలో అదే ఏడాది టెస్టుల్లోనూ రంగప్రవేశం చేశాడు.కంగారూ గడ్డపై శతకంతో..ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న నితీశ్ రెడ్డి.. కంగారూ గడ్డపై అదరగొట్టాడు. ముఖ్యంగా సీనియర్లంతా విఫలమైన వేళ మెల్బోర్న్లో శతకం సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. అయితే, ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన నితీశ్.. దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు.18.1 పాయింట్లుపక్కటెముకల నొప్పి కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన నితీశ్ రెడ్డి.. ఇప్పటి వరకు మైదానంలో దిగలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందిన అతడు.. యో-యో టెస్టు పాస్ అయ్యాడు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందిన అతడు ఆదివారం సన్రైజర్స్ శిబిరంలో చేరనున్నాడు.కాగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీశాడు. అదే విధంగా నాలుగు టీ20లలో కలిపి 90 రన్స్ చేసిన నితీశ్.. మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లలో కలిపి 303 పరుగులు సాధించడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.రన్నరప్ఇదిలా ఉంటే.. గతేడాది ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన సన్రైజర్స్ టైటిల్ పోరులో మాత్రం ఓడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఈ ఏడాది మార్చి 23న సొంతమైదానం ఉప్పల్లో రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్తో తమ ఐపీఎల్-2025లో ప్రయాణం మొదలుపెట్టనుంది. కాగా కోల్కతా- బెంగళూరు మధ్య పోరుతో మార్చి 22 నుంచి తాజా ఎడిషన్ ఆరంభం కానుంది.చదవండి: ఇంగ్లండ్తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
IND vs ENG: టీమిండియా కెప్టెన్గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్?
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma) కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో అతడే భారత జట్టును ముందుకు నడిపించనున్నట్లు సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నాయకత్వ బృందం రోహిత్తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరోసారి సూపర్ ‘హిట్’కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో రోహిత్ శర్మ టీమిండియాను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీలో భారత్ ఐదింటికి ఐదూ గెలిచి అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా న్యూజిలాండ్తో ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకం(76)తో బ్యాటర్గానూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి.. ఇంత వరకు ఏ కెప్టెన్కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ సాధించాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్తో స్వదేశంలో వన్డే సిరీస్లోనూ హిట్మ్యాన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అయితే, ఈ అద్బుత ప్రదర్శన కంటే ముందు రోహిత్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు.అత్యంత ఘోర ఓటమి కారణంగాముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్.. 3-0తో వైట్వాష్కు గురైంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ఓటమి. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. ఐదు టెస్టుల సిరీస్లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత కంగారూలకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది.ఇక ఈ రెండు సిరీస్లలో కెప్టెన్గా.. బ్యాటర్గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్గా వచ్చి అక్కడా వైఫల్యాన్ని కొనసాగించాడు. సీన్ రివర్స్ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పాలనే డిమాండ్లు పెరిగాయి. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత పరిస్థితి మారిపోయింది.రోహిత్ శర్మకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్లు గళం వినిపిస్తున్నారు. కాగా ఐపీఎల్-2025 కారణంగా దాదాపు రెండు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండనున్న టీమిండియా.. జూన్ ఆఖర్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ఈ సిరీస్లో రోహిత్నే కెప్టెన్గా కొనసాగించాలని సూచించాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్ను ఓడించాలంటే రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని పేర్కొన్నాడు. ఇక బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్‘‘రోహిత్ ఏం చేయగలడో మరోసారి నిరూపితమైంది. బీసీసీఐలో భాగమైన ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ పర్యటనలోనూ అతడినే కొనసాగించాలని.. అతడే సరైన సారథి అని నమ్ముతున్నారు. అటు రోహిత్ కూడా రెడ్ బాల్ క్రికెట్లో కొనసాగేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు బోర్డుకు తెలిపాడు’’ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరికొంతకాలం టెస్టులు ఆడటం ఖాయమైపోయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంతో మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత్కు అధిక ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్గా రోహిత్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. గతేడాది పొట్టి వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. ఇప్పట్లో తనకు రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తెలిపాడు. ఇక రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు.చదవండి: IPL 2025: హార్దిక్పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్..? -
‘ఇంగ్లండ్తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. చుక్కలు చూపిస్తాడు’
ఇంగ్లండ్తో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టోక్స్ బృందంపై భారత్ తమ అత్యుత్తమ ‘స్పిన్’ అస్త్రాన్ని ప్రయోగించాలని సూచించాడు. ‘మిస్టరీ స్పిన్నర్ల’ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఎదుర్కోలేరని.. వారి బలహీనతను అవకాశంగా మలచుకోవాలని పేర్కొన్నాడు.కాగా ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన టీమిండియా.. రెండున్నర నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025తో బిజీబిజీగా గడుపనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.మింగుడుపడని మాత్రఇందులో భాగంగా ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు టీమిండియా మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. ‘‘మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కోలేకపోవడం ఇంగ్లండ్కు ఉన్న అతిపెద్ద బలహీనత. వాళ్లకు ఇది మింగుడుపడని మాత్ర.ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలేమరి అలాంటప్పుడు వరుణ్ చక్రవర్తి లేకుండానే ఇంగ్లండ్కు వెళ్తారా? లేదు.. లేదు.. కచ్చితంగా అతడి ఇంగ్లండ్లో ఆడించాల్సిందే. లేదంటే కుల్దీప్ యాదవ్నైనా ప్రయోగిస్తారు. ఒకవేళ అతడు చెలరేగిపోయాడంటే.. ఇంగ్లండ్కు తిప్పలు తప్పవు.వరుణ్, కుల్దీప్.. ఇద్దరూ ఉన్నారంటే ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలే’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు అభిప్రాయపడ్డాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ప్రయోగించడం ద్వారా ఇంగ్లిష్ బ్యాటర్ల ఆట త్వరగా కట్టించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ వచ్చిన తర్వాత ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి రాత మారిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్కు మెంటార్గా ఉన్న సమయంలో ఈ స్పిన్ బౌలర్ నైపుణ్యాలను గుర్తించిన గౌతీ.. భారత జట్టులో అతడి పునరాగమనానికి మార్గం సుగమం చేశాడు. అయితే, కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని వరుణ్ నిలబెట్టుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటి స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో దుమ్ములేపి.. వన్డేల్లోనూ అరంగేట్రం చేసిన వరుణ్.. చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. న్యూజిలాండ్తో గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులోకి వచ్చిన ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. ఐదు వికెట్లతో దుమ్ములేపాడు.అనంతరం ఆస్ట్రేలియాతో సెమీస్లో రాణించిన వరుణ్.. కివీస్తో ఫైనల్లోనూ రెండు వికెట్లు తీశాడు. తద్వారా టీమిండియా చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని టెస్టుల్లోనూ అరంగ్రేటం చేయించాలని నవజ్యోత్ సింగ్ సిద్ధు బీసీసీఐకి సూచించడం గమనార్హం.‘తొలి విజయం’ కోసం..కాగా టీమిండియా గత రెండు టెస్టు సిరీస్లలో ఘోర పరాజయం చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్ అవకాశాలను పోగొట్టుకుంది. ఇక డబ్ల్యూటీసీ కొత్త ఎడిషన్(2025-27)లో ఇంగ్లండ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న భారత్.. భారీ విజయంతో కమ్బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. కాగా జూన్ 30 నుంచి టీమిండియా ఇంగ్లండ్ పర్యటన మొదలుకానున్నట్టు సమాచారం.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్తో సిరీస్కు రెడీ’ -
BGT: ‘నేను ఆడితే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్తో సిరీస్కు రెడీ’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచిన టీమిండియా దాదాపు రెండున్నర నెలల విరామం తర్వాత మైదానంలో దిగనుంది. ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్లో వెళ్లనున్న ఈ టూర్లో భాగంగా ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.వరుస ఓటములుకెప్టెన్గా రోహిత్ శర్మ(Rohit Sharma)కు, హెడ్కోచ్గా గౌతం గంభీర్కు ఇది విషమ పరీక్ష కానుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ అత్యుత్తమంగా కొనసాగుతున్నా.. కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం తేలిపోతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ కావడం.. ఆస్ట్రేలియా గడ్డపై ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓడిపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో ఇంగ్లండ్లో సత్తా చాటితేనే రోహిత్- గంభీర్ జోడీకి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమని చెప్పాడు. అంతేకాదు.. ఆసీస్తో టెస్టుల్లో తాను ఆడి ఉంటే హ్యాట్రిక్ కొట్టేవాళ్లమని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘క్రికెటర్గా జాతీయ జట్టుకు ఆడాలని నాకూ ఉంటుంది. ఇంగ్లండ్తో తదుపరి టెస్టు సిరీస్కు నేనైతే సిద్ధంగానే ఉన్నాను. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తూనే ఉన్నాను.ఒకవేళ జట్టుకు నా అవసరం ఉంటే.. కచ్చితంగా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతా. దేశవాళీ క్రికెట్లో నేను విరామం లేకుండా ఆడుతూనే ఉన్నాను. అంతేకాదు.. గత రెండేళ్లుగా కౌంటీల్లోనూ ఆడుతున్నా. భారీ స్థాయిలో పరుగులు రాబడుతున్నా.నేను ఆడితే కచ్చితంగా గెలిచేవాళ్లంకాబట్టి నాకు గనుక ఈసారి అవకాశం వస్తే కచ్చితంగా.. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా’’ అని పుజారా రెవ్స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఆసీస్కు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం గురించి ప్రస్తావన రాగా.. ‘‘అవును.. నేను నమ్మకంగా చెప్పగలను.. ఒకవేళ నేను జట్టులో ఉంటే కచ్చితంగా మేము హ్యాట్రిక్ కొట్టేవాళం. ఇందులో సందేహమే లేదు’’ అని పుజారా పేర్కొన్నాడు.ఇక సొంతగడ్డపై ఆడటం ఇంగ్లండ్కు సానుకూల అంశమే అయినా ఈసారి టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పుజారా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయిన తర్వాత ఆ జట్టు బలహీనపడింది. వారిద్దరు తుదిజట్టులో లేకుంటే ప్రత్యర్థి జట్టుకు మంచిదే కదా! ఈసారి టీమిండియా కచ్చితంగా మంచి స్కోర్లతో విజయం సాధిస్తుంది’’ అని పుజారా ధీమా వ్యక్తం చేశాడు.కాగా విదేశీ గడ్డపై ముఖ్యంగా ఆసీస్లో టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గడంలో ఛతేశ్వర్ పుజారాది కీలక పాత్ర. అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈ ‘నయా వాల్’కు అవకాశాలు తగ్గిపోయాయి. చివరగా అతడు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లో టీమిండియాకు ఆడాడు. ఆస్ట్రేలియాతో నాటి పోరులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత పుజారా దేశీ, కౌంటీ క్రికెట్కు పరిమితమయ్యాడు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
శుబ్మన్ గిల్కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు.. బుమ్రా రికార్డు బ్రేక్!
టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’(ICC Player of the Month) అవార్డు గెలుచుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారానికి అతడు ఎంపికయ్యాడు. తద్వారా ఇప్పటి వరకు అత్యధికసార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి భారత క్రికెటర్గా గిల్ నిలిచాడు.ట్రోఫీ గెలిచిన టీమిండియా..కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. గత నెల 19న పాకిస్తాన్లో మొదలైన ఈ మెగా వన్డే టోర్నమెంట్.. దుబాయ్లో మార్చి 9న టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగిసింది. ఇక ఈ ఈవెంట్లో రోహిత్ సేన తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది.గిల్ అదరగొట్టాడుగ్రూప్ దశలో వరుసగా మూడు గెలిచి సెమీస్ చేరిన భారత్.. అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో కివీస్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా నిలిచింది. ఐదు మ్యాచ్లలోనూ అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.భారత్ ఈ ఘనత సాధించడంలో గిల్ది కూడా కీలక పాత్ర. ఈ టోర్నీలో బంగ్లాదేశ్పై 101 పరుగులు సాధించిన గిల్.. పాకిస్తాన్తో మ్యాచ్లో 46 పరుగులు చేశాడు. అంతకు ముందు ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)లోనూ గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో వరుసగా 87, 60, 112 పరుగులు సాధించాడు.వారిని ఓడించిఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి నెలకు నామినేట్ అయ్యాడు గిల్. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. వారిద్దరిని ఓడించి అత్యధిక ఓట్లతో గిల్ విజేతగా నిలిచాడు.బుమ్రా రికార్డు బ్రేక్ఇక గిల్ ఈ అవార్డు గెలవడం ఇది మూడోసారి. 2023 జనవరి, సెప్టెంబర్ నెలలకు గానూ గిల్ గతంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలిచాడు. అంతకు ముందు భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండుసార్లు ఈ పురస్కారం పొందాడు. అయితే, గిల్ ఇప్పుడు బుమ్రాను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అందుకున్న భారత క్రికెటర్లు వీరే👉శుబ్మన్ గిల్- మూడుసార్లు👉జస్ప్రీత్ బుమ్రా- రెండుసార్లు👉రిషభ్ పంత్- ఒకసారి👉రవిచంద్రన్ అశ్విన్- ఒకసారి👉భువనేశ్వర్ కుమార్- ఒకసారి👉శ్రేయస్ అయ్యర్- ఒకసారి👉విరాట్ కోహ్లి- ఒకసారి👉యశస్వి జైస్వాల్- ఒకసారి.టాప్లోనే గిల్మరోవైపు.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో గిల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా.. -
IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా..
టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం లభించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 నేపథ్యంలో రెండు నెలలకు పైగా భారత జట్టు ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీల తరఫున ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22న మొదలై మే 25న ఫైనల్తో ముగియనుంది.ఈ పొట్టి ఫార్మాట్ టోర్నమెంట్ పూర్తైన తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటన(India Tour Of England)కు వెళ్లనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. గంభీర్ కీలక నిర్ణయంఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా సిరీస్ కంటే ముందే ఇంగ్లండ్కు వెళ్లనున్న ఇండియా-‘ఎ’ జట్టుతో అతడు ప్రయాణించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిననాటి నుంచి గంభీర్తో బీసీసీఐతో పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నాడు. ఇండియా-‘ఎ’ జట్టుతో పాటు ప్రయాణం చేయాలని అతడు భావిస్తున్నాడు.అందుకే ఇలారిజర్వ్ ఆటగాళ్ల నైపుణ్యాలను దగ్గరగా పరిశీలించాలని అతడు భావిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత.. గంభీర్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో వైల్డ్ కార్డ్ ద్వారా అతడు తీసుకువచ్చిన ఆటగాళ్ల నుంచి మెరుగైన ఫలితాలు వచ్చాయి. టెస్టుల్లోనూ ఇదే తరహా సూత్రాన్ని పాటించాలని భావిస్తున్నాడు.ముఖ్యంగా ఇండియా-‘ఎ’ జట్టులోని ప్రతిభావంతులకు అవకాశం ఇస్తే బాగుంటుందని అతడు భావిస్తున్నాడు. ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీని వీడిన తర్వాత ఇండియా-‘ఎ’ టూర్లు నామమాత్రంగా మారిపోయాయి. టెస్టుల్లో ఘోర పరాభవాలుఅందుకే గంభీర్ ఈ అంశంపై దృష్టి సారించాడు. టూర్ల సంఖ్య పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్గా పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత విజయాలు అందుకున్న గంభీర్.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు చవిచూశాడు. టీ20, వన్డే ద్వైపాక్షిక టోర్నీల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్ క్లీన్స్వీప్ విజయాలు సాధించి సత్తా చాటింది. అయితే, సొంతగడ్డపై టెస్టుల్లో కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైంది.అదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్లో 3-1తో కంగారూల చేతిలో ఓడి దశాబ్దకాలం తర్వాత ఓటమిని చవిచూసింది. దీంతో గంభీర్పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడిని తొలగించాలనే డిమాండ్లూ వినిపించాయి.ఇలాంటి తరుణంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడం ద్వారా గంభీర్ తిరిగి గాడిలో పడ్డాడు. కాగా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్కు తాను మెంటార్గా పనిచేసిన సమయంలో గుర్తించిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలను ఈ మెగా వన్డే టోర్నీలో ఆడించడం ద్వారా మరోసారి విమర్శల పాలయ్యాడు గంభీర్. ఇండియా-‘ఎ’ టీమ్పై కూడా దృష్టి.. వారి గుండెల్లో గుబులుఅయితే, వారిద్దరు జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించడంతో గంభీర్ను విమర్శించిన వాళ్లే అతడి నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లోనూ తన ముద్ర వేసేందుకు గంభీర్ ఇండియా-‘ఎ’ టీమ్పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఫామ్లేమితో సతమతమయ్యే సీనియర్లపై వేటు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా ఇంతకు ముందు కోచ్లుగా పనిచేసిన ద్రవిడ్, రవిశాస్త్రి వంటి వారు ఎప్పుడూ ఇలా ఇండియా-‘ఎ’ జట్టుతో ప్రయాణించిన దాఖలాలు లేవని.. ఈ ప్రయోగం ద్వారా గంభీర్ ఎలాంటి ఫలితం పొందుతాడో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) టెస్టుల్లో పునరాగమనంపై దృష్టి సారించాడు. దేశవాళీ టోర్నమెంట్లలో తాను అద్భుతంగా రాణించానని.. అందుకే తాను తిరిగి జాతీయ జట్టుకు ఆడతాననే ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో బీసీసీఐ(BCCI) శ్రేయస్ అయ్యర్పై వేటు వేసిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలను గాయం సాకు చూపి తప్పించుకున్నాడని భావించిన బోర్డు.. అయ్యర్ వార్షిక కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై తరఫున దేశీ బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.ఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్.. ఈ వన్డే టోర్నీలో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఐదు ఇన్నింగ్స్లో కలిపి 243 పరుగులు సాధించాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో న్యూజిలాండ్ స్టార్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రచిన్ రవీంద్ర(263) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే.. వన్డేల్లో తానేంటో మరోసారి నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీమిండియా టెస్టు రీఎంట్రీకి తాను సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో పునరాగమనం చేయాలని ఉంది. వీలైనంత ఎక్కువగా క్రికెట్ ఆడాలని భావిస్తున్నా.నేను ఉత్తమంగా రాణించానుదేశవాళీ టోర్నమెంట్లో నేను ఉత్తమంగా రాణించాను. అయితే, నా చేతుల్లో ఏమీ లేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కానీ ఈ విషయం గురించి పదే పదే ఆలోచించను. దాని వల్ల అనసవరంగా నా మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది.అనుకున్నది జరుగకపోతే మానసికంగానూ కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తా. విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటా. సమయం వచ్చినపుడు అవకాశం అదే తలుపుతడుతుంది. ముందుగా చెప్పినట్లు నేను భవిష్యత్తు, గతం గురించి ఎక్కువగా ఆలోచించే మనిషిని కాను. ప్రస్తుతం నేను ఇలా ఉండటానికి కారణం అదే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా చివరిసారిగా అయ్యర్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 14 టెస్టులు ఆడిన ఈ ముంబైకర్ 811 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ నాటికి!?ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక తాజా రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్.. ఆడిన ఐదు మ్యాచ్లలోనే ఏకంగా 480 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా స్టోక్స్ బృందంతో టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ నాటికి అయ్యర్ పునరాగమనం చేసే అవకాశాలు లేకపోలేదు.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’
తాను అవకాశాల కోసం అడిగే వ్యక్తిని కాదని టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) అన్నాడు. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో తెలియదని.. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా తనకు పిలుపునిస్తారని ఆశగా ఎదురుచూశానని.. అయితే, సెలక్టర్లు మరోసారి మొండిచేయే చూపారని ఆవేదన వ్యక్తం చేశాడు.జట్టులో అవకాశాలు కరువుకాగా ఒకప్పుడు టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్(Vice Captain)గా వెలుగొందిన అజింక్య రహానే.. తాత్కాలిక సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు విజయం అందించాడు. విదేశాల్లోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న ఈ ముంబై బ్యాటర్కు గత కొన్నేళ్లుగా జట్టులో అవకాశాలు కరువయ్యాయి. అయితే, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. ఐపీఎల్లోనూ తనను తాను నిరూపించుకున్న రహానే.. అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC)-2023 ఫైనల్(ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా)కు ఎంపికయ్యాడు.అనంతరం వెస్టిండీస్ పర్యటనలో టెస్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందాడు. కానీ ఆ టూర్లో వైఫల్యం తర్వాత రహానేకు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపురాలేదు. ఈ క్రమంలో దేశీ క్రికెట్పై దృష్టి సారించిన అతడు.. ముంబై కెప్టెన్గా గతేడాది రంజీ ట్రోఫీ టైటిల్ అందుకున్నాడు. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు.ఇక ప్రస్తుతం రంజీ సెమీ ఫైనల్స్తో బిజీగా ఉన్న అజింక్య రహానే టీమిండియా పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘జట్టు నుంచి నన్ను ఎందుకు తప్పించారని ప్రశ్నించే రకం కాదు. అసలు మేనేజ్మెంట్తో నాకు కమ్యూనికేషన్ లేదు. చాలా మంది వెళ్లి మాట్లాడమని చెప్పారు.అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడుఅందుకు నేను సిద్ధంగా ఉన్నా.. ఎదుటి వ్యక్తి కూడా అందుకు సుముఖంగా ఉండాలి కదా!.. ఒకవేళ అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు నేను పోరాడటంలో అర్థం ఉండదు. నేను నేరుగా అతడితోనే మాట్లాడాలనుకున్నా. అందుకే మెసేజ్లు చేయలేదు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది’’ అంటూ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించింది. తదుపరి సిరీస్లలో నన్ను ఆడిస్తారని అనుకున్నా. కానీ నా చేతుల్లో ఏం లేదు కదా! ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాను. ఐపీఎల్లో కూడా ఆడితే మళ్లీ నన్ను పిలుస్తారేమో.రీఎంట్రీ ఇస్తాఅయితే, సౌతాఫ్రికాలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అందుకే టెస్టు సిరీస్కు నన్ను పిలుస్తారని ఆశించా. కానీ ఆ జట్టులో నాకు స్థానం దక్కలేదు. చాలా బాధగా అనిపించింది. అయినా.. ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం. అయితే, ఏదో ఒకరోజు తప్పకుండా మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’’ అని అజింక్య రహానే ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రహానేను కొనుగోలు చేసింది. రూ. కోటి యాభై లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో టీమిండియా 3-1తో ఓడిపోయింది. తదుపరి టెస్టు సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనున్న రోహిత్ సేన ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీతో బిజీగా ఉంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే!
చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy 2025)కు ముందు ఇంగ్లండ్పై క్లీన్స్వీప్ విజయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కి సంతృప్తిని మిగిల్చింది. విజయానంతరం మాట్లాడుతూ.. "ఈ సిరీస్లో మేము ఏదైనా పొరపాటు చేశామని నేను భావించడం లేదు. అయితే జట్టు సమిష్టిగా మరింత మెరుగ్గా ఆడాలని నేను భావిస్తున్నాను. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలున్నాయి. తప్పకుండా జట్టు మరింత మెరుగ్గా ఆడాలని నేను కోరుకుంటున్నాను" అని రోహిత్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.అయ్యర్ అద్భుత ఫామ్ వాస్తవానికి... ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ బ్యాటింగ్ అన్ని విధాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డే నుంచి వైదొలగడంతో.. తుదిజట్టులోకి వచ్చాడు అయ్యర్. అద్భుత రీతిలో రాణించి మరోసారి టీమిండియా మిడిలార్డర్కు వెన్నెముక గా నిలిచాడు.ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్ వంటి అగ్రశ్రేణి పేస్ బౌలర్లున్నారు. వారిని ఎదుర్కొని రాణించడం ఆషామాషీ విషయం కాదు. ఇందుకు అనుగుణంగా తన స్టాన్స్ ని కూడా మార్పు చేసుకొని అయ్యర్ తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించాడు. అయ్యర్ ఫామ్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టుకి కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.భారత్ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అయ్యర్ పై మిడిల్ ఓవర్లలో నిలకడగా పరుగులు సాధించాల్సిన బాధ్యత ఉంటుంది. గతం లో 2023 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన అయ్యర్ తర్వాత అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత గాయాల కారణంగా గత సంవత్సరం ఒక్క రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో తన కేంద్ర కాంట్రాక్టును కోల్పోవడంతో శ్రేయస్ అయ్యర్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.చలించని దృఢ సంకల్పంఅయితే అయ్యర్ దృఢ సంకల్పం ఎప్పుడూ చలించలేదు. దేశవాళీ వైట్-బాల్ టోర్నమెంట్లలో నిలకడగా రాణించి 188.52 స్ట్రైక్ రేట్తో 345 పరుగులతో, 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ లో ఐదు ఇన్నింగ్స్లలో 131.57 సగటుతో 325 పరుగులు చేశాడు.కేవలం ఒకే ఒక్కసారి అవుట్ అయ్యాడు. దేశవాళీ టౌర్నమెంట్లలో మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో మళ్ళీ భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి వన్డేలో కోహ్లి గాయంతో ఇలా కీలకమైన బ్రేక్ దొరికింది. దాంతో చెలరేగిపోయిన అయ్యర్ జట్టుకి తన అవసరం ఎలాంటితో చూపించి సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్పై అద్భుతమైన ప్రదర్శనఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ 3-0 తో విజయం సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో వరుసగా 59 పరుగులు (తొలి వన్డే) , 44 (రెండో వన్డే), 78 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ గాయపడిన కారణంగానే తాను ఈ సిరీస్ లోని తొలి వన్డే లో ఆడగలిగానని అయ్యర్ వెల్లడించాడు. అయితే ఆ అవకాశాన్ని అయ్యర్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.అందుకే కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అయ్యర్ స్థానం జట్టులో పదిలంగా నిలిచింది. ఇంగ్లండ్తో జరిగిన చివరి మ్యాచ్లో 78 పరుగులతో అయ్యర్ వన్డేల్లో తన 20వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అయ్యర్ ఐదు సెంచరీలు కూడా చేసాడు. మొత్తం 65 వన్డేల్లో 48.18 సగటుతో 2,602 పరుగులు సాధించాడు. ఇక 2023 ప్రపంచ కప్ లో అయ్యర్ అద్భుతంగా రాణించి 66.25 సగటుతో 113.24 స్ట్రైక్ రేట్తో 530 పరుగులు చేశాడు. ఇంతటి అపార అనుభవం ఉన్న అయ్యర్ మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ బ్యాటింగ్ను నిలువరించడం ప్రత్యర్థి జట్లకు అంత తేలికైన విషయం కాదు. చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
అదంతా అబద్దం.. మాకంటూ ఓ విధానం ఉంది: మెకల్లమ్ ఫైర్
కామెంటేటర్లు రవి శాస్త్రి(Ravi Shastri), కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon Mccullum) మండిపడ్డాడు. వీరిద్దరు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆట విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తమకంటూ ఓ విధానం ఉందని.. ఫలితాలు అనుకూలంగా లేనపుడు ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో సూర్యసేన చేతిలో 4-1తో చిత్తైన బట్లర్ బృందం.. రోహిత్ సేనతో వన్డేల్లో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది.తద్వారా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభానికి ముందు గట్టి ఎదురుదెబ్బను చవిచూసింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా భారత్తో ఇంగ్లండ్ మూడో వన్డే సందర్భంగా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క నెట్ సెషన్ఈ సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ ఒకే ఒక్క నెట్ సెషన్లో పాల్గొన్నదంటూ బట్లర్ బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట పట్ల అంకితభావం లేదంటూ విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఇంగ్లండ్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తాజాగా స్పందించాడు.టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘మేము అసలు శిక్షణా శిబిరంలో పాల్గొననేలేదన్న వారి మాటలు పూర్తిగా అవాస్తవం. సిరీస్ ఆసాంతం మేము నెట్ సెషన్స్లో బిజీగా ఉన్నాం.అంతకు ముందు కూడా మా వాళ్లు వరుస సిరీస్లు ఆడారు. ఎదుటివారి విషయంలో ఆధారాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం సులువే. ఫలితాలు మాకు అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మాకంటూ ఒక విధానం ఉందిఏ ఫార్మాట్లో ఎలా ఆడాలో మాకంటూ ఒక విధానం ఉంది. దానినే మేము అనుసరిస్తాం. ఇక ఇప్పటికే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ముందుగా చెప్పినట్లు వాళ్లు మాట్లాడిన మాటలు అబద్దాలు’’ అని మెకల్లమ్ రవిశాస్త్రి, పీటర్సన్ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు.ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం వీరి మాటలను ఖండించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటీ రెండు సెషన్లు మాత్రమే మిస్సయ్యామని తెలిపాడు. అంతేతప్ప రవిశాస్త్రి, పీటర్సన్ అన్నట్లుగా తామేమీ పూర్తిగా ప్రాక్టీస్కు దూరంగా లేమని పేర్కొన్నాడు.కాగా టెస్టుల్లో ‘బజ్బాల్’ విధానంతో దూకుడైన ఆటను పరిచయం చేసిన బ్రెండన్ మెకల్లమ్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్గానూ నియమితుడయ్యాడు. అయితే, తొలి ప్రయత్నంలోనే ఘోర పరాజయాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. రానున్న కాలంలో భారత బౌలింగ్ దళంలో ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో హర్షిత్ అద్భుత ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షిత్.. స్వదేశంలో ఇంగ్లండ్(India vs England)తో పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. తొలుత టీ20లలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ పేసర్.. అనంతరం వన్డేల్లోనూ చోటు దక్కించుకున్నాడు.బుమ్రా స్థానంలో ఐసీసీ టోర్నీకిఇంగ్లండ్తో ఆడిన టీ20 మ్యాచ్లో మూడు వికెట్లతో మెరిసిన రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. మూడు వన్డేల్లో కలిపి ఆరు వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ రెండు సిరీస్లలో టీమిండియా గెలవడంలో తాను భాగమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని బీసీసీఐ హర్షిత్ రాణాతో భర్తీ చేసింది.ఈ నేపథ్యంలో కామెంటేటర్, భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ హర్షిత్ రాణా ఆట తీరును కొనియాడాడు. రాణా రాకతో అర్ష్దీప్ సింగ్కు గట్టి పోటీ తప్పదని అభిప్రాయపడ్డాడు. ‘‘ఇటీవలి కాలంలో హర్షిత్ రాణా పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది.టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడుతన ప్రదర్శనతో అతడు జట్టు విజయాలపై ప్రభావం చూపగలిగాడు. అతడి ఆటిట్యూడ్ కూడా ముచ్చటగొలిపేలా ఉంది. సమీప భవిష్యత్తులోనే అతడు టీమిండియా బౌలింగ్ బిగ్ స్టార్గా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఆట పట్ల అతడి అంకితభావం, ఆలోచనా ధోరణి నాకెంతో నచ్చింది. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో సీనియర్గా అర్ష్దీప్ సింగ్కే ప్రాధాన్యం దక్కుతుంది. అయితే, దీర్ఘ కాలంలో రాణా వల్ల అర్ష్దీప్నకు కష్టాలు తప్పవు. సెకండ్ సీమర్గా అతడికి హర్షిత్ నుంచి పోటీ ఎదురవుతుంది.సిరాజ్ రీ ఎంట్రీ కష్టమే!కచ్చితంగా హర్షిత్ రాణా అర్ష్కు గట్టిపోటీగా మారతాడు. అతడి వల్ల ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్కు పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేయడం కష్టంగా మారింది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగాడు హర్షిత్ రాణా.గత ఎడిషన్లో మొత్తంగా పదమూడు మ్యాచ్లు ఆడి 19 వికెట్లతో మెరిసిన ఈ ఢిల్లీ బౌలర్.. కోల్కతాను చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నాడు కోల్కతా జట్టు మెంటార్గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్కోచ్ కావడంతో హర్షిత్కు టీమిండియా ఎంట్రీ కాస్త సులువుగానే దక్కింది.చదవండి: Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా? -
CT 2025: చతికిలపడ్డ ఇంగ్లండ్.. గాయాల ఊబిలో ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కు ఇంగ్లండ్పై మూడు వన్డేల సిరీస్ విజయం టీమిండియాలో ఉత్తేజాన్ని రెట్టింపు చేసింది. ఈ సిరీస్ సందర్భంగా జట్టులోని ప్రధాన బ్యాటర్లందరూ పరుగులు సాధించడంతో మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. జట్టులోని ప్రధాన బౌలరైన జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడం జట్టుకి కాస్త అసంతృప్తిని కలిగించినా.. గాయాలపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ.. టీమ్ మేనేజిమెంట్ కానీ చేయగలిగింది ఏమీ లేదు.ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న క్రీడాకారులతో వ్యూహం రూపొందించాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆస్టేలియా పర్యటనలోనూ, సొంతగడ్డ పై శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల తో వరుసగా పరాజయాలు చవిచూసింది రోహిత్ సేన. అయితే, ఇంగ్లండ్ విజయంతో మళ్ళీ మునుపటి రీతిలో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టు తో ఈ సిరీస్ ఏర్పాటు చేయడం భారత్ వ్యూహం ఫలించిందని చెప్పాలి.వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఇంగ్లండ్అయితే ఈ టోర్నమెంట్లో టీమిండియా ప్రధాన ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పేపర్ మీద ఇంగ్లండ్ చాలా పటిష్టమైన జట్టుగా కనిపిస్తున్నా..ఈ టోర్నమెంట్ పాకిస్తాన్, దుబాయ్ ల లో జరుగుతున్నందున.. ఆసియా జట్లు ఈ పిచ్లపై ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. ఇక బుధవారం అహ్మదాబాద్లో జరిగిన మూడవ వన్డేలో ఇంగ్లండ్ 142 పరుగుల భారీ ఓటమి చవిచూడడం ఆ జట్టుకి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు.ఇంగ్లండ్ ఈ వన్డే సిరీస్ను 0-3 తేడాతో కోల్పోవడమే కాక అంతకుముందు జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా భారత్ చేతిలో 1-4 తేడాతో పరాజయం చవిచూసింది. ఈ పరాజయంపై స్పందిస్తూ, భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టును తీవ్రంగా దుయ్యబట్టారు.భారత పర్యటనలో ఇంగ్లీష్ జట్టు కేవలం ఒక నెట్ సెషన్ లో మాత్రమే పాల్గొందని, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు ఇది చాల దారుణమైన విషయమని శాస్త్రి వెల్లడించాడు. "నేను విన్న దాని ప్రకారం, ఈ పర్యటన అంతటా ఇంగ్లాండ్ ఒకే ఒక నెట్ సెషన్ లో పాల్గొంది. ఇంగ్లండ్ జట్టు సిరీస్ విజయం కోసం కష్టపడటానికి సిద్ధంగా లేదు," అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. వ్యాఖ్యాత బృందంలో భాగమైన పీటర్సన్, జాకబ్ బెథెల్ స్థానంలో ఇంగ్లాండ్ జట్టులో చేరిన టామ్ బాంటన్ భారత్ తో జరిగిన మూడో వన్డే కి ముందు గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని వెల్లడించడంతో.. శాస్త్రి ఆ జట్టుపై మరింత అసంతృప్తి వ్యక్తం చేసాడు.గాయాల ఊబిలో ఆస్ట్రేలియాఇక ఇంగ్లండ్ పరిస్థితి ఇలా ఉంటే, ఈ టోర్నమెంట్ లో ప్రధాన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియా జట్టు గాయాల ఊబిలో చిక్కుకొని ఉంది. ఇటీవల శ్రీలంకలో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఆ తర్వాత జరిగే వన్డే మ్యాచ్లలో కూడా విజయం సాధించాలని.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టు ఆత్మవిశ్వాసానికి ఇది ఎంతో కీలకమని భావిస్తోంది.ఇటీవల భారత్తో సొంత గడ్డ పై జరిగిన టెస్ట్ సిరీస్ లో తన సత్తా చాటిన ఆస్ట్రేలియా తర్వాత గాయాల కారణంగా చతికిలపడింది. జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్, సీనియర్ బౌలర్ మిచెల్ స్టార్క్, మరో పేస్ బౌలర్ జోష్ హాజిల్వుడ్, ఆల్ రౌండర్ మిచ్ మార్ష్ గాయాల కారణంగా జట్టు నుంచి తప్పుకున్నారు, మరో ముఖ్యమైన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ గత వారం వన్డేల నుండి రిటైర్మెంట్ అవుతున్నట్టు అనూహ్యమైన ప్రకటన చేసాడు.ఈ ఈ పరిస్థితులలోశ్రీలంక సిరీస్ కోసం రిజర్వ్ ఫాస్ట్ బౌలర్లు సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్, బెన్ డ్వార్షుయిస్తో పాటు లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘ, స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీ, బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్లను సెలెక్టర్లు జట్టులోకి చేర్చారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలకమైన టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా వంటి ప్రత్యర్థి ని పూర్తిగా కొట్టివేయడానికి లేకపోయినా, ఆ జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పడంలో సందేహం లేదు.చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. కోహ్లి కామెంట్స్ వైరల్ -
క్రెడిట్ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా అంతే: రోహిత్ శర్మ
ఇంగ్లండ్తో మూడో వన్డేలో తాను అవుటైన తీరు పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. బౌలర్ అద్భుతమైన బంతిని సంధించాడని.. అది ఆడటం ఎవరితరం కాదంటూ తనను తాను సమర్థించుకున్నాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ముందు భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం అందుకున్న విషయం తెలిసిందే.స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను రోహిత్ సేన 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తొలుత నాగ్పూర్లో బట్లర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. కటక్లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్తో ఫామ్లోకి వచ్చిన భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. విధ్వంసకర శతకం(119) బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.మార్క్వుడ్ సూపర్ డెలివరీఅయితే, అహ్మదాబాద్లో బుధవారం జరిగిన మ్యాచ్లో మాత్రం హిట్మ్యాన్ తేలిపోయాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ పేసర్ మార్క్వుడ్(Mark Wood) గంటకు దాదాపు 142 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని ఆడటం తప్ప రోహిత్ శర్మకు మరో ఆప్షన్ లేకపోయింది. ఈ క్రమంలో అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ తన కుడివైపునకు డైవ్ చేసి మరీ ఒడిసిపట్టాడు. దీంతో రోహిత్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.టాస్ ఓడిన టీమిండియా.. ఇలా ఆరంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికీ భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్ శుబ్మన్ గిల్(112) శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78), కేఎల్ రాహుల్(40) రాణించడం వల్ల నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 34.2 ఓవర్లలో 214 పరుగులు చేసి బట్లర్ బృందం ఆలౌట్ అయింది. ఫలితంగా 142 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సిరీస్ను సంపూర్ణ విజయంతో ముగించింది.క్రెడిట్ మొత్తం బౌలర్కే ఇవ్వాలిఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్ సాగిన తీరుపట్ల ఎంతో సంతోషంగా ఉంది. సవాళ్లు ఉంటాయని ముందే తెలుసు. ఊహించనవి కూడా జరగడం సహజమే. నా విషయంలో క్రెడిట్ మొత్తం బౌలర్కే ఇవ్వాలి. బౌలర్గా నన్ను సవాల్ చేయడం అతడి కర్తవ్యం. బ్యాటర్గా బౌలర్ను ఎదుర్కోవడం నా పని.ఇక్కడ ఇద్దరం ఒకరితో ఒకరం పోటీ పడే క్రమంలో నేను ఆ బంతిని ఆడటంలో విఫలమయ్యాను. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సిరీస్లో మా జట్టు ఆడిన తీరు పట్ల సంతృప్తిగా ఉన్నాను. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం మా ఆట తీరును మెరుగుపరచుకోవాల్సి ఉంది.చాంపియన్ టీమ్వాటి గురించి నేను ఇక్కడ వివరణ ఇస్తూ ఉండలేను. అయితే, జట్టుగా నిలకడైన ప్రదర్శన చేయడం పట్ల మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. చాంపియన్ టీమ్ రోజురోజుకూ మరింత మెరుగవ్వాలని ఆశించడం సహజమే కదా! మేమూ అంతే.. తమకు నచ్చిన విధంగా ఆడేలా మా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం. అందుకు వరల్డ్కప్(2023) చక్కటి ఉదాహరణ. అయితే, నాడు అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాం. ఆటలో ఇవన్నీ భాగమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో పరిపూర్ణ విజయం సాధించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనుంది. తదుపరి ఐసీసీ టోర్నీలోపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ టోర్నీ మొదలుకానుండగా.. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్తో.. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్లతో మ్యాచ్లు ఆడనుంది. ఇక 2017లో చివరగా నిర్వహించిన ఈ వన్డే ఫార్మాట్ ఈవెంట్లో ఫైనల్ చేరిన టీమిండియా పాక్ జట్టు చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు Captain @ImRo45 is presented the winners trophy by ICC Chairman, Mr @JayShah as #TeamIndia clean sweep the ODI series 3-0 👏👏#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/1XaKksydw9— BCCI (@BCCI) February 12, 2025 -
విరాట్ను అతిగా ఇబ్బంది పెట్టిన బౌలర్లు.. సౌథీ, హాజిల్వుడ్ సరసన రషీద్
ప్రపంచ క్రికెట్ను శాశించే విరాట్ కోహ్లిని (Virat Kohli) కొందరు బౌలర్లు తెగ ఇబ్బంది పెట్టారు. విరాట్ను అతిగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల జాబితాలోకి తాజాగా ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (Adil Rashid) చేరాడు. భారత్తో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మూడో వన్డేలో ఆదిల్ రషీద్ విరాట్ను ఔట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో విరాట్ను ఔట్ చేయడం ఆదిల్కు ఇది 11వ సారి. ప్రపంచ క్రికెట్లో టిమ్ సౌథీ, జోష్ హాజిల్వుడ్ మాత్రమే విరాట్ను ఇన్ని సార్లు ఔట్ చేశారు. తాజా డిస్మిసల్తో ఆదిల్.. సౌథీ, హాజిల్వుడ్ సరసన చేరాడు. సౌథీ 37 మ్యాచ్ల్లో, హాజిల్వుడ్ 29 మ్యాచ్ల్లో, రషీద్ 34 మ్యాచ్ల్లో తలో 11 సార్లు విరాట్ను ఔట్ చేశారు. వీరి తర్వాత విరాట్ను అధికంగా ఇబ్బంది పెట్టింది మొయిన్ అలీ (41 మ్యాచ్ల్లో), జేమ్స్ ఆండర్సన్ (37 మ్యాచ్ల్లో). వీరిద్దరూ విరాట్ను చెరి 10 సార్లు ఔట్ చేశారు. వీరిద్దరు కూడా ఇంగ్లండ్ బౌలర్లే కావడం విశేషం. బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేసే విరాట్.. పై ఐదుగురంటే తెగ బయపడిపోతాడు. వీరి బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడతాడు. నిన్నటి మ్యాచ్లో ఈ సీన్ రిపీట్ అయ్యింది. ఆదిల్ను ఎదుర్కొనేందుకు విరాట్ చాలా కష్టపడ్డాడు. ఒకానొక సందర్భంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. మథ్యలో ఆదిల్ శాంతించడంతో ఎలాగోలా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్.. ఆతర్వాత ఆదిల్ చేతికే చిక్కాడు. ఆదిల్ అద్భుతమైన ఫ్లైటెడ్ డెలివరీతో విరాట్ ఆట కట్టించాడు. బాగా టర్న్ అయిన ఈ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్కీపర్ ఫిల్ సాల్ట్ చేతుల్లోకి వెళ్లింది. ఆదిల్ విరాట్ను వన్డేల్లో ఐదు సార్లు, టెస్ట్ల్లో నాలుగు సార్లు, టీ20ల్లో రెండు సార్లు ఔట్ చేశాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో విరాట్ హాఫ్ సెంచరీతో రాణించాడు. చాలా ఇన్నింగ్స్ల తర్వాత విరాట్ చేసిన హాఫ్ సెంచరీ ఇది. దీంతో వన్డేల్లో విరాట్ హాఫ్ సెంచరీల సంఖ్య 73కు చేరింది. ఈ మ్యాచ్లో విరాట్ హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్మన్ గిల్ సెంచరీతో, శ్రేయస్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరితో పాటు కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 356 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 214 పరుగులకే ఆలౌటై 142 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు భారత్ ఇంగ్లండ్ను ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 4-1 తేడాతో ఓడించింది. -
ఘనమైన ముగింపు
వన్డేల్లో భారత జట్టు మరోసారి తమ బలాన్ని ప్రదర్శించింది. సొంతగడ్డపై తమ స్థాయిని చూపిస్తూ ఇంగ్లండ్ను క్లీన్స్వీప్ చేసింది. గత రెండు మ్యాచ్ల తరహాలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా చివరి పోరులోనూ ఘన విజయాన్ని అందుకుంది. కెరీర్లో 50వ వన్డే ఆడిన శుబ్మన్ గిల్ శతకానికి తోడు శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి రాణించడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆ తర్వాత బలమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టి పడేసింది.‘బజ్బాల్‘ మాయలో ‘బ్యాడ్బాల్’గా మారిపోయిన ఆటతో ఇంగ్లండ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు కోహ్లి సహా ప్రధాన బ్యాటర్లంతా ఫామ్లోకి వచ్చిన సానుకూలతతో ఇక చాంపియన్స్ ట్రోఫీ సమరానికి రోహిత్ బృందం సన్నద్ధమైంది. అహ్మదాబాద్: ఇంగ్లండ్పై టి20 సిరీస్ను 4–1తో గెలుచుకున్న భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో మ్యాచ్లో భారత్ 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (102 బంతుల్లో 112; 14 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (64 బంతుల్లో 78; 8 ఫోర్లు, 2 సిక్స్లు), కోహ్లి (55 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. కోహ్లితో 116 పరుగులు జోడించిన గిల్, అయ్యర్తో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. అట్కిన్సన్ (19 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (41 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరీస్లో 259 పరుగులు చేసిన గిల్కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. శతక భాగస్వామ్యాలు... గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ (1) ఈసారి రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే గిల్, కోహ్లి భాగస్వామ్యంలో భారత్ ఇన్నింగ్స్ సరైన దిశలో సాగింది. 7 పరుగుల వద్ద సమన్వయ లోపంతో కోహ్లి రనౌట్ ప్రమాదంలో పడినా వుడ్ త్రో నేరుగా వికెట్లను తగలకపోవడంతో బతికిపోయాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. ఐదు బంతుల వ్యవధిలో గిల్ (51 బంతుల్లో), కోహ్లి (50 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. అయితే తర్వాతి ఓవర్లో రషీద్ వేసిన చక్కటి బంతిని ఆడలేక కోహ్లి వెనుదిరిగాడు. అనంతరం ఫామ్లో ఉన్న అయ్యర్...గిల్తో జత కలిశాడు. ఈ జోడీ కూడా పదునైన బ్యాటింగ్తో అలవోకగా పరుగులు సాధించింది. వుడ్ ఓవర్లో డీప్ మిడ్వికెట్ మీదుగా ఫోర్ కొట్టి 95 బంతుల్లోనే గిల్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. ఆ వెంటనే 43 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే తక్కువ వ్యవధిలో వీరిద్దరిని ఆదిల్ రషీద్ వెనక్కి పంపించాడు. గత రెండు వన్డేల్లో విఫలమైన కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) ఈసారి మెరుగ్గా ఆడగా... రషీద్ ఓవర్లో వరుసగా 6, 6 బాది తర్వాతి బంతికి హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 17) అవుటయ్యాడు.తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయినా... భారత్ 350 పరుగుల స్కోరును దాటగలిగింది. ఆఖరి 7 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. భారత తుది జట్టులో వరుణ్ చక్రవర్తి, షమీ, రవీంద్ర జడేజా స్థానాల్లో కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ తుది జట్టులోకి వచ్చారు. సమష్టి వైఫల్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 23; 4 ఫోర్లు), బెన్ డకెట్ (22 బంతుల్లో 34; 8 ఫోర్లు) సరైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 6.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. రాణా తన తొలి 2 ఓవర్లలో 5 ఫోర్లతో 22 పరుగులు ఇవ్వగా... అర్ష్ దీప్ ఓవర్లో డకెట్ వరుసగా 4 బంతుల్లో 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ భాగస్వామ్యం విడిపోయిన తర్వాత ఇంగ్లండ్ తడబడింది. బాంటన్, రూట్ (29 బంతుల్లో 24; 2 ఫోర్లు) కొద్దిసేపు నిలబడినా వీరిద్దరు ఎనిమిది పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. టపటపా వికెట్లను కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. రాణా వరుసగా రెండు ఓవర్లలో బట్లర్ (6), బ్రూక్ (26 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్)లను బౌల్డ్ చేయడంతో జట్టు ఆశలు కోల్పోయింది. మిగతా లాంఛనం ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మరో 15.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు కుప్పకూలింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాల్ట్ (బి) వుడ్ 1; గిల్ (బి) రషీద్ 112; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 52; అయ్యర్ (సి) సాల్ట్ (బి) రషీద్ 78; రాహుల్ (ఎల్బీ) (బి) మహమూద్ 40; పాండ్యా (బి) రషీద్ 17; అక్షర్ (సి) బాంటన్ (బి) రూట్ 13; సుందర్ (సి) బ్రూక్ (బి) వుడ్ 14; రాణా (సి) బట్లర్ (బి) అట్కిన్సన్ 13; అర్ష్ దీప్ (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 356. వికెట్ల పతనం: 1–6, 2–122, 3–226, 4–259, 5–289, 6–307, 7–333, 8–353, 9–353, 10–356. బౌలింగ్: సాఖిబ్ మహమూద్ 10–0–68–1, మార్క్ వుడ్ 9–1–45–2, అట్కిన్సన్ 8–0–74–1, రూట్ 5–0–47–1, ఆదిల్ రషీద్ 10–0–64–4, లివింగ్స్టోన్ 8–0–57–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 23; డకెట్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 34; బాంటన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 38; రూట్ (బి) అక్షర్ 24; బ్రూక్ (బి) రాణా 19; బట్లర్ (బి) రాణా 6; లివింగ్స్టోన్ (స్టంప్డ్) రాహుల్ (బి) సుందర్ 9; అట్కిన్సన్ (బి) అక్షర్ 38; రషీద్ (బి) పాండ్యా 0; వుడ్ (సి) అయ్యర్ (బి) పాండ్యా 9; మహమూద్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 12; మొత్తం (34.2 ఓవర్లలో ఆలౌట్) 214. వికెట్ల పతనం: 1–60, 2–80, 3–126, 4–134, 5–154, 6–161, 7–174, 8–175, 9–193, 10–214. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–33–2, హర్షిత్ రాణా 5–1–31–2, వాషింగ్టన్ సుందర్ 5–0–43–1, అక్షర్ పటేల్ 6.2–1–22–2, పాండ్యా 5–0–38–2, కుల్దీప్ యాదవ్ 8–0–38–1. ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడకుండానే..చాంపియన్స్ ట్రోఫీ బరిలో టీమిండియా దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా భారత జట్టు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం లేదు. బుధవారం వరకు స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా... తమకు ప్రాక్టీస్ మ్యాచ్ల అవసరం లేదని తేల్చేసింది. టోర్నీలో ప్రాక్టీస్ మ్యాచ్లు ఫిబ్రవరి 14–17 మధ్య జరుగుతాయి. 19న టోర్నీ ప్రారంభం కానుండగా, భారత జట్టు 15న దుబాయ్ చేరుకుంటుంది. మరోవైపు అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ టీమ్లు మాత్రం పాక్ గడ్డపైనే ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడబోతున్నాయి. ఈ మూడు మ్యాచ్లలో తలపడేందుకు ప్రత్యర్థులుగా పాకిస్తాన్ మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. మరో ప్రాక్టీస్ పోరులో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ తలపడతాయి. 1ఒకే మైదానంలో మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్గా శుబ్మన్ గిల్ గుర్తింపు పొందాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ టి20ల్లో (న్యూజిలాండ్పై 126 నాటౌట్; 2023లో), టెస్టుల్లో (ఆ్రస్టేలియాపై 128; 2023లో), వన్డేల్లో (ఇంగ్లండ్పై 112; 2025లో) ఒక్కో సెంచరీ సాధించాడు. -
అహ్మదాబాద్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి
ఇంగ్లండ్తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నాగ్పూర్, కటక్ వన్డేల్లో ఇంగ్లండ్ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.అయితే, ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ రూపంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్మ్యాన్ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్వుడ్ బౌలింగ్లో వెనుదిరిగాడు.ఎట్టకేలకు ఫామ్లోకిఈ నేపథ్యంలో మరో ఓపెనర్ శుబ్మన్ గిల్కు జతైన వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. దానిని శతకంగా మార్చుకున్నాడు.గిల్ శతకంమొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్మన్ గిల్ 14 ఫోర్లు, 3 సిక్స్లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా(17), అక్షర్ పటేల్(13), వాషింగ్టన్ సుందర్(14).. పేసర్లు హర్షిత్ రాణా(13), అర్ష్దీప్ సింగ్(2), కుల్దీప్ యాదవ్(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.అవయవ దానం గురించిఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్ వుడ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒకటి, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్తో బరిలోకి దిగడం విశేషం.అహ్మదాబాద్లో వన్డేల్లో అత్యధిక స్కోర్లుసౌతాఫ్రికా వర్సెస్ ఇండియా- 2010లో 365/2ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- 2025లో 356ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 2002లో 325/5వెస్టిండీస్ వర్సెస్ ఇండియా- 2002లో 324/4 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2007లో 319/7.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు -
వారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) సూపర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో సౌతాఫ్రికా బ్యాటర్ హషీం ఆమ్లా(Hashim Amla) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే(India vs England) సందర్భంగా శతకం బాదిన ‘ప్రిన్స్’ ఈ ఘనత సాధించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత నాగ్పూర్లో నాలుగు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించిన రోహిత్ సేన.. కటక్లో జరిగిన రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తద్వారా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.గిల్ సూపర్ సెంచరీఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా నామామాత్రపు మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే, గత మ్యాచ్లో శతకం(119) బాదిన కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(1) ఈసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మాత్రం సెంచరీతో మెరిశాడు.తొలి యాభై ఇన్నింగ్స్లోమొత్తంగా 102 బంతులు ఎదుర్కొని 112 పరుగులు సాధించాడు. గిల్ ఇన్నింగ్స్లో ఏకంగా పద్నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే గిల్ హషీం ఆమ్లాను అధిగమించాడు. వన్డేల్లో ఆడిన తొలి యాభై ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.అంతేకాదు.. ఒకే వేదికపై మూడు ఫార్మాట్లలో శతకం బాదిన ఐదో బ్యాటర్గానూ శుబ్మన్ గిల్ చరిత్రకెక్కాడు. ఇక ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో మూడో వన్డేలో గిల్ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది.కోహ్లి కూడా ఫామ్లోకిఇక ఈ మ్యాచ్తో మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఫామ్లోకి వచ్చాడు. అహ్మదాబాద్లో 55 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు సాధించాడు. మరోవైపు.. నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత హాఫ్ సెంచరీ(64 బంతుల్లో 78)తో మెరిశాడు.ఇదిలా ఉంటే.. 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్మన్ గిల్ ఇప్పటి వరకు 50 వన్డేలు, 32 టెస్టులు, 21 టీ20లు ఆడాడు. వరుసగా ఆయా ఫార్మాట్లలో 2587, 1893, 578 పరుగులు చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో వన్డేల్లో తొలి యాభై ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు👉శుబ్మన్ గిల్(ఇండియా)- 2587 పరుగులు👉హషీం ఆమ్లా(సౌతాఫ్రికా)- 2486 పరుగులు👉ఇమామ్ ఉల్ హక్(పాకిస్తాన్)- 2386 పరుగులు👉ఫఖర్ జమాన్(పాకిస్తాన్)- 2262 పరుగులు👉షాయీ హోప్(వెస్టిండీస్)- 2247 పరుగులుఒకే వేదికపై వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో శతకం బాదిన క్రికెటర్లు👉ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా)- వాండరర్స్ స్టేడియం, జొహన్నస్బర్గ్👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- నేషనల్ స్టేడియం, కరాచి👉క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)- సూపర్స్పోర్ట్ పార్క్, సెంచూరియన్👉శుబ్మన్ గిల్(ఇండియా)- నరేంద్ర మోదీ స్టేడియం(మొతేరా), అహ్మదాబాద్.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డుJubilation as @ShubmanGill gets to a fine CENTURY!Keep at it, young man 🙌🙌Live - https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/Xbcy6uaO6J— BCCI (@BCCI) February 12, 2025 -
చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డు
అహ్మదాబాద్ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఓవరాల్గా ఈ జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు.కాగా గత కొంతకాలంగా కోహ్లి వరుస వైఫల్యాలతో సతమవుతున్న విషయం తెలిసిందే. గత పన్నెండు ఇన్నింగ్స్లో అతడు చేసిన పరుగులు వరుసగా 4, 1, 5, 100*, 7, 11, 3, 36, 5, 17, 6, 6. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)లోనైనా కోహ్లి ఫామ్లోకి వస్తాడని భావిస్తే.. మోకాలి గాయం కారణంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్కు దూరమయ్యాడు.కేవలం ఐదు పరుగులుఅనంతరం కటక్లో జరిగిన రెండో వన్డేతో పునరాగమనం చేసిన కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలోనైనా బ్యాట్ ఝులిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కోహ్లి ఓ అరుదైన ఘనత సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్పై నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. కాగా కోహ్లి ఇంగ్లండ్పై ఇప్పటి వరకు ఎనిమిది శతకాలు బాదడంతో పాటు 23 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. సగటు 41.23.హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లిఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే, ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ కోహ్లి(52), ఓపెనర్ శుబ్మన్ గిల్ ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో సాల్ట్కు క్యాచ్ ఇచ్చిన కోహ్లి అవుటయ్యాడు.ఇక ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ శతకం(112) బాదగా..శ్రేయస్ అయ్యర్(78), కేఎల్ రాహుల్(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది.అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు1. డాన్ బ్రాడ్మన్(ఆస్ట్రేలియా)- 63 ఇన్నింగ్స్లో 5028 పరుగులు2. అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా)- 124 ఇన్నింగ్స్లో 4850 పరుగులు3. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 114 ఇన్నింగ్స్లో 4815 పరుగులు4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 84 ఇన్నింగ్స్లో 4488 పరుగులు5. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 99 ఇన్నింగ్స్లో 4141 పరుగులు6. విరాట్ కోహ్లి(ఇండియా)-109 ఇన్నింగ్స్లో 4001కి పైగా పరుగులు.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
Ind vs Eng 3rd ODI: వరుణ్ చక్రవర్తికి గాయం.. ఆ ఇద్దరికి విశ్రాంతి
Ind vs Eng 3rd ODI: టీమిండియాతో అహ్మదాబాద్ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తన నిర్ణయం గురించి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాం. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ పరిస్థితి మెరుగుపడవచ్చు. తొలి రెండు వన్డేల్లో మేము ముందుగా బ్యాటింగ్ చేశాం. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి ముందు కాస్త కొత్తగా ప్రయత్నిస్తున్నాం. వికెట్ బాగుంది. ఇక్కడే మేము న్యూజిలాండ్తో వరల్డ్కప్ మ్యాచ్ ఆడాం. నల్లరేగడి మట్టి పిచ్ సెకండాఫ్లో బ్యాటింగ్కు ఇంకాస్త అనుకూలంగా మారుతుంది. ఈరోజు మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.మరోవైపు.. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ(Rohit Sharma) తాము మూడు మార్పులతో మూడో వన్డే ఆడుతున్నట్లు వెల్లడించాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చామన్న రోహిత్.. దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్కు దూరమయ్యాడని తెలిపాడు. వరుణ్ పిక్కల్లో నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ సేన చేతిలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో 4-1తో ఓడిపోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. నాగ్పూర్, కటక్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2-0తో ఓటమిపాలైంది.తాజాగా అహ్మదాబాద్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ఒక్క వన్డేలో అయినా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునే పనిలో ఉంది. మరోవైపు.. క్లీన్స్వీప్ విజయంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమూద్.చదవండి: 119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
వరల్డ్క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే: క్రిస్ గేల్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో విజేతగా ఎవరన్న అంశంపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) తన అంచనా తెలియజేశాడు. ఈసారి టీమిండియానే టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కాగా 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో ఫైనల్ చేరింది.తటస్థ వేదికపై రోహిత్ సేనఅయితే, నాటి టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి ఈ వన్డే ఫార్మాట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో ఈ విషయం గురించి చర్చించగా.. తటస్థ వేదికపై రోహిత్ సేన మ్యాచ్లు ఆడేలా హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోయినా.. ఐసీసీ చర్యలకు ఉపక్రమించడంతో దిగివచ్చింది. దీంతో దుబాయ్ వేదికగా టీమిండియా తమ మ్యాచ్లు ఆడేందుకు మార్గం సుగమమైంది.రెండు గ్రూపులుమరోవైపు.. పాకిస్తాన్లోని రావల్పిండి, కరాచి, లాహోర్ నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు. ఇక ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ అర్హత సాధించగా.. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి.ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా మ్యాచ్తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న ఈ ఐసీసీ ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. అనంతంర మార్చి 2న న్యూజిలాండ్తో తలపడుతుంది.ఐసీసీ టోర్నీలలో అద్భుతంగాకాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై తడబడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకుల నడుమ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై.. టైటిల్ను చేజార్చుకుంది. అయితే, అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగించి చాంపియన్గా అవతరించింది.ఇదే జోరులో చాంపియన్స్ ట్రోఫీలోనూ అడుగుపెట్టనున్న రోహిత్ సేనకు.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ మంచి సన్నాహకంగా ఉపయోగపడుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలుత నాగ్పూర్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. కటక్లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. ఇక రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చి.. విధ్వంసకర శతకం(90 బంతుల్లో 119 రన్స్) బాదడం టీమిండియాకు అతిపెద్ద సానుకూలాంశంగా పరిణమించింది.అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ తక్తో మాట్లాడిన విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియానే ఫేవరెట్. టైటిల్ గెలిచే జట్టు ఇదే’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్. వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ఘనత అతడిది. హిట్మ్యాన్ అతడు. వన్డేల్లో నా సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో విఫలమైనా మెగా టోర్నీలో మాత్రం తప్పక రాణిస్తాడు’’ అని క్రిస్ గేల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
భారత అత్యుత్తమ తుదిజట్టుకు ఆఖరి కసరత్తు.. వారిద్దరికి ఛాన్స్!
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి భారత్ తన తుది జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. జట్టులోని ఆటగాళ్ల ఫామ్ గురించి అంచనా వేయడానికి అహ్మదాబాద్లో ఇంగ్లండ్(India vs England)తో బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్ టీమిండియాకు చివరి అవకాశం. భారత్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ను కైవసం చేసుకున్నందున.. ఈ మూడో వన్డేలో కొంతమంది ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయత్నించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే -2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ను నిర్ణయించడానికి భారత్ కి ఇదే చివరి అవకాశం.పంత్కు అవకాశంకర్ణాటక వికెట్ కీపర్-బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లండ్తో జరిగిన రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్గా రాణించాడు. కానీ ఈ మూడో వన్డే లో రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం కల్పించడం తప్పనిసరి గా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్ అని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంతకూ ముందే ప్రకటించినప్పటికీ పంత్ దూకుడుగా ఆడే స్వభావం వల్ల మిడిల్ ఆర్డర్లో అతనికి అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు.పైగా జట్టులో రెండో వికెట్ కీపర్ గా అతని ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తోంది. పంత్కి వన్డేల్లో మెరుగైన రికార్డు (27 ఇన్నింగ్స్లలో 871 పరుగులు) ఉంది. అంతేగాక తన అసాధారణ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా పంత్కు ఉంది. మరోవైపు, ఇంగ్లండ్తో జరిగిన రెండు వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినా తన బ్యాటింగ్తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాగ్పూర్ లో కేవలం రెండు పరుగులు చేయగా కటక్ లో పది పరుగులు చేశాడు. అయితే, ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పటికే జట్టులో ఉండటంతో పంత్కి అది ప్రతికూలంగా మారవచ్చు.రాణా స్థానంలో అర్ష్దీప్ సింగ్భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ గురించి ఇంకా స్పష్టత లేక పోవడంతో.. అర్ష్దీప్ సింగ్ కి అవకాశం కల్పించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా తన పూర్తి స్థాయి ఫామ్ కనిపించలేకపోయాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండు వందేళ్లలో షమీ ప్రదర్శన అతని స్థాయికి తగ్గట్టుగా లేదు.ఫలితంగా తన పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక పోయాడు. ఈ కారణంగా ఇంగ్లండ్తో జరిగే మూడో వన్డేకు పేస్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో అర్ష్దీప్ సింగ్ను తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. హర్షిత్ ఇంగ్లాండ్తో జరిగిన రెండు వన్డేల నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుధవారం ఇంగ్లండ్తో జరిగే మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది.రేసులో వరుణ్ చక్రవర్తి ఇక కుల్దీప్ అవకాశం కల్పించిన ప్రతీ సారి తన వైవిధ్యమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్నకు వరుణ్ చక్రవర్తి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ భారత్ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ కారణంగా భారత్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్ రౌండర్లయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లను కూడా జట్టులో తీసుకోనే అవకాశం ఉంది. చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం!
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతంకాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్లో వికెట్ కీపర్గా రిషభ్ పంత్ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.అతడికి ప్రమోషన్.. రాహుల్కు అన్యాయం?స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్ను ఆరో నంబర్ బ్యాటర్గా పంపింది. ఈ క్రమంలో నాగ్పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.ఇది చాలా దురదృష్టకరంఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదుకాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్ను ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?అక్షర్ పటేల్తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్ను ఆరో నంబర్లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్క్లాస్ ప్లేయర్గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు. చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన -
కటక్ వన్డేలో ఫ్లడ్ లైట్ల సమస్య.. బీసీసీఐపై ఎదురుదాడికి దిగిన పాక్ అభిమానులు
భారత్, ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫ్లడ్ లైట్లు మొరాయించిన విషయం తెలిసిందే. ఛేదనలో భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లడ్ లైట్ ఆగిపోయాయి. ఊహించని ఈ పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్లు విస్మయానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్లు ఆటగాళ్లను మైదానాన్ని వీడాల్సిందిగా కోరారు. ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. మైదాన సిబ్బంది వెంటనే స్పందించడంతో ఫ్లడ్ లైట్లు మళ్లీ ఆన్ అయ్యాయి. తదనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగింది.కాగా, ఈ ఉదంతం జరగడానికి ఒక్క రోజు ముందు ఇదే ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్ మూడో బంతిని కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. అయితే రచిన్ బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతని నుదిటిపై తాకింది. బంతి బలంగా తాకడంతో రచిన్కు తీవ్ర రక్తస్రావమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన రచిన్ను వెంటనే అస్పత్రికి తరలించారు.ఫ్లడ్ లైట్ల కారణంగా రచిన్కు తీవ్రమైన గాయమైన నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు పాక్ క్రికెట్ బోర్డును ఏకి పారేశారు. చెత్త లైటింగ్ కారణంగా ఈ ఘోరం జరిగిందని దుయ్యబట్టారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేది పెట్టుకుని ఇంత నాసిరకమైన ఏర్పాట్లు ఏంటని మండిపడ్డారు. ఇలాంటి మైదానానికి ఓకే చెప్పినందుకు ముందుగా ఐసీసీని నిందించాలని అంన్నారు. తక్షణమే గడాఫీ స్టేడియానికి మరమ్మత్తులు చేయాలని సూచించారు. లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను పాక్ నుంచి దుబాయ్కు మార్చాలని కోరారు.భారత అభిమానుల ఘాటైన విమర్శల అనంతరం కటక్ ఉదంతాన్ని బూచిగా చూపెడుతూ పాక్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు ఎక్కు పెట్టారు. బీసీసీఐకు ఫ్లడ్ లైట్లు అవసరమైతే పాక్ క్రికెట్ బోర్డు సరఫరా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మమ్మల్ని నిందించే ముందు మీ విషయాన్ని సరి చూసుకోండని హితవు పలుకుతున్నారు. రచిన్ ఉదంతంపై భారత అభిమానులు స్పందించినందుకు బీసీసీఐపై ఎదురుదాడికి దిగుతున్నారు. -
హర్షిత్ రాణాపై రోహిత్ శర్మ ఫైర్!.. వీడియో వైరల్
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మెదడు పని చేస్తోందా?.. మనసు ఎక్కడపెట్టి ఆడుతున్నావు?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.కాగా కటక్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్(India vs England) మధ్య ఆదివారం రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పర్యాటక ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(26) నిరాశపరిచినా.. బెన్ డకెట్ మాత్రం అర్ధ శతకం(56 బంతుల్లో 65)తో మెరిశాడు. వన్డౌన్లో వచ్చిన జో రూట్(72 బంతుల్లో 69) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.ఉచితంగా నాలుగు పరుగులుఇక హ్యారీ బ్రూక్(31) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ జోస్ బట్లర్ పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 32వ ఓవర్ను భారత యువ పేస్ బౌలర్ హర్షిత్ రాణా వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న బట్లర్ ఐదో బంతిని డిఫెన్స్ ఆడగా.. బంతిని అందుకున్న రాణా వికెట్ల వైపునకు త్రో చేశాడు.అయితే, అది స్టంప్స్ను తాకకపోగా.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి కూడా అందకుండా బౌండరీ వైపు దూసుకువెళ్లింది. దీంతో రాణా చేసిన తప్పు వల్ల ఇంగ్లండ్కు ఉచితంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రోహిత్ శర్మ.. హర్షిత్ రాణాను చూస్తూ.. ‘మెదడు ఎక్కడ పెట్టుకుని ఆడుతున్నావు?’ అన్నట్లుగా సైగలతో అతడిపై అసహనం వెళ్లగక్కాడు.రోహిత్ విశ్వరూపంఇదిలా ఉంటే.. ఇక బట్లర్ 34 పరుగులు చేసి నిష్క్రమించగా.. లివింగ్స్టోన్ 41 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లు విఫలం కాగా 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా మూడు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ శతకం(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు- 119 రన్స్) చెలరేగగా.. శుబ్మన్ గిల్(60), శ్రేయస్ అయ్యర్(47 బంతుల్లో 44), అక్షర్ పటేల్(43 బంతుల్లో 41*) కూడా రాణించారు. ఫలితంగా 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 308 పరుగులు చేసింది. ఇంగ్లండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. Rohit sharma angry on harshit rana on overthrow #LCDLFAllStars #SEVENTEEN #jailstool #DelhiElectionResults #cepostaperte pic.twitter.com/XEUjyQMRdK— kyaa haal hai (@Nittin08572676) February 9, 2025What a way to get to the HUNDRED! 🤩A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T— BCCI (@BCCI) February 9, 2025 -
క్రిస్ గేల్ను అధిగమించిన రోహిత్.. ప్రపంచ రికార్డుకు గురి
తాను బ్యాట్ ఝులిపిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి నిరూపించాడు. ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌండరీలు, సిక్స్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రో‘హిట్’.. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్(Chris Gayle) సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు.. అరుదైన ప్రపంచ రికార్డుకు మరింత చేరువయ్యాడు.కాగా గత కొంతకాలంగా బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. కటక్ వన్డేతో ఫామ్లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో డెబ్బై ఆరు బంతుల్లోనే శతకమార్కును అందుకుని.. తన వన్డే కెరీర్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లతో పాటు.. ఏడు సిక్స్లు ఉన్నాయి.రెండో స్థానానికి ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ను అధిగమించి షాహిన్ ఆఫ్రిది తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 267 వన్డేలు పూర్తి చేసుకున్న రోహిత్ 338 సిక్స్లు బాదాడు.మరోవైపు.. వెస్టిండీస్ తరఫున 301 వన్డేల్లో గేల్ 331 సిక్సర్లు కొట్టాడు. ఇక పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్లతో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ప్రపంచ రికార్డుకు రోహిత్ శర్మ ఇంకా కేవలం పదమూడు సిక్స్ల దూరంలో ఉన్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటికే అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. అతడి ఖాతాలో ఏకంగా 631 సిక్స్లు ఉన్నాయి. రోహిత్ వన్డేల్లో 338, టీ20లలో 205, టెస్టుల్లో 88 సిక్స్లు బాదాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతున్న టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత సూర్యకుమార్ బృందం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో సొంతం చేసుకోగా.. మరో వన్డే మిగిలి ఉండగానే వన్డే సిరీస్ను రోహిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. కటక్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బట్లర్ బృందాన్ని 304 పరుగులకు ఆలౌట్ చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ... మొత్తంగా తొంభై బంతుల్లో 119 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మెరుపు అర్ధ శతకం(52 బంతుల్లో 60) రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) మరోసారి రాణించారు.ఈ క్రమంలో 44.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. హిట్ షోతో అలరించిన రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం ఆఖరి వన్డే జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తిరుగులేని హిట్మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను అధిగమించాడు. ఇంగ్లండ్తో రెండో వన్డే(India vs England) సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్లో శతక్కొట్టడం ద్వారా మరిన్ని రికార్డులను హిట్మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.అద్భుత ఇన్నింగ్స్కాగా రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో కెప్టెన్గా, బ్యాటర్గా దారుణంగా విఫలమైన అతడు రిటైర్ అయిపోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్తో కటక్ వన్డేలో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడి.. విమర్శించినవాళ్లే ప్రశంసించేలా రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీబరాబతి స్టేడియంలో లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్ శర్మ. ఫ్లడ్లైట్ల సమస్య కారణంగా కాసేపు అవాంతరాలు ఎదురైనా.. అతడి ఏకాగ్రత చెదరలేదు. ఒంటిమీదకు బాణాల్లా దూసుకువస్తున్న ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ల బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో ఏకంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, లియామ్ లివింగ్స్టోన్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇవ్వడంతో హిట్మ్యాన్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 15404 పరుగులు చేశాడు. తద్వారా సచిన్ టెండుల్కర్ను అధిగమించాడు.కాగా ఓపెనర్గా సచిన్ టెండుల్కర్ 15335 పరుగులు చేశాడు. మరోవైపు.. ఈ జాబితాలో విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలోకి ఇప్పుడు రోహిత్ దూసుకువచ్చాడు. కాగా 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.. 2013లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు.ద్రవిడ్ను అధిగమించివన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (267 వన్డేల్లో 10,987 పరుగులు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ (344 వన్డేల్లో 10,889 పరుగులు) ఐదో స్థానానికి చేరాడు. టాప్–3లో సచిన్ టెండూల్కర్ (463 వన్డేల్లో 18,246 పరుగులు), విరాట్ కోహ్లి (296 వన్డేల్లో 13,911 పరుగులు), సౌరవ్ గంగూలీ (311 వన్డేల్లో 11,363 పరుగులు) ఉన్నారు.32వ శతకంవన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు 32. తద్వారా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్–2లో విరాట్ కోహ్లి (50), సచిన్ టెండూల్కర్ (49) ఉన్నారు.ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. కటక్లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు బట్లర్ బృందం ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 44.3 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్- ఇంగ్లండ్ మధ్య నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరుగుతుంది.చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో రెండో వన్డేలో విధ్వంసకర బ్యాటింగ్తో శతక్కొట్టి తన ఆటను విమర్శిస్తున్న వాళ్లకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. కో..డితే బంతి బౌండరీ దాటడమే అన్నట్లుగా తనదైన శైలిలో హిట్టింగ్ ఆడి.. క్రికెట్ ప్రేమికులకు కనులవిందు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్తో చెలరేగి.. జట్టును గెలిపించాడు.నా గేమ్ప్లాన్ అదేఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... సెంచరీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు ఆటను పూర్తిగా ఆస్వాదించాను. జట్టు కోసం పరుగులు చేయడం ఎల్లప్పుడూ సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా సిరీస్ గెలవాలంటే మాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.నిజానికి టీ20 ఫార్మాట్ కంటే కాస్త సుదీర్ఘమైన.. టెస్టుల కంటే చిన్నదైన ఫార్మాట్ ఇది. అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పుటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటూ వెళ్లాలి. ఈరోజు నా వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగాను.నల్లరేగడి మట్టి పిచ్ ఇది. జారుతూ ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వికెట్ మీదకు కాకుండా.. శరీరం మీదకు బంతులు సంధిస్తున్న ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాన్ని పసిగట్టి నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను.గిల్ క్లాసీ ప్లేయర్గ్యాప్ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాను’’ అని రోహిత్ శర్మ తన ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. శుబ్మన్ గిల్(Shubman Gill), శ్రేయస్ అయ్యర్ నుంచి తనకు మద్దతు లభించించదన్న హిట్మ్యాన్.. ‘‘ఇద్దరూ చక్కగా సహకరించారు. వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. గిల్ చాలా చాలా క్లాసీ ప్లేయర్. అతడి ఆటను నేను దగ్గరగా గమనించాను. పరిస్థితి ఎలా ఉన్న తలవంచని స్వభావం. అతడి బ్యాటింగ్ గణాంకాలే ఇందుకు నిదర్శనం’’ అని రోహిత్ శర్మ గిల్పై ప్రశంసలు కురిపించాడు.మిడిల్ ఓవర్లే ముఖ్యంఇక టీమిండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఏదేమైనా మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. మధ్య ఓవర్లలో ఆట తీరును బట్టే ఫలితం నిర్ణయించబడుతుంది. ఒకవేళ అప్పుడే మనం జాగ్రత్తపడితే డెత్ ఓవర్లలో పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు.నాగ్పూర్లో కూడా మేము ఇదే విధంగా మిడిల్ ఓవర్లలో చక్కగా రాణించాం. తద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగాం. రోజురోజుకూ మరింత గొప్పగా మారేలా మా జట్టు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. జట్టులోని ప్రతి సభ్యుడికి తన పాత్ర ఏమిటో తెలుసు. కెప్టెన్, కోచ్ వాళ్ల నుంచి ఎలాంటి ఆట తీరును ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కాబట్టి ముందుకు అనుకున్న వ్యూహాలను పక్కాగా అమలు చేస్తే దేని గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒడిశాలోని కటక్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్(65), జో రూట్(69) అర్ధ శతకాలతో రాణించారు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లు- 119) సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి బాటలు చేశాడు.మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(60) అర్ధ శతకంతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) లక్ష్యాన్ని పూర్తి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. రో‘హిట్’ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ విజయంతో టీమిండియా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డే జరుగుతుంది.చదవండి: SA T20: ఫైనల్లో సన్రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్గా ముంబై టీమ్What a way to get to the HUNDRED! 🤩A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T— BCCI (@BCCI) February 9, 2025𝗔 𝘀𝘂𝗽𝗲𝗿 𝘀𝗵𝗼𝘄 𝘁𝗼 𝘀𝗲𝗮𝗹 𝗮 𝘄𝗶𝗻 𝗶𝗻 𝗖𝘂𝘁𝘁𝗮𝗰𝗸! ✅The Rohit Sharma-led #TeamIndia beat England by 4⃣ wickets in the 2nd ODI & take an unassailable lead in the ODI series! 👏 👏Scorecard ▶️ https://t.co/NReW1eEQtF#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/G63vdfozd5— BCCI (@BCCI) February 9, 2025 -
IND Vs ENG: రోహిత్ సూపర్ సెంచరీ..రెండో వన్డేలో ఇంగ్లండ్పై టీమిండియా గెలుపు (ఫొటోలు)
-
సిరీస్ విజయమే లక్ష్యంగా...
ఇంగ్లండ్పై టి20 సిరీస్ జోరును కొనసాగిస్తూ వన్డేల్లోనూ శుభారంభం చేసిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్ను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. అన్ని రకాలుగా ఫామ్లో ఉన్న టీమిండియా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో చెలరేగుతున్న భారత్ను నిలువరించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ ఈ సారైనా కోలుకొని పోటీనిస్తుందా చూడాలి. కటక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై తమ సత్తాను ప్రదర్శిస్తున్న భారత జట్టు ఇంగ్లండ్పై వన్డే సిరీస్ను గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బారాబతి స్టేడియంలో నేడు జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 38.4 ఓవర్లలోనే ఛేదన పూర్తి చేసిన భారత్ అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే మరో మ్యాచ్ కూడా రోహిత్ సేన ఖాతాలో చేరుతుంది.టి20ల్లో చిత్తుగా ఓడి తొలి వన్డేలో కూడా 248కే పరిమితమైన ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శనతో సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్లే గెలిచి 25 ఓడింది. కోహ్లి సిద్ధం... గాయంతో తొలి మ్యాచ్కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తి ఫిట్గా సిద్ధమయ్యాడు. రెండో వన్డేలో అతను బరిలోకి దిగడం ఖాయమైంది. కోహ్లి కూడా చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. లయ అందుకునేందుకు అతనికి ఇదే సరైన అవకాశం. అయితే ఎవరి స్థానంలో విరాట్ ఆడతాడనేది ఆసక్తికరం. గత మ్యాచ్లో చెప్పినదాని ప్రకారం శ్రేయస్ను తప్పించి కోహ్లిని తీసుకోవాలి. కానీ మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్ను పక్కన పెడితే టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు రావచ్చు. కోచ్ గంభీర్ సాధారణంగా ఓపెనింగ్ ఎడమ, కుడిచేతివాటం కాంబినేషన్ను ఇష్టపడతాడు. అలా చూస్తే శ్రేయస్పైనే వేటు వేసి జైస్వాల్ను ఆడించవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రయోగాలు చేయకుండా జైస్వాల్ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమవుతుంది. మరో వైపు రాహుల్ స్థానంలో కీపర్గా పంత్ను ఆడించే ఆలోచన కూడా ఉంది. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ను పరీక్షించేందుకు రాణాను పక్కన పెట్టాలనే చర్చ కూడా జరుగుతోంది. ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని భావిస్తే భారత జట్టు మార్పులపై దృష్టి పెట్టకపోవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్లో ఆటగాళ్లను పరీక్షించాలనే ఆలోచన ఉంటే మాత్రం మార్పులు ఖాయం. సీనియర్ పేసర్ షమీ గత మ్యాచ్లో వికెట్లు తీయకపోయినా చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఆల్రౌండర్ అక్షర్ బ్యాటింగ్లో రాణించడం సానుకూలాంశం. అయితే అన్నింటికి మించి కెపె్టన్ రోహిత్ ఫామ్లోకి రావడం భారత్కు ముఖ్యం. చాలా కాలంగా వరుసగా విఫలమవుతున్న రోహిత్ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. గిల్, పాండ్యా, జడేజాలతో మన బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గెలిపించేదెవరు? ఈ పర్యటనలో ఐదు మ్యాచ్లలో ఓడిన ఇంగ్లండ్ ఆట దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. పేరుకు భారీ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తున్నా ఆ జట్టు వ్యూహాల్లో పదును లోపించింది. గుడ్డిగా బ్యాట్లు ఊపడం తప్ప ఆటగాళ్లు విఫలమవుతున్న చోట రెండో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కోచ్ మెక్కలమ్ ప్రణాళికలు ఏవీ పని చేయడం లేదు. భారత గడ్డపై అనుభవం ఉన్న బట్లర్ మాత్రమే ఎంతో కొంత రాణిస్తుండగా బెతెల్ కాస్త పట్టుదలగా ఆడగలిగాడు. జట్టు ఆధారపడుతున్న రూట్, బ్రూక్ స్థాయికి తగ్గ ఆటను కనబర్చాల్సి ఉంది. ముఖ్యంగా బ్రూక్ 5 టి20లు, వన్డే కలిపి 91 పరుగులే చేశాడు. డకెట్ ఇంకా వన్డే ఓపెనర్గా కుదురుకోకపోగా, సాల్ట్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఆర్చర్, కార్స్ పేస్ భారత బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, రషీద్ తేలిపోయాడు. ఈ మ్యాచ్లో మరో పేసర్ వుడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 40 ఓవర్లలోపే భారత్ తొలి వన్డే ముగించడం ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనతను కూడా చూపించింది. దీనిని ఆ జట్టు ఎలా అధిగమిస్తుందో చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్/ పంత్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్ దీప్, షమీ ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్,డకెట్, లివింగ్స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఐదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతోంది. మొదటినుంచి ఇక్కడి పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలం. భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సారి కూడా పరుగుల వరద ఖాయం. వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. -
నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev) కీలక వ్యాఖ్యలు చేశాడు. సారథి విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నాడు. అదే విధంగా.. గెలిచినపుడు బ్రహ్మరథం పట్టినవాళ్లు ఓడినపుడు అదే స్థాయిలో విమర్శిస్తారని ఆటగాళ్లకు గుర్తు చేశాడు. విజయగర్వం తలకెక్కితే అడుగులు తడబడతాయని.. అందుకే ఆటగాళ్లను ఎవరూ అతిగా ప్రశంసించవద్దని సూచించాడు.దారుణ వైఫల్యాలుఅంతర్జాతీయ క్రికెట్లో ఫార్మాట్లకు అతీతంగా గత పది ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సాధించిన స్కోర్లు వరుసగా... 2, 3, 9, 10, 3, 6, 18, 11, 0, 8. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ ‘హిట్మ్యాన్’ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో ఏడు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్లో లియామ్ లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన ఈ వన్డేలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 52), అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) అద్భుత అర్ధ శతకాలతో రాణించారు. తద్వారా ఇంగ్లండ్పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే.. రోహిత్ శర్మపై విమర్శలు మరింత పదునెక్కేవి.నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లోఇక ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ తర్వాత టీమిండియా నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అడుగుపెడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. క్రికెట్ అడ్డా యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ బిగ్ ప్లేయర్. అతడు త్వరలోనే ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నా.అదే విధంగా కోచ్ గౌతం గంభీర్కు కూడా గుడ్లక్ చెబుతున్నా. ఎవరికైనా ఒక పనిలో కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఇప్పుడు దేశం మొత్తం భారత క్రికెట్ జట్టు ప్రదర్శనలపై మరింత దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఒడిదొడుకులు ఎదుర్కొంది.సారథి ఇలా ఉంటే.. సమస్యలు తప్పవుఅయితే, సొంతగడ్డపై మెరుగ్గానే రాణించింది. అయినప్పటికీ స్థూలంగా ఇటీవల వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ ఫామ్లేమి ఆందోళనకు గురిచేస్తోంది. సారథి ఇలా ఉంటే.. జట్టుపై ప్రభావం పడుతుంది. సమస్యలు తప్పవు’’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.ఇక టీమిండియాపై అభిమానుల ఆగ్రహం గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన(టెస్టుల్లో) కనబరిచింది. అభిమానులకు కోపం రావడంలో తప్పులేదు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత మన ఆటగాళ్లకు ఎంతటి ఘన స్వాగతం లభించిందో గుర్తుంది కదా!పొగిడినవాళ్లు.. తిడతారు కూడానేనైతే నా జీవితంలో మునుపెన్నడూ అలాంటి దృశ్యాలు చూడలేదు. కాబట్టి మనవాళ్ల ప్రదర్శన బాగా లేనప్పుడు కచ్చితంగా విమర్శలు వస్తాయి. అందుకే ఆటగాళ్లకు అతిగా పొగడవద్దని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా. దాని ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఒకవేళ జట్టు, ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించాలన్న సద్విమర్శలు మాత్రమే చేయాలనేది నా అభిప్రాయం’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.చదవండి: Indv vs Eng: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో చక్కగా రాణించగల నైపుణ్యాలు అతడి సొంతమని కొనియాడాడు. అయితే, గత రెండేళ్లుగా టీమిండియా యాజమాన్యం అయ్యర్కు అడపాదడపా మాత్రమే అవకాశాలు ఇవ్వడం తనకు విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నాడు.కాగా స్వదేశంలో గతేడాది ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా వెన్నునొప్పితో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. రంజీల్లో ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆదేశాలను తొలుత బేఖాతరు చేసిన ఈ ముంబైకర్.. తర్వాత గాయాన్ని సాకుగా చూపి తప్పించుకున్నాడు.ఈ క్రమంలో బీసీసీఐ అయ్యర్పై కఠిన చర్యలు తీసుకుంది. అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేస్తూ వేటు వేసింది. ఈ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా టైటిల్ గెలిచాడు.టీ20 జట్టులో మాత్రం చోటు కరువుఈ నేపథ్యంలో గతేడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో ఆడే అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీ20 జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోయాడు. యాజమాన్యం అతడిని ఎప్పటికప్పుడు పక్కనపెట్టి.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ అతడికి చాన్స్ ఇవ్వలేదు.ఇక తాజాగా ఇంగ్లండ్తో స్వదేశంలో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. నాగ్పూర్లో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఈ మ్యాచ్లో తనకు తొలుత తుదిజట్టులో స్థానం లేదని.. విరాట్ కోహ్లి గాయపడ్డ కారణంగానే తనను పిలిపించారని శ్రేయస్ అయ్యర్ స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫామ్లో ఉన్న ఆటగాడిని బెంచ్కే పరిమితం చేయాలని చూడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?ఈ నేపథ్యంలో లెజెండరీ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా అతడి సేవలను ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వన్డే ప్రపంచకప్-2023లోనూ శతకాలతో చెలరేగి భీకరమైన ఫామ్ కనబరిచాడు.మిడిలార్డర్లో సొగసైన బ్యాటింగ్తో అలరించాడు. దీంతో జట్టులో అతడి స్థానం సుస్థిరమైందని నేను అనుకున్నా. కానీ అలా జరుగలేదు. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.అయినా.. అతడిని పక్కనపెట్టాలని చూడటం సరికాదు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ హెడ్కోచ్గా పాంటింగ్ నియమితుడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేలంలో భాగంగా శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంలో పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు కలిసి గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పనిచేశారు కూడా!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో గురువారం నాటి తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం కటక్లో రెండో వన్డే జరుగుతుంది.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
టీమిండియాకు భరోసానిచ్చిన బౌలర్లు.. అతడికీ త్వరలోనే అవకాశం!
ఇంగ్లండ్తో నాగపూర్లో జరిగిన తొలి వన్డేలో భారత్ తరుఫున మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని రంగంలోకి దించుతారని అందరూ భావించారు. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడినప్పటికీ వరుణ్కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇందుకు బదులుగా ఆల్రౌండర్లైన రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మరో ఎడం చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లతో భారత్ బరిలోకి దిగింది. ఈ ఫార్ములా టీమిండియాకు బాగానే పనిచేసింది.తడబడినా రాణించిన రానాఇక పేస్ బౌలర్లలో గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలతో పాటు 23 ఏళ్ళ హర్షిత్ రాణాకి స్థానం ఇచ్చారు. అతడికి ఇదే తొలి వన్డే. ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా గత సీజన్ లో ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరుఫున ఆడిన రానా 13 మ్యాచ్ లలో 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా లో నాలుగో బౌలర్ గా నిలిచాడు.ఇక డెత్ ఓవర్లలో 9.85 పరుగుల సగటు తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన రాణా.. అరంగేట్రంలోనే మూడు వికెట్లు పడగొట్టి వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే నాగపూర్ లో తన తొలి స్పెల్ లోని మూడో ఓవర్లో రాణా ఏకంగా 26 పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మూడు సిక్సలు, రెండు బౌండరీలతో ఏకంగా 26 పరుగులు సాధించాడు.అయితే అతడి స్థానంలో తర్వాత బౌలింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా నిలకడగా బౌలింగ్ చేయడమే కాక , అదే ఓవర్లో సాల్ట్ రనౌట్ అవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్కి బ్రేకులు పడ్డాయి. మళ్ళీ రెండో స్పెల్ కి వచ్చిన రాణా ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ మరో ఓపెనర్ బెన్ డకేట్ వికెట్ తీయడమే కాక మొత్తం మీద ఏడు ఓవర్లలో 53 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.షమీ రాకతో కొంత ఊరట ఇక గాయం నుంచి కొలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన ౩౩ ఏళ్ళ షమీ పొదుపుగా బౌలింగ్ చేసి 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి కోలుకోవడం పై స్పష్టమైన సమాచారం లేక పోవడం తో షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యల బౌలింగ్ భారత్ జట్టు మేనేజిమెంట్ కి కొద్దిగా ఊరట కలిగించవచ్చు. అయితే బుమ్రా లేని లోటు పూరించడం కష్టమే అయినా ఈ ముగ్గురు రాణించడం పేస్ బౌలింగ్ భారం కొద్దిగా తగ్గినట్టు భావించవచ్చు.వరుణ్కు త్వరలో అవకాశం అయితే ఈ మ్యాచ్ కి ముందు అందరూ ఈ మ్యాచ్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తప్పక ఆడతాడని భావించారు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ రాణించడమే ఇందుకు కారణం. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జట్టులో వరుణ్ కి స్థానం కల్పించడానికి ముందు ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్ లో ఆడించడం చాల ముఖ్యం. ఈ నేపథ్యంలో నాగపూర్ లో 33 ఏళ్ల వరుణ్ ఆడటం ఖాయమని భావించారు. అయితే మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ అయితే ఈ టోర్నమెంట్ లో ఏదో ఒక దశ లో వరుణ్ ఆడే అవకాశం ఉందని వివరించాడు.అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడడం పై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన పై అది ఆధారపడి ఉంటుందని రోహిత్ వివరించాడు. "వరుణ్ బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఇది రుజువైంది. అయితే అతని ఆడింది టి20 ఫార్మాట్ అయినందున వన్డేల్లో అతని ప్రదర్శనపై ఇంకా అంచనా వేయాల్సి ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు."ఈ సిరీస్లో వరుణ్ తో ఏదో ఒక దశలో ఆడించడానికి ప్రయత్నిస్తాం. అతని సామర్థ్యం ఏమిటో చూడటానికి ఇది మాకు అవకాశాన్ని కలిపిస్తుంది. ప్రస్తుతం మేము అతన్ని తీసుకోవాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికలో వరుణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే, అతని ప్రదర్శన కూడా మేము ఆశించిన స్థాయిలో ఉంటే వరుణ్ కి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశం కల్పించే అవకాశం పై తప్పక పరిశీలిస్తాం’’ అని రోహిత్ వివరించాడు. -
Ind vs Eng: ‘రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడటం ఆశ్చర్యమే’
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను టీమిండియా(India vs England) విజయంతో ఆరంభించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో నాగ్పూర్ వేదికగా పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel).. ఇద్దరూ అదరగొట్టడం విశేషం.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలా జడ్డూ, అక్షర్ కలిసి ఆడతారని తాను అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్లో ఇద్దరు రాణించడం శుభసూచకమని.. అయితే అక్షర్ కంటే జడ్డూ మెరుగ్గా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు.జడ్డూ, అక్షర్.. ఒకరు బౌలింగ్లో.. ఒకరు బ్యాటింగ్లోకాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు తీశాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో కేవలం 26 పరుగులే ఇచ్చి స్టార్ బ్యాటర్లు జో రూట్(19), జొకొబ్ బెతెల్(51) వికెట్లతో పాటు.. టెయిలెండర్ ఆదిల్ రషీద్(8)ను అవుట్ చేశాడు.ఇక లక్ష్య ఛేదనలో భాగంగా జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొని 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. జోస్ బట్లర్ (52) రూపంలో బిగ్ వికెట్ దక్కించుకున్న మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్.. బ్యాటర్గానూ దుమ్ములేపాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ 47 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 52 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వీరిద్దరి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో 600 వికెట్ల క్లబ్లో చేరాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడతారని అస్సలు అనుకోలేదుతద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్గా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఫాస్ట్బౌలర్ కపిల్ పాజీ ఈ ఫీట్ అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్లో అతడికి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్న సందేహం ఉండేది. ఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడు పదిహేనవ ఆటగాడిగా ఉన్నాడు.నిజానికి ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఒకే మ్యాచ్లో ఆడించరనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలాంటిది జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు(గురువారం) ఇది జరిగింది.ఈ మ్యాచ్లో జడ్డూ అక్షర్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అక్షర్కు బ్యాటింగ్కు చేసే అవకాశం వచ్చింది. ఇకపై జడ్డూ బౌలింగ్ ఆల్రౌండర్.. అక్షర్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా మీకు(మేనేజ్మెంట్) ఉపయోగపడతాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి వన్డే స్కోర్లు👉వేదిక: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్పూర్👉టాస్: ఇంగ్లండ్.. బ్యాటింగ్👉ఇంగ్లండ్ స్కోరు: 248 (47.4)👉భారత్ స్కోరు: 251/6 (38.4)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87 పరుగులు).చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలని హితవు పలికాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరు స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ చురకలు అంటించాడు.కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England ODIs)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరిగింది. 248 పరుగులుఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(26 బంతుల్లో 43), బెన్ డకెట్(29 బంతుల్లో 32)లు శుభారంభం అందించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 52), జాకొబ్ బెతెల్(64 బంతుల్లో 51) అర్ధ శతకాలతో మెరిశారు.అయితే, భారత బౌలర్ల విజృంభణ కారణంగా మరెవరూ రాణించలేకపోయారు. ఫలితంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాతో పాటు రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.అయ్యర్ మెరుపు అర్ధ శతకంఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్లు కోల్పోగా.. శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. గిల్ పట్టుదలగా క్రీజులో నిలబడి కాస్త నెమ్మదిగానే ఆడగా.. అయ్యర్ మెరుపు అర్ధ శతకం(36 బంతుల్లో 59), అక్షర్ పటేల్(52) విలువైన హాఫ్ సెంచరీ చేసి నిష్క్రమించారు.ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుబ్మన్ గిల్కు తోడయ్యాడు. అప్పటికి గిల్ సెంచరీకి 19 పరుగులు, టీమిండియా విజయానికి 28 పరుగులు కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో స్ట్రైక్లో ఉన్న రాహుల్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కేఎల్ రాహుల్ వ్యవహారశైలిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించే క్రమంలో రాహుల్ తన ఆటపై శ్రద్ధ పెట్టలేక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడని మండిపడ్డాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘అతడు తన సహజశైలిలో ఆడాల్సింది.కానీ తన బ్యాటింగ్ పార్ట్నర్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. అందుకు ఫలితంగా ఏం జరిగిందో చూడండి. ఇది టీమ్ గేమ్. కాబట్టి ఏ ఆటగాడు కూడా ఇలా చేయకూడదు. స్ట్రైక్ రొటేట్ చేసేందుకు ఏదో కొత్తగా ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇది పూర్తిగా అతడు అనాసక్తితో ఆడిన షాట్’’ అని గావస్కర్ కేఎల్ రాహుల్ తీరును విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
క్రెడిట్ మొత్తం అతడికే.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
భారత్లో ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కోల్పోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్(India vs England ODIs)నూ ఓటమితోనే ఆరంభించింది. నాగ్పూర్లో గురువారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) విచారం వ్యక్తం చేశాడు.క్రెడిట్ మొత్తం అతడికేశుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోవడమే తమ పరాజయానికి కారణమని బట్లర్ అన్నాడు. అదే విధంగా.. టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు దక్కుతుందంటూ అతడి బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. కాగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన బట్లర్ తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు.అతడి రనౌట్లో అయ్యర్ కీలక పాత్రఈ క్రమంలో టీమిండియా సీనియర్ పేసర్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి ఓవర్లో పరుగులేమీ ఇవ్వలేదు. అనంతరం వన్డే అరంగేట్ర ఆటగాడు, మరో పేసర్ హర్షిత్ రాణా సైతం మెయిడిన్ వేసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్తో హర్షిత్ రాణాకు చుక్కలు చూపించాడు.ఒకే ఓవర్లో ఏకంగా ఇరవై ఆరు పరుగులు పిండుకుని రాణాను పనిష్ చేశాడు. కానీ మంచి జోరు మీదున్న సమయంలో అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా సాల్ట్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు- 43 రన్స్) వెనుదిరిగాడు.A moment of brilliance on the field by #ShreyasIyer and #PhilSalt is RUNOUT! 🙌🏻Start watching FREE on Disney+ Hotstar ➡️ https://t.co/gzTQA0IDnU#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18 1 & Colors Cineplex! pic.twitter.com/n9hvFfJQpE— Star Sports (@StarSportsIndia) February 6, 2025 ఇక మరో ఓపెనర్ బెన్ డకెట్ సైతం 29 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన రీఎంట్రీ స్టార్ జో రూట్(19) నిరాశపరిచాడు. ఇక హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి తరుణంలో బట్లర్, జాకొబ్ బెతెల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.బట్లర్ 67 బంతుల్లో 52 పరుగులు చేయగా.. బెతెల్ 64 బాల్స్ ఎదుర్కొని 51 రన్స్ సాధించాడు. కానీ మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. లియామ్ లివింగ్స్టోన్(5), బ్రైడన్ కార్సే(10), ఆదిల్ రషీద్(8) త్వరత్వరగా పెవిలియన్ చేరగా.. టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ 18 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38.4 ఓవర్లలోనే..ఫలితంగా ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) విఫలమైనా.. శుబ్మన్ గిల్ (87) అద్భుత అర్థ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీ20 తరహా మాదిరి 36 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపాడు. ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లోనే 52) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.మా ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ‘‘గెలవలేకపోయినందుకు బాధగా ఉంది. పవర్ ప్లేలో మేము అద్భుతంగా రాణించాం. కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఇంకో 40- 50 పరుగులు చేసేందుకు వికెట్ అనుకూలంగానే ఉంది. కానీ మేము ఆఖరిదాకా నిలవలేకపోయాం.ఏదేమైనా మా వాళ్లు శుభారంభం అందించారనేది వాస్తవం. ఆ సమయంలో మ్యాచ్ మాకు అనుకూలంగానే ఉంది. ఇక టీమిండియా విజయంలో శ్రేయస్ అయ్యర్కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్ల భారత్కు మెరుగైన భాగస్వామ్యం లభించింది. ఏదేమైనా.. ఇకపై మేము ఇన్నింగ్స్ ఆసాంతం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) పునరాగమనంలో అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన ఈ ముంబైకర్.. ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ అదే ఫామ్ను కొనసాగించాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు అర్ధ శతకంతో రాణించి భారత్ గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయ్యర్ షాకింగ్ కామెంట్స్ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్పై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. విజయానంతరం అతడొక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. నాగ్పూర్ వన్డే తుదిజట్టులో తనకు తొలుత అసలు స్థానమే లేదని చెప్పాడు. అయితే, ఆఖరి నిమిషంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి ఫోన్ కాల్ వచ్చిందని.. అప్పటికప్పుడు మ్యాచ్ కోసం తనను తాను మానసికంగా సన్నద్ధం చేసుకున్నట్లు తెలిపాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఇదొక సరదా ఘటన. గత రాత్రి నేను సినిమా చూస్తూ సమయం గడిపేద్దామని అనుకున్న. అయితే, అంతలోనే అకస్మాత్తుగా కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. విరాట్ మోకాలు ఉబ్బిపోయింది కాబట్టి.. నీకు ఆడే అవకాశం రావొచ్చు అని మా కెప్టెన్ చెప్పాడు.తుదిజట్టులో నాకసలు స్థానమే లేదువెంటనే నా గదికి పరిగెత్తుకుని వెళ్లాను. మరో ఆలోచన లేకుండా నిద్రకు ఉపక్రమించాను. ఆ క్షణంలో ఆ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు. నిజానికి తొలి వన్డేలో మొదట నాకు ఆడే అవకాశం రాలేదు.దురదృష్టవశాత్తూ విరాట్ గామపడటం వల్ల నన్ను పిలిచారు. అయితే, ఏదో ఒక సమయంలో కచ్చితంగా నాకు అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నన్ను నేను సన్నద్ధం చేసుకుంటూనే ఉన్నాను. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలో ఓసారి ఆసియా కప్ సమయంలో నేను గాయపడినపుడు నా స్థానంలో వేరొకరు వచ్చి శతకం బాదారు’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.అదే నాకు ఉపయోగపడిందిఇక దేశవాళీ క్రికెట్ ఆడటం వల్ల ప్రయోజనాలను వివరిస్తూ.. ‘‘గతేడాది డొమెస్టిక్ సీజన్ను నేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నా. ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలన్న అంశం గురించి నేను మరిన్ని పాఠాలు నేర్చుకునే వీలు కలిగింది. కాలానుగుణంగా నా ఆటకు మెరుగులు దిద్దుకున్నా. నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాను.ప్రతి విషయంలోనూ పరిపూర్ణత సాధించేందుకు కృషి చేశా. ముఖ్యంగా ఫిట్నెస్పై కూడా మరింత దృష్టి సారించాను. అదే నాకు ఇప్పుడిలా ఉపయోగపడింది’’ అని శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ముంబై తరఫున రంజీల్లో తాజా సీజన్లో అయ్యర్ ఓ ద్విశతకం బాదాడు. అంతేకాదు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా ముంబైకి టైటిల్ అందించాడు.నాలుగు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంఇక భారత్- ఇంగ్లండ్ వన్డే విషయానికొస్తే.. నాగ్పూర్లో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బట్లర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. భారత బౌలర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనలో టీమిండియా పందొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వన్డౌన్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87), నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 59), ఆల్రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ టార్గెట్ను పూర్తి చేసింది.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డుSHREYAS on F-IYER! 🔥@ShreyasIyer15 shifts gears by taking on Jofra Archer for back-to-back sixes! 💪Start watching FREE on Disney+ Hotstar#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18-1 & Colors Cineplex! pic.twitter.com/HrQ3WLGuPe— Star Sports (@StarSportsIndia) February 6, 2025 -
IND Vs ENG: శుబ్మన్, శ్రేయస్ సత్తా చాటగా...
స్వదేశంలో జరుగుతున్న పోరులో ఇంగ్లండ్పై భారత్ సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతోంది. టి20 సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు వన్డేల్లో గెలుపుతో బోణీ చేసింది. బౌలింగ్లో జడేజా, రాణా రాణించడంతో ముందుగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన జట్టు...ఆపై గిల్, శ్రేయస్, అక్షర్ బ్యాటింగ్తో 11.2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరింది. పేలవ బ్యాటింగ్తో ఇంగ్లండ్ మరోసారి పరాజయానికే పరిమితమైంది. నాగ్పూర్: ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత్ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (96 బంతుల్లో 87; 14 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59; 9 ఫోర్లు, 2 సిక్స్లు), అక్షర్ పటేల్ (47 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. రెండో వన్డే ఆదివారం కటక్లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... ఓపెనర్లు సాల్ట్, బెన్ డకెట్ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు) ఇంగ్లండ్కు శుభారంభం అందించారు. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ తొలి వికెట్కు 8.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. ఓపెనర్లను నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమవుతున్న స్థితిలో ఇంగ్లండ్ స్వయంకృతం ఇన్నింగ్స్ను మలుపు తిప్పింది. లేని మూడో పరుగు కోసం ప్రయత్నించిన సాల్ట్ను చక్కటి ఫీల్డింగ్తో శ్రేయస్ రనౌట్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జో రూట్ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో బట్లర్, బెతెల్ కలిసి ఇంగ్లండ్ను ఆదుకున్నారు. వీరిద్దరు భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడారు. 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే బట్లర్ నిష్క్రమించాడు. బెతెల్తో కలిసి ఐదో వికెట్కు అతను 14.3 ఓవర్లలో 59 పరుగులు జత చేశాడు. 62 బంతుల్లో బెతెల్ హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకోగా...తర్వాతి బ్యాటర్లెవరూ నిలవలేకపోవడంతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఆట ముగిసింది. రాణించిన అక్షర్... ఛేదనలో ఆరంభంలో భారత్ తడబడింది. 19 పరుగుల వద్దే యశస్వి జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2) వెనుదిరిగారు. అయితే గిల్, శ్రేయస్ భాగస్వామ్యంలో జట్టు దూసుకుపోయింది. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు బ్యాటింగ్తో అలరించాడు. ఆర్చర్ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదిన అతను, కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. ఈ జోరులో 30 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. గిల్తో కలిసి మూడో వికెట్కు 94 పరుగులు (10.4 ఓవర్లలో) జోడించిన తర్వాత శ్రేయస్ వెనుదిరిగాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ కూడా గిల్కు తగిన విధంగా సహకరించడంతో జట్టు లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో గిల్ 60 బంతుల్లో, అక్షర్ 46 బంతుల్లోనే హాఫ్ సెంచరీలను అందుకున్నారు. నాలుగో వికెట్కు 17.5 ఓవర్లలో 108 పరుగులు జత చేసిన అనంతరం అక్షర్ అవుటయ్యాడు. ఈ దశలో భారత్ విజయానికి 28 పరుగులు, గిల్ సెంచరీకి 19 పరుగులు అవసరమయ్యాయి. అయితే గిల్ సెంచరీ చేజార్చుకోగా, రాహుల్ (2) కూడా నిలబడలేదు. కానీ పాండ్యా (9 నాటౌట్), జడేజా (12 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు.26 పరుగులు సమర్పించుకున్నా... కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రాణా బౌలింగ్ ఆరంభంలో తడబడ్డాడు. ముఖ్యంగా అతని మూడో ఓవర్లో సాల్ట్ 3 సిక్స్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో సాల్ట్ వరుసగా 6, 4, 6, 4, 0, 6 బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే తన నాలుగో ఓవర్లో అతను సత్తా చాటి పరిస్థితిని మార్చాడు. మూడో బంతికి డకెట్ను అవుట్ చేసిన రాణా చివరి బంతికి బ్రూక్ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత కీలకమైన లివింగ్స్టోన్ వికెట్ కూడా రాణా ఖాతాలోనే చేరింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (రనౌట్) 43; డకెట్ (సి) జైస్వాల్ (బి) రాణా 32; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 19; బ్రూక్ (సి) రాహుల్ (బి) రాణా 0; బట్లర్ (సి) పాండ్యా (బి) అక్షర్ 52; బెతెల్ (ఎల్బీ) (బి) జడేజా 51; లివింగ్స్టోన్ (సి) రాహుల్ (బి) రాణా 5; కార్స్ (బి) షమీ 10; రషీద్ (బి) జడేజా 8; ఆర్చర్ (నాటౌట్) 21; మహమూద్ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్దీప్ 2; ఎక్స్ట్రాలు 5; మొత్తం (47.4 ఓవర్లలో ఆలౌట్) 248. వికెట్ల పతనం: 1–75, 2–77, 3–77, 4–111, 5–170, 6–183, 7–206, 8–220, 9–241, 10–248. బౌలింగ్: షమీ 8–1–38–1, రాణా 7–1–53–3, అక్షర్ 7–0–38–1, పాండ్యా 7–1–37–0, కుల్దీప్ 9.4–0–53–1, జడేజా 9–1–26–3. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 15; రోహిత్ శర్మ (సి) లివింగ్స్టోన్ (బి) మహమూద్ 2; గిల్ (సి) బట్లర్ (బి) మహమూద్ 86; శ్రేయస్ (ఎల్బీ) (బి) బెతెల్ 59; అక్షర్ (బి) రషీద్ 52; రాహుల్ (సి) అండ్ (బి) రషీద్ 2; పాండ్యా (నాటౌట్) 9; జడేజా (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 13; మొత్తం (38.4 ఓవర్లలో 6 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–113, 4–221, 5–225, 6–235. బౌలింగ్: ఆర్చర్ 7–1–39–1, మహమూద్ 6.4–0–47–2, కార్స్ 5–0–52–0, రషీద్ 10–1–49–2, బెతెల్ 3–0–18–1, లివింగ్స్టోన్ 5–0–28–0, రూట్ 2–0–10–0. సినిమా చూస్తుండగా... ‘నేను ఈ మ్యాచ్ ఆడతానని అనుకోలేదు. కాస్త ఎక్కువ సేపు మెలకువతో ఉండవచ్చు అనుకొని రాత్రి సినిమా చూస్తూ కూర్చున్నాను. అయితే కోహ్లి మోకాలికి గాయం అయిందని నువ్వు ఆడాల్సి ఉంటుందని కెప్టెన్ రోహిత్నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే సినిమాను సగంలోనే ఆపేసి వెంటనే వెళ్లి పడుకున్నాను’ –శ్రేయస్ అయ్యర్ జైస్వాల్ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ ముందే సిద్ధమైందని శ్రేయస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. గత కొంత కాలంగా వన్డేల్లో ఘనమైన రికార్డు ఉన్నా సరే... శ్రేయస్కు తుది జట్టులో చోటు లేకపోవడం ఆశ్చర్యకరం.గాయంతో దూరమైన కోహ్లి టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లి లేకుండానే భారత జట్టు తొలి వన్డేలో బరిలోకి దిగింది. కుడి మోకాలికి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. బుధవారం ప్రాక్టీస్ సమయంలోనే అతనికి ఈ గాయమైందని టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు. అయితే మ్యాచ్ ముందు రోజు టీమ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని చెప్పలేదు. గురువారం జట్టు సభ్యులందరితో కలిసి మైదానానికి వచ్చిన కోహ్లి స్వల్పంగా డ్రిల్స్లో పాల్గొన్నాడు. అయితే ఈ సమయంలో అతను కాలికి ప్లాస్టర్తో కనిపించాడు. యశస్వి జైస్వాల్, రాణా అరంగేట్రం పేస్ బౌలర్ హర్షిత్ రాణా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్తో వన్డే క్రికెట్లోకి అడుగు పెట్టారు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 257, 258వ ఆటగాళ్లుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. భారత్ తరఫున ఇప్పటికే 19 టెస్టులు, 23 టి20లు ఆడిన 23 ఏళ్ల ముంబై ఆటగాడు జైస్వాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా... ఢిల్లీకి చెందిన రాణా ఆ్రస్టేలియా గడ్డపై తొలి రెండు టెస్టులు ఆడాడు. ఆపై ఇంగ్లండ్తో గత శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్తో అంతర్జాతీయ టి20ల్లోకి అడుగు పెట్టాడు. -
రాణించిన జడ్డూ, శ్రేయస్, గిల్, అక్షర్.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో (England) మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే (47.4 ఓవర్లలో) ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (59), శుభ్మన్ గిల్ (87), అక్షర్ పటేల్ (52) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యలోనే భారత్ గెలుపు ఖరారు చేశాడు. లక్ష్యానికి చేరువైన తరుణంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (9 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) భారత్ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, జేకబ్ బేతెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.జడేజా@600ఈ మ్యాచ్లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ జడేజానే.అరంగ్రేటంలోనే మెరిసిన రాణా.. నిరాశపరిచిన జైస్వాల్ఈ మ్యాచ్తో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆతను.. ఆతర్వాత కోలుకుని మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ రాణాకు చుక్కలు చూపించాడు. ఇదే మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేసిన మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.కొనసాగిన రోహిత్ వైఫల్యాల పరంపరఅంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ మ్యాచ్లో అతను 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రోహిత్ ప్రదర్శనలు చాలా దారుణంగా ఉన్నాయి.గత 16 ఇన్నింగ్స్ల్లో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ చేసింది కేవలం 166 పరుగులే. విరాట్ దూరం.. పంత్కు నో ప్లేస్ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్లో ఆడలేదు. గాయాల కారణంగా కోహ్లి మ్యాచ్లకు దూరం కావడం చాలా అరుదు. ఈ మ్యాచ్లో మరో భారత స్టార్ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. వికెట్కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ అదనంగా వికెట్కీపింగ్ బాధ్యతలు మోశాడు. -
IND VS ENG 1st ODI: కొనసాగుతున్న రోహిత్ వైఫల్యాల పరంపర
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ (Rohit Sharma) వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. కొద్ది రోజుల కిందటి వరకు టెస్ట్లకే పరిమితమైన రోహిత్ బ్యాడ్ ఫామ్.. ఇప్పుడు వన్డేలకు కూడా పాకింది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. భారీ అంచనాల నడుమ ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలి బంతి నుంచే రోహిత్ కాన్ఫిడెంట్గా కనిపించలేదు. ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్లను ఎదుర్కొనేందుకు హిట్మ్యాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ సాకిబ్ మహమూద్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అత్యంత చెత్తగా ఔటైన అనంతరం రోహిత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నీ పని అయిపోయింది పో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ రంజీల్లో ఆడి, అక్కడా మర్యాద పోగొట్టుకున్నాడు. పసికూన జమ్మూ అండ్ కశ్మీర్తో జరిగిన మ్యాచ్లో వరుసగా 3, 28 పరుగులకు ఔటయ్యాడు. అంతకుముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ వైఫల్యాలు పతాక స్థాయికి చేరాయి. ఆ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సిరీస్లో ఫామ్తో తెగ ఇబ్బంది పడిన రోహిత్ చివరి టెస్ట్ నుంచి స్వతాహాగా తప్పుకున్నాడు. 2024-25 సీజన్లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు పరిశీలిస్తే దారుణంగా ఉన్నాయి. గత 16 ఇన్నింగ్స్లలో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. అతను బ్యాటింగ్ సగటు కేవలం 10.37గా ఉంది. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ కేవలం 166 పరుగులే చేశాడు.2024-25లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..652382520818113610392 (నేటి మ్యాచ్)టెస్ట్లతో పోలిస్తే వన్డేల్లో పర్వాలేదనిపించే రోహిత్.. ఇక్కడ కూడా విఫలం కావడంతో అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే తమ ఆరాధ్య ఆటగాడి పని అయిపోయిందా అనుకుంటూ మదనపడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం 249 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. శ్రేయస్ అయ్యర్ (59) మెరుపు ఇన్నింగ్స్తో భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. శుభ్మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (18) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 111 పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా ఇంకా బ్యాటింగ్కు రావాల్సి ఉంది. -
ఇంగ్లండ్తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయంనాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్లు శుభ్మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) అర్ద సెంచరీలు సాధించి టీమిండియాను గెలిపించారు.ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్లక్ష్యానికి 28 పరుగుల దూరంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం ఆదిల్ రషీద్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (52) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. లక్ష్యానికి 85 పరుగుల దూరంలో భారత్ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే మరో 85 పరుగులు చేయాలి. గిల్తో పాటు అక్షర్ (29) క్రీజ్లో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. శ్రేయస్ ఔట్మంచి టచ్లో కనిపించిన శ్రేయస్ అయ్యర్ 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జేకబ్ బేతెల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 113/3గా ఉంది. గిల్కు (28) జతగా అక్షర్ పటేల్ క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ఈ మ్యాచ్లో శ్రేయస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బేకబ్ బేతెల్ బౌలింగ్లో బౌండరీ బాది ఈ మైలురాయిని చేరుకున్నాడు. శ్రేయస్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 101/2గా ఉంది. శ్రేయస్తో పాటు శుభ్మన్ గిల్ (18) క్రీజ్లో ఉన్నాడు.వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్.. జోఫ్రా ఆర్చర్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/2గా ఉంది. శ్రేయస్ (18), శుభ్మన్ గిల్ (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ ఔట్రోహిత్ వైఫల్యాల పరంపర వన్డేల్లోనూ కొనసాగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చెత్త షాట్ ఆడి కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 19 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 248 పరుగులకే ఆలౌటైన ఇంగ్లండ్ నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను 248 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టగా.. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్241 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో ఆదిల్ రషీద్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో వికెట్ డౌన్.. లివింగ్స్టోన్ ఔట్183 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి లివింగ్స్టోన్ (5) ఔటయ్యాడు. హర్షిత్ రాణాకు ఇది మూడో వికెట్. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్ ఔట్170 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (52) ఔటయ్యాడు. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 170/5గా ఉంది. జేకబ్ బేతెల్ (22), లివింగ్స్టోన్ క్రీజ్లో ఉన్నారు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/430 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/4గా ఉంది. జేకబ్ బేతెల్ (18), జోస్ బట్లర్ (48) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. రూట్ ఔట్111 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో జో రూట్ (19) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన రాణాఅరంగ్రేటం పేసర్ హర్షిత్ రాణా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బేశాడు. 10వ ఓవర్ మూడో బంతికి డకెట్ను (32) ఔట్ చేసిన రాణా.. అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్ను డకౌట్ చేశాడు. 10 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. జో రూట్ (1), జోస్ బట్లర్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. సాల్ట్ రనౌట్ఇంగ్లండ్ జట్టు 75 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకరంగా కనిపించిన సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.రాణా బౌలింగ్లో చితక్కొట్టిన సాల్ట్ఆరో ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో వరుసగా 6,4,6,4,0,6 బాదాడు. ఒకే ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.కట్టుదిట్టంగా భారత పేసర్ల బౌలింగ్టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగగా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భారత బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్నే మెయిడిన్ వేసి శుభారంభం అందించాడు. అతడికి తోడుగా హర్షిత్ రాణా కొత్త బంతితో బరిలోకి దిగి వన్డేల్లో తన మొదటి ఓవర్నే మెయిడిన్(సున్నా పరుగులు) చేశాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 26/0 (5)బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్నాగ్పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే ఇవాళ (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆడటం లేదు. అతని కుడి మోకాలికి గాయమైంది. కోహ్లి గాయపడటంతో యశస్వి జైస్వాల్కు అవకాశం వచ్చింది. యశస్వి.. రోహిత్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు. యశస్వికి వన్డేల్లో ఇది తొలి మ్యాచ్ (డెబ్యూ). ఈ మ్యాచ్లో యశస్వితో పాటు హర్షిత్ రాణా కూడా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్కు కూడా అవకాశం దక్కలేదు. కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ బాధ్యతలను అదనంగా మోయనున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది.ఇంగ్లండ్ విషయానికొస్తే.. టీ20 సిరీస్ ఆడిన జట్టులో పెద్దగా మార్పులు లేవు. జో రూట్ కొత్తగా జట్టులో చేరాడు. ఈ సిరీస్ భారత్, ఇంగ్లండ్ జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లో మొత్తం మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ -
Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రం
టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్(India vs England) టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య నాగ్పూర్లో గురువారం మ్యాచ్ మొదలైంది. అయితే, దురదృష్టవశాత్తూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రంటాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ విషయాన్ని వెల్లడించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్తో తొలి వన్డేతో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యువ పేసర్ హర్షిత్ రాణా యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించాడు.‘‘టాస్ ఓడినా మరేం పర్లేదు. మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. బంతితో, బ్యాట్తో దూకుడుగానే రాణించాలని కోరుకుంటున్నాం. ఇదొక సరికొత్త ఆరంభం. చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం.జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మోకాలి సమస్య వల్ల కోహ్లి ఆడలేకపోతున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. ఇప్పటికే టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకున్న జైసూ.. తాజాగా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. మరోవైపు.. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల ఇంగ్లండ్తో నాలుగో టీ20 సందర్భంగా.. శివం దూబేకు కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. జో రూట్కు స్వాగతంమరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సరికొత్త ఉత్సాహంతో వన్డే బరిలో దిగుతున్నామని.. జో రూట్కు తిరిగి జట్టులోకి స్వాగతం పలికాడు. ఇక తాము ప్రస్తుతం పటిష్ట జట్టుతో తలపడుతున్నామన్న బట్లర్.. హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రతి విషయంలోనూ తమను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తాము ముగ్గురు పేసర్లతో పాటు ఒక అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను కూడా ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడే నిమిత్తం ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సూర్యకుమార్ సేన 4-1తో జయభేరి మోగించింది. అనంతరం గురువారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్కు తెరలేచింది.భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.భారత్తో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: హార్దిక్ పాండ్యా లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్కప్ ఆడాం: రోహిత్ శర్మ -
హార్దిక్ లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్కప్ ఆడాం: రోహిత్
హార్దిక్ పాండ్యా(Hardik Pandya) జట్టుతో లేకపోయినా తాము గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ సేవలు తమకు ముఖ్యమేనని.. అయితే, అతడి గైర్హాజరీలో కూడా తమవైన వ్యూహాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ సొంతగడ్డపై టీమిండియా తరఫున పునరాగమనం చేస్తున్నాడు.ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)లో హిట్మ్యాన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య నాగ్పూర్లో గురువారం తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా గురించి ప్రశ్న ఎదురైంది. ఒకవేళ పాండ్యా గాయపడితే అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరంటూ విలేకరులు అడిగారు.ప్రతిసారీ నెగటివ్గానే ఎందుకు?ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ‘‘ప్రతిసారీ ప్రతికూల అంశాల గురించే మనం ఎందుకు మాట్లాడాలి? ‘అతడు గాయపడతాడు.. ఇతడికి గాయమవుతుంది.. అప్పుడెలా? ఇలా జరిగితే జట్టుకు కష్టమే’.. అనే మాటలు ఎందుకు?సెలక్టర్లు, నాయకత్వ దళంలో ఇందుకు సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ మీకు చెప్పలేం కదా! కానీ మా వ్యూహాలు మాకుంటాయి. పాండ్యా గాయపడ్డా మేము వరల్డ్కప్ సజావుగానే పూర్తిచేశాం.అతడు గాయపడితే ఎలా అన్న ఆలోచన నాకు లేదుటోర్నీ మూడు లేదంటే నాలుగో మ్యాచ్లో అతడు గాయపడ్డాడనుకుంటా. ఆ తర్వాత కూడా మేము టోర్నీ ఆసాంతం మంచి క్రికెట్ ఆడాం. ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. అప్పటి దాకా అజేయంగా నిలిచాం. కాబట్టి ఇప్పుడు అతడు గాయపడితే ఎలా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు. ఒకవేళ అతడు గాయపడినా ఏం చేయాలో మాకు తెలుసు. జట్టు మొత్తం సమిష్టిగా రాణిస్తే మాకు ఎలాంటీ సమస్యా ఉండదు’’ అని రోహిత్ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా పాండ్యా గాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటిన పాండ్యాతద్వారా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.బ్యాట్తో, బంతితో రాణించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ వరల్డ్కప్-2024లో 144 పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 3/20తో రాణించి టీమిండియాకు విజయం అందించాడు. సౌతాఫ్రికా విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ల వికెట్లు తీసి రోహిత్ సేన చాంపియన్గా నిలవడంలో హార్దిక్ పాండ్యా ప్రధాన భూమిక పోషించాడు.ఇక ఇటీవల ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ హార్దిక్ పాండ్యా ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా నాలుగో టీ20లో మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 53 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం అతడు వన్డే సిరీస్కు సిద్ధమయ్యాడు. కాగా ఫిబ్రవరి 6(గురువారం), ఫిబ్రవరి 9(ఆదివారం), ఫిబ్రవరి 12(బుధవారం)న భారత్- ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు నాగ్పూర్, కటక్, అహ్మదాబాద్. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు టీమిండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా. చదవండి: CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్ను ఎలా పక్కనపెట్టారు?’ -
CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్ను ఎలా పక్కనపెట్టారు?’
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ బంగర్(Sanjay Bangar)మద్దతుగా నిలిచాడు. అతడిని ఇంగ్లండ్తో వన్డేలకు, చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ హైదరాబాదీ స్టార్ నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అని.. అలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం సరికాదని యాజమాన్యానికి హితవు పలికాడు.వన్డేలకు సిద్ధమైన రోహిత్ సేనకాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో టెస్టు సిరీస్ కోల్పోయిన అనంతరం.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లతో బిజీ అయింది. ఇప్పటికే సూర్యకుమార్ సేన ఐదు టీ20లలో నాలుగింట గెలిచి బట్లర్ బృందాన్ని చిత్తు చేసి సిరీస్ గెలుచుకోగా.. తాజాగా రోహిత్ సేన వన్డేలకు సిద్ధమైంది.అందుకే చోటివ్వలేదుఅయితే, ఆసీస్ పర్యటన తర్వాత విశ్రాంతి పేరిట సిరాజ్ను టీ20 సిరీస్ నుంచి తప్పించిన మేనేజ్మెంట్.. వన్డేల్లోనూ చోటివ్వలేదు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలోనూ అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. సిరాజ్ను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు.ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బంతితో రాణించగలుగుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడని రోహిత్ పేర్కొన్నాడు. అందుకే మహ్మద్ షమీతో పాటు అర్ష్దీప్ సింగ్కు బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో చోటిచ్చినట్లు తెలిపాడు.నాణ్యమైన బౌలర్.. అతడిని ఎలా పక్కనపెట్టారుఇక ఇంగ్లండ్తో గురువారం నుంచి టీమిండియా వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఈ విషయాలపై సంజయ్ బంగర్ స్పందించాడు. ‘‘జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించిన సిరాజ్ను పక్కనపెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కొన్ని మ్యాచ్లలో అయితే తన అద్భుత ప్రదర్శనతో అతడే జట్టును గెలిపించాడు.ఉదాహరణకు అహ్మదాబాద్ మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా విజయంలో తన పాత్ర కూడా ఉంది. అయితే, పాత బంతితో రాణింలేకపోతున్నాడన్న కారణం చూపి అతడిని పక్కనపెట్టడం సరికాదు. అతడొక క్వాలిటీ ప్లేయర్. ఏ దశలో బాగా బౌలింగ్ చేస్తాడన్న అంశంతో సంబంధం లేకుండా నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడికి జట్టులో చోటివ్వాలి’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.కాగా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లోనూ సిరాజ్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఏడు ఓవర్ల బౌలింగ్లో కేవలం 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ లంక 50 పరుగులకే కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా టీమిండియా సునాయాస విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్తో మ్యాచ్లోనూ రెండు కీలక వికెట్లు తీసి భారత్ విజయంలో పాలుపంచుకున్నాడు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా గడ్డ మీద మాత్రం సిరాజ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అలా అయితే సిరాజ్కు చోటుకానీ టెస్టులు.. వన్డే ఫార్మాట్ వేరు కాబట్టి సిరాజ్కు ఇంగ్లండ్తో వన్డేల్లోనైనా అవకాశం ఇచ్చి చూడాల్సిందని సంజయ్ బంగర్ పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోతే.. సిరాజ్కు దుబాయ్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉందని మరో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది. అనంతరం ఆదివారం(ఫిబ్రవరి 9) కటక్లో రెండో వన్డే.. అదే విధంగా అహ్మదాబాద్లో బుధవారం(ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ సంయుక్త వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్లో భారత్ తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
ఇంగ్లండ్తో వన్డేలు: రోహిత్, కోహ్లి ఫామ్లోకి వస్తారా?
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్(India vs England)తో గురువారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్ సంసిద్ధమవుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy) జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఇది కీలకంగా మారింది. అయితే టీమిండియా అభిమానుల దృష్టి మాత్రం సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీల పైనే ఉంది. మామూలుగా అయితే వారిద్దరి ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. కానీ ప్రస్తుతం వారిద్దరూ పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతూదండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.సీనియారిటీ పరంగా వారిద్దరూ జట్టులో చాల కీలకం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరూ ఆడటం ప్రారంభిస్తే జట్టులో ఉత్తేజం మామూలు స్థాయిలో ఉండదు. ఇక అందరికీ కోహ్లీ సంగతి తెలిసిందే. అతడు ఫీల్డ్ లో మెరుపు తీగలా కలయ తిరుగుతూ జట్టు సభ్యులని ఉత్తేజపరుస్తాడు. రోహిత్ శర్మ జట్టు సారథి. జట్టుని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే అది తప్పనిసరిగా అతని నాయకత్వ తీరు పై ప్రభావం చూపిస్త ఉందనడంలో సందేహం లేదు.పైగా వారిద్దరి వయస్సు కూడా ముప్పై అయిదు సంవత్సరాలు దాటడంతో ఈ ఇద్దరి పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి వస్తే తప్ప విమర్శలకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. వరుసగా విఫలమవుతూ ఒత్తిడిలో ఉన్న వారిద్దరూ రిటైర్మెంట్ గురుంచి ఆలోచిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.కోహ్లిని వెంబడిస్తున్న బలహీనతఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ దేశవాళీ రంజీ ట్రోఫీ లో రాణిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా వారి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్, కోహ్లీ ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే క్రికెట్లో ఆడారు. ఆ సిరీస్లో రోహిత్ 141.44 స్ట్రైక్ రేట్తో మూడు ఇన్నింగ్స్లలో 157 పరుగులు చేశాడు.అయితే కోహ్లీ మాత్రం మూడు మ్యాచ్లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీకి దీర్ఘకాలంగా ఉన్న బలహీనత మళ్లీ బయటపడింది. అతను ఆఫ్-స్టంప్ దిశగా వచ్చే బంతుల్ని ఛేజ్ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ నుంచి వైదొలగడానికి ముందు ఐదు ఇన్నింగ్స్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాటింగ్ దిగ్గజాలని గౌరవించండిఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల కు మద్దతుగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడటం వాస్తవమే అయినా వారిద్దరూ రిటైర్మెంట్ కావాలని కోరడం అన్యాయమని చెప్పాడు. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కఠినమైన దశలను ఎదుర్కొంటాడనీ.. విరాట్, రోహిత్ లు 'రోబోలు కాదని భారత్ అభిమానులు గుర్తించాలని పీటర్సన్ పేర్కొన్నాడు."నా కెరీర్లో కూడా ఇలాంటి సవాళ్ళే ఎదురయ్యాయి. రోహిత్, విరాట్ రోబోలు కాదు. వారు బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ సెంచరీ చేయడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో వారిద్దరూ విఫలమై ఉండవచ్చు. అంత మాత్రం వారిద్దరూ ఇంక అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరారని ముద్ర వేయడం సరికాదు’’ అని పీటర్సన్ అన్నాడు. వారిద్దరి రికార్డులని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల సానుభూతి చూపాలని పీటర్సన్ భారత్ అభిమానులకి పిలుపునిచ్చాడు.సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నుభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి ని సాధించిన బ్యాటర్గా సచిన్ సాధించిన రికార్డ్ కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ఈ మైలురాయి ని చేరాడనికి 350 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్ లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్ల సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు సాధించి ఈ రికార్డ్ ని అధిగమిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
CT 2025: వరుణ్ చక్రవర్తి రేసులో ఉన్నాడు: రోహిత్ శర్మ
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఇప్పట్లో మైదానంలో దిగే పరిస్థితి కనిపించడం లేదు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నాటికి కూడా అతడు అందుబాటులోకి వస్తాడా? లేదా అన్న విషయంపై కూడా సందిగ్దం నెలకొంది. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అంతా తానై పేస్ దళ బాధ్యతలు మోసిన బుమ్రా.. ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి(Back Spasm)తో బాధపడ్డాడు. మ్యాచ్ మధ్యలోనే ఆస్పత్రికి వెళ్లిన బుమ్రా.. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ జట్టుతో చేరాడు. కానీ.. బౌలింగ్ మాత్రం చేయలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లకు అతడు దూరమయ్యాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడికి ఫిట్నెస్ ఆధారంగా చోటు కల్పించింది.స్పందించిన రోహిత్ శర్మకానీ ఇప్పటికీ బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోలేదని వార్తలు వస్తుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై స్పందించాడు. ఇంగ్లండ్తో గురువారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా స్కానింగ్ రిపోర్టుల కోసం మేము ఎదురుచూస్తున్నాం.మరికొన్ని రోజుల్లో వైద్య బృందం వద్దకు నివేదిక వస్తుంది. ఆ తర్వాతే బుమ్రా ఫిట్గా ఉన్నాడా? లేదా అన్న అంశంపై స్పష్టత వస్తుంది. ఒకవేళ అతడు ఫిట్నెస్ సాధిస్తే ఇంగ్లండ్తో ఆఖరి వన్డేకు అందుబాటులోకి వస్తాడు’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.వరుణ్ పోటీలో ఉంటాడుఅదే విధంగా.. తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.‘‘టీ20 సిరీస్లో అతడు తన బౌలింగ్లో వైవిధ్యాన్ని చూపించాడు. పొట్టి ఫార్మాట్కు వన్డేలకు తేడా ఉంటుందని తెలుసు. అయితే, తాను ఏం చేయగలనో వరుణ్ నిరూపించాడు. అందుకే అతడిని కూడా మా ఆప్షన్లలో చేర్చుకున్నాం.ఈ సిరీస్ ద్వారా అతడి బౌలింగ్ సామర్థ్యాలు, నైపుణ్యాలను క్షుణ్ణంగా గమనించే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాం. అతడిని తుదిజట్టులోకి తీసుకుంటామా? లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను. అయితే, కచ్చితంగా అతడు మాత్రం పోటీలో ఉంటాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా ఇటీవల ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్లలో కలిపి పద్నాలుగు వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డే జట్టులోనూ అతడిని చేర్చారు. ఇదిలా ఉంటే.. 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తి ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 18 టీ20 మ్యాచ్లు ఆడి.. మొత్తంగా 33 వికెట్లు తీశాడు. ఇక.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. కాబట్టి ఇంగ్లండ్తో వన్డే సిరీస్ తర్వాత వరుణ్ ఈ మెగా టోర్నీకి ఎంపికవుతాడా? లేదా అన్న విషయం తేలుతుంది. ప్రస్తుతానికి అతడు ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్నాడు. చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం
భారత టెస్టు, వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు కోపం వచ్చింది. తన ఫామ్ గురించి ప్రశ్నించిన విలేకర్ల తీరుపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి పనికిరాని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని అతడు అసహనానికి లోనయ్యాడు . అదే విధంగా.. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలపై కూడా రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు.టెస్టుల్లో విఫలంగత కొంతకాలంగా టెస్టుల్లో రోహిత్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో.. అనంతరం ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి వైఫల్యాల పరంపర కొనసాగింది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో ఈ ముంబైకర్ ఐదు ఇన్నింగ్స్ ఆడి కేవలం 31 పరుగులే చేశాడు.ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా ఇటీవల ముంబై ఓపెనర్గా రంజీ ట్రోఫీ(Ranji Trophy) బరిలో దిగాడు రోహిత్ శర్మ. అయితే, అక్కడా ‘హిట్మ్యాన్’కు చేదు అనుభవమే ఎదురైంది. జమ్మూ కశ్మీర్తో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో మూడు, రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులకే అతడు పరిమితమయ్యాడు.అసలు ఇదెలాంటి ప్రశ్న?ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)కు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకు తన పేలవ ఫామ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు ఇదెలాంటి ప్రశ్న?.. ఆ ఫార్మాట్(టెస్టు) వేరు.. ఇది వేరు.దానికీ.. దీనికీ పోలిక ఎందుకు తెస్తున్నారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ‘‘క్రికెటర్లుగా మా కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజం. నా ప్రయాణంలో ఇలాంటివెన్నో చూశాను. నాకు ఇదేమీ కొత్త కాదు. ప్రతిరోజూ సరికొత్తదే. అలాగే ఆటగాడిగా నాకు ప్రతి సిరీస్ ఒక తాజా ఆరంభాన్ని ఇస్తుంది’’ అని రోహిత్ శర్మ సానుకూల దృక్పథంతో మాట్లాడాడు.ఇలాంటి సమయంలో ఇక చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తాను రిటైర్ కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘ఇంగ్లండ్తో మూడు వన్డేలు.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇలాంటి సమయంలో నా భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడటం సరైందేనా?నా గురించి ఎన్నో వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటన్నింటికి సమాధానం ఇచ్చేందుకు నేను ఇక్కడ కూర్చోలేదు. నాకు ప్రస్తుతం ఈ మూడు వన్డేలు.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ మాత్రమే ముఖ్యమే.ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ మ్యాచ్ల మీదే ఉంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని రోహిత్ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా రోహిత్ చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలో దిగాడు. గతేడాది లంకతో మూడు వన్డే మ్యాచ్లు ఆడి వరుసగా 58, 64, 35 పరుగులు చేశాడు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ📍 NagpurGearing up for the #INDvENG ODI series opener....in Ro-Ko style 😎#TeamIndia | @IDFCFIRSTBank | @ImRo45 | @imVkohli pic.twitter.com/gR2An4tTk0— BCCI (@BCCI) February 5, 2025 -
తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ
టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. జోస్ బట్లర్(Jos Buttler) కెప్టెన్సీలోని ఈ టీమ్లో మాజీ సారథి జో రూట్(Joe Root)కు స్థానం కల్పించింది. దీంతో.. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత అతడు తొలిసారిగా వన్డే ఫార్మాట్ బరిలో దిగనున్నాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్(India vs England)లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా.. బట్లర్ బృందం సూర్యకుమార్ సేన చేతిలో 4-1తో చిత్తుగా ఓడి.. సిరీస్ను కోల్పోయింది. కేవలం రాజ్కోట్ టీ20లో మాత్రమే గెలిచి వైట్వాష్ నుంచి తప్పించుకుంది.ఓపెనర్లుగా వారేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాగ్పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి) వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తాజాగా తమ తుదిజట్టును వెల్లడించింది. తొలి వన్డేలో ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ తమ స్థానాలను పదిలం చేసుకోగా.. జో రూట్ వన్డౌన్లో ఆడనున్నాడు. దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత రూట్ తిరిగి రాగా.. కెప్టెన్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో లియామ్ లివింగ్స్టోన్- జాకొబ్ బెతెల్ జోడీ కొనసాగనుంది.ముగ్గురు సీమర్లతోమరోవైపు.. తొలి వన్డేలో ఇంగ్లండ్ ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సేలతో పాటు సకీమ్ మహమూద్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తమ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ను ఆడించనుంది.మ్యాచ్ ఆరంభ సమయం ఇదేఇక భారత్- ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా రెండో వన్డే ఆదివారం(ఫిబ్రవరి 9) జరుగనుండగా.. అహ్మదాబాద్లో ఆఖరి వన్డే(ఫిబ్రవరి 12) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం భారత్- ఇంగ్లండ్ మధ్య మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు వన్డే మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరుజట్లకు ఈ సిరీస్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. వరుస చేదు అనుభవాల తర్వాతఇదిలా ఉంటే.. బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు గత రెండు వన్డే సిరీస్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతిలో ఓటమిపాలైంది. ఇక వన్డే వరల్డ్కప్-2023లోనూ ఇంగ్లండ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమై అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్లో రోహిత్ సేనకు ఏమేర పోటీ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇంగ్లండ్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన బ్రెండన్ మెకల్లమ్కు తొలుత టీ20 సిరీస్లో చేదు అనుభవం ఎదురైంది. అయినప్పటికీ వన్డే సిరీస్లోనూ అదే దూకుడును కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మేనేజ్మెంట్ చెప్పడం విశేషం. టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్. చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్సిగ్నల్! -
మా మధ్య అలాంటి పోటీ లేనేలేదు.. రోహిత్ భయ్యా మాత్రం: గిల్
జట్టు విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని తాను అభినందిస్తానని టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) అన్నాడు. తనకు ఎవరిపట్లా ద్వేషభావన లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడేటపుడు ఆటగాళ్లంతా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారని.. తాను కూడా అంతేనని పేర్కొన్నాడు.కాగా వన్డే, టీ20, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా ఒకప్పుడు శుబ్మన్ గిల్కు ప్రాధాన్యం దక్కిన విషయం తెలిసిందే. అయితే, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రాకతో టెస్టుల్లో ఓపెనర్గా గిల్ స్థానం గల్లంతైంది. ఇక అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన తర్వాత.. కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ కొత్త ఓపెనింగ్ జోడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.టీ20లలో కొత్త జోడీకేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్తో పాటు పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ టీ20లలో భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలతో సంజూ.. ఇంగ్లండ్తో స్వదేశంలో తాజా సిరీస్లో అద్భుత ప్రదర్శనతో అభిషేక్ ఓపెనర్లుగా తమ స్థానాలను పటిష్టం చేసుకున్నారు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో సంజూ విఫలమైనా అతడికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగానే ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. అభిషేక్ ఈ సిరీస్లో రికార్డు శతకం(54 బంతుల్లో 135)తో సత్తా చాటి ఓపెనర్గా పాతుకుపోయేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.‘టాక్సిక్’ కాంపిటిషన్?ఈ నేపథ్యంలో ఓపెనింగ్ స్థానం విషయంలో శుబ్మన్ గిల్కు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ పోటీగా తయారయ్యారని.. దీంతో అతడు ఇబ్బందులు పడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మంగళవారం మీడియా గిల్ను ప్రశ్నించగా.. హుందాగా స్పందించాడు.‘‘అభిషేక్ నాకు చిన్ననాటి నుంచే స్నేహితుడు. అదే విధంగా జైస్వాల్ కూడా నాకు ఫ్రెండే. మా మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని నేను అనుకోను. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు తాను గొప్పగా రాణించాలని కోరుకుంటాడు.అతడు బాగా ఆడకూడదనుకోనుప్రతి మ్యాచ్లోనూ అద్బుతంగా ఆడాలనే అనుకుంటాడు. అంతేకానీ.. ‘అతడు బాగా ఆడకూడదు. అలాగైతేనే నేను బాగుంటాను’ అనుకునే వాళ్లు ఎవరూ ఉండరు. జట్టు కోసం ఎవరైతే కష్టపడి ఆడి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటారో వారిని తప్పక అభినందించాలి’’ అని శుబ్మన్ గిల్ సమాధానం ఇచ్చాడు.ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వన్డేల్లో గత ఏడాదిన్నర కాలంగా రోహిత్ భాయ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మాకు అదొక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఇక ముందు కూడా అదే జోరును కొనసాగిస్తాడు’’ అని శుబ్మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో గిల్తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ.. జట్టు ఫైనల్ చేరడంలో కీలకప్రాత పోషించాడు. అంతేకాదు.. శ్రీలంకతో గతేడాది వన్డే సిరీస్లోనూ రెండు అర్ధ శతకాలు బాదాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 6) నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇందులో రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగనున్నారు.చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్సిగ్నల్! -
BCCI: రోహిత్ శర్మకు డెడ్లైన్?.. కోహ్లికి మాత్రం గ్రీన్సిగ్నల్?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికే సమయం సమీపిస్తోందా?.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో భారత్ను చాంపియన్గా హిట్మ్యాన్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే.ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ మునుపటిలా దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లలో అతడు చేసిన పరుగులు 58, 64, 35. వైట్బాల్ క్రికెట్లో ఈ మేర ఫర్వాలేదనిపించినా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు.కెప్టెన్గానూ చెత్త రికార్డుతొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో తేలిపోయిన రోహిత్ శర్మ.. కెప్టెన్గానూ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో భారత్ కివీస్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైంది. తద్వారా స్వదేశంలో ప్రత్యర్థి చేతిలో ఇంతటి పరాభవం చవిచూసిన తొలి భారత కెప్టెన్గా హిట్మ్యాన్ నిలిచాడు.అనంతరం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లోనూ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఫామ్లేమి కారణంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి స్వయంగా తప్పుకొన్నాడు. ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా 3-1తో ఓడిపోయింది.రోహిత్ శర్మకు డెడ్లైన్ఈ క్రమంలో 37 ఏళ్ల రోహిత్ శర్మ రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పట్లో తాను రిటైర్ కాబోనని ఈ కుడిచేతి వాటం బ్యాటర్ స్పష్టం చేశాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రోహిత్ శర్మకు డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడి అంతర్జాతీయ కెరీర్పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం.రోహిత్ శర్మ వయసుతో పాటు.. 2027 వన్డే వరల్డ్కప్ నాటికి జట్టును సన్నద్ధం చేసే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేర అతడితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్తో వన్డేలు, చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేసిన సమయంలో సెలక్టర్లు, బోర్డు పెద్దలు రోహిత్ శర్మతో సుదీర్ఘ చర్చలు జరిపారు.చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. రానున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ సీజన్కు.. అదే విధంగా వన్డే ప్రపంచకప్ టోర్నీకి జట్టును సిద్ధం చేసే విషయంలో యాజమాన్యానికి కొన్ని స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి.కోహ్లికి మాత్రం గ్రీన్సిగ్నల్?!కాబట్టి ఇప్పటి నుంచే జట్టు పరివర్తనపై దృష్టి పెట్టింది. అన్నీ సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది’’ అని పేర్కొన్నాయి. అయితే, మరో దిగ్గజ బ్యాటర్, 36 ఏళ్ల విరాట్ కోహ్లి విషయంలో మాత్రం బీసీసీఐ మరికొన్నాళ్ల పాటు వేచిచూడాలనే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.ఇక రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్తో వన్డేతో సిరీస్తో బిజీగా ఉన్నారు. ఇరుజట్ల మధ్య నాగ్పూర్లో గురువారం తొలి వన్డేతో మూడు మ్యాచ్ల సిరీస్ మొదలుకానుంది. అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను 4-1తో గెలుచుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డు -
విధ్వంసకర శతకం.. రెండో స్థానానికి దూసుకొచ్చిన అభిషేక్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో (ICC T20 Rankings) టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దుమ్మురేపాడు. ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడిన శర్మ.. ఒక్కసారిగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ప్రస్తుతం శర్మ కెరీర్లో అత్యుత్తమంగా 829 రేటింగ్ పాయింట్లు సాధించాడు. శర్మ దెబ్బకు సహచరుడు తిలక్ వర్మ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్తో సిరీస్లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి దిగజారాడు. ఆసీస్ విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ దెబ్బకు టాప్-10 (హెడ్ మినహా) బ్యాటర్లు తలో స్థానం కోల్పోయారు. ఇంగ్లండ్తో జరిగిన చివరి రెండు టీ20ల్లో సత్తా చాటిన శివమ్ దూబే 38 స్థానాలు ఎగబాకి 58వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో పర్వాలేదనిపించిన హార్దిక్ పాండ్యా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలింగ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్తో చివరి టీ20లో రెండు వికెట్లతో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆదిల్ రషీద్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున టాప్-5లో ఉన్న ఏకైక బౌలర్ వరుణ్ ఒక్కడే. తాజా ర్యాంకింగ్స్లో విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా.. హసరంగ, ఆడమ్ జంపా తలో స్థానం దిగజారి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్తో చివరి టీ20లో ఓ మోస్తరుగా రాణించిన భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరాడు. టీ20ల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్ అర్షదీప్ 8 నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఇవి మినహా బౌలర్ల విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. జట్ల ర్యాంకింగ్స్లో భారత్ ఏ జట్టుకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. 19561 పాయింట్లతో టీమిండియా టాప్లో కొనసాగుతుంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 12417 పాయింట్లు మాత్రమే కలిగి ఉంది. -
ఇంగ్లండ్తో తొలి వన్డే.. ప్రపంచ రికార్డుపై గురి పెట్టిన షమీ
ఫిబ్రవరి 6న ఇంగ్లండ్తో జరుగబోయే తొలి వన్డేలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ఓ వరల్డ్ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో షమీ ఐదు వికెట్లు తీస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్గా వరల్డ్ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) పేరిట ఉంది. స్టార్క్ 102 మ్యాచ్ల్లో 200 వికెట్లు పూర్తి చేశాడు. షమీ ప్రస్తుతం 100 ఇన్నింగ్స్ల్లో 195 వికెట్లు కలిగి ఉన్నాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..మిచెల్ స్టార్క్-102 మ్యాచ్లుసక్లయిన్ ముస్తాక్-104 మ్యాచ్లుట్రెంట్ బౌల్ట్-107 మ్యాచ్లుబ్రెట్ లీ-112 మ్యాచ్లుఅలన్ డొనాల్డ్-117 మ్యాచ్లుకాగా, 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా గాయపడిన షమీ.. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో షమీ వన్డేల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. షమీ చివరిగా ఆడిన వన్డే వరల్డ్కప్లో కేవలం ఏడు ఇన్నింగ్స్ల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్ల ఘనతలు ఉండటం విశేషం. షమీ చెలరేగడంతో భారత్ ఆ వరల్డ్కప్లో ఫైనల్ వరకు అజేయంగా చేరింది. అయితే తుది పోరులో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది.34 ఏళ్ల షమీ రీఎంట్రీ ఇచ్చాక ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో వికెట్లేమీ తీయలేదు. దీంతో అతన్ని నాలుగో టీ20లో పక్కన పెట్టారు. నాలుగో టీ20తో భారత్ సిరీస్ను కైవసం చేసుకోవడంతో షమీకి తిరిగి చివరి టీ20లో అవకాశం దక్కింది. ఈ సారి షమీ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో షమీ 3 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకప్రాత పోషించాడు.షమీ.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షమీపై భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ టోర్నీలో షమీ రాణిస్తే పూర్వవైభవం సాధిస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రయాణం ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. దీనికి ముందు ఫిబ్రవరి 6న భారత్ నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో తొలి వన్డే ఆడుతుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్లకు కటక్, అహ్మదాబాద్ వేదికలు కానున్నాయి. ఈ మూడు మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
వన్డే జట్టులోకి వచ్చేశాడు.. కానీ ఆ విషయంలో కష్టమే!
ఇంగ్లండ్తో గురువారం నాగ్పూర్లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్(India vs England) కోసం సంసిద్ధమవుతున్న భారత జట్టుతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా చేరడం ఆశించిన పరిణామమే. చక్రవర్తి వన్డే జట్టులోకి చేరడంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలో.. మరి కొద్దీ రోజుల్లో పాకిస్తాన్-దుబాయ్లలో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. అరంగేట్రం ఖాయమేఇక ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో వరుణ్ రాణించిన విషయం తెలిసిందే. వరుణ్ వన్డే టోర్నమెంట్లో కూడా అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. మంగళవారం విదర్భ క్రికెట్ స్టేడియం లో వరుణ్ ఒక గంటకు పైగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.ఇంగ్లండ్పై 4-1 తేడాతో గెలిచిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో చక్రవర్తి భారత బౌలర్లలో ప్రధాన ఆకర్షణ అయ్యాడు. కర్ణాటకకు చెందిన ఈ స్పిన్నర్ ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో కూడా బాగా రాణించిన స్పిన్నర్లలో చక్రవర్తి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. వరుణ్ ఈ టోర్నమెంట్లో 12.16 సగటుతో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు.అయితే వరుణ్ ఎవరి స్థానంలో భారత్ జట్టులో వస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ముందస్తు జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్లతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరి స్థానంలో వరుణ్ జట్టులోకి వస్తాడన్నది ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ తన తుది జట్టు ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక వరుణ్కి ఇప్పటికే తమిళనాడుకు చెందిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మద్దతు ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో అతనిని చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశాడు.ఇంగ్లండ్తో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశం ఉందని అశ్విన్ ముందే ప్రకటించాడు. "ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్లో వరుణ్కు ఆడే అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకి ఎంపిక చేసే అవంకాశముందని" అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే వరుణ్ పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ అతనికి అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. కొద్దో గొప్పో బ్యాటింగ్ వచ్చిన వారికే భారత్ జట్టు ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటె అవసరమైన పక్షంలో వారు తమ బ్యాటింగ్ తో జట్టు ని ఆదుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.ఇప్పటికే జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ లు లోయర్ మిడిల్ ఆర్డర్లో సమర్థులైన బ్యాటర్లుగా గుర్తింపు పొందారు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక మోస్తరుగా బ్యాటింగ్ లో రాణించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బౌలింగ్ ప్రతిభతో నిలకడ గా రాణించగలిగితేనే వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఇందుకు గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్ కీలకం కానుంది.అయితే భారత్ బౌలింగ్ మార్పులు చేర్పులు అంతా జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడే విషయం పై స్పష్టం వచ్చినట్లయితే జట్టులో మరో స్పిన్నర్ కి స్థానం లభించే అవకాశం ఉంది. బుమ్రా తన వెన్ను సమస్యల నుండి సకాలంలో కోలుకో లేకపోతే, భారత్ తన బౌలింగ్ ని పునః పరిశీలించాల్సిన ఆవరసం ఉంది. -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు
ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా కెప్టెన్ (Team India Captain) రోహిత్ శర్మను (Rohit Sharma) ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ సిరీస్లో హిట్మ్యాన్ మరో 134 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు సాధించేందుకు రోహిత్కు మరో 19 ఇన్నింగ్స్ల సమయం ఉంది.ప్రస్తుతం రోహిత్ 257 వన్డే ఇన్నింగ్స్ల్లో 31 సెంచరీలు, 57 అర్ద సెంచరీల సాయంతో 10866 పరుగులు చేశాడు. విరాట్ వన్డేల్లో 11,000 పరుగులను 222 ఇన్నింగ్స్ల్లోనే పూర్తి చేశాడు. వన్డేల్లో వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 276 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. రోహిత్ మరో 19 ఇన్నింగ్స్ల్లో 134 పరుగులు చేస్తే సచిన్ను వెనక్కు నెట్టి విరాట్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు.కాగా, ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో రోహిత్ శర్మ ఈ ఏడాది తొలిసారి టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. జనవరి ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రోహిత్ బరిలోకి దిగలేదు. ఫామ్లేమి కారణంగా రోహిత్ వాలంటీర్గా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం ఈ ఏడాది భారత్ ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడింది. గతేడాది టీ20 వరల్డ్కప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్లో ఆడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఇంగ్లండ్తో జరుగబోయే తొలి వన్డే రోహిత్కు ఈ ఏడాది భారత్ తరఫున తొలి మ్యాచ్ అవుతుంది.రంజీల్లోనూ నిరాశేఇంగ్లండ్తో టీ20 సిరీస్ జరిగే సమయంలో రోహిత్ రంజీ బరిలోకి దిగాడు. ఖాళీగా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లంతా రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం అనంతరం రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. గతేడాది నుంచి పెద్దగా ఫామ్లో లేని రోహిత్ రంజీ మ్యాచ్తో అయినా తిరిగి టచ్లోకి రావాలని భావించాడు. కానీ రోహిత్కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.ఫిబ్రవరి 6 నుంచి మొదలుఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్లను కటక్, అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మూడు మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.చిత్తుగా ఓడిన ఇంగ్లండ్వన్డే సిరీస్కు ముందు ఇంగ్లండ్ భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ముగిసిన చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అనంతరం బౌలర్లు తలో చేయి వేసి భారత్కు ఘన విజయాన్ని అందించారు. -
‘ఇగో’ చూపించాలనుకుంటే జట్టులో చోటుండదు: సంజూకు వార్నింగ్
టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson) ఆట తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్(Krishnamachari Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ ‘ఇగో’ చూపించాలనుకుంటే మాత్రం జట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఇకముందైనా షాట్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని సూచించాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో రెండు టీ20 శతకాలతో చెలరేగిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్తో సిరీస్లో పూర్తిగా విఫలమయ్యాడు.స్వదేశంలో బట్లర్ బృందంతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్(India vs England)లో సంజూ మొత్తంగా కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు.. పదే పదే ఒకే రీతిలో అవుటయ్యాడు. షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో విఫలమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్లకు సులువైన క్యాచ్లు ఇచ్చి వెనుదిరిగాడు.‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. ‘‘సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృథా చేసుకున్నాడు. ఐదోసారి కూడా అదే రీతిలో అవుటయ్యాడు.మరోసారి పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. నాకు తెలిసి.. అతడు తన ‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఇలా చేశాడని అనుకుంటున్నా. ‘లేదు.. లేదు.. నేను ఈ షాట్ కచ్చితంగా ఆడగలను’ అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.అసలు అతడు ఫామ్లేమితో సతమతమయ్యాడా? లేదంటే.. ‘ఇగో’ ట్రిప్నకు ఏమైనా వెళ్లాడా? నాకైతే అతడి గురించి ఏమీ ఏమీ అర్థం కావడం లేదు. ఈ సిరీస్లో.. నిజంగా తీవ్రంగా నిరాశపరిచాడు.జైస్వాల్ తిరిగి వస్తాడుసంజూను చాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదని అంతా మాట్లాడుకుంటున్నాం కదా! ఇదిలో ఇలాగే ఆడితే మాత్రం.. సెలక్టర్లు మాత్రం అతడిపై మరోసారి వేటు వేస్తారు. యశస్వి జైస్వాల్ తిరిగి వస్తాడు. తదుపరి టీ20 మ్యాచ్లో సంజూ శాంసన్ను కాదని యశస్వి జైస్వాల్ను ఆడిస్తారు’’ అని చిక్కా సంజూకు హెచ్చరికలు జారీ చేశాడు.గాయం.. ఆరు వారాలు దూరంఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా గాయపడ్డ సంజూ శాంసన్.. ఆరు వారాలు పూర్తిగా ఆటకు దూరం కానున్నాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్కు కేరళ జట్టుకు అతడు అందుబాటులో ఉండటం లేదు. కాగా ఇంగ్లండ్తో ఆదివారం ముంబైలో జరిగిన చివరిదైన ఐదో టి20లో బ్యాటింగ్ చేస్తుండగా సీమర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అతని కుడి చూపుడు వేలికి గాయమైంది.‘స్కానింగ్లో స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో శాంసన్ ఆరు వారాలు ఆటకు దూరమవుతాడు. పుణే వేదికగా ఈ నెల 8 నుంచి 12 వరకు జమ్మూ కశ్మీర్తో కేరళ ఆడే రంజీ క్వార్టర్ ఫైనల్ పోరులో అతను బరిలోకి దిగడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సామ్సన్ ఐపీఎల్ కల్లా అందుబాటులో ఉంటాడని బోర్డు పేర్కొంది.ఇక ఐపీఎల్లో సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను టీమిండియా 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం గురువారం(ఫిబ్రవరి 6) నాగ్పూర్లో జరిగే తొలి వన్డేతో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
CT 2025: అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్
టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England) ఆసాంతం అదరగొట్టాడు ఈ కర్ణాటక బౌలర్. ఐదు టీ20లలో కలిపి పద్నాలుగు వికెట్లతో మెరిసిన ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్.. భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.అంతేకాదు.. ఒక ద్వైపాక్షకి సిరీస్లో ఎక్కువ వికెట్లు తీసిన తొలి స్పిన్ బౌలర్గానూ వరుణ్ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న వరుణ్ చక్రవర్తికి వరుస అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.అతడిని జట్టులోకి తీసుకోండిఈ క్రమంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో వరుణ్ చక్రవర్తిని చేరిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అతడిని ఆడించాలని సూచించాడు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫ్రీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జనవరి 18న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అతడు చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తారనే భావిస్తున్నా.సమయం మించిపోలేదుఎందుకంటే.. ఈ టోర్నీలో ఆడుతున్న అన్ని దేశాలు తమ ప్రాథమిక జట్లను మాత్రమే ప్రకటించాయి. కాబట్టి వరుణ్కు ఈసారి ఛాన్స్ ఇస్తారేమో అనిపిస్తోంది. అయితే, నేరుగా ఐసీసీ టోర్నీ జట్టుకు ఎంపిక చేయడం అంత సులువేమీ కాదు.అదీగాక అతడు ఇంకా వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు. అందుకే తొలుత ఇంగ్లండ్తో వన్డేల్లో వరుణ్ని ఆడించి.. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేస్తే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అతడికి తప్పక అవకాశం ఇస్తారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన దుబాయ్లో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టులో నలుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను ఎంపిక చేసింది. ఇక వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకుంటే ఐదో స్పెషలిస్టు స్పిన్నర్ అవుతాడు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: ఇంగ్లండ్తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
సెంచరీ హీరో అభిషేక్ శర్మ ఫ్యామిలీని చూశారా? (ఫోటోలు)
-
IPL 2025: రాజస్థాన్ రాయల్స్కు బిగ్ షాక్.. సంజూ శాంసన్కు గాయం..?
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్కు (Rajasthan Royals) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ (Sanju Samson) శాంసన్ గాయపడినట్లు సమాచారం. ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా సంజూ చూపుడు వేలికి గాయమైనట్లు తెలుస్తుంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ సంధించిన బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది. ఈ సందర్భంగా సంజూ చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఆతర్వాత సంజూ బ్యాటింగ్ను కొనసాగించినప్పటికీ.. కొద్ది సేపటికే ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో సంజూ బరిలోకి దిగలేదు. అతని స్థానంలో ద్రువ్ జురెల్ వికెట్కీపింగ్ చేశాడు. పలు నివేదికల ప్రకారం.. సంజూ రానున్న ఆరు వారాలు క్రికెట్కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. దీంతో సంజూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా సంజూ రంజీ బరిలో ఉండడని సమాచారం. రంజీలో సంజూ ప్రాతినిథ్యం వహించే కేరళ, క్వార్టర్ ఫైనల్లో జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడాల్సి ఉంది.డగౌట్లో సంజూఇంగ్లండ్తో చివరి టీ20లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన సంజూ.. ఆతర్వాత స్కానింగ్కు వెళ్లలేదు. డగౌట్లో ఎక్స్ట్రా ప్లేయర్ జెర్సీ వేసుకుని కనిపించాడు. దీన్ని చూసి అభిమానులు సంజూకు ఏమీ కాలేదని ఊపిరి పీల్చుకున్నారు. అయితే మ్యాచ్ అనంతరం సంజూ చూపుడు వేలుకు బాగా వాపు వచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడు స్కానింగ్కు వెళ్లగా డాక్టర్లు ఫ్రాక్చర్ను గుర్తించినట్లు సమాచారం.ఘోర వైఫల్యంఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్లో అతను కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. ఈ సిరీస్లో సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రతి మ్యాచ్లో ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో సంజూ వీక్నెస్ను గుర్తించిన ఇంగ్లండ్ పేసర్లు పదేపదే ఒకే తరహా బంతులు వేసి అతన్ని ఔట్ చేశారు.4-1 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సంజూ విఫలమైనప్పటికీ భారత్ 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో సంజూ సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి టీ20లో విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్రేట్తో 276 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు.మార్చి 21 నుంచి ప్రారంభంఐపీఎల్ 2025 సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్లో రాజస్థాన్ ఆరంభ ఎడిషన్లో మాత్రమే టైటిల్ సాధించింది. గత సీజన్లో సంజూ శాంసన్ నేతృత్వంలోని ఈ జట్టు రెండో క్వాలిఫయర్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. -
టీ20లు సరే.. గంభీర్కు అసలు పరీక్ష ఇప్పుడే!
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఘోరంగా పరాజయం చవిచూసిన భారత్ జట్టు తిరిగి గాడిలో పడటం శుభపరిణామం. ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్టు పై 4-1 తేడాతో టీ20 సిరీస్ ను చేజిక్కించుకోవడం సానుకూలాంశం. కొత్త సంవత్సరంలో అదీ ఇంగ్లండ్పై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.అయితే ఈ సిరీస్కు ముందు భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. సొంత గడ్డపై 27 సంవత్సరాల తర్వాత శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ను కోల్పోవడం భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారి. న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్లో భారత్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన లో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ భారత్ జట్టు 3-1 తేడాతో ఓటమి పాలయింది. ఈ సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ఘోర వైఫల్యంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని, భారత్ జట్టు క్యాంప్ లో విభేదాలు తలెత్తాయని , కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ ఒకే పేజీలో లేరని విమర్శలు కూడా వచ్చాయి.టీ20ల్లో అద్భుతమైన ఫామ్ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీ20 ఫార్మాట్ లో భారత్ అద్భుతమైన ఫామ్ను కనబరుస్తోంది. 2024 ప్రారంభం నుంచి భారత్ జట్టు 29 మ్యాచ్లలో కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే ఓటమి చవిచూసింది. ఏదేమైనా.. గంభీర్ తన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ సిరీస్ అనంతరం మాట్లాడుతూ భారత్ జట్టుకి ఓడిపోతామనే భయం లేదు. మేము అధిక-రిస్క్, అధిక-రివార్డ్ క్రికెట్ ఆడతాం. ప్రతీసారి 250 పరుగులు చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు 130 పరుగులకే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని వ్యాఖ్యానించాడు.రోహిత్, కోహ్లీతో అభిప్రాయభేదాలు? అయితే భారత్ టి20 ఫార్మాట్ రికార్డును అటుంచితే , వన్డే , టెస్ట్ ఫార్మాట్లలో భారత్ ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. ఇక గురువారం నుంచి ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. త్వరలో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్ భారత్ కి ఎంతో కీలకం. ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నారు.వన్డే క్రికెట్లో వారిద్దరికీ అపారమైన నైపుణ్యం ఉందని, గంభీర్ అన్నాడు. వారిద్దరితో ఆస్ట్రేలియా పర్యటన లో అభిప్రాయభేదాలు తలెత్తయన్న పుకార్లకు చెక్ పెడుతూ, "వారిద్దరు ఎంతో అనుభవం ఉన్నవారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కానీ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం ప్రారంభించిన తర్వాత, విషయాలు సరిగ్గా జరగడం ప్రారంభిస్తాయి" అని గంభీర్ ఆ పుకార్లను కొట్టి పారేసాడు.అభిషేక్పై ప్రశంసలు కోచ్ గంభీర్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సాధించిన సెంచరీ పై ప్రశంసలు కురిపించాడు."నేను ఇలాంటి టి20 సెంచరీని ఇంతవరకు చూడలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి హేమాహేమీలైన బౌలర్లు ఎదుర్కొని అలా అలవోకగా షాట్ లు కొట్టడం సామాన్య విషయం కాదు. ఐపీఎల్ లో మీరు చాలా సెంచరీలు చూసి ఉండవచ్చు. కానీ ఇంగ్లండ్ వంటి జట్టు పై ఆ స్థాయి లో షాట్లు కొట్టి అభిషేక్ సెంచరీ సాధించాడు. అందుకే నేను చూసిన వాటిలో ఇది అత్యుత్తమైన టీ20 సెంచరీగా భావిస్తున్నాను" అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
వాళ్లిద్దరు మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతారు: కెవిన్ పీటర్సన్
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) మద్దతు పలికాడు. వీరిద్దరు మరో రెండేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారని అంచనా వేశాడు. ఇప్పటికే తామేంటో ‘విరాహిత్’ ద్వయం నిరూపించుకున్నారని.. కొత్తగా వాళ్లు చేయాల్సిందేమీ లేదని పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ఇద్దరు గత కొన్నినెలలుగా రోహిత్-విరాట్ పేలవ ఫామ్తో సతమతమవుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా రెడ్బాల్ క్రికెట్లో రోహిత్, కోహ్లి విఫలమవుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఇక ఆటకు సెలవిచ్చి యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లూ వినిపించాయి. ఇక టీ20 రిటైర్మెంట్ తర్వాత వీరిద్దరు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో మాత్రమే పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఇంగ్లండ్తో వన్డేలకు సిద్ధమయ్యారు.సొంతగడ్డపై జరగుతున్న ఈ సిరీస్ అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి బిజీ అవుతారు. ఈ మ్యాచ్లలో వీరి ఆట తీరు ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతారు‘‘ఎవరి ముందు వీరు ఇంకా నిరూపించుకోవాల్సిందేమీ ఏమీలేదు. ఇద్దరూ దిగ్గజాలే. అద్భుతమైన బ్యాటింగ్తో ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నారు. వారి వయసు 36- 37. అయినా సరే.. మరో రెండేళ్ల పాటు టీమిండియా తరఫున కొనసాగ గల సత్తా వారికి ఉంది.ఇక కోహ్లి విషయానికొస్తే.. భారత్ తరఫున అత్యుత్తమ చేజింగ్ కింగ్ అతడే. అంతేకాదు.. ప్రపంచంలో అతడి లాంటి ఆటగాడు మరొకరు లేరు. చేజింగ్లో దేశానికి ఇన్ని విజయాలు సాధించి పెట్టినవారూ లేరు. అతడు ఫామ్లోకి వచ్చాడంటే.. ఎవరూ ఆపలేరు.కోహ్లి- రోహిత్ ఆటను చూస్తే ముచ్చటేస్తుంది. రోహిత్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత అతడు ఎదిగిన తీరు అమోఘం’’ అని పీటర్సన్ కొనియాడాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాగ్పూర్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకానుంది. కటక్ వేదికగా ఫిబ్రవరి 9న రెండో వన్డే, అహ్మదాబాద్లో ఫిబ్రవరి 12న మూడో వన్డే జరుగుతుంది. ఇంగ్లండ్తో మూడు వన్డేలకు టీమిండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.భారత్తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. ఫిబ్రవరి 20న రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తటస్థ వేదికైన దుబాయ్లో టీమిండియా తమ మ్యాచ్లు ఆడుతుంది. ఇక దాయాది పాకిస్తాన్తో ఫిబ్రవరి 23న మ్యాచ్ ఆడనున్న భారత్.. లీగ్ దశలో ఆఖరిగా మార్చి రెండున న్యూజిలాండ్తో తలపడుతుంది. -
అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్! వైరల్
ఇంగ్లండ్తో ఐదో టీ20(India vs England)లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. సహచరులు విఫలమైన చోట.. ‘చేతికే బ్యాట్ మొలిచిందా’ అన్నట్లుగా.. పొట్టి ఫార్మాట్కే వన్నె తెచ్చేలా అతడి ఇన్నింగ్స్ సాగింది.మిగిలిన భారత ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టిన వేళ.. తను మాత్రం ‘తగ్గేదేలే’ అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్ను చితక్కొట్టిన విధానం టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్!ఈ క్రమంలో అభిషేక్ శర్మను ఉద్దేశించి సహచర ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్మేట్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కత్తి పట్టుకుని ఉన్న ఫొటోతో పాటు.. బ్యాట్తో అభిషేక్ పోజులిస్తున్న ఫొటోను పంచుకున్న నితీశ్.. ‘‘మెంటల్ నా కొడుకు’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు సెల్యూట్ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జతచేశాడు. పూనకం వస్తే అతడిని ఎవరూ ఆపలేరన్న అర్థంలో అభిషేక్ ఇన్నింగ్స్ను ప్రశంసిస్తూ ఇలా ఊరమాస్ కామెంట్ పెట్టాడు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం నితీశ్ వాడిన పదాన్ని తప్పుబడుతుండగా.. మరికొందరు అభిషేక్ ఆట తీరును వర్ణించేందుకే ఆ పదం వాడాడని పేర్కొంటున్నారు.150 పరుగుల తేడాతో మట్టికరిపించికాగా ఇప్పటికే ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ సూర్యకుమార్ సేన సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో బట్లర్ బృందాన్ని 150 పరుగుల తేడాతో మట్టికరిపించి ఏకపక్ష విజయం సాధించింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. ఇందుకు ప్రధాన కారణం అభిషేక్ శర్మ.ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ.. పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. అదే జోరులో 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, పదమూడు సిక్స్లు ఉన్నాయి.అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియాకు ఘన విజయం దక్కింది. దీంతో 4-1తో ఈ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను సూర్యకుమార్ సేన సొంతం చేసుకుంది.కాగా అంతర్జాతీయ టీ20లలో అభిషేక్ శర్మకు రెండో శతకం. ఇంతకు ముందు జింబాబ్వేపై అతడు సెంచరీ సాధించాడు. ఇక ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అభిషేక్ శర్మ.. గత సీజన్లో పరుగుల వరద పారించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్తో కలిసి విధ్వంసక బ్యాటింగ్తో చెలరేగి.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గాయం వల్ల దూరంఇక విశాఖపట్నం కుర్రాడు, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా సన్రైజర్స్కే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలోనూ ఇద్దరూ కలిసే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్తో స్నేహం దృష్ట్యా ఈ మేర కామెంట్ చేయడం గమనార్హం. కాగా నితీశ్ రెడ్డి కూడా ఇంగ్లండ్తో టీ20లకు సెలక్ట్ అయ్యాడు. కోల్కతా మ్యాచ్లో కూడా భాగమయ్యాడు. అయితే, గాయం కారణంగా అనంతరం జట్టుకు దూరమయ్యాడు. చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ వెన్నులో వణుకు..!
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ (RCB) వెన్నులో వణుకు మొదలైంది. ఈ సిరీస్లో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ ఆటగాళ్లు (England Players) దారుణంగా విఫలం కావడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్కు చెందిన ఫిల్ సాల్ట్ (Phil Salt), లియామ్ లివింగ్స్టోన్ (Liam Livingstone), జేకబ్ బేతెల్ను (Jacob Bethell) ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ ముగ్గురు తాజాగా ముగిసిన సిరీస్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక చతికిలపడ్డారు.రూ. 11.50 కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఫిల్ సాల్ట్ చివరి టీ20 మినహా సిరీస్ మొత్తంలో విఫలమయ్యాడు. రూ. 8.75 కోట్ల ధర పలికిన లియామ్ లివింగ్స్టోన్ ఒక్క మూడో టీ20లో మాత్రమే కాస్త పర్వాలేదనిపించాడు. రూ. 2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన జేకబ్ బేతెల్ సిరీస్ మొత్తంలో ఒక్క మ్యాచ్లో కూడా రాణించలేక తస్సుమనిపించాడు.భారీ అంచనాలతో కొనుగోలు చేసిన తమ ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఆర్సీబీ యాజమాన్యానికి గుబులు పుట్టుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి (మెగా వేలంలో) తప్పు చేశామా అని ఆత్మపరిశీలన చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లండ్ విధ్వంసకర వీరుల త్రయం తమ ఫేట్ను మారుస్తుందని ఆర్సీబీ అభిమానులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనల తర్వాత వారి అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. 'ఈ సాలా కప్ నమ్మదే' అంటూ ప్రతి యేడు డప్పు కొట్టుకునే ఆర్సీబీ అభిమానులకు 2025 సీజన్ ప్రారంభానికి ముందే తమ భవిష్యత్తు అర్దమైపోయింది. ఐపీఎల్ ప్రారంభానికి మరో నెలన్నర రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్యలో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ బ్యాటింగ్ త్రయం టీ20లు ఆడేది లేదు. మరి ఐపీఎల్ బరిలోకి నేరుగా దిగి వీరేమి చేస్తారో వేచి చూడాలి.కాగా, భారత్తో ముగిసిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 1-4 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ మొత్తంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్లోని మూడో టీ20లో మాత్రమే ఇంగ్లండ్ విజయం సాధించగలిగింది. ఆ మ్యాచ్లోనూ భారత ఆటగాళ్ల స్వయంకృతాపరాధాల వల్లే ఇంగ్లండ్ గెలవగలిగింది.ఈ సిరీస్లో భారత ప్రదర్శన విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ వీరలెవెల్లో విజృంభించగా.. బౌలింగ్లో వరుణ్ చక్రవరి అంచనాలకు మించి రాణించాడు. ఈ సిరీస్లో లీడింగ్ రన్ స్కోరర్.. లీడింగ్ వికెట్ టేకర్లు వీరిద్దరే. చివరి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్రేట్తో 276 పరుగులు చేశాడు. వరుణ్ ఈ సిరీస్లో 5 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. -
టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. ఇంగ్లండ్తో ఐదో టీ20లో భారీ తేడాతో గెలుపొంది.. ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టెస్టు హోదా కలిగిన జట్లలో ఇంత వరకు.. ఏ టీమ్కీ సాధ్యం కాని రీతిలో ‘బిగ్గెస్ట్ విక్టరీ(Biggest Victory)’ల విషయంలో అత్యంత అరుదైన ఘనత సాధించింది.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1(India Won Series With 4-1)తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కోల్కతాలో విజయంతో ఈ సిరీస్ ఆరంభించిన టీమిండియా.. చెన్నైలోనూ గెలిచింది. అయితే, ఆ తర్వాత రాజ్కోట్లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.ఏకపక్ష విజయం అయితే, పడిలేచిన కెరటంలా పుణె వేదికగా మరోసారి సత్తా చాటి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఈ నాలుగు మ్యాచ్లలో టీమిండియాకు ఇంగ్లండ్ గట్టి పోటీనివ్వగా.. నామమాత్రపు ఆఖరి టీ20లో మాత్రం సూర్యకుమార్ సేన ఏకపక్ష విజయం సాధించింది.అభిషేక్ పరుగుల సునామీవాంఖడేలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్(Jos Buttler) టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. మార్క్వుడ్ సంజూ శాంసన్(16)ను త్వరగానే పెవిలియన్కు పంపి ఇంగ్లండ్కు శుభారంభం అందించినా.. ఆ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. భారత మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడు కనబరిచాడు.ఇంగ్లండ్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ.. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో పరుగుల సునామీ సృష్టించాడు. ఇతరులలో తిలక్ వర్మ(15 బంతుల్లో 24), శివం దూబే(13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్లో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.బౌలర్ల విజృంభణ ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) అర్ధ శతకం సాధించగా.. మిగతా వాళ్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. బెన్ డకెట్ 0, కెప్టెన్ బట్లర్ 7, హ్యారీ బ్రూక్ 2, లియామ్ లివింగ్స్టోన్ 9, జాకొబ్ బెతెల్ 10, బ్రైడన్ కార్సే 3, జేమీ ఓవర్టన్ 1, జోఫ్రా ఆర్చర్ 1*, ఆదిల్ రషీద్ 6, మార్క్ వుడ్ 0 పరుగులు చేశాడు.ప్రపంచంలోనే ఏకైక జట్టుగాఫలితంగా 97 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. పొదుపుగా బౌలింగ్ చేస్తూనే భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, శివం దూబే, అభిషేక్ శర్మచ వరుణ్ చక్రవర్తి తలా రెండు.. రవి బిష్ణోయి ఒక వికెట్ తీశాడు. దీంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. టీమిండియా చేతిలో 150 పరుగుల భారీ తేడాతో మట్టికరిచింది.కాగా టీమిండియా అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థి జట్టుపై 150 పైచిలుకు పరుగులతో విజయం సాధించడం ఇది రెండోసారి. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. అంతేకాదు.. అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్లపై ఎక్కువసార్లు(4) గెలుపొందిన టీ20 టీమ్గానూ తన రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఇక వన్డేల్లోనూ బిగ్గెస్ట్ విక్టరీ సాధించిన జట్టుగా టీమిండియాకు రికార్డు ఉంది. శ్రీలంకపై 2023లో తిరువనంతపురం వేదికగా 317 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్లు(ఫుల్ మెంబర్ సైడ్)👉ఇండియా- న్యూజిలాండ్పై 2023లో అహ్మదాబాద్ వేదికగా 168 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఇంగ్లండ్పై 2025లో ముంబై వేదికగా 150 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్- వెస్టిండీస్పై 2018లో కరాచీ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఐర్లాండ్పై 2018లో డబ్లిన్ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇంగ్లండ్- వెస్టిండీస్పై 2019లో బెసెటెరె వేదికగా 137 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- సౌతాఫ్రికాపై 2024లో జొహన్నస్బర్గ్ వేదికగా 135 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య -
అంతర్జాతీయ టీ20లలో సంజూ శాంసన్ అరుదైన ఘనత
సౌతాఫ్రికా గడ్డపై శతకాలతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్ సంజూ శాంసన్(Sanju Samson).. స్వదేశంలో మాత్రం తేలిపోయాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England)లో పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ ఐదో టీ20 సందర్భంగా అతడు అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ(Rohit Sharma), యశస్వి జైస్వాల్తో కలిసి ఎలైట్ క్లబ్లో చేరాడు.కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సంజూ శాంసన్ రెండు అంతర్జాతీయ టీ20 శతకాలు బాదిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్తో సొంతగడ్డపై కూడా బ్యాట్ ఝులిపిస్తాడని ఎదురుచూసిన అభిమానులను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ నిరాశపరిచాడు.ఆరంభం బాగున్నాకోల్కతాలో 26 పరుగులతో ఫర్వాలేదనిపించిన సంజూ.. ఆ తర్వాత చెన్నైలో ఐదు, రాజ్కోట్లో మూడు, పుణెలో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో సంజూ శాంసన్ అంచనాలు అందుకోలేకపోయాడు. ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా అదే జోరును కొనసాగించలేకపోయాడు.తొలి బంతికే సిక్స్ బాదిమొత్తంగా ఏడు బంతుల్లో పదహారు పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్లో మరో పేసర్ జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్లోనూ సంజూ విఫలమైనప్పటికీ.. తన ఇన్నింగ్స్ను సిక్సర్తో ఆరంభించడం ద్వారా అరుదైన ఫీట్ నమోదు చేశాడు.టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఓ మ్యాచ్లో తొలి బంతికే సిక్స్ బాదిన మూడో భారత క్రికెటర్గా సంజూ చరిత్రకెక్కాడు. అంతకుముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించారు. కాగా ఇంగ్లండ్తో ఐదో టీ20లొ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో డీప్ స్వ్కేర్ లెగ్ మీదుగా ఫ్లాట్ సిక్స్(70 మీటర్లు) బాదాడు. ఇక తొలి ఓవర్లోనే అతడు మరో సిక్స్, ఫోర్ బాదడం విశేషం.సంజూకు భారత మాజీ క్రికెటర్ మద్దతుఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ ఇంగ్లండ్తో ఐదు టీ20లలో కలిపి కేవలం 51 పరుగులే చేశాడు. దీంతో అతడి నిలకడలేమి ఆట తీరుపై మరోసారి విమర్శలు వస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు మద్దతుగా నిలిచాడు. ‘‘టీ20 క్రికెట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు.. ముఖ్యంగా బ్యాటింగ్ టాలెంట్ కోసం చూస్తున్నట్లయితే.. వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.మ్యాచ్పై వారి ప్రభావం ఎలా ఉంటోంది.. జట్టు కోసం వారు ఏం చేయగలరన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంజూ శాంసన్ విషయానికొస్తే.. కఠినమైన పిచ్లపై అతడు అద్బుతమైన శతకాలతో జట్టును గెలిపించాడు.టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిదికాబట్టి అలాంటి వాళ్లు కొన్నిసార్లు విఫలమైనా పెద్దగా పట్టించుకోకూడదు. అయితే, దీర్ఘకాలంలో ఇదే పునరావృతమైనా కాస్త వేచిచూడాలి. టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిది. దూకుడుగా ముందుకెళ్లేందుకు రిస్క్ తీసుకుంటే ఇలాంటివి తప్పవు. ఇలాంటి వాళ్లకు ఫామ్లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు’’ అని సంజయ్ మంజ్రేకర్ సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, ఐదో టీ20 ఆరంభానికి ముందు అతడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన క్రికెటర్లురోహిత్ శర్మ- 2021లో ఇంగ్లండ్పై- అహ్మదాబాద్ వేదికగా ఆదిల్ రషీద్ బౌలింగ్లోయశస్వి జైస్వాల్- 2024లో జింబాబ్వేపై- హరారే వేదికగా సికందర్ రజా బౌలింగ్లోసంజూ శాంసన్- 2025లో ఇంగ్లండ్పై- ముంబై వేదికగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్All those fake narrative PR by Rishabh Pant against Sanju Samson that "can't play extra pace, can't play short ball, can't play Archer". Sanju silenced all those critics by his performance🥵 . 6️⃣, 6️⃣ and 4️⃣ vs Jofra Archer in the FIRST over of the match. pic.twitter.com/YmAxAqoXrw— Rosh🧢 (@ImetSanjuSamson) February 3, 2025 -
వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య
ఇంగ్లండ్తో ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం(India Beat England)పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించాడు. సమిష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైనందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారని.. అందుకు తగ్గ ఫలితాలను మైదానంలో చూస్తున్నామంటూ సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు.4-1తో కైవసంఇక ఎక్కువసార్లు తాము రిస్క్ తీసుకునేందుకే మొగ్గుచూపుతామన్న సూర్య.. అంతిమంగా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపాడు. కాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్కతాలో విజయంతో సిరీస్ను ఆరంభించిన సూర్యసేన.. చెన్నైలోనూ అదే ఫలితం పునరావృతం చేసింది.అనంతరం రాజ్కోట్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు.. పుణెలో విజయంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20లోనూ అద్భుత ఆట తీరు కనబరిచింది. వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.అభిషేక్ శర్మ ఊచకోతఓపెనర్ సంజూ శాంసన్(16) మరోసారి వైఫల్యాన్ని కొనసాగించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) మాత్రం పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో తిలక వర్మ(24), శివం దూబే(13 బంతుల్లో 30) మాత్రమే రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ బృందానికి టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు. బెన్ డకెట్ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు తమ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.97 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) ఒక్కడు కాసేపు పోరాడగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఏమాత్రం సహకారం అందలేదు. ఫలితంగా 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో 150 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దూబే రెండు, స్పిన్నర్లు వరుణ్ చక్రర్తి రెండు, అభిషేక్ శర్మ రెండు, రవి బిష్ణోయి ఒక వికెట్ తీశారు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.రిస్క్ అని తెలిసినాఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ‘‘జట్టులోని ఏ సభ్యుడైతే ఈరోజు రాణించగలడని భావిస్తానో.. అతడిపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాను. నెట్స్లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతున్నారు. నాకు ఎప్పుడైతే వారి అవసరం ఉంటుందో అప్పుడు కచ్చితంగా రాణిస్తున్నారు.మ్యాచ్కు ముందు రచించిన ప్రణాళికలకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒక్కోసారి రిస్క్ అని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం.వాళ్లిద్దరు అద్భుతంఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఈరోజు అద్భుతంగా సాగింది. టాపార్డర్లో ఓ బ్యాటర్ ఇలా చెలరేగిపోతుంటే చూడటం ముచ్చటగా అనిపించింది. ఈ ఇన్నింగ్స్ చూసి అతడి కుటుంబం కూడా మాలాగే సంతోషంలో మునిగితేలుతూ ఉంటుంది.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్లను చక్కగా వినియోగించుకుంటున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అందుకు ఫలితమే ఈ సిరీస్లో అతడి ప్రదర్శన. అతడి వల్ల జట్టుకు అదనపు శక్తి లభిస్తోంది. అతడొక అద్భుతం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఈ సిరీస్లో వరుణ్ చక్రవర్తి పద్నాలుగు వికెట్లు తీశాడు.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్An impressive way to wrap up the series 🤩#TeamIndia win the 5th and final T20I by 150 runs and win the series by 4-1 👌Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/aHyOY0REbX— BCCI (@BCCI) February 2, 2025 -
‘ఇలాంటి టీ20 సెంచరీ చూడనేలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు’
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్తో చివరి టీ20లో భారీ సెంచరీతో చెలరేగిన అభిషేక్ ఆటతీరు అమోఘమని కొనియాడాడు. ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ తానెప్పుడూ చూడలేదని గంభీర్ అన్నాడు. పరుగుల సునామీకాగా ఇంగ్లండ్తో నామమాత్రపు ఐదో టీ20(India vs England)లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. పదిహేడు బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోకుండా చేసి.. మొత్తంగా 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏకంగా పదమూడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో అభిషేక్ పరుగుల వరద పారిస్తుంటే వాంఖడేలో నేరుగా ఈ అద్బుతాన్ని వీక్షించిన ప్రేక్షకులతో పాటు.. టీవీలు, ఫోన్లలో మ్యాచ్ చూస్తున్న క్రికెట్ ప్రేమికులూ ఆనందంతో మురిసిపోయారు.ప్రశంసల వర్షంఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్కు ఫిదా అయిపోయాడు. ‘అభిషేక్ నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. కొత్త తరం ఆటగాళ్లు భయం లేకుండా దూకుడుగా ఆడుతున్నారు. అలాంటి వాళ్లకు అండగా నిలుస్తాం.ఇలాంటి టీ20 సెంచరీ చూడనేలేదుఇంగ్లండ్ బౌలర్లు 140–150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతుంటే అభిషేక్ అలవోకగా సిక్సర్లు బాదాడు. దీనికంటే గొప్ప టీ20 శతకాన్ని చూడలేదు. ఫలితాలు అనుకూలంగా వస్తే అంత సవ్యంగా సాగుతుంది. పరాజయాలు ఎదురైనప్పుడే జట్టుపై విమర్శలు వస్తాయి. అలాంటి కష్ట కాలాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం.వన్డేల్లోనూ ఇదే దూకుడుఈ జట్టు చాలా కాలంగా కలిసి ఆడుతోంది. వారి మధ్య మంచి అనుబంధం ఉంది. 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం అంటే ఎలా ఉంటుందో మా ఆటగాళ్లకు తెలుసు. వన్డేల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తాం’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్లో భాగంగా కోల్కతా, చెన్నై మ్యాచ్లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్కోట్లో జరిగిన మూడో టీ20లో ఓటమిపాలైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్లో విజయం సాధించి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.247 పరుగులు ఈ క్రమంలో వాంఖడే మైదానంలో ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించిన ఇంగ్లండ్ ఆశలపై భారత జట్టు నీళ్లు చల్లింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. అభిషేక్ శర్మ సునామీ శతకం కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో.. తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది.ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ఫిలిప్ సాల్ట్(23 బంతుల్లో 55) మెరుపు హాఫ్ సెంచరీతో అలరించినా.. మిగతా వాళ్లలో జాకొబ్ బెతల్(10) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు కూల్చగా.. రవి బిష్ణోయి ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్పై 150 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్ను 4-1తో ముగించింది. తదుపరి ఫిబ్రవరి 6 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
అభిషేక్ శర్మ విధ్వంసం..భారత్ గెలుపు సిరీస్ కైవసం (ఫొటోలు)
-
IND VS ENG 5th T20: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా (Team India) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్లో (Bilateral Series) అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్లో హోల్డర్ డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను పేకమేడలా కూల్చారు. బ్యాటింగ్లో చెలరేగిన అభిషేక్ బౌలింగ్లోన సత్తా చాటి 2 వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.ప్రస్తుత సిరీస్లో వరుణ్ ప్రదర్శనలు..తొలి టీ20-3/23 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)రెండో టీ20-2/38మూడో టీ20-5/24 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)నాలుగో టీ20-2/28ఐదో టీ20-2/25 -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం
ఐదో టీ20లో భారత్ ఘన విజయంముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ను 150 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను పేకమేడలా కూల్చారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్59 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బిష్ణోయ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ (2) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్48 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ను (7) వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు పంపాడు. టార్గెట్ 248.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్కు శుభారంభమే లభించింది. అయితే ఆ జట్టు 3వ ఓవర్ తొలి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో బెన్ డకెట్ డకౌటాయ్యాడు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 48/1గా ఉంది. ఫిల్ సాల్ట్ (39) ధాటిగా ఆడుతున్నాడు. అభిషేక్ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (247/9) చేసింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్.. సెంచరీని 37 బంతుల్లో శతక్కొట్టాడు. టీ20ల్లో అభిషేక్ది భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), సెంచరీ (37). టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. అభిషేక్కు టీ20ల్లో ఇది రెండో సెంచరీ.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135) కూడా అభిషేక్దే. అలాగే ఓ టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13) కొట్టింది కూడా అభిషేకే. అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ విధ్వంసం.. 17 బంతుల్లో అర్ధ శతకంఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సంజూ ఔటయ్యాక ఒక్కసారిగా బీస్ట్ మోడ్లోకి వచ్చిన అభిషేక ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 17 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత అభిషేక్దే ఫాస్టెస్ట్ ఫిఫ్టి. అభిషేక్ దెబ్బకు భారత్ తొలి 6 ఓవర్లలో 95 పరుగులు చేసిం్ది. అభిషేక్ 58, తిలక్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.సంజూ శాంసన్ మరోసారి విఫలంటీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు.వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విఫలమైనా టీమిండియా మేనేజ్మెంట్ సంజూకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో తొలి బంతికే సిక్సర్ బాదిన సంజూ.. ఆతర్వాత అదే ఓవర్లో మరో సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే సంజూ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లోనే మార్క్ వుడ్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 2) నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున అర్షదీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి రాగా.. గత మ్యాచ్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన సాకిబ్ మహమూద్కు ఇంగ్లండ్ రెస్ట్ ఇచ్చింది. సాకిబ్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి హర్షిత్ రాణా వస్తాడు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ అరంగేట్రంలోనే అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy)నూ హర్షిత్ ఆడవచ్చని అంచనా వేశాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్ రాణా.. గతేడాది ఆ జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. నాడు కోల్కతా మెంటార్గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్షిత్కు జాతీయజట్టులో త్వరగానే అవకాశం వచ్చింది.ఆసీస్లో అరంగేట్రంఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పెర్త్ టెస్టులో నాలుగు వికెట్లతో మెరిశాడు. అయితే, అంతకంటే ముందే పరిమిత ఓవర్ల సిరీస్కు ఎంపికైనా తుదిజట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు.కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చికానీ అనూహ్యంగా ఇంగ్లండ్తో నాలుగో టీ20 సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు. శివం దూబేకు కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి మూడు వికెట్లు కూల్చాడు. హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్(9)తో పాటు జాకొబ్ బెతల్(6) రూపంలో కీలక వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్ జేమీ ఓవర్టన్(19)ను కూడా అవుట్ చేశాడు.‘కంకషన్ సబ్స్టిట్యూట్’ వివాదం సంగతి పక్కనపెడితే... కీలక సమయంలో కీలక వికెట్లు తీయడం ద్వారా టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన హర్షిత్ రాణాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రన్ అక్మల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు‘‘హర్షిత్ రాణా బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. ఒకవేళ బుమ్రా గనుక ఫిట్గా లేకపోతే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయం. పేస్లో వైవిధ్యం చూపడంతో పాటు.. మూడు వికెట్లు తీసిన తీరు ఆకట్టుకుంది’’ అని కమ్రన్ అక్మల్ పేర్కొన్నాడు.అదే విధంగా స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి మాట్లాడుతూ.. ‘‘రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నారు. వీరిద్దరు గనుక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉంటే టీమిండియా స్పిన్ విభాగం మరింత పటిష్టంగా ఉండేది’’ అని కమ్రన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.మరోవైపు.. పాకిస్తాన్ మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం రవి బిష్ణోయి ప్రదర్శనను ప్రశంసించాడు. వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేస్తున్న తీరు ఎంతో బాగుందని కొనియాడాడు. గత మ్యాచ్లో తప్పులను సరిదిద్దుకుని నాలుగో టీ20లో రాణించాడని పేర్కొన్నాడు.బుమ్రాకు వెన్నునొప్పికాగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్లో అతడికి ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు.అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం బుమ్రాకు ఫిట్నెస్ ఆధారంగా చోటిచ్చారు. ఒకవేళ టోర్నీ నాటికి బుమ్రా పూర్తి ఫిట్గా లేకుంటే.. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్కు చాన్స్ ఉంటుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే, కమ్రన్ అక్మల్ మాత్రం హర్షిత్ రాణా పేరును తెరమీదకు తెచ్చాడు.టీ20 సిరీస్ మనదేఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. కోల్కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రాజ్కోట్లో మాత్రం విఫలమైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో టీ20లో జయకేతనం ఎగురవేసి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి టీ20 జరుగుతుంది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
‘ఐదో టీ20లో తప్పక ఆడిస్తాం.. అతడి రాకతో జట్టులో జోష్’
దాదాపు ఏడాది తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami). ఇంగ్లండ్తో మూడో టీ20(India vs England) సందర్భంగా భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మంగళవారం నాటి(జనవరి 28) ఈ మ్యాచ్లో షమీ కొత్త బంతితో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా రాజ్కోట్ టీ20లో మూడు ఓవర్లకే పరిమితమైన షమీ.. మొత్తంగా 25 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో నాలుగో టీ20లో అతడికి ఆడే అవకాశం రాలేదు. షమీపై వేటు వేసిన టీమిండియా యాజమాన్యం యువ తరంగం అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh)ను మళ్లీ వెనక్కి పిలిపించింది.తుది జట్టులోకి వస్తాడా? లేదా? ఈ నేపథ్యంలో షమీ మళ్లీ తుది జట్టులోకి వస్తాడా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో ఐదో టీ20లో షమీని ఆడిస్తామనే సంకేతాలు ఇచ్చాడు. నాలుగో టీ20 జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షమీ బాగానే ఉన్నాడు.అతడు చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. వార్మప్ మ్యాచ్లలోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్లో అతడికి ఆడే అవకాశం రావచ్చు. అయితే, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం.భారత క్రికెట్కు కొత్త జోష్ఏదేమైనా.. అతడు తిరిగి టీమిండియాలోకి రావడం బౌలింగ్ విభాగానికి సానుకూలాంశం. ఎంతో అనుభవజ్ఞుడు. తన అనుభవాలను యువ బౌలర్లతో పంచుకుంటున్నాడు. బౌలర్గా తన జ్ఞానాన్ని వాళ్లకూ పంచుతున్నాడు. షమీ రాకతో భారత క్రికెట్కు కొత్త జోష్ వచ్చింది. షమీ నుంచి గొప్ప ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.చీలమండ గాయానికి సర్జరీకాగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ తర్వాత షమీ జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. చీలమండ గాయం వేధిస్తున్నా ఐసీసీ టోర్నీలో మ్యాచ్లు పూర్తి చేసుకున్న తర్వాతే సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. కోలుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది.అనంతరం.. బెంగాల్ తరఫున రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న షమీని.. బీసీసీఐ ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లకు ఎంపిక చేసింది. అదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ చోటిచ్చింది. ఐదో టీ20లో ఆడటం పక్కా!అయితే, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో స్పిన్నర్లకు పెద్ద పీట వేసిన యాజమాన్యం.. ఒకే ఒక్క స్పెషలిస్టు పేసర్తో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో అర్ష్దీప్పై నమ్మకం ఉంచిన యాజమాన్యం షమీకి ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్లో అవకాశం ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో నాలుగో టీ20లో పదిహేను పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. అంతకు ముందు కోల్కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్సేన.. తాజా విజయంతో 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఇప్పటికే భారత్ సిరీస్ గెలిచింది కాబట్టి.. అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతినిచ్చి.. షమీని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇంగ్లండ్తో నాలుగో టీ20(India vs England)లో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. శివం దూబే(Shivam Dube)కు కంకషన్ సబ్స్టిట్యూట్గా.. హర్షిత్ రాణా(Harshit Rana)ను పంపడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం ద్వారా పుణె మ్యాచ్లో భారత జట్టు పన్నెండు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్లు అయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియా స్వదేశంలో ప్రస్తుతం ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్కతా, చెన్నై మ్యాచ్లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్కోట్లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పుణెలో శుక్రవారం నాలుగో టీ20 జరిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ విషయంలో కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ సంజూ శాంసన్(1), వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ(0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0)లను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు.దూబే, హార్దిక్ అదరగొట్టారుఈ క్రమంలో అభిషేక్ శర్మ(29) కాసేపు క్రీజులో నిలబడగా.. రింకూ సింగ్(30) ఫర్వాలేదనిపించాడు. అయితే, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు శివం దూబే, హార్దిక్ పాండ్యా రాకతో సీన్ మారింది. దూబే 34 బంతుల్లో 53 పరుగులతో దంచికొట్టగా.. పాండ్యా 30 బంతుల్లోనే 53 పరుగులతో దుమ్ములేపాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.హర్షిత్ రాణా రాకతో..అయితే, ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్ బౌలింగ్లో దూబే హెల్మెట్కు బంతి బలంగా తాకగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు. తాను బాగానే ఉన్నానని చెప్పిన దూబే.. బ్యాటింగ్ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత అతడు ఫీల్డింగ్కు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన రెండు ఓవర్ల తర్వాత హర్షిత్ రాణాను మేనేజ్మెంట్ మైదానంలోకి పంపింది.ఈ క్రమంలో తన టీ20 అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్(3/33)తో ఇంగ్లండ్ను దెబ్బకొట్టి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆల్రౌండర్ దూబే స్థానంలో స్పెషలిస్టు ఫాస్ట్బౌలర్ను కాంకషన్ సబ్స్టిట్యూట్గా పంపడం విమర్శలకు దారితీసింది.నిబంధనలకు విరుద్ధంఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ స్థానంలో బౌలర్.. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. ఆల్రౌండర్ స్థానంలో ఆల్రౌండర్(like-for-like replacement) కంకషన్ సబ్స్టిట్యూట్గా రావాలి. రూల్ బుక్లో ఇది స్పష్టంగా రాసి ఉంది.ఉదాహరణకు.. బెక్ డకెట్ తలకు గాయమైతే.. ఫీల్డింగ్ సమయంలో అతడి స్థానంలోమరో బ్యాటర్నే పంపాలి. కానీ బౌలర్ను పంపకూడదు. ఎందుకంటే.. అతడు బౌలింగ్ చేయలేడు .ఒకవేళ బౌలర్ గాయపడితే అతడి స్థానంలో మరో బౌలర్నే పంపాలి. కానీ.. ఇక్కడ శివం దూబేకు 20 ఓవర్లో తలకు గాయమైనప్పుడు.. కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణాను రప్పించారు. హర్షిత్కు బదులు మహ్మద్ షమీని రప్పించవచ్చు కదా.12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాంఎందుకంటే.. హర్షిత్ రాణా నైపుణ్యాలకు.. శివం దూబే స్కిల్స్కు పోలికే లేదు. దూబే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడు గంటకు 115- 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేస్తాడు. కానీ.. హర్షిత్ రాణా పూర్తిస్థాయి ఫాస్ట్ బౌలర్. గంటకు 140 -145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఎవరు ఏమన్నా ఇదే వాస్తవం.ఈరోజు శివం దూబే 53 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి.. కీలక వికెట్లు తీశాడు. ఇండియా గెలిచింది. నిజానికి ఈరోజు మనం 12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాం. రమణ్దీప్ సింగ్ను పంపాల్సిందిదూబే బ్యాటింగ్ చేశాడు.. హర్షిత్ బౌలింగ్ చేశాడు’’ అని ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దూబేకు కాంకషన్ సబ్స్టిట్యూట్గా రమణ్దీప్ సింగ్ను పంపాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా పుణె మ్యాచ్లో ఇంగ్లండ్పై పదిహేను పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు -
సబ్స్ట్యూట్గా వచ్చాడు.. గేమ్నే మార్చేశాడు! రూల్స్ ఏమి చెబుతున్నాయి?
పుణే వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(53), శివమ్ దూబే(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ మహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్ రెండు , రషీద్, కార్స్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(51), డకెట్(39) మెరుపు మెరిపించినప్పటికి తమ జట్టును గెలిపించలేకపోయారు.కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి..ఇక ఈ మ్యాచ్లో యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana) కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి తన టీ20 అరంగేట్రం చేశాడు. వాస్తవానికి నాలుగో టీ20 మ్యాచ్ తుది జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కలేదు. ఆల్రౌండర్ శివమ్ దూబే స్ధానంలో హర్షిత్ రాణా మైదానంలో అడుగుపెట్టాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జేమీ ఓవర్టన్ బౌలింగ్లో ఓ బంతి దూబే హెల్మెట్ బలంగా తాకింది. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి అతడిని పరీక్షించారు.అయితే దూబే తనకు బాగనే ఉందని చెప్పడంతో ఫిజియో వెనక్కి వెళ్లిపోయాడు. దూబే సైతం తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. కానీ ఫీల్డింగ్ సమయంలో మాత్రం దూబే మైదానంలో అడుగుపెట్టలేదు. రెండు ఓవర్ల తర్వాత అతడికి బదులు హర్షిత్ను మేనేజ్మెంట్ తీసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ను అద్బుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపాడు. అయితే దూబే స్ధానంలో హర్షిత్ రాణా రావడంపై జోస్ బట్లర్తో సహా పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అస్సలు రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓ లుక్కేద్డాం.రూల్స్ ఇవే..ఐసీసీ ప్లే కండిషన్స్ నియమం 1.2.7.3 ప్రకారం.. కంకషన్ సబ్స్టిట్యూట్గా ఒకరికి బదులు మరొకరిని ఆడేందుకు అనుమతించొచ్చు. అయితే ఆ కంకషన్ రీప్లేస్మెంట్ అభ్యర్థనను ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆమోదించాలి. 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్’ విధానాన్ని పాటించాలి. అంటే బ్యాటర్ స్ధానంలో బ్యాటర్, బౌలర్ స్ధానంలో బౌలరే, ఆల్రౌండర్ స్ధానంలో ఆల్రౌండర్ మాత్రమే కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలో దిగాలి. అయితే దీనిపై మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. దీనిపై ప్రత్యర్థి జట్టుకు అప్పీలు చేసేందుకూ హక్కు ఉండదు. ఇక మ్యాచ్లో దూబే ఆల్రౌండర్ కాబట్టి అతడి స్దానంలో హర్షిత్ రాణాను ఆల్రౌండర్గా పరిగణించి మ్యాచ్ రిఫరీ కంకషన్ సబ్స్ట్యూట్గా అనుమతిచ్చాడు.జడ్డూ స్ధానంలో చాహల్..కాగా కంకషన్ సబ్స్టిట్యూట్ను ఉపయోగించుకోవడం ఇదేమి తొలిసారి కాదు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో జడేజా స్థానంలో కంకషన్ రీప్లేస్మెంట్గా వచ్చిన యుజువేంద్ర చాహల్ కంకషన్ సబ్స్టిట్యూట్ వచ్యాడు. చాహల్ ఏకంగా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం -
పాండ్యా, దూబే మెరుపులు.. 3–1తో సిరీస్ టీమిండియా వశం (ఫొటోలు)
-
IND VS ENG 4th T20: విరాట్ కోహ్లిని అధిగమించిన హార్దిక్ పాండ్యా
ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా (Team India) మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు దోహదపడిన పాండ్యా.. భారత్ తరఫున డెత్ ఓవర్లలో (16 నుంచి 20) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. పాండ్యా ఈ రికార్డును సాధించే క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ డెత్ ఓవర్లలో 192.54 స్ట్రయిక్రేట్తో 1032 పరుగులు చేయగా.. పాండ్యా 174.24 స్ట్రయిక్రేట్తో 1068 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టీ20లో హార్దిక్ పాండ్యా శివాలెత్తిపోయాడు. చాలాకాలం తర్వాత అతని బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ జాలు వారింది. ఈ మ్యాచ్లో తొలి 14 పరుగులు చేసేందుకు 17 బంతులు తీసుకున్న హార్దిక్.. ఆతర్వాత చేసిన 39 పరుగులను కేవలం 13 బంతుల్లో రాబట్టాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి హార్దిక్ స్కోర్ 17 బంతుల్లో 14 పరుగులు కాగా.. 18 ఓవర్ ముగిసే సరికి అతని స్కోర్ 30 బంతుల్లో 53 పరుగులుగా ఉండింది. 15-18 ఓవర్ల మధ్యలో హార్దిక్.. శివమ్ దూబేతో కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్, శివమ్ దూబే (Shivam Dube) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. 12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్ను హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.చివరి ఓవర్ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 23, బెన్ డకెట్ 39, జోస్ బట్లర్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (12), లివింగ్స్టోన్ (8) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 60 బంతుల్లో 96 పరుగులు చేయాలి. కాగా, 5 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
తీరు మార్చుకోని సంజూ శాంసన్.. వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న సూర్య
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పలువురు టీమిండియా బ్యాటర్ల వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో ఓపెనర్ సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యారు. తొలి మ్యాచ్లో 20 బంతుల్లో 26 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో (5,3,1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. సూర్య విషయానికొస్తే.. ఏదో కెప్టెన్సీ బాధ్యత మోస్తున్నాడని తప్పిస్తే, ఈ సిరీస్ మొత్తంలో సూర్య ప్రదర్శనలు శూన్యం. సిరీస్ను డకౌట్తో ప్రారంభించిన సూర్య.. ఇవాళ జరుగుతున్న నాలుగో టీ20లోనూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మధ్యలో రెండు, మూడు మ్యాచ్ల్లో అతను 12, 14 పరుగులు చేశాడు. సూర్య ప్రదర్శన ఈ సిరీస్కు ముందు నుంచే చెత్తగా ఉంది. చివరి 10 ఇన్నింగ్స్ల్లో అతను కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యపై విమర్శలు తారా స్థాయికి చేరాయి. కెప్టెన్సీకి వేరే వాళ్లకు కట్టబెట్టి ముందు అతన్ని జట్టులో నుంచి తీసేయండని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇతను కేవలం ఐపీఎల్ ప్లేయర్ మాత్రమేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.అభిషేక్ శర్మది అదే తీరు.. మంచి ఆరంభాలు లభించినా..!ఈ సిరీస్లో అభిషేక్ శర్మ కాస్త పర్వాలేదనిపిస్తున్నా అతని నిలకడలేమి ఆందోళన కలిగిస్తుంది. తొలి టీ20లో మ్యాచ్ విన్నింగ్ నాక్ (34 బంతుల్లో 79) ఆడిన అభిషేక్ ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో మంచి ఆరంభాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు, మూడు టీ20ల్లో వరుసగా 12, 24 పరుగులు చేసిన అభిషేక్.. ఇవాళ జరుగుతున్న నాలుగో మ్యాచ్లో 19 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో అభిషేక్కు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే అతను చివరి వరకు క్రీజ్లో ఉండాల్సింది. అయితే అతను తన సహజ సిద్దమైన దూకుడును ప్రదర్శించి వికెట్ పారేసుకున్నాడు. అభిషేక్ వికెట్ సమర్పించుకోవడంతో పాటు భారత్ను కష్టాల్లోకి నెట్టాడు.తిలక్ ఖాతాలో వరుసగా రెండు వైఫల్యాలుసిరీస్లోని రెండో టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ (55 బంతుల్లో 72 నాటౌట్) ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన తిలక్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమై నిరాశపరిచాడు. మూడో టీ20లో 18 పరుగులు చేసిన తిలక్.. ఇవాళ జరుగుతున్న నాలుగో మ్యాచ్లో గోల్డెన్ డకౌటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలం కావడంతో తిలక్పై కూడా విమర్శలు మొదలవుతున్నాయి.నాలుగో టీ20 విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (181/9) చేసింది. 12 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జట్టును హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.చివరి ఓవర్ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. -
నాలుగో టీ20లో ఇంగ్లండ్పై భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.భారత ఇన్నింగ్స్లో హార్దిక్, దూబేతో పాటు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) రాణించగా.. సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో జేమీ ఓవర్టన్ (19) వేగంగా పరుగులు రాబట్టినప్పటికీ అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్ (2), లివింగ్స్టోన్ (9), జేకబ్ బేతెల్ 96), బ్రైడన్ కార్స్ (0), జోఫ్రా ఆర్చర్ (0) నిరాశపరిచారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా (గాయపడిన శివమ్ దూబే స్థానంలో కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు), రవి బిష్ణోయ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్137 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో జేకబ్ బేతెల్ (6) ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 24 బంతుల్లో 45 పరుగులు చేయాలి.ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్129 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రమాదకరంగా కనిపించిన హ్యారీ బ్రూక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్గాయపడిన శివమ్ దూబే స్థానంలో కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా డేంజరెస్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ (9) వికెట్ పడగొట్టాడు. 12 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 99/4గా ఉంది. హ్యారీ బ్రూక్ (23), జేకబ్ బేతెల్ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 48 బంతుల్లో 83 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్ ఔట్67 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (2) ఔటయ్యాడు. టార్గెట్ 182.. 65 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 65 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత బెన్ డకెట్ను (39) రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. ఆతర్వాత ఫిల్ సాల్ట్ను (23) అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 7.1 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 66/2గా ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 77 బంతుల్లో 116 పరుగులు చేయాలి. జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ క్రీజ్లో ఉన్నారు. హార్దిక్, దూబే విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్ఇంగ్లండ్తో నాలుగో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (181/9) చేసింది. 12 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జట్టును హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి ఔటైన హార్దిక్చాలాకాలం తర్వాత హార్దిక్ పాండ్యా తన స్థాయికి తగ్గట్టుగా బ్యాట్ను ఝులిపించాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 30 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 166/6గా ఉంది. శివమ్ దూబే (43), అక్షర్ పటేల్ క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్79 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ (30) ఔటయ్యాడు. 11 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 79/5గా ఉంది. శివమ్ దూబే (13), హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నారు. కష్టాల్లో భారత్57 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆదిల్ రషీద్ బౌలింగ్లో జేకబ్ బేతెల్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (29) ఔటయ్యాడు. 8 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 65/4గా ఉంది. రింకూ సింగ్ (26), శివమ్ దూబే (7) క్రీజ్లో ఉన్నారు. సాకిబ్ మహమూద్ విజృంభణ.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్ఇంగ్లండ్ సాకిబ్ మహమూద్ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు బంతులకు సంజూ శాంసన్, తిలక్ వర్మ వికెట్లు తీసిన సాకిబ్.. ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ను (0) పెవిలియన్కు పంపాడు. శాంసన్, సూర్యకుమార్ తమ వైఫల్యాల పరంపరను కొనసాగించారు. అభిషేక్ శర్మ (11), రింకూ సింగ్ క్రీజ్లో ఉన్నారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్12 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్ (1) మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత బంతికే తిలక్ వర్మ కూడా డకౌటయ్యాడు. సాకిబ్ మహమూద్కు రెండు వికెట్లు దక్కాయి. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్ చివరి రెండు బంతులకు అభిషేక్ శర్మ వరుసగా సిక్సర్, బౌండరీ బాదాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్పూణే వేదికగా నాలుగో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. మార్క్ వుడ్ స్థానంలో సాకిబ్ మహమూద్.. జేమీ స్మిత్ స్థానంలో జేకబ్ బేతెల్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్ కోసం టీమిండియా మూడు మార్పులు చేసింది. షమీ స్థానంలో అర్షదీప్.. దృవ్ జురెల్ స్థానంలో రింకూ సింగ్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధ్యింలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
T20 WC 2025: ప్రపంచకప్ ఫైనల్లో భారత్
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025) టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు కొనసాగుతోంది. లీగ్ దశ, సూపర్ సిక్స్ దశల్లో సత్తా చాటుతూ జైత్రయాత్రను కొనసాగించిన మన అమ్మాయిలు.. సెమీ ఫైనల్లోనూ అదరగొట్టారు. ఫలితంగా వరుసగా రెండోసారి భారత్ ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది.కౌలలంపూర్లోని బేయూమస్ ఓవల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్(India Women U19 vs England Women U19) మధ్య వరల్డ్కప్-2025 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ అండర్-19 మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.ఓపెనర్ డెవీనా పెరిన్ 45 పరుగులతో సత్తా చాటగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ జెమీమా స్పెన్స్ మాత్రం తొమ్మిది పరుగులకే పరిమితమైంది. ఇక కెప్టెన్ అబీ నొర్గ్రోవ్ 30 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో అమూ సురేన్కుమార్ 14 పరుగులతో అజేయంగా నిలిచింది. పరుణిక, వైష్ణవి తీన్మార్మిగతా వాళ్లలో ట్రూడీ జాన్సన్ డకౌట్ కాగా.. చార్లెట్ స్టబ్స్ (4), కేటీ జోన్స్ (0), ప్రిషా తానావాలా(2), చార్లెట్ లాంబర్ట్(0) కూడా పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పరుణిక సిసోడియా, వైష్ణవి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆయుశీ శుక్లా రెండు వికెట్లు పడగొట్టింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం ఒక్క వికెట్ నష్టపోయి పనిపూర్తి చేసింది.కమలిని హాఫ్ సెంచరీ.. త్రిష ధనాధన్ఓపెనర్ జి. కమలిని(G Kamalini) అర్ధ శతకం(50 బంతుల్లో 56 రన్స్, నాటౌట్)తో మెరవగా.. టోర్నీ ఆరంభం నుంచే అదరగొడుతున్న గొంగడి త్రిష 29 బంతుల్లో 35 పరుగులతో రాణించింది. ఇక తెలుగమ్మాయి త్రిషను ఇంగ్లండ్ బౌలర్ ఫోబే బ్రెట్ అవుట్ చేయగా.. కమలినికి తోడుగా వన్డౌన్లో ఆడిన సనికా చాల్కె 11 పరుగులతో అజేయంగా నిలిచింది. 15వ ఓవర్లో కమలిని ఫోర్ బాదడంతో భారత్ విజయం ఖరారైంది. పరుణికకుప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది. ఇక తొలి సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా.. ఆసీస్ను చిత్తు చేసి తొలి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆదివారం భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్ జరుగుతుంది.ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025- రెండో సెమీ ఫైనల్భారత్ వర్సెస్ ఇంగ్లండ్- స్కోర్లుఇంగ్లండ్- 113/8 (20)భారత్- 117/1 (15)ఫలితం- ఇంగ్లండ్పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్.చదవండి: టీ20 ప్రపంచకప్-2025: ఆసీస్ను చిత్తు చేసి ఫైనల్లో సౌతాఫ్రికా -
గంభీర్ వ్యూహం అదే.. ఇకపై కూడా మార్పు ఉండదు: అసిస్టెంట్ కోచ్
ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పై వచ్చిన విమర్శలపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే(Ryan Ten Doeschate) స్పందించాడు. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) వ్యూహాలకు అనుగుణంగానే తమ ప్రణాళికలు ఉంటాయని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా.. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఇక ముందు కూడా ప్రయోగాలు కొనసాగిస్తామని పేర్కొన్నాడు.కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్(India vs England)తో పాటు మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ ఇండియా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఇరుజట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచ్లు జరిగాయి.బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూకోల్కతా, చెన్నైలలో వరుస విజయాలు సాధించిన.. రాజ్కోట్లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం పరాజయం పాలైంది. తద్వారా ఇంగ్లండ్పై సూర్య సేన ఆధిక్యం 2-1కు తగ్గింది. అయితే, ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సహా పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు.స్పెషలిస్టు బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్ను ఎనిమిదో స్థానంలో ఆడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిని కాదని.. కేవలం లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్లను ముందుగా బ్యాటింగ్కు పంపడాన్ని తప్పుబట్టారు. ఇక ఈ మ్యాచ్లో జురెల్ రెండు పరుగులకే పరిమితం కాగా.. వాషింగ్టన్ సుందర్ 6, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు.మిగతా వాళ్లు కూడా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల టార్గెట్ను పూర్తి చేసే క్రమంలో 145 పరుగుల వద్ద నిలిచి.. 26 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వచ్చాయి. మా వ్యూహాల్లో భాగమే..ఈ క్రమంలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే స్పందిస్తూ.. ‘‘ధ్రువ్ జురెల్ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు ఎందుకు పంపించారని మీరు వాదించవచ్చు. అయితే, కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. ముఖ్యంగా టీ20 క్రికెట్లో గౌతం గంభీర్ బ్లూప్రింట్ ఎలా ఉందో ఓ సారి గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది.ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండేలా అతడు సెట్ చేస్తాడు. ఇక ధ్రువ్ ఎనిమిదో స్థానంలో వచ్చినపుడు అతడి అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని నేను అనుకోలేదు. ఏదేమైనా అతడిని అలా లోయర్ ఆర్డర్లో పంపించడం మా వ్యూహాల్లో భాగమే.వీలైనన్ని అవకాశాలు ఇస్తాంఫలితం ఎలా ఉన్నా... మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతాం. సుదీర్ఘకాలంలో జట్టు ప్రయోజనాల దృష్ట్యా వారికి వీలైనన్ని అవకాశాలు ఇస్తాం. తప్పక తమను తాము నిరూపించుకుని. తమ విలువేంటో చాటుకుంటారు’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నాలుగో టీ20 జరుగనుంది. పుణె ఇందుకు వేదిక. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్లను తప్పించి..వారి స్థానంలో శివం దూబే, అర్ష్దీప్ సింగ్లను ఆడించాలని సూచించాడు. చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం -
T20 WC 2025: వరల్డ్కప్ ఫైనల్లో సౌతాఫ్రికా.. ఆసీస్ చిత్తు
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025) టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్కు దూసుకువెళ్లింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వరల్డ్కప్ తాజా ఈవెంట్లో గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణఈ క్రమంలో శుక్రవారం ఉదయం సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా(South Africa Women U19 vs Australia Women U19) మధ్య తొలి సెమీ ఫైనల్(Semi Final-1) మ్యాచ్ జరిగింది. కౌలలంపూర్లోని బేయూమస్ ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు కంగారు జట్టు బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.ఓపెనర్లలో ఇనెస్ మెకియోన్ డకౌట్ కాగా.. గ్రేస్ లియాన్స్ 2 పరుగులే చేసి అవుటైంది. ఇక వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ లూసీ హామిల్టన్() 18 పరుగులు చేయగా.. మిగతా వాళ్లలో ఎలియనోర్ లారోసా(7), హస్రత్ గిల్(1), చ్లోయే ఐన్స్వర్త్(1), లిలీ బాసింగ్వైట్(2), టెగాన్ విలియమ్సన్(3*) పూర్తిగా విఫలమయ్యారు.105 పరుగులేఅయితే, మిడిలార్డర్ బ్యాటర్ కాయిమే బ్రే 36 పరుగులతో రాణించగా.. ఎల్లా బ్రిస్కో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. పదిహేడు బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 27 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగలిగింది.ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఆష్లే వాన్ విక్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంతబిసెంగ్ నిని, కెప్టెన్ కైలా రెయ్నెకె, షేష్నీ నాయుడు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ జెమ్మా బోతా(24 బంతుల్లో 37 రన్స్) శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ సిమోనే లౌరెన్స్(5) మాత్రం నిరాశపరిచింది.రాణించిన కెప్టెన్వన్డౌన్ బ్యాటర్ ఫే కౌలింగ్(7) కూడా విఫలం కాగా.. కైలా కెప్టెన్ ఇన్నింగ్స్తో బాధ్యతాయుతంగా ఆడింది. 26 బంతుల్లో 26 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మేసో(19) కాసేపు క్రీజులో నిలబడగా.. మికే వాన్వూస్ట్ 8, షేష్నీ నాయుడు 2 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.1 ఓవర్లలో 106 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మహిళ అండర్-19 టీ20 వరల్డ్కప్ సెకండ్ ఎడిషన్లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ ఆష్లే వాన్ విక్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్(India Women U19 vs England Women U19) అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండో బెర్తు కోసంఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్లో గెలిచిన జట్టు.. ఫైనల్లో సౌతాఫ్రికాతో ట్రోఫీ కోసం తలపడుతుంది. కాగా మొట్టమొదటి మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక తాజా ఎడిషన్లోనూ డిఫెండింగ్ చాంపియన్గా స్థాయికి తగ్గట్లు రాణించి సెమీ ఫైనల్ వరకు వచ్చింది. మరోసారి చాంపియన్గా నిలవాలనే పట్టుదలతో ఉంది.చదవండి: Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్బౌల్డ్! దారుణ వైఫల్యం -
Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే
ఇంగ్లండ్తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్పై బ్యాట్ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.పక్కనపెడితేనే బెటర్ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్ జురెల్(Dhruv Jurel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సేవలను మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ను బౌలర్గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్లో అతడు తొలి బంతికే వికెట్ తీశాడు. బెన్ డకెట్ను అవుట్ చేశాడు.అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.ఒకవేళ ఒకే ఒక్క ఓవర్ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్ జురెల్ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.నలుగురు బౌలర్లుఇక ఇంగ్లండ్తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్ వర్మ వన్డౌన్లో.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లోయర్- మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా అతడు చక్కటి ఆప్షన్ అని తెలిపాడు. రాజ్కోట్లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉండాలి. ఈ మ్యాచ్లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్ లేదంటే.. ఆల్రౌండర్ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తిలతో పాటు.. అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా బౌల్ చేయగలరన్న ఆకాశ్ చోప్రా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్తో నాలుగో టీ20లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ల బదులు.. అర్ష్దీప్ సింగ్, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.ఇంగ్లండ్తో నాలుగో టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్టైమ్ రికార్డు -
కెప్టెన్గా సూర్యా ఏంటి?.. నేనైతే షాకయ్యా: టీమిండియా మాజీ కోచ్
ఒకప్పుడు టీమిండియాలో చోటు కోసం పరితపించిపోయిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఇప్పుడు కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు. ముప్పై ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన అతడు.. పొట్టి ఫార్మాట్లో తనను తాను నిరూపించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. టీ20లో ప్రపంచ నంబర్ వన్(ICC World No.1 Batter) బ్యాటర్గా సత్తా చాటిన అతడు.. మూడేళ్ల వ్యవధిలోనే అనూహ్యంగా భారత జట్టు(Team India T20 Captain) నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు.కెప్టెన్గా వరుస విజయాలుపూర్తిస్థాయి టీ20 కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంకలో క్లీన్స్వీప్ విజయం అందుకున్న సూర్య... బంగ్లాదేశ్పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. యువ జట్టుతో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడా టీ20 సిరీస్ను 3-1తో గెలిచి తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సూర్య సారథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్తో సిరీస్ గెలవడంలో టీమిండియా బిజీగా ఉంది.ఈ నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్(Sanjay Bangar) సూర్యకుమార్ యాదవ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తక్కువ కాలంలోనే అతడు కెప్టెన్ స్థాయికి చేరుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం దాదాపు ఖరారైపోయిందన్న తరుణంలో సూర్య సారథిగా ఎంపిక కావడం నిజంగా ఓ షాక్ అన్నాడు.హార్దిక్ పాండ్యాకు బదులు సూర్య.. నేనైతే షాకయ్యాఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ ‘షో’లో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది హార్దిక్ పాండ్యానే కాబోయే కెప్టెన్ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా సూర్య పేరు బయటకు వచ్చింది. నిజంగా కెప్టెన్గా అతడి నియామక ప్రకటన రాగానే.. నేనైతే షాకయ్యా. ఏదేమైనా.. నాయకుడిగా అతడు ఎదిగిన తీరు అద్భుతం.రోహిత్, కోహ్లి, జడేజా రిటైర్మెంట్ తర్వాత.. యువకులతో కూడిన జట్టు లభించడం కూడా అతడికి కలిసి వచ్చింది. వాళ్లలో ఒకడిగా ఉంటూనే.. నవతరం నాయకుడిగా సూర్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకునే వీలు కలిగింది.ఇక బ్యాటర్గా అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. బౌలర్ చేతి నుంచి బంతి వెలువడకముందే.. దానిని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ షాట్తో రెడీ ఉండటం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అందులో సూర్య ఒకడు.అతడో అద్భుత బ్యాటర్ఆసియా కప్ సమయంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు సూర్యను ఎదుర్కొనేందుకు పడ్డ కష్టాలను మేము చూశాం. వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక కొత్త షాట్తో బంతిని ఎదుర్కోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. 360 డిగ్రీలలో షాట్లు బాదగల క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, అప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా.. తన ప్రణాళికను మార్చుకుని షాట్లు ఆడటంలో దిట్ట. అతడో అద్భుత బ్యాటర్’’ అని సంజయ్ బంగర్ సూర్యను ప్రశంసించాడు.గొప్ప కెప్టెన్ కూడామరోవైపు.. ఇదే షోలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్గానూ అతడిలో టెంపర్మెంట్ సూపర్. గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారీ మరింత ప్రశాంతంగా.. నిరాడంబరంగా ఉండటం అతడికే చెల్లింది. అతడి మనసు మంచిది. టెస్టు కెప్టెన్సీకి బుమ్రా సరైనవాడని ఎలా అనుకుంటున్నామో.. టీ20లకు సూర్య అత్యుత్తమ కెప్టెన్ అని ఇప్పటికే రుజువైంది’’ అని సూర్యకుమార్ యాదవ్ను కొనియాడాడు. చదవండి: రెండు వరల్డ్కప్లు ఆడాడు.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే! -
Ind vs Eng: టీమిండియాకు శుభవార్త!.. పాపం అతడిపై వేటు!
ఇంగ్లండ్తో నాలుగో టీ20(India Vs England)కి ముందు టీమిండియాకు శుభవార్త! నయా ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh) పూర్తి ఫిట్నెస్ సాధించాడు. పుణె మ్యాచ్లో ఆడేందుకు అతడు సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే ధ్రువీకరించాడు.భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్తో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికి మూడు పూర్తి చేసుకుంది. కోల్కతా, చెన్నై టీ20లలో గెలిచిన టీమిండియా.. రాజ్కోట్(Rajkot T20I)లో మాత్రం విఫలమైంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్పై ఆధిక్యం 2-1కు తగ్గింది.వెన్ను నొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్.. మిగిలిన రెండు మ్యాచ్లకు మాత్రం దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా అతడు ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడు ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది.జురెల్పై వేటు పడే అవకాశంఈ విషయం గురించి కోచ్ డష్కాటే మాట్లాడుతూ.. అతడు బుధవారం నెట్స్లో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. ఒకవేళ రింకూ తిరిగి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. అయితే, అతడు వస్తే ధ్రువ్ జురెల్పై వేటు పడే అవకాశం ఉంది.మూడో టీ20లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన జురెల్.. ఒత్తిడిలో చిత్తైపోయాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. నిజానికి బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకాస్త ముందు వస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్లను ఆరు, ఏడు స్థానాల్లో పంపడంతో జురెల్కు దెబ్బ పడింది.రింకూ లేదంటే.. ఆ ఇద్దరిలో ఒకరు?ఇక రింకూకు కోల్కతా టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. గతేడాది కూడా అతడి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. పద్దెనిమిది మ్యాచ్లలో కలిపి అతడు 245 పరుగులే చేశాడు. అయితే, 2023లో మాత్రం 12 మ్యాచ్లలోనే 262 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రింకూ సింగ్పై సెలక్టర్లు నమ్మకం ఉంచుతారా? లేదంటే.. శివం దూబే, రమణ్దీప్ సింగ్లలో ఒకరికి తుదిజట్టులో చోటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా శుక్రవారం పుణె వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉండగా.. 2-2తో సమం చేయాలని బట్లర్ బృందం భావిస్తోంది. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన ఐదో టీ20 జరుగుతుంది.ఇంగ్లండ్తో టీ20లకు భారత జట్టు(అప్డేటెడ్)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివం దూబే, రమణ్దీప్ సింగ్.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్టైమ్ రికార్డు -
‘అతడిని మర్చిపోయాం.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే!’
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. ఇప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు.కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. నాటి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను కూడా లెక్కచేయక మొండిగా వ్యవహరించాడు.సెంట్రల్ కాంట్రాక్టు పాయె!ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంతజట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్(Sanju Samson) ముందుకు దూసుకురాగా.. టెస్టుల్లో రిషభ్ పంత్తో కలిసి ధ్రువ్ జురెల్ పాతుకుపోయాడు. ఇక వన్డేల్లో సీనియర్ కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రీఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.ప్రపంచకప్లో ఆడినా..వన్డే ప్రపంచకప్-2023 జట్టులో కేఎల్ రాహుల్తో పాటు ఇషాన్ను ఎంపిక చేసినా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టీమ్లో మాత్రం రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సంజూ- జురెల్లను ఎంపిక చేసిన బోర్డు.. వన్డేలకు రాహుల్- పంత్లను ఎంచుకుంది.అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్కు మద్దతుగా ఉండే కొంతమంది నెటిజన్లు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమై ఆకాశ్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు. డబుల్ సెంచరీ కూడా చేశాడు.. కానీఇందుకు బదులిస్తూ.. ‘‘ఇషాన్ కిషన్.. అతడిని మనం ఇంతత్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే!.. మళ్లీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్లో టీ20 ప్రపంచకప్.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ ఆడాడు. వన్డేల్లో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది.కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది. ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే, సెలక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలక్టర్లు మళ్లీ అతడిని కనికరించకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో గనుక సత్తా చాటితే ఏదేమైనా ప్రస్తుతం ధ్రువ్ జురెల్తో పోటీలో ఇషాన్ కిషన్ వెనుకబడి పోయాడన్న ఆకాశ్ చోప్రా.. జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. సెలక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఈసారి ఐపీఎల్లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 11.25 కోట్లకు ఇషాన్ కిషన్ను కొనుగోలు చేసింది.చదవండి: CT 2025: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్ -
అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే!: మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కోల్కతా టీ20లో మూడు బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer) బౌలింగ్లో.. వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.తీరు మార్చుకోని సూర్యఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ సూర్య నిరాశపరిచాడు. ఏడు బంతులు ఎదుర్కొన్న ఈ ‘మిస్టర్ 360’.. మూడు ఫోర్లతో టచ్లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ 12 పరుగుల వద్ద పేసర్ బ్రైడన్ కార్సే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. తాజాగా రాజ్కోట్(Rajokot T20I) వేదికగా సాగిన మూడో టీ20లోనూ సూర్య విఫలమయ్యాడు. ఈ వన్డౌన్ బ్యాటర్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్లో సాల్ట్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అయితే, తొలి రెండు మ్యాచ్లలో టీమిండియా గెలుపొందడంతో సూర్య వైఫల్యంపై పెద్దగా చర్చ జరుగలేదు. ఆ రెండు టీ20లలో బౌలర్లతో పాటు.. వరుసగా అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79), తిలక్ వర్మ(55 బంతుల్లో 72*) బ్యాట్తో రాణించడంతో భారత్ గెలుపొందింది.అయితే, మూడో టీ20లో బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగాబ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, సూర్య వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే‘‘ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడాలని భావిస్తే.. అందుకు సరైన బంతిని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. అలా కాకుండా ఏ బంతికైనా అగ్రెసివ్గానే ఉంటానంటే కుదరదు. ప్రతి బాల్ను బౌండరీకి తరలించడం కుదరదు కదా!..టీమిండియా ఈ స్థాయిలో ఉందంటే.. అందుకు వారి అత్యుత్తమ ఆటగాళ్లు ఫామ్లో ఉండటమే కారణం. అందుకే వాళ్లు వరల్డ్ చాంపియన్స్ అయ్యారు. కానీ.. పదే పదే ఒకే తరహా తప్పులు చేస్తే ఎలా? సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.. రెండు మంచి షాట్లు ఆడాడు. అంతే.. కన్నుమూసి తెరిచేలోగా మళ్లీ డగౌట్కు చేరుకున్నాడు. జట్టు గెలుపునకు అతడు తన వంతు సహకారం అందించనేలేదు’’ అని మైకేల్ వాన్ క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా రాజ్కోట్లో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 48-2 ఉన్న సమయంలో సూర్య క్రీజులోకి వచ్చాడు. రాగానే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో రెండు షాట్లు బాదిన సూర్య.. మార్క్ వుడ్ బౌలింగ్లోనూ తన ట్రేడ్మార్క్ ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా.. ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయగా.. బట్లర్ బృందం 171 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో సూర్యసేన 145 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఇంగ్లండ్ చేతిలొ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదుమ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా ఆధిక్యం ప్రస్తుతానికి 2-1కి తగ్గింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా? -
ప్రపంచంలోనే తొలి బౌలర్గా.. వరుణ్ చక్రవర్తి ‘చెత్త రికార్డు’
గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసిరావాలంటారు. టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుత పరిస్థితికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చాడు 33 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్ బౌలర్. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్లో ఐదు వికెట్లు తీసిన వరుణ్.. అనంతరం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.కెరీర్లోనే అత్యుత్తమంగాస్వభావసిద్ధంగా ఫాస్ట్బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్లపై కూడా వరుణ్ చక్రవర్తి తన మార్కు చూపించగలిగాడు. ప్రొటిస్ జట్టుతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్(ఒకే ఇన్నింగ్స్లో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం) కూడా ఉండటం విశేషం.ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England T20 Series)లోనూ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. కోల్కతాలో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో రెండు వికెట్లు తీయగలిగాడు.అయితే, రాజ్కోట్లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులే ఇచ్చి మెరుగైన ఎకానమీ(6.00) నమోదు చేశాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్(24)తో పాటు జేమీ స్మిత్(6), జేమీ ఓవర్టన్(0), బ్రైడన్ కార్సే(3), జోఫ్రా ఆర్చర్(0)ల వికెట్లు తీశాడు.కానీ.. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.దురదృష్టం వెంటాడిందిసౌతాఫ్రికాతో 2024 నాటి రెండో టీ20 సందర్భంగా వరుణ్ చక్రవర్తి తొలిసారి అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. తాజాగా ఇంగ్లండ్తో మూడో టీ20లో రెండో అత్యుత్తమ గణాంకాలు(5/24) సాధించాడు.కానీ దురదృష్టవశాత్తూ ఈ రెండు మ్యాచ్లలోనూ టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో ఇలా ఓ బౌలర్ ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేసిన రెండు సందర్భాల్లోనూ అతడి జట్టు ఓడిపోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే తొలిసారి.చెత్త ‘వరల్డ్’ రికార్డుతద్వారా.. వరుణ్ చక్రవర్తి పేరిట ఇలా ఓ చెత్త వరల్డ్ రికార్డు నమోదైంది. అయితే, ఇంగ్లండ్తో మూడో టీ20లో అద్భుత ప్రదర్శనకు గానూ వరుణ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మెరుగ్గా ఆడేందుకుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. అయితే, మున్ముందు ఇంతకంటే మెరుగ్గా ఆడేందుకు కష్టపడుతున్నట్లు తెలిపాడు.బ్యాటర్ల కారణంగానేకాగా ఇంగ్లండ్తో కోల్కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. చెన్నైలో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కగలిగింది. అయితే, మూడో టీ20లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. రాజ్కోట్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్ను 171 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో 145 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా??: కెవిన్ పీటర్సన్ -
అద్భుత బ్యాటర్.. లోయర్ ఆర్డర్లో పంపిస్తారా?: కెవిన్ పీటర్సన్
రాజ్కోట్ టీ20(Rajkot T20I)లో టీమిండియా ఆట తీరును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. కోల్కతా, చెన్నైలలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తద్వారా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో మూడో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేనకు పరాజయం ఎదురైంది.బ్యాటర్ల వైఫల్యం వల్లేఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిని చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్లలో టీమిండియా టాపార్డర్ ఒకే విధంగా ఉంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ.. వన్డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు.హార్దిక్ ఐదో నంబర్లోమూడో టీ20లోనూ ఈ నలుగురి స్థానాలు మారలేదు. కానీ వరుస విరామాల్లో వికెట్లు పడిన వేళ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ ప్రమోట్ చేసింది. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్కు దిగాడు. మరోవైపు.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఆ తర్వాతి స్థానాల్లో మరో ఇద్దరు ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్(6), అక్షర్ పటేల్(15)లను రంగంలోకి దించారు.ఎనిమిదో స్థానంలో జురెల్అదే విధంగా.. అచ్చమైన బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు పంపారు. ఇక హార్దిక్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇరవైకి పైగా బంతులు తీసుకుని.. మొత్తంగా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చే సమయానికి.. టీమిండియా విజయలక్ష్యానికి ఓవర్కు పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఇలాంటి తరుణంలో ఒత్తిడిలో చిత్తైన జురెల్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది.అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్ను పక్కనపెట్టిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. టీమిండియా అనవసరంగా ఆల్రౌండర్లను ముందు పంపిందని అభిప్రాయపడ్డాడు. వారికి బదులు జురెల్ను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది సరైంది కానేకాదు. ధ్రువ్ జురెల్ అచ్చమైన, స్వచ్ఛమైన బ్యాటర్. అద్భుత నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని అతడిని లోయర్ ఆర్డర్లో పంపించడం సరికాదు. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లు కచ్చితంగా కాస్త టాప్ ఆర్డర్లోనే రావాలి’’ అని కెవిన్ పీటర్సన్ హిందుస్తాన్ టైమ్స్తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- మూడో టీ20 స్కోర్లు👉టాస్: ఇండియా.. తొలుత ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన సూర్య👉ఇంగ్లండ్ స్కోరు: 171/9 (20)👉ఇండియా స్కోరు: 145/9 (20)👉ఓవరాల్ టాప్ రన్ స్కోరర్: బెన్ డకెట్(28 బంతుల్లో 51)👉టీమిండియా టాప్ రన్ స్కోరర్: హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో 40)👉ఫలితం: ఇండియాపై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(5/24).చదవండి: అతడొక వరల్డ్క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య -
అతడొక వరల్డ్క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య
ఇంగ్లండ్పై హ్యాట్రిక్ విజయంతో సిరీస్ గెలవాలని భావించిన టీమిండియాకు చుక్కెదురైంది. రాజ్కోట్ టీ20లో సూర్యకుమార్ సేన ప్రత్యర్థి చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.బెన్ డకెట్ మెరుపు హాఫ్ సెంచరీనిరంజన్ షా స్టేడియంలో మంగళవారం రాత్రి ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఆదిలోనే హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(5) వికెట్ తీసి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్ బెన్ డకెట్(Ben Ducket) ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు.మెరుపు అర్ధ శతకం బాది మెరుగైన స్కోరుకు బాటలు వేశాడు. డకెట్.. 28 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 51 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ జోస్ బట్లర్(24) కూడా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించగా వరుణ్ చక్రవర్తి అతడిని బోల్తా కొట్టించాడు.లివింగ్స్టోన్ ధనాధన్మిగతా వాళ్లలో లియామ్ లివింగ్స్టోన్(Liam Livingstone- 24 బంతుల్లో 43 రన్స్) దంచికొట్టగా.. ఆదిల్ రషీద్(10), మార్క్ వుడ్(10) డబుల్ డిజిట్ స్కోర్లతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, రవి బిష్ణోయి, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.టీమిండియా తడ‘బ్యాటు’ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. ఓపెనర్లలో సంజూ శాంసన్(3) మరోసారి నిరాశపరచగా.. అభిషేక్ శర్మ(14 బంతుల్లో 24) కాసేపు మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14) మరోసారి విఫలం కాగా.. వాషింగ్టన్ సుందర్(6), ధ్రువ్ జురెల్(2) చేతులెత్తేశారు.ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా (35 బంతుల్లో 40) మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్(15)తో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఇక టెయిలెండర్లలో మహ్మద్ షమీ 7 పరుగులు చేయగా.. రవి బిష్ణోయి 4, వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా ఉన్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో 26 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓటమి ఎదురైందని విచారం వ్యక్తం చేశాడు. ‘‘మ్యాచ్ సాగేకొద్దీ మంచు ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని భావించాను. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ మా చేతుల్లో ఉందనుకున్నా.అతడొక వరల్డ్క్లాస్ బౌలర్కానీ ఆదిల్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే అతడిని వరల్డ్క్లాస్ బౌలర్ అంటారు. మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. స్పిన్నర్లు అవసరం ఎంతగా ఉంటుందో మాకు తెలుసు. అందుకే మా జట్టులో వారే ఎక్కువగా ఉన్నారు.ప్రతి టీ20 మ్యాచ్ నుంచి మేము సరికొత్త పాఠాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈసారి బ్యాటింగ్ పరంగా మా పొరపాట్లు ఏమిటో గుర్తించగలిగాం. ఇక షమీ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తాడు.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు సాధిస్తున్న ఫలితాలే.. అతడి క్రమశిక్షణ, కఠిన శ్రమకు నిదర్శనం. మైదానం లోపలా.. వెలుపలా ఆట పట్ల అతడి అంకితభావం ఒకేలా ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కీలకమైన ఇన్ఫామ్ బ్యాటర్ తిలక్ వర్మ(18) వికెట్ తీసి.. టీమిండియా ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో జేమీ ఓవర్టన్ మూడు, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్వుడ్ ఒక వికెట్ తీశాడు. ఇక తన అద్భుత ప్రదర్శన(5/24)కు గానూ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్గా -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న అర్షదీప్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జనవరి 28) జరుగబోయే మూడో టీ20లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీ20ల్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం అర్షదీప్ 62 మ్యాచ్ల్లో 98 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 21వ స్థానంలో ఉన్నాడు.తొలి పేసర్గా చరిత్రకెక్కనున్నాడు..!నేటి మ్యాచ్లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన పేసర్గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్ పేసర్ హరీస్ రౌఫ్ పేరిట ఉంది. రౌఫ్ 71 మ్యాచ్ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. అర్షదీప్కు తన 63వ మ్యాచ్లోనే 100 వికెట్ల మైలురాయిని క్రాస్ చేసే అవకాశం వచ్చింది.రషీద్ 53 మ్యాచ్ల్లోనే..!టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 53 మ్యాచ్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు. 2021లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఈ ఫీట్ను సాధించాడు. రషీద్ తర్వాత అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచ్చనేకు దక్కుతుంది. సందీప్ 54 మ్యాచ్ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లురషీద్ ఖాన్ (53 మ్యాచ్లు)సందీప్ లామిచ్చనే (54 మ్యాచ్లు)వనిందు హసరంగ (63 మ్యాచ్లు)ఎహసాన్ ఖాన్ (71 మ్యాచ్లు)హరీస్ రౌఫ్ (71 మ్యాచ్లు)నేటి మ్యాచ్లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన మూడో బౌలర్గా హసరంగతో కలిసి సంయుక్తంగా నిలుస్తాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్న అర్షదీప్కు నేటి మ్యాచ్లో రెండు వికెట్లు తీయడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో అర్షదీప్ 3 వికెట్లు తీశాడు. అర్షదీప్ రెండు రోజుల కిందటే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపికైన విషయం తెలిసిందే.భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. నేటి మ్యాచ్లోనూ భారత్ ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తుంది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ (39 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రెండో మ్యాచ్లో తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విశేషంగా రాణించారు. వీరి ప్రదర్శనల కారణంగానే భారత్ తొలి రెండు టీ20ల్లో నెగ్గింది. -
Rohit-Virat: నేను సిద్ధమే.. వాళ్లు రెడీగా ఉండాలి కదా!: టీమిండియా కొత్త కోచ్
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) పూర్తి ఫిట్నెస్తోనే ఉన్నాడని భారత బ్యాటింగ్ కొత్త కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) వెల్లడించాడు. అయితే, ఇంగ్లండ్తో మూడో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్న అంశంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.కాగా ఏడాది తర్వాత.. ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా షమీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, బట్లర్ బృందంతో తొలి రెండు టీ20లో మాత్రం అతడికి భారత తుదిజట్టులో చోటు దక్కలేదు.ఈ నేపథ్యంలో షమీ ఫిట్నెస్పై మరోసారి ఊహాగానాలు వచ్చాయి. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్మెంట్ అతడిని పక్కనపెడుతోందని కొంతమంది భావిస్తుండగా.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షమీపై అదనపు భారం పడకుండా చూస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తుది నిర్ణయం వాళ్లదేఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందిస్తూ.. షమీకి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవన్నాడు. అతడు వందశాతం మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నాడని అయితే తుదిజట్టులో ఆడించే అంశంపై కెప్టెన్ సూర్యకుమార్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లే నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు.కాగా.. 2023 నవంబర్లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ టీమిండియా తరఫున ఆడలేకపోయాడు. కొన్నాళ్లు విశ్రాంతి, ఇంకొన్నాళ్లు గాయాలతో సతమతమైన 34 ఏళ్ల వెటరన్ బెంగాల్ సీమర్ను తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్కు ఎంపికచేశారు. దీంతో 15 నెలల తర్వాత జట్టులో చోటు దక్కింది కానీ ఆడేందుకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో కోల్కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా.. చెన్నై మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య రాజ్కోట్ వేదికగా మంగళవారం మూడో టీ20 జరుగుతుంది. రోహిత్, కోహ్లిలకోసం ప్రత్యేకంగా ఏమైనా..?ఇటీవలి కాలంలో టెస్టుల్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) గురించి విలేకరులు సితాన్షు కొటక్ వద్ద ప్రస్తావన తీసుకువచ్చారు. బ్యాటింగ్ కోచ్గా వారికోసం ఏవైనా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారా అని అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘రోహిత్, విరాట్ చాలా సీనియర్ ఆటగాళ్లు.అయినా.. ఈరోజుల్లో ప్రతి ఒక్క ఆటగాడు తన ఆట గురించి తానే అంచనా వేసుకోగలుగుతున్నాడు. ఇతరులతో తన ప్రణాళికల గురించి పంచుకుంటూ ..లోపాల్ని సరిచేసుకుంటున్నారు. అలాంటి వారికి మనవంతుగా ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వగలగడం గొప్ప విషయమే. సలహాలిస్తే తీసుకోవాలి కదా!నిజంగా నా సలహాల వల్ల రోహిత్, కోహ్లిల ఆట కనీసం రెండు నుంచి ఐదు శాతం మెరుగుపడినా అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అయినా వాళ్లిద్దరు ఇప్పటికే ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. అయినా సరే నా నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే.. అందుకు వారు సిద్ధంగా ఉండాలి. తద్వారా ఎప్పటికపుడు ఆటను మెరుగుపరచుకోవచ్చు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు.కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ పూర్తిగా విఫలం కాగా.. విరాట్ కోహ్లి కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్లో కలిపి 31 పరుగులే చేశాడు.ఇక కోహ్లి పదకొండు ఇన్నింగ్స్ ఆడి 191 పరుగులు సాధించాడు. ఈ సిరీస్లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూ జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణం ‘విరాహిత్’ ద్వయం వైఫల్యమేనని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఇద్దరూ రంజీ బరిలోకి వచ్చారు.చదవండి: U19 T20 WC 2025: భారత్తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్ వివరాలు -
Ind vs Eng: బౌలర్లకు కష్టమే.. బ్యాటర్లపైనే భారం! వారు ‘ఫాస్ట్ షో’ మొదలెడితే..
ఇంకా కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) ‘360 డిగ్రీ’ బ్యాటింగ్ బాకీ ఉంది. సంజూ శాంసన్(Sanju Samson) మెరుపు జోరు కనబర్చలేదు. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) అసలు ఆట మిగిలే ఉంది. అయినాసరే భారత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగ్గింది. ఇప్పుడు సిరీస్ను కైవసం చేసుకునే పనిలో పడింది. ఒకవేళ ఈ ముగ్గురు గనక రాణిస్తే మూడో మ్యాచ్తోనే భారత్ ఐదు టీ20ల సిరీస్ను గెలుచుకునే అవకాశముంది. ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రత్యర్థి ఇంగ్లండ్పై ‘హ్యాట్రిక్’ విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు సిరీస్పైనే కన్నేసింది. రాజ్కోట్లో జరిగే మూడో టీ20లో గెలిచి ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో తమ వైఫల్యాల్ని అధిగమిస్తే ఇంగ్లండ్కు మూడో పరాజయం తప్పదేమో! ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓటమి బట్లర్ బృందాన్ని కుంగదీసింది.ఇప్పుడు సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అయితే ఇది పొట్టి ఫార్మాట్. ఏ క్షణంలోనైనా, ఏ ఓవరైనా ఉన్నపళంగా మార్చేయగలదు. కాబట్టి ఏ జట్టు తప్పక గెలుస్తుందనే గ్యారంటీ లేదు. గత రెండు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ సాల్ట్–డకెట్ విఫలమైంది. వారి ఓపెనింగ్లో గునక ‘పవర్ ప్లే’ కనబడితే భారత్కు సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలో గత రెండో టీ20లాగే ఉత్కంఠరేపే సమరం జరిగొచ్చు.టాపార్డర్ రాణిస్తే... ఓపెనర్లలో అభిషేక్ శర్మ తొలి మ్యాచ్లో మెరిపించాడు. కానీ శాంసన్ నుంచే ఆ మెరుపులు కరువయ్యాయి. కెప్టెన్ సూర్యకుమార్ కూడా టీ20కి కాదుకదా... వన్డేకు సరిపడా ఆటకూడా చూపించలేకపోయాడు. ఈ ముగ్గురు మూకుమ్మడిగా రాణిస్తే మిడిలార్డర్ సంగతి చూసుకునేందుకు తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, ధ్రువ్ జురేల్ ఉన్నారు.బ్యాటింగ్కు అచ్చొచ్చే పిచ్పై లోయర్ ఆర్డర్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు కూడా దంచేసే అవకాశాన్ని పిచ్ కల్పిస్తుంది. గత మ్యాచ్ల్ని నిశితంగా గమనిస్తే... బ్యాటింగ్ కన్నా కూడా మన బౌలింగ్ దళం గట్టి ప్రభావమే చూపింది. ఇంగ్లండ్ టాపార్డర్ను తేలిగ్గా కూల్చేస్తుంది. అర్ష్దీప్, పాండ్యాలకు జతగా మరో సీమర్ను తీసుకోవాలనుకుంటే స్పిన్నర్ రవి బిష్ణోయ్ని పక్కన బెట్టొచ్చు.భారమంతా బ్యాటర్లపైనే... ఇంగ్లండ్ కూడా గత మ్యాచ్లో బౌలింగ్తో ఆకట్టుకుంది. హిట్టింగ్ ఓపెనర్లను కూల్చి, మిడిలార్డర్ను దెబ్బతీసి మ్యాచ్ను గెలిచేస్థితికి వచ్చేసింది. అయితే తిలక్ వర్మ పోరాటమే వారి శ్రమను నీరుగార్చింది. లేదంటే చెన్నైలోనే భారత్కు 1–1తో చెక్ పెట్టేది. కార్స్, మార్క్వుడ్, ఆర్చర్, రషీద్లతో కూడిన బౌలింగ్ దళం పటిష్టంగానే ఉంది.అయితే పరిస్థితి చక్కబెట్టాల్సింది... ఎదురుదాడికి దిగాల్సింది... బ్యాటర్లే! ఫిల్ సాల్ట్, డకెట్లు ఆషామాషీ ఓపెనర్లు కాదు. కానీ వారి ఫ్లాప్షో ముగిసి ‘ఫాస్ట్ షో’ మొదలైతే మాత్రం పరుగుల తుఫాన్ ఖాయం. బట్లర్, బ్రూక్, లివింగ్స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, ఆర్చర్ ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదో వరుస బ్యాటింగ్ దాకా పరుగుల బాదే ఆటగాళ్లే జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇంగ్లండ్ భారమంతా బ్యాటర్లపైనే ఉంది.పిచ్, వాతావరణం రాజ్కోట్ పిచ్ ఎప్పుడైనా బ్యాటింగ్కు స్వర్గధామం. ప్రత్యేకించి టీ20ల్లో పరుగుల వరద, మెరుపుల సరదా ఖాయం. బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్పై బౌలర్లకు కష్టాలు తప్పవు. గత రెండు మ్యాచ్ల్లో నమోదైన మోస్తరు స్కోరును సులువుగా అధిగమిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తుది జట్లు (అంచనా) భారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్/షమీ, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్రాజ్కోట్ సూర్యకు ప్రత్యేకంరాజ్కోట్లో భారత జట్టు ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్ల్లో (2013లో ఆస్ట్రేలియాపై; 2019లో బంగ్లాదేశ్పై; 2022లో దక్షిణాఫ్రికాపై; 2023లో శ్రీలంకపై) గెలిచిన టీమిండియా ఒక మ్యాచ్లో (2017లో న్యూజిలాండ్ చేతిలో) ఓడిపోయింది. ఈ మైదానంలో చివరిసారి 2023 జనవరి 7న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్లు) ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం విశేషం.చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: మాజీ క్రికెటర్
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ తెలుగు తేజం.. ఇప్పటికే రెండు శతకాలు సాధించాడు. కష్టతరమైన సౌతాఫ్రికా పిచ్లపై వరుస సెంచరీలతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఇంగ్లండ్తో సిరీస్(India vs England)లోనూ అదరగొడుతున్నాడు.స్వదేశంలో ఇంగ్లిష్ జట్టుతో కోల్కతాలో జరిగిన తొలి టీ20లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట.. తాను మాత్రం బ్యాట్ ఝులిపించాడు.సూపర్ ఫినిషింగ్ టచ్ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఫోర్ బాది జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 72 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ ఇన్నింగ్స్లో.. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. ఈ రెండు సందర్బాల్లోనూ 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి టీమిండియాను గెలిపించడం విశేషం.ఈ నేపథ్యంలో తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్ను ఏకంగా మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)తో పోలుస్తూ ఆకాశానికెత్తడం విశేషం. ‘‘ఆఖరి వరకు అతడి ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. పద్దెమినిదవ ఓవర్లోనూ ఏమాత్రం భయపడలేదు.తిలక్ వర్మ అచ్చం ఆ దిగ్గజం మాదిరేఅంతెందుకు పందొమ్మిదవ ఓవర్లో టీమిండియాకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. అప్పుడూ అతడు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. ఫోర్తో ఫినిష్ చేశాడు. అతడు ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు జట్టును కూడా కాన్ఫిడెంట్గా ఉంచుతున్నాడు.ధోని కంటే కాస్త మెరుగేగతంలో మనకు ఇలాంటి దిగ్గజం ఒకరు ఉండేవారు. అతడు మరెవరో కాదు మహేంద్ర సింగ్ ధోని. తను కూడా ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ముగించేవాడు. అతడిలాంటి వ్యక్తి.. అది కూడా మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇలాంటి ఫలితాలు రాబట్టడం మామూలు విషయం కాదు’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో టైమ్అవుట్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా తిలక్ వర్మ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 22 టీ20 మ్యాచ్లు ఆడి 156కు పైగా స్ట్రేక్రేటుతో 707 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 120. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా రెండు గెలిచింది. ఆధిక్యంలో టీమిండియాతొలి టీ20లో ఏడు వికె ట్ల తేడాతో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రెండో మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం రాజ్కోట్లో మూడో టీ20 జరుగనుంది. తదుపరి పుణె, ముంబైలలో మిగిలిన టీ20లు జరుగుతాయి.చదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణం ఇదే!2️⃣-0️⃣ 🙌Tilak Varma finishes in style and #TeamIndia register a 2-wicket win in Chennai! 👌Scorecard ▶️ https://t.co/6RwYIFWg7i #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/d9jg3O02IB— BCCI (@BCCI) January 25, 2025 -
షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్తో సమస్యా?
సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం కోసం మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదని సమాచారం. పూర్తి ఫిట్గా ఉన్నా ఇంగ్లండ్తో మూడో టీ20లో(India vs England 3rd T20I)నూ అతడిని ఆడించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాలను షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.కాగా దశాబ్ద కాలంగా టీమిండియా తరఫున నిలకడగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్గా షమీకి పేరుంది. అయితే, వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా గాయపడ్డ ఈ బెంగాల్ పేసర్ కోలుకోవడానికి ఈసారి చాలా సమయమే పట్టింది. చీలమండ గాయం వేధిస్తున్నా.. వరల్డ్కప్ టోర్నీని పూర్తయ్యేదాకా పంటిబిగువన నొప్పిని భరించిన షమీ.. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా ఈవెంట్లో ఇరవై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.శస్త్ర చికిత్స తర్వాతతద్వారా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన షమీ.. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు ఏడాదికాలంగా టీమిండియాకు దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. దేశవాళీ క్రికెట్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. బెంగాల్ తరఫున దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగాడు. నిలకడగా బౌలింగ్ చేయడంతో వికెట్లు తీసిన షమీ... ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్లకు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ సెలక్టర్లు షమీకి చోటిచ్చారు. ఇక ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20తో అతడు రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ.. తుదిజట్టులో మాత్రం షమీకి చోటు దక్కలేదు. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా స్పిన్నర్లకు పెద్దపీట వేసిన క్రమంలో అతడికి మొండిచేయి ఎదురైంది.పూర్తి ఫిట్గా ఉన్నాడుఅదే విధంగా.. చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ షమీని ఆడించలేదు. తాజా సమాచారం ప్రకారం.. రాజ్కోట్లో జరిగే మ్యాచ్లోనూ అతడిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ స్పందించాడు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘కోల్కతాలో జరిగిన తొలి టీ20కి ముందే షమీ నన్ను తన దగ్గరకు పిలిపించాడు.అంతా బాగానే ఉందని.. తాను పూర్తి ఫిట్గా ఉన్నట్లు చెప్పాడు. అయితే, జట్టు యాజమాన్యం ఆలోచన మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కాబట్టి షమీ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.గంభీర్తో సమస్యా?అయితే, ఇంగ్లండ్తో ఆఖరి రెండు టీ20లలో మాత్రం అతడిని ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా.. వన్డే సిరీస్లోనూ షమీకి అవకాశం ఇస్తారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ మేరకు మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతిమంగా యాజమాన్యం నిర్ణయాలే చెల్లుబాటు అవుతాయి. కోచ్ గౌతం గంభీర్, షమీ మధ్య సమన్వయ, సమాచార లోపం లేదనే అనుకుంటున్నా’’ అని బద్రుద్దీన్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన సూర్యకుమార్ సేన.. రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కింది. తద్వారా 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రాజ్కోట్లో మంగళవారం ఇంగ్లండ్తో మూడో టీ20లో తలపడనుంది.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
Ind vs Eng: అతడికి గాయం.. భారత జట్టులోకి శివం దూబే!
ముంబై ఆల్రౌండర్ శివం దూబే(Shivam Dube) టీమిండియాతో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత అతడు భారత టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడని సమాచారం.లంక పర్యటనలో ఆఖరిగాకాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024) గెలిచిన భారత జట్టులో భాగమైన శివం దూబే ఆ తర్వాత.. శ్రీలంకతో టీ20లలో ఆడాడు. అనంతరం సొంతగడ్డపై జరిగిన బంగ్లాదేశ్తో పొట్టి ఫార్మాట్ సిరీస్కు ఎంపిక చేసి జట్టులో.. అదే విధంగా సౌతాఫ్రికాకు వెళ్లిన టీమ్లోనూ శివం దూబేకు సెలక్టర్లు చోటివ్వలేదు.తాజా రంజీ మ్యాచ్లో డకౌట్లుఈ క్రమంలో అతడు తన సొంత జట్టు ముంబై తరఫున దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, రంజీ మ్యాచ్లలోనూ భాగమయ్యాడు. తాజాగా జమ్మూ కశ్మీర్తో శనివారం ముగిసిన మ్యాచ్లోనూ శివం దూబే ఆడాడు. అయితే, తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లోనూ సున్నా చుట్టాడు.నితీశ్ రెడ్డికి గాయం?అయితే, ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఓ వికెట్ మాత్రం తన ఖాతాలో వేసుకోగలిగాడు. అయితే, అనూహ్యంగా శివం దూబేకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపు వచ్చినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా గాయపడిన మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. స్థానాన్ని దూబేతో భర్తీ చేసినట్లు తెలిపింది.అయితే, నితీశ్ రెడ్డి గాయం తాలూకు వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడికాలేదు. కానీ వెంటనే అతడు మైదానంలో దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని సమాచారం. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా కోల్కతాలో బుధవారం తొలి మ్యాచ్ జరిగింది.తొలి టీ20లో భారత్ విజయంఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో సూర్యకుమార్ సేన ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసన బట్లర్ బృందం 132 పరుగులకే ఆలౌట్ కాగా.. 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.ఇక ఈ మ్యాచ్లో నితీశ్ కుమార్ రెడ్డికి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చసే అవకాశం కూడా రాలేదు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన ఈ ఆంధ్ర క్రికెటర్.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో చిరస్మరణీయ శతకం సాధించాడు. దూబే జట్టుతో చేరేది అపుడేఅనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్తో బిజీ అయిన 21 ఏళ్ల నితీశ్.. దురదృష్టవశాత్తూ గాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది. అయితే, ఇదే రోజు రంజీ మ్యాచ్ ముగించుకున్న శివం దూబే ఇప్పటికిప్పుడు భారత జట్టుతో చేరలేడు. రాజ్కోట్లో మంగళవారం జరిగే మూడో టీ20 నుంచి అతడు టీమిండియాతో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. చదవండి: ICC టీ20 జట్టు ప్రకటన.. కెప్టెన్గా రోహిత్ శర్మ, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు -
Ind vs Eng: టీమిండియాకు ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం!
ఇంగ్లండ్తో రెండో టీ20కి టీమిండియా(India Vs England 2nd T20) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. విజయంతో ఆరంభించిన ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆధిపత్యమే లక్ష్యంగా చెపాక్ బరిలో దిగనుంది. అయితే, చెన్నై మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా శుక్రవారం సాయంత్రం చిదంబరం స్టేడియంలో నెట్స్లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు.చీలమండ నొప్పిఈ సందర్భంగానే అభిషేక్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి పాదం మెలిక పడగా.. చీలమండ నొప్పి(Ankle Injury)తో విలవిల్లాడాడు. ఈ క్రమంలో వెంటనే ఫిజియోలు వచ్చి అభిషేక్ను పరీక్షించారు. అనంతరం అతడు మైదానం వీడాడు. అయితే, మళ్లీ నెట్ సెషన్లో బ్యాటింగ్కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో టీ20కి అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది.సంజూకు జోడీ ఎవరు?ఒకవేళ అభిషేక్ శర్మ గనుక దూరమైతే సంజూ శాంసన్తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్గా వస్తాడా? లేదంటే ప్రయోగాత్మకంగా ఇంకెవరినైనా టాపార్డర్కు ప్రమోట్ చేస్తాడా? అనే చర్చ జరుగుతోంది. కాగా ఈడెన్ గార్డెన్స్లో బుధవారం ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.తొలి టీ20లో అభిషేక్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. బట్లర్ బృందాన్ని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న 24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 79 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.మిగతా వాళ్లలో కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.షమీ వస్తాడా?కాగా టీమిండియలో పునగామనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్కతాలో మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన క్రమంలో షమీకి చోటు ఇవ్వలేకపోయినట్లు మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అద్భుత గణాంకాలు కలిగి ఉన్న యువ పేసర్ అర్ష్దీప్ ఒక్కడికే తుదిజట్టులో దక్కగా.. షమీ బెంచ్కే పరిమితమయ్యాడు.అయితే, తొలి టీ20లో ప్రభావం చూపలేకపోయినప్పటికీ రవి బిష్ణోయికి మరో అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్లతో పాటు అతడినీ రెండో టీ20లో కొనసాగించే అవకాశం ఉంది. ఇక అభిషేక్ శర్మ గాయంతో దూరమైతే గనుక షమీని తుదిజట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఆరంభ ఓవర్లలో అర్ష్దీప్ త్వరత్వరగా వికెట్లు తీశాడు కాబట్టి సరిపోయింది. అందుకే ఈసారి అర్ష్దీప్తో పాటు షమీని కొత్త బంతితో బరిలోకి దించాలనే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చెన్నైలో చిదంబరం స్టేడియం(చెపాక్)లో శనివారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది.చదవండి: భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి టీ20లో ఆడిన జట్టులో ఒక మార్పుతో చెన్నై బరిలో దిగనున్నట్లు తెలిపింది. కాగా కోల్కతాలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్.. అతడి స్థానాన్ని నాలుగు అంతర్జాతీయ టీ20లు ఆడిన ఓ పేసర్తో భర్తీ చేయడం విశేషం.బ్యాటర్ల వైఫల్యంతాజా భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ టీమిండియాతో తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది.బట్లర్ అర్ధ శతకం చేసినాఓపెనర్లు ఫిల్ సాల్ట్(0) డకౌట్ కాగా.. బెన్ డకెట్(4) కూడా విఫలమయ్యాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. లియామ్ లివింగ్స్టోన్(0), జాకబ్ బెతెల్(7), జేమీ ఓవర్టన్(2) దారుణంగా విఫలమయ్యారు. ఇక లోయర్ ఆర్డర్లో గస్ అట్కిన్సన్(2), ఆదిల్ రషీద్(8*), మార్క్వుడ్(1) కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతంఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం చేసి.. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై జయభేరి మోగించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లలో సంజూ శాంసన్(26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79) సుడిగాలి ఇన్నింగ్స్తో మెరిశాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ(19*), హార్దిక్ పాండ్యా(3*) నాటౌట్గా నిలిచారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అట్కిన్సన్ మాత్రం కేవలం రెండు ఓవర్లలోనే ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసిన యాజమాన్యం.. 29 ఏళ్ల రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సేకు తుదిజట్టులో చోటు కల్పించింది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం రెండో టీ20 జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ఆరంభం అవుతుంది.టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.చదవండి: అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో విఫలమైనా ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే ఫార్మాట్లో(ODI Format) సత్తా చాటుతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరిద్దరు మరోసారి పరుగుల వరద పారించడం ఖాయమని పేర్కొన్నాడు.రోహిత్తో పోలిస్తే కోహ్లి కాస్త నయంకాగా భారత సారథి రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్లో నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. అయితే, రోహిత్తో పోలిస్తే కోహ్లి కాస్త నయం. పెర్త్టెస్టులో కనీసం శతకం బాదాడు.దేశవాళీ క్రికెట్ బాటకానీ ఆ తర్వాత మరోసారి చేతులెత్తేశాడు. అయితే, అన్నింటికంటే కూడా ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు షాట్ల ఎంపికలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ఆడితేనే పునర్వైభవం పొందే అవకాశం ఉంటుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలో రోహిత్ శర్మ ముంబై తరఫున రంజీ ట్రోఫీ రెండో దశ బరిలో దిగగా.. కోహ్లి మాత్రం మెడ నొప్పి కారణంగా ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక రోహిత్ రంజీల్లోనూ తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. జమ్ము కశ్మీర్తో మ్యాచ్లో భాగంగా తొలి ఇన్నింగ్స్లో మూడు పరుగులకే అవుటైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఇక ‘విరాహిత్’ ద్వయం తదుపరి ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా.. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత వీరు యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలో దిగనున్నారు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో భాగమవుతారు. అయితే, వీరిద్దరి తాజా వరుస వైఫల్యాల నేపథ్యంలో మెగా టోర్నీలో ఏమేరకు రాణిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వైట్బాల్ క్రికెట్లో అదరగొడతారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే రోహిత్- కోహ్లి వైట్బాల్ క్రికెట్లో పరుగులు తీయడం మొదలుపెడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్ భిన్నమైంది.అవుట్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతులను ఆడాలనే ప్రయత్నంలో విరాట్ సఫలం కాలేకపోయాడు. మరోవైపు.. రోహిత్ కూడా మునుపటి లయను అందుకోలేకపోయాడు. అయితే, వీరిద్దరికి వన్డే ఫార్మాట్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి కచ్చితంగా తిరిగి పుంజుకుంటారు’’ అని పేర్కొన్నాడు.మొక్కుబడిగా వద్దు!ఇక టీమిండియా ప్రధాన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడటం గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఏదో షో ఆఫ్ చేయడానికి మాత్రం రెండు మ్యాచ్లు ఆడేసి వెళ్లిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీలు దొరికినప్పుడల్లా.. తరచుగా క్రికెట్ ఆడుతూ ఉంటేనే ఫామ్లో ఉంటారు.యువ ఆటగాళ్లకు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలతో పోటీ అంటే మంచి మజా ఉంటుంది. వాళ్లకు బౌలింగ్ చేయాలనే ఉద్దేశంతో మరింత ఎక్కువగా కష్టపడతారు. అంతిమంగా ఇది భారత క్రికెట్ ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేస్తుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్పై ఫ్యాన్స్ ఆగ్రహం -
Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఇంగ్లండ్ బ్యాటర్ల అసమర్థతను బాగానే కప్పి పుచ్చుతున్నావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.దమ్ముంటే రెండో టీ20(India vs England)లో సత్తా చూపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్చర్ను ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా చేతిలో ఓటమిపై స్పందిస్తూ.. ఆర్చర్ ఒకింత వింత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..టీమిండియా ఘన విజయంఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ ఆరంభం కాగా.. బుధవారం మొదటి మ్యాచ్ జరిగింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో బట్లర్ బృందాన్ని చిత్తు చేసింది.ఆకాశమే హద్దుగా అభిషేక్ శర్మఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్ల విజృంభణ కారణంగా ఇంగ్లండ్ను 132 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనలోనూ అదరగొట్టింది. మరో 43 బంతులు మిగిలి ఉండగానే 133 పరుగుల టార్గెట్ను పూర్తి చేసింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సుడిగాలి ఇన్నింగ్స్తో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తంగా 34 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఆదిల్ రషీద్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక వన్డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు.జోఫ్రా ఆర్చర్కు వికెట్లుఇక టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు జోఫ్రా ఆర్చర్కు దక్కాయి. సంజూ శాంసన్తో పాటు.. సూర్యకుమార్ యాదవ్లను ఈ రైటార్మ్ పేసర్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ.. అదృష్టం వల్లే టీమిండియా గెలిచిందన్న అర్థంలో వ్యాఖ్యానించాడు.అదృష్టం వల్లే గెలిచారు‘‘ఈరోజు మ్యాచ్లో మిగతా బౌలర్లతో పోలిస్తే పరిస్థితులు నాకు కాస్త అనుకూలంగానే ఉన్నాయి. మావాళ్లలో అందరూ బాగానే బౌలింగ్ చేశారు. అయితే, టీమిండియా బ్యాటర్ల అదృష్టం వల్ల వారికి భంగపాటు ఎదురైంది.టీమిండియా బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయి. కానీ.. మేము సరిగ్గా క్యాచ్లు పట్టలేకపోయాం. తదుపరి మ్యాచ్లో మాత్రం కచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేయబోము. అన్ని క్యాచ్లు ఒడిసిపడతాం. అప్పుడు నలభై పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా చేస్తాం’’ అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు.నిజానికి తొలి టీ20లో అభిషేక్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్ను మాత్రమే ఇంగ్లండ్ ఫీల్డర్లు జారవిడిచారు. తిలక్ వర్మ కూడా ఓసారి బంతిని గాల్లోకి లేపినా.. అదేమీ అంత తేలికైన క్యాచ్ కాదు. ఈ రెండు తప్ప టీమిండియా బ్యాటర్లు క్యాచ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వనే లేదు.అయినప్పటికీ అదృష్టం వల్లే టీమిండియా బ్యాటర్లు తప్పించుకున్నారంటూ ఆర్చర్ వ్యాఖ్యానించడం.. అభిమానుల ఆగ్రహానికి ప్రధాన కారణం. మరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం తమ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామంటూ.. భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వడం గమనార్హం.చదవండి: Rohit Sharma: వింటేజ్ ‘హిట్మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి విఫలమై! -
టీ20ల్లో జోస్ బట్లర్ అరుదైన ఘనత
టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 12000 పరుగులు పూర్తి చేసిన ఏడో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. భారత్తో తొలి టీ20 సందర్భంగా జోస్ ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. జోస్కు ముందు క్రిస్ గేల్ (14562), షోయబ్ మాలిక్ (13492), కీరన్ పోలార్డ్ (13429), అలెక్స్ హేల్స్ (13361), విరాట్ కోహ్లి (12886), డేవిడ్ వార్నర్ (12757) మాత్రమే టీ20ల్లో 12000 పరుగులు చేశారు.టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. గేల్ (343 మ్యాచ్ల్లో), విరాట్, వార్నర్ బట్లర్ కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు. బట్లర్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు (భారత్తో తొలి టీ20 కలుపుకుని) 430 మ్యాచ్లు ఆడి 145.29 స్ట్రయిక్రేట్తో, 35.08 సగటున 12035 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 84 అర్ద సెంచరీలు ఉన్నాయి.బట్లర్ ఒక్క అంతర్జాతీయ క్రికెట్లోనే సెంచరీ, 26 అర్ద సెంచరీల సాయంతో 3457 పరుగులు చేశాడు. బట్లర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 3000 టీ20 పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్ బట్లరే.భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. బట్లర్తో పాటు ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్తో పాటు ఇన్నింగ్స్ను ఓపెన్ చేసిన సంజూ శాంసన్ కూడా బ్యాట్ను ఝులిపించాడు. శాంసన్ 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేశాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) భారత్ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది. -
టీమిండియా భవిష్య కెప్టెన్గా తిలక్ వర్మ!
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆటంటే తనకెంతో ఇష్టమని.. టీ20లలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. పొట్టి ఫార్మాట్లో టీమిండియా భవిష్య కెప్టెన్గా తాను తిలక్నే ఎంచుకుంటానని బ్రాడ్ హాగ్ తెలిపాడు.ఐపీఎల్లో సత్తా చాటికాగా అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే అద్భుతాలు చేసిన అతడు టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023 ఆగష్టులో వెస్టిండీస్(West Indies Tour)తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుస సెంచరీలుఅదే పర్యటనలో వన్డేల్లోనూ తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మొత్తంగా 21 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 635 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా రెండు శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు.. ఈ రెండూ కూడా సౌతాఫ్రికా గడ్డపై.. అదీ వరుస మ్యాచ్లలో సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం.ఇక ఇప్పటికి నాలుగు వన్డేలు పూర్తి చేసుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ 68 పరుగులు చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల.. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో బ్యాటర్గా, సారథిగా సత్తా చాటి ఫైనల్కు చేర్చాడు.ఇక తిలక్ వర్మ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్తో బిజీగా ఉన్నాడు. ఇరుజట్ల మధ్య కోల్కతాలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 16 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్క్వుడ్ బౌలింగ్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.టీమిండియా కెప్టెన్ కావడం ఖాయంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తిలక్ వర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నాకు అత్యంత ఇష్టమైన యువ క్రికెటర్ తిలక్ వర్మ. టీ20 ఫార్మాట్లో అతడు టీమిండియాకు కెప్టెన్ కావడం ఖాయం. అతడు చాలా స్మార్ట్. అతడి క్రికెట్ బ్రెయిన్ సూపర్. అందుకే భవిష్య కెప్టెన్గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు.అభిషేక్ భేష్అదే విధంగా.. ఇంగ్లండ్తో తొలి టీ20లో అదరగొట్టిన అభిషేక్ శర్మను కూడా బ్రాడ్ హాగ్ ఈ సందర్భంగా అభినందించాడు. ‘‘కొన్నిసార్లు అతడు విఫలమైన మాట వాస్తవం. అయితే, కోచ్తో పాటు కెప్టెన్ మద్దతు ఉండటం అతడికి సానుకూలాంశం. ఎందుకంటే.. టీ20 క్రికెట్లో టాపార్డర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని ఏ జట్టైనా కోరుకుంటుంది.ఓపెనింగ్ బ్యాటర్కు మేనేజ్మెంట్ కాస్త స్వేచ్ఛనిస్తుంది. పవర్ ప్లేలో పరుగులు రాబట్టి మంచి పునాది వేస్తే.. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుంది. అభిషేక్ శర్మ విధ్వంసకర ఓపెనర్. అతడు ఈరోజు అద్భుతంగా ఆడాడు. ఇలాగే మున్ముందూ కొనసాగాలి’’ అని బ్రాడ్ హాగ్ ఆకాంక్షించాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 34 బంతుల్లోనే 79 పరుగులతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్రేటు 232.35.చదవండి: అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికి ఇవ్వాల్సింది.. మూడు ఓవర్లలోనే..
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల పొట్టి ఫార్మాట్ సిరీస్లో టీమిండియా(India Beat England) శుభారంభం చేసింది. కోల్కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ను కట్టడి చేయగా.. లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగి అభిషేక్ శర్మ విజయాన్ని నల్లేరు మీద నడకలా మార్చాడు.ఈ మ్యాచ్లో సత్తా చాటి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh), వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలను టీమిండియా అభిమానులు హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఈ ముగ్గురి చక్కటి ఆట తీరు వినోదాన్ని పంచిందంటూ కితాబులిస్తున్నారు. ఇక వీరిలో వరుణ్ చక్రవర్తిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించిన విషయం తెలిసిందే.అభిషేక్ శర్మ లేదంటే వరుణ్?ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’కు అర్ష్దీప్ సింగ్ మాత్రమే అర్హుడని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?.. అభిషేక్ శర్మ లేదంటే వరుణ్?.. కానేకాదు..నా వరకైతే అర్ష్దీప్ మాత్రమే ఈ అవార్డుకు అర్హుడు. ఎందుకంటే.. ఇంగ్లండ్ టాపార్డర్ను అతడు కుప్పకూల్చాడు. ఒకరకంగా.. కేవలం మూడంటే మూడు ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేశాడు’’ అని బసిత్ అలీ అర్ష్దీప్ సింగ్ను ప్రశంసించాడు.అత్యుత్తమంగా రాణించాడుఅదే విధంగా.. ‘‘వరుణ్ చక్రవర్తి కూడా బాగా బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. అయినా సరే.. అద్భుతంగా బౌలింగ్ చేసింది మాత్రం అర్ష్దీప్ అనే చెబుతాను. అతడు ఈరోజు అత్యుత్తమంగా రాణించాడు. రవి బిష్ణోయి కూడా ఫరవాలేదు. వికెట్ తీయలేకపోయినా కాస్త పొదుపుగానే బౌల్ చేశాడు’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.బౌలర్ల విజృంభణకాగా టీమిండియాతో తొలి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 132 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(0), బెన్ డకెట్(4)లను వచ్చీ రాగానే అర్ష్దీప్ అవుట్ చేశాడు. ఆరంభంలోనే మూడు ఓవర్లు వేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. రెండు వికెట్లతో సత్తా చాటాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే మాత్రమే ఇచ్చాడు.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు పూర్తి చేసి 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా(2/42), అక్షర్ పటేల్(2/22) రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆదిల్ రషీద్ రనౌట్లో భాగమయ్యాడు.బ్యాటర్ల సత్తాఇక లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ శుభారంభం అందించారు. సంజూ వేగంగా(20 బంతుల్లో 26) ఆడి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అవుట్ కాగా.. అభిషేక్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లసాయంతో 79 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్ కాగా.. తిలక్ వర్మ(9*) , హార్దిక్ పాండ్యా(3*) అజేయంగా నిలిచి పనిపూర్తి చేశారు.చదవండి: అతడే ఎక్స్ ఫ్యాక్టర్.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్ -
అతడే ఎక్స్ ఫ్యాక్టర్.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా(Piyush Chawla) ప్రశంసలు కురిపించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపిస్తే అది కచ్చితంగా మ్యాచ్ విన్నింగ్సే అవుతుందని కొనియాడాడు. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ను సుదీర్ఘకాలం టీ20 జట్టులో కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్లి చేశాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన అభిషేక్ శర్మ.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఈ పంజాబీ బ్యాటర్ డకౌట్ అయి విమర్శల పాలయ్యాడు. అయితే, అదే వేదికపై శతకంతో చెలరేగి తానేంటో నిరూపించుకున్నాడు.సంజూకు కెప్టెన్ మద్దతుఅయితే, ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక టీ20 జట్టులో ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్(Sanju Samson)తో పాటు అభిషేక్ను మేనేజ్మెంట్ ఆడిస్తున్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్గా సంజూనే కొనసాగిస్తామని ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. దీంతో అతడికి ఢోకా లేనట్లే.జైస్వాల్ రూపంలో ముప్పుఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో గనుక విఫలమైతే అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మరో లెఫ్టాండర్ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రూపంలో అతడికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో బ్యాట్ ఝులిపిస్తేనే మరికొంతకాలం జట్టుతో కొనసాగగలడని అంచనా వేశాడు.ఇరవై బంతుల్లోనే అందుకు తగ్గట్లుగానే అభిషేక్ శర్మ తొలి టీ20లోనే దుమ్ములేపాడు. కేవలం ఇరవై బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 79 రన్స్ సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్లు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిషేక్ శర్మ ఆట తీరును ప్రశంసించాడు. ‘‘అభిషేక్ హై- రిస్క్ బ్యాటర్. ఒకవేళ అతడు పరుగుల వరద పారించాడంటే.. ఆ మ్యాచ్లో జట్టు గెలవాల్సిందే.ఎక్స్- ఫ్యాక్టర్ ప్లేయర్అభిషేక్ శర్మ ఎక్స్- ఫ్యాక్టర్ ప్లేయర్. 20-22 బంతుల్లోనే 60 పరుగులు చేయగలడు. ఇలాంటి వాళ్లను జట్టులో సుదీర్ఘకాలం కొనసాగించాలి. ఈరోజు అతడు కాస్త నెమ్మదిగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.అతడి ఆట తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక చక్కటి నిదర్శనం. అతడి ఆడిన షాట్లు కూడా చూడముచ్చటగా ఉన్నాయి’’ అని పీయూష్ చావ్లా కితాబులిచ్చాడు. కాగా ఇంగ్లండ్తో కోల్కతాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ప్రత్యర్థిని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. అభిషేక్ శర్మ(79) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా వేగంగా టార్గెట్ను ఛేదించింది. ఇక ఇంగ్లండ్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన మూడు వికెట్ల వీరుడు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
టీమిండియాతో తొలి టీ20లో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. పరుగులు రాబట్టేందుకు వీలుగా ఉన్న పిచ్ మీద సత్తా చాటలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యామన్న బట్లర్.. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపిందని తెలిపాడు. ఏదేమైనా భారత బౌలర్లు అద్భుతంగా ఆడారని.. తదుపరి మ్యాచ్లో తాము తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నాడు.అర్ష్దీప్ అదరగొడితే..కాగా ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగిన పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(0)ను డకౌట్ చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. అనంతరం బెన్ డకెట్(4)ను కూడా పెవిలియన్కు పంపాడు.వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడుఅర్ష్దీప్తో పాటు మిస్టరీ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. వరుస బంతుల్లో లివింగ్స్టోన్(0)తో పాటు హ్యారీ బ్రూక్(17)ను అవుట్ చేశాడు. అదే విధంగా.. కొరకాని కొయ్యగా మారిన కెప్టెన్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచే దూకుడు కనబరిచింది. అభిషేక్ శర్మ ధనాధన్సంజూ శాంసన్ (20 బంతుల్లో 26) వేగంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. అభిషేక్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 34 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 79 పరుగులు చేశాడు.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) విఫలం కాగా.. తిలక్ వర్మ(19), హార్దిక్ పాండ్యా(3) నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. అభిషేక్ ధాటికి 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 133 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఒత్తిడి పెంచలేకపోయాం.. ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో జోస్ బట్లర్ స్పందిస్తూ.. ‘‘టీమిండియాపై ఒత్తిడి పెంచలేకపోయాం. నిజంగా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక మా జట్టులోని కొంత మంది.. కొందరు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి.. వికెట్ బాగానే ఉంది. ఫాస్ట్ స్కోరింగ్ గ్రౌండ్ ఇది.కానీ మేము ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. టీ20 క్రికెట్లో మేము మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాం. అయితే, అల్ట్రా- అగ్రెసివ్ జట్టుతో పోటీలో ఈరోజు వెనుకబడిపోయాం. ఏదేమైనా టీమిండియాతో పోరు రసవత్తరంగా ఉంటుంది. తదుపరి మ్యాచ్లలో కచ్చితంగా రాణిస్తాం. ప్రతీ వేదికపై విభిన్న పిచ్ పరిస్థితులు ఉంటాయి.జోఫ్రా ఆర్చర్ సూపర్స్టార్మా జట్టులో జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అతడొక సూపర్స్టార్. ప్రత్యర్థిని కచ్చితంగా భయపెట్టగలడు. ముందుగా చెప్పినట్లు మేము తిరిగి పుంజుకుంటాం’’ అని పేర్కొన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైనట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ సంజూ, సూర్య రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ వికెట్ను ఆదిల్ రషీద్ దక్కించుకున్నాడు. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది.చదవండి: NADA: డోపింగ్ పరీక్షలు.. బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..𝗔 𝗱𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗵𝗼𝘄 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗘𝗱𝗲𝗻 𝗚𝗮𝗿𝗱𝗲𝗻𝘀! 💪 💪#TeamIndia off to a flying start in the T20I series, sealing a 7⃣-wicket win! 👏 👏Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hoUcLWCEIP— BCCI (@BCCI) January 22, 2025 -
Ind vs Eng: అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు.. ఇదే లాస్ట్ ఛాన్స్!
అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ సిరీస్లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.అరంగేట్రంలో డకౌట్.. ఆ వెంటనే సెంచరీగతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా.. అభిషేక్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ అభిషేక్ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.కాబట్టి అభిషేక్కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ కావడం అభిషేక్ శర్మకు మరో మైనస్. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్ ఫామ్లో ఉన్నాడు.అలా అయితే వృథానేఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్తో వన్డేల్లో శుబ్మన్ గిల్- రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథిఏదేమైనా యశస్వి జైస్వాల్ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్ చోప్రా అన్నట్లు అభిషేక్ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.చదవండి: జైస్వాల్కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం: సూర్య
సౌతాఫ్రికా గడ్డపై విజయం తర్వాత సూర్యకుమార్ సేన స్వదేశంలో మరో పొట్టి ఫార్మాట్ పోరుకు సిద్ధమైంది. ఇంగ్లండ్(India Vs England)తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా బుధవారం తొలి టీ20 ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై పరుగుల వరద పారించేందుకు సై అంటున్నాయి.ఇక టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో సెమీస్లో తలపడ్డ ఇండియా- ఇంగ్లండ్ ముఖాముఖి పోటీపడటం ఇదే తొలిసారి. నాడు టీమిండియా చేతిలో చిత్తైన ఇంగ్లిష్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024 సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో అదరగొట్టిన ఈ ఆల్రౌండర్ను కాదని.. సూర్యకుమార్ యాదవ్ను రోహిత్ శర్మ(Rohit Sharma) వారసుడిగా ప్రకటించింది. సారథిగా సూపర్ హిట్ఈ క్రమంలో గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన సూర్య.. 3-0తో క్లీన్స్వీన్ విజయంతో ప్రస్థానం ఆరంభించాడు. అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్పై కూడా సూర్య ఇదే ఫలితం పునరావృతం చేయగలిగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో 3-1తో టీమిండియాను గెలిపించాడు. ఇక ఇంగ్లండ్తో టీ20 సిరీస్ల నేపథ్యంలో కొత్త వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాతో సూర్య అనుబంధం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో భాగంగా ఈ ప్రస్తావన రాగా సూర్య హుందాగా స్పందించాడు.మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం‘‘హార్దిక్ పాండ్యాతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా నాయకత్వ బృందంలో అతడు ఎల్లప్పుడూ కీలక భాగమే. భారత జట్టును ఎలా నడిపించాలో మాకందరికీ బాగా తెలుసు. మైదానంలోకి దిగాక జట్టు కోసం అందరం చర్చించే నిర్ణయం తీసుకుంటాం. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్నారు. మైదానంలో అవసరమైనపుడు సూచనలు, సలహాలు ఇస్తారు.ఇక హెడ్ కోచ్ గౌతం గంభీర్తో కూడా నేను గతంలో కలిసి పని చేశాను. ఆయన ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛనిస్తారు. కోచ్ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలోనే వెళుతోంది. వికెట్ కీపర్గా సంజూ శాంసన్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మరో ప్లేయర్ గురించి ఆలోచన లేదు.ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లుటీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దాదాపు ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లు ఆడి టీమ్ను సిద్ధం చేయడం ముఖ్యం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. జట్టులో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూనే.. తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా వివరించాడు.నేను బాగా ఆడలేదు కాబట్టేఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా సూర్య ఈ సందర్భంగా స్పందించాడు. వన్డే ఫార్మాట్లో తన ప్రదర్శన బాగా లేనందువల్లే ఎంపిక కాలేదని నిజాయితీగా ఒప్పుకొన్నాడు. ఏదేమైనా వన్డేల్లో బాగా ఆడలేకపోవడమే తనను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని తెలిపాడు.చదవండి: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. కెప్టెన్గా సంజూ శాంసన్! నితీశ్కు చోటు? -
ఇంగ్లండ్ వైస్ కెప్టెన్గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ పురుషుల జట్టుకు కొత్త వైస్ కెప్టెన్ను ప్రకటించింది. యువ తరంగం హ్యారీ బ్రూక్ ఇకపై పరిమిత ఓవర్ల జట్టుకు ఉప నాయకుడిగా పనిచేస్తాడని మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు బ్రూక్ నియామకానికి సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మూడేళ్ల నుంచి అదరగొడుతున్నాడుకాగా 2022లో వెస్టిండీస్తో టీ20 సిరీస్ సందర్భంగా హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది సౌతాఫ్రికాతో సిరీస్లో భాగంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇక 25 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 24 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లలో అతడి సగటు 30.73.. స్ట్రైక్రేటు 146.07. వన్డేల్లో బ్రూక్ సగటు 39.94.. స్ట్రైక్రేటు 106.83. మూడేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో టెస్టుల్లో ఎనిమిది, వన్డేల్లో ఒక శతకం సాధించాడు.బట్లర్ వారసుడిగాఇలా అద్భుత ప్రదర్శనతో మేనేజ్మెంట్ను ఆకట్టుకుంటున్న బ్రూక్ను వైస్ కెప్టెన్ పదవి వరించింది. బట్లర్ వారసుడిగా అతడిని చూస్తున్న యాజమాన్యం భవిష్యత్తులో సారథిగా నియమించాలనే యోచనలో ఉన్నట్లు తాజా ప్రకటన స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయమై ఊహాగానాలు రాగా.. బ్రూక్ మాత్రం పెద్దగా స్పందించలేదు.ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు చేరువగా..ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ హ్యారీ బ్రూక్ ఆడుతున్నాడు. 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో మొత్తంగా 11 మ్యాచ్లు ఆడి.. 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది.ఈ క్రమంలో 2024 ఎడిషన్కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ను కొనుగోలు చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సీజన్ మొత్తానికి అతడు దూరంగానే ఉన్నాడు. అయినప్పటికీ ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిపై మరోసారి నమ్మకం ఉంచింది. 2025 మెగా వేలం సందర్భంగా రూ. 6.25 కోట్లకు హ్యారీ బ్రూక్ను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా ఇంగ్లండ్కు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది.జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు జరుగనుండగా.. ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్కు షెడ్యూల్ ఖరారైంది. కోల్కతా, చెన్నై, రాజ్కోట్, పుణె, ముంబై, టీ20లకు.. నాగ్పూర్, కటక్, అహ్మదాబాద్ వన్డేలకు ఆతిథ్యం ఇస్తాయి. ఇక ఇప్పటికే ఈ సిరీస్ల కోసం భారత్- ఇంగ్లండ్ బోర్డులు తమ జట్లను ఖరారు చేశాయి. చదవండి: Ind vs Eng: భారత తుదిజట్టులో వీరే.. ఆ ప్లేయర్లు బెంచ్కే పరిమితం! -
Ind vs Eng 1st T20: భారత తుదిజట్టులో వీరే!
ఇంగ్లండ్తో టీ20 సమరానికి(India vs England T20 Series) టీమిండియా సన్నద్ధమైంది. కోల్కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం(జనవరి 22) బట్లర్ బృందంతో తొలి టీ20లో తలపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో 3-1తో ఓటమి తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి సిరీస్ ఇది.ఈ నేపథ్యంలో తిరిగి విజయాల బాట పట్టాలని.. ఇంగ్లండ్తో టీ20లతో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు జరిగే ఈ పరిమిత సిరీస్లలో విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.ఓపెనింగ్ జోడీ అదేకాగా ఇంగ్లండ్తో తొలుత ఐదు టీ20లు, అనంతరం మూడు వన్డేల సిరీస్లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీనే ఓపెనర్లుగా కొనసాగనున్నారు. నిజానికి సంజూ ఓపెనింగ్ బ్యాటర్గా ప్రమోట్ అయిన తర్వాతే నిలకడగా రాణిస్తున్నాడు.ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్లో రెండు శతకాలతో చెలరేగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 366 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్రేటు 198.91 కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయ టీ20లలో సంజూ ఇప్పటికే మూడు సెంచరీలు తన పేరిట లిఖించుకున్నాడు.మరోవైపు.. అభిషేక్ శర్మ మాత్రం ఐపీఎల్ మాదిరి టీమిండియా తరఫున బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ తర్వాత అతడి సగటు కేవలం 18.85 కావడం గమనార్హం. అయితే, దేశీ టీ20 టోర్నీలో మాత్రం మంచి ఫామ్ కనబరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్లో పంజాబ్ కెప్టెన్గా వ్యవహరించిన అభిషేక్.. 255 పరుగులు చేశాడు.వరుసగా మూడు శతకాలుఇక మూడో స్థానంలో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ దిగడం ఖాయమే. సౌతాఫ్రికాతో టీ20లలో వరుస శతకాలు బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సెంచరీతో చెలరేగాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్గా వరుసగా మూడు శతకాలు సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు.మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాగా.. ఈసారి కూడా టీమిండియా ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా ప్లేయింగ్ ఎలెవన్లో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై శతకం(టెస్టు) బాదిన నితీశ్ రెడ్డి.. తనకు గుర్తింపు తెచ్చిన టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! వీరితో పాటు ఫినిషర్ రింకూ జట్టులో ఉండనే ఉంటాడు.షమీ రాక.. రాణాకు నో ఛాన్స్ఇక బౌలర్ల విషయంలో.. ముఖ్యంగా పేసర్ల విషయంలో కాస్త సందిగ్దం నెలకొనే అవకాశం ఉంది. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్తో పునరాగమనం చేస్తున్నాడు. కాబట్టి అతడు పూర్తి ఫిట్గా ఉంటే యాక్షన్లోకి దిగడం లాంఛనమే. అయితే, అతడితో పాటు పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్ ఒక్కడికే ఛాన్స్ దక్కనుంది.చాంపియన్స్ ట్రోఫీకి ముందు అర్ష్ కూడా వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడతాడు. దీంతో హర్షిత్ రాణా బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇక స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులో ఆడనుండగా.. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు సమాచారం. ఇక వికెట్ కీపర్గా సంజూ అందుబాటులో ఉంటాడు కాబట్టి ధ్రువ్ జురెల్ కూడా బెంచ్కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి.ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
ఇంగ్లండ్తో స్వదేశంలో మూడు వన్డేల(Ind vs Eng ODI Series)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. ఇదే జట్టు ఒక్క మార్పుతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలోకి దిగుతుందని వెల్లడించిందిఓపెనర్గా ఎవరు?కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్(Shubman Gill) వైస్ కెప్టెన్గా ఎంపికకాగా.. మరో యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఈ ఇద్దరిలో ఎవరు తుదిజట్టులో ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్ అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో దుమ్ములేపాడు. అనంతరం రెండు ద్విశతకాలు కూడా బాది సత్తా చాటాడు. అదే టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలోనూ జైసూ ఎంట్రీ ఇచ్చాడు.బుమ్రా బదులు హర్షిత్ రాణాఇక ఇప్పటి వరకు ఓవరాల్గా టీమిండియా తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. టెస్టుల్లో 1798, టీ20లలో 723 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పితో బాధపడుతున్న పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేనట్లు తెలుస్తోంది.అందుకే ఇంగ్లండ్తో వన్డేలకు బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు టీమిండియా సెలక్టర్లు. అయితే, ఫిట్నెస్ ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా జట్టుతో చేరనుండగా.. హర్షిత్ పక్కకు తప్పుకొంటాడు.షమీతో పాటు వారు కూడాఇక ఈ జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ స్థానం సంపాదించగా.. స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్తో పాటు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక పేసర్ల విభాగంలో మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మొత్తం ఐదు టీ20లు(జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2) జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది.ఇంగ్లండ్తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.ఇంగ్లండ్తో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).భారత్తో వన్డేలకు/చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్తో టీ20లకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
చాంపియన్స్ ట్రోఫీ: భారత జట్టు ప్రకటన తేదీ ఖరారు!
చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైంది. ఈ ఐసీసీ టోర్నీకి శనివారం టీమిండియాను ప్రకటించనుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి మీడియా ముఖంగా జట్టు వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) చివరగా 2017లో జరిగింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. దుబాయ్లోఇక మెగా ఈవెంట్కు వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై కాగా.. ఆతిథ్య జట్టు హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాకిస్తాన్కు పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. ఇందుకు అంగీకరించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను కూడా ఒప్పించింది. ఈ క్రమంలో టీమిండియా దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడనుంది.ఇక ఈ మెగా టోర్నీకి ప్రొవిజనల్ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13ను డెడ్లైన్గా విధించగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఇప్పటికే తమ టీమ్ల వివరాలు వెల్లడించాయి. అయితే, పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్ మాత్రం గడువు పొడిగించాల్సిందిగా కోరినట్లు సమాచారం.అదే రోజు ఇంగ్లండ్తో వన్డేలకు జట్టు ప్రకటనఈ నేపథ్యంలో శనివారం(జనవరి 18)న తమ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇక అదే రోజు ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు కూడా టీమ్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది.ఆసీస్తో ఐదు టెస్టుల సిరీస్లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఇక తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు టీ20, మూడు వన్డేల సిరీస్లు ఆడనుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు కాగా.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి.ఇక ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ముగిసిన తర్వాత టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుండగా.. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న భారత్ తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన దాయాదుల పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్లో జరుగనుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టు (అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ సాధిస్తే), మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.చదవండి: ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం! ఆమె ఎవరంటే? -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు మాంచి ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత జట్టు ఇటీవల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఓటమితో పాటు అంతకు ముందు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైంది. ఈ రెండు సార్లూ మన బ్యాటింగే పెద్ద బలహీనతగా కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్లో ఇంగ్లండ్లో జరిగే టెస్టు సిరీస్కు ముందుగా టీమిండియా సన్నద్ధత మెరుగ్గా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. భారత టెస్టు జట్టు సభ్యులంతా రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైనా... ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఉండటంతో ఒకటికి మించి రంజీ మ్యాచ్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఆ తర్వాత ఐపీఎల్ మొదలైతే ఎరుపు బంతితో సాధన అసాధ్యం! దాంతో ఇంగ్లండ్కు వెళ్లి అక్కడే నాలుగు రోజులు మ్యాచ్లు ఆడాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ యువ జట్టు ‘లయన్స్’తో భారత్ నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనుంది. ఐపీఎల్ ముగిసే మే 25 నుంచి తొలి టెస్టు ప్రారంభమయ్యే జూన్ 20 మధ్య ఉన్న సమయంలో టీమిండియా మూడు మ్యాచ్లు ఆడుతుంది. అక్కడి వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడి బ్యాటింగ్ మెరుగుపర్చుకోవడం మాత్రమే కాకుండా టెస్టు టీమ్లో స్థానాన్ని ఆశించే ఆటగాళ్లు కూడా తమ సత్తాను చాటేందుకు ఈ మూడు మ్యాచ్లు ఉపకరిస్తాయని బోర్డు ఆశిస్తోంది. ఆసీస్తో సిరీస్లో విఫలమైన రోహిత్, కోహ్లిలతో పాటు ఇతర ఆటగాళ్లంతా ఈ మ్యాచ్లలో బరిలోకి దిగనున్నారు. -
Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు?
టెస్టుల్లో వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా.. మరో కీలక పోరుకు సన్నద్ధమవుతోంది. స్వదేశంలో ఇంగ్లండ్(India vs England)తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22న టీ20తో మొదలై.. ఫిబ్రవరి 12న మూడో వన్డేతో ఈ సిరీస్ ముగియనుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో సిరీస్ నుంచి టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్ను నియమించనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.గంభీర్కు చేదు అనుభవాలుఈ క్రమంలో మరో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. గతేడాది శ్రీలంక పర్యటనతో కోచ్గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీకి ఆరంభంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. లంకతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం 2-0తో ఓడిపోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్ను కోల్పోయింది.అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్తో టీ20, టెస్టుల్లో జయకేతనం ఎగురవేసిన భారత జట్టు.. న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో వైట్వాష్కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో 3-1తో ఓడి ట్రోఫీని కోల్పోయింది. ఇందుకు టీమిండియా బ్యాటర్ల వైఫల్యమే ప్రధానం కారణం.ద్రవిడ్తో సితాన్షు కొటక్ఈ ఘోర పరాభవాల నేపథ్యంలో బ్యాటింగ్కు ప్రత్యేకంగా కోచ్ను నియమించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. గంభీర్ ఏరికోరి తన సహాయక సిబ్బందికిలోకి తీసుకున్న అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్, ర్యాన్ డష్కాటే పని తీరుపై గుర్రుగా ఉన్న మేనేజ్మెంట్.. వారిని తప్పించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.టీమిండియా బ్యాటింగ్ కోచ్గా సితాన్షు కొటక్ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్కు కీలక విషయాలు వెల్లడించాయి. ‘‘సితాన్షు కొటక్ టీమిండియా బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. త్వరలోనే అతడు జట్టుతో చేరతాడు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు తుది నిర్ణయం జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ కూడా రాబోతోంది. కాబట్టి బీసీసీఐ ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది.ఇక ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు కోల్కతాలో మూడు రోజుల పాటు శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. అందరు ఆటగాళ్లు జనవరి 18నే రిపోర్టు చేయాల్సి ఉంటుంది’’ అని సదరు వర్గాలు తెలిపాయి.కాగా సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ సితాన్షు కొటక్కు కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఈ మాజీ బ్యాటర్.. ఇండియా-‘ఎ’ జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో చివరగా కోచ్గా వ్యవహరించాడు.దేశీ క్రికెట్లో అద్భుతమైన రికార్డుసౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహించిన సితాన్షు కొటక్.. 130 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 8061 పరుగులు చేశాడు. ఇక గతంలో టీమిండియా తాత్కాలిక కోచ్గానూ కొటక్ వ్యవహరించాడు. 2023లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్ పర్యటనలో భారత్ టీ20 సిరీస్ ఆడినప్పుడు అతడు జట్టుతోనే ఉన్నాడు.కాగా రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా ఉన్న సమయంలో విక్రం రాథోడ్ బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు. అయితే, జూలై 2024 తర్వాత ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో సితాన్షు కొటక్ వైపు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్లు తాజా సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
టీమిండియాకు బ్యాడ్న్యూస్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు టీమిండియాకు చేదువార్త!.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్కు అతడు అందుబాటులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.అంతా తానై నడిపించిన బుమ్రాఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పితృత్వ సెలవుల కారణంగా తొలి టెస్టుకు దూరం కాగా బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. పెర్త్లో జరిగిన ఈ మ్యాచ్లో బౌలర్గా, కెప్టెన్గా రాణించి టీమిండియాకు 295 పరుగుల భారీ తేడాతో విజయం అందించాడు.ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్లో.. ఫామ్లేమి దృష్ట్యా రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ మ్యాచ్కు దూరం కాగా బుమ్రా మరోసారి జట్టు పగ్గాలు తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా అతడు వెన్నునొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించుకున్న తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలో దిగి బౌలింగ్ చేశాడు. 32 వికెట్లతో కానీ దురదృష్టవశాత్తూ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో 3-1 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా.. పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఏదేమైనా అద్బుత ప్రదర్శనతో ఈ సిరీస్లో అదరగొట్టిన బుమ్రా 32 వికెట్లతో లీడింగ్ వికెట్టేకర్గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో సొంతగడ్డపై టీ20, వన్డేలు ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనాల్సి ఉంది. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇంగ్లండ్తో వన్డేలతో పాటు.. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లకు కూడా దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. అతడు నాకౌట్ దశకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.బెడ్ రెస్ట్ అవసరం‘‘బుమ్రా వచ్చేవారం బీసీసీఐకి చెందిన, బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన తేదీ ఖరారు కాలేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కండరాల నొప్పితో పాటు వాపు కూడా ఉంది.కాబట్టి వైద్యులు అతడిని ఇంటి వద్ద బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇది నిజంగా జట్టుకు ఎదురుదెబ్బలాంటిదే. డిస్క్ బాహ్య పొర ఉబ్బినట్లు తేలినా, కండరాల వాపు ఎక్కువగా ఉన్నా మరింత కష్టమే. అతడొక విలువైన ఆటగాడు. కాబట్టి అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.అవే కీలకంఅదే విధంగా.. టీమిండియా మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రాంజీ శ్రీనివాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఎడిమా(శరీర కణజాలాల్లో ఫ్లూయిడ్స్) ఫామ్ అయితే.. వాపు వస్తుంది. అయితే, గాయం, నొప్పి తీవ్రత ఆధారంగా ఓ వ్యక్తి ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలనే అంశాన్ని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తి శరీరతత్వం, వైద్యుల పర్యవేక్షణ, వాడే మందులు.. అన్నీ ఇందులో కీలకం’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.చదవండి: అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?: భజ్జీ -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన షమీ.. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు తీశాడంటే..
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఇంగ్లండ్తో తొలి వన్డేలో గనుక అతడు రాణిస్తే.. మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.కాస్త ఆలస్యంగా ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చినా.. వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోయాడు షమీ. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే, వరల్డ్కప్ మధ్యలోనే చీలమండ నొప్పి వేధించినా లెక్కచేయని షమీ.. టోర్నీ ముగిసిన తర్వాత మాత్రం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. అయితే, ఇప్పటి వరకు అతడు టీమిండియాలో పునరాగమనం చేయలేకపోయాడు. తొలుత దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలర్.. పదకొండు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో షమీ స్థానం దక్కించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇంగ్లండ్తో వన్డేల్లోనూ షమీ చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది.ఈ నేపథ్యంలో షమీని ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో అతడు ఐదు వికెట్లు తీస్తే చాలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన మొదటి క్రికెటర్గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది.షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లోస్టార్క్ 102 ఇన్నింగ్స్లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే, షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లో 195 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి తదుపరి ఆడబోయే వన్డేలో షమీ ఐదు వికెట్లు తీశాడంటే.. స్టార్క్ వరల్డ్ రికార్డును అతడు బద్దలుకొడతాడు. ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్గా.. టీమిండియా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కొనసాగుతున్నాడు. అతడు 133 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ అందుకున్నాడు.కాగా టీమిండియా ఇంగ్లండ్తో జనవరి 22- ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20లు ఆడనుంది. అనంతరం.. ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఫిబ్రవరి 6న నాగ్పూర్లో తొలి వన్డే, ఫిబ్రవరి 9న కటక్లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న మూడో అహ్మదాబాద్లో మూడో వన్డే జరుగనున్నాయి.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే1. మిచెల్ స్టార్క్- 102 మ్యాచ్లలో2. సక్లెయిన్ ముస్తాక్- 104 మ్యాచ్లలో3. ట్రెంట్ బౌల్ట్- 107 మ్యాచ్లలో4. బ్రెట్ లీ- 112 మ్యాచ్లలో5. అలెన్ డొనాల్డ్- 117 మ్యాచ్లలో.చదవండి: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్స్టార్పై వేటు! -
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్స్టార్పై వేటు!
ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్ కెప్టెన్గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్దీప్ సింగ్తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.సూపర్స్టార్పై వేటు!మరోవైపు.. సూపర్స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్తో ఐదు టీ20లుకోల్కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్కోట్లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్). చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
టీమిండియా యువ బౌలర్కు వెన్నునొప్పి.. మరో పేసర్ అవుట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సత్తా చాటి.. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భారత క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ క్యాష్ రిచ్ లీగ్లో ప్రతిభ నిరూపించుకోవడం ద్వారా యువకులు అంతర్జాతీయ టీ20లలోనూ ఆడే అవకాశం దక్కించుకుంటున్నారు. నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా ఆ కోవకు చెందిన వాడే. ఈ ఢిల్లీ ఎక్స్ప్రెస్ గతేడాది ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు.అరేంగేట్ర మ్యాచ్లోనేలక్నో సూపర్ జెయింట్స్ తరఫున అరేంగేట్ర మ్యాచ్లోనే మయాంక్ యాదవ్.. తన పేస్ పదనుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ఈ స్పీడ్స్టర్. అయితే, కేవలం నాలుగు మ్యాచ్లు ఆడిన తర్వాత గాయం కారణంగా.. ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో సత్తా చాటిఅనంతరం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మయాంక్ యాదవ్.. స్వదేశంలో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. బంగ్లాతో మూడు మ్యాచ్లలోనూ ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ గాయం తిరగబెట్టడంతో మయాంక్ యాదవ్ టీమిండియాకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరుగనున్న టీ20 సిరీస్కైనా ఎంపికవుతాడని భావిస్తే.. ఈసారి కూడా గాయం అతడికి అడ్డంకిగా మారింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మయాంక్ యాదవ్ ఇంకా కోలుకోలేదని సమాచారం.వెన్నునొప్పి వేధిస్తోందిఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అతడిని వెన్నునొప్పి వేధిస్తోంది. కాబట్టి ఇంగ్లండ్తో సిరీస్ నాటికి ఫిట్నెస్ సాధించకపోవచ్చు. సెకండ్ లెగ్లో భాగంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ రంజీ జట్టులో కూడా మయాంక్ పేరు లేకపోవడం గమనించే ఉంటారు’’ అని పేర్కొన్నాయి.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ కూడా ఈ సిరీస్కు దూరం కానున్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో తీరికలేకుండా గడిపిన ఈ ఇద్దరు ఫాస్ట్బౌలర్లు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని.. ఇంగ్లండ్తో వన్డేలకు మాత్రం తిరిగి రానున్నట్లు సమాచారం. మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా అప్పుడే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక బుమ్రా, సిరాజ్, షమీ గైర్హాజరీలో అర్ష్దీప్ సింగ్ టీ20 సిరీస్లో పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నట్లు సమాచారం.భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. టీ20 సిరీస్, వన్డే షెడ్యూల్టీ20లుతొలి టీ20- జనవరి 22- కోల్కతారెండో టీ20- జనవరి 25- చెన్నైమూడో టీ20- జనవరి 28- రాజ్కోట్నాలుగో టీ20- జనవరి 31- పుణెఐదో టీ20- ఫిబ్రవరి 2- ముంబైవన్డేలుతొలి వన్డే- ఫిబ్రవరి 6- నాగ్పూర్రెండో వన్డే- ఫిబ్రవరి 9- కటక్మూడో వన్డే- ఫిబ్రవరి 12- అహ్మదాబాద్.చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
Ind vs Eng: నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్ ఇచ్చిన భారత పేసర్!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనానికి సై అంటున్నాడు. ఇప్పటికే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ బెంగాల్ బౌలర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆకట్టుకుంటున్నాడు. మధ్యప్రదేశ్తో ఇటీవల జరిగిన మ్యాచ్లో బ్యాట్తో(42 పరుగులు నాటౌట్)నూ సత్తా చాటిన షమీ.. తాజాగా ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో బంతితో రాణించాడు.వడోదర వేదికగా తొలి ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ - హర్యానా(Haryana vs Bengal) మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్యానాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అర్ష్ రంగా(23), హిమాన్షు రాణా(14) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. కెప్టెన్, వన్డౌన్ బ్యాటర్ అంకిత్ కుమార్(18) కూడా నిరాశపరిచాడు.రాణించిన మిడిలార్డర్ బ్యాటర్లుఅయితే, మిడిలార్డర్లో పార్థ్ వత్స్(62), నిశాంత్ సింధు(64) మాత్రం దుమ్ములేపారు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. మిగిలిన వాళ్లలో రాహుల్ తెవాటియా(29) ఫర్వాలేదనిపించగా.. ఎనిమిదో స్థానంలో వచ్చిన సుమిత్ కుమార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి హర్యానా 298 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్లో బెంగాల్ పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ కోటా పూర్తి చేయడంతో పాటు.. వికెట్లు తీయడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. హర్యానాతో మ్యాచ్లో షమీ పది ఓవర్లు బౌల్ చేసి.. 61 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆరంభంలో ఓపెనర్ హిమాన్షు రాణాను అవుట్ చేసిన షమీ.. డెత్ ఓవర్లలో దినేశ్ బనా(15), అన్షుల్ కాంబోజ్(4)లను వెనక్కి పంపాడు.సర్జరీ తర్వాత నో రీ ఎంట్రీఇలా ఓవరాల్గా తన ప్రదర్శన ద్వారా షమీ.. తాను పూర్తి ఫిట్గా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. మిగతా బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు, సయాన్ ఘోష్, ప్రదీప్త ప్రామాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా షమీ టీమిండియాకు చివరగా ఆడాడు.స్వదేశంలో జరిగిన నాటి ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ 24 వికెట్లతో సత్తా చాటాడు. చీలమండ గాయం వేధిస్తున్నా ఈ మెగా ఈవెంట్లో కొనసాగిన షమీ.. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మహ్మద్ షమీ.. ఇంత వరకు భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్లు ఆడి.. పదకొండు వికెట్లు తీసినా.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడిని పక్కనపెట్టారు. టెస్టుల్లో బౌలింగ్ చేసే స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదన్న కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. అయితే, తదుపరి టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22 నుంచి ఐదు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో షమీ పది ఓవర్ల కోటా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి.. తానూ రేసులో ఉన్నానని సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
అరివీర భయంకరమైన ఫామ్లో అయ్యర్.. టీమిండియాలో చోటు పక్కా..!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్నాడు. అయ్యర్ ఈ ఏడాది దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫామ్ లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. దేశవాలీ క్రికెట్లో మెరుగ్గా ఆడుతున్నాడు. శ్రేయస్ మిగతా టీమిండియా ఆటగాళ్లలా బీరాలకు పోకుండా తనను తాను తగ్గించుకుని దేశవాలీ క్రికెట్ ఆడాడు. శ్రేయస్ ఈ ఏడాది రంజీల్లో 90.4 సగటున, 88.8 స్ట్రయిక్రేట్తో 452 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 188.5 స్ట్రయిక్రేట్తో 49.3 సగటున 345 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయస్ పట్టపగ్గాల్లేకుండా బ్యాట్ను ఝులిపిస్తున్నాడు. వీహెచ్టీలో శ్రేయస్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండు సెంచరీల సాయంతో 325 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ యావరేజ్ చూస్తే కళ్లు చెదురుతాయి. శ్రేయస్ 325 సగటున పరుగులు సాధించాడు. అతని స్ట్రయిక్రేట్ 131.6గా ఉంది. ఈ గణాంకాలతో శ్రేయస్ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. పలు నివేదికల ప్రకారం శ్రేయస్ ఇంగ్లండ్ సిరీస్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కానున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఇదే భీకర ఫామ్ను కొనసాగిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్కు తిరుగే ఉండదు. శ్రేయస్ టీమిండియా తరఫున చివరిగా గతేడాది ఆగస్ట్లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. శ్రేయస్ తన చివరి టీ20ను 2023 డిసెంబర్లో ఆడాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ శ్రేయస్కు చివరి టీ20. టెస్ట్ల విషయానికొస్తే..శ్రేయస్ టెస్ట్ల రికార్డు అంత బాలేదు. 2021 నవంబర్లో తొలి టెస్ట్ మ్యాచ్ (న్యూజిలాండ్తో) ఆడిన శ్రేయస్.. 2024 ఫిబ్రవరిలో తన చివరి టెస్ట్ మ్యాచ్ (ఇంగ్లండ్) ఆడాడు. 33 ఏళ్ల శ్రేయస్ టీమిండియాలో చోటే లక్ష్యంగా దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇంగ్లండ్తో పరిమత ఓవర్ల సిరీస్లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 12వ తేదీలోపు ప్రకటించనున్నారు. చాలా నివేదికలు రెండు ఫార్మాట్లలో శ్రేయస్కు చోటు పక్కా అని అంటున్నాయి. శ్రేయస్ రాకతో మిడిలార్డర్లో టీమిండియా అత్యంత పటిష్టంగా మారుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. వన్డే ఫార్మాట్లో మొదటి నుంచి శ్రేయస్కు తిరుగులేదు. ఈ ఫార్మాట్లో అతను 62 మ్యాచ్లు ఆడి 47.47 సగటున, 101.21 స్ట్రయిక్రేట్తో 2421 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లోనూ శ్రేయస్కు మెరుగైన రికార్డే ఉంది. పొట్టి ఫార్మాట్లో శ్రేయస్ 51 మ్యాచ్లు ఆడి 136.12 స్ట్రయిక్రేట్తో, 30.66 సగటున 1104 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ల్లో అంతంతమాత్రంగా రాణించిన శ్రేయస్.. 14 మ్యాచ్ల్లో 36.86 సగటున 811 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
ఇంగ్లండ్తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి రెస్ట్!
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణంగా భారత బ్యాటర్ల వైఫల్యమే అని చెప్పవచ్చు. ఇక ఆటలో గెలుపోటములు సహజం కాబట్టి.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లపై దృష్టి సారించనుంది.ఇప్పటికే ఆస్ట్రేలియాను వీడిన టీమిండియా స్టార్లలో కొందరు.. స్వదేశంలో అడుగుపెట్టగానే దేశీ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రసిద్ కృష్ణ, దేవ్దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లలో భాగం కానున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్కు విశ్రాంతిఅయితే, కేఎల్ రాహుల్ను కూడా ఈ టోర్నీలో ఆడాలని యాజమాన్యం సూచించగా.. అతడు తనకు విశ్రాంతి కావాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా.. దేవ్దత్ పడిక్కల్ పెర్త్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. నిరాశపరిచిన పడిక్కల్అయితే, తొలి ఇన్నింగ్స్లో డకౌటై పూర్తిగా నిరాశపరిచిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 25 పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత మళ్లీ అతడు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం సంపాదించలేకపోయాడు.వాషీకే పెద్దపీటఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు మాత్రం ఈ సిరీస్లో ప్రాధాన్యం దక్కింది. రవిచంద్రన్ అశ్విన్ను కాదని మరీ.. టీమిండియా మేనేజ్మెంట్ వాషీ వైపు మొగ్గుచూపింది. అందుకు తగ్గట్లుగానే వాషీ రాణించాడు. అవసరమైన వేళ బ్యాట్ ఝులిపించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు ఈ చెన్నై చిన్నోడు.ప్రసిద్ హిట్అయితే, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లతో పాటు పేస్ దళంలో ఆకాశ్ దీప్తో పోటీలో వెనుకబడ్డ ప్రసిద్ కృష్ణకు ఆఖరి టెస్టులో అవకాశం వచ్చింది. సిడ్నీ టెస్టుకు ముందు ఆకాశ్ దీప్ గాయపడిన కారణంగా.. ప్రసిద్కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్లో మొత్తంగా ఆరు వికెట్లు తీసి.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఈ కర్ణాటక యువ పేసర్.నాకౌట్ మ్యాచ్ల బరిలోఇక పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ తదుపరి ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లపై కూడా కన్నేశారు. సీనియర్లు విశ్రాంతి పేరిట దూరమయ్యే పరిస్థితుల నేపథ్యంలో అవకాశాన్ని ఒడిసిపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లలో ఆడేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.కాగా గురువారం (జనవరి 9) నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రి క్వార్టర్ పైనల్ మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. తమిళనాడు, రాజస్తాన్, హర్యానా, బెంగాల్ ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించాయి. మరోవైపు.. అద్భుత ప్రదర్శనతో టాప్-6లో నిలిచిన గుజరాత్, విదర్భ, కర్ణాటక, బరోడా, మహారాష్ట్ర, పంజాబ్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఇంగ్లండ్తో ఐదు టీ20లు, మూడు వన్డేలుఈ నేపథ్యంలో తమిళనాడు తరఫున వాషీ, కర్ణాటక తరఫున ప్రసిద్ కృష్ణ, దేవ్దత్ పడిక్కల్ బరిలో దిగనున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్లు జరుగుతాయి.చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’ -
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్ల పూర్తి వివరాలు
పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు త్వరలో భారత్లో పర్యటించనుంది. ఈ సిరీస్లు జనవరి 22 నుంచి మొదలవుతాయి. తొలుత ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భారత్ ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే జరుగుతున్న సిరీస్లు కావడంతో ఈ సిరీస్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిమత ఓవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)వన్డే సిరీస్లోని మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతాయి.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్లలోని మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్లలోని మ్యాచ్లను డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ మరియు వెబ్సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.ఇంగ్లండ్ వన్డే జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్ఇంగ్లండ్ టీ20 జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టోన్, రెహన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్టీ20, వన్డే సిరీస్ల కోసం భారత జట్లను ప్రకటించాల్సి ఉంది.కాగా, భారత జట్టు తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని (2024-25) ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పదేళ్ల తర్వాత ఆసీస్ బీజీటీని సొంతం చేసుకుంది. బీజీటీ పూర్తయిన 17 రోజుల్లో భారత్ ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతుంది. ఈ సిరీస్ల అనంతరం టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతాయి. పాక్తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే భారత్ ఆడే మ్యాచ్లన్నీ హైబ్రిడ్ మోడల్లో దుబాయ్లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం (భారత్ వర్సెస్ పాక్) ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. మార్చి 2న భారత్ న్యూజిలాండ్తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
Ind vs Eng: తుదిజట్టులో పంత్కు స్థానం ఉండదు!
ఆస్ట్రేలియా పర్యటన తాలూకు చేదు అనుభవం తర్వాత.. స్వదేశంలో మరో మెగా సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్తో టీ20, వన్డేల్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.ఇందులో భాగంగా భారత్- ఇంగ్లండ్ ఐదు టీ20 మ్యాచ్లు, మూడు వన్డే మ్యాచ్లలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో టీ20ల నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)కు భారత తుదిజట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో పంత్కు స్థానం ఉండదు!పంత్కు బదులుగా సంజూ శాంసన్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతారని సంజయ్ బంగర్ అంచనా వేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్గా సంజూ శాంసన్(Sanju Samson) టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్గా, బ్యాటర్గా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.కాబట్టి మరో వికెట్ కీపర్.. అంటే రిషభ్ పంత్కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టం. ఒకవేళ సంజూ ఓపెనర్గా వస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది. అదే మిడిలార్డర్లో వస్తే మరోలా ఉంటుంది. పంత్ టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తుదిజట్టులో సభ్యుడైనా ఈసారి మాత్రం టీమ్లో స్థానం కోసం గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. సంజూ అద్భుత ప్రదర్శన కారణంగా పంత్ చోటు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.తిలక్ వర్మకు లైన్ క్లియర్అదే విధంగా.. తెలుగు తేజం, యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) కూడా ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో కచ్చితంగా ఆడతాడని సంజయ్ బంగర్ జోస్యం చెప్పాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాటర్గా ఉండటం తిలక్ వర్మకు అదనపు బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్లో అతడు కూడా దంచికొట్టాడు. అందుకే తిలక్కు లైన్ క్లియర్గా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా సౌతాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్, తిలక్ వర్మ శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇద్దరూ చెరో రెండు సెంచరీలు బాదడంతో ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్లలో మూడు గెలిచి 3-1తో సౌతాఫ్రికాపై నెగ్గింది. సంజూ, తిలక్ ఊచకోతతొలి టీ20లో 107 పరుగులు సాధించిన సంజూ.. తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. అయితే, నాలుగో టీ20లో మాత్రం 56 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.మరోవైపు.. తిలక్ వర్మ మూడు, నాలుగో టీ20లలో శతక్కొట్టేశాడు. సెంచూరియన్ మ్యాచ్లో 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్.. జొహన్నస్బర్గ్లో 47 బంతుల్లోనే 120 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడిన టీమిండియా ఆతిథ్య జట్టు చేతిలో 3-1తో ఓడింది. తద్వారా పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూలకు సమర్పించుకుంది. ఈ సిరీస్లో రిషభ్ పంత్ 255 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు ఆఫర్! మెగా టోర్నీకి ఎంపికయ్యే ఛాన్స్! -
CT 2025: యశస్వి జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు బంపరాఫర్!?
టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అద్భుత ప్రదర్శనతో జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal). తొలుత(2023) టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. వెస్టిండీస్తో మ్యాచ్లో భారీ శతకం(171) బాది.. తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. విండీస్తో సిరీస్తోనే టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.డబుల్ సెంచరీల వీరుడునిలకడైన ఆట తీరుతో దాదాపు ఏడాదిన్నర కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు జైస్వాల్. ముఖ్యంగా టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయి.. ఇప్పటికే ఎన్నెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడిన జైస్వాల్.. 1798 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం విశేషం.వన్డేల్లో మాత్రం నో ఛాన్స్!ఇక అంతర్జాతీయ టీ20లలో 23 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ ముంబై బ్యాటర్.. 723 రన్స్ సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ(Rohit Sharma)కు జోడీగా, టీ20లలో శుబ్మన్ గిల్(Shubman Gill)కు జంటగా ఓపెనర్గా పాగా వేసిన 23 ఏళ్ల జైసూకు ఇంత వరకు వన్డేల్లో మాత్రం అవకాశం రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ- గిల్లు వన్డేల్లో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ యువ బ్యాటర్కు ఇంత వరకు సెలక్టర్లు పిలుపునివ్వలేదు.మెగా టోర్నీకి ఎంపిక?! అయితే, స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా జైస్వాల్ వన్డేల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనవరి 22 నుంచి భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో జైసూ వన్డే అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనుంది.లిస్ట్-‘ఎ’ క్రికెట్లో గణాంకాలు ఇలాఅందుకే ఈ మెగా టోర్నీకి ముందు జైస్వాల్ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్- గిల్లకు చాంపియన్స్ ట్రోఫీలో బ్యాకప్ ఓపెనర్గా జైస్వాల్ను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంగ్లండ్తో కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఆడించి అతడిని సన్నద్ధం చేయాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో యశస్వి జైస్వాల్ మెరుగైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కేవలం 32 మ్యాచ్లలోనే 1511 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, ఏడు హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ(203) ఉంది.నితీశ్ కుమార్ రెడ్డికి బంపరాఫర్!ఇక జైస్వాల్తో పాటు మరో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆంధ్ర క్రికెటర్ ఇప్పటికే టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో శతకంతో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు.అయితే, ఇప్పట్లో వన్డేల్లో నితీశ్ రెడ్డి అరంగేట్రం చేసే అవకాశం లేకపోయినా.. చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతడు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు రెవ్స్పోర్ట్స్ పేర్కొంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా నితీశ్ రెడ్డి ఎంపికకానున్నట్లు పేర్కొంది. అయితే, ప్రధాన జట్టులో కాకుండా ట్రావెలింగ్ రిజర్వ్స్లో అతడు చోటు సంపాదించనున్నట్లు సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్తో సిరీస్లలోనైనా ఆడిస్తారా? -
ఇంకెన్నాళ్లు ఇలా?.. అతడిని ఆస్ట్రేలియా టూర్కి పంపాల్సింది!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం ఎప్పుడు? ఇప్పటికే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు దూరమైన ఈ సీనియర్ బౌలర్.. కనీసం ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు అయినా అందుబాటులోకి వస్తాడా?.. ఇంతకీ షమీకి ఏమైంది? అతడి గాయం తీవ్రత ఎలా ఉంది?.. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు తప్ప జాతీయ జట్టుతో చేరేందుకు అతడు సిద్ధంగా లేడా?..భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవి. అసలు షమీ ఫిట్నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గానీ.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) గానీ స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నిస్తున్నాడు. తానే గనుక బీసీసీఐ నాయకత్వంలో ఉంటే గనుక షమీని కచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటనకు పంపించేవాడినని పేర్కొన్నాడు.అదే ఆఖరుకాగా వన్డే ప్రపంచకప్-2023(ODI World Cup 2023) సందర్భంగా మహ్మద్ షమీ చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. చీలమండ నొప్పి వేధిస్తున్నా బంతితో మైదానంలో దిగి.. ప్రత్యర్థులకు వణుకుపుట్టించాడు. అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ టీ20 టోర్నీతో రీ ఎంట్రీఅయితే, దురదృష్టవశాత్తూ టైటిల్ పోరులో రోహిత్ సేన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి.. రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఈ మెగా ఈవెంట ముగిసిన తర్వాత షమీ చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందాడు. దాదాపు ఏడాది తర్వాత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు.ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్లు ఆడిన షమీ.. పదకొండు వికెట్లు తీసి సత్తా చాటాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్గా 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే ఆసీస్తో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ మొదలుపెట్టగా.. కనీసం మూడో టెస్టు నుంచైనా షమీ జట్టుతో చేరతాడనే వార్తలు వచ్చాయి.కొన్నాళ్లు విరామం కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం షమీ గాయంపై స్పష్టత లేదని.. అతడి ఫిట్నెస్ గురించి తమకు పూర్తి సమచారం లేదని పేర్కొన్నాడు. దీంతో షమీ ఆసీస్ టూర్ అటకెక్కింది. ఈ క్రమంలో కొన్నాళ్లు విరామం తీసుకున్న షమీ.. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్తో మ్యాచ్లో ఈ బెంగాల్ ఆటగాడు బ్యాట్ ఝులిపించడం విశేషం. 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మహ్మద్ సిరాజ్తో పాటు యువ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ పెద్దగా రాణించకపోవడంతో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడింది. ఇక ఈ సిరీస్ను టీమిండియా 1-3తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఇంకెన్నాళ్లు ఇలా?ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘అసలు అతడు ఎక్కడ ఉన్నాడు? పూర్తి స్థాయిలో కోలుకునేది ఎప్పుడు? అతడిని ఇంకెన్నాళ్లు ఎన్సీఏలో కూర్చోబెడతారు? అతడి ఫిట్నెస్ గురించి, ప్రస్తుతం అతడి పరిస్థితి గురించి బీసీసీఐ గానీ, ఎన్సీఏ గానీ ఎందుకు సరైన సమాచారం ఇవ్వలేకపోతోంది. నిజానికి అతడికి ఉన్న నైపుణ్యాల దృష్ట్యా.. నేనైతే అతడు పూర్తి ఫిట్గా లేకున్నా ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లేవాడిని’’ అని షమీ గురించి ప్రస్తావించాడు.అతడిని ఆస్ట్రేలియా టూర్కి పంపాల్సింది!ఇందుకు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ బదులిస్తూ.. ‘‘షమీ పూర్తి ఫిట్గా లేకపోయినా.. కనీసం నాలుగైదు ఓవర్లు అయినా బౌల్ చేసేవాడు. బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా అందుబాటులో ఉండేవాడు. నిజంగా అతడు గనుక టీమిండియాతో ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో సొంతగడ్డపై ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!? -
భీకర ఫామ్లో ప్రభ్సిమ్రన్ సింగ్-అభిషేక్ శర్మ.. 644 పరుగులతో..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)- అభిషేక్ శర్మ(Abhishek Sharma) దుమ్ములేపుతున్నారు. అద్బుత బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్ల బౌలింగ్ను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఈ ఓపెనింగ్ జోడీ అరుదైన రికార్డు సాధించింది.సౌరాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా తొలి వికెట్కు 298 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అభిషేక్- ప్రభ్సిమ్రన్.. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare trophy)లో మొదటి వికెట్కు అత్యధిక పరుగులు జోడించిన రెండో జంటగా నిలిచారు. ఇక తాజాగా హైదరాబాద్తో శుక్రవారం నాటి మ్యాచ్లోనూ ఈ జోడీ ధనాధన్ దంచికొట్టింది.మళ్లీ శతక్కొట్టాడు!అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి పంజాబ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ప్రభ్సిమ్రన్ సింగ్ మెరుపు శతకం బాదగా.. కెప్టెన్ అభిషేక్ శర్మ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కాగా ప్రభ్సిమ్రన్ 105 బంతుల్లో ఏకంగా 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు. అభిషేక్ 72 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్స్లు బాది 93 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి 145 బంతుల్లో 196 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.426 పరుగుల భారీ స్కోరుమిగిలిన బ్యాటర్లలో అన్మోల్ప్రీత్ సింగ్(46), రమణ్దీప్ సింగ్(80), నేహాల్ వధేరా(35 నాటౌట్), నమన్ ధీర్(14 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో పంజాబ్ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 426 పరుగుల భారీ స్కోరు సాధించింది.అత్యధిక పరుగుల వీరుడిగాహైదరాబాద్ బౌలర్లలో ముదస్సిర్, శరణు నిశాంత్, అనికేత్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్తో మ్యాచ్లో శతక్కొట్టిన ప్రభ్సిమ్రన్ సింగ్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి సగటున 473 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 150 నాటౌట్. మరోవైపు.. పంజాబ్ సారథి అభిషేక్ శర్మ ఒక సెంచరీ, రెండు ఫిఫ్టీల సాయంతో 397 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 170. ఏకంగా 644 పరుగులుఇక ఈ ప్రదర్శనలతో.. ఇంగ్లండ్తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్కు ముందు ప్రభ్సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ భారత సెలక్టర్లకు గట్టి సందేశం పంపించినట్లయింది. భీకర ఫామ్లో ఉన్న టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ ఇంగ్లండ్తో టీ20లలో ఆడటం ఖాయంగానే అనిపిస్తున్నా.. ఈసారైనా ప్రభ్సిమ్రన్ను సెలక్టర్లు కనికరిస్తారేమో చూడాలి!కాగా విజయ్ హజారే ట్రోఫీలో గత మూడు మ్యాచ్లలో కలిపి ప్రభ్సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ జోడీ ఏకంగా 644 పరుగులు(150, 298, 196) సాధించడం విశేషం. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది.చదవండి: కొన్స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది! -
షమీకి విశ్రాంతి.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో తొలి మ్యాచ్కు ఈ బెంగాల్ బౌలర్ దూరం కానున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.మోకాలు ఉబ్బిపోయింది!ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ పదకొండు వికెట్ల తీశాడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా షమీ మరోసారి గాయపడినట్లు సమాచారం. అతడి మోకాలు ఉబ్బిపోయినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.అందుకే షమీని హడావుడిగా తిరిగి జట్టులోకి చేర్చుకునే పరిస్థితి లేదని.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు మొత్తంగా దూరమయ్యాడనే సంకేతాలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్కు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ పేరు కనిపించింది.విశ్రాంతినిచ్చాంఇక డిసెంబరు 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో బెంగాల్ తొలుత ఢిల్లీ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్కు షమీ దూరంగా ఉండనున్నాడు. ‘‘విజయ్ హజారే ట్రోఫీలో మా తొలి మ్యాచ్కు షమీ అందుబాటులో ఉండడు. ఈ టీమిండియా వెటరన్ బౌలర్కు విశ్రాంతినిచ్చాం’’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధంఈ పరిణామాల నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడు ఫిట్ లేని కారణంగా.. టీమిండియా మేనేజ్మెంట్ మరికొన్నాళ్లపాటు అతడిని పక్కన పెట్టనుందట.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు టీమిండియా ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. అప్పుడే షమీ.. భారత జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు ముగిసే సరికి 1-1తో సమంగా ఉంది. తదుపరి మెల్బోర్న్, సిడ్నీల్లో భారత్- ఆసీస్ మధ్య మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: భారత్తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్కు చోటు -
ధోనిని చిన్న పిల్లాడిలా మార్చిన విజయం..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అన్న బిరుదు ఉంది. ధోని ఆన్ ఫీల్డ్ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చాలా నింపాదిగా కనిపించేవాడు. టెన్షన్ అన్నది అతని ముఖంలో కనపడేది కాదు. విజయాలకు ఉప్పొంగిపోవడం.. ఓటములకు ఢీలా పడిపోవడం ధోనికి తెలీదు. అలాంటి ధోని ఒకానొక సందర్భంలో చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఎగిరెగిరి గంతులేశాడు. ఆ సందర్భం 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నాటిది.2013, జూన్ 23న ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఫైనల్లో భారత్.. ఆతిథ్య ఇంగ్లండ్పై 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది, రెండో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్లో గెలుపు ఖరారైన వెంటనే మిస్టర్ కూల్ కెప్టెన్ మిస్టర్ జాలీ కెప్టెన్గా మారిపోయాడు. ఆ విజయం ధోనికి, అటూ టీమిండియాకు చాలా సంతృప్తినిచ్చింది. అందుకే ధోని తన శైలికి భిన్నంగా ప్రవర్తించాడు.Relive @ashwinravi99's magical ball in #CT13 🪄He bowled 4 overs, gave 15 runs including a maiden and took key wickets of Joe Root & Jonathan Trott in the final 👌pic.twitter.com/zBr1VkBVy8— CricTracker (@Cricketracker) September 17, 2024ధోని వరల్డ్కప్లు గెలిచినప్పుడు కూడా అంత ఎగ్జైట్ కాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ధోనికి అంత తృప్తినిచ్చింది. ఈ విషయాన్ని ధోని స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఫైనల్లో భారత్ గెలిచిన తీరు.. నాటి మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయి. అందుకే భారత్కు అది చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ముఖ్యంగా ధోని కెరీర్లో హైలైట్గా నిలిచిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో మూడు ఐసీసీ టైటిల్స్ (టీ20, వన్డే వరల్డ్కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన తొలి కెప్టెన్గా ధోని చరిత్ర సృష్టించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ఫార్మాట్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా టీ20 మ్యాచ్గా మార్చబడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 43, రవీంద్ర జడేజా 33 నాటౌట్, శిఖర్ ధవన్ 31 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 9, దినేశ్ కార్తీక్ 6, సురేశ్ రైనా 1, ధోని 0, అశ్విన్ 1 పరుగుకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రవి బొపారా 3, ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ట్రెడ్వెల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు కలిసి కట్టుగా రాణించడంతో 5 పరుగుల స్వల్ప తేడాతో పరాజయంపాలైంది. రవిచంద్రన్ అశ్విన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లు వేసి ఓ మెయిడిన్ సహా రెండు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ చివరి ఓవర్లో అశ్విన్ 15 పరుగులను విజయవంతంగా కాపాడుకుని భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అశ్విన్ వేసిన మ్యాచ్ చివరి బంతిని మ్యాజిక్ డెలివరీగా ఇప్పటికీ చెప్పుకుంటారు.భారత విజయంలో అశ్విన్తో పాటు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ధోని కూడా కీలక భూమికలు పోషించారు. ఇషాంత్, జడ్డూ చెరో 4 ఓవర్లు వేసి తలో 2 వికెట్లు తీయగా.. ధోని రెండు కీలకమైన స్టంపౌట్లు, ఓ రనౌట్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఇయాన్ మోర్గన్ (33), రవి బొపారా (30), జోనాథన్ ట్రాట్ (20), ఇయాన్ బెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. కుక్ (2), రూట్ (7), బట్లర్ (0), బ్రేస్నెన్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఈ గెలుపు అనంతరం భారత సంబురాలు అంబరాన్నంటాయి. ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే షైన్ అవుతున్న కోహ్లి ఈ విజయాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు.భారత క్రికెట్ అభిమానులకు ఈ విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. మినీ వరల్డ్కప్గా చెప్పుకునే ఈ టైటిల్ను గెలిచిన అనంతరం భారత్ 11 ఏళ్ల పాటు ఒక్క ఐసీసీ టైటిల్ను కూడా సాధించలేకపోయింది. చివరికి 2024లో టీమిండియా కల సాకారమైంది. భారత్ 2024 టీ20 వరల్డ్కప్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు టైటిల్ను అందించాడు. భారత్ మొత్తంగా రెండు వన్డే వరల్డ్కప్లు (1983, 2011), రెండు టీ20 ప్రపంచకప్లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు (2002, 2013) గెలిచింది. -
ఇండియా, ఇంగ్లండ్ సిరీస్లో స్వల్ప మార్పులు
వచ్చే ఏడాది భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్లోని తొలి టీ20 చెన్నైలో, రెండో టీ20 కోల్కతాలో జరగాల్సి ఉన్నాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ల వేదికలు తారుమారు కానున్నాయి. తొలి టీ20 కోల్కతాలో, రెండో టీ20 చెన్నైలో జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ ఏడాది బంగ్లాదేశ్తో జరిగే ఓ టీ20 మ్యాచ్ వేదిక కూడా మారనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారత్లో పర్యటించనుంది. ఈ సిరీస్ల్లోని తొలి టీ20 ముందుగా ప్రకటించిన ధర్మశాల వేదికగా కాకుండా గ్వాలియర్లో జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. -
ఇంగ్లండ్తో సెమీఫైనల్.. టీమిండియా గెలుపుకు పునాది వేసిన అక్షర్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కష్టతరమైన పిచ్పై ఈ స్కోర్ ఫైటింగ్ స్కోర్గా చెప్పవచ్చు. ఈ స్కోర్ను ఛేదించే క్రమంలో దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లండ్కు టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ కళ్లెం వేశాడు. 20 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు (బట్లర్, మొయిన్ అలీ, బెయిర్స్టో) తీసి టీమిండియా గెలుపుకు పునాది వేశాడు.అక్షర్ రెచ్చిపోవడంతో డిఫెన్స్లో పడిపోయిన ఇంగ్లండ్.. ఆతర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అక్షర్తో పాటు మరో ఎండ్లో కుల్దీప్ యాదవ్ (4-0-19-3), బుమ్రా (2.4-0-12-2) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 2022 ఎడిషన్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనానికి పునాది వేసిన అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
Shivam Dube: ఐపీఎల్లో హీరో.. ఇండియా తరఫున జీరో
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే వరుసగా విఫలమవుతున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. దూబే వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూబేను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దూబే స్థానంలో రింకూ సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్లలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆల్రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకుంటే కనీసం బ్యాటింగ్కైనా న్యాయం చేయలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 ఫామ్ను (14 మ్యాచ్ల్లో 162.30 స్ట్రయిక్రేట్తో 396 పరుగులు, 3 అర్దసెంచరీలు) చూసి హార్దిక్తో పోల్చి తప్పు చేశామని బాధపడుతున్నారు. ఐపీఎల్లో హీరో ఇండియా తరఫున జీరో అంటూ ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో గోల్డెన్ డకౌట్ కావడంతో దూబేపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు అభిమానులు దూబేపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కీలకమైన మ్యాచ్లో కీలక సమయంలో బ్యాటింగ్కు దిగి తొలి బంతికే ఔట్ కావడాన్ని అభిమానులు సహించలేకున్నారు. వరుసగా విఫలమవుతున్నా దూబేకు అవకాశాలు ఇస్తున్నందుకు కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుబడుతున్నారు. ఇచ్చిన అవకాశాలు చాలు ఫైనల్లో దూబేని తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నారు.కాగా, ఇంగ్లండ్తో నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో దూబే విఫలమైనా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తూ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. కోహ్లి (9), దూబే (0), పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
'పర్ఫెక్ట్ రివెంజ్' అంటే ఇదే.. ఇంగ్లండ్ లెక్క సరి చేసిన టీమిండియా
టీ20 వరల్డ్కప్ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో గెలుపుతో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. గత వరల్డ్కప్ సెమీస్లో ఇంగ్లండ్ టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇందుకు ప్రతిగా టీమిండియా ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్లో ఇంగ్లండ్ 10 వికెట్లు పడగొట్టి చిత్తు చేసింది. టీమిండియా ఇంగ్లండ్ లెక్క సరి చేయడంతో భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'పర్ఫెక్ట్ రివెంజ్' అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.THE WINNING CELEBRATION OF TEAM INDIA. 🇮🇳- History will be rewritten tomorrow. 🏆pic.twitter.com/atRTQyA1ZA— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 20242022 ప్రపంచకప్ సెమీస్లో టీమిండియాను ఓడించి ఫైనల్స్కు చేరిన ఇంగ్లండ్.. తుది సమరంలో పాకిస్తాన్ను ఓడించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రస్తుత వరల్డ్కప్ సెమీస్లో ఇంగ్లండ్కు ఓడించి ఫైనల్స్కు చేరని భారత్.. తుది సమరంలో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుందని భారత క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.INDIA TOOK A PERFECT REVENGE OF 2022 SEMIS. 🇮🇳- England defeated India by 10 wickets in the 2022 Semi Final.- India took all 10 wickets of England in the 2024 Semi Final. pic.twitter.com/7OKz2yvrsT— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024కాగా, నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్పై విజయం సాధించిన టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోహ్లి (9), దూబే (0) మరోసారి విఫలం కాగా.. పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
T20 World Cup 2024: ఫైనల్లో టీమిండియా.. హిట్మ్యాన్ భావోద్వేగం
టీమిండియా రోహిత్ శర్మ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ, ఇతరులను ఆటపట్టిస్తూ సరదాగా కనిపించే రోహిత్.. టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్పై విజయానంతరం ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఫైనల్స్కు చేరామన్న సంతోషంలో ఉబికి వస్తున్న ఆనందభాష్పాలు ఆపుకునే ప్రయత్నం చేశాడు. చేతిని అడ్డుపెట్టుకుని తన భావోద్వేగాన్ని కవర్ చేసుకున్నాడు. అప్పుడే డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చిన విరాట్ అతని భుజం తట్టాడు. రోహిత్, కోహ్లి ఒకే ఫ్రేమ్లో ఉన్న చిత్రం సోషల్మీడియాలో వైరలవుతుంది.Rohit Sharma got emotional on the Semis Finals victory. 🥹- Virat Kohli confronted him! ❤️ pic.twitter.com/JMVT2qFx2q— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024కాగా, నిన్న (జూన్ 27) జరిగిన టీ20 వరల్డ్కప్ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి, మూడోసారి ఫైనల్స్కు (టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో) చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోహ్లి (9), దూబే (0) మరోసారి విఫలం కాగా.. పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
కోహ్లి ఫైనల్లో ఫామ్లోకి వస్తాడు.. టైటిల్ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సహచర ఓపెనర్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత వరల్డ్కప్లో కోహ్లి వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో హిట్మ్యాన్ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. కోహ్లి నాణ్యమైన ప్లేయర్ అని రోహిత్ కితాబునిచ్చాడు. కోహ్లి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసని అన్నాడు. ఫామ్ కోల్పోవడం తాత్కాలికమని తెలిపాడు. 15 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడిన వ్యక్తికి ఫామ్ను తిరిగి దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య కాదని అన్నాడు. ఫైనల్ కోసం కోహ్లి తన ఫామ్ను దాచిపెట్టుకున్నాడని పేర్కొన్నాడు.ఇంగ్లండ్ను మట్టికరిపించి ఫైనల్కు అర్హత సాధించిన అనంతరం రోహిత్ మరిన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. ఈ మ్యాచ్ను ఇలా (ఏకపక్షంగా) గెలవడానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఛాలెంజింగ్గా ఉన్న పరిస్థితులను మేము స్వీకరించాము. టోర్నీ ఆరంభం నుంచి ఇదే మా విజయ రహస్యం. బౌలర్లు, బ్యాటర్లు పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి అందుకు అనుగుణంగా ఆడారు. ఓ దశలో 140-150 స్కోర్కే పరిమితమవుతానుకున్నాం. నేను, సూర్య మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో 170 పరుగుల మార్కును తాకగలిగాం. ఈ పిచ్పై ఇది చాలా మంచి స్కోర్. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అక్షర్, కుల్దీప్ మా గన్ స్పిన్నర్స్. వీరిద్దరు ప్రత్యర్దిపై ఒత్తిడి తెచ్చారు. బుమ్రా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతను మా మ్యాచ్ విన్నర్. మ్యాచ్ మొత్తంలో మేము చాలా కామ్గా ఉన్నాం.ఇలా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలం. మేమె ఏ దశలోనూ ఆందోళన చెందలేదు. ఇదే మమ్మల్ని గెలిపించింది. ఫైనల్లో ఇదే తరహాలో నాణ్యమైన క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. అందు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాం. ప్రస్తుతం జట్టు మంచి షేప్లో ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. ఫైనల్లోనూ ఇదే కొనసాగుతుందని భావిస్తున్నానని రోహిత్ అన్నాడు.కాగా, ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రో'హిట్'మ్యాన్ శర్మ.. రికార్డులు బద్దలు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్మ్యాన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్.. క్రిస్ గేల్ (63) తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో రోహిత్ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్- 63రోహిత్ శర్మ- 50జోస్ బట్లర్- 43డేవిడ్ వార్నర్- 40యువరాజ్ సింగ్- 33విరాట్ కోహ్లి- 33టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలురోహిత్ శర్మ- 113జయవర్దనే- 111విరాట్- 105వార్నర్- 103తిలకరత్నే దిల్షన్- 101భారత కెప్టెన్గా అత్యధిక పరుగులువిరాట్- 12883ధోని- 11207అజహారుద్దీన్- 8095గంగూలీ- 7643రోహిత్- 5012ఐసీసీ నాకౌట్స్లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ- 22క్రిస్ గేల్- 21ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఫైనల్స్కు టీమిండియా..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్క్యాస్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?షెడ్యూల్ ప్రకారం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒక్క బంతి కూడా పడకుండా) సూపర్-8 దశలో గ్రూప్ (గ్రూప్-1) టాపర్గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్ చేరుతుంది.ఒకవేళ భారత్-ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్కు వర్షం కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.తొలి సెమీఫైనల్కు రిజర్వ్ డేమరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది. -
T20 World Cup 2024: సెమీస్లో టీమిండియా ప్రత్యర్ధి ఇంగ్లండ్..!
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-2 సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు చేరుకున్నాయి. గ్రూప్-1 సెమీస్ బెర్త్లు నేడు (జూన్ 24) జరుగబోయే మ్యాచ్లతో ఖరారవుతాయి. ఇవాళ రాత్రి (భారతకాలమానం ప్రకారం) జరిగే భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంతో గ్రూప్-1 సెమీస్ బెర్త్లపై క్లారిటీ వస్తుంది. ఏ కారణాల చేతైనా ఈ మ్యాచ్ ఫలితంతో క్లారిటీ రాకపోతే రేపు ఉదయం జరిగే బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వరకు ఆగాల్సి ఉంటుంది.కాగా, గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్త్లు ఖరారు కావడంతో సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడతాయనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి. నేడు ఆసీస్తో జరుగబోయే మ్యాచ్లో భారత్ గెలిచినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా సెమీస్లో టీమిండియా.. ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంటుంది. ఎందుకంటే.. టీమిండియా ఆసీస్పై గెలిచినా లేక ఈ మ్యాచ్ రద్దైనా గ్రూప్-1లో టీమిండియా అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 టాపర్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్లో తలపడాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్-2 టాపర్ను ఢీకొట్టాల్సి ఉంటుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచిందిసెమీస్లో తమ ప్రత్యర్ధిగా ఎవరుండాలని ఎంచుకుని సౌలభ్యం ప్రస్తుతం టీమిండియాకు దొరికింది. ఆసీస్పై గెలిస్తే ఇంగ్లండ్.. ఆసీస్ చేతిలో ఓడితే సౌతాఫ్రికాను టీమిండియా ఢీకొట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-2కు సంబంధించి యూఎస్ఏపై గెలుపుతో ఇంగ్లండ్.. వెస్టిండీస్ను చిత్తు చేసి సౌతాఫ్రికా సెమీస్ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. -
వన్డేల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కేదార్ జాదవ్.. కోహ్లితో కలిసి..!
టీమిండియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జూన్ 3) ప్రకటించాడు. వైవిధ్యభరితమైన ఆటగాడిగా పేరున్న కేదార్.. టీమిండియా తరఫున పలు మరపురాని ఇన్నింగ్స్లు ఆడి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేదార్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతనాడిన ఓ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్పై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది.2017లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కేదార్ చేసిన మెరుపు శతకాన్ని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. భారత ఫుల్ టైమ్ కెప్టెన్గా విరాట్ కోహ్లికి అది తొలి మ్యాచ్. పూణే వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో కేదార్ సొంత అభిమానుల (కేదార్ స్వస్థలం పూణే) మధ్యలో పేట్రేగిపోయాడు. కేవలం 65 బంతుల్లోనే శతక్కొట్టి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో బరిలోకి దిగిన లోకల్ బాయ్ కేదార్.. ఎవరూ ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. కేదార్కు జతగా మరో ఎండ్లో కోహ్లి కూడా శివాలెత్తిపోయాడు. కోహ్లి 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను విజయపు అంచుల వరకు తీసుకెళ్లారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (40 నాటౌట్) లాంఛనంగా మ్యాచ్ను ముగించాడు. కేదార్, కోహ్లి చెలరేగడంతో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్లో కేదార్ ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయింది. కేదార్, కోహ్లి శతక్కొట్టుడు ముందు 351 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. కేదార్ ఆడిన ఆ చిరస్మరణీయ ఇన్నింగ్స్ నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు.కేదార్ కెరీర్లో ఈ ఇన్నింగ్స్తో పాటు మరో మరపురాని ఇన్నింగ్స్ కూడా ఉంది. 2018 ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ముంబై ఇండియన్స్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో గాయంతో బాధపడుతూనే ఆఖర్లో వచ్చి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ఆ మ్యాచ్లో గాయం బారిన పడిన కేదార్.. సీఎస్కే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి మ్యాచ్ను ముగించాడు. కేదార్ దేశవాలీ కెరీర్లో సైతం ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు చాలా ఉన్నాయి.39 ఏళ్ల కేదార్.. టీమిండియా తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి.ఐపీఎల్లో 2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. తన కెరీర్లో 95 మ్యాచ్లు ఆడి 123.1 స్ట్రయిక్రేట్తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.కేదార్ దేశవాలీ ట్రాక్ రికార్డు విషయానికొస్తే.. పూణేలో పుట్టి మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్! వీడియో
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో పరుగుల వరద పారించినా.. భారత జట్టులో చోటు కోసం మాత్రం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది ఈ ముంబై ప్లేయర్కి! అయితేనేం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్, మెంటార్ అన్న విషయం తెలిసిందే. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్. కుమారుడి కోసం తాను చేసిన త్యాగాలు ఫలించినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. కఠిన శ్రమ, ఓపిక ఉండాలి. తండ్రి కంటే తన పిల్లలను ఇంత బాగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి గొప్ప వ్యక్తి నౌషద్ ఖాన్.. ఆయన గనుక ఒప్పుకొంటే.. మహీంద్రా థార్తో సత్కరించాలనుకుంటున్నా’’ అని బహుమతి ప్రకటించారు. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్ర. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్ ఖాన్కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సర్ఫరాజ్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. గ్రేడ్- సీ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్కు అవకాశమిచ్చింది. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి ఇది తగునా కోహ్లి? Anand Mahindra fulfilled his promise and gifted a Mahindra Thar to Sarfaraz Khan's father, Naushad. Mahindra had promised to give the gift following Sarfaraz's Test debut. His father played a key role in Sarfaraz's success and coached him right from childhood. pic.twitter.com/Ktf070Qf5U — Sanjay Kishore (@saintkishore) March 23, 2024 -
సర్ఫరాజ్ తండ్రితో కలిసి ఆడాను: రోహిత్ శర్మ
స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 4-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లి, మహ్మద్ షమీ, రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లు లేకుండానే ఇంగ్లండ్ను రోహిత్ సారథ్యంలోని యంగ్ ఇండియా చిత్తు చేసింది. కాగా ఈ టెస్టు సిరీస్తో నలుగురు యువ క్రికెటర్లు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అందులో ఒకడు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. భారత జట్టులో చోటు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న సర్ఫరాజ్కు రాజ్కోట్ టెస్టు ముందు సెలక్టర్లు పిలుపునిచ్చారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో సర్ఫరాజ్కు భారత జట్టులో చోటు దక్కింది. జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రాజ్కోట్ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో భారత జట్టు ప్రాతినిథ్యం వహించాలన్న అతడి కల నేరవేరింది. కాగా ఇది సర్ఫరాజ్ ఒక్కడి కల మాత్రమే కాదు తన తండ్రి నౌషాద్ ఖాన్ది కూడా. సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ కూడా క్రికెటరే. అతడు భారత జట్టు తరపున ఆడాలని కలలు కన్నాడు. కానీ అతడి కలను తన కొడుకు రూపంలో నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టెస్టు క్యాప్ను అందుకునే సమయంలో నౌషాద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. నౌషాద్ ఖాన్ చిన్న కొడుకు ముషీర్ ఖాన్ కూడా దేశీవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా "టీమ్ రో" మాట్లాడుతూ.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుర్రాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. "యువ క్రికెటర్లతో కలిసి ఆడటాన్ని ఎంజాయ్ చేశాను. వారంతా చాలా అల్లరి చేసే వారు. నాకు వారిలో చాలా మంది తెలుసు. వారి బలాలు ఏంటో, వాళ్లు ఎలా ఆడాలనుకుంటారో తెలుసు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో అనుభవం లేకపోయినప్పటికి దేశీవాళీ క్రికెట్లో ఎలా ఆడారో నాకు తెలుసు. కాబట్టి వారి గత ఇన్నింగ్స్లను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసం నింపడమే నా పని. కుర్రాళ్లు కూడా నా నమ్మకాన్ని వమ్ముచేయలేదు. అద్బుతంగా రాణించారు. అరంగేట్రంలోనే అదరగొట్టారు. వారి డెబ్యూ సమయంలో తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వారు ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. సర్ఫరాజ్ కుటంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నా చిన్నతనంలో కంగా లీగ్లో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి ఆడాను. అతని తండ్రి ఎడమచేతి బ్యాటర్. ఆయన దూకుడుగా ఉండేవాడు. సర్ఫరాజ్ భారత్కు ప్రాతినిథ్యం వహించడం వెనక అతడి తండ్రి కృషి ఎంతో ఉందని" హిట్మ్యాన్ పేర్కొన్నాడు. -
అప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం.. బాకీలన్నీ తీర్చేసా!
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో ధ్రువ్ జురెల్ ఒకడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను ఐపీఎల్-2022 వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది. అయితే, ఆ ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్కు తుదిజట్టులో చోటు దక్కలేదు. బెంచ్కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో వేచి చూసి..గతేడాది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 11 ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ 152 పరుగులు చేశాడు. ఇక దేశవాళీ క్రికెట్లోనూ రాణించిన ఈ యూపీ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసి.. తనదైన ముద్ర వేయగలిగాడు. ముఖ్యంగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించి సత్తా చాటాడు. అయితే, చాలా మంది క్రికెటర్లలాగే ధ్రువ్ జురెల్ కూడా అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. తనలాగే కొడుకును కూడా సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెటర్ అవుతానని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడి తల్లి అండగా నిలిచి.. తన వద్ద ఉన్న చిన్నపాటి బంగారు వస్తువులు కూడా అమ్మేసి కిట్ కొనేందుకు డబ్బులిచ్చారు. ఎల్లవేళలా కొడుకుకు మద్దతుగా నిలిచారు. తండ్రి కూడా అర్థం చేసుకుని బాసటగా నిలవడంతో ధ్రువ్ జురెల్ తన కలలు నెరవేర్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గతాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నాకు మొట్టమొదటిసారి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కిన సమయంలో నా తల్లిదండ్రులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. నేను ఆ బాకీలన్నీ తీర్చేశాను. మా అమ్మ కోసం కొన్ని నగలు కూడా కొన్నాను’’ అని ధ్రువ్ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు తనకోసం పడిన కష్టం వెలకట్టలేనిదని పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా సీజన్ మొదలుకానుండగా.. రాజస్తాన్ మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
రోహిత్ భయ్యా తిడతాడు కానీ... టీమిండియా నయా స్టార్
Seeing Rohit Sharma "Pyaar Sa Aata Hai": ‘‘రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఐపీఎల్లోనూ తొమ్మిది- పదేళ్ల పాటు ఆడాను. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికీ ఆడుతూనే ఉన్నా. అయితే, అన్నింటితో పోలిస్తే రోహిత్ భయ్యా కెప్టెన్సీలో ఆడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన మంచి కప్టెన్. ఆయన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది. జట్టులో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాడు. టీమ్ మీటింగ్ జరుగుతున్నపుడు రోహిత్ భయ్యా మాట్లాడటం చూస్తుంటే నాకు ఆమిర్ ఖాన్ సినిమా ‘లగాన్’ గుర్తుకువస్తూ ఉంటుంది’’ అని టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా ముంబై స్టార్ సర్ఫరాజ్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజ్కోట్ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు.. మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్లలోనూ భాగమై మరో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో తన అనుబంధం, నాయకుడిగా అతడు వ్యవహారశైలి గురించి తాజాగా ఆజ్తక్తో మాట్లాడాడు సర్ఫరాజ్ ఖాన్. ‘‘రోహిత్ భయ్యా మమ్మల్ని మరీ ఎక్కువగా ఏం తిట్టడు. కాకపోతే సరైన సమయంలో సరైన విధంగా ఆడేలా కాస్త గట్టిగానే హెచ్చరిస్తాడు. మాట్లాడటంలో ప్రతి ఒక్కరికి తమదైన స్టైల్ ఉంటుంది. రోహిత్ భయ్యా సరాదాగా అన్న మాటల్ని కూడా కొందరు వేరే విధంగా అనుకుంటారు. నాకైతే ఆయన మమ్మల్ని తిట్టినట్లు అనిపించదు. ముంబైవాళ్లంతా అలాగే మాట్లాడతారు. ఆటగాళ్లతో రోహిత్ భయ్యా ఎంతో కలుపుగోలుగా ఉంటారు. తను సీనియర్, కెప్టెన్ అన్నట్లుగా వ్యవహరించరు’’ అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన సర్ఫరాజ్ను ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టగా.. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. చదవండి: IPL 2024: అభిమానులకు బ్యాడ్న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం? -
నన్ను క్షమించండి సన్నీ సార్.. మరోసారి అలా చేయను: సర్ఫరాజ్
టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన అరంగేట్ర టెస్టు సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. రాజ్కోట్ వేదికగా జరిగిన ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు ద్వారా డెబ్యూ చేసిన సర్ఫరాజ్.. తన బ్యాటింగ్ స్కిల్స్తో అందరని అకట్టుకున్నాడు. సర్ఫరాజ్ తన అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్లలోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అదేవిధంగా ధర్మశాల వేదికగా ఐదో టెస్టులోనూ ఈ ముంబైకర్ సత్తాచాటాడు. అయితే ఆఖరి టెస్టులో మంచి టచ్లో కన్పించిన సర్ఫరాజ్ ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. టీ బ్రేక్ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతికే సర్ఫరాజ్ పెవిలియన్కు చేరాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో బంతిని తప్పుగా అంచనా వేసిన సర్ఫరాజ్.. లేట్ కట్ షాట్ ఆడి స్లిప్లో జో రూట్ చేతికి చిక్కాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ 8 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు. కాగా సర్ఫరాజ్ ఔటైన వెంటనే భారత బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ సమయంలో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. సర్ఫరాజ్ ఔటైన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. "బంతి ఒక్కసారిగా పైకి పిచ్ అయ్యింది. అది షాట్ ఆడాల్సిన బాల్ కాదు. అయినా ఆడేందుకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే ఆవిధంగా ఆడాల్సిన అవసరం లేదు. కాస్త దృష్టి పెట్టి ఆడాల్సింది. ఇటువంటి సమయంలో దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మాన్ మాటలను గుర్తు చేసుకోవాలి. తాను 200 పరుగులు సాధించినా సరే ఎదుర్కొనే తర్వాత బంతిని సున్నా స్కోరు పై ఉన్నాను అని అనుకుని ఆడేవాడినని చెప్పేవారు. కానీ సర్ఫరాజ్ టీ విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్ ఆడి ఔటయ్యాడని" సన్నీ కాస్త సీరియస్ అయ్యాడు. అయితే గవాస్కర్ అంతలా సీరియస్ అవ్వడానికి ఓ కారణముంది. ఎందుకంటే మ్యాచ్కు ముందు షాట్ల ఎంపికపై దాదాపు గంట సేపు సర్ఫరాజ్కు గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. కానీ సర్ఫరాజ్ మాత్రం చెత్త షాట్ ఆడి ఔట్ కావడంతో లిటిల్ మాస్టర్కు కోపం వచ్చింది. అయితే గవాస్కర్ సీరియస్ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ బాధపడ్డాడని, ఆయనకు క్షమాపణలు కూడా చెప్పాడని ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ భాటియా తెలిపారు. ఈయన గవాస్కర్కు అత్యంత సన్నిహితుడు. ‘సన్నీ సార్కు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను తప్పు చేశా. మరోసారి అలాంటి తప్పిదం పునరావృతం కాదు’ అని యువ ఆటగాడు అన్నాడు’’ అని శ్యామ్ భాటియా చెప్పుకొచ్చారు. చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి మరీ.. -
అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి..
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్గా కేఎస్ భరత్ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం. రెండో టెస్టుతో రజత్ పాటిదార్, మూడో టెస్టుతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టుతో ఆకాశ్ దీప్, ఐదో టెస్టుతో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో రజత్ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన జురెల్ను కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్ను ఆడించడంలో అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘జట్టు యాజమాన్యం జురెల్పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్ బాల్ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్ వంటి జట్టుతో కీలక సిరీస్లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే, అగార్కర్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్ మాత్రం పడిక్కల్ వైపే మొగ్గు చూపాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్ వంటి మంచి హైట్ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్ జురెల్ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్ -
సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ టాప్ 10లోకి దూసుకొచ్చారు. హిట్మ్యాన్ ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో ర్యాంక్కు చేరుకోగా..జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వీరిద్దరితో పాటు ధర్మశాల టెస్టులో సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్ సైతం తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్ను పొందాడు. 11 స్ధానాలు ఎగబాకి 20వ ర్యాంక్కు గిల్ చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం వరుసగా రెండు మూడు స్దానాల్లో నిలిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో నిలిచాడు. బుమ్రాను వెనుక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. చదవండి: #David Miller: మూడు మ్యాచ్లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్ -
యశస్వీ జైశ్వాల్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను జైశ్వాల్కు ఈ అవార్డు దక్కింది. స్వదేశలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత నెలలో ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడిన యశస్వీ 112 సగటుతో ఏకంగా 560 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 209 పరుగులు చేసిన జైశ్వాల్.. రాజ్కోట్ టెస్టులో 214 పరుగులతో చెలరేగాడు. ఓవరాల్గా ఇంగ్లండ్ సిరీస్లో జైశ్వాల్ ఏకంగా 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ అవార్డు కోసం జైశ్వాల్తో పాటు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక పోటీపడ్డారు. కానీ ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన జైశ్వాల్నే ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపిక చేసింది. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ఎంపికైంది. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో సదర్లాండ్ అద్భుతంగా రాణించింది. చదవండి: వరల్డ్కప్ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కఠిన నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ Presenting the ICC Player of the Month for February 🙌 Congratulations, Yashasvi Jaiswal 👏👏 🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ — BCCI (@BCCI) March 12, 2024 -
Rohit Sharma: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క మొనగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఓ గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో సెంచరీతో (103) కదంతొక్కిన హిట్మ్యాన్.. తన టెస్ట్ కెరీర్లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ (110), అశ్విన్ (9 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (7 వికెట్లు) చెలరేగడంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ తన కెరీర్లో చేసిన 12 టెస్ట్ సెంచరీలు టీమిండియా విజయానికి దోహదపడ్డాయి. ఇలా ఓ ఆటగాడు చేసిన తన తొలి 12 టెస్ట్ సెంచరీలు జట్టు విజయానికి దోహదపడటం క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ తప్ప ఈ ఘనతను ఎవరూ సాధించలేకపోయారు. లేటు వయసులో టెస్ట్ ఓపెనర్గా ప్రమోషన్ పొందిన రోహిత్.. వయసు మీద పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా ఎవరికీ సాధ్యంకాని ఈ గొప్ప రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో భీకర ఫామ్లో ఉండిన హిట్మ్యాన్ ఈ సిరీస్లో ఆడిన 9 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 44.44 సగటున 400 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో హిట్మ్యాన్ నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. సిరీస్ ఆధ్యాంతం రోహిత్తో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి, సిరీస్ ఎగరేసుకుపోయింది. -
మురళీథరన్ రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్
ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ ప్రదర్శనతో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఇందులో ఓ రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టెస్ట్ సిరీస్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు అత్యధిక సార్లు తీసిన బౌలర్గా అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మురళీథరన్ పేరిట ఉండిన ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (800) సాధించిన మురళీ తన టెస్ట్ కెరీర్లో (ఓ టెస్ట్ సిరీస్లో) 25 అంతకంటే ఎక్కువ వికెట్ల ఘనతను ఆరు సార్లు నమోదు చేయగా.. అశ్విన్ ఏడు సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు. కేవలం 100 టెస్ట్ల్లోనే 516 వికెట్లు (36 ఐదు వికెట్ల ఘనతలు) తీసిన అశ్విన్.. మరో 285 వికెట్లు తీస్తే మురళీథరన్ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొడతాడు. కాగా, ధర్మశాల వేదికగా జరిగిన టెస్ట్లో ఇంగ్లండ్పై ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్ల టెస్ట్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ సిరీస్లో యాష్ రెండు ఐదు వికెట్ల ఘనతలు, ఓ నాలుగు వికెట్ల ఘనత నమోదు చేశాడు. -
పవర్ హిట్టర్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే!
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ఓపెనర్గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్లలో కలిపి (తొమ్మిది ఇన్నింగ్స్లో) ఏకంగా సగటు 89తో.. 712 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. టీమిండియా 4-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు యశస్వి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. యశస్వి జైస్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైస్వాల్ను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్లోనూ తన ఆట తీరును గమనిస్తూనే ఉన్నాం. అతడో అసాధారణ ఆటగాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలతో రాణించి టీ20లలోనూ అడుగుపెట్టాడు. అయితే, ఇంతవరకు వన్డేల్లో మాత్రం అతడికి అవకాశం రాలేదు. 50 ఓవర్ల ఫార్మాట్ క్రికెట్లోనూ యశస్వితో అరంగేట్రం చేయిస్తే మంచిది. అప్పుడు అతడు.. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్ల ప్లేయర్గా జట్టుకు ఉపయోగపడతాడు. బ్యాటర్గా డిఫెన్సివ్గా.. అదే సమయంలో దూకుడుగా ఎలా ఉండాలో తెలిసిన ఆటగాడు. ఆండర్సన్ బౌలింగ్లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన విధానం అతడి పవర్ హిట్టింగ్ నైపుణ్యాలకు నిదర్శనం’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 26 సిక్సర్లు బాదారు. ముఖ్యంగా రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్స్లు కొట్టడం హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టు, అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. చదవండి: శార్దూల్ ఏమన్నాడో విన్నాను: డొమెస్టిక్ క్రికెట్పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
‘బజ్బాల్’ బెడిసికొట్టి.. అవమానభారంతో ఇలా!..
భారత గడ్డపై టెస్టు సిరీస్ను గెలిచి తమ 12 ఏళ్ల నీరిక్షణకు తెరదించాలని భావించిన ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లండ్ కనీస పోటీ ఇవ్వకుండా టీమిండియా ముందు మోకారిళ్లింది. బజ్బాల్ అంటూ వరల్డ్ క్లాస్ జట్లను గడగడలాంచిన ఇంగ్లండ్.. భారత్ దెబ్బకు పసికూనలా వణకిపోయింది. అసలైన టెస్టు క్రికెట్ మజా ఎలా ఉంటుందో ఇంగ్లండ్ జట్టుకు రోహిత్ సేన చూపించింది. ఘన విజయంతో భారత్ టూర్ను ముగించాలని భావించిన స్టోక్స్ సేన.. ఆఖరికి ఘోర పరాభావంతో తమ దేశానికి తిరుగు పయనమైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. భారత గడ్డపై ఇంగ్లండ్ ఘోర ఓటమికి గల ఐదు కారణాలను పరిశీలిద్దాం. బెడిసి కొట్టిన బజ్ బాల్.. ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్ వైఫల్యమే. వారు అవలంభిస్తున్న బజ్బాల్ విధానమే వారి కొంపముంచింది. సాధరణంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బ్యాటరైనా ఆచతూచి ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇంగ్లండ్ జట్టుది మాత్రం వేరే లెక్క. వచ్చామా ఫోరో, సిక్స్ కొట్టి ఔటయ్యామా అన్నట్లు ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కొనసాగింది. ఆఖరి వరల్డ్ క్లాస్ బ్యాటర్ జో రూట్ సైతం అదే తీరును కనబరిచాడు. పరుగులు వేగంగా సాధించాలనే ఉద్దేశ్యంతో తనకు రాని షాట్లను ఆడి పెవిలియన్కు చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థి బౌలర్లపై దాడికి ప్రయత్నించి వికెట్లను కోల్పవడం సంప్రదాయ క్రికెట్ ఉద్దేశ్యం కాదు కద. ఈ సిరీస్లో భారత 9వ నెంబర్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతులు కూడా ఏ ఇంగ్లండ్ ఆటగాడు ఎదుర్కోలేకపోయాడు. టెస్టు క్రికెట్ అంటే కనీస ఓపికతో బ్యాటింగ్ చేయాలనే కామన్ సెన్స్ ఇంగ్లండ్ బ్యాటర్లలో కొరవడింది. బజ్బాల్ అంటూ టెస్టు క్రికెట్ రూపు రేఖలను మార్చేసిన ఇంగ్లండ్కు భారత్ మాత్రం సరైన గుణపాఠం చెప్పిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంగ్లండ్ ఘోర పరభావానికి మరో కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. ఇక తమకు తిరుగులేదని, ఏకంగా సిరీస్ వైట్ వాష్ చేసినట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ అక్కడ ప్రత్యర్ధి భారత్ అన్న విషయం బహుశా ఇంగ్లండ్ మార్చిపోయిందేమో. ఆ తర్వాత వైజాగ్ టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. ఇంగ్లండ్ను చిత్తు చేసింది. అప్పటికి ఇంగ్లండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఏమాత్రం పోలేదు. ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి కదా చూసుకోవచ్చులా అన్నట్లు ఇంగ్లండ్ థీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వైజాగ్ టెస్టు అనంతరం భారత్ నుంచి దుబాయ్ వేకేషన్కు ఇంగ్లండ్ జట్టు వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన ఇంగ్లండ్ ఆటను మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ దాదాపు వారం రోజులు గడిపింది. ఆ తర్వాత రాజ్కోట్కు చేరుకున్న ఇంగ్లండ్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మూడో టెస్టులో బరిలోకి దిగింది. రాజ్కోట్లో కూడా ఇంగ్లండ్ తీరు ఏ మాత్రం మారలేదు. మరోసారి ఇంగ్లండ్ను టీమిండియా చిత్తు చేసింది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. అయితే అప్పటికి ఇంగ్లండ్ మాత్రం సిరీస్ తామే గెలుస్తామన్న థీమాగా కన్పించింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్సీ, కోచ్ మెకల్లమ్ ఆఖరి రెండు టెస్టుల్లో భారత్ను చిత్తు చేస్తామని గొప్పలు పలికారు. కానీ భారత్ ముందు ఇంగ్లండ్ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్ విజయ భేరి మ్రోగించింది. బౌలింగ్ వైఫల్యం. స్పిన్నర్లు కాస్తో కూస్త అకట్టుకున్నప్పటికి ఫాస్ట్ బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్ ఆండర్సన్, వుడ్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు సైతం భారత బ్యాటర్లు ముందు దాసోహం అయ్యారు. ఆండర్సన్ను అయితే భారత యువ ఓపెనర్ జైశ్వాల్ ఊచకోత కోశాడు. స్పిన్నర్ల ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఇంగ్లండ్ బౌలింగ్లో ఎటాక్లో స్పష్టంగా అనుభవం లేమి కన్పించింది. జాక్ లీచ్ వంటి స్టార్ స్పిన్నర్ తొలి టెస్టు తర్వాత జట్టు నుంచి తప్పుకోవడం ఇంగ్లండ్ను బాగా దెబ్బతీసింది. టామ్ హార్లీ, బషీర్ వంటి యువ స్పిన్నర్లు ఆడపదడప వికెట్లు తీసినప్పటికి పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నారు. స్టోక్సీ మిస్ ఫైర్.. తన కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బెన్ స్టోక్స్.. భారత్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. ఈ సిరీస్లో బెన్ స్టోక్స్ దారుణంగా విఫలమయ్యాడు. అస్సలు ఈ సిరీస్లో అతడి వ్యూహం ఎవరికీ అర్ధం కాలేదు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లో కూడా నిరాశపరిచాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో కూడా స్టోక్సీ ఫెయిల్ అయ్యాడు. సిరీస్ మొత్తంగా 5 టెస్టుల్లో 199 పరుగులు స్టోక్స్ చేశాడు. ఇది కూడా ఇంగ్లండ్ ఓటమికి ఓ కారణం. కుర్రాళ్లు కొట్టిపాడేశారు..? కోహ్లి, రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లను ఇంగ్లండ్ తక్కువగా అంచనా వేసింది. వారికి పెద్దగా అనుభవం లేనందన తమ బౌలర్లు పై చేయి సాధిస్తారని ఇంగ్లండ్ మేనెజ్మెంట్ భావించింది. కోహ్లిని ఎలా ఔట్ చేయాలి? రాహుల్ను ఎలా ఔట్ చేయాలని ప్రణాళికలు రచించిన ఇంగ్లండ్.. యువ ఆటగాళ్లు విషయంలో మాత్రం ఎటువంటి ఆలోచన చేయలేదు. అదే వారి కొంపముంచింది. జైశ్వాల్, సర్ఫరాజ్, ధ్రవ్ జురల్ యువ సంచలనాలు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జైశ్వాల్ అయితే ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. 𝐑𝐨𝐡𝐢𝐭 & 𝐂𝐨. conquered the series with ease💪#IDFCFirstBankTestSeries #INDvENG #JioCinemaSports #BazBowled pic.twitter.com/a6HsT0Ikbe — JioCinema (@JioCinema) March 9, 2024