-
జాన్సన్ ఛార్లెస్ ఊచకోత.. సౌతాఫ్రికాను ఊడ్చేసిన విండీస్
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన ఆఖరి టీ20లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (26 బంతుల్లో 69; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విండీస్ను గెలిపించాడు. కెప్టెన్ బ్రాండన్ కింగ్ (28 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కైల్ మేయర్స్ (23 బంతుల్లో 36 నాటౌట్; 4 సిక్సర్లు) సైతం ఆకట్టుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ, పీటర్కు తలో వికెట్ దక్కింది. దీనికి ముందు ఓబెద్ మెక్కాయ్ (4-0-39-3), గుడకేశ్ మోటీ (3-0-21-2), షమార్ జోసఫ్ (4-0-26-2) ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ అల్లాడిపోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ డస్సెన్ (51), వియాన్ ముల్దర్ (36) మాత్రమే రాణించారు. ఈ సిరీస్లో తొలి రెండు టీ20లను కూడా వెస్టిండీసే గెలిచింది. తొలి మ్యాచ్లో 28 పరుగుల తేడాతో.. రెండో టీ20లో 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చరిత్రలో విండీస్ టీ20 సిరీస్లో సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేయడం ఇదే మొదటిసారి. -
టీ20 వరల్డ్కప్ 2024కు ముందు వెస్టిండీస్కు భారీ షాక్
స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్కప్ 2024కు ముందు ఆతిథ్య వెస్టిండీస్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ సందర్భంగా హోల్డర్ గాయపడినట్లు తెలుస్తుంది. హోల్డర్ స్థానాన్ని రిజర్వ్ ఆటగాడు ఓబెద్ మెక్కాయ్తో భర్తీ చేయనున్నట్లు విండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ తెలిపాడు. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో హోల్డర్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ లేకపోవడం తమ జట్టుకు పెద్ద లోటే అవుతుందని హేన్స్ అభిప్రాయపడ్డాడు. మెక్కాయ్ హోల్డర్ స్థానానికి న్యాయం చేస్తాడని హేన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ 2024లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లైన వెస్టిండీస్ ప్రస్తానం జూన్ 2న మొదలవుతుంది. విండీస్ తమ తొలి మ్యాచ్లో పపువా న్యూ గినియాతో తలపడుతుంది. విండీస్ గ్రూప్-సిలో పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, ఉగాండ, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో తలపడుతుంది.టీ20 వరల్డ్కప్ 2024 కోసం విండీస్ జట్టు: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్కాయ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్రిజర్వ్ ప్లేయర్లు: కైల్ మేయర్స్, మాథ్యూ ఫోర్డ్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్, ఆండ్రీ ఫ్లెచర్ -
చెలరేగిన విండీస్ కెప్టెన్.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2024 సన్నాహాకాల్లో వెస్టిండీస్ తమ సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో ఆరు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడుతోంది. ఈ క్రమంలో జమైకా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 28 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రాండెన్ కింగ్(79) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మైర్స్(34), ఛేజ్(32) పరుగులతో రాణించారు. సఫారీ బౌలర్లలో ఫెహ్లుక్వాయో, బార్ట్మన్ తలా 3 వికెట్లు పడగొట్టగా.. కొయిట్జీ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(87) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటకి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో ప్రోటీస్ జట్టు ఓటమి పాలైంది. కరేబియన్ బౌలర్లలో ఫోర్డే, మోటీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మెకాయ్ రెండు, ఛేజ్, జోషఫ్ చెరో వికెట్ సాధించారు. -
జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024లో సన్నాహకాల్లో భాగంగా వెస్టిండీస్ తమ స్వదేశంలో ఆరు మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి దశ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్లు మాత్రమే ఇరు జట్లు ఆడనునున్నాయి. టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత మరో మూడు మ్యాచ్లు జరగనున్నాయి.మే 23న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రోటీస్తో సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు ఐపీఎల్-2024లో భాగమైన విండీస్ ఆటగాళ్లు దూరమయ్యారు. కెప్టెన్ కెప్టెన్ రావ్మెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్మైర్ వంటి కీలక ఆటగాళ్లు ప్లే ఆఫ్స్కు సన్నద్దమవుతున్నారు. ఈ సిరీస్లో విండీస్ కెప్టెన్గా బ్రాండన్ కింగ్ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డే, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, రొమారియోడెన్ షెఫెర్డ్ వాల్ష్. -
‘సాక్షి’కి టీ 20 వరల్డ్కప్ ట్రోఫీ
మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్కప్ సమరం ఆరంభం కానుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్ ప్రపంచకప్ ప్రారంభం కానున్న తరుణంలో క్రికెట్ అభిమానులు ఆ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్లో మొత్తం 55 టీ20 మ్యాచ్లు నిర్వహించనున్నారు.‘సాక్షి’కి రానున్న వరల్డ్కప్ ట్రోఫీఇదిలా ఉంచితే, టీ20 వరల్డ్కప్ ట్రోఫీ నేడు ఆదివారం(మే 19) ‘సాక్షి’ ఆఫీస్కు రానుంది. ప్రొటెక్టెడ్ కంటైనర్లో సాక్షి ఆఫీస్కు తీసుకురానున్నారు. ఈ ట్రోఫీని సాక్షి ఆఫీస్కు తీసుకువచ్చి అక్కడ పని చేసే ఉద్యోగుల ముందు ప్రదర్శించనున్నారు.ఈ ట్రోఫీతో పాటు టీమిండియా వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా కూడా సాక్షి ఆఫీస్కు రానున్నారు. ఈ క్రమంలోనే సాక్షి ఉద్యోగస్తులతో పీయూష్ చావ్లా ముచ్చటించనున్నారు. ఇక ముగ్గురు నుంచి నలుగురు స్టార్ స్పోర్ట్స్ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్కు విచ్చేయనుంది.కాగా జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా ఈ వరల్డ్కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది. తొలిసారి ఉగాండ..టోర్నీలో భాగంగా ఉగాండ తొలిసారి ప్రపంచకప్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్కప్కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. నమీబియా సైతం టీ 20 వరల్డ్కప్లో పాల్గొంటుంది. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా,సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాల్లో .. యూఎస్ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్ మ్యాచ్లు జరుగనున్నాయి.ఈ ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వీటిల్లో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్లో టాప్-8లో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్.. టీ20 ర్యాంకింగ్స్లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, ఓమన్, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్కప్కు క్వాలిఫై అయ్యాయి. -
ఆసీస్, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్కప్ ఫైనల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్కప్-2024కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. అమెరికా, వెస్టిండీస్ల వేదికగా జూన్ 1 నుంచి ఈ పొట్టి వరల్డ్కప్ షురూ కానుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే అన్ని జట్లు దాదాపుగా తమ వివరాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్స్కు చేరే జట్లను వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశాడు. వెస్టిండీస్, భారత్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ సెమీఫైనల్స్కు చేరుతాయని లారా తెలిపాడు. అంతేకాకుండా. జూన్ 29న తుది పోరులో వెస్టిండీస్, భారత జట్లు తలపడతాయని లారా జోస్యం చెప్పాడు.వెస్టిండీస్ ఒక అద్బుతమైన జట్టు. జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. జట్టులో ప్రతీ ఒక్కరికి తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా ఉంది. మరోవైపు భారత వరల్డ్కప్ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటకి.. టాప్-4లో మాత్రం కచ్చితంగా ఉంటుంది.టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్-విండీస్ జట్లు తలపడితే నేను చూడాలనకుంటున్నాను. ఈ రెండు టీమ్స్ ఫైనల్లో తల పడి అత్యుత్తమ జట్టు ఛాంపియన్స్గా నిలవాలి. అదేవిధంగా భారత్, విండీస్ పాటు అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ కూడా సెమీఫైనల్స్కు చేరే అవకాశముందని లారా క్రికెట్ పాకిస్తాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారా పేర్కొన్నాడు.కాగా ఈ పొట్టి వరల్డ్కప్లో భారత జట్టు కంటే విండీస్కే ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. విండీస్ రెండు సార్లు ఛాంపియన్స్గా నిలిచింది. వెస్టిండీస్ 2012 ,2016లో టైటిల్ను గెలుచుకుంది. మరోవైపు 2007లో జరిగిన టీ20 వరల్డ్కప్ తొలి ఎడిషన్ టైటిల్ను టీమిండియా సొంతం చేసుకుంది. -
IPL 2024- WI: అలా అయితే.. సన్రైజర్స్, రాజస్తాన్కు షాక్!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది.మే 23, 25, 26 తేదీల్లో ప్రొటిస్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడనున్నట్లు వెల్లడించింది. జమైకాలోని సబీనా పార్కు వేదికగా ఈ మూడు మ్యాచ్లు జరుగనున్నట్లు వెల్లడించింది. కాగా విండీస్- సౌతాఫ్రికా సిరీస్ సమయంలోనే ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ నాకౌట్, క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి.సన్రైజర్స్, రాజస్తాన్కు షాక్!ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ చేరిన జట్లలో భాగమైన ఆటగాళ్లను గనుక విండీస్- ప్రొటిస్ బోర్డులు వెనక్కి పిలిపిస్తే ఆయా ఫ్రాంఛైజీలకు తలనొప్పి తప్పదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లోనే ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్న ఈ రెండు జట్లు గనుక కీలక సమయంలో ఆటగాళ్లను కోల్పోతే కష్టాలు తప్పవు. కాగా మే 21న ఐపీఎల్-2024 తొలి క్వాలిఫయర్, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న రెండో క్వాలిఫయర్, మే 26న ఫైనల్ జరుగనున్నాయి.మెగా ఈవెంట్కు ముందుకాగా గత టీ20 ప్రపంచకప్నకు అర్హత సాధించలేక చతికిలపడ్డ వెస్టిండీస్.. ఆ తర్వాత స్వదేశంలో టీమిండియా, ఇంగ్లండ్లపై సిరీస్లు గెలిచి ఫామ్లోకి వచ్చింది. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.ఇక జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్కు ముందు సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్తో విండీస్కు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ నుంచి తమ ఆటగాళ్లను వెనక్కి పిలిపించేందుకు సమాయత్తమైన విషయం తెలిసిందే.ఐపీఎల్-2024లో భాగమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆటగాళ్లు వీరేవిండీస్ ప్లేయర్లురోవ్మన్ పావెల్ (రాజస్తాన్ రాయల్స్), షిమ్రాన్ హెట్మెయిర్ (రాజస్తాన్ రాయల్స్), అల్జారీ జోసెఫ్ (ఆర్సీబీ), షాయ్ హోప్ (ఢిల్లీ క్యాపిటల్స్), షమర్ జోసెఫ్ (లక్నో సూపర్ జెయింట్స్), నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్), ఆండ్రీ రస్సెల్ (కోల్కతా నైట్ రైడర్స్), రొమారియో షెఫర్డ్ (ముంబై ఇండియన్స్).సౌతాఫ్రికా ఆటగాళ్లుఐడెన్ మార్క్రమ్ (సన్రైజర్స్ హైదరాబాద్), హెన్రిచ్ క్లాసెన్ (సన్రైజర్స్ హైదరాబాద్), మార్కో జాన్సన్ (సన్రైజర్స్ హైదరాబాద్), గెరాల్డ్ కోట్జీ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో సూపర్ జెయింట్స్), కేశవ్ మహరాజ్ (రాజస్తాన్ రాయల్స్), డేవిడ్ మిల్లర్ (గుజరాత్ టైటాన్స్), అన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా), కగిసో రబడ (పంజాబ్ కింగ్స్), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్).చదవండి: గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. గిల్కు ఏకంగా! -
టీ20 ప్రపంచకప్కు ఉగ్ర ముప్పు
పురుషుల టీ20 ప్రపంచకప్ 2024కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. టోర్నీ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్కు (కరీబియన్ దీవులు) ఉత్తర పాకిస్తాన్ ప్రాంతం నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పొట్టి ప్రపంచకప్ సహా పలు ఇతర క్రీడా కార్యక్రమాలపై దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్ (IS-Khorasan) పిలునిచ్చినట్లు తెలుస్తుంది. ప్రో ఇస్లామిక్ స్టేట్ (IS) మీడియా వర్గాలు హింసను ప్రేరేపించే విధంగా ప్రచారాలు ప్రారంభించాయి. తమ మద్దతుదారులంతా యుద్ధరంగంలో చేరాలని పిలుపునిస్తున్నాయి.ఈ అంశంపై క్రికెట్ వెస్టిండీస్ స్పందించింది. తమ దేశంలో జరిగే ప్రపంచకప్ మ్యాచ్లకు ఎలాంటి ఆటంకం కలగదని హామీ ఇచ్చింది. టోర్నీకి సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తామని ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టోర్నీ సజావుగా సాగుతుందని క్రికెట్ వెస్టిండీస్ CEO జానీ గ్రేవ్స్ హామీ ఇచ్చారు.కాగా, టీ20 ప్రపంచకప్కు వెస్టిండీస్తో పాటు యూఎస్ఏ కూడా ఆతిథ్యమిస్తుంది. జూన్ 1 నుంచి ఈ క్రికెట్ మహాసంగ్రామం ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ యూఎస్ఏలోని డల్లాస్ నగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్లో ఆతిథ్య యూఎస్ఏ జట్టు.. వారి పక్క దేశమైన కెనడాతో తలడనుంది. మెగా టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో టీమిండియా.. ఐర్లాండ్తో తలపడుతుంది. ప్రపంచకప్లో బిగ్ ఫైట్, దాయాదుల సమరం జూన్ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. -
వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
టీ20 వరల్డ్కప్-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోవ్మన్ పావెల్ సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా ఈ వరల్డ్కప్ జట్టులో పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్మైర్కు చోటు దక్కింది. హెట్మైర్ చివరగా గతేడాది డిసెంబర్లో విండీస్ తరపున ఆడాడు. అదేవిధంగా విండీస్ యవ పేస్ సంచలనం షమర్ జోసెఫ్కు కూడా ఈ మెగా టోర్నీ జట్టులో సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అదే విధంగా ఈ జట్టులో నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రోమారియో షెఫర్డ్ వంటి విధ్వంస ఆటగాళ్లు ఉన్నారు. పేపర్పై బలంగా కన్పిస్తున్న కరేబియన్లు తమ సొంత గడ్డపై ఎలా రాణిస్తారో వేచి చూడాలి. ఇక ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డల్లాస్ వేదికగా అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి.టీ20 వరల్డ్కప్కు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రోమారియో షెఫర్డ్. -
విండీస్ ఓపెనర్ ఊచకోత.. బెంబేలెత్తిపోయిన పసికూన
ఐదు మ్యాచ్ల అనధికారిక టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్-ఏ జట్టు నేపాల్లో పర్యటిస్తుంది. సిరీస్లో భాగంగా నిన్న (మే 1) జరిగిన మూడో మ్యాచ్లో పర్యాటక జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ మెరుపు శతకం (61 బంతుల్లో 119 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్లో ఛార్లెస్ ఊచకోత ధాటికి నేపాల్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ గెలుపుతో విండీస్ సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్లో నేపాల్ సంచలన విజయం సాధించగా.. రెండు, మూడు మ్యాచ్ల్లో విండీస్ విజయం సాధించింది. ఇవాళ (మే 2) నాలుగో టీ20 జరుగుతుంది.మూడో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్లో ఛార్లెస్తో పాటు ఆండ్రీ ఫ్లెచర్ (33 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. అలిక్ అథనాజ్ 17, ఫేబియన్ అలెన్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కీమో పాల్ 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, సాగర్ ధకల్ తలో వికెట్ పడగొట్టగా.. అథనాజ్ రనౌటయ్యాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్ల దెబ్బకు 19.2 ఓవర్లలో 151 పరుగులకే బిచానా సర్దేసింది. విండీస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్ 3 వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ 2, మాథ్యూ ఫోర్డ్, ఓబెద్ మెక్కాయ్, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్లో లోకేశ్ బమ్, కరణ్ తలో 28 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ సిరీస్లో వరుసగా సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ ఈ మ్యాచ్లో ఆడలేదు. -
రోహిత్ వీరోచిత శతకం.. విండీస్కు షాకిచ్చిన నేపాల్
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్-ఏ క్రికెట్ జట్టు నేపాల్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) తొలి టీ20 జరిగింది. కిరీటీపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య నేపాల్ తమకంటే చాలా రెట్లు మెరుగైన విండీస్-ఏకు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్లో నేపాల్ విండీస్ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ వీరోచిత శతకం బాదాడు. ఫలితంగా నేపాల్ విండీస్పై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. అలిక్ అథనాజ్ (47), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (74), కీసీ మెక్కార్తీ (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. నేపాల్ బౌలర్లలో కమల్, దీపేంద్ర, రోహిత్, అభినాష్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (54 బంతుల్లో 112; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రోహిత్కు సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించప్పటికీ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించుకున్నాడు. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర (24), కుశాల్ మల్లా (16), కుశాల్ భుర్టెల్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, మెక్కాయ్ తలో రెండు వికెట్లు, కీమో పాల్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రెండో టీ20 ఇదే వేదికగా రేపు జరుగనుంది. -
రోహిత్ శర్మపై సంచలన వ్యాఖ్యలు
‘‘రోహిత్ శర్మ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అతడొక అద్భుతమైన క్రికెటర్. కానీ.. ప్రస్తుతం బ్యాటింగ్ ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. రోహిత్తో పోలిస్తే విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ మెరుగైన ఫామ్లో ఉన్నారు.ఓపెనింగ్ స్థానాల కోసం గట్టి పోటీనిస్తున్నారు. అయితే, రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి కచ్చితంగా అతడొక ఓపెనర్గా ఉంటాడు. కాబట్టి ఫామ్లో ఉన్న ఎవరో ఒక ఆటగాడు బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక రావాల్సి ఉంటుంది.నిజానికి ఇలాంటి సమయంలో.. వరల్డ్కప్ టోర్నీకి ముందు రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్గా తిరిగి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరికాదు.ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ ఐడియల్ కెప్టెన్ కాదు. అతడి కోసం యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్లలో ఎవరో ఒకరిపై తప్పక వేటు పడుతుంది’’ అని కోల్కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య సంచలన వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్న కారణంగా ఫామ్లో ఉన్న ఆటగాళ్లపై వేటు పడుతుందంటూ ఘాటు విమర్శలు చేశాడు. హిట్మ్యాన్ టీ20లలో మునుపటిలా ఆటడం లేదని.. అతడి పునరాగమనం జట్టు కూర్పులో చిక్కులు తెస్తుందని జాయ్ భట్టాచార్య అభిప్రాయపడ్డాడు.కాగా టీ20 ప్రపంచకప్-2022లో సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దాదాపు ఏడాది కాలం పాటు టీ20 జట్టుకు దూరంగా ఉన్నారు.ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చారు. ఇక రోహిత్ గైర్హాజరీలో టీ20 జట్టును ముందుకు నడిపిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లు గాయాల బారిన పడిన తరుణంలో.. ప్రపంచకప్-2024లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్గా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది.ఈ నేపథ్యంలో రోహిత్తో కలిసి విరాట్ కోహ్లి మెగా ఈవెంట్లో ఓపెనింగ్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్లలో ఎవరో ఒకరిపై వేటు పడటం ఖాయం. ఈ నేపథ్యంలో జాయ్ భట్టాచార్య ఈమేరకు వ్యాఖ్యల చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు.. ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కలిపి 303 పరుగులు చేశాడు.మరోవైపు కోహ్లి ఆర్సీబీ ఓపెనర్గా 9 ఇన్నింగ్స్లో కలిపి 430 రన్స్ చేయగా.. శుబ్మన్ గిల్ 304, యశస్వి జైస్వాల్ ఓ సెంచరీ సాయంతో 225 పరుగులు సాధించాడు. కాగా జూన్ 1న అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభంకానుంది. -
నేపాల్ క్రికెట్ బోర్డు పేదరికం.. విండీస్ క్రికెటర్లకు ఊహించని కష్టాలు
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్-ఏ క్రికెట్ జట్టు నేపాల్లో పర్యటిస్తుంది. ఈ నెల (ఏప్రిల్) 27 నుంచి వచ్చే నెల (మే) 4వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో విండీస్-నేపాల్ జట్లు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్నాయి. కిరీటీపూర్ వేదికగా జరిగే ఈ సిరీస్ ఏప్రిల్ 27, 28, మే 1, 2, 4 తేదీల్లో జరుగనుంది. విండీస్ క్రికెట్ బోర్డు నేపాల్ సిరీస్ను వరల్డ్కప్ సన్నాహకంగా భావించి పూర్తి స్థాయి జట్టును అక్కడికి పంపింది.ఐపీఎల్తో బిజీగా ఉన్న క్రికెటర్లు మినహా మిగతా జట్టంతా నేపాల్ పర్యటనకు వచ్చింది. విండీస్ క్రికెటర్లు నిన్ననే నేపాల్ రాజధాని ఖాట్మండులో ల్యాండ్ అయ్యారు. అయితే ఖాట్మండు విమానాశ్రయంలో విండీస్ క్రికెటర్లకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. నేపాల్ క్రికెట్ బోర్డు విండీస్ క్రికెటర్లకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లు ఆడిన క్రికెటర్లుకు స్వాగతం పలికే నాథుడు కూడా లేకుండా పోయాడు.నిధులలేమితో కొట్టిమిట్టాడుతున్న నేపాల్ క్రికెట్ బోర్డు విండీస్ క్రికెటర్లకు కనీస రవాణా సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. క్రికెటర్లు సాధారణ బస్సులో బస చేసే ప్రదేశానికి బయల్దేరారు. నేపాల్ క్రికెట్ బోర్డు దీనస్థితి ఎంతలా ఉందంటే.. విండీస్ క్రికెటర్ల లగేజీని మోసుకెళ్లేందుకు ట్రాలీ ఆటో లాంటి ఆతి సాధారణ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. విండీస్ ఆటగాళ్లు ఎవరి లగేజీని వాళ్లే మోసుకెళ్లి ట్రాలీలో పెట్టుకున్నారు.ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. కొందరు నేపాల్ క్రికెట్ బోర్డు పరిస్థితిని చూసి జాలి పడుతుంటే.. మరికొందరు మీమ్స్కు వాడుకుంటున్నారు.కాగా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా గతంలో నేపాల్ క్రికెట్ బోర్డు పరిస్థితి మాదిరే ఉండేది. ఆ జట్టు క్రికెట్ బోర్డు కూడా పేదరికంతొ కొట్టిమిట్టాడింది. ప్రస్తుతం పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. విండీస్ క్రికెట్ బోర్డుకు ఎలాగోలా నిధులు సమకూరుతున్నాయి. అందుకే ఆ జట్టు యూఎస్ఏతో కలిసి ఈ ఏడాది టీ20 వరల్డ్కప్కు ఆతిథ్యమివ్వగలుగుతుంది. నేపాల్ క్రికెట్ బోర్డు విషయానికొస్తే.. ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు జీతాలు ఇవ్వలేకపోతుంది. కనీసం కిట్లు కూడా సమకూర్చలేకపోతుంది. దీనస్థితిలో ఉన్న నేపాల్ క్రికెట్ను బీసీసీఐ లాంటి సంపన్న బోర్డులు ఆదుకోవాలి. నేపాల్లో పర్యటిస్తున్న వెస్టిండీస్-ఏ క్రికెట్ జట్టు: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), అలిక్ అథనాజ్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, కడీమ్ అలీన్, జాషువా బిషప్, కీసీ కార్టీ, జాన్సన్ చార్లెస్, మార్క్ దేయల్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డ్, ఒబెడ్ మెకాయ్ , గుడకేష్ మోటీ, కీమో పాల్, ఒషానే థామస్, హేడెన్ వాల్ష్West Indies team have arrived in Nepal. pic.twitter.com/EIrBPPr5ui— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 -
టీ20 వరల్డ్కప్లో రీఎంట్రీపై విండీస్ వీరుడి స్పందన ఇదే..!
విండీస్ వెటరన్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ టీ20 వరల్డ్కప్తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై నరైన్ తాజాగా స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. రీఎంట్రీకి డోర్లు మూసుకుపోయాయని అన్నాడు. ఇటీవలికాలంలో తన ప్రదర్శనలు సంతృప్తినిచ్చాయని తెలిపాడు. టీ20 వరల్డ్కప్ ఆడాలనే అభిమానుల ప్రతిపాదనను గౌరవిస్తానని అన్నాడు. అయితే అందుకు ఓకే మాత్రం చెప్పలేనని వివరించాడు. వరల్డ్కప్ ఆడే విండీస్ జట్టుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని.. విండీస్ వీరులు మరో టైటిల్కు అర్హులేనంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నరైన్ టీ20 వరల్డ్కప్లో ఆడటంపై బహిరంగ ప్రకటన చేయడంతో విండీస్ క్రికెట్ బోర్డు ఓ అంచనాకు వచ్చింది. నరైన్ను టీ20 వరల్డ్కప్లో ఆడాలని ఒప్పించేందుకు తాను గతకొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని విండీస్ టీ20 జట్టు కెప్టెన్ రోవ్మన్ పావెల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నరైన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బంతితో పాటు బ్యాట్తోనూ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో నరైన్ మెరపు శతకంతో (56 బంతుల్లో 109) విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ 7 మ్యాచ్ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 286 పరుగులు చేశాడు. 9 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ సీజన్లో కేకేఆర్ సాధించిన విజయాల్లో నరైన్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. నరైన్ ఈ సీజన్లోనే రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. నరైన్ ఓపెనర్గా బరిలోకి దిగుతున్నప్పటి నుంచి అతని ఫేట్ మారిపోయింది. ఓపెనర్గా అతను స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. నరైన్ను ఓపెనర్గా పంపడం కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రతిపాదన. గతంలోనూ గంభీర్ నరైన్ను ఓపెనర్గా పంపి సత్ఫలితాలు సాధించాడు. 35 ఏళ్ల నరైన్ 2019లో చివరిసారిగా వెస్టిండీస్కు ఆడాడు. అతను 2023లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాజా బ్యాటింగ్ ఫామ్ నేపథ్యంలో నరైన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ కోసం చాలామంది వెటరన్ క్రికెటర్లు రిటైర్మెంట్ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్లు ఇమాద్ వసీం, మొహహ్మద్ ఆమిర్ టీ20 వరల్డ్కప్ కోసం యూ టర్న్ తీసుకున్నారు. -
ఎప్పుడూ షూ కూడా వేసుకోలేదు: ‘ఎంఐ’ పవర్ హిట్టర్
‘‘నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అందుకే ఎంత వీలైతే అంత నిరాడంబరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఇక్కడిదాకా చేరుకునే క్రమంలో నా ప్రయాణం ఎంత కష్టతరంగా సాగిందో నాకు తెలుసు. కాళ్లకు బూట్లు లేకుండానే స్కూలుకు వెళ్లిన రోజులు ఉన్నాయి. నేనే కాదు.. బరాకరాలో 99 శాతం పిల్లలు ఎప్పుడూ నాలాగే కనీసం చెప్పుల్లేకుండా వెళ్లాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే.. బరాకరాలో ప్రయాణం మొత్తం నదుల మీదే సాగుతుంది. అక్కడ కాంక్రీట్ రోడ్డులు ఉండవు. మొత్తం అంతా బురదమయమే. అంతా సవ్యంగా ఉన్న రోజు కుదిరితే పడవలో ప్రయాణం చేసేవాళ్లం’’ అంటూ వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ బాల్యంలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. పవర్ హిట్టింగ్ ఎలా సాధ్యం? పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం కఠినంగా శ్రమించడమేనని పేర్కొన్నాడు. అదే విధంగా పవర్ హిట్టర్గా పేరొందడం గురించి మాట్లాడుతూ.. ‘‘మంచి బ్యాట్ ఉండి.. మనం బలంగా ఉంటే తొలి బంతి నుంచే భారీ షాట్లు కొట్టవచ్చు(నవ్వుతూ). కొన్నిసార్లు అది సాధ్యపడకపోవచ్చు. సరైన సమయంలో సరైన బంతిని బాదితేనే దానిని సిక్సర్గా మలిచే అవకాశం ఉంటుంది. ఫినిషర్ల నుంచి ప్రతి ఒక్కరు భారీ షాట్లు ఆశిస్తారు. అందుకు తగ్గట్లుగా ఆడుతూనే వికెట్ పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది’’ అని రొమారియో షెఫర్డ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. వెస్టిండీస్ తరఫున సత్తా చాటుతూ కాగా 1994లో గయానాలో జన్మించిన రొమారియో షెఫర్డ్ క్రికెట్ను కెరీర్గా ఎంచుకుని.. 2019లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి పవర్ హిట్టర్గా పేరొందాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 31 వన్డేలు, 35 టీ20 మ్యాచ్లు ఆడాడు ఈ పేస్ ఆల్రౌండర్. విండీస్ తరఫున వన్డేల్లో 400 పరుగులు చేయడంతో పాటు 27 వికెట్లు పడగొట్టిన రొమారియో షెఫర్డ్.. టీ20లలో 317 రన్స్ చేసి 37 వికెట్లు తీశాడు. ఆరంభంలో భారీ ధరకు అమ్ముడుపోయి.. ఇప్పుడిలా ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన రొమారియో షెఫర్డ్ను 2022 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 7.75 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే, తర్వాత అతడిని ఎస్ఆర్హెచ్ వదిలేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. కానీ ఐపీఎల్-2024కు ముందు లక్నో నుంచి ముంబై ఇండియన్స్ రొమారియో షెఫర్డ్ను రూ. 50 లక్షల ధరకు ట్రేడ్ చేసుకుంది. PC: MI ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో నాలుగు మ్యాచ్లు ఆడిన రొమారియో షెఫర్డ్ 58 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్ 2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. "Ahmedabad chalo!" 🫡💙 The boys have reached the 📍 for their season opener 🏟️#OneFamily #MumbaiIndians pic.twitter.com/cUgkx6Lkyf — Mumbai Indians (@mipaltan) March 22, 2024 చదవండి: IPL 2024: షెడ్యూల్, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు -
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్.. 44 బంతుల్లో శతకం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఎడిషన్లో విండీస్ ఆటగాడు చాడ్విక్ వాల్టన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ లీగ్లో న్యూయార్క్ సూపర్స్టార్ స్ట్రయికర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న చాడ్విక్.. కొలొంబో లయన్స్తో ఇవాళ (మార్చి 18) జరుగుతున్న మ్యాచ్లో 44 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న చాడ్విక్.. 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. చాడ్విక్తో పాటు అల్విరో పీటర్సన్ (49) రాణించడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో కపూగెదెర (17 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో న్యూయార్క్ 200 పరుగుల మార్కును క్రాస్ చేసింది. కొలొంబో లయన్స్ బౌలర్లలో రాణా నయీమ్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరివర్దన ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కొలొంబో లయన్స్... 8.1 ఓవర్లలో 54 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. దమ్మిక ప్రసాద్ (1-0-6-2), రాహుల్ శర్మ (2.1-0-10-2) అసేల గుణరత్నే (2-0-6-1), జేరోమ్ టేలర్ (2-0-18-1) కొలొంబో లయన్స్ పతనాన్ని శాశిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో విజేత రేపు జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ డెవిల్స్తో తలపడనుంది. ఢిల్లీ డెవిల్స్కు సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్నాడు. -
T20 WC 2024: అభిమానులకు గుడ్న్యూస్!
క్రికెట్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ మ్యాచ్లను ఉచితంగా వీక్షించే లక్కీ ఛాన్స్..!! ఈ మెగా ఈవెంట్ ప్రసారకర్త డిస్నీ+హాట్స్టార్ తమ డిజిటల్ ప్రేక్షకులకు ఈ అవకాశం కల్పించనుంది. కాగా ఈ ఏడాది జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్ ప్రపంచకప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్లో మొత్తం 55 టీ20 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డిస్నీ+హాట్స్టార్ సోమవారం కీలక ప్రకటన చేసింది. తమకున్న మొబైల్ యూజర్లు వరల్డ్కప్-2024 మ్యాచ్లన్నింటినీ ఫ్రీగా చూడవచ్చని తెలిపింది. కాగా గతంలో ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్కప్-2023 మ్యాచ్లను కూడా డిస్నీ తమ డిజిటల్ యూజర్ల కోసం ఉచితంగా ప్రసారం చేసింది. అదండీ సంగతి.. మీకు గనుక డిస్నీ+హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఉచితంగా మ్యాచ్లు చూసేయొచ్చు! కాగా జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా ఈ వరల్డ్కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. అన్నట్లు టోర్నీకే హైలైట్గా భావించే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ సమరం కంటే ముందు.. మరో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ టీ20 మజాను అందించనుంది. ఈ మ్యాచ్లను కూడా జియో సినిమా తమ యాప్లో ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! రింకూ సింగ్కు బంపరాఫర్.. టీ20 వరల్డ్కప్ జట్టులో ఛాన్స్? -
కైల్ మేయర్స్ ఆల్రౌండ్ షో.. మెరుపు అర్దశతకం సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఫార్చూన్ బారిషల్ ఆటగాడు కైల్ మేయర్స్ (వెస్టిండీస్) ఆల్రౌండ్ షోతో ఇరగదీశాడు. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో మెరుపు అర్దశతకం (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సహా రెండు వికెట్లు (4-0-28-2) తీసి తన జట్టును గెలిపించాడు. తొలుత బౌలింగ్లో రాణించిన మేయర్స్ ఆతర్వాత బ్యాటింగ్లో మెరిశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కైల్ మేయర్స్, సైఫుద్దీన్, మెక్కాయ్ తలో 2 వికెట్లు తీసి ఛాలెంజర్స్ పతనాన్ని శాశించారు. తైజుల్ ఇస్లాం, జేమ్స్ ఫుల్లర్ చెరో వికెట్ పడగొట్టారు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్లో జోష్ బ్రౌన్ చేసిన 34 పరుగులే అత్యధికం. కెప్టెన్ షువగట (24), ట్రామ్ బ్రూస్ (17), సైకత్ అలీ (11), రొమారియో షెపర్డ్ (11), నిహాదుజ్జమాన్ (10) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లు కనీసం ఈపాటి పరుగులు కూడా సాధించలేకపోయారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. కైల్ మేయర్స్, తమీమ్ ఇక్బాల్ (52 నాటౌట్) చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఫలితంగా బారిషల్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. బారిషల్ ఇన్నింగ్స్లో సౌమ్య సర్కార్ (0) విఫలం కాగా.. డేవిడ్ మిల్లర్ (17) వేగంగా పరుగులు సాధించాడు. ముష్ఫికర్ రహాం (6 నాటౌట్) విన్నింగ్ రన్స్ కొట్టాడు. ఛాలెంజర్స్ బౌలర్లలో షువగట, బిలాల్ ఖాన్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. రంగ్పూర్ రైడర్స్, కొమిల్లా విక్టోరియన్స్ మధ్య ఇవాళ రాత్రి క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు.. ఫిబ్రవరి 28న జరిగే క్వాలిఫయర్-2లో ఫార్చూన్ బారిషల్తో తలపడుతుంది. -
పూనకాలు తెప్పించిన పోలార్డ్.. బాబర్ వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో పూర్వంలా పూనకాలు తెప్పించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 49 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. 𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑷𝒐𝒍𝒍𝒚 𝒊𝒏 𝑷𝑺𝑳 𝟐𝟎𝟐𝟒🔥 📸: Fan Code pic.twitter.com/uUMO58x5Sj — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది బ్యాటర్ బాబర్ ఆజమ్ (పెషావర్) వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఈ మ్యాచ్లో 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసిన బాబర్.. టీ20ల్లో అత్యంత వేగంగా (271 ఇన్నింగ్స్ల్లో) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. He's still got it 🥶pic.twitter.com/kthsVbhdf3 — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్తో పాటు జేమ్స్ విన్స్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ అక్లక్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) రాణించడంతో పెషావర్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కరాచీ 16.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ (3.5-1-20-2) ఒక్కడే కరాచీ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. సలాంకీల్ వికెట్ తీసినప్పటికీ (4-0-54-1) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఆజమ్ (72) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ (19.5 ఓవర్లలో ఆలౌట్) చేయగలిగింది. పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్తో పాటు రోవ్మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు, డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
నిన్న ప్రత్యర్దులు.. నేడు సహచరులు, ఒక్క రోజులో సీన్ రివర్స్
ఆధునిక క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన టీ20 మ్యాచ్లో ప్రత్యర్దులుగా బరిలోకి దిగిన నికోలస్ పూరన్ (వెస్టిండీస్), టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా).. ఇవాళ ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఒకే జట్టుకు ఆడుతున్నారు. నిన్నటి వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఉండిన క్రికెటర్లు రోజు మారే సరికి దుబాయ్లో వాలిపోయారు. ILT20 2024లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న తొలి క్వాలిఫయర్లో పూరన్, డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. గల్ఫ్ జెయింట్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఎమిరేట్స్ స్కోర్ 45/2గా ఉంది. ముహమ్మద్ వసీం (12), ఆండ్రీ ఫ్లెచర్ (0) ఔట్ కాగా.. పూరన్ (9), కుశాల్ పెరీర్ (22) క్రీజ్లో ఉన్నారు. కాగా, నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు రేపు (ఫిబ్రవరి 15) జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్తో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు నేటి మ్యాచ్లో గెలిచిన జట్టుతో ఫైనల్లో తలపడుతుంది. -
చరిత్ర సృష్టించిన రసెల్, రూథర్ఫోర్డ్ జోడీ
పొట్టి క్రికెట్లో ఆండ్రీ రసెల్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ జోడీ (వెస్టిండీస్ క్రికెటర్లు) చరిత్ర సృష్టించింది. ఈ జోడీ ఆరో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో రసెల్, రూథర్ఫర్డ్ జోడీ ఆరో వికెట్కు 139 పరుగులు జోడించి గత రికార్డును బద్దలుకొట్టింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు పపువా న్యూ గినియా జోడీ (టోనీ ఉరా-నార్మన్ వనువా) పేరిట ఉండింది. 2022లో జరిగిన ఓ మ్యాచ్లో పపువా జోడీ ఆరో వికెట్కు అత్యధికంగా 115 పరుగులు జోడించింది. దీనికి ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియన్ జోడీ (మైక్ హస్సీ-కెమరూన్ వైట్) పేరిట ఉండింది. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హస్సీ-వైట్ కాంబో ఆరో వికెట్కు అజేయమైన 101 పరుగులు జోడించింది. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పర్యాటక విండీస్ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి విండీస్ను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రసెల్, రూథర్ఫోర్డ్తో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలుత విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్కు ఓటమి తప్పలేదు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్లో విండీస్ విజయం సాధించింది. -
రఫ్ఫాడించిన రసెల్.. వార్నర్ మెరుపులు వృధా
ఆస్ట్రేలియా పర్యటనను విండీస్ గెలుపుతో ముగించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పర్యాటక జట్టు చివరి మ్యాచ్లో విజయం సాధించింది. ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశారు. ఫలితంగా 37 పరుగుల తేడాతో విజయం సాధించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకున్నారు. రఫ్ఫాడించిన రసెల్.. రెచ్చిపోయిన రూథర్ఫోర్డ్ తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. వీరిద్దరితో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. వార్నర్ మెరుపులు వృధా భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్లో విండీస్ విజయం సాధించింది. టీ20 సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య టెస్ట్, వన్డే సిరీస్లు జరిగాయి. టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. -
వందో మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన వార్నర్.. తొలి టీ20 ఆసీస్దే
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ చివరివరకు అద్భుతంగా పోరాడింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎంతటి భారీ స్కోర్లనైనా ఛేదిస్తుందని అనిపించింది. జట్టులో దాదాపుగా అందరూ బ్యాట్తో మెరుపులు మెరిపించగల సమర్ధులే. ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా విండీస్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ (70) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ (39), టిమ్ డేవిడ్ (37 నాటౌట్), వేడ్ (21) వేగంగా పరుగులు సాధించగా.. మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్వెల్ (10), స్టోయినిస్ (9), అబాట్ (0) నిరాశపరిచారు. విండీస్ బౌలరల్లో రసెల్ 3 వికెట్లు, అల్జరీ జోసఫ్ 2, హోల్డర్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకు పరిమితమై (8 వికెట్లు కోల్పోయి) 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (53), జాన్సన్ చార్లెస్ (42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తొలి వికెట్కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చివారు తుస్సుమనిపించడంతో విండీస్ చేతులెత్తేసింది. ఆఖర్లో జేసన్ హోల్డర్ (34 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడి విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. పూరన్ (18), పావెల్ (14), హోప్ (16), రసెల్ (1), రూథర్ఫోర్డ్ (7), షెపర్డ్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టోయినిస్ 2, బెహ్రెన్డార్ఫ్, మ్యాక్స్వెల్, అబాట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఫిబ్రవరి 11న అడిలైడ్లో జరుగనుంది. -
ఫ్యాన్స్కు ఇక పండగే.. క్రిస్ గేల్ రీ ఎంట్రీ! తెలంగాణ కెప్టెన్గా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్లో తెలంగాణ టైగర్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్రిస్ గేల్ స్వయంగా వెల్లడించాడు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు తొమ్మిది రోజుల పాటు డెహ్రడూన్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగనుంది. "నాపై నాకున్న నమ్మకం, అభిమానుల హర్ష ద్వనిలు నన్ను మళ్లీ బ్యాట్ పట్టేలా చేస్తున్నాయి. వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలతో మళ్లీ ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఐవీపీఎల్కు సిద్దమవ్వండి" అంటూ గేల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. గేల్తో పాటు భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్ప్రీత్ గోనీ, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం ఎన్ని జట్లు అంటే? ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్తో పాటు యూరోస్పోర్టస్ ఛానెల్లో అభిమానులు వీక్షించవచ్చు. కాగా వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్, హెర్షల్ గిబ్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో భాగం కానున్నట్లు సమాచారం. -
సీన్ అబాట్ ఆల్రౌండ్ షో.. విండీస్ను చిత్తు చేసిన ఆసీస్
స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఆసీస్ ఆటగాడు సీన్ అబాట్ ఆల్రౌండ్ షోతో (69 పరుగులు, 3 వికెట్లు) విండీస్ను ఓడించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో వచ్చిన అబాట్ 63 బంతుల్లో 4 సిక్సర్లు, బౌండరీ సాయంతో 69 పరుగులు చేసి ఆసీస్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో గ్రీన్ (33), షార్ట్ (41), లబూషేన్ (26), ఆరోన్ హార్డీ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలరల్లో గుడకేశ్ మోటీ 3 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాశించగా.. అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు, మాథ్యూ ఫోర్డ్, ఒషేన్ థామస్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. సీన్ అబాట్ (3/40), జోష్ హాజిల్వుడ్ (3/43) విజృంభించడంతో 43.3 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. సదర్ల్యాండ్ 2, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో కీసీ కార్టీ (40) టాప్ స్కోరర్గా నిలువగా.. అలిక్ అథనాజ్ (11), షాయ్ హోప్ (29), రోస్టన్ చేజ్ (25), అల్జరీ జోసఫ్ (19) రెండంకెల స్కోర్ చేశారు. ఈ సిరీస్లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్లో చివరిదైన మూడో వన్డే ఫిబ్రవరి 6న జరుగనుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఫిబ్రవరి 9, 11, 13 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement