వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..! | Womens Cricket: West Indies Chase 168 In 10.5 Overs But MISS OUT To Bangaldesh On World Cup Qualification | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!

Published Sat, Apr 19 2025 9:47 PM | Last Updated on Sat, Apr 19 2025 10:07 PM

Womens Cricket: West Indies Chase 168 In 10.5 Overs But MISS OUT To Bangaldesh On World Cup Qualification

మహిళల వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌కు గుండె కోత మిగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచినా కరీబియన్‌ జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది. థాయ్‌లాండ్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 19) జరిగిన డు ఆర్‌ డై మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన థాయ్‌లాండ్‌ 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్‌ కాగా.. వెస్టిండీస్‌ కేవలం 10.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయినా 0.013 రన్‌రేట్‌ తేడాతో వరల్డ్‌కప్‌ బెర్త్‌ను కోల్పోయింది. 

పాయింట్ల పరంగా విండీస్‌తో సమానంగా ఉన్నప్పటికీ.. రన్‌రేట్‌ కాస్త ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ టోర్నీలో పాక్‌ ఆడిన 5 మ్యాచ్‌ల్లో గెలిచి తొలి ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్‌ కోసం వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ పోటీపడ్డాయి. ఇరు జట్లు చెరో 5 ​మ్యాచ్‌ల్లో తలో మూడు గెలువగా, రన్‌రేట్‌ కాస్త ఎక్కువగా ఉండటం చేత బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.

కాగా, పాక్‌ వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌-2025లో మొత్తం ఆరు జట్లు (పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, థాయ్‌లాండ్‌) పాల్గొన్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పాక్‌, బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌ నేరుగా అర్హత సాధించగా.. పాక్‌, బంగ్లాదేశ్‌ క్వాలిఫయర్స్‌ ద్వారా క్వాలిఫై అయ్యాయి.‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement