శ్రీలంకతో మూడో టెస్ట్‌.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన | England Announce Playing XI For 3rd Test Against Sri Lanka | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో మూడో టెస్ట్‌.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

Published Wed, Sep 4 2024 7:25 PM | Last Updated on Wed, Sep 4 2024 7:47 PM

England Announce Playing XI For 3rd Test Against Sri Lanka

సెప్టెంబర్‌ 6 నుంచి కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా శ్రీలంకతో జరిగే మూడో టెస్ట్‌ కోసం​ ఇంగ్లండ్‌ తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్‌ 3) ప్రకటించారు. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ ఓ మార్పు చేసింది. మాథ్యూ పాట్స్‌ స్థానంలో 20 ఏళ్ల యువ పేసర్‌ జోష్‌ హల్‌ తుది జట్టులోకి వచ్చాడు. హల్‌కు ఇది అరంగేట్రం మ్యాచ్‌.

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టు ఘన విజయాలు సాధించింది. తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో.. తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో 190 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మూడో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టు: డాన్ లారెన్స్, ⁠బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్‌), జో రూట్, ⁠హ్యారీ బ్రూక్ (వైస్‌ కెప్టెన్‌), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్‌), ⁠క్రిస్ వోక్స్, ⁠గస్ అట్కిన్సన్, ఓలీ స్టోన్, ⁠జోష్ హల్, షోయబ్ బషీర్


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement