బంగ్లాదేశ్‌తో రెండో టీ20.. నితీశ్‌ కుమార్‌ ఊచకోత.. టీమిండియా భారీ స్కోర్‌ | IND VS BAN 2nd T20: Nitish Reddy Shines With Blasting Fifty, Team India Set 222 Runs Target | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌తో రెండో టీ20.. నితీశ్‌ కుమార్‌ ఊచకోత.. టీమిండియా భారీ స్కోర్‌

Published Wed, Oct 9 2024 8:42 PM | Last Updated on Wed, Oct 9 2024 8:42 PM

IND VS BAN 2nd T20: Nitish Reddy Shines With Blasting Fifty, Team India Set 222 Runs Target

న్యూఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి బంగ్లాదేశ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను నితీశ్‌ కుమార్‌ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్‌ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు.

హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్‌ 10, అభిషేక్‌ శర్మ 15, సూర్యకుమార్‌ యాదవ్‌ 8, రియాన్‌ పరాగ్‌ 15, వరుణ్‌ చక్రవర్తి 0. సుందర్‌ 0 (నాటౌట్‌), అర్షదీప్‌ సింగ్‌ 6, మయాంక్‌ యాదవ్‌ ఒక్క పరుగు (నాటౌట్‌) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్‌ హొసేన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌, తంజిమ్‌ హసన్‌ తలో రెండు వికెట్లు తీశారు. 

తుది జట్లు..

భారత్: సంజు శాంసన్(వికెట్‌కీపర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), నితీష్ కుమార్‌ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(వికెట్‌కీపర్‌), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకెర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement