241 పరుగులతో నెగ్గిన ఇంగ్లండ్‌ | England won by 241 runs | Sakshi
Sakshi News home page

241 పరుగులతో నెగ్గిన ఇంగ్లండ్‌

Published Mon, Jul 22 2024 1:24 AM | Last Updated on Mon, Jul 22 2024 1:24 AM

England won by 241 runs

నాటింగ్‌హమ్‌: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు 241 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది. నాలుగో రోజు ఇంగ్లండ్‌ నిర్దేశించిన 385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 36.1 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. 

ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 248/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 92.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (109; 13 ఫోర్లు), జో రూట్‌ (122; 10 ఫోర్లు) సెంచరీలు సాధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement