Nitish Kumar Reddy
-
హైదరాబాద్ ఫ్యాన్ కు పండుగ.. కెప్టెన్ గా నితీశ్ రెడ్డి?
-
అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్! వైరల్
ఇంగ్లండ్తో ఐదో టీ20(India vs England)లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. సహచరులు విఫలమైన చోట.. ‘చేతికే బ్యాట్ మొలిచిందా’ అన్నట్లుగా.. పొట్టి ఫార్మాట్కే వన్నె తెచ్చేలా అతడి ఇన్నింగ్స్ సాగింది.మిగిలిన భారత ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టిన వేళ.. తను మాత్రం ‘తగ్గేదేలే’ అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్ను చితక్కొట్టిన విధానం టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్!ఈ క్రమంలో అభిషేక్ శర్మను ఉద్దేశించి సహచర ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్మేట్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కత్తి పట్టుకుని ఉన్న ఫొటోతో పాటు.. బ్యాట్తో అభిషేక్ పోజులిస్తున్న ఫొటోను పంచుకున్న నితీశ్.. ‘‘మెంటల్ నా కొడుకు’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు సెల్యూట్ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జతచేశాడు. పూనకం వస్తే అతడిని ఎవరూ ఆపలేరన్న అర్థంలో అభిషేక్ ఇన్నింగ్స్ను ప్రశంసిస్తూ ఇలా ఊరమాస్ కామెంట్ పెట్టాడు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం నితీశ్ వాడిన పదాన్ని తప్పుబడుతుండగా.. మరికొందరు అభిషేక్ ఆట తీరును వర్ణించేందుకే ఆ పదం వాడాడని పేర్కొంటున్నారు.150 పరుగుల తేడాతో మట్టికరిపించికాగా ఇప్పటికే ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ సూర్యకుమార్ సేన సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో బట్లర్ బృందాన్ని 150 పరుగుల తేడాతో మట్టికరిపించి ఏకపక్ష విజయం సాధించింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. ఇందుకు ప్రధాన కారణం అభిషేక్ శర్మ.ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ.. పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. అదే జోరులో 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, పదమూడు సిక్స్లు ఉన్నాయి.అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియాకు ఘన విజయం దక్కింది. దీంతో 4-1తో ఈ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను సూర్యకుమార్ సేన సొంతం చేసుకుంది.కాగా అంతర్జాతీయ టీ20లలో అభిషేక్ శర్మకు రెండో శతకం. ఇంతకు ముందు జింబాబ్వేపై అతడు సెంచరీ సాధించాడు. ఇక ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అభిషేక్ శర్మ.. గత సీజన్లో పరుగుల వరద పారించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్తో కలిసి విధ్వంసక బ్యాటింగ్తో చెలరేగి.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గాయం వల్ల దూరంఇక విశాఖపట్నం కుర్రాడు, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా సన్రైజర్స్కే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలోనూ ఇద్దరూ కలిసే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్తో స్నేహం దృష్ట్యా ఈ మేర కామెంట్ చేయడం గమనార్హం. కాగా నితీశ్ రెడ్డి కూడా ఇంగ్లండ్తో టీ20లకు సెలక్ట్ అయ్యాడు. కోల్కతా మ్యాచ్లో కూడా భాగమయ్యాడు. అయితే, గాయం కారణంగా అనంతరం జట్టుకు దూరమయ్యాడు. చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
Ind vs Eng: అతడికి గాయం.. భారత జట్టులోకి శివం దూబే!
ముంబై ఆల్రౌండర్ శివం దూబే(Shivam Dube) టీమిండియాతో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత అతడు భారత టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడని సమాచారం.లంక పర్యటనలో ఆఖరిగాకాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024) గెలిచిన భారత జట్టులో భాగమైన శివం దూబే ఆ తర్వాత.. శ్రీలంకతో టీ20లలో ఆడాడు. అనంతరం సొంతగడ్డపై జరిగిన బంగ్లాదేశ్తో పొట్టి ఫార్మాట్ సిరీస్కు ఎంపిక చేసి జట్టులో.. అదే విధంగా సౌతాఫ్రికాకు వెళ్లిన టీమ్లోనూ శివం దూబేకు సెలక్టర్లు చోటివ్వలేదు.తాజా రంజీ మ్యాచ్లో డకౌట్లుఈ క్రమంలో అతడు తన సొంత జట్టు ముంబై తరఫున దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, రంజీ మ్యాచ్లలోనూ భాగమయ్యాడు. తాజాగా జమ్మూ కశ్మీర్తో శనివారం ముగిసిన మ్యాచ్లోనూ శివం దూబే ఆడాడు. అయితే, తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లోనూ సున్నా చుట్టాడు.నితీశ్ రెడ్డికి గాయం?అయితే, ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఓ వికెట్ మాత్రం తన ఖాతాలో వేసుకోగలిగాడు. అయితే, అనూహ్యంగా శివం దూబేకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపు వచ్చినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా గాయపడిన మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. స్థానాన్ని దూబేతో భర్తీ చేసినట్లు తెలిపింది.అయితే, నితీశ్ రెడ్డి గాయం తాలూకు వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడికాలేదు. కానీ వెంటనే అతడు మైదానంలో దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని సమాచారం. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా కోల్కతాలో బుధవారం తొలి మ్యాచ్ జరిగింది.తొలి టీ20లో భారత్ విజయంఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో సూర్యకుమార్ సేన ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసన బట్లర్ బృందం 132 పరుగులకే ఆలౌట్ కాగా.. 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.ఇక ఈ మ్యాచ్లో నితీశ్ కుమార్ రెడ్డికి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చసే అవకాశం కూడా రాలేదు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన ఈ ఆంధ్ర క్రికెటర్.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో చిరస్మరణీయ శతకం సాధించాడు. దూబే జట్టుతో చేరేది అపుడేఅనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్తో బిజీ అయిన 21 ఏళ్ల నితీశ్.. దురదృష్టవశాత్తూ గాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది. అయితే, ఇదే రోజు రంజీ మ్యాచ్ ముగించుకున్న శివం దూబే ఇప్పటికిప్పుడు భారత జట్టుతో చేరలేడు. రాజ్కోట్లో మంగళవారం జరిగే మూడో టీ20 నుంచి అతడు టీమిండియాతో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. చదవండి: ICC టీ20 జట్టు ప్రకటన.. కెప్టెన్గా రోహిత్ శర్మ, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు -
తిరుమలలో సందడి చేసిన నితీష్ కుమార్ రెడ్డి
-
మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియా రైజింగ్ స్టార్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాళ్లపై తిరుమల దర్శనానికి వెళ్లాడు. నితీశ్ ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన విషయాన్ని నితీశ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. నితీశ్ మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కుతున్న దృశ్యం సోషల్మీడియాలో వైరలవుతుంది.Nitish Kumar Reddy climbing stairs of Tirupati after scoring ton in his debut series. The peace is in the feet of Govinda 🧡 pic.twitter.com/23xKmNOpaC— Pari (@BluntIndianGal) January 13, 2025కాగా, నితీశ్ ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ భారత్ తరఫు రెండో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. మెల్బోర్న్ టెస్ట్లో నితీశ్ సూపర్ సెంచరీ సాధించి భారత్ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ సెంచరీతో నితీశ్ ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. మెల్బోర్న్ టెస్ట్లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్.. ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో నితీశ్ ఐదు టెస్ట్ల్లో 37.25 సగటున 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో నితీశ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన నితీశ్ బౌలింగ్లోనూ అదరగొట్టాడు. ఐదు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు.బీజీటీతో భారత్కు నితీశ్ రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్ లభించాడు. ఈ సిరీస్లో నితీశ్ రాణించినా భారత్ 1-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. బీజీటీ అనంతరం భారత్ ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సిద్దమవుతుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో నితీశ్ చోటు దక్కించుకున్నాడు. నితీశ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే భారత్ జట్టులో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా జరుగనుంది. మెగా టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో పాటు గ్రూప్-ఏలో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 19న ప్రకటించే అవకాశం ఉంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో పాల్గొనే భారత జట్టు ఇదే..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, దృవ్ జురెల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి భిష్ణోయ్భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
‘నితీశ్ రెడ్డికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వాల్సిందే’
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చంతా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) గురించే!.. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే ప్రాథమిక జట్లను ప్రకటించడానికి సోమవారమే(జనవరి 13) ఆఖరి తేదీ అయినా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని మరింత గడువు కోరింది.ఇందుకు ఐసీసీ నుంచి సానుకూల స్పందన రాగా.. జనవరి 18 లేదా 19న చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి ఈ మెగా టోర్నీకి తమ జట్టును ఎంచుకున్నారు.కెప్టెన్కు నో ఛాన్స్!టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ఈ వన్డే ఫార్మాట్ జట్టులో గావస్కర్, పఠాన్ చోటివ్వలేదు. అయితే, అనూహ్యంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం తమ టీమ్లో చేర్చారు. ఈ విషయం గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో వన్డేల్లో ఎవరు అదరగొట్టారో వారిని మాత్రమే నేను ఎంచుకుంటాను. వన్డే ప్రపంచకప్-2023లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు.సంజూను ఎలా కాదనగలం?ఇక శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అతడు కూడా ప్రపంచకప్ టోర్నీలో మునుపెన్నడూ లేనివిధంగా దుమ్ములేపాడు. కాబట్టి తనకు సెలక్టర్లు మద్దతుగా నిలవాలి. గత కొన్ని నెలలుగా అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఫామ్లో ఉన్నా సరే అతడికి సెలక్టర్ల నుంచి పిలుపురావడం లేదు.నా అభిప్రాయం ప్రకారం వీరిద్దరికి కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్టులో చోటివ్వాలి. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ను ఆడించాలి. ఆరో స్థానంలో రిషభ్ పంత్ ఆడాలి. ఇక సంజూ శాంసన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో వరుస శతకాలు సాధించాడు. అలాంటి ఆటగాడిని మనం ఎలా విస్మరించగలం?’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డికి చోటు ఇవ్వాల్సిందేఇక ఇర్ఫాన్ పఠాన్ ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు చెప్పింది బాగుంది. ఇక ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఇక జట్టులో సమతూకం ఉండాలంటే.. బౌలింగ్ ఆప్షన్లు కూడా చూసుకోవాలి. జట్టులో కచ్చితంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కు ఒక బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో మనకు అద్భుతమైన ఆటగాడు అందుబాటులో ఉన్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కువ మందికి సాధ్యం కాని ఘనతను సెంచరీ ద్వారా అతడు సాధించాడు’’ అని పేర్కొన్నాడు.కాగా నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఇటీవల ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో శతకంతో ఆకట్టుకున్నాడు.ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తప్పకుండా తుదిజట్టులో ఉంటారని అంచనా వేసిన ఇర్ఫాన్ పఠాన్.. బుమ్రా గాయం త్వరగా నయమైపోవాలని ఆకాంక్షించాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ తిరస్కరించగా.. హైబ్రిడ్ విధానంలో భారత్ మ్యాచ్లు జరుగనున్నాయి. తటస్థ వేదికైన దుబాయ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో మ్యాచ్లో రోహిత్ సేన తమ ప్రయాణం ఆరంభించనుంది.సునిల్ గావస్కర్- ఇర్ఫాన్ పఠాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శుబ్మన్ గిల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: CT 2025: వరల్డ్కప్లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ: శ్రేయస్ అయ్యర్ -
నితీశ్ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!
టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి.బంగ్లాతో సిరీస్ సందర్భంగా..సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్ ఝులిపించి సత్తా చాటాడు.మెల్బోర్న్లో గుర్తుండిపోయే శతకంఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్ రెడ్డి ఈ సిరీస్లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్ బ్యాటర్గా సేవలు అందించగల యువ క్రికెటర్ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్ దళంలో ఐదో బౌలర్గానూ నితీశ్ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్లో నితీశ్ రెడ్డి బౌలర్గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
CT 2025: యశస్వి జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు బంపరాఫర్!?
టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అద్భుత ప్రదర్శనతో జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal). తొలుత(2023) టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. వెస్టిండీస్తో మ్యాచ్లో భారీ శతకం(171) బాది.. తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. విండీస్తో సిరీస్తోనే టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.డబుల్ సెంచరీల వీరుడునిలకడైన ఆట తీరుతో దాదాపు ఏడాదిన్నర కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు జైస్వాల్. ముఖ్యంగా టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయి.. ఇప్పటికే ఎన్నెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడిన జైస్వాల్.. 1798 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం విశేషం.వన్డేల్లో మాత్రం నో ఛాన్స్!ఇక అంతర్జాతీయ టీ20లలో 23 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ ముంబై బ్యాటర్.. 723 రన్స్ సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ(Rohit Sharma)కు జోడీగా, టీ20లలో శుబ్మన్ గిల్(Shubman Gill)కు జంటగా ఓపెనర్గా పాగా వేసిన 23 ఏళ్ల జైసూకు ఇంత వరకు వన్డేల్లో మాత్రం అవకాశం రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ- గిల్లు వన్డేల్లో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ యువ బ్యాటర్కు ఇంత వరకు సెలక్టర్లు పిలుపునివ్వలేదు.మెగా టోర్నీకి ఎంపిక?! అయితే, స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా జైస్వాల్ వన్డేల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనవరి 22 నుంచి భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో జైసూ వన్డే అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనుంది.లిస్ట్-‘ఎ’ క్రికెట్లో గణాంకాలు ఇలాఅందుకే ఈ మెగా టోర్నీకి ముందు జైస్వాల్ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్- గిల్లకు చాంపియన్స్ ట్రోఫీలో బ్యాకప్ ఓపెనర్గా జైస్వాల్ను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంగ్లండ్తో కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఆడించి అతడిని సన్నద్ధం చేయాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో యశస్వి జైస్వాల్ మెరుగైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కేవలం 32 మ్యాచ్లలోనే 1511 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, ఏడు హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ(203) ఉంది.నితీశ్ కుమార్ రెడ్డికి బంపరాఫర్!ఇక జైస్వాల్తో పాటు మరో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆంధ్ర క్రికెటర్ ఇప్పటికే టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో శతకంతో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు.అయితే, ఇప్పట్లో వన్డేల్లో నితీశ్ రెడ్డి అరంగేట్రం చేసే అవకాశం లేకపోయినా.. చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతడు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు రెవ్స్పోర్ట్స్ పేర్కొంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా నితీశ్ రెడ్డి ఎంపికకానున్నట్లు పేర్కొంది. అయితే, ప్రధాన జట్టులో కాకుండా ట్రావెలింగ్ రిజర్వ్స్లో అతడు చోటు సంపాదించనున్నట్లు సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్తో సిరీస్లలోనైనా ఆడిస్తారా? -
‘నితీశ్.. జీనియస్’
సిడ్నీ: ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొడుతున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ప్రశంసలు కురిపించాడు. మెల్బోర్న్ టెస్టులో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో క్లార్క్ మాట్లాడుతూ... ‘నితీశ్ జీనియస్. చిన్న వయసులో అతడి ఆటతీరు అమోఘం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడికింకా 21 ఏళ్లే. ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ ప్రారంభానికి ముందు అతడి గురించి ఎవరూ పెద్దగా ఆలోచించలేదు. కానీ తన ఆటతీరుతో నితీశ్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లను చూసి అతడు భయపడలేదు. అవసరమైన సమయంలో సంయమనం చూపాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ అతడు దాన్ని చేసి చూపాడు. సమయానుకూలంగా బ్యాటింగ్ చేస్తూ పరిణతి చూపాడు. భవిష్యత్తులో అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని భావిస్తున్నా. అదే అతడికి మంచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో ఇలాంటి చురుకైన కుర్రాడు లభించడం భారత క్రికెట్కు మంచి చేస్తుంది. సిడ్నీ టెస్టులో అందరి దృష్టి అతడిపైనే ఉంటుంది’ అని అన్నాడు. ఆ్రస్టేలియాతో సిరీస్లో ఫామ్ దొరకబుచ్చుకోలేక తంటాలు పడుతున్న టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మను ఉద్దేశించి కూడా క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు భారమైనట్లు అనిపిస్తే తప్పుకోవడమే మంచిదని అన్నాడు. ‘సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ను తప్పిస్తారని అనుకోవడం లేదు. కానీ అతడి ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ఈ సిరీస్లో అతడి టెస్టు కెరీర్ ముగుస్తుందని అనుకోవడం లేదు. అయితే జట్టును ఇబ్బంది పెడుతూ భారంగా కొనసాగాలని ఏ ఆటగాడు కోరుకోడు’ అని క్లార్క్ అన్నాడు. -
నితీశ్ రెడ్డి ఒక్కడే కాదు.. అతడూ జట్టులో ఉండాలి!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్ ముంగిపునకు వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తమ చివరి టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టి.. ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి చేసుకుంది.పెర్త్లో జరిగిన తొలి టెస్టులో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. తదుపరి అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్లో మూడో మ్యాచ్ను డ్రా చేసుకున్న భారత జట్టు.. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో దారుణంగా విఫలమైంది. ఆతిథ్య జట్టు చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా ఆసీస్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో నిలవగా.. రోహిత్ సేన డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియాకు మార్గం సుగమమైంది. ఏదేమైనా ఆసీస్లో టీమిండియా వైఫల్యం కొనసాగుతున్నప్పటికీ ఓ ఆణిముత్యం లాంటి ఆటగాడు దొరకడం సానుకూలాంశం.నితీశ్ రెడ్డి.. ఆణిముత్యం లాంటి ఆటగాడు అతడు మరెవరో కాదు.. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy). ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ తొలి టెస్టు నుంచే బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఏకంగా శతకం(114)తో సత్తా చాటాడు. తద్వారా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత బ్యాటర్గా 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు.ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీశ్ రెడ్డి టీమిండియా టెస్టు జట్టుతో పాతుకుపోవడం ఖాయమంటూ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్తో టెస్టుల తర్వాత.. టీమిండియా 2025లో తొలుత ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.నితీశ్ రెడ్డితో పాటు అతడినీ ఎంపిక చేయండి!అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి చేసుకుని.. జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నితీశ్ రెడ్డితో పాటు ఇంగ్లండ్ టూర్కు మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను ఎంపిక చేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.‘‘మెల్బోర్న్ టెస్టు భారత క్రికెట్కు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ను ఇచ్చింది.. అతడి పేరు నితీశ్ కుమార్ రెడ్డి. ఐపీఎల్లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ తరఫున అదరగొట్టడం ద్వారా భారత క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు.. నిజానికి ఫస్ట్క్లాస్ క్రికెట్లో అంత గొప్ప ఏమీ ఆడలేదు. క్రెడిట్ మొత్తం వారికేఅయినప్పటికీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. అతడి బృందం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచినందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సెలక్టర్ల నమ్మకాన్ని ఈ అబ్బాయి నిలబెట్టుకున్నాడు. ఇక మరో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)పై కూడా సెలక్టర్లు దృష్టి సారించాలి.అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరో సానుకూలాంశం. అయితే, బౌలింగ్ నైపుణ్యాలను కాస్త మెరుగుపరచుకోవాలి. అతడికి ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి అక్కడ అతడు టెస్టుల్లో రాణించగలడు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ స్టార్కు రాసిన కాలమ్లో పేర్కొన్నాడు.కౌంటీల్లో ఆడిన వెంకటేశ్కాగా 2024లో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా లంకాషైర్కు ప్రాతినిథ్యం వహించాడు వెంకటేశ్ అయ్యర్. మూడు మ్యాచ్లు ఆడి 116 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో ఐదు వికెట్లు తీయగలిగాడు.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
నితీశ్ రెడ్డికి అరుదైన గౌరవం.. బీసీసీఐ వీడియో వైరల్
టీమిండియా నయా సంచలనం, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)కి అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(Melbourne Cricket Ground) హానర్స్ బోర్డులో అతడికి చోటు లభించింది. భారత జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కూడా మరోసారి ఈ గౌరవం దక్కించుకోగా.. ఈ ఇద్దరి పేర్లను బోర్డుపై చేర్చుతున్న సమయంలో నితీశ్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యాడు.వీడియో షేర్ చేసిన బీసీసీఐఈ ప్రత్యేకమైన క్షణాలను ఫోన్ కెమెరాలో బంధిస్తూ మధురజ్ఞాపకాలను పోగు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఐదు వికెట్ల హాల్... ప్రత్యేకమైన సెంచరీ... వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో పాటు నితీశ్ కుమార్ రెడ్డి పేర్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ హానర్స్ బోర్డులో చేరిన వేళ’’ అంటూ క్యాప్షన్ జతచేసింది.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. తొలి టెస్టులో భారత్, రెండో టెస్టులో ఆసీస్ గెలుపొందగా.. మూడో టెస్టు డ్రా అయింది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు జరిగింది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలమైన చోట ఈ బాక్సింగ్ డే మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి శతకంతో చెలరేగాడు. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలమైన చోట 114 పరుగులతో దుమ్ములేపాడు. చిన్న వయసులోనే ఎంసీజీలో శతకంతద్వారా ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున శతకం బాదిన క్రికెటర్గా.. 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ హానర్స్ బోర్డులో నితీశ్ రెడ్డి పేరును లిఖించారు. బుమ్రా మరోసారిఇక ఇదే టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. సామ్ కొన్స్టాస్(8), ట్రవిస్ హెడ్(1), మిచెల్ మార్ష్(0), అలెక్స్ క్యారీ(2), నాథన్ లియాన్(41) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో ఐదు వికెట్ల ప్రదర్శన(5/57) నమోదు చేసినందుకు గానూ బుమ్రా పేరు కూడా హానర్స్ బోర్డులో రాశారు. కాగా 2018లోనూ బుమ్రా ఇలాంటి ఘనత సాధించి.. తొలిసారి హానర్స్ బోర్డులోకెక్కాడు. ఇక 2020లో అజింక్య రహానే 112 పరుగులు చేసి తన పేరు(మొత్తంగా రెండుసార్లు)ను లిఖించుకున్నాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా తదితరులు కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆఖరి టెస్టు గెలిస్తేనేఫలితంగా ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలను మెరుగుపరచుకుంది. ఇక ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా జనవరి 3న ఈ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవడంతో పాటు.. శ్రీలంకతో సిరీస్లో ఆసీస్ టెస్టు ఫలితాలపై భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.చదవండి: Rohit On Pant Batting: నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యం.. అతడికి నేనేం చెప్పగలను Magnificent 5️⃣-wicket haul 🤝 Special Maiden 💯Vice Captain Jasprit Bumrah and Nitish Kumar Reddy's names are etched on the Honours Board of Melbourne Cricket Ground ✍️ 👏#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 | @NKReddy07 pic.twitter.com/4tat5F0N6e— BCCI (@BCCI) December 31, 2024 -
ఓటమి మానసికంగా వేధిస్తోంది.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఓటమి పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. భారీ లక్ష్యం ముందున్నా ఆఖరి వరకు పోరాడాలని నిశ్చయించుకున్నామని.. అయితే, ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయామని పేర్కొన్నాడు. ఏదేమైనా ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా ఆడారని.. టెయిలెండర్లు కూడా అద్భుత పోరాటపటిమతో మ్యాచ్ను తమ నుంచి లాగేసుకున్నారని రోహిత్ అన్నాడు.184 పరుగుల భారీ తేడాతో ఓటమిబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతున్న భారత్.. పెర్త్లో గెలిచి, అడిలైడ్లో ఓడింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. అయితే, మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో మాత్రం 184 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది.మానసికంగా వేధిస్తోందిఈ నేపథ్యంలో ఆసీస్ చేతిలో ఘోర పరాభవంపై స్పందించిన రోహిత్ శర్మ.. పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. ‘‘ఈ ఓటమి చాలా బాధాకరం. మానసికంగా వేధిస్తోంది. మ్యాచ్ గెలిచేందుకు ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ మేము మాత్రం విజయానికి దారిని కనుక్కోలేకపోయాం.ఆఖరి వరకు పోరాడాలని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ఆస్ట్రేలియాను 90/6కు కట్టడి చేసినా.. ఆ తర్వాత మళ్లీ పట్టు కోల్పోయాం. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాం. అయితే, మేము చేయగలిగిందంతా చేశామనే నమ్ముతున్నా.సులువైన టార్గెట్ కాదని తెలుసు.. అయినాఅయితే, వాళ్లు పోరాడిన తీరు అసాధారణం. ముఖ్యంగా ఆఖరి వికెట్కు అద్భుతం చేశారు. ఇక ఆఖరి రోజు 340 పరుగుల లక్ష్యం ఛేదించడం అంత సులువు కాదని తెలుసు. అయినా.. అందుకు పునాది వేసేందుకు తీవ్రంగా శ్రమించాం. కానీ ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మేము అనుకున్న లక్ష్యానికి దూరమయ్యాం’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.ఆసీస్లో తొలిసారి.. అయినా అద్భుతంగాఇక తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(114)తో చెలరేగిన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) ప్రస్తావన రాగా.. ‘‘అతడు తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్లు ఆడుతున్నాడు. అయినప్పటికీ అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. అతడి టెక్నిక్స్ కూడా బాగున్నాయి.విజయవంతమైన ఆల్రౌండర్గా ఎదిగే అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయి. రోజురోజుకూ అతడు మరింత మెరుగుపడాలని కోరుకుంటున్నా. మేనేజ్మెంట్, జట్టు నుంచి అతడికి పూర్తి సహకారం ఉంది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. నితీశ్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- నాలుగో టెస్టు👉వేదిక:మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్👉టాస్: ఆస్ట్రేలియా- తొలుత బ్యాటింగ్👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు- 474👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు- 369👉ఆసీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు- 234👉భారత్ విజయ లక్ష్యం- 340👉భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు- 155👉ఫలితం: 184 పరుగుల తేడాతో భారత్ ఓటమి👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్యాట్ కమిన్స్(మొత్తం 90 పరుగులు, ఆరు వికెట్లు) చదవండి: అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్ -
వారి మాటలు తప్పని నిరూపించా.. ఇక మిగిలింది అదే: నితీశ్ రెడ్డి
టెస్టు క్రికెట్లోనూ రాణించగలనని నిరూపించానని టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) అన్నాడు. విమర్శకులకు ఆటతోనే సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉందన్నాడు. కాగా ఆసీస్తో టెస్టు సిరీస్లో నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 ఆటగాడు టెస్టుల్లో రాణించగలడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.అయితే, ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తన అద్భుత శతకంతో ఈ ఆంధ్ర ఆటగాడు అందరి అనుమానాలను పటాపంచలు చేశాడు. ఈ ప్రదర్శనతో తన సత్తా ఏమిటో చూపించాడు. వారి మాటలు తప్పని నిరూపించాఈ క్రమంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ.. ‘నా ఆట గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయనే విషయం నాకూ తెలుసు. ఐపీఎల్లో రాణించిన ఆటగాడు ఇక్కడ సరిపోతాడా అని అన్నారు. వారి మాటలను తప్పని నిరూపించాలనుకున్నా. ఇప్పుడు అదే చేసి చూపించా. భారత జట్టు కోసం వంద శాతం శ్రమించేందుకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించాడు.అదే విధంగా.. సెంచరీ సాధించిన క్షణాలు అపూర్వమని నితీశ్ రెడ్డి గుర్తు చేసుకున్నాడు. కోహ్లి అభినందనలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అతడు అన్నాడు.‘అది చాలా గొప్ప క్షణం. కోహ్లి ఆటను చూస్తూ, అభిమానిస్తూ పెరిగిన నేను ఇప్పుడు అతనితో కలిసి ఆడాను. పెర్త్లో కోహ్లి సెంచరీ చేసినప్పుడు మరో ఎండ్లో నేనున్నాను. నా ప్రదర్శనను కోహ్లి ఎంతో అభినందించి ప్రోత్సహించాడు. ఇక మిగిలింది అదేచాలా బాగా ఆడావని చెప్పాడు. ఇలాంటి సమయం గురించే నేను కలలుగన్నాను. నా సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించిన సిరాజ్కు కృతజ్ఞతలు. నిజానికి నా శతకంకంటే సిరాజ్ చివరి బంతిని డిఫెన్స్ ఆడినప్పుడే మైదానం దద్దరిల్లింది’ అని నితీశ్ గుర్తు చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా తన బ్యాటింగ్ను మెరుగుపర్చుకునేందుకు ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు బౌలింగ్లో కూడా పదును పెంచాల్సి ఉందని నితీశ్ చెప్పాడు. -
పరుగుల వీరుడు మనోడే
ఒంగోలు: కాకి నితీష్కుమార్రెడ్డి.. నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్లో ఎనలేని క్రేజ్ నింపేశాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్లో అతను ఆడిన అద్భుత ఇన్నింగ్స్ భారత క్రికెట్ ప్రేమికులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ యువ ఆటగాడి స్వస్థలం విశాఖ అయినా అతని తల్లి స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole) నగర శివారులోని చెరువుకొమ్ముపాలెం కావడంతో అతనికి జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది.చిన్నతనం నుంచి క్రికెట్ అంటేనే క్రేజ్:అందరు చదువుతూ ఆడతామంటారు. కానీ నితీష్కుమార్రెడ్డి (Nitish Kumar Reddy) మాత్రం ఆడుతూ చదువుకుందామంటారు. చిన్నతనం నుంచి క్రికెట్ (Cricket) అంటే ఎంతో మక్కువ ఉన్న నితీష్ కఠోర సాధనతో రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్గానే కాకుండా మీడియం పేసర్గా కూడా రాణిస్తూ నేడు అంతర్జాతీయ క్రికెట్కు మరో అద్భుత వరంగా మారాడు.ఒంగోలుతో అనుబంధం ఇలా..చెరువుకొమ్ముపాలేనికి చెందిన పూసపాటి నరశింహారెడ్డి, సుశీలకు ఇద్దరు సంతానం. ఒకరు మానస (నితీష్ రెడ్డి తల్లి). మరొకరు సురేంద్రరెడ్డి (ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం). మానస, ముత్యాలరెడ్డిలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె తేజస్వి ఆస్ట్రేలియాలో మెడిసిన్ చేస్తున్నారు. ఇక రెండో సంతానమే నితీష్రెడ్డి. ఒక వైపు విద్యను అభ్యసిస్తూనే మరో వైపు క్రికెట్లో దూసుకెళుతున్నాడు. ఐదో ఏటనే ప్లాస్టిక్ బ్యాట్తో క్రికెట్ ఆటలో అరంగేట్రం చేసిన నితీష్రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి నేడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. 2017–18లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో నాగాలాండ్ జట్టుపై 441 బంతుల్లో 345 పరుగులు చేసి క్రికెట్ అభిమానుల మనస్సును దోచుకున్నాడు. దీంతో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అవకాశాన్ని కై వసం చేసుకున్నాడు. పంజాబ్పై అద్భుతంగా 64 పరుగులు (ఒకే ఒక్క పరుగుతో గెలుపు), రాజస్థాన్పై 76 పరుగులు చేసి సన్రైజర్స్ జట్టు గెలుపులో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఒంగోలులోని శర్మా కాలేజీ గ్రౌండులో సైతం 2018, 2019లో రంజీ మ్యాచ్లు ఆడాడు. ఇటీవల అమ్మమ్మ సుశీల పరమపదించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నితీష్రెడ్డి చెరువుకొమ్ముపాలేనికి వచ్చారని గ్రామస్తులు తెలిపారు.సంతోషంగా ఉందినితీష్రెడ్డికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటేనే ప్రేమ. అనేక మార్లు గ్రామానికి తల్లితో పాటు వచ్చి వెళుతుండేవాడు. విద్యాభ్యాసం ఇక్కడ చేయకున్నా ఇక్కడ ఉన్న కుర్రాళ్లతో మాత్రం పరిచయాలు మెండుగానే ఉన్నాయి. ఇన్నాళ్లకు అంతర్జాతీయంగా క్రికెట్లో రాణించాడని తెలియడంతో గ్రామంలో చాలామంది నా మనవడి గురించి గొప్పగా మాట్లాడుతుంటే చెందే అనుభూతిని వర్ణించలేం. ఇంకా ఉన్నత స్థాయికి చేరాలనేదే మా ఆకాంక్ష. – పూసపాటి నరశింహారెడ్డి, నితీష్రెడ్డి తాతయ్యస్నేహితుడిగా ఆనందంగా ఉందినాది చెరువుకొమ్ముపాలెమే. నితీష్రెడ్డి మేనమామ సురేంద్రరెడ్డి నాకు క్లాస్మేట్. దీంతో అమ్మమ్మ గారింటికి వచ్చినపుడల్లా నాకు నితీష్రెడ్డితో పరిచయం ఉండేది. మాతో ఎక్కువగా క్రికెట్ ప్రాక్టీస్ గురించే మాట్లాడేవాడు. ఒంగోలులో రంజీ మ్యాచ్లు ఆడేందుకు వచ్చిన సమయంలోను నాతో మాట్లాడాడు. స్నేహితులను గుర్తుపెట్టుకుని పలకరిస్తాడు. చాలామంది యువ క్రికెటర్లలో ఎనలేని క్రేజ్ను నితీష్ రెడ్డి సంపాదించుకోవడం ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది జూన్లో మళ్లీ చెరువుకొమ్ముపాలేనికి నితీష్రెడ్డి వస్తారని సమాచారం. ఆ రోజు గ్రామంలో ఘనంగా సత్కారం చేయాలని భావిస్తున్నాం.– ఆల నారాయణ, నితీష్రెడ్డి చిన్ననాటి స్నేహితుడు -
IND VS AUS 4th Test: గవాస్కర్కు పాదాభివందనం చేసిన నితీశ్ తండ్రి
మెల్బోర్న్ టెస్ట్లో నితీశ్ కుమార్ రెడ్డి చేసిన సూపర్ సెంచరీకి యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతుంది. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లాంటి భారత క్రికెట్ దిగ్గజాలు నితీశ్ సూపర్ ఇన్నింగ్స్ను కొనియాడుతున్నారు. నితీశ్ సెంచరీ చూసి రవిశాస్త్రి కన్నీటిపర్యంతం కాగా.. గవాస్కర్ జేజేలు పలికాడు.సాధారణంగా గవాస్కర్ ఏ ఆటగాడిని పెద్దగా పొగడడు. అలాంటిది సన్నీ నితీశ్ను పొగడటం చూస్తుంటే ఆశ్చర్యమేసింది. పొగడటమే కాదు.. నితీశ్ సెంచరీ అనంతరం గవాస్కర్ స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చాడు. భారత క్రికెట్ చరిత్రలో నితీశ్ సెంచరీ చిరకాలం గుర్తుండిపోతుందని కితాబిచ్చాడు.గవాస్కర్.. నితీశ్ను ప్రశంశిస్తూనే ఓ కీలక సూచన కూడా చేశాడు. నితీశ్ ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసుంటారు. వాటిని నితీశ్ ఎప్పటికీ గుర్తించుకోవాలని సూచించారు. మూడో రోజు ఆట ముగిశాక నితీశ్ కుటుంబ సభ్యులు గవాస్కర్ను కలిశారు. Nitish Kumar Reddy's father touching Sunil Gavaskar's feet. (ABC Sport). pic.twitter.com/sVSep2kl9G— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2024ఈ సందర్భంగా నితీశ్ తల్లి, తండ్రి, సోదరి గవాస్కర్కు పాదాభివందనం చేశారు. నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కాళ్లకు నమస్కారం చేస్తుండగా గవాస్కర్ వారించారు. అయినా ముత్యాల రెడ్డి వినలేదు. సార్.. మీరు గొప్ప క్రికెటర్ అంటూ సాష్టాంగపడ్డాడు. అనంతరం గవాస్కర్ ముత్యాల రెడ్డిని హత్తుకొని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి 266 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కమిన్స్ (34), లయోన్ (1) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్ టాప్ స్కోరర్గా నిలిచాడు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రశంసలు
హైదరాబాద్: మెల్బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై అద్భుత శతకాన్ని సాధించిన మన నితీశ్ కుమార్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రశంసలు కురిపించారు. కెరీర్ ఆరంభంలోనే భారత టెస్టు చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ గురించి ఆయన ఇలా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు తేజం నితీశ్ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు.ఆయన గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మన తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేసిన నితీశ్కు నా అభినందనలు. అలాంటి బిడ్డను దేశానికి అందించిన ఆయన తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా తెలుగు వారు అన్ని రంగాలలో ముందు ఉంటారని నితీశ్ మరోసారి నిరూపించారు.' అని ఆయన అన్నారు.స్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఓటమి అంచులో ఉన్న టీమిండియాను నితీశ్ సెంచరీతో ఆదుకున్నాడు. మన జట్టు ఫాలోఆన్ ఆడుతూ పరాభవం ముంగిట నిలిచిన సమయంలో అతడి అసాధారణ పోరాటం వల్లే నాలుగో టెస్టులో ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం గెలుపు దిశగా భారత్ కొనసాగుతుంది.#KethireddyJagadishwaraReddy congratulated the greatness of Telugu #Chiranjeevi #NitishKumarReddy who gave the glory of #Telugu's to the world today and congratulated his parents who gave this pearl to the #Indian #nation.@PMOIndia @HMOIndia @revanth_anumula @AndhraPradeshCM pic.twitter.com/Tv3oT7o3e1— KETHIREDDY JAGADISH (@kethireddyjagad) December 28, 2024 -
అసలు ఎవరీ నితీష్ రెడ్డి..?
-
ఆసీస్ గడ్డపై తెలుగోడి సత్తా
-
జింక్ మైదానం నుంచి ఎంసీజీ సెంచరీ వరకు...
సాక్షి, క్రీడావిభాగం : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం...మరో 25 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉంది. కానీ కొడుకు భవిష్యత్తు కోసం దానిని వదిలేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. దానికి ఎంత ధైర్యం కావాలి? తన అబ్బాయి ఆటపై ఎంత నమ్మకం ఉండాలి. విశాఖపట్నానికి చెందిన ముత్యాల రెడ్డి కి ఆ నమ్మకం ఉంది. అందుకే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు.మున్ముందు ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయని తెలిసినా అన్నింటినీ తట్టుకునేందుకు రెడీ అన్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన కొడుకు టెస్టు క్రికెటర్గా మారి ఎందరో కలలు గనే మెల్బోర్న్ మైదానంలో సెంచరీ సాధించిన క్షణం ఆయన ఆనందం కన్నీళ్లుగా మారి కనిపించింది! తన కష్టం ఫలించిన రోజు ఆ పుత్రోత్సాహం గురించి చెప్పేందుకు ఎన్ని విశేషణాలు కూడా సరిపోవేమో. ఆరేళ్ల వయసులో మొదలైన నితీశ్ రెడ్డి క్రికెట్ ఆట 12 ఏళ్లు వచ్చే సరికి పూర్తి స్థాయి క్రికెటర్గా మారాలనే కల వైపు అడుగులు వేసింది. ఏసీఏకు చెందిన కడప అకాడమీలో అండర్–14 విభాగంలో శిక్షణకు ఎంపికైన తర్వాత గమ్యంపై మరింత స్పష్టత వచ్చేసింది. ఇదే సమయంలో ముత్యాల రెడ్డి అనూహ్యం నిర్ణయం తీసుకున్నాడు.ఉద్యోగరీత్యా రాజస్తాన్కు బదిలీ కాగా...అలా వెళితే తన కొడుకును తీర్చిదిద్దడం కష్టమవుతుందని ఆయన భావించాడు. అందుకే హిందుస్తాన్ జింక్ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయంలో కొడుకు కోసం కేటాయించేశాడు. బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్మర్చంట్ ట్రోఫీలో ఒకే సీజన్లో రికార్డు స్థాయిలో ఏకంగా 1237 పరుగులు చేయడటంతో అతని సత్తా అందరికీ తెలిసింది. 176.71 సగటుతో 4 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో చేసిన ఆ పరుగులు బీసీసీఐ ఉత్తమ ఆటగాడి అవార్డును అందించాయి. నాగాలాండ్తో జరిగిన పోరులో 366 బంతుల్లో 60 ఫోర్లు, 7 సిక్స్లతో చేసిన 441 పరుగులు నితీశ్ ధాటిని చూపించాయి. అలా మొదలైన ప్రస్థానం అండర్–19 జట్టుతో పాటు ఆ తర్వాత ఆంధ్ర సీనియర్ టీమ్లో కూడా అవకాశం కల్పించాయి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ దూకుడును అభిమానులంతా చూశారు. గత రంజీ ట్రోఫీ సీజన్లో ఆంధ్ర తరఫున 25 వికెట్లు తీయడంతో అతని బౌలింగ్ పదును కూడా సెలక్టర్లకు అర్థమైంది. అందుకే జాతీయ జట్టులో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నితీశ్ తాజా ప్రదర్శన టెస్టు జట్టులో అతని స్థానాన్ని సుస్థిరం చేయడం ఖాయం. ఇదే జోరు కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలో కూడా ఈ అబ్బాయి అద్భుతాలు చేయడం ఖాయం. -
నితీశ్ రెడ్డి ‘వైల్డ్ ఫైర్’
దేశం తరఫున ఆడుతూ కెరీర్లో తొలి సెంచరీ అంటే ఎలా ఉండాలి...జీవితకాలం ఇలాంటి క్షణాల కోసమే శ్రమించే కష్టాన్ని మరచిపోయేలా ఉండాలి...ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక మైదానంలో ఎందరో కలలు గనే చోట సాధించినట్లుగా ఉండాలి... అన్నీ అనుకూలించినప్పుడు కాదు...జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ తానేంటో చూపించాలి...అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ, శరీరానికి తగిలే దెబ్బలను తట్టుకుంటూ, వేలాది మంది తనకు జేజేలు పలికేలా శతకం బాదాలి...వీటన్నింటికీ ఒక్కటే సమాధానం! మన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కొట్టినట్లుగా సెంచరీ ఉండాలి. మెల్బోర్న్ టెస్టులో భారీ ఆధిక్యంపై కన్నేసి విజయంపై గురి పెట్టిన ఆస్ట్రేలియాను మన నితీశ్, వాషింగ్టన్ సుందర్ సమర్థంగా అడ్డుకున్నారు. శతక భాగస్వామ్యంతో జట్టును గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించారు. ముందుగా ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఆపై ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. నితీశ్ అద్భుత బ్యాటింగ్కు సుందర్ సమన్వయం తోడవడంతో కంగారూలు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వీరిద్దరు కలిసి 47.3 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఈ ఇద్దరు బ్యాటర్ల పోరు తర్వాత ప్రస్తుతానికి భారత్ ఓటమి ప్రమాదంనుంచి దాదాపుగా తప్పించుకున్నట్లే. మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్ను భారత యువ ఆటగాళ్లు ఆసక్తికరంగా మార్చారు. ఒక దశలో తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం కోల్పోయి ఓటమికి బాటలు వేసుకునేటట్లు కనిపించిన టీమిండియా కోలుకొని మెరుగైన స్థితికి చేరింది. మ్యాచ్ మూడో రోజు వెలుతురులేమితో ఆటను నిర్ణీత సమయానికి ముందే అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (176 బంతుల్లో 105 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా...వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో 50; 1 ఫోర్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నితీశ్తో పాటు సిరాజ్ (2 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. భారత్ మరో 116 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్నైట్ స్కోరు 164/5తో ఆట కొనసాగించిన భారత్ శనివారం 70 ఓవర్లు ఆడి మరో 194 పరుగులు జోడించింది. ప్రస్తుతానికి ఆసీస్కు ఆధిక్యం ఉన్నా...నాలుగో రోజు ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేసి సవాల్ విసురుతుందనేది ఆసక్తికరం. మిగిలిన సమయం, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్లు పూర్తి కావడం అంత సులువు కాదు. అదే జరిగితే ఈ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియవచ్చు. భారీ భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్లో 310 పరుగులు వెనుకబడి ఉన్న స్థితినుంచి రిషభ్ పంత్ (37 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (17) మూడో రోజు ఆటను కొనసాగించారు. వీరిద్దరు మరింత బాధ్యతాయుతంగా ఆడి జట్టును రక్షించాల్సి ఉన్నా...ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముఖ్యంగా పంత్ చెత్త షాట్తో తన వికెట్ సమర్పించుకోగా, జడేజా ఎల్బీగా దొరికిపోయాడు. 30 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. జడేజా అవుటయ్యాక సుందర్ బ్యాటింగ్కు రాగా, మరో ఎండ్లో నితీశ్ 22 పరుగుల వద్ద ఆడుతున్నాడు. మరో మూడు వికెట్లు తీసి భారత్ ఆట ముగించవచ్చని భావించిన ఆసీస్కు ఇక్కడే అసలు ప్రతిఘటన ఎదురైంది. నితీశ్, సుందర్ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ మెల్లగా స్కోరును పెంచుతూ పోయారు. లంచ్ సమయానికి స్కోరు 244/7 వద్ద నిలిచింది. రెండో సెషన్లో పూర్తిగా వీరిద్దరిదే హవా సాగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా 24 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ బౌలర్లు విఫలమయ్యారు. మూడో సెషన్లో కూడా వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఆసీస్ తొలి 15 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేకపోయింది. ఎట్టకేలకు 127 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం తర్వాత సుందర్ను అవుట్ చేసి లయన్ ఈ జోడీని విడదీశాడు. మరో రెండు పరుగులకే బుమ్రా (0) కూడా వెనుదిరిగాడు. అయితే మరో 15 బంతుల పాటు చివరి వికెట్ చేజార్చుకోకుండా భారత్ మూడో రోజును ముగించింది. స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 474; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలండ్ (బి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; కోహ్లి (సి) క్యారీ (బి) బోలండ్ 36; ఆకాశ్దీప్ (సి) లయన్ (బి) బోలండ్ 0; పంత్ (సి) లయన్ (బి) బోలండ్ 28; జడేజా (ఎల్బీ) (బి) లయన్ 17; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 105; సుందర్ (సి) స్మిత్ (బి)లయన్ 50; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (బ్యాటింగ్) 2; ఎక్స్ట్రాలు 11; మొత్తం (116 ఓవర్లలో 9 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159, 6–191, 7–221, 8–348, 9–350. బౌలింగ్: స్టార్క్ 25–2–86–0, కమిన్స్ 27–6–86–3, బోలండ్ 27–7–57–3, లయన్ 27–4–88–2, మార్ష్ 7–1–28–0, హెడ్ 3–0–11–0. సుందర్ సంయమనం...దాదాపు నాలుగేళ్ల క్రితం వాషింగ్టన్ సుందర్ బ్రిస్బేన్ టెస్టుతో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 161/5తో కష్టాల్లో ఉన్న స్థితిలో అతను బ్యాటింగ్కు దిగి జట్టును గట్టెక్కించాడు. అతను చేసిన 62 పరుగులు ఆ తర్వాత భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మరోసారి అతను అలాంటి పాత్రనే పోషించాడు. ఈ టెస్టు కోసం ప్రధాన బ్యాటర్ గిల్ను పక్కన పెట్టి ఆల్రౌండర్ సుందర్ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ తప్పుడు నిర్ణయం జట్టు ఓటమికి కారణం కావచ్చని విశ్లేషకులు అన్నారు. అయితే సుందర్ తన బ్యాటింగ్తో వారి అనుమానాలను పటాపంచలు చేశాడు. ముఖ్యంగా ఏ రెగ్యులర్ బ్యాటర్కు తగ్గని రీతిలో అద్భుతమైన డిఫెన్స్తో జట్టు ఇన్నింగ్స్ను నిర్మించాడు. సుందర్ పట్టుదల, ఓపికతో అండగా నిలవడం వల్లే మరో వైపు నితీశ్ సెంచరీ సాధ్యమైంది. ఎంతో జాగ్రత్తగా ఆడిన సుందర్ ఏకంగా 162 బంతులు ఎదుర్కొన్నాడు. కమిన్స్ ఓవర్లో అతను కొట్టిన సింగిల్తో భారత్ ఫాలో ఆన్ ప్రమాదంనుంచి తప్పించుకుంది. తాను ఎదుర్కొన్న 103వ బంతికి గానీ సుందర్ ఏకైక ఫోర్ కొట్టలేదు. టీ విరామం తర్వాత 146 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. మళ్లీ ఆ్రస్టేలియాను నిలువరించడంలో సఫలమైన తర్వాత చివరకు లయన్ బౌలింగ్లో అతను వెనుదిరిగాడు. బ్రిస్బేన్ విజయం తర్వాత తన కుక్క పిల్లకు అక్కడి మైదానం ‘గాబా’ పేరును సుందర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి ప్రదర్శన తర్వాత రెండో కుక్క పిల్ల ఏమైనా ఉంటే ‘ఎంసీజీ’ అంటాడేమో!ఇక తగ్గేదేలే...పెర్త్ టెస్టులో 73/6 నుంచి జట్టును 150 వరకు అతనే తీసుకెళ్లాడు...అడిలైడ్లో 87/5, 105/5 వద్ద ఉన్నప్పుడు 42, 42తో రెండు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లు ఆడాడు. మెల్బోర్న్లో 191/6 నుంచి స్కోరును 300 దాటించాడు...ఈ సిరీస్లో తొలి రోజునుంచి తనదైన ముద్ర వేసిన నితీశ్ కుమార్ రెడ్డి 284 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ టెస్టుకు ముందు అతని ప్రదర్శన చూస్తే ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నట్లుగా కనిపించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఎంసీజీలో అతను ఆ లోటును తీర్చుకున్నాడు. ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్లు, బంగ్లాదేశ్తో టి20లో 34 బంతుల్లో 74 పరుగుల ఆటతో తానేంటో చూపించినా...నితీశ్ను టెస్టు ఆటగాడిగా ఎవరూ చూడలేదు. 23 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 674 పరుగులు, బౌలింగ్లో 56 వికెట్ల అతని రికార్డు ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి అర్హతగా మారుతుందని, తుది జట్టులో స్థానం దక్కుతుందని ఊహించలేదు. మీడియం పేస్ బౌలింగ్ చేసే బ్యాటర్గా హార్దిక్ పాండ్యా తరహాలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని నితీశ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. కానీ ఈ సిరీస్కు ముందు దులీప్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్లలో రెండు డకౌట్లు బ్యాటింగ్పై కూడా సందేహాలు రేపాయి. కానీ టీమ్ మేనేజ్మెంట్ నితీశ్పై నమ్మకముంచింది. అతడిని తమ ట్రంప్ కార్డ్గా వాడి అద్భుత ఫలితాలు సాధించింది. ఇప్పుడు సెంచరీతో నితీశ్ తన స్థాయిని ప్రదర్శించాడు. అతను ఎనిమిదో స్థానంలో క్రీజ్లోకి వచ్చే సమయానికి భారత్ మరో 283 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాంటి సమయంలోనూ ఎలాంటి తడబాటు లేకుండా అతను స్వేచ్ఛగా ఆడిన తీరు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలను సైతం ఆకట్టుకుంది. షాట్ల ఎంపిక మాత్రమే కాదు, అతనిలో కనిపించిన ఆత్మవిశ్వాసం ఎంతో అనుభవం ఉన్నవాడిలా చూపించింది. ముఖ్యంగా క్రీజ్లో పట్టుదలగా నిలబడిన తీరు, పోరాటతత్వం ఈ 21 ఏళ్లు కుర్రాడిని మరో మెట్టు ఎక్కించాయి. స్టార్క్ బౌలింగ్తో ఆఫ్ డ్రైవ్ బౌండరీతో 81 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అతను ‘పుష్ప’లా తగ్గేదేలే అంటూ సంకేతం చూపించాడు. ఆ తర్వాత పరిస్థితికి తగినట్లుగా తనను తాను మార్చుకున్నాడు. 85 స్కోరు వద్దనుంచి 97కు చేరేందుకు 48 బంతులు తీసుకున్నాడు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. సెంచరీ తర్వాత బ్యాట్ను మైదానంలో జెండా తరహాలో పాతి ఇది ఆరంభం మాత్రమే అన్నట్లుగా తన రాకను నితీశ్ ఘనంగా చూపించాడు. 21 ఏళ్ల 214 రోజుల వయసులో సెంచరీ బాది ఆ్రస్టేలియా గడ్డపై అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వారిలో మూడో స్థానంలో అతను నిలవడం విశేషం. కమిన్స్తో తలపడి... నిలబడి...నితీశ్ ఇన్నింగ్స్లో చూడచక్కటి షాట్లు ఎన్నో ఉన్నాయి. అతని పది ఫోర్లు కూడా ఎంతో నియంత్రణతో, ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి సాధికారతతో వచ్చాయి. ఆరంభంలో లయన్ బౌలింగ్లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన సిక్స్, ఆ తర్వాతి బౌండరీలో చక్కటి ఫుట్వర్క్ కనిపించింది. అయితే సెంచరీని అందుకునే క్రమంలో అతను కొన్ని కఠిన క్షణాలను కూడా దాటాడు! ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ , తన సన్రైజర్స్ సారథి కమిన్స్ బౌలింగ్ను అతను ఎదుర్కొన్న తీరు శనివారం ఆటలో హైలైట్గా నిలిచింది. ఎన్ని ప్రమాదకరమైన బంతులు వచ్చినా... నితీశ్ తలవంచి కాడి పడేయలేదు. వాటికి ఎదురొడ్డి నిలబడ్డాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్ అతనిలోని మొండితనాన్ని చూపించింది. ముఖ్యంగా బౌన్సర్గా వచ్చిన మూడో బంతిని ఆడలేకపోయిన నితీశ్ అదృష్టవశాత్తూ చివరి క్షణంలో దానినుంచి తప్పించుకోగలిగాడు. ఆఖరి బంతి కూడా దాదాపు ఇదే తరహాలో అతడిని వెంటాడింది. మరికొద్ది సేపటికి కమిన్స్ బౌలింగ్లోనే బంతి మోచేయి కింది భాగంలో బలంగా తగలడంతో అతను విలవిల్లాడుతూ బ్యాట్ వదిలేశాడు. ఫిజియో వచ్చి చికిత్స చేయాల్సి వచ్చింది. అయితే ఈ కుర్రాడు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయి తానేంటో చూపించాడు. ఆ మూడు బంతులు!లయన్ వేసిన ఇన్నింగ్స్ 112వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి నితీశ్ మరో ఎండ్కు చేరుకున్నాడు. ఆ సమయంలో అతని స్కోరు 97. అదే ఓవర్ తర్వాత ఐదు బంతులు ఆడిన సుందర్ చివరి బంతికి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్ చివరి బంతికి మరో రెండు పరుగులు తీసిన అతను 99 వద్ద నిలిచాడు. అయితే మరుసటి ఓవర్లో ఒక్కసారిగా ఉత్కంఠ చోటు చేసుకుంది. తొలి మూడు బంతులు ఎదుర్కొన్న బుమ్రా డకౌట్గా వెనుదిరిగాడు. ఆ సమయంలో సిరాజ్ క్రీజ్లోకి వచ్చాడు. కమిన్స్ బంతులను అతను ఆడగలడా అని అన్ని వైపులనుంచి సందేహం. మైదానంలో ఫ్యాన్స్ కూడా మునివేళ్లపై నిలిచారు. ఎలాగో అతను ఆ గండాన్ని దాటాడు. ఆఖరి బంతిని సిరాజ్ డిఫెండ్ చేసినప్పుడు ఎంసీజీ మొత్తం ఊగిపోవడం విశేషం! అయితే బోలండ్ తర్వాతి ఓవర్ మూడో బంతిని లాఫ్టెడ్ ఆన్డ్రైవ్గా ఆడటంతో నితీశ్ శతకం పూర్తయింది. అభిమానుల ఉత్సాహంతో ‘జి’ దద్దరిల్లగా...ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి ముత్యాల రెడ్డి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఆ సమయంలో కామెంటరీలో ఉన్న మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ...‘ఈ భావోద్వేగ క్షణం గురించి ఏం చెప్పినా తక్కువే. అక్కడ ఏడుస్తోంది నితీశ్ తండ్రి మాత్రమే కాదు. మైదానంలో ఉన్న సగటు భారత అభిమానులకు కూడా అదే భావన వచ్చి ఉంటుంది. నా కళ్లల్లో కూడా కన్నీళ్లు తిరిగాయంటే ఆశ్చర్యపోవద్దు’ అని వ్యాఖ్యానించాడు. 5 ఎనిమిది లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్కు దిగి సెంచరీ సాధించిన ఆటగాళ్లలో నితీశ్ ఐదోవాడు. భారత ఆటగాళ్లలో అతనే మొదటివాడు. 8 ఈ సిరీస్లో నితీశ్ సిక్సర్ల సంఖ్య. గతంలో ఆ్రస్టేలియా గడ్డపై ఒక సిరీస్లో మైకేల్ వాన్ (8; ఇంగ్లండ్), క్రిస్ గేల్ (8;వెస్టిండీస్) మాత్రమే ఎనిమిది సిక్స్లు బాదారు.‘విశాఖపట్నం యువకుడు నితీశ్ కుమార్రెడ్డికి నా అభినందనలు. అండర్–16 స్థాయిలో, రంజీ ట్రోఫీలో ఎన్నో విజయాలతో అతను సత్తా చాటాడు. ఇలాంటి ఘనతలు మున్ముందు మరిన్ని సాధించాలని, భారత జట్టులో సభ్యుడిగా దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ –నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి నా అభినందనలు. జట్టు కష్టాల్లో ఉండి ఫాలో ఆన్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో పరిస్థితి చక్కదిద్దడంలో అతను కీలక పాత్ర పోషించాడు. రాబోయే ఎన్నో ఘనతల్లో ఇది మొదటిది కావాలి. మైదానంలో అతని విజయాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి -
ఏపీ గర్వపడేలా చేశారు.. క్రికెటర్ నితీష్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ నితీష్ కుమార్రెడ్డి(Nitish Kumar Reddy)కి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మెల్బోర్న్(Melbourne)లో చిన్నవయసులోనే సెంచరీ సాధించిన నితీష్కు అభినందనలు. 21 సంవత్సరాల వయసులోనే ఈఘనత సాధించటం విశేషం. ప్రపంచ స్థాయి ఆస్ట్రేలియన్ జట్టు మీద నితీష్ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. నితీష్ సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశారు. నితీష్ విజయం ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తి దాయకం. నితీష్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత క్రికెటర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీతో మెరిశారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరొ వైపు, వాషింగ్టన్ సుందర్ తో కలిసి రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదీ చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు -
సిరాజ్ టెన్షన్ పెట్టాడు.. కానీ అతడి వల్లే.: నితీశ్ రెడ్డి తండ్రి కామెంట్స్ వైరల్
నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) మెల్బోర్న్లో సాధించిన ఘనత తమ జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని అతడి తండ్రి ముత్యాలరెడ్డి అన్నారు. ఇదొక ప్రత్యేకమైన అనుభూతి అని.. తన కుమారుడి కష్టానికి ప్రతిఫలం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా టీమిండియా తరఫున టీ20ల ద్వారా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు నితీశ్ రెడ్డి.పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన 21 ఏళ్ల ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)కి ఎంపికయ్యాడు. కంగారూ దేశంలోని పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసిన తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. తొలి టెస్టు నుంచే బ్యాట్తో చెలరేగిన నితీశ్ రెడ్డి.. తాజాగా మెల్బోర్న్ వేదికగా శతకంతో మెరిశాడు.97 పరుగుల వద్ద ఉండగా ఎనిమిదో వికెట్బాక్సింగ్ డే టెస్టులో భాగంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ... భారత్ తరఫున తొలి సెంచరీ సాధించాడు. అయితే, నితీశ్ రెడ్డి 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. వాషింగ్టన్ సుందర్(50) ఎనిమిదో వికెట్గా వెనుదిరిగాడు.99.. తొమ్మిదో వికెట్ డౌన్ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. అయితే, అతడు పరుగుల ఖాతా తెరవకముందే కమిన్స్ బుమ్రాను డకౌట్గా పెవిలియన్కు పంపాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోగా.. అప్పటికి నితీశ్ 99 పరుగుల వద్ద ఉన్నాడు. దీంతో బుమ్రా స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మహ్మద్ సిరాజ్ వికెట్ కాపాడుకుంటాడా?.. నితీశ్ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకోగలడా? అనే ఉత్కంఠ పెరిగింది.ఫోర్ బాది వంద పరుగుల మార్కుకుఅయితే, సిరాజ్ కమిన్స్ బౌలింగ్లో మూడు బంతులను చక్కగా డిఫెన్స్ చేసుకోవడంతో.. నితీశ్ రెడ్డికి లైన్క్లియర్ అయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో అతడు ఫోర్ బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.Nitish Kumar Reddy hits his maiden Test century and receives a standing ovation from the MCG crowd ❤️ #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Vbqq5C26gz— cricket.com.au (@cricketcomau) December 28, 2024 ఇక నితీశ్ రెడ్డి శతకం బాదినపుడు అతడి కుటుంబం కూడా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లోనే ఉంది. ఈ నేపథ్యంలో నితీశ్ తండ్రి ముత్యాలరెడ్డి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ ఆడం గిల్క్రిస్ట్ ముత్యాలరెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు.సిరాజ్ వల్లే సాధ్యమైందిఈ సందర్భంగా ముత్యాలరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబానికి ఇదెంతో ప్రత్యేకమైన రోజు. జీవితాంతం ఈ క్షణాలు గుర్తుండిపోతాయి. 14- 15 ఏళ్ల వయసు నుంచే నితీశ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇప్పుడిక అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటుతుండటం సంతోషం. ఈ భావనను మాటల్లో వర్ణించలేను. నిజానికి నితీశ్ 99 పరుగుల వద్ద ఉన్నపుడు నాకు టెన్షన్గా అనిపించింది. అప్పటికి ఒకే వికెట్ చేతిలో ఉన్నా.. సిరాజ్ అద్భుతం చేశాడు. అతడు వికెట్ కాపాడుకున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు😭😭pic.twitter.com/IFTEjVw0uS https://t.co/4p2BAImzGW— Kraken (@krak3nnnnnn) December 28, 2024Adam Gilchrist asked Nitish Reddy's fathe,Nitish Reddy at 99 and Md Siraj was facing 3 balls. HIS FATHER SAID TENSION #nitishkumarreddy #fatherson #MOMENT pic.twitter.com/DVeyQOy7Io— The Comrade (@Yogeshp89973385) December 28, 2024 -
టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) తమ బ్యాటింగ్ పవరేంటో చూపించారు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ... కొరకరాని కొయ్యగా మారి వారి సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను రెడ్డి- వాషీ జోడీ సాధించింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించిన భారత జట్టు.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకోగలిగింది. తద్వారా 1-1తో సిరీస్లో సమంగా ఉన్న రోహిత్ సేన.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్లు తప్పక గెలవాలి.పటిష్ట స్థితిలో ఆసీస్అయితే, మెల్బోర్న్ వేదికగా గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో ఆదిలోనే టీమిండియాకు షాకులు తగిలాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు సామ్ కొన్స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) అర్ధ శతకాలతో మెరవగా.. స్టీవ్ స్మిత్ శతక్కొట్టాడు(140).స్వీయ తప్పిదాలతోమిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ(31), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(49) కూడా రాణించారు. ఫలితంగా ఆసీస్ పటిష్ట స్థితిలో నిలవగా.. మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు మళ్లీ ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(3), కేఎల్ రాహుల్(24), విరాట్ కోహ్లి(36), ఆకాశ్ దీప్(0), రిషభ్ పంత్(28), రవీంద్ర జడేజా(17) విఫలమయ్యారు.ఇరగదీసిన రెడ్డి, వాషీమరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(82) శతకం దిశగా పయనించినా.. అనవసరంగా సింగిల్కు యత్నించి రనౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్ చేసిన నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు.ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి తన అంతర్జాతీ కెరీర్లో తొలి శతకం నమోదు చేయగా.. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. ఇక ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.ఎట్టకేలకు కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఆ పని చేయగలిగాడు. అతడి బౌలింగ్లో వాషీ(50) స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో శతక భాగస్వామ్యానికి తెరపడ్డప్పటికీ నితీశ్ రెడ్డి- వాషింగ్టన్ సుందర్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు.ప్రపంచ రికార్డుటెస్టు క్రికెట్ చరిత్రలో ఎనిమిది, తొమ్మిది స్థానాలో బ్యాటింగ్ చేసి.. ఒకే ఇన్నింగ్స్లో 150కి పైగా బంతులు ఎదుర్కొన్న మొట్టమొదటి జోడీ రెడ్డి- వాషీ. మెల్బోర్న్లో మూడో రోజు ఆట ముగిసేసరికి వాషీ 162 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ కాగా.. నితీశ్ రెడ్డి 176 బంతుల్లో 105(10 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక భారత్ స్కోరు: 358/9 (116). ఆస్ట్రేలియా కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. నాథన్ లియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. చదవండి: Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి!.. భావోద్వేగంతో తండ్రి కన్నీళ్లు! వీడియో A fantastic effort from Washington Sundar to bring up his 50! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/xIIJ3go51r— cricket.com.au (@cricketcomau) December 28, 2024 -
నితీశ్ రెడ్డి వైల్డ్ ఫైర్
-
Nitish Kumar Reddy: హాఫ్ సెంచరీ తర్వాత పుష్ప.. సెంచరీ తర్వాత బాహుబలి
మెల్బోర్న్ టెస్ట్లో అద్భుతమైన శతకంతో మెరిసిన నితీశ్ కుమార్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ గర్వపడేలా చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని గాజువాక ప్రాంతానికి చెందిన నితీశ్ 21 ఏళ్ల 214 రోజుల వయసులోనే ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించాడు. తద్వారా ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించిన మూడో అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ 18 ఏళ్ల 253 రోజుల వయసులో ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించగా.. రిషబ్ పంత్ 21 ఏళ్ల, 91 రోజుల వయసులో ఆస్ట్రేలియాలో శతకొట్టాడు.THE CELEBRATION FROM NKR'S FATHER IS SIMPLY AMAZING. 🥹❤️- Nitish Kumar Reddy, you've made whole India proud. 🇮🇳pic.twitter.com/Gx1PFY7RnE— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024సరికొత్త ధృవ తారభారత క్రికెట్లో సరికొత్త ధృవ తార అవతరించింది. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికాడు. మెల్బోర్న్ టెస్ట్లో జట్టు కష్టాల్లో (191/6) ఉన్నప్పుడు బరిలోకి దిగిన నితీశ్.. సహచరుడు వాషింగ్టన్ సుందర్ను సమన్వయపరుచుకుంటూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బాక్సింగ్ డే టెస్ట్లో నితీశ్ చేసిన సెంచరీ ఆషామాషీ సెంచరీ కాదు. భారత క్రికెట్ బ్రతికి ఉన్నంతవరకు ఈ సెంచరీ ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుంటుంది.MAIDEN TEST CENTURY BY NKR. 🇮🇳- Nitish Kumar Reddy, the future superstar has announced his arrival in Melbourne. A hundred of the highest order, take a bow Nitish! 🙇♂️ pic.twitter.com/l82hFjRYSC— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024డెబ్యూ సిరీస్లోనే సత్తా చాటిన నితీశ్అరంగేట్రం సిరీస్లోనే సూపర్ సెంచరీతో మెరిసిన నితీశ్ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల మన్ననలందుకుంటున్నాడు. నితీశ్ ఆగమనంతో భారత క్రికెట్ సరికొత్త ధృవ తార అవతరించిందని క్రికెట్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజం నితీశ్ సెంచరీని అద్వితీయమైనదిగా అభివర్ణించాడు. ఆసీస్ సిరీస్లో నితీశ్ ఆది నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్లో నితీశ్ బ్యాట్తో పాటు బంతితోనూ రాణించాడు.Youngest Indian with a Test century in Australia:Sachin Tendulkar - 18 years 253 days.Rishabh Pant - 21 years 91 days.Nitish Kumar Reddy - 21 years 214 days. pic.twitter.com/p0NfjiWl1v— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024ఆసీస్ గడ్డపై సరికొత్త చరిత్రనితీశ్.. ఈ సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో నితీశ్ ఆసీస్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.NITISH KUMAR REDDY BECOMES THE FIRST INDIAN NO.8 TO SCORE A TEST CENTURY IN AUSTRALIA. pic.twitter.com/iF1Oel0EaK— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024హాఫ్ సెంచరీ తర్వాత పుష్ప.. సెంచరీ తర్వాత బాహుబలిహాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం పుష్ప స్టయిల్లో తగ్గేదేలేదంటూ సెలబ్రేషన్స్ చేసుకున్న నితీశ్.. సెంచరీ అనంతరం బాహుబలిలో ప్రభాస్లా విన్నూత్నంగా సంబురం చేసుకున్నాడు.- Pushpa Celebrations with Fifty.- Hundred Celebrations with Hundred.- NITISH REDDY 🤝 ALLU ARJUN 🤝 PRABHAS...!!!! 🔥 pic.twitter.com/N5kCBxqqhe— Tanuj Singh (@ImTanujSingh) December 28, 2024ప్రౌడ్ ఫాదర్నితీశ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న అతని తండ్రి చాలా ఎమోషనల్ అయ్యాడు. పుత్రోత్సాహంతో పొంగిపోతూ ఆనందబాష్పాలు కార్చాడు. ఆట ముగిసిన అనంతరం ఆడమ్ గిల్క్రిస్ట్ నితీశ్ తండ్రితో మాట్లాడాడు. తమ జీవితాల్లో ఇవి మరిచిపోలేని క్షణాలని నితీశ్ తండ్రి తెలిపాడు. నితీశ్ విరాట్ను అమితంగా ఆరాధిస్తాడని నితీశ్ తండ్రి ఈ సందర్భంగా చెప్పాడు.Adam Gilchrist interviewing the proud father of Nitish Kumar Reddy. ❤️ pic.twitter.com/oT5fIuIn4P— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024The emotions of Nitish Kumar Reddy's father at the MCG. 🥹❤️ pic.twitter.com/rDSmIJ0w3J— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024 -
Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి!.. భావోద్వేగంతో తండ్రి కన్నీళ్లు!
కఠిన శ్రమకు ఫలితం దక్కితే.. అంకితభావానికి ప్రతిగా అందమైన, అరుదైన బహుమతి లభిస్తే.. ఆటే ఆరోప్రాణంగా భావించే వారి త్యాగానికి సరైన గుర్తింపు దక్కితే ఎట్టా ఉంటది?!... టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి, అతడి తండ్రి ముత్యాలరెడ్డి భావోద్వేగాలను గమనిస్తే ఆ విషయం కళ్లకు కట్టినట్లు తెలుస్తది!!తన కెరీర్ను త్యాగం చేసిఐదేళ్ల ప్రాయంలోనే క్రికెట్ పట్ల మక్కువ కనబరిచిన కుమారుడి కోసం ఆ తండ్రి ఉద్యోగం సైతం విడిచిపెట్టి.. కత్తిమీద సాము చేశాడు. కొడుకులోని ప్రతిభను గుర్తించి.. అతడిని క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు ఎన్నో కష్టనష్టాలకోర్చాడు. అందుకు ప్రతిగా ఆ కుమారుడు ఆస్ట్రేలియా గడ్డపై అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డు సాధించి.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు.పుత్రోత్సాహంతండ్రి కళ్లముందే ఆసీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ అంతర్జాతీయ కెరీర్లో.. అదీ చిన్న వయసులోనే శతకం బాదేశాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా అభిమానులకు వినోదం పంచడంతో పాటు.. పడ్డ కష్టాన్ని మర్చిపోయి ఆ తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోయేలా చేశాడు.పట్టరాని సంతోషంతో కన్నీటి పర్యంతంఅవును.. ఆ తండ్రి ముత్యాలరెడ్డి, కొడుకు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy). 21 ఏళ్ల 216 రోజుల వయసులో ఈ విశాఖపట్నం కుర్రాడు ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుపై.. టీమిండియా కష్టాల్లో ఉన్న విలువైన సెంచరీ చేశాడు. దీంతో తండ్రి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. కంటతడి పెడుతూ.. తన ప్రార్థనలు ఫలించాయి అన్నట్లుగా ఆకాశం వైపు చూస్తూ ముత్యాలరెడ్డి భావోద్వేగాని(Nitish Kumar Reddy Father Gets Emotional)కి గురైన తీరు అందరి మనసులను కదిలించింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘తండ్రి కష్టానికి ప్రతిఫలం దక్కింది. కొడుకంటే ఇలా ఉండాలి’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో భారత్ను తన సెంచరీతో గట్టెక్కించిన నితీశ్ రెడ్డిపై మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఐసీసీ, బీసీసీఐ కూడా నితీశ్ రెడ్డి సరైన సమయంలో.. సరైన చోట శతకం బాదాడంటూ కొనియాడాయి.టీ20లతో టీమిండియా అరంగేట్రంకాగా నితీశ్ రెడ్డి ఐపీఎల్-2024(IPL 2024)లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో చోటు సంపాదించిన ఈ యువ కెరటం.. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ నైపుణ్యాల వల్ల టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆటతోనే తిప్పి కొట్టాడుఅయితే, నితీశ్కు అనతికాలంలోనే పిలుపునిచ్చి సెలక్టర్లు తప్పుచేశారని.. కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శించారు. అతడికి బదులు.. ఆసీస్లో ఆడిన అనుభవం ఉన్న శార్దూల్ ఠాకూర్ను బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.అయితే, ఆ విమర్శలన్నింటికీ నితీశ్ రెడ్డి తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. ఆసీస్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా పెర్త్((41, 38 నాటౌట్, ఒక వికెట్))లో టీమిండియాను ఆదుకుని విజయంలో తన వంతు పాత్ర పోషించిన నితీశ్ రెడ్డి.. అడిలైడ్లోనూ 42, 42 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. మూడో టెస్టులోనూ తన వంతు సహకారం అందించాడు.ఎంసీజీలో విశ్వరూపంఈ క్రమంలో మెల్బోర్న్లో జరుగుతున్న నాలుగో టెస్టులో మాత్రం నితీశ్ రెడ్డి తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు చక్కటి షాట్లతో అలరిస్తూ 171 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని.. టీమిండియాను మ్యాచ్లో నిలిపాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. కాగా నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆసీస్(474) కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: ZIM Vs AFG: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే.. శతకాల మోతNitish Kumar Reddy hits his maiden Test century and receives a standing ovation from the MCG crowd ❤️ #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Vbqq5C26gz— cricket.com.au (@cricketcomau) December 28, 2024 -
వారెవ్వా నితీశ్ రెడ్డి!.. ‘విధ్వంసం’ కాదు.. విలువైన సెంచరీ
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) విలువైన శతకం సాధించాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి ‘స్టార్’ బ్యాటర్లంతా విఫలమైన వేళ.. అతడు మాత్రం పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కంగారూల పేస్ పదునుకు తన బ్యాట్తో విరుగుడు మంత్రం రచించి.. దూకుడుగా ఆడుతూ వారిని ఇరకాటంలో పడేశాడు.తొట్ట తొలి శతకంమరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(50)తో కలిసి నిలకడగా ఆడుతూ.. భారత్ స్కోరును మూడు వందల మార్కును దాటించాడు. ఎనిమిదో వికెట్కు వాషీతో కలిసి విలువైన 127 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలోనే తన అంతర్జాతీయ కెరీర్లో మొట్టమొదటి శతకాన్ని(Maiden Century) నమోదు చేశాడు విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి.ఫోర్ బాది.. శతకం పూర్తి చేసుకునిటీమిండియా తరఫున ఆడుతున్న నాలుగో టెస్టులోనే 21 ఏళ్ల నితీశ్ రెడ్డి ఈ అద్భుతం చేశాడు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. ఆచితూచి ఆడుతూనే అదును చూసి బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో స్కాట్ బోలాండ్ బౌలింగ్లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 171 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.తద్వారా ఆస్ట్రేలియాలో టీమిండియా తరఫున అత్యంత పిన్న వయసులో టెస్టు సెంచరీ సాధించిన మూడో క్రికెటర్గా నితీశ్ రెడ్డి రికార్డులకెక్కాడు. కాగా మెల్బోర్న్లో గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌట్ అయింది.వాళ్లంతా విఫలంఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్, కెప్టెన రోహిత్ శర్మ(3), వన్డౌన్ బ్యాటర్ కేఎల్ రాహుల్(24) విఫలం కాగా.. హాఫ్ సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్(82) స్వీయ తప్పిదం వల్ల రనౌట్ అయ్యాడు.ఇక విరాట్ కోహ్లి 36 పరుగులకే నిష్క్రమించగా.. ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో 164/5 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా.. కాసేపటికే రిషభ్ పంత్(28), రవీంద్ర జడేజా(17) వికెట్లు కోల్పోయింది.ఆల్రౌండర్ల మెరుపులుఈ క్రమంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి- స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వందకు పైగా పరుగుల భాగస్వామ్యంతో దుమ్ములేపారు. వాషీ సరిగ్గా 50 పరుగులు చేసి అవుట్ కాగా.. నితీశ్ రెడ్డి శతకంతో మెరిశాడు.ఇక వెలుతులేమి కారణంగా మూడో రోజు ఉదయం 11.55 నిమిషాలకు ఆట నిలిపివేసే సమయానికి నితీశ్ రెడ్డి.. 176 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో.. 105 పరుగులు చేశాడు. అప్పటికి టీమిండియా 116 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ట్రోఫీలో భాగంగా ఆసీస్తో మూడు టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా 1-1తో సమంగా ఉంది.చదవండి: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన నితీశ్ రెడ్డిNitish Kumar Reddy hits his maiden Test century and receives a standing ovation from the MCG crowd ❤️ #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Vbqq5C26gz— cricket.com.au (@cricketcomau) December 28, 2024 -
ఆసీస్ గడ్డపై తెలుగోడు.. నితీష్ రెడ్డి వైల్డ్ ఫైర్
-
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన నితీశ్ రెడ్డి
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. కంగారూల దేశంలో లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగి అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాటర్గా రికార్డు సాధించాడు. ఐపీఎల్-2024(IPL-2024 )లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన విశాఖ కుర్రాడు నితీశ్ రెడ్డి.. టీ20ల ద్వారా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.అరుదైన నైపుణ్యాల కారణంగాభారత్ తరఫున పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటిన నితీశ్ రెడ్డి.. తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టులోనూ చోటు సంపాదించాడు. ఏకంగా ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టుతో భారత్ తలపడే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)కి ఎంపికవడమే కాక.. తుదిజట్టులో స్థానం దక్కించుకున్నాడు.ఇదే జోరులో టీమిండియా మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నితీశ్ రెడ్డి నిలబెట్టుకుంటున్నాడు. పెర్త్ టెస్టులో విలువైన ఇన్నింగ్స్(41, 38 నాటౌట్, ఒక వికెట్) ఆడిన 21 ఏళ్ల ఈ తెలుగు తేజం.. అడిలైడ్(42, 42, ఒక వికెట్)లోనూ బ్యాట్ ఝులిపించాడు. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టులోనూ ఫర్వాలేదనిపించిన నితీశ్ రెడ్డి.. బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో మాత్రం దుమ్ములేపుతున్నాడు.అరుదైన రికార్డు.. ఆసీస్ గడ్డపై చరిత్రరోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) వంటి టాప్ బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు. మరో యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో కలిసి నితీశ్ రెడ్డి భారత ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. విలువైన శతకం సాధించాడు.అయితే, 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో నితీశ్ రెడ్డి ఖాతాలో అరుదైన రికార్డు జమైంది. ఆస్ట్రేలియాలో ఎనిమిది.. లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్గా అతడు చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును నితీశ్ రెడ్డి బద్దలు కొట్టాడు.ఆసీస్ గడ్డపై ఎనిమిది లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన భారత క్రికెటర్లు1. నితీశ్ రెడ్డి- మెల్బోర్న్-2024- 88* రన్స్2. అనిల్ కుంబ్లే- అడిలైడ్- 2008- 87 రన్స్3. రవీంద్ర జడేజా- సిడ్నీ- 2019- 81 రన్స్4. కిరణ్ మోరే- మెల్బోర్న్- 1991- 67*5. శార్దూల్ ఠాకూర్- బ్రిస్బేన్- 2021- 67. Nitish Kumar Reddy was looking like Neo in The Matrix after dodging this one 😳#AUSvIND pic.twitter.com/B8sX7aKYvf— cricket.com.au (@cricketcomau) December 28, 2024 -
ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న నితీష్ రెడ్డి.. పిచ్పై పుష్ప స్టైల్ వార్నింగ్ (ఫొటోలు)
-
IND VS AUS: తగ్గేదేలేదన్న నితీశ్ రెడ్డి.. వైరలవుతున్న పుష్ప స్టయిల్ సెలబ్రేషన్స్
బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా నయా సెన్సేషన్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన నితీశ్.. టెస్ట్ల్లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం నితీశ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. You know the dialogue😉#Pushpa2 pic.twitter.com/Y9YESUCSKk— CricTracker (@Cricketracker) December 28, 2024మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న నితీశ్.. తగ్గేదేలేదంటూ పుష్ప స్టయిల్(Pushpa Style Celebrations)లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నితీశ్ సెలబ్రేషన్స్కు క్రికెట్ అభిమానులు సహా సినీ ఫ్యాన్స్ కూడా ముగ్దులవుతున్నారు. నితీశ్ 'తగ్గేదేలే' సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కిన భారత్ 300 మార్కును దాటింది. నితీశ్.. వాషింగ్టన్ సుందర్తో (39) కలిసి ఎనిమిదో వికెట్కు అజేయమైన 103 పరుగులు జోడించి భారత్ను ఫాలో గండం నుంచి గట్టెక్కించాడు. ప్రస్తుతం నితీశ్ 80ల్లోకి (85 నాటౌట్) ప్రవేశించాడు. 96 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 324/7గా ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 150 పరుగులు వెనుకపడి ఉంది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, ఆకాశ్దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 3, కమిన్స్ 2, లయోన్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
IND VS AUS 2nd Test: సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన నితీశ్ రెడ్డి
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండిన ఓ లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు (భారత్ తరఫున) గతంలో సెహ్వాగ్ పేరిట ఉండేది. 2003 పర్యటనలో సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై 6 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్లో నితీశ్ కుమార్ రెడ్డి సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్లో నితీశ్ ఇప్పటికే 7 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్లో ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. నితీశ్ ఈ సిరీస్లో మరిన్ని సిక్సర్లు బాదే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు..నితీశ్ కుమార్ రెడ్డి-7 (2024)వీరేంద్ర సెహ్వాగ్-6 (2003)మురళీ విజయ్-6 (2014)సచిన్ టెండూల్కర్-5 (2007)రోహిత్ శర్మ-5 (2014)మయాంక్ అగర్వాల్-5 (2018)రిషబ్ పంత్-5 (2018)ఇదిలా ఉంటే, అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్గా నిలిచాడు.19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
IND vs AUS 2nd Test: తొలి రోజు ఆసీస్దే..!
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 94 పరుగులు వెనుకపడి ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. మార్నస్ లబుషేన్ (20), నాథన్ మెక్స్వీని (38) క్రీజ్లో ఉన్నారు. ఉస్మాన్ ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. కాగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
IND VS AUS: ఆపద్భాంధవుడు నితీశ్
టీమిండియా యువ ఆల్రౌండర్, ఆంధ్రా కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్నాడు. నితీశ్ ఆడింది రెండు టెస్ట్ మ్యాచ్లే అయినా టీమిండియా పాలిట ఆపద్భాంధవుడిలా మారాడు. అడిలైడ్ వేదికగా జరుగతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో నితీశ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్పెషలిస్ట్ బ్యాటర్లంతా విఫలమైన వేల నితీశ్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు.ఈ మ్యాచ్లో నితీశ్ 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక స్కోర్. ఈ ఇన్నింగ్స్లో నితీశ్ ఆడిన షాట్లు అబ్బురపరిచాయి. స్టార్క్, బోలాండ్ లాంటి అరివీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో నితీశ్ అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదాడు.స్టార్క్, బోలాండ్ బౌలింగ్లో నితీశ్ కొట్టిన సిక్సర్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచాయి. తొలి ఇన్నింగ్స్లో నితీశ్ పుణ్యమా అని భారత్ 150 పరుగుల మార్కు దాటింది. నితీశ్ మరో రెండు, మూడు ఓవర్లు క్రీజ్లో ఉండి ఉంటే భారత్ 200 పరుగుల మార్కు దాటేది. నితీశ్ టెక్నిక్తో పాటు బంతిని బలంగా బాదే తత్వం టీమిండియా అభిమానులను తెగ ఆకట్టుకుంది.అంతకుముందు నితీశ్ తొలి టెస్ట్లోనూ రెండు మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. పెర్త్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో నితీశ్ 59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్లో నితీశ్ చేసిన స్కోరే టాప్ స్కోర్. విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ లాంటి సీనియర్లు విఫలమైన పిచ్పై నితీశ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు.అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లోనూ నితీశ్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చిన నితీశ్.. కోహ్లికి అండగా నిలిచి 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో నితీశ్ బంతితోనూ పర్వాలేదనిపించాడు. కీలకమైన మిచెల్ మార్ష్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా చూస్తే నితీశ్ టీమిండియాకు అవసరమైన సందర్భాల్లో బ్యాట్తో పాటు బంతితోనూ సత్తా చాటుతూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు.ఆసీస్తో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మిచెల్ స్టార్క్ (6/48) దెబ్బకు 180 పరుగులకు ఆలౌటైంది. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 30 ఓవర్ల అనంతరం వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. నాథన్ మెక్స్వీని (38), లబుషేన్ (19) క్రీజ్లో ఉన్నారు. ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది. ప్రస్తుతం ఆసీస్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 96 పరుగులు వెనుకపడి ఉంది. -
ఆసీస్ను మట్టికరిపించిన టీమిండియా.. బుమ్రాకు చిరస్మరణీయం
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందేప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా టీమిండియా ఆసీస్తో తమ ఆఖరి సిరీస్ ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్కు చేరాలంటే ఆసీస్పై కచ్చితంగా నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్టుకు దూరమయ్యాడు.బాధ్యతలు తీసుకున్న బుమ్రాఅయితే, సారథిగా ఉంటానంటూ బాధ్యతలు తీసుకున్న వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. తన పనిని సమర్థవంతంగా నెరవేర్చాడు. కెప్టెన్సీతో పాటు, ఆటగాడిగానూ అదరగొట్టిన ఈ పేస్ దళ నాయకుడు ఆసీస్ గడ్డపై కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు.అప్పుడు ఆదుకున్న పంత్, నితీశ్ రెడ్డిపెర్త్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పూర్తిగా సీమర్లకే అనుకూలించిన పిచ్పై భారత బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డారు. టాపార్డర్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్(0) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు.అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26) పట్టుదలగా నిలబడినా.. వివాదాస్పద రీతిలో థర్డ్ అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి(5) సైతం నిరాశపరచగా.. రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించడం కలిసి వచ్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 150 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్. మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.చెలరేగిన బుమ్రా.. కుప్పకూలిన ఆసీస్అనంతరం తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా తన పేస్ పదునుతో చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా రాణించడంతో మొదటిరోజు కేవలం 67 పరుగులే చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 104 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌట్ అయింది. బుమ్రాకు ఐదు, రాణాకు మూడు, సిరాజ్కు రెండు వికెట్లు దక్కాయి.జైస్వాల్ భారీ సెంచరీ.. శతక్కొట్టిన కోహ్లిఫలితంగా 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్కు మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో యశస్వి భారీ శతకం(161) పూర్తి చేసుకోగా.. రాహుల్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో పెర్త్లో పట్టు బిగించిన టీమిండియా.. కోహ్లి అజేయ సెంచరీ(100)కి తోడు నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 38 నాటౌట్)కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచింది.534 పరుగుల భారీ లక్ష్యం.. చేతులెత్తేసిన ఆసీస్ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఉండగా.. రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తద్వారా ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. అయితే, ఆది నుంచే మరోసారి అటాక్ ఆరంభించిన భారత బౌలర్లు ఆసీస్ను 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా జయభేరి మోగించి ఆసీస్కు సొంతగడ్డపై భారీ షాకిచ్చింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లు కూల్చగా.. వాషింగ్టన్ సుందర్ రెండు, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం నమోదు చేసింది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు👉వేదిక: పెర్త్ స్టేడియం, పెర్త్👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్👉టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 104 ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 238 ఆలౌట్👉ఫలితం: ఆసీస్పై 295 పరుగుల తేడాతో టీమిండియా భారీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(8 వికెట్లు)👉నాలుగురోజుల్లోనే ముగిసిన మ్యాచ్.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి!Big wicket for India! Siraj with a beauty! #AUSvIND pic.twitter.com/NEJykx9Avj— cricket.com.au (@cricketcomau) November 25, 2024History Made Down Under! 🇮🇳✨Team India seals a memorable victory, becoming the FIRST team to defeat Australia at the Optus Stadium, Perth! 🏟💥A moment of pride, determination, and unmatched brilliance as #TeamIndia conquers new heights in the 1st Test & secures No.1 Spot in… pic.twitter.com/B61Ic9qLuO— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
IND Vs AUS: నితీశ్ రెడ్డి ధనాధన్.. బౌలింగ్లోనూ అదుర్స్! బ్యాటర్ ఫ్యూజులు ఔట్
టీమిండియా యువ క్రికెటర్, విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ టెస్టుల్లో తొలి వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి.. సత్తా చాటాడు. కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన నితీశ్.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో 21 ఏళ్ల నితీశ్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. ఈ ఏడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్తో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. మూడు మ్యాచ్లలో కలిపి 90 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, అనూహ్య రీతిలో నితీశ్ రెడ్డిని సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేశారు. ఇందుకు ప్రధాన కారణం నితీశ్కు ఉన్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ నైపుణ్యాలే! హార్దిక్ పాండ్యా కేవలం వన్డే, టీ20లకే పరిమితం కావడంతో టెస్టుల్లో అతడి వారసుడి కోసం టీమిండియా ఎదురుచూస్తోంది.ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండరే అయినా.. ఆసీస్ టూర్కు మాత్రం బీసీసీఐ నితీశ్నే ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ శార్దూల్ను పక్కనపెట్టి.. ఈ యువ ఆటగాడికి పెద్దపీట వేసింది.అంతేకాదు... మెగా సిరీస్కు నితీశ్ను సన్నద్ధం చేసే క్రమంలో.. భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు ముందే అతడిని ఆస్ట్రేలియాకు పంపించింది. అయితే, ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో నితీశ్ ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ విఫలమయ్యాడు.ఆసీస్తో అనధికారిక సిరీస్లో 71 (0, 17, 16, 38) పరుగులు మాత్రమే చేయడంతో పాటు.. ఒకే ఒక్క వికెట్ తీశాడు నితీశ్. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టుల్లో అతడిని ఆడిస్తారా? లేదా? అన్న సందేహాల నడుమ.. మేనేజ్మెంట్ మాత్రం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచింది.ఈ క్రమంలో పెర్త్ వేదికగా తొలి టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి.. టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్లోనూ ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు.మొదటి ఇన్నింగ్స్లో 59 బంతుల్లో 41 పరుగులతో భారత టాప్ స్కోరర్గా నిలిచిన ఈ ఆల్రౌండర్.. రెండో ఇన్నింగ్స్లో తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా నితీశ్ రెడ్డి టెస్టుల్లో వికెట్ల ఖాతా కూడా తెరిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ప్రమాదకారిగా పరిణమించిన మిచెల్ మార్ష్(47)ను నితీశ్ తన బౌలింగ్ నైపుణ్యంతో బోల్తా కొట్టించాడు.అతడి బౌలింగ్లో మార్ష్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలం కాగా.. బంతి తాకి స్టంప్స్ ఎగిరిపడ్డాయి. దీంతో మార్ష్ షాకింగ్ రియాక్షన్తో క్రీజును వీడాడు. ఈ క్రమంలో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా తొలి టెస్టులో టీమిండియా ఆసీస్కు 534 పరుగుల భారీ లక్ష్యం విధించింది. అయితే, ఆసీస్ 182 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.EDGE & GONE!Nitish Kumar Reddy gets the big fish #MitchellMarsh!#AUSvINDOnStar 👉 1st Test, Day 4, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/n4mKpojPhp— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
‘దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడు’: అతడి మాటలే నితీశ్ రెడ్డికి స్ఫూర్తి
టీమిండియా యువ సంచలనం, ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు అరంగేట్రం కల శుక్రవారం(నవంబరు 22) నెరవేరింది. ఆస్ట్రేలియా గడ్డ మీద పెర్త్ వేదికగా ఈ 21 ఏళ్ల విశాఖ కుర్రాడు.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకున్నాడు. దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడుఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కంగారూ గడ్డపై మ్యాచ్కు ముందు కాస్త ఒత్తిడిలో ఉన్న సమయంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యలు తనలో స్ఫూర్తిని రగిల్చాయని తెలిపాడు. ‘దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడు’ అంటూ గంభీర్ తనతో చెప్పినట్లు నితీశ్ పేర్కొన్నాడు. కాగా పేస్కు సహకరిస్తున్న పెర్త్ పిచ్పై సీనియర్ ఆటగాళ్లే విఫలమైన చోట నితీశ్ రెడ్డి బ్యాట్తో విజృంభించడం విశేషం. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ మార్ష్ వంటి పేసర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టి సత్తా చాటాడు. 41 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు.మ్యాచ్ అనంతరం నితీశ్ మాట్లాడుతూ... ‘పెర్త్ గురించి చాలా విన్నా. దీంతో మ్యాచ్కు ముందు కాస్త ఆందోళన చెందాను. బౌన్సర్లను ఎదుర్కోవడం కష్టం అనిపించినా... ఆ సమయంలో కోచ్ గంభీర్ నెట్స్లో చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నా.అదొక గొప్ప అనుభూతి‘ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లు సంధిస్తే... అది దేశం కోసం బుల్లెట్ అనుకో’ అని కోచ్ చెప్పారు. మ్యాచ్ ఆరంభానికి ఒకరోజు ముందే అరంగేట్రం చేయనున్నట్లు తెలిసింది. విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకోవడం గొప్ప అనుభూతి. చిన్నప్పటి నుంచి కోహ్లి ఆట చూస్తూ పెరిగా... అలాంటిది ఇప్పుడు విరాట్ భాయ్తో కలిసి ఆడే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది.భారత్ ‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడటం ఎంతో ఉపకరించింది. ఇక్కడి పిచ్లపై ఒక అవగాహన ఏర్పడింది. భారత్తో పోల్చుకుంటే పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. అందుకే అతడిని టార్గెట్ చేశాపిచ్ నుంచి స్పిన్నర్లకు పెద్దగా సహకారం లేకపోవడంతో లియాన్ను లక్ష్యంగా చేసుకొని వేగంగా పరుగులు రాబట్టా. పంత్తో కలిసి బ్యాటింగ్ చేయడం బాగుంది. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే వికెట్లు దక్కుతాయని ముందే అనుకున్నాం. బుమ్రా, సిరాజ్, హర్షిత్ అదే చేసి చూపెట్టారు. ప్రస్తుతానికి వికెట్ పేస్ బౌలింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది’ అని నితీశ్ వివరించాడు. పేస్ ఆల్రౌండర్గా జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్కు తొలి రోజు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా బోర్డర్- గావస్కర్ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడనుంది.చదవండి: IND vs AUS: బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో -
Ind vs Aus 1st Day 2: అదరగొట్టిన భారత ఓపెనర్లు.. రెండో రోజూ మనదే
Australia vs India, 1st Test Day 2 At Perth Updates: అదరగొట్టిన భారత ఓపెనర్లు.. రెండో రోజు మనదేపెర్త్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో కూడా భారత జట్టు అదరగొట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, రాహుల్ అద్బుతంగా ఆడుతున్నారు. జైశ్వాల్(90), రాహుల్(62) ఆజేయంగా నిలిచారు. ప్రస్తుతం టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. జైశ్వాల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను రాహుల్ ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజులో జైశ్వాల్(74), కేఎల్ రాహుల్(56) పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు- 145/0 (37.4). 191 పరుగుల లీడ్.యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీఆసీస్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకంతో మెరిశాడు. నాథన్ లియాన్ బౌలింగ్లో సింగిల్ తీసి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జైస్వాల్కు ఇది తొమ్మిదో ఫిఫ్టీ. మరోవైపు రాహుల్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు- 100/0 (37.4). 146 పరుగుల లీడ్.టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 84/0 (26)జైస్వాల్ 42, రాహుల్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఆధిక్యం 130 పరుగులు.20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 75-0రాహుల్ 29, జైస్వాల్ 38 పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ప్రస్తుతం 121 పరుగుల మెరుగైన ఆధిక్యంలో ఉంది.నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లుటీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడుతున్నారు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 12 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 29 బంతులు ఎదుర్కొని ఎనిమిది, జైస్వాల్ 43 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేశారు. భారత్ స్కోరు: 30-0(12).ఆస్ట్రేలియా ఆలౌట్.. స్కోరు ఎంతంటే?టీమిండియాతో తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్లలో టెయిలెండర్ మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడం విశేషం.అయితే, స్టార్క్ను అవుట్ చేసేందుకు భారత బౌలర్లు సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు హర్షిత్ రాణా అతడిని పెవిలియన్కు పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో స్టార్క్తో పాటు వాళ్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు.ఇక టీమిండియా బౌలర్లలో ప్రధాన పేసర్ బుమ్రాకు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. హర్షిత్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి రోజు ఆటలో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్హర్షిత్ రాణా బౌలింగ్లో నాథన్ లియాన్ థర్డ్ స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోగా.. హర్షిత్ ఖాతాలో రెండో వికెట్ జమైంది. జోష్ హాజిల్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. స్టార్క్ 11 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 79/9 (33.3).ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియా అదరగొట్టింది. కెప్టెన్ బుమ్రా బౌలింగ్లో అలెక్స్ క్యారీ(21) అవుటయ్యాడు. పంత్కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లియాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 70-8(29).రెండో రోజు ఆట ఆరంభంఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. శనివారం 67/7 ఓవర్ నైట్ స్కోరుతో ఆసీస్ తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఆసీస్తో శుక్రవారం తొలి టెస్టు మొదలుపెట్టింది. పెర్త్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఆదుకున్న నితీశ్ రెడ్డి, పంత్టాపార్డర్ కుదేలైన వేళ మిడిలార్డర్ బ్యాటర్ రిషభ్ పంత్(37), లోయర్ ఆర్డర్లో ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ పేసర్లలో హాజిల్వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి రోజు బుమ్రాకు నాలుగు వికెట్లుఈ క్రమంలో తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, అరంగేట్ర బౌలర్ హర్షిత్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు కాగా.. తొలి రోజు ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 67 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(8), అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) వికెట్లను బుమ్రా పడగొట్టగా.. మార్నస్ లబుషేన్(2), మార్ష్(6)ను సిరాజ్ వెనక్కి పంపాడు. హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్ను అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్లో తన వికెట్ల ఖాతా తెరిచాడు.తుదిజట్లుటీమిండియాకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్.చదవండి: ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్ రెడ్డి -
కుప్పకూలి... కూల్చేసి...
గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సిరీస్లు నెగ్గిన భారత జట్టు ‘హ్యాట్రిక్’ దిశగా తొలి అడుగు తడబడుతూ వేసింది. కంగారూ పేసర్లను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక కష్టమే అనిపించిన దశలో బౌలర్లు విజృంభించి టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటే... బంతితో తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. నాయకుడు ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో బుమ్రా చాటి చెప్పగా... అతడికి సిరాజ్, హర్షిత్ రాణా చక్కటి సహకారం అందించారు. రెండో రోజు ఇదే జోరు కొనసాగి... బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడైతే ఈ మ్యాచ్పై భారత్కు పట్టు చిక్కుతుంది. పెర్త్: బ్యాటర్లు విఫలమైన చోట... బౌలర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తొలి రోజు భారత జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ఐదు మ్యాచ్ల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ప్రారంభమైంది. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్పై ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఆట ముగిసే సమయానికి భారత్ భారీ ఆధిక్యం సాధించే స్థితిలో నిలిచింది. ఆ్రస్టేలియా గడ్డపై గత ఏడు దశాబ్దాల్లో ఒక టెస్టు మ్యాచ్లో తొలి రోజు 17 వికెట్లు పడటం ఇదే తొలిసారి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో (59 బంతుల్లో 41; 6 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్గా నిలవగా... రిషబ్ పంత్ (78 బంతుల్లో 37; 3 ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (74 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్వుడ్ 4 వికెట్లు... స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (28 బంతుల్లో 19 బ్యాటింగ్; 3 ఫోర్లు), స్టార్క్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. చేతిలో 3 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు తొలి సెషన్లో వీలైనంత త్వరగా ఆ్రస్టేలియాను ఆలౌట్ చేస్తే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కుతుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడితే ఈ టెస్టు ఫలితాన్ని శాసించే అవకాశం లభిస్తుంది. బుల్లెట్లాంటి బంతులతో.. బ్యాటర్ల వైఫల్యంతో డీలా పడ్డ జట్టులో బుమ్రా తిరిగి జవసత్వాలు నింపాడు. ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించి టీమిండియాకు శుభారంభం అందించాడు. మూడో ఓవర్లో మెక్స్వీనీ (10)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా... ఏడో ఓవర్లో ఆసీస్కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగో బంతికి ఉస్మాన్ ఖ్వాజా (8)ను అవుట్ చేసిన బుమ్రా... ఆ మరుసటి బంతికి ప్రమాదకర స్టీవ్ స్మిత్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కెప్టెన్ స్పూర్తితో చెలరేగిన యువ పేసర్ హర్షిత్ రాణా మంచి వేగంతో ఆకట్టుకోగా... హైదరాబాదీ పేసర్ సిరాజ్ మెయిడెన్లతో విజృంభించాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ (11)ను హర్షిత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పచ్చికతో కూడిన పిచ్పై టాస్ గెలిచిన బుమ్రా బ్యాటింగ్ నిర్ణయం తీసుకోవడం క్రీడాభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినా... ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అది సరైందనే భావన బలపడింది. మార్ష్ (6) రూపంలో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్న సిరాజ్... క్రీజులో పాతుకుపోయిన లబుషేన్ (52 బంతుల్లో 2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆసీస్ సారథి కమిన్స్ (3)ను బుమ్రా అవుట్ చేయడంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. పేస్కు అనుకూలమైన పిచ్పై భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో ఎలా ఆడతారనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. నమ్మకాన్ని నిలబెట్టుకున్న నితీశ్ ప్లేయర్ల సహనానికి పరీక్ష పెట్టే పెర్త్ పిచ్పై మొదట మన బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లు విజృంభిస్తుంటే... కుదురుకోవడానికి ప్రయత్నించకుండా బాధ్యతారహిత షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) మూడో ఓవర్లోనే అవుట్ కాగా... 23 బంతులు ఎదుర్కొన్న దేవదత్ పడిక్కల్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.ఆదుకుంటాడనుకున్న కోహ్లి (5) ఎక్కువసేపు నిలవలేకపోగా... కాస్త పోరాడిన కేఎల్ రాహుల్ అంపైర్ సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు. ధ్రువ్ జురేల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా భారత జట్టు 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికే క్రీజులో ఉన్న పంత్కు నితీశ్ జత కలవడంతో భారత జట్టు కోలుకోగలిగింది.ఆసీస్ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న పంత్... కమిన్స్ బౌలింగ్లో కళ్లు చెదిరే సిక్స్తో ఆకట్టుకోగా... తొలి టెస్టు ఆడుతున్న నితీశ్ రెడ్డి ధాటిగా ఆడాడు. ఏడో వికెట్కు 48 పరుగులు జోడించిన అనంతరం పంత్ వెనుదిరిగాడు. పంత్ అవుటయ్యాక నితీశ్వేగంగా ఆడి జట్టు స్కోరును 150కి చేర్చి చివరి వికెట్గా పెవిలియన్కు చేరాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మెక్స్వీనీ (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 26; పడిక్కల్ (సి) కేరీ (బి) హాజల్వుడ్ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) హాజల్వుడ్ 5; పంత్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 37; జురేల్ (సి) లబుషేన్ (బి) మార్ష్ 11; సుందర్ (సి) కేరీ (బి) మార్ష్ 4; నితీశ్ రెడ్డి (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 41; హర్షిత్ (సి) లబుషేన్ (బి) హాజల్వుడ్ 7; బుమ్రా (సి) కేరీ (బి) హాజల్వుడ్ 8; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–32, 4–47, 5–59, 6–73, 7–121, 8–128, 9–144, 10–150. బౌలింగ్: స్టార్క్ 11–3–14–2; హాజల్వుడ్ 13–5–29–4; కమిన్స్ 15.4–2–67–2; లయన్ 5–1–23–0; మార్ష్ 5–1–12–2. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (బ్యాటింగ్) 19; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (బ్యాటింగ్) 6; ఎక్స్ట్రాలు 2; మొత్తం (27 ఓవర్లలో 7 వికెట్లకు) 67. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59. బౌలింగ్: బుమ్రా 10–3–17–4; సిరాజ్ 9–6–17–2; హర్షిత్ రాణా 8–1–33–1. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం ఈ మ్యాచ్ ద్వారా ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేస్ బౌలర్ హర్షిత్ రాణా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందు నితీశ్కు మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లీ టెస్టు క్యాప్ అందించగా... హర్షిత్కు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ జాతీయ జట్టు క్యాప్ ఇచ్చి అభినందించారు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 315వ ఆటగాడిగా నితీశ్ కుమార్ రెడ్డి, 316వ ప్లేయర్గా హర్షిత్ నిలిచారు. ఇటీవల బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగిన టి20 సిరీస్లో నితీశ్ తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. న్యూఢిల్లీలో జరిగిన రెండో టి20 మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆ్రస్టేలియా ఓపెనర్ మెక్స్వీనీ కూడా పెర్త్ మ్యాచ్తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. -
నితీశ్ రెడ్డి ‘ధనాధన్’ ఇన్నింగ్స్.. టీమిండియా 150 ఆలౌట్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా నామమాత్రపు స్కోరు చేసింది. టాపార్డర్ వైఫల్యం కారణంగా తొలి ఇన్నింగ్స్లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. కీలక ఆటగాళ్లంతా విఫలమైన చోట.. అరంగేట్ర ఆటగాడు, ఆంధ్ర యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవడం విశేషం.జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా నితీశ్ కుమార్రెడ్డి, హర్షిత్ రాణా టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.ఇక పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్(26) కాసేపు పట్టుదలగా నిలబడ్డాడు. కానీ అనూహ్యంగా వివాదాస్పద రీతిలో అతడు అవుట్ అయ్యాడు. మరోవైపు.. వన్డౌన్లో వచ్చిన పడక్కిల్ సున్నా చుట్టగా.. విరాట్ కోహ్లి ఐదు పరుగులకే నిష్క్రమించాడు.రాణించిన రిషభ్ పంత్ ఈ క్రమంలో మిడిలార్డర్లో రిషభ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 78 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మూడు ఫోర్లతో పాటు తనదైన ట్రేడ్ మార్క్ సిక్సర్ సాయంతో 37 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4) నిరాశపరచగా.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చిన నితీశ్ రెడ్డి అద్బుతంగా ఆడాడు.నితీశ్ రెడ్డి ధనాధన్టెస్టుల్లో అదీ ఆసీస్ గడ్డపై అరంగేట్రం చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కేవలం 59 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. నితీశ్ రెడ్డి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. అయితే, ఆసీస్ సారథి, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో నితీశ్ ఇన్నింగ్స్తో పాటు టీమిండియా ఇన్నింగ్స్కూ తెరపడింది.ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్ రెడ్డి.. 49.4వ ఓవర్ వద్ద.. కమిన్స్ బౌలింగ్లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి.. పదో వికెట్గా వెనుదిరిగాడు. ఇక మిగిలిన వాళ్లలో హర్షిత్ రాణా 7, బుమ్రా 8 పరుగులు చేయగా.. మహ్మద్ సిరాజ్ 0 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఆసీస్ పేసర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు కూల్చారు.చదవండి: చెత్త అంపైరింగ్.. కేఎల్ రాహుల్ అసంతృప్తి.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు -
టాలెంటెడ్ కిడ్.. కానీ.. : నితీశ్ రెడ్డిపై ప్యాట్ కమిన్స్ కామెంట్స్
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడితో కలిసి ఆడిన జ్ఞాపకాలు మధురమైనవని.. ఆట పట్ల నితీశ్ అంకితభావం అమోఘమని కొనియాడాడు. ఆసీస్ గడ్డపై కూడా అతడు బంతిని స్వింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టుల్లో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ గురువారం మీడియాతో మాట్లాడాడు.మాకు ఎంతో కీలకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీ తమకు ఎంతో కీలకమైన సిరీస్ అన్న కమిన్స్.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో తలపడటం కఠినమైన సవాలు అని పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడటం ఎల్లప్పుడూ ఒత్తిడికి గురిచేస్తుందని.. అయితే, తాము అన్ని రకాలుగా ఈ సిరీస్కు సిద్ధమయ్యాం కాబట్టి ఆందోళన చెందడం లేదని తెలిపాడు.టాలెంటెడ్ కిడ్ కానీ..ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘ఎంతో ప్రతిభావంతుడైన కుర్రాడు. కానీ.. సన్రైజర్స్ తరఫున అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఏదేమైనా అతడు టాలెంటెడ్ కిడ్. తన ఆట తీరుతో నన్ను ఇంప్రెస్ చేశాడు. ఇక్కడ కూడా బంతిని కాస్త స్వింగ్ చేయగలడనే అనుకుంటున్నా’’ అని కమిన్స్ కితాబులిచ్చాడు.సన్రైజర్స్ గెలుపులోకాగా ఐపీఎల్-2024లో కమిన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత వైఫల్యాలను మరిపించేలా జట్టును ఏకంగా ఫైనల్స్కు చేర్చాడు. ఇక కమిన్స్ కెప్టెన్సీలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.ఈ ఏడాది రైజర్స్ తరఫున 303 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో ఆస్ట్రేలియాతో టెస్టులకు నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. పెర్త్లో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
శార్దూల్ ఎక్కడ?.. నితీశ్ను ఆడిస్తారా? అతడు కూడా గంగూలీలా..
ఆస్ట్రేలియతో టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ పేస్ ఆల్రౌండర్లను ఈ సిరీస్లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు. ఐదు టెస్టులుటీమిండియాకు ఎంతో కీలకమైన ఈ పర్యటనలో యువకుడైన నితీశ్ కుమార్ రెడ్డిపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాడు.నితీశ్ రెడ్డి ఆట చూడాల్సిందేనితీశ్ గురించి మోర్కెల్ ప్రస్తావిస్తూ.. ‘అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఈ పర్యటనలో అతడి ఆట చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. అతడు ఆల్రౌండ్ సామర్థ్యం గల ఆటగాడు. అతడి బౌలింగ్లో పదును ఉంది.మనం ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా అతడి బంతి బ్యాట్ను తాకుతుంది. ఆస్ట్రేలియా పిచ్లపై అతడి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ బౌలింగ్కు అనుకూలమైన ఆసీస్ పిచ్లపై నితీశ్ మరింత ప్రమాదకారి కాగలడు. సరైన దిశలో వినియోగిస్తే అతడు ఉపయుక్త బౌలర్ అవుతాడు. ప్రతి బంతిని వికెట్ లక్ష్యంగా సంధించడం అతడి నైపుణ్యం.పేస్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి నితీశ్కు ఇది చక్కటి అవకాశం. ప్రపంచంలోని ఏ జట్టయినా మంచి పేస్ ఆల్రౌండర్ ఉండాలని కోరుకుంటుంది. తమ పేసర్లకు మరింత విశ్రాంతి నివ్వగల ఆల్రౌండర్ లభిస్తే అంతకుమించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?ఈ నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వంటి ఆల్రౌండర్ అవసరం ఉంది. కానీ.. అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఆప్షన్ వెదుక్కున్నారు. మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు? వాళ్లిద్దరిని పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితం చేద్దామనుకుంటున్నారు కదా! గత రెండు, మూడేళ్లుగా శార్దూల్పై మీరు నమ్మకం ఉంచారు. అతడికి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా నితీశ్ను బౌలింగ్ చేయమంటూ తెరమీదకు తీసుకువచ్చారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నితీశ్ కూడా గంగూలీలాఇక నితీశ్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమన్న భజ్జీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి పేస్ దళానికి అదనపు బలంగా మారితే బాగుంటుందని సూచించాడు. పేసర్లకు విశ్రాంతినిచ్చేలా బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్లోనూ సత్తా చాటితే ఉపయుక్తమని పేర్కొన్నాడు. ‘‘గంగూలీ మాదిరి.. కొన్ని ఓవర్లపాటు బౌలింగ్ చేసి.. నితీశ్ 1-2 వికెట్లు తీస్తే.. జట్టుకు అది ఒకరంగా బోనస్లా మారుతుంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంకాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి... టీ20ల్లో మెరుపుల ద్వారా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. షమీ వంటి సీనియర్ పేసర్ లేకపోవడంతో అతడి స్థానంలో సీమ్, బౌన్స్ను వినియోగించుకోగలగడంతో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా నితీశ్ను తుది జట్టులోకి ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీ రైటార్మ్ మీడియం పేసర్ కూడా! తన కెరీర్లో గంగూలీ టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ ఫిట్నెస్ లేమి వల్ల కేవలం వన్డే, టీ20లకు పరిమితం కాగా.. శార్దూల్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని రంజీల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్రౌండర్ అవసరం: టీమిండియా కోచ్
యువ క్రికెటర్ నితీశ్కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్ ఆల్రౌండ్ నైపుణ్యాలు అద్భుతమని.. అతడి చేరికతో జట్టు మరింత వైవిధ్యంగా మారిందని కొనియాడాడు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఈ పేస్ ఆల్రౌండర్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాల్సి ఉందని పేర్కొన్నాడు. తద్వారా ఆస్ట్రేలియాతో టెస్టులో నితీశ్ అరంగేట్రం ఖాయమని పరోక్షంగా వెల్లడించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిన్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు.ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్రౌండర్ అవసరంఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం(నవంబరు 22) ఈ మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విశాఖ కుర్రాడు నితీశ్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘జట్టులో ఇప్పుడున్న యువ ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి స్కిల్ అద్భుతం. ముఖ్యంగా మ్యాచ్ మొదటి రెండు రోజుల ఆటలో అతడు కీలకం కానున్నాడు.వికెట్-టు- వికెట్ బౌలింగ్ వేయగల సత్తా నితీశ్ సొంతం. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్లూ పేసర్లకు సహాయపడగల ఆల్రౌండర్ను కోరుకుంటుంది. అయితే, జస్ప్రీత్ నితీశ్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. ఈ సిరీస్లో అందరినీ ఆకర్షించగల ఆటగాడు అనడంలో సందేహం లేదు’’ అని నితీశ్ రెడ్డిని మోర్కెల్ ప్రశంసించాడు.కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ తరఫున సత్తా చాటి.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ఆసీస్తో పర్యటనలో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదనపు బలం అదేఇప్పటికే పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్ల వంటి సీనియర్లతో పాటు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా ఉన్నా.. బ్యాటింగ్ కూడా చేయడం నితీశ్కు ఉన్న అదనపు బలం. కాబట్టి బుమ్రా, సిరాజ్లతో పాటు 21 ఏళ్ల ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను తుదిజట్టులో ఆడించేందుకు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా..రోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్. చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
వంద శాతం ఫిట్గా ఉన్నా.. మేనేజ్మెంట్ నుంచి పిలుపు రాలేదు: టీమిండియా స్టార్
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతవరకు తనకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపురాలేదని.. కానీ.. త్వరలోనే తాను జాతీయ జట్టు తరఫున పునగామనం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఆసీస్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో శార్దూల్ ఠాకూర్కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశంఈ ముంబై ఆటగాడికి బదులు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో సీనియర్ అయిన శార్దూల్ను కాదని.. టెస్టు అరంగేట్రం చేయని నితీశ్ను సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. తాము గతాన్ని మరిచి సరికొత్తగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ముంబై తరఫున రంజీ బరిలోఇదిలా ఉంటే..కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న శార్దూల్ ఠాకూర్ ఇటీవలే మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో బరిలోకి దిగాడు. తాజాగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా సర్వీసెస్తో మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా సర్వీసెస్పై ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.వంద శాతం ఫిట్నెస్ సాధించానుఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన శార్దూల్ ఠాకూర్ టీమిండియా రీ ఎంట్రీ గురించి స్పందించాడు. ‘‘రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఆరంభ మ్యాచ్లలో కాస్త ఆందోళనకు గురయ్యా. సర్జరీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం వెంటాడింది. అయితే, క్రమక్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు వంద శాతం ఫిట్నెస్ సాధించాను.బౌలింగ్లో నేను రాణించిన తీరు ఇందుకు నిదర్శనం. గత మూడు, నాలుగు మ్యాచ్లను గమనిస్తే బౌలింగ్ బాగానే ఉంది. కొన్నిసార్లు క్యాచ్లు మిస్ చేశాను. అయితే, ఐదు మ్యాచ్లలో కలిపి దాదాపు 20 వికెట్ల దాకా తీశాను. నా ఫిట్నెస్, బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను.ఇప్పటి వరకు పిలుపు రాలేదుటీమిండియా మేనేజ్మెంట్ నుంచి నాకైతే ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతోంది. కాబట్టి నాకు అవకాశం వస్తుందనే భావిస్తున్నా. ఇప్పుడైతే ఫిట్నెస్పై మరింత దృష్టి సారించి.. బౌలింగ్లో రాణించడమే నా ధ్యేయం’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్ చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్న్యూస్ -
కోహ్లి మళ్లీ ఫెయిల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్లో పంత్ క్లీన్బౌల్డ్!
ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా ఆసీస్లో అడుగుపెట్టారు. ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ కోసం నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇక ఆసీస్తో సిరీస్కు సన్నాహకాల్లో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఇండోర్ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో భారత ఆటగాళ్లు మూడు రోజుల పాటు(శుక్రవారం- ఆదివారం) ఇంట్రా- స్క్వాడ్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. పెర్త్లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం(WACA) ఇందుకు వేదిక. కేవలం పదిహేను పరుగులకేఅయితే, ఈ మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి లేదని సమాచారం. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్లో శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ను కొనసాగించినట్లు సమాచారం. కేవలం పదిహేను పరుగులకే అతడు అవుట్ అయినట్లు తెలుస్తోంది. తనదైన శైలిలో చక్కగా ఆట మొదలుపెట్టి కవర్ డ్రైవ్లతో అలరించిన కోహ్లి.. తప్పుడు షాట్ సెలక్షన్తో వికెట్ పారేసుకున్నాడు. భారత పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్లో సెకండ్ స్లిప్లో ఉన్న ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి నిష్క్రమించాడు.పంత్ క్లీన్బౌల్డ్మరోవైపు.. రిషభ్ పంత్ సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. నితీశ్ రెడ్డి బౌలింగ్లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఇక ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కూడా 16 పరుగులకే అవుటైనట్లు తెలుస్తోంది. ప్రముఖ జర్నలిస్టు ఒకరు పెర్త్ నుంచి ఈ మేరకు సోషల్ మీడియాలో అప్డేట్స్ షేర్ చేశారు.కోహ్లికి గాయం?ఇక వార్మప్ మ్యాచ్లో అవుటైన వెంటనే కోహ్లి, పంత్ నెట్స్లో ప్రాక్టీస్ చేసేందుకు తిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్కు ముందు కోహ్లి గాయపడినట్లు వార్తలు వచ్చాయి. స్కానింగ్ తర్వాత మళ్లీ అతడు మైదానంలో అడుగుపెట్టినట్లు ఆసీస్ మీడియా వెల్లడించింది. మరోవైపు.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ సైతం గాయం కారణంగా ఫీల్డ్ను వీడినట్లు సమాచారం.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో రాణించడం తప్పనిసరి. ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు రోహిత్ సేన అర్హత సాధిస్తుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవంఅయితే, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తొలిసారిగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు క్లీన్స్వీప్నకు గురైంది.ఈ సిరీస్లో కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1. ఇక నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్ మొదలుకానుంది. ఇక టీమిండియా కంటే ముందు ఆసీస్లో అడుగుపెట్టిన ఇండియా-‘ఎ’ అనధికారిక టెస్టు సిరీస్లో 2-0తో వైట్వాష్ అయింది.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: భారత క్రికెట్లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు! 39 ఏళ్ల తర్వాత -
ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలం.. అయినా అతడిపై భారీ అంచనాలు!
భారత వన్డే, టీ20 జట్టులో కీలకమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లకు ముందు రెడ్బాల్తో ప్రాక్టీస్ చేసినా.. రీఎంట్రీ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఇక హార్దిక్ లేకపోయినా.. శార్దూల్ ఠాకూర్ రూపంలో టెస్టుల్లో టీమిండియాకు పేస్ బౌలింగ్ దొరికాడు. కానీ నిలకడలేమి ఆట తీరుతో ప్రస్తుతం జట్టుకు దూరమైన ఈ ముంబై క్రికెటర్.. రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. నితీశ్కుమార్ రెడ్డికి బంపరాఫర్ ఈ నేపథ్యంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డికి బంపరాఫర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు.ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలంఅంతకంటే ముందే ఆస్ట్రేలియా-‘ఎ’తో తలపడిన భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే, ఆసీస్-‘ఎ’తో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో నితీశ్ పూర్తిగా నిరాశపరిచాడు. పరుగులు రాబట్టడంలో, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు.రెండు మ్యాచ్లలో నితీశ్ చేసిన స్కోర్లు 0, 17, 16, 38. తీసిన వికెట్ ఒకే ఒక్కటి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టుల్లో నితీశ్ రెడ్డిని ఆడిస్తారా? లేదా అన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా మేనేజ్మెంట్ నితీశ్ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆకాశ్.. అయితే, ఇప్పుడే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్లలో అతడు విఫలం కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నాడు. అనధికారిక టెస్టుల్లో రన్స్ రాబట్టలేక.. వికెట్లు తీయలేక నితీశ్ ఇబ్బంది పడ్డాడని.. అలాంటి ఆటగాడు పటిష్ట ఆసీస్పై ఎలా రాణించగలడని ప్రశ్నించాడు.అయినా భారీ అంచనాలు.. ఇప్పుడే అదెలా సాధ్యం?‘‘హార్దిక్ పాండ్యా లేనందుకు శార్దూల్ జట్టుతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మనం నితీశ్ కుమార్ రెడ్డి నుంచి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా సేవలు ఆశిస్తున్నాం. ఇప్పుడే అదెలా సాధ్యం? ఇటీవలి అతడి ప్రదర్శనలు గొప్పగా ఏమీలేవు. అయినప్పటికీ అతడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఏదేమైనా అతడు ఈ సిరీస్లో రాణించాలనే కోరుకుంటున్నా. నిజానికి ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ అతడికి పెద్దగా అనుభవం లేదు. అయినా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ రూపంలో నితీశ్ సేవలు జట్టుకు అవసరం కాబట్టి.. అతడు ఎంపికయ్యాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో అదరగొట్టికాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి.. ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. 39 ఇన్నింగ్స్లో కలిపి 779 పరుగులు చేసిన నితీశ్.. 42 ఇన్నింగ్స్లో కలిపి 56 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మ ధ్య నవంబరు 22 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: టీమిండియాకు గుడ్న్యూస్ -
Aus A vs Ind A: రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్.. జురెల్ ఒక్కడే!.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్లో 161 పరుగులకే కుప్పకూలింది.తొలి టెస్టులో ఓటమికాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.అదొక్కటే సానుకూలాంశంఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది. రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్మెల్బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. పెవిలియన్కు గత మ్యాచ్లో శతకం బాదిన వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో మిడిలార్డర్లో దేవ్దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 80 పరుగులు సాధించాడు.నితీశ్ రెడ్డి మరోసారిమిగతా వాళ్లలో ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.చెలరేగిన నాసెర్ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. చదవండి: WI Vs ENG: కెప్టెన్తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో -
Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక తొలి టెస్టులో భారత-‘ఎ’ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్గా వెనుదిరిగాడు.వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్(35 బంతుల్లో 21), నాలుగో నంబర్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్(77 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో పేసర్ నవదీప్ సైనీ(23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.బాబా అపరాజిత్(9)తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. మానవ్ సుతార్ (1), ప్రసిద్ కృష్ణ(0) కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో వచ్చిన ముకేశ్ కుమార్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టడంతో 47.4 ఓవర్లలో 107 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. మూకుమ్మడిగా విఫలంకాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా భారత యువ ఆటగాళ్లు అనధికారిక టెస్టులపై దృష్టి పెట్టారు. ఈ రెండు మ్యాచ్ల సిరీస్లో సత్తా చాటి టీమ్ మేనేజ్మెంట్ను ఇంప్రెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్-ఎతో గురువారం నుంచి భారత్-ఎ తొలి అనధికారిక టెస్టు మొదలైంది. అయితే, తొలి ఇన్నింగ్స్లోనే అందరూ మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ టీమ్కు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో నిరాశపరచగా.. ప్రసిద్ కృష్ణ వికెట్లు తీస్తేనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.దేశవాళీల్లో సత్తా చాటి... 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఈశ్వరన్ భారీగా పరుగులు సాధించినా దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. 99 మ్యాచ్లలో అతను 7638 పరుగులు సాధించగా, ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న తాజా మ్యాచ్ అతడికి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ .ఇంతటి అపార అనుభవం ఉన్న ఈశ్వరన్ పేరు పెర్త్లో జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే పరిశీలనలో ఉంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్గా ఈశ్వరన్కే తొలి ప్రాధాన్యత ఉంది. గాయాల నుంచి కోలుకునిఇక గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత దులీప్ ట్రోఫీ, ఇరానీ, రంజీలలో పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆడాడు. వీటిలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా... అతని బౌలింగ్ శైలికి ఆసీస్ పిచ్లు సరిగ్గా సరిపోతాయి. ఇదే కారణంతో అతను సీనియర్ టీమ్లోకి ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్కు ముందు తన ఫామ్ను అందుకోవడంతో పాటు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు కూడా ప్రసిద్కు ఇది సరైన వేదిక కానుంది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తోఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి వీరితో పోలిస్తే భిన్నం. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తో పాటు ఇటీవల బంగ్లాదేశ్పై టి20లో చెలరేగిన నితీశ్ ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్లలో రెండు సార్లు డకౌట్ అయిన అతను... 48 ఓవర్లు బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.అయినా సరే శార్దుల్ ఠాకూర్లాంటి ఆల్రౌండర్ను కాదని నితీశ్ను సెలక్టర్ల టెస్టు టీమ్కు ఎంపిక చేశారు. గత ఏడాది రంజీ సీజన్లో 25 వికెట్లు తీసిన నితీశ్ ప్రదర్శన కూడా ఒక కారణం కాగా... వికెట్కు ఇరు వైపులా బంతిని చక్కగా స్వింగ్ చేసే అతని నైపుణ్యం ఆసీస్ పిచ్లపై పనికొస్తుందని వారు భావించారు. ఈ నేపథ్యంలో తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత నితీశ్పైనే ఉంది. టెస్టు క్రికెటర్లు కూడా... భారత్ తరఫున ఇంకా టెస్టులు ఆడని రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో భారత ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్కు ఆడిన ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, ముకేశ్ కుమార్లాంటి ప్లేయర్లు మరోసారి ఎరుపు బంతితో తమ ఆటను నిరూపించుకోవాల్సి ఉంది.ఆసీస్ క్రికెటర్లకూ పరీక్షఇక రంజీ, దులీప్ ట్రోఫీలో రాణించి ఈ టీమ్కు ఎంపికైన బాబా ఇంద్రజిత్, రికీ భుయ్, ఖలీల్, తనుశ్ కొటియాన్, సాయిసుదర్శన్ రాణించడం వారి భవిష్యత్తుకు కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో కూడా పలువురు టెస్టు క్రికెటర్లు ఉన్నారు. మైకేల్ నెసర్, మార్కస్ హారిస్, స్కాట్ బోలండ్, కామెరాన్ బాన్క్రాఫ్ట్, టాడ్ మర్ఫీ ఆసీస్ ప్రధాన జట్టులోకి పునరాగమనం చేసే ప్రయత్నంలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.ఇక పరిమిత ఓవర్ల పోటీల్లో సత్తా చాటిన జోష్ ఫిలిప్ కూడా ఇక్కడ రాణించి టెస్టు అరంగేట్రాన్ని ఆశిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా న్యూసౌత్వేల్స్కు చెందిన 19 ఏళ్ల ఓపెనర్ స్యామ్ కొన్స్టాస్పై ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు.‘జూనియర్ రికీ పాంటింగ్’గా అందరూ పిలుస్తున్న ఈ బ్యాటర్ 6 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 2 సెంచరీలు సహా 45.70 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ బాగా ఆడితే భారత్తో టెస్టుకు అతడు కొత్త ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎ’ జట్ల పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. చదవండి: IPL 2025: రిషభ్ పంత్ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్Waking up early just to see Ruturaj score a golden duck. Bro not doing justice to his fans now pic.twitter.com/KDfzJmXXZ2— Div🦁 (@div_yumm) October 31, 2024 -
IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. రిటెన్షన్ పూర్తి లిస్టు ఇదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 రిటెన్షన్ లిస్టు.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అక్టోబరు 31 వరకు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించబోయేది వీరిపైనే అంటూ ఔత్సాహికులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఆ విశేషాలపై మనమూ ఓ లుక్కేద్దామా!నిబంధనలు ఇవీఅంతకంటే ముందు ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ఎలా ఉందో పరిశీలిద్దాం. రూల్స్ ప్రకారం.. ఈసారి పర్స్ వాల్యూ 120 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతేకాదు.. రైట్ టూ మ్యాచ్ కార్డు కూడా ఉపయోగించుకునే వీలు కలిగింది.అంటే.. ఒక ఆటగాడిని ఓ ఫ్రాంఛైజీ వదిలేసిన తర్వాత.. అతడు వేలంలోకి వస్తే.. మరో ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసిన పక్షంలో.. ఈ కార్డును ఉపయోగించి పాత ఫ్రాంఛైజీ మళ్లీ సదరు ప్లేయర్ను వేలంలోని ధరకు సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురుఇక ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. అందులో కనీసం ఒక్కరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ అయి ఉండాలి. అంటే.. ఇంత వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడని క్రికెటర్ అయి ఉండాలి.ఇక తాము కొనసాగించాలనుకున్న తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు గనుక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే రూ. 4 కోట్ల మేర చెల్లించాలి.రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంతఅయితే, కొన్ని జట్లు కొందరు ఆటగాళ్లను వదులుకోవడానికి అస్సలు సిద్ధపడవు. అలాగే, వారి డిమాండ్కు తగ్గట్లు భారీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంఛైజీలకు బీసీసీఐ ఓ వెసలుబాటు కల్పించింది. తాము రిటైన్ చేసుకోవాలనుకునే తొలి ఐదుగురు క్రికెటర్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు.ఐపీఎల్-2025 రిటెన్షన్ లిస్టు అంచనాలు ఇవేముంబై ఇండియన్స్1. హార్దిక్ పాండ్యా- రూ. 18 కోట్లు2. జస్ప్రీత్ బుమ్రా- రూ. 14 కోట్లు3. తిలక్ వర్మ- రూ. 11 కోట్లు4. సూర్యకుమార్ యాదవ్- రూ. 18 కోట్లు5. నమన్ ధీర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ఆకాశ్ మధ్వాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లురాయల్ చాలెంజర్స్ బెంగళూరు1. విరాట్ కోహ్లి- రూ. 18 కోట్లు2. ఫాఫ్ డుప్లెసిస్- రూ. 14 కోట్లు3. మహ్మద్ సిరాజ్- రూ. 11 కోట్లు4. యశ్ దయాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అనూజ్ రావత్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్1. రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు2. మతీశ పతిరణ- రూ. 14 కోట్లు3. రచిన్ రవీంద్ర- రూ. 11 కోట్లు4. రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు5. ఎంఎస్ ధోని(అన్క్యాప్డ్- అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లుకోల్కతా నైట్ రైడర్స్1. శ్రేయస్ అయ్యర్- రూ. 18 కోట్లు2. సునిల్ నరైన్- రూ. 14 కోట్లు3. రింకూ సింగ్- రూ. 11 కోట్లు4. ఆండ్రీ రసెల్- రూ. 18 కోట్లు5. హర్షిత్ రాణా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. అంగ్క్రిష్ రఘువంశీ(అన్కాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 55 కోట్లురాజస్తాన్ రాయల్స్1. సంజూ శాంసన్- రూ. 18 కోట్లు2. జోస్ బట్లర్- రూ. 14 కోట్లు3. రియాన్ పరాగ్- రూ. 11 కోట్లు4. యశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లు5. సందీప్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది- రూ. 55 కోట్లులక్నో సూపర్ జెయింట్స్1. నికోలస్ పూరన్- రూ. 18 కోట్లు2. మార్కస్ స్టొయినిస్- రూ. 14 కోట్లు3. మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు4. ఆయుశ్ బదోని(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. మొహ్సిన్ ఖాన్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుపంజాబ్ కింగ్స్1. అర్ష్దీప్ సింగ్- రూ. 18 కోట్లు2. సామ్ కరన్- రూ. 14 కోట్లు3. కగిసో రబాడ- రూ. 11 కోట్లు4. అశుతోశ్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ప్రభ్సిమ్రన్ సింగ్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్1. రిషభ్ పంత్- రూ. 18 కోట్లు2. అక్షర్ పటేల్- రూ. 14 కోట్లు3. కుల్దీప్ యాదవ్- రూ. 11 కోట్లు4. రసిఖ్ సలాం దర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అభిషేక్ పోరెల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుసన్రైజర్స్ హైదరాబాద్1. హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు (ప్రస్తుత సమాచారం ప్రకారం ఇతడే ఈసారి రిటెన్షన్ జాబితాలో అత్యంత ఖరీదైన ఆటగాడు)2. ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు3. అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు4. ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు5. నితీశ్ రెడ్డి- రూ. 6 కోట్లు 6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 45 కోట్లుగుజరాత్ టైటాన్స్1. శుబ్మన్ గిల్- రూ. 18 కోట్లు2. మహ్మద్ షమీ/డేవిడ్ మిల్లర్- రూ. 14 కోట్లు3. సాయి సుదర్శన్- రూ. 11 కోట్లు4. రషీద్ ఖాన్- రూ. 18 కోట్లు5. రాహుల్ తెవాటియా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. మోహిత్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు.చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
గంభీర్ సర్ చెప్పడం వల్లే.. ఆరోజు అలా: నితీశ్ రెడ్డి
క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు అరుదుగా ఉంటారు. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ఆ కోవకు చెందిన వాడే. ప్రస్తుతం భారత్ తరఫున టాప్ క్లాస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఈ బరోడా క్రికెటర్ కొనసాగుతున్నాడు. అయితే, అతడి సేవలు పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమయ్యాయి. ఫిట్నెస్ దృష్ట్యా వన్డే, టీ20 ఫార్మాట్లలో మాత్రమే ఆడుతున్న హార్దిక్.. టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల మరోసారి రెడ్బాల్తో ప్రాక్టీస్ చేసినా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జట్టులో మాత్రం అతడి పేరు లేదు.తెలుగు కుర్రాడు నితీశ్కుమార్ రెడ్డికే ఓటుఈ క్రమంలో మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను కాదని మరీ సెలక్టర్లు తెలుగు కుర్రాడు నితీశ్కుమార్ రెడ్డికి ఓటు వేశారు. పొట్టి ఫార్మాట్లో రాణిస్తున్న ఈ ఆంధ్ర ఆల్రౌండర్ను ఆసీస్ టూర్కు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో నితీశ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్బాల్ క్రికెట్లో నిలకడైన పేస్తో రాణించడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు. గంటకు 140- 145 కిలోమీటర్ల వేగం కంటే.. 130- 135 మధ్య వేగంతో బౌలింగ్ చేస్తూ పేస్పై ఎక్కువగా దృష్టి పెడతానని తెలిపాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా హెడ్కోచ్ గౌతం గంభీర్ విలువైన సూచనలు ఇచ్చాడని.. ఆయన మార్గదర్శనంలో అనుకున్న ఫలితాలు రాబట్టగలనని ధీమా వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన నితీశ్రెడ్డి.. ఇటీవల బంగ్లాతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. రెండో టీ20లో మాత్రం దుమ్ములేపాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి పరుగుల వరద పారించాడు.4 ఫోర్లు, 7 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడికేవలం 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి ఏకంగా 74 పరుగులు రాబట్టాడు. అదే మ్యాచ్లో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఆ మ్యాచ్లో తన ప్రదర్శన గురించి తాజాగా గుర్తుచేసుకున్న నితీశ్రెడ్డి గంభీర్ వల్లే తను స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగానని తెలిపాడు. ఈ మేరకు హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘ఆరంభంలో నాకేమీ అర్థం కాలేదు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం దూకుడుగా ఆడమని చెప్పింది. ఐపీఎల్లో ఎలా ఆడానో అచ్చం అలాగే ప్రత్యర్థి బౌలింగ్పై అటాక్ చేయాలని చెప్పారు. అదే మైండ్సైట్తో ఇక్కడా ఆడాలని సూచించారు. పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేయమన్నారు. నాకింకా గుర్తుంది.. ఆరోజు డ్రింక్స్ బ్రేక్కు ముందు నేను రివర్స్ స్వీప్ షాట్ ఆడాను.నీకు ఆ పవర్ ఉందిఅయితే, ప్రత్యర్థి జట్టు డీఆర్ఎస్కు వెళ్లగా అంపైర్స్ కాల్ ద్వారా నాటౌట్గా నిలిచాను. అప్పుడు గౌతం సర్ నా దగ్గరికి వచ్చారు. ‘నితీశ్ నువ్వు బలంగా బంతిని బాదగలవు. నీకు ఆ పవర్ ఉంది. బంతిని బౌండరీ లైన్ను ఈజీగా దాటేలా చేయగలవు. అలాంటపుడు రివర్స్ షాట్తో నీకు పనిలేదు. ముఖ్యంగా ఇలాంటి వికెట్ల(ఢిల్లీ)పై అలా ఆడాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు.ఆయన మాటలు నాలో ఉత్సాహం నింపాయి. నా బ్యాట్ పవరేంటో చూపించాను. ముఖ్యంగా స్పిన్నర్ బౌలింగ్కు వచ్చినప్పుడు నేను మరింత దూకుడుగా ఆడాను’’ అని నితీశ్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక రెడ్బాల్ క్రికెట్ ఆడేందుకూ సిద్ధంగా ఉన్నానన్న 21 ఏళ్ల ఈ ఆల్రౌండర్ బౌలింగ్లోనూ నిలకడ ప్రదర్శించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం న్యూ జిలాండ్తో టెస్టులతో బిజీగా ఉన్న టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో నితీశ్ సహా పలువురు యువ ఆటగాళ్లు ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టారు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. రిజర్వు ప్లేయర్లు: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
BGT: ఆసీస్తో టెస్టు సిరీస్ జట్టు.. నితీశ్ కుమార్ రెడ్డికి చోటు
ముంబై: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ సిరీస్కు ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్తో టి20 సిరీస్లో మెరుపులు మెరిపించిన 21 ఏళ్ల నితీశ్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. సుదీర్ఘ కాలం పేస్ ఆల్రౌండర్గా సేవలందించగల సత్తా ఉండటంతోనే సెలెక్టర్లు నితీశ్ వైపు మొగ్గుచూపారు. నవంబర్ 22 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీని కోసం బీసీసీఐ శుక్రవారం రాత్రి 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నితీశ్తో పాటు ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. గాయంతో ఇబ్బంది పడుతున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పరిగణించలేదు. న్యూజిలాండ్తో రెండో టెస్టులో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్ ఆసీస్ పర్యటనకూ ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు. సఫారీతో టి20 సిరీస్కు రమణ్దీప్, వైశాక్ దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో జరగనున్న నాలుగు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం కూడా బీసీసీఐ శుక్రవారమే 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. పంజాబ్ బ్యాటర్ రమణ్దీప్ సింగ్, కర్ణాటక సీమర్ విజయ్ కుమార్ వైశాక్ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చారు. గాయాల బారిన పడ్డ శివమ్ దూబే, మయాంక్ యాదవ్ను ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాతో నాలుగు టి20 మ్యాచ్లు నవంబర్ 8న (డర్బన్), 10న (పోర్ట్ ఎలిజబెత్), 13న (సెంచూరియన్), 15న (జొహనెస్బర్గ్) జరుగుతాయి. ఆస్ట్రేలియా పర్యటనకు టెస్టు సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పంత్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఆకాశ్దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్కు భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్. -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం జట్టు ప్రకటన అప్పుడే.. రేసులో ఆంధ్ర కుర్రాడు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్తో రెండో టెస్ట్ అనంతరం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మీడియా కథనాల మేరకు ఆంధ్ర యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని భారత జట్టుకు ఎంపిక చేస్తారని తెలుస్తుంది. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో నితీశ్ ఎంపిక జరగవచ్చని ప్రచారం జరుగుతుంది. ఆస్ట్రేలియా కండీషన్స్లో నితీశ్ సీమ్ బౌలింగ్ భారత్కు లబ్ది చేకూరుస్తుందని సెలెక్టర్లు భావిస్తున్నారట. మరోవైపు ఇదే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ బెర్త్ కోసం శార్దూల్ ఠాకూర్ కూడా పోటీ పడుతున్నాడని తెలుస్తుంది. శార్దూల్కు గతంలో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉండటంతో సెలెక్టర్లు ఇతని పేరును కూడా పరిశీలిస్తునట్లు సమాచారం. బీజీటీ కోసం శార్దూల్, నితీశ్లలో ఎవరిని ఎంపిక చేస్తారో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.కాగా, 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో నితీశ్ ఓ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్శించాడు. నితీశ్ ఈ ఏడాది ఐపీఎల్లోనూ విశేషంగా రాణించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత-ఏ జట్టులో కూడా నితీశ్ చోటు దక్కించుకున్నాడు.నవంబర్ 22 నుంచి మొదలు..భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 3తో ఈ పర్యటన ముగియనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు జంబో జట్టును ఎంపిక చేస్తారని సమాచారం.చదవండి: బంగ్లాదేశ్ గడ్డపై సరికొత్త చరిత్ర -
మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డికి బంపరాఫర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో సత్తా చాటిన యువ క్రికెటర్లు మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డిల రాత మారిపోయింది. ఇటీవలే వీరిద్దరు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. స్వదేశంలో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్, నితీశ్ సెలక్టర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.కివీస్తో సిరీస్కు...ఈ సిరీస్లో స్పీడ్స్టర్ మయాంక్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. రెండో టీ20లో నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్(34 బంతుల్లో 74)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్కు వీరిద్దరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికచేశారు సెలక్టర్లు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ వీరికి మరో శుభవార్త అందించాడు. కివీస్తో సిరీస్లో వీరిని టెస్టుల్లో ఆడించే ఉద్దేశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారో? లేదో?‘‘యువ ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను మేము గుర్తించాం. అయితే, వాళ్లు ఎక్కువగా రెడ్బాల్ క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ వారిలోని నైపుణ్యాలకు మరింత పదునుపెట్టేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. అందుకే మరింత నిశితంగా పరిశీలించేందుకు వీలుగా రిజ్వర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాం.తమకు దొరికిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు. టెస్టు క్రికెట్ ఆడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. మా బెంచ్ స్ట్రెంత్ను పెంచుకునే క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.గాయాల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఎక్కువ బ్యాకప్ ఆప్షన్లు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సిరీస్లో వారు మాతో పాటే ప్రయాణిస్తారు కాబట్టి.. దగ్గరగా గమనిస్తాం. వర్క్లోడ్ను మేనేజ్ చేయగలరా? జట్టుకు ఎంతమేర ఉపయోగపడతారు? అన్న అంశాలు పరిశీలిస్తాం.ముఖ్యంగా ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. మా దగ్గర ఇప్పుడు 8- 9 ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలోనూ వీలైనంత మంది అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉందివీరిలో చాలా మంది దులిప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ఆడారు. ఇప్పుడు ఈ యువ ఆటగాళ్లను కివీస్తో టెస్టులకు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేయడానికి కారణం.. వాళ్లను దగ్గరగా గమనించి ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉండటమే’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.కాగా ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్తో పాటు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా న్యూజిలాండ్ టెస్టులకు ట్రావెలింగ్ రిజర్వులుగా ఉన్నారు. కాగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున వికెట్లు పడగొట్టిన మయాంక్ గాయం కారణంగా ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. అనంతరం, జాతీయ క్రికెట్ అకాడమీలో చేరి పునరావాసం పొందాడు. తర్వాత నేరుగా టీమిండియాలో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడంలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వగలిగాడు.చదవండి: షమీ ఫిట్గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్ శర్మ 💬💬 Our focus is to improve and better our performance.#TeamIndia Captain Rohit Sharma ahead of the #INDvNZ Test series 👌👌@IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/mJMOvVgVDw— BCCI (@BCCI) October 15, 2024 -
గంభీర్ సూచించాడు నేను పాటించాను: నితీశ్ కుమార్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్పై రెండో టి20లో చెలరేగేందుకు కోచ్ గౌతమ్ గంభీర్ కిటుకులు దోహదం చేశాయని చెప్పాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శన క్రెడిట్ అంతా కోచ్కే దక్కుతుందన్నాడు. పవర్ప్లేలోనే టాపార్డర్ను కోల్పోయిన దశలో నితీశ్, హిట్టర్ రింకూ సింగ్లు మెరుపు అర్ధశతకాలతో బంగ్లా బౌలర్లను చితగ్గొట్టారు. నాలుగో వికెట్కు వీరిద్దరు కేవలం 49 బంతుల్లోనే 108 పరుగులు జోడంచడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆంధ్ర హిట్టర్ ఏకంగా ఏడు సిక్సర్లు బాదడం విశేషం. 34 బంతుల్లోనే 74 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీసిన అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే! భాగస్వామ్యంపై అతను మాట్లాడుతూ ‘మా ఇద్దరి మధ్య సానుకూల సంభాషణ జరిగింది. ఎలాంటి ఒత్తిడికి గురవొద్దని నిర్ణయించుకున్నాం. మా దృష్టి ఎదుర్కొనే స్పిన్నర్లపైనే ఉండింది. స్కోరుపై కాదు! ఈ ఓవర్ మనకు కీలకమని అనుకున్నాం. అదే అదనుగా దంచేశాం. నిజం చెప్పాలంటే ఈ మెరుపు ప్రదర్శనకు కారణం కోచ్ గంభీరే. అతను నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ముఖ్యంగా బౌలింగ్పై బెంగ పెట్టుకోవద్దని చెప్పాడు. బౌలింగ్ చేసేటపుడు బౌలర్గానే ఆలోచించాలని బ్యాటర్గా కాదని చెప్పాడు. ఇది నాకు బాగా పనిచేసింది. యథేచ్చగా ఆడేలా, స్వేచ్ఛగా బౌలింగ్ చేసేలా ఉపకరించింది’ అని బీసీసీఐ వీడియోలో నితీశ్ వెల్లడించాడు. భారత్ తరఫున ఆడుతూ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానని తెలిపాడు. రింకూ సింగ్ మాట్లాడుతూ... ‘నితీశ్, నేను బ్యాటింగ్లో చెలరేగడాన్ని ఆస్వాదించాను’ అని చెప్పాడు. ఇలా బాదడం బహుశా భగవంతుడి ప్రణాళిక కావొచ్చని నితీశ్కు చెప్పినట్లు రింకూ పేర్కొన్నాడు. టాపార్డర్ కూలినపుడు, ఒత్తిడిలోనే ఇలాంటి భాగస్వామ్యాలు సాధ్యమైనట్లు చెప్పాడు. తాను భారత్కు ఎంపికైన ప్రతీసారి సిరీస్ గెలుపొందడం చెప్పుకోదగ్గ విశేషమన్నాడు. కెపె్టన్ సూర్యకుమార్ తమదైన శైలిలోనే ఆడేందుకు స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పాడు. -
భారత కుర్రాళ్ల జోరు.. బంగ్లా పులుల బేజారు (ఫోటోలు)
-
IND vs BAN: న్యూఢిల్లీలో నితీశ్ ‘షో’.. సిరీస్ భారత్ సొంతం
అందివచ్చి న అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పడుతూ... ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్పై భారత్ ఘనవిజయం సాధించింది. నితీశ్, రింకూ సింగ్ అర్ధశతకాలతో టీమిండియా భారీ స్కోరు చేయగా... బంగ్లాదేశ్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు టి20 సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ శనివారం హైదరాబాద్లో జరుగుతుంది. న్యూఢిల్లీ: టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత జట్టు... టి20ల్లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా 16వ సిరీస్ విజయం కావడం విశేషం. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శన ఫలితంగా... మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన రెండో టి20లో భారత్ 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. పరుగుల తేడా పరంగా బంగ్లాపై టీమిండియాకిదే అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరిపించాడు. రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. మహ్ముదుల్లా (39 బంతుల్లో 41; 3 సిక్సర్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. వైజాగ్ కుర్రాడి వీరవిహారం... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన ఓపెనర్ సంజూ సామ్సన్ (10) రెండో ఓవర్ చివరి బంతికి ఔట్ కాగా.. కాసేపటికే మరో ఓపెనర్ అభిõÙక్ శర్మ (15) అతడిని అనుసరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ (8) కూడా వెనుదిరగడంతో టీమిండియా 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. మహ్ముదుల్లా బౌలింగ్లో 6,4తో మోత ప్రారంభించిన నితీశ్... రిషాద్ వేసిన 10వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 100 పరుగులు దాటింది. ఆడుతున్న రెండో మ్యాచ్లోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడిన నితీశ్ 27 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిరాజ్ వేసిన 13వ ఓవర్లో నితీశ్ 6,4,2,6,6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు. ఇదే జోష్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి నితీశ్ ఔట్ కాగా.. ఆ తర్వాత బాదే బాధ్యత రింకూ, పాండ్యా తీసుకున్నారు. వీరిద్దరూ విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఆది నుంచి తడబాటే! ఛేదన ఏ దశలోనూ బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగలేదు. భారత్ తరఫున బౌలింగ్ చేసిన ఏడుగురు ప్రభావవంతంగా బంతులు వేయగా... పరుగులు రాబట్టేందుకు బంగ్లా బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. మూడో ఓవర్లో పర్వేజ్ హుస్సేన్ (16)ను ఔట్ చేసి అర్ష్ దీప్ వికెట్ల పతనానికి తెరలేపగా... అది చివరి వరకు కొనసాగింది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. బ్యాట్తో సంచలన ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి బంతితోనూ చెలరేగి తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) నజ్ముల్ (బి) తస్కీన్ 10; అభిషేక్ (బి) తన్జీమ్ 15; సూర్య (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 8; నితీశ్ కుమార్ రెడ్డి (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 74; రింకూ సింగ్ (సి) జాకిర్ అలీ (బి) తస్కీన్ 53; పాండ్యా (సి) మిరాజ్ (బి) రిషాద్ 32; రియాన్ పరాగ్ (సి) మహ్ముదుల్లా (బి) తన్జీమ్ 15; సుందర్ (నాటౌట్) 0; వరుణ్ చక్రవర్తి (సి) పర్వేజ్ (బి) రిషాద్ 0; అర్ష్ దీప్ (సి) లిటన్ దాస్ (బి) రిషాద్ 6; మయాంక్ యాదవ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు: 7, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–17, 2–25, 3–41, 4–149, 5–185, 6–213, 7–214, 8–214, 9–220, బౌలింగ్: మిరాజ్ 3–0–46–0; తస్కీన్ 4–0–16–2; తన్జీమ్ 4–0–50–2; ముస్తఫిజుర్ 4–0–36–2; రిషాద్ 4–0–55–3; మహ్ముదుల్లా 1–0–15–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (బి) అర్ష్ దీప్ 16; లిటన్ దాస్ (బి) వరుణ్ 14; నజ్ముల్ (సి) పాండ్యా (బి) సుందర్ 11; తౌహిద్ (బి) అభిõÙక్ 2; మిరాజ్ (సి) (సబ్) రవి బిష్ణోయ్ (బి) రియాన్ 16; మహ్ముదుల్లా (సి) రియాన్ (బి) నితీశ్ 41; జాకీర్ అలీ (సి) సుందర్ (బి) మయాంక్ యాదవ్ 1; రిషాద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 9; తన్జీమ్ (సి) పాండ్యా (బి) నితీశ్ 8; తస్కీన్ (నాటౌట్) 5; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–40, 3–42, 4–46, 5–80, 6–83, 7–93, 8–120, 9–127, బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1; నితీశ్ కుమార్ రెడ్డి 4–0–23–2; వాషింగ్టన్ సుందర్ 1–0–4–1; వరుణ్ చక్రవర్తి 4–0–19–2; అభిషేక్ 2–0–10–1; మయాంక్ యాదవ్ 4–0–30–1; రియాన్ పరాగ్ 2–0–16–1. -
బంగ్లాదేశ్తో రెండో టీ20.. నితీశ్ కుమార్ ఊచకోత.. టీమిండియా భారీ స్కోర్
న్యూఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ను నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 108 పరుగులు జోడించారు.హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 8, రియాన్ పరాగ్ 15, వరుణ్ చక్రవర్తి 0. సుందర్ 0 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 6, మయాంక్ యాదవ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు. తుది జట్లు..భారత్: సంజు శాంసన్(వికెట్కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(వికెట్కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకెర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది
భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ప్రతీ యువ క్రికెటర్ కల. ప్రతిభకు తోడు శ్రమ, పట్టుదల, పోరాటంతో సత్తా చాటి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కుర్రాళ్లకు ఆదివారం అలాంటి గొప్ప అవకాశం వచి్చంది. ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్తో తొలి టి20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీమిండియా తరఫున ‘బ్లూ జెర్సీ’లో ఆడటం మాత్రమే కాదు... వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా తమ విలువను అమాంతం పెంచుకున్నారు. వీరిద్దరిని వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరం. ఐపీఎల్–2025 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్కు ముందు వరకు వీరిద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లే. ఇప్పుడు భారత్కు ప్రాతినిధ్యం వహించడంతో ‘క్యాప్డ్’ ప్లేయర్లుగా మారిపోయారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్కు ఆడితే ‘క్యాప్డ్ ప్లేయర్’గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్లో నితీశ్ రెడ్డి సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు. నిబంధనలు ఇలా... ఐపీఎల్–2025 కోసం గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను టీమ్కు కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కచి్చతంగా ‘అన్క్యాప్డ్’ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను నిర్ణయించారు. వీరికి అవకాశం ఉందా... నితీశ్ రెడ్డి గత ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 142.92 స్ట్రయిక్రేట్తో పరుగులు చేసిన అతను ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీని ప్రకారం చూస్తే ‘అన్క్యాప్డ్’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిõÙక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్ను కనీసం ఐదో ఆటగాడిగా రూ. 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది సందేహమే! అతడిని విడుదల చేసి వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్రైజర్స్కు మరో అవకాశం ఉంటుంది. మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్లో ఆడింది నాలుగు మ్యాచ్లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని వదులుకునేందుకు సూపర్ జెయింట్స్ ఇష్టపడకపోవచ్చు. లక్నో మెంటార్గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. ఇద్దరిలో ఎవరినీ ఇరు జట్లు కొనసాగించకపోయినా...వేలంలోకి వెళితే భారీ మొత్తం లభించేందుకు కూడా ఆస్కారం ఉంది. కల నిజమైంది: నితీశ్ రెడ్డి గ్వాలియర్: భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ సంతోషం వెలిబుచ్చారు. తమ కెరీర్లో ఇది అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించినట్లు ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు వెల్లడించారు. ‘భారత్లో క్రికెట్ ఆడే ఎవరికైనా ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. టీమిండియా తరఫున ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైనట్లుగా భావించాను. సహజంగానే కొంత ఉత్కంఠ, ఆందోళన ఉన్నా ఆ తర్వాత మెల్లగా ఆటను ఆస్వాదించాను. నాకూ, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. టీమ్లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం నుంచి మంచి మద్దతు లభించింది. బౌలింగ్లోనూ నాకు మంచి సూచనలు లభించాయి. కెపె్టన్ సూర్య నాపై ఎలాంటి ఒత్తిడి దరి చేరకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసే అవకాశం కలి్పంచాడు. తొలి మ్యాచ్ అనిపించకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు’ అని నితీశ్ రెడ్డి వివరించాడు. తొలి మ్యాచ్లో మయాంక్ కూడా భావోద్వేగభరితమయ్యాడు. ‘నేను మ్యాచ్ ఆడుతున్నానని తెలియగానే గత నాలుగు నెలలు నా కళ్ల ముందు మెదిలాయి. పైగా గాయం నుంచి కోలుకొని వస్తున్నాను కాబట్టి అదనపు ఒత్తిడి నాపై ఉంది. అయితే కెప్టెన్ సూర్య నేను రనప్ తీసుకుంటున్న సమయంలో నా వద్దకు వచ్చి నువ్వు ఎలా బౌలింగ్ చేయగలనని భావిస్తోవో అలాగే చేయి అతని ధైర్యం నింపాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్తో గతంలో పని చేసిన అనుభవం కూడా పనికొచి్చంది’ అని మయాంక్ చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అరంగేట్రం
బంగ్లాదేశ్తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఢిల్లీకి చెందిన మయాంక్ యాదవ్, ఆంధ్రప్రదేశ్కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి భారత్ తరఫున టి20లు ఆడిన 116వ, 117వ ఆటగాళ్లుగా నిలిచారు. మ్యాచ్కు ముందు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చేతుల మీదుగా నితీశ్... టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ చేతుల మీదుగా మయాంక్ క్యాప్లు అందుకున్నారు. వైజాగ్కు చెందిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డికి ఎట్టకేలకు టీమిండియా తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్లో ఆకట్టుకోవడంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా... చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా నితీశ్ ఆ టూర్కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్కు ముందు నితీశ్ 20 టి20ల్లో 128.24 స్ట్రయిక్రేట్తో 395 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల మయాంక్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఐపీఎల్–2024 సీజన్లో తన ఎక్స్ప్రెస్ బౌలింగ్తో చెలరేగాడు. నిలకడగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఒకసారి 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. 14 టి20ల్లో అతను 14.31 సగటుతో 19 వికెట్లు తీశాడు. -
బంగ్లాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు
ముంబై: స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో పాల్గొనే భారత జట్టును శనివారం రాత్రి ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో స్థానం లభించింది. ఐపీఎల్లో తన పేస్ బౌలింగ్తో ఆకట్టుకున్న మయాంక్ యాదవ్కు కూడా తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడేళ్ల తర్వాత భారత టి20 జట్టులోకి పునరాగమనం చేశాడు. విశాఖపట్నంకు చెందిన 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి గత జూలైలో జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే జట్టును ప్రకటించాక నితీశ్ గాయపడటంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరం కావాల్సి వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నితీశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్లు ఆడిన నితీశ్ 142.92 స్ట్రయిక్రేట్తో 303 పరుగులు సాధించి ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును గెల్చుకున్నాడు. మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 6న గ్వాలియర్లో... రెండో మ్యాచ్ అక్టోబర్ 9న న్యూఢిల్లీలో... మూడో మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్లో జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. ఆరు మార్పులు... గత నెలలో శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్లో పాల్గొన్న ఆరుగురు భారత క్రికెటర్లను బంగ్లాదేశ్తో జరిగే సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. శ్రీలంకతో సిరీస్లో శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, సిరాజ్, ఖలీల్ అహ్మద్ ఆడారు. వీరి స్థానాల్లో అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్లకు చోటు దక్కింది. భారత టి20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిõÙక్ శర్మ, సంజూ సామ్సన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్‡్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్. -
Duleep Trophy: ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే అందరి దృష్టి!
శ్రీలంక పర్యటన తర్వాత.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా క్రికెటర్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్బాల్ టోర్నీ బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. సుమారుగా యాభై మందికి పైగా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు.ఈ టోర్నీకి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే నాలుగు జట్ల వివరాలను వెల్లడించింది. ఆటగాళ్లను టీమ్-ఏ, టీమ్-బి, టీమ్-సి, టీమ్-డిగా విభజించింది. టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తదితరులు పాల్గొననున్న ఈ టోర్నీలో.. ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా హైలైట్గా నిలవనున్నారు.అభిమన్యు ఈశ్వరన్బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ దులిప్ ట్రోఫీ-2024లో టీమ్-బి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 94 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇప్పుడు ఈ టోర్నీలో గనుక ఈశ్వరన్ సత్తా చాటితే.. బంగ్లాతో సిరీస్లో టీమిండియా బ్యాకప్ ఓపెనర్గా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యశ్ దయాల్దులిప్ ట్రోఫీ-2024లో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ టీమ్-బికి ఆడనున్నాడు. 26 ఏళ్ల ఈ యూపీ బౌలర్ ఇప్పటి వరకు 23 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 23 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున కూడా సత్తా చాటాడు. దులిప్ టోర్నీలో యశ్ దయాల్ ఆకట్టుకుంటే బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో అతడి పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంటుంది.హర్షిత్ రాణాఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు హర్షిత్ రాణా. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ ఢిల్లీ బౌలర్ జింబాబ్వేతో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే, ఈ 22 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు.ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడి 28 వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. దులిప్ ట్రోఫీలో టీమ్-డికి ఆడనున్నాడు. మెరుగైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాలని పట్టుదలగా ఉన్నాడు.నితీశ్కుమార్ రెడ్డిఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్కుమార్ రెడ్డి. ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ.. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ దురదృష్టవశాత్తూ గాయపడి.. జింబాబ్వే టూర్కు వెళ్లలేకపోయాడు. అయితే, దులిప్ ట్రోఫీ(టీమ్-బి)లో సత్తా చాటితే మాత్రం.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.ముషీర్ ఖాన్టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న ఆల్రౌండర్. దేశవాళీ క్రికెట్లో ముంబైకివ ఆడుతున్న ముషీర్.. గత రంజీ సీజన్లో ఓవరాల్గా 529 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. కేవలం ఆరు ఫస్ట్క్లాస్ మ్యాచ్లలోనే ఈ మేర స్కోరు చేశాడు. పందొమిదేళ్ల ముషీర్ ఖాన్ దులిప్ ట్రోఫీలో టీమ్-బికి ఆడనున్నాడు. అన్నకు పోటీగా బ్యాట్తో రంగంలోకి దిగనున్నాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
Ind vs Zim: నితీశ్ రెడ్డికి చేదు అనుభవం.. శివం దూబేకు ఛాన్స్
ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ యువ ఆల్రౌండర్ గాయం బారిన పడ్డాడు. ఫలితంగా జింబాబ్వేతో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో తీశ్ రెడ్డి స్థానంలో శివం దూబేను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం ప్రకటించింది.వైజాగ్ కుర్రాడుకాగా విశాఖపట్నానికి చెందిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున అదరగొట్టిన ఈ 21 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు.జింబాబ్వే పర్యటన కోసంఈ సీజన్ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతడిని ఎంపిక చేశారు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టుకు సెలక్ట్ అయిన తొలి ఆంధ్ర క్రికెటర్గా నితీశ్ రెడ్డి చరిత్రకెక్కాడు. అయితే, ప్రస్తుతం అతడు గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.అతడితో భర్తీనితీశ్ రెడ్డి చికిత్స నిమిత్తం ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి స్థానాన్ని ముంబై పేస్ ఆల్రౌండర్ శివం దూబేతో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లంతా విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో జింబాబ్వే టూర్కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.ఇక జూలై 6 నుంచి టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్లన్నింటికీ హరారే వేదిక.జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టు(రివైజ్డ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, శివం దూబే.చదవండి: ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!Nitish Kumar Reddy: అప్పుడే నా కల పూర్తిగా నెరవేరుతుంది -
అప్పుడే నా కల పూర్తిగా నెరవేరుతుంది: నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియాకు ఎంపిక కావడం పట్ల ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశాడు. ‘‘భారత జట్టుకు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. అయితే నా స్వప్నం 50 శాతమే సాకారమైంది. నేను టీమిండియా జెర్సీ వేసుకొని మైదానంలో దిగి సెంచరీతో జట్టును గెలిపించినపుడే నా పూర్తి కల నెరవేరుతుంది’’ అని ఈ విశాఖపట్నం కుర్రాడు అన్నాడు.‘‘నా కెరీర్ను తీర్చిదిద్దేందుకు నాన్న నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఇప్పుడు ఆయన కళ్లలో ఆనందం చూస్తుంటే ఇదే కదా ఆయన లక్ష్యమని గర్వంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఆంధ్ర క్రికెట్ జట్టు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా జెర్సీ ధరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఈ సీజన్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున చెలరేగిన అతను ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు. ముఖ్యంగా ఈ ఐపీఎల్ అసాంతం నితీశ్ కనబరిచిన నిలకడ, కచ్చితత్వంతో కూడిన షాట్లు, మెరిపించిన మెరుపులు భారత సెలక్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతన్ని భారత జట్టులోకి ఎంపిక చేశారు.శుబ్మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్పాండేలాంటి పలు కొత్తముఖాలకు తొలిసారి చోటు కల్పించింది. ప్రస్తుతం రెగ్యులర్ టీమిండియా జట్టు వెస్టిండీస్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో తదుపరి సూపర్–8 దశ మ్యాచ్ల్ని ఆడుతోంది. ఈ మెగా టోర్నీలో ముందుగా రోహిత్ బృందం అమెరికాలోనే మొత్తం లీగ్ మ్యాచ్ల్ని ఆడింది.ఇక ఈ టోర్నీ ముగిసిన వెంటనే జూలై 6 నుంచి జింబాబ్వే టూర్లో ద్వైపాక్షిక సిరీస్ మొదలవుతుంది. పూర్తిగా టి20 ఫార్మాట్కే పరిమితమైన ఈ పర్యటనలో భారత జట్టు జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా ఐదు మ్యాచ్లు ఆడుతుంది. మెగా టోర్నీ కోసం ఎంపికైన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్లు ఇద్దరే జింబాబ్వే పర్యటనకు కొనసాగుతున్నారు. స్టాండ్బైలుగా ఉన్న గిల్, రింకూ సింగ్, ఖలీల్, అవేశ్ ఖాన్లకు చోటిచ్చారు.సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, బుమ్రా, రవీంద్ర జడేజా, చహల్, సిరాజ్లతో పాటు శివమ్ దూబే, అర్ష్దీప్, కుల్దీప్ యాదవ్ లకు కూడా విశ్రాంతినివ్వడం ఆశ్చర్యకరం. బహుశా సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టి అంతా 2026 టీ20 ప్రపంచకప్పైనే ఉండటం వల్ల పూర్తిస్థాయిలో రిజర్వ్ బెంచ్కే అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. భారత టీ20 జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ సామ్సన్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే. -
జింబాబ్వే టూర్కు నితీష్కుమార్
విశాఖ స్పోర్ట్స్: జింబాబ్వేతో తలపడే భారత్ టీ20 జట్టులోకి నితీష్కుమార్ రెడ్డి చేరాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ నితీష్కుమార్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. విశాఖకు చెందిన కె.నితీష్కుమార్ రెడ్డి భారత్ టీ20 జట్టులో స్థానం సాధించడం పట్ల ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి అభినందనలు తెలిపారు. జింబాబ్వే టూర్లో రాణించాలని ఆకాంక్షించారు. సంఘం కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నితీష్కుమార్ను అభినందించారు. -
టీమిండియాలో ఎంట్రీ.. నితీశ్ కుమార్ రెడ్డికి ఏసీఏ అభినందనలు
టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ జట్టుకు ఎంపికైన విశాఖపట్నం కుర్రాడిపై ప్రశంసలు కురిపించింది.కాగా సీనియర్ల గైర్హాజరీలో యువ భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి మొదలుకానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(సన్రైజర్స్ హైదరాబాద్)తో పాటు అభిషేక్ శర్మ(యోహానన్ ప్రధాన కోచ్గా), రియాన్ పరాగ్(రాజస్తాన్ రాయల్స్), తుషార్ దేశ్పాండే(చెన్నై సూపర్ కింగ్స్) తదితర యంగ్క్రికెటర్లు తొలిసారిగా చోటు దక్కింది.ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శరత్ చంద్రా రెడ్డితో పాటు కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి, అపెక్స్ మెంబర్స్ నితీశ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే నితీశ్ రెడ్డి ఐపీఎల్లో స్థానం సంపాదించాడు.ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 13 మ్యాచ్లు ఆడి 303 పరుగులు చేశాడు. రైజర్స్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆంధ్ర నుంచి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలోనూ నితీశ్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రూ. 15.6 లక్షలకు ఈ యంగ్ సెన్సేషన్ను గోదావరి టైటాన్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్గా యోహానన్నియామకంక్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) 2024–25 సీజన్ కోసం పురుషులు, మహిళల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) జట్లలోని పలు విభాగాలకు ప్రధాన కోచ్లను నియమించారు. 71 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ మాజీ క్రికెటర్ టిను యోహానన్ను సీనియర్ పురుషుల విభాగానికి ప్రధాన కోచ్గా నియమించారు.అదే విధంగా అండర్ –23 పురుషుల విభాగానికి ప్రధాన కోచ్గా జె.క్రిష్ణారావు, సీనియర్ మహిళా విభాగానికి ఎం.ఎన్. విక్రమ్ వర్మ, అండర్–23 మహిళా విభాగానికి ఎస్.రమాదేవి, అండర్–19 మహిళా విభాగానికి ఎస్.శ్రీనివాసరెడ్డి, అండర్–15 మహిళా విభాగానికి ఎం.సవితను ప్రధాన కోచ్లుగా నియమించారు.ఇంటర్నేషనల్కు ఆడిన యోహానన్ను ప్రధాన కోచ్గా తీసుకొచ్చేందుకు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి తీవ్రంగా కృషి చేసినందుకు సీఏసీ చైర్మన్ ఎన్.మధుకర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. యోహానన్ ప్రధాన కోచ్గా నియమించడం వల్ల రాష్ట్రానికి చెందిన ప్లేయర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్.మధుకర్ వెల్లడించారు.యోహానన్ గురించి..యోహానన్ 1979 ఫిబ్రవరి 18న జన్మించారు. టీమిండియా మాజీ క్రికెటర్. అతను కుడిచేతి వాటం కలిగిన ఫాస్ట్ మీడియం బౌలర్. కేరళ తరపున ఫస్ట్–క్లాస్ క్రికెట్ ఆడాడు.భారత్ తరపున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన మొదటి కేరళ ఆటగాడు. అతను ప్రస్తుత కేరళ క్రికెట్ జట్టు కోచ్. 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి ఇన్టేక్ కోసం ఎంపికయ్యాడు. డిసెంబర్ 2001లో ఇంగ్లండ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో తన టెస్టు అరంగేట్రం చేశాడు.మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో అతను ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ అవుట్ చేశాడు. అతను తన మొదటి ఓవర్ నాల్గవ బంతికి తన మొదటి టెస్ట్ వికెట్ సాధించారు. 2024–25 సీజన్ను విజయవంతంగా నిర్వహించాలని ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి కోరారు. -
భారత టీ-20 జట్టులోకి ఏపీ కుర్రాడు నితీశ్... వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత టీ–20 జట్టులోకి ఆంధ్ర నుంచి ఎంపికయిన మొదటి ఆటగాడు నితీశ్ కుమార్రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆల్రౌండర్గా రాణిస్తున్న నితీశ్.. భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు. జింబాబ్వే టూర్లో నితీశ్ మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. కెరీర్లో మరింత ఎదగాలని తెలిపారు.కాగా, ఇటీవల ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన నితీశ్కుమార్రెడ్డి భారత టీ-20 జట్టులోకి ఎంపికయ్యారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే ఐపీఎల్లో స్థానం సంపాదించి సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జూలై 2024లో జరగబోయే జింబాబ్వే పర్యటన కోసం నితీశ్ భారత టీ–20 జట్టుకు ఎంపికయ్యారు. -
టీమిండియాలో చోటే లక్ష్యం
విశాఖ స్పోర్ట్స్: ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే.. ఐపీఎల్లో స్థానం సంపాదించి సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన కాకి నితీష్కుమార్రెడ్డి.. జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని వెల్లడించాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించి నిఖార్సైన ఆల్రౌండర్గా ఎదుగుతానంటున్న నితీష్కుమార్రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే.. దేశంలోనే బెస్ట్ క్రికెటర్గా.. అండర్–12, 14లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అకాడమీ ద్వారా శిక్షణ తీసుకున్నా. అనంతరం అండర్–16లో రాణించి ఏకంగా దేశంలోనే బెస్ట్ క్రికెటర్గా బీసీసీఐ నుంచి జగ్మోహన్ దాల్మియా అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మవిశ్వాసం వచ్చింది. 2020లో తొలి ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడి ఆ తర్వాతి ఏడాదే లిస్ట్–ఏ మ్యాచ్ల్లో ఇండియా–బి జట్టుకు ఆడాను. 2021 చివరికల్లా టి20ల్లో ఆడే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఐపీఎల్లో ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు లభించడం వల్ల నా ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునే అవకాశం కలిగింది. అది.. గొప్ప అనుభూతి ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటం ఆనందాన్నిచ్చింది. కీలక సమయాల్లో రాణించి సన్రైజర్స్ గెలుపులో భాగం కావడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. టైటిల్ పోరులో సరిగ్గా ఆడలేకపోవడం కాస్త నిరాశ కలిగించింది. స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా నా ఆటకు అన్వయించుకున్నా. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మహీ భాయ్(ధోనీ) చూస్తుండగా చివరి బంతిని స్టాండ్స్లోకి తరలించడం.. మా జట్టు విజయం సాధించడం మరపురాని సంఘటన. మొత్తంగా ఐపీఎల్లో రాణించడం గొప్ప అనుభూతినిచి్చంది. ఏపీఎల్లోనూ రాణిస్తా.. ప్రస్తుతం నా దృష్టి ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మూడో సీజన్పైనే ఉంది. గోదావరి టైటాన్స్ ఫ్రాంచైజీ అత్యధిక ధరకు నన్ను దక్కించుకుంది. ఈ నెలాఖరు నుంచి ఏపీఎల్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. నా అనుభవంతో జట్టును ముందుకు తీసుకువెళ్తా. నేను బౌలింగ్లోనూ రాణించేందుకు యార్కర్లపై దృష్టి పెడుతున్నా. అప్పుడే ఫర్ఫెక్ట్ ఆల్రౌండర్గా ఎదగగలను. ఐపీఎల్తో పాటు ఏపీఎల్ నా లక్ష్యానికి దోహదపడతాయని భావిస్తున్నా. ఆల్రౌండర్గా రాణించి జాతీయ జట్టులో స్థానం సాధించడమే నా తదుపరి లక్ష్యం. అదీ త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నా. -
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్. హైదరాబాద్కు చెందిన యువ బ్యాటర్ క్రీజ్లో ఉన్నాడు. ఆల్టైమ్ స్పిన్ దిగ్గజాల్లో ఒకడైన అశ్విన్ వేసిన బంతి ఆఫ్స్టంప్పై పడింది. బలంగా బాదితే వైడ్ లాంగాన్ దిశగా సిక్సర్! ఆ తర్వాత లెగ్స్పిన్నర్ చహల్ వచ్చాడు. టి20 క్రికెట్ స్టార్లలో ఒకడిగా, 350 వికెట్లు తీసిన అనుభవం అతనిది. వరుసగా ఫోర్, సిక్సర్! అంతటితో ఆగిపోలేదు. మరో రెండు బంతుల విరామం తర్వాత అదే ఓవర్లో వరుసగా మళ్లీ సిక్స్, ఫోర్.. కొద్ది సేపటికి అశ్విన్ తిరిగొచ్చాక వరుస బంతుల్లో మళ్లీ రెండు భారీ సిక్సర్లు! ఎక్కడా ఎలాంటి తడబాటు లేదు. పొరపాటున బ్యాట్ చివర తగిలి బంతి స్టాండ్స్లోకి వెళ్లింది కాదు. పూర్తిగా సాధికారికంగా, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఆడిన షాట్లతో అతను ఆయా బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ తరహాలో అతను ఆడిన తీరు, అగ్రశ్రేణి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న శైలి.. మాజీ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు అతని గురించి మాట్లాడుకునేలా చేసింది. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్గా అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. ఆ కుర్రాడే కె. నితీశ్ కుమార్ రెడ్డి. విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల నితీశ్ తాజా ఐపీఎల్లో తన ఆటతో అందరినీ ఆకర్షించాడు. అటు బ్యాటింగ్లో చెలరేగుతూ, ఇటు బౌలింగ్లో కీలక సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా ఫీల్డింగ్లో కూడా చురుకైన ప్రదర్శనతో సన్రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆరేళ్ల క్రితమే జూనియర్ స్థాయి క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి తన రాకను ఘనంగా చాటిన నితీశ్ ఇప్పుడు సీనియర్ ఇండియా క్రికెట్లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఐపీఎల్లో ఒక అచ్చమైన తెలుగబ్బాయి ఆటను చూసి ఎంత కాలమైంది! హైదరాబాద్ టీమ్ దక్కన్ చార్జర్స్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి సన్రైజర్స్ వరకూ మనవాళ్ల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అటు ఆంధ్ర నుంచి గానీ, ఇటు హైదరాబాద్ నుంచి గానీ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా చాలా సందర్భాల్లో బయటి ఆటగాళ్లతోనే లోకల్ టీమ్ను ఫ్రాంచైజీ నడిపిస్తూనే ఉంది. ఏ సగటు క్రికెట్ అభిమానిని అడిగినా ఇదే చెబుతాడు. టీమ్లోకి తీసుకున్నా తుది జట్టులో ఆడించకుండా, ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వకుండా సాగిన రోజులే ఎక్కువ. అక్కడక్కడా ఎవరైనా బరిలోకి దిగినా.. వాహ్ అనిపించే గుర్తుంచుకోదగ్గ ప్రదర్శనలూ తక్కువే. ఇలాంటి స్థితిలో నితీశ్ను అందరూ రెండు రాష్ట్రాల ప్రతినిధిగా, తమవాడిగా అభిమానిస్తున్నారు. అతను కూడా తన అద్భుత ఆటతో అందరి నమ్మకాన్ని నిలబెడుతూ కొత్త సంచలనంలా మారాడు. అలా మొదలై..నితీశ్లోని సహజ ప్రతిభే అతడిని బ్యాటింగ్లో రాటుదేలేలా చేసింది. చాలా మందిలాగే నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కూడా అబ్బాయి అల్లరిని భరించలేక ఆరేళ్ల వయసులో వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించడంతో మైదానంలో అతని ఆట మొదలైంది. ఆపై అబ్బాయి ఆసక్తి, నేర్చుకోవాలనే పట్టుదల వెరసి పూర్తి స్థాయిలో తండ్రి అతడిని క్రికెట్ శిక్షణ వైపు మళ్లించేలా చేసింది. కోచ్ల పర్యవేక్షణలో రాటుదేలిన నితీశ్ చిన్న వయసులోనే తనలోని అపార ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చాడు. అండర్–12 స్థాయికి వచ్చేసరికి గమ్యం స్పష్టమైపోయింది. అప్పటికే అతని బ్యాటింగ్లో స్ట్రోక్ మేకింగ్, పట్టుదల చూసినవారికి భవిష్యత్తులో ఉత్తమ క్రికెటర్ కావాల్సిన లక్షణాలున్నాయని అర్థమైంది. ఈ క్రమంలోనే అప్పటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్, భారత మాజీ ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్ దృష్టి కూడా నితీశ్పై పడింది. ట్రయల్స్లో అతని ప్రతిభను చూసిన ఎమ్మెస్కే కడపలోని ఏసీఏ అండర్–14 అకాడమీలో చేరే అవకాశం కల్పించారు. అక్కడి నుంచి నితీశ్కు 24 గంటలూ క్రికెట్టే జీవితంగా మారిపోయింది. తన ఆటను మరింత సానబెట్టుకునే అవకాశం దక్కిన చోట కష్టపడిన అతను మరింత రాటుదేలాడు. మరో వైపు వైజాగ్ జింక్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉన్న తండ్రి ముత్యాల రెడ్డికి రాజస్థాన్లోని ఉదయ్పూర్కు ట్రాన్స్ఫర్ అయింది. తాను అక్కడికి వెళితే బిడ్డ భవిష్యత్తుకు ఇబ్బంది రావచ్చని భావించిన ఆయన ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా ఇచ్చేశారు. పూర్తి స్థాయిలో కొడుకుకు అండగా ఉండి సరైన మార్గనిర్దేశనంలో నడిపించారు. పరుగుల వరద పారించి..నితీశ్ కెరీర్లో 2017–18 దేశవాళీ సీజన్ హైలైట్గా నిలిచింది. 14 ఏళ్ల నితీశ్ అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్లపై చెలరేగిన 8 ఇన్నింగ్స్లలోనే ఏకంగా 176.71 సగటుతో రికార్డు స్థాయిలో 1237 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఇందులో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. అన్నింటికి మించి నాగాలాండ్తో జరిగిన పోరులో అతను సాధించిన క్వాడ్రూపల్ సెంచరీ హైలైట్గా నిలిచింది. రాజ్కోట్లో జరిగిన ఈ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నితీశ్ 366 బంతులు ఎదుర్కొని 60 ఫోర్లు, 7 సిక్సర్లతో 441 పరుగులు సాధించడం విశేషం. ఇదే జోరును కొనసాగిస్తూ అండర్–19 టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో కూడా ఆకట్టుకున్న అతను బీసీసీఐ చాలెంజర్ టోర్నీలోనూ అవకాశం దక్కించుకున్నాడు. అదే జోరులో 17 ఏళ్ల వయసులో ఆంధ్ర తరఫున తొలి సీనియర్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఒంగోలులో జరిగిన కేరళతో జరిగిన మ్యాచ్లో రంజీ ట్రోఫీలో అతను అరంగేట్రం చేశాడు. తర్వాతి సీజన్లో విజయ్హజారే వన్డే టోర్నీలో అడుగు పెట్టిన నితీశ్కు కొన్నాళ్ల తర్వాత ముస్తాక్ అలీ టి20 టోర్నీలోనూ ఆంధ్రకు ఆడే అవకాశం దక్కింది. ప్రతికూల పరిస్థితులను దాటి..అండర్–19 స్థాయిలో ఆకట్టుకున్నా.. అక్కడి నుంచి సీనియర్ స్థాయికి చేరే క్రమంలో యువ క్రికెటర్లంతా ఒక రకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. రెండింటి మధ్య ఉండే అంతరం కారణంగా అంచనాలను అందుకోలేక వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది. దాదాపు అందరు ఆటగాళ్లు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. నితీశ్కు కూడా ఇలాగే జరిగింది. జూనియర్ స్థాయి మెరుపుల తర్వాత కొంత కాలం పాటు అతను ఇదే స్థితిని అనుభవించాడు. రంజీ అరంగేట్రం తర్వాత ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో పాటు కోవిడ్ వల్ల వచ్చిన విరామం, ఇతర వేర్వేరు కారణాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ఈ దశలో అతను తన ఆటకు మరో రూపంలో పదును పెట్టాడు. అప్పటి వరకు వేర్వేరు వయో విభాగాల్లో ఓపెనర్గా భారీగా పరుగులు సాధించి అప్పుడప్పుడు మీడియం పేస్ బౌలింగ్ చేసిన నితీశ్ ఇప్పుడు తన బౌలింగ్పై మరింత శ్రద్ధ పెట్టాడు. అది 2022–23 రంజీ సీజన్లో బ్రహ్మండంగా పని చేసింది. 8 మ్యాచ్లలో 25 వికెట్లు పడగొట్టి సత్తా చాటడంతో ఆంధ్ర టీమ్లో ఆల్రౌండర్గా అతనికి గుర్తింపు దక్కింది. ఇదే క్రమంలో 2023–24 సీజన్లో పూర్తి స్థాయి ప్రదర్శనతో రెగ్యులర్గా టీమ్లో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా అతను మళ్లీ 25 వికెట్లతో చెలరేగడంతో పాటు గతంలోలాగా బ్యాటింగ్లో కూడా తన పదును చూపించడం విశేషం. ఐపీఎల్లో అదరగొట్టి..‘నితీశ్కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటికి నాకు మరో 25 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆ సమయంలో నేను అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ హతాశులయ్యారు. సహజంగానే ఆ తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మేమందరం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే వాటి ప్రభావం అబ్బాయిపై పడరాదని భావించాం. అతడి ఆటకు మాత్రం ఇబ్బంది రాకుండా అన్నీ చూసుకున్నాం. అసలు ఆటల గురించి ఏమాత్రం అవగాహన లేని నా భార్య మానస కూడా కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేసి శ్రమించింది. ఇప్పుడు అతడిని ఐపీఎల్లో చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది’ భావోద్వేగంతో ముత్యాల రెడ్డి నాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.నితీశ్ గత ఏడాదే సన్రైజర్స్ టీమ్తో పాటు ఉన్నాడు. కానీ ఆడిన రెండు మ్యాచ్లలో బ్యాటింగ్ అవకాశమే రాకపోగా, బౌలింగ్లోనూ వికెట్లు దక్కలేదు. అప్పుడు కొంత నిరాశకు గురైనా.. ఈసారి దక్కిన అవకాశాన్ని అతను అద్భుతంగా వాడుకున్నాడు. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్లో చెలరేగుతూ రైజర్స్ టీమ్లో కీలకంగా మారాడు.‘చిన్నప్పుడే నితీశ్లో ప్రతిభను గుర్తించాం. ఆపై సరైన అవకాశాలు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. ఐపీఎల్లో అతని ఆట చూస్తే సంతోషం కలుగుతోంది. ఒత్తిడిలోనూ ఎక్కడా తడబాటుకు, ఆందోళనకు గురికాని అతని ఆత్మవిశ్వాసం నాకు నచ్చుతుంది. ఇప్పుడు అతను కెరీర్ కీలక దశలో ఉన్నాడు. బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. బౌలింగ్లో స్టోక్స్, పాండ్యా తరహాలో మీడియం పేస్తోనే వేరియేషన్లు ప్రదర్శించడం, బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయడం వంటివి మెరుగుపరచుకుంటే మంచి ఆల్రౌండర్గా త్వరలోనే టీమిండియాకు ఆడగలడు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనలాగే సగటు తెలుగు క్రికెట్ అభిమానులదీ అదే కోరిక. త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం.-మొహమ్మద్ అబ్దుల్ హాది -
APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
సన్రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్-2024లో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం ఇందుకు ఓ కారణమైతే.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించడం మరో కారణం.జోనల్ స్థాయి క్రీడాకారులకి గుర్తింపు తెచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట గత రెండేళ్లుగా టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేరెన్నికగన్న క్రికెటర్లతో పాటు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లు కూడా ఈ లీగ్లో భాగమవుతున్నారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఏపీఎల్లో పాల్గొంటున్నాయి. ఇక ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీఎల్.. మూడో సీజన్ కోసం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కొనుగోలుకై గురువారం వేలం నిర్వహించారు. ఇందులో భాగంగా 76 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇక ఇప్పటికే 44 మంది ప్లేయర్లను ఆయా జట్లు రిటైన్ చేసుకున్నాయి.ఇక ఏ,బీ,సీ,డీ పేరిట నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించారు. ‘ఏ’ కేటగిరీ కనీస ధర: లక్ష... బీ కేటగిరీ కనీస ధర: 50 వేలు.. సీ,డీ కేటగిరీ కనీస ధర: 25 వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో దుమ్ము లేపుతున్న పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ వేలంలో పాల్గొన్నాడు.ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 15.6 లక్షలకు నితీశ్ రెడ్డి అమ్ముడుపోయాడు. ఈ యంగ్ సెన్సేషన్ కోసం గోదావరి టైటాన్స్ యాజమాన్యం ఈ మేరకు భారీ మొత్తం వెచ్చించింది.ఈ విషయం తెలియగానే నితీశ్ కుమార్ రెడ్డి నమ్మలేకపోతున్నా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వైజాగ్ కుర్రాడు నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్రైజర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంచనాలకు మించి రాణించిన 20 ఏళ్ల ఈ ఆల్రౌండర్ 7 ఇన్నింగ్స్ ఆడి 239 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3 వికెట్లు కూడా తీశాడు. NITISH KUMAR REDDY - Highest paid player in Andhra Premier League. 💥IPL salary - 20 Lakhs. APL salary - 15.6 Lakhs. His reaction is priceless. 🫡 The future star. pic.twitter.com/33i0hT3F3a— Johns. (@CricCrazyJohns) May 16, 2024 -
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కళ్లు చెదిరే క్యాచ్లు పట్టారు. తొలుత నితీశ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత సన్వీర్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్లు పట్టి హైలైటయ్యారు.సన్వీర్ సూపర్ క్యాచ్భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సన్వీర్ మిడ్ ఆన్ దిశగా ముందుకు పరిగెడుతూ అద్భుతమన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. సన్వీర్ క్యాచ్ పట్టిన విధానం క్లారిటీగా లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేయగా రీ ప్లేలో స్పష్టమైన క్యాచ్గా తేలింది. దీంతో బ్యాటర్ స్టోయినిస్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్యాచ్ చూసిన జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. - First Nitish Reddy.- Then Sanvir Singh.- Two Incredible Catches by these SRH's youngsters. 🤯🙌 pic.twitter.com/DHtMenorn5— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024నితీశ్ అద్భుత విన్యాసంసన్వీర్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు ముందు నితీశ్ కుమార్ రెడ్డి కూడా సూపర్ క్యాచ్ పట్టాడు. భువీ బౌలింగ్లోనే నితీశ్ బౌండరీ లైన్ వద్ద చూడచక్కని క్యాచ్ అందుకున్నాడు. సిక్సర్కు వెళ్లాల్సిన బంతిని నితీశ్ అద్భుతంగా బ్యాలెన్స్ చేసి తన జట్టుకు 6 పరుగులు ఆదా చేయడంతో పాటు కీలకమైన డికాక్ను పెవిలియన్కు సాగనంపాడు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఆటగాళ్లు మైదానంలో చాలా చురుగ్గా కదులుతున్నారు. బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో.. భువీ దెబ్బకు (3-0-7-2) 9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. డికాక్ (2), స్టోయినిస్ (3) పెవిలియన్కు చేరగా.. రాహుల్ (22), కృనాల్ (21) క్రీజ్లో ఉన్నారు. -
SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
సొంతగడ్డపై.. టీ20 మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఆఖరి బంతికి ఒక్క పరుగు తేడాతో గెలిస్తే ఆ కిక్కే వేరు.. సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, అభిమానులు గురువారం నాటి మ్యాచ్లో ఈ మధురానుభూతిని చవిచూశారు.ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసి.. పటిష్ట రాజస్తాన్ రాయల్స్పై రైజర్స్ను గెలుపు తీరాలకు చేర్చడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆటగాళ్లు, ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్రాంఛైజీ సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. #TATAIPL Matches 📂↳ Last Ball Thrillers 📂Bhuvneshwar Kumar wins it for @SunRisers 👌👏Recap the Match on @StarSportsIndia and @JioCinema 💻📱#SRHvRR pic.twitter.com/mHdbR2K3SH— IndianPremierLeague (@IPL) May 2, 2024 ‘‘హేయ్.. మేమే గెలిచాం’’ అన్నట్లుగా సంతోషం పట్టలేక గాల్లోకి ఎగిరి దుముకుతూ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నారు కావ్యా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.అగ్ర స్థానంలోనే రాజస్తాన్కాగా ఐపీఎల్-2024లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ రాయల్స్కు సన్రైజర్స్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఉప్పల్లో గురువారం జరిగిన మ్యాచ్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రైజర్స్ గట్టెక్కింది. Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 తద్వారా వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. రైజర్స్ చేతిలో పరాభవం ఎదురైనా రాజస్తాన్ అగ్రస్థానానికి వచ్చిన చిక్కేమీ లేదు. ఇప్పటికే 8 విజయాలు సాధించిన సంజూ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో అందరి కంటే ముందే ఉంది.సన్రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఉప్పల్, హైదరాబాద్👉టాస్: సన్రైజర్స్- బ్యాటింగ్👉హైదరాబాద్ స్కోరు: 201/3 (20)👉రాజస్తాన్ స్కోరు: 200/7 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్పై సన్రైజర్స్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: భువనేశ్వర్ కుమార్(3/41)👉టాప్ స్కోరర్లు: నితీశ్ రెడ్డి(సన్రైజర్స్- 42 బంతుల్లో 76 రన్స్- నాటౌట్)👉రియాన్ పరాగ్ (రాజస్తాన్- 49 బంతుల్లో 77 పరుగులు).చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్ ప్రశంసలు -
SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్
సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఆఖరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరు అసలైన టీ20 మజాను అందించింది.ఈ హోరాహోరీ పోరులో రాయల్స్పై సన్రైజర్స్ పైచేయి సాధించి సొంతగడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.ఇక గత రెండు మ్యాచ్లలో పరాజయాలు చవిచూసి ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం హర్షం వ్యక్తం చేశాడు.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదేటేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్పై సన్రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై కమిన్స్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్ ఇది.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆఖరి బంతిని సంధించేపుడు భువీ తన ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు.మిడిల్ ఓవర్లలో వీలైనన్ని వికెట్లు తీసేందుకు ప్రయత్నించాం. అదృష్టవశాత్తూ ఆఖరి వరకు పోరాడగలిగాం. ఇక నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. యార్కర్లు సంధించడంలో అతడు దిట్ట.ఉప్పల్లో మేము ఇప్పటికే చాలా మ్యాచ్లు ఆడాం. కాబట్టి 200 లక్ష్యమనేది ఛేదించగలిగే టార్గెట్ అని తెలుసు. అయితే, విజయం మమ్మల్ని వరించింది.అతడొక అద్భుతం అంతేఈరోజు నితీశ్ రెడ్డి పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా ఆడాడు. అతడొక అద్భుతం అంతే! ఫీల్డింగ్లోనూ రాణిస్తున్నాడు. బౌలర్గానూ తన వంతు సేవలు అందిస్తున్నాడు’’ అంటూ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్ల ఆట తీరును ప్యాట్ కమిన్స్ కొనియాడాడు.కాగా ఉప్పల్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 58) శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి దుమ్ములేపాడు.42 బంతులు ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్ల పాటు ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు.కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ కేవలం 3 వికెట్ల నష్టపోయి 201 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ను భువీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జోస్ బట్లర్(0), వన్డౌన్లో వచ్చిన సంజూ శాంసన్(3)ను డకౌట్ చేశాడు.ఇక 40 బంతుల్లో 67 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న యశస్వి జైస్వాల్ వికెట్ను నటరాజన్ తన ఖాతాలో వేసుకోగా.. టాప్ స్కోరర్ రియాన్ పరాగ్(77)ను కమిన్స్ పెవిలియన్కు పంపాడు.నరాలు తెగే ఉత్కంఠఈ క్రమంలో చివరి 3 ఓవర్లలో రాయల్స్ విజయ సమీకరణం 27 పరుగులుగా మారగా.. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్స్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.అయితే, రైజర్స్ పేసర్లు అంతా తలకిందులు చేశారు. 18వ ఓవర్లో నటరాజన్, 19వ ఓవర్లో కమిన్స్ తలా కేవలం ఏడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. చివరి ఓవర్లో సమీకరణం 13 పరుగులు మారింది.అప్పుడు బంతిని అందుకున్న భువీ బౌలింగ్లో తొలి ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ రోవ్మన్ పావెల్ను భువీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. భువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 -
SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
సన్రైజర్స్పై 202 పరుగుల లక్ష్యఛేదనలో చివరి 3 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్కు 27 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇది సులువుగా అందుకోగలిగేదే. కానీ ఇక్కడే హైదరాబాద్ బౌలింగ్ అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. 18వ ఓవర్లో నటరాజన్ 7 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీయగా, 19వ ఓవర్లో కమిన్స్ 7 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, 5 బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా, భువనేశ్వర్ వేసిన చివరి బంతిని ఆడలేక పావెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఉప్పల్ మైదానం హోరెత్తింది. గెలిచే మ్యాచ్ను చేజేతులా రాయల్స్ కోల్పోగా, ఓటమి అంచుల నుంచి హైదరాబాద్ ఒక పరుగుతో గట్టెక్కింది. సాక్షి, హైదరాబాద్: ఉత్కంఠభరిత పోరులో చివరకు హైదరాబాద్ పైచేయి సాధించింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఒక పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (42 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77; 8 ఫోర్లు, 4 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలు చేశారు. భువనేశ్వర్కు (3/41) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నితీశ్ ధమాకా... పవర్ప్లే ముగిసేసరికి 2 వికెట్లకు 37 పరుగులు... ఈ సీజన్లో సన్రైజర్స్ చేసిన అత్యల్ప పరుగులివి. దీనిని చూస్తే రైజర్స్ 200 పరుగులకు చేరగలదని ఎవరూ ఊహించలేదు. అభిషేక్ శర్మ (12), అన్మోల్ప్రీత్ (5) విఫలం కాగా... హెడ్ అప్పటికి 17 బంతుల్లో 18 పరుగులే చేసి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. చహల్ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాది హెడ్ జోరు ప్రదర్శించగా... నితీశ్ తన బ్యాటింగ్తో ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. 10 ఓవర్ల తర్వాత స్కోరు 75 పరుగులకు చేరింది. 37 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. చహల్ వేసిన 13వ ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లతో నితీశ్ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు హెడ్ను బౌల్డ్ చేసి అవేశ్ ఈ జోడీని విడదీయగా, కొద్ది సేపటికి 30 బంతుల్లో నితీశ్ అర్ధసెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆఖరి 5 ఓవర్లలో రైజర్స్ బ్యాటర్లు నితీశ్, క్లాసెన్ మరింత చెలరేగడంతో 70 పరుగులు వచ్చాయి. అశ్విన్ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు కొట్టిన నితీశ్... అవేశ్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. మరోవైపు చహల్ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదిన క్లాసెన్... చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టి స్కోరును 200 పరుగులు దాటించాడు. కీలక భాగస్వామ్యం... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే రెండో బంతికి బట్లర్ (0), ఐదో బంతికి సామ్సన్ (0) అవుట్... రైజర్స్ పైచేయి! కానీ 7 పరుగుల వద్ద యశస్వి ఇచ్చిన క్యాచ్ను వదిలేసిన కమిన్స్... 24 పరుగుల వద్ద పరాగ్ ఇచ్చిన క్యాచ్ను వదిలేసిన అభిషేక్... అంతే... ఆట రాజస్తాన్ వైపు మొగ్గింది. 1 పరుగు వద్దే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత యశస్వి, పరాగ్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. వికెట్లు పడినా వీరిద్దరు ధాటిగా ఆడి పరుగులు రాబట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఇద్దరూ బ్యాటర్లు రైజర్స్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. ఒకే ఓవర్లో యశస్వి 30 బంతుల్లో, ఆ తర్వాత 31 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే విజయం వైపు దూసుకుపోతున్న దశలో వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది. ఆ తర్వాత కీలక సమయాల్లో మరో మూడు వికెట్లు చేజార్చుకున్న రాయల్స్ ఓటమిని ఆహా్వనించింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) అవేశ్ 58; అభిషేక్ (సి) జురేల్ (బి) అవేశ్ 12; అన్మోల్ప్రీత్ (సి) యశస్వి (బి) సందీప్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 76; క్లాసెన్ (నాటౌట్) 42; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–25, 2–35, 3–131. బౌలింగ్: బౌల్ట్ 4–0–33–0, అశి్వన్ 4–0–36–0, అవేశ్ 4–0–39–2, సందీప్ శర్మ 4–0–31–1, చహల్ 4–0–62–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) నటరాజన్ 67; బట్లర్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సామ్సన్ (బి) భువనేశ్వర్ 0; పరాగ్ (సి) జాన్సెన్ (బి) కమిన్స్ 77; హెట్మైర్ (సి) జాన్సెన్ (బి) నటరాజన్ 13; పావెల్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 27; జురేల్ (సి) అభిõÙక్ (బి) కమిన్స్ 1; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–135, 4–159, 5–181, 6–182, 7–200. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–41–3, జాన్సెన్ 4–0–44–0, కమిన్స్ 4–0–34–2, నటరాజన్ 4–0–35–2, ఉనాద్కట్ 2–0–23–0, నితీశ్ కుమార్ రెడ్డి 1–0–12–0, షహబాజ్ 1–0–11–0. ఐపీఎల్లో నేడుముంబై X కోల్కతావేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన నితీశ్ రెడ్డి.. ఐపీఎల్లోనే తొలి ఆటగాడిగా
సన్రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఘనత సాధించాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచి అరుదైన రికార్డు నమోదు చేశాడు. కాగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు సాగిన హోరాహోరీ పోరులో కేవలం రెండు పరుగుల తేడాతో రైజర్స్ జయకేతనం ఎగురవేసింది. A Fantastic Finish 🔥 Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛 Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌 Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI — IndianPremierLeague (@IPL) April 9, 2024 టాపార్డర్ విఫలమైనా సొంత మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్కు శుభారంభమే లభించింది. ట్రవిస్ హెడ్(21), డేంజరస్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(16), ఐడెన్ మార్క్రమ్(0)లను త్వరగానే పెవిలియన్కు పంపి.. సన్రైజర్స్ టాపార్డర్ను దెబ్బకొట్టింది. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రాహుల్ త్రిపాఠి(11) ఏమాత్రం ప్రభావం చూపకపోగా.. నాలుగో నంబర్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి పట్టుదలగా నిలబడ్డాడు. విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్(9) కూడా తక్కువ స్కోరుకే పరిమితం కాగా.. అబ్దుల్ సమద్తో కలిసి నితీశ్ దూకుడు పెంచాడు. ప్రత్యర్థి బౌలర్లపై నితీశ్, సమద్ ఎదురుదాడి ధనాధన్ ఇన్నింగ్స్తో వీరిద్దరూ కలిసి కేవలం 19 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. నితీశ్ (37 బంతుల్లో 64), సమద్ (12 బంతుల్లో 25) ఇన్నింగ్స్ కారణంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ టాపార్డర్ను కుప్పకూల్చిన సన్రైజర్స్ పేసర్లు.. ఆ తర్వాత బ్యాటర్లకు పరుగులు చేసే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఆఖరి వరకు మ్యాచ్ సాగగా.. ఫైనల్గా రెండు పరుగులతో గెలిచి సన్రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్లో అరుదైన ఘనత రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్కుమార్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నటరాజన్, జయదేవ్ ఉనాద్కట్తో పాటు నితీశ్ కుమార్ కూడా ఒక వికెట్(జితేశ్ శర్మ) దక్కించుకున్నాడు. అంతేకాదు.. పంజాబ్ బ్యాటర్ ప్రభ్షిమ్రన్ సింగ్ ఇచ్చిన క్యాచ్ను కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇలా ఒక ఇన్నింగ్స్లో యాభైకి పైగా పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్, ఒక క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నితీశ్ రెడ్డి రికార్డులకెక్కాడు. తెలుగు కుర్రాడు కాగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 2003లో జన్మించిన నితీశ్ రెడ్డి బ్యాటింగ్ ఆల్రౌండర్. కుడిచేతి వాటం అయిన ఈ ఆంధ్ర ఆటగాడు.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా! ఇక ఇదే మ్యాచ్లో నితీశ్ కుమార్ రెడ్డి మరో ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్లో అర్ధ శతకం సాధించిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు. 20 ఏళ్ల 319 రోజుల వయసులో నితీశ్ ఐపీఎల్ ఫిఫ్టీ సాధించగా.. ప్రియం గార్గ్ 19 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ ఘనత సాధించి అతడి కంటే ముందు వరుసలో ఉన్నాడు. చదవండి: T20 WC: హార్దిక్, రాహుల్కు నో ఛాన్స్.. ఆ ముగ్గురూ ఫిక్స్! A special counter attacking innings from Nitish Kumar Reddy 🙌 He is leading #SRH's fightback with some glorious shots 👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/6SFysFcqKz — IndianPremierLeague (@IPL) April 9, 2024 -
సన్రైజర్స్కు ఇది కొత్తేం కాదు.. పంజాబ్ కింగ్స్కు కూడా!
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించనడంలో సందేహం లేదు. ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠ కలిగించిన ఈ మ్యాచ్లో ఎట్టకేలకు సన్రైజర్స్ జయభేరి మోగించింది. కేవలం రెండు పరుగుల తేడాతో గెలుపొంది సీజన్లో మూడో విజయం అందుకుంది. మరోవైపు.. సొంతగడ్డపై ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఇలా ఆఖరి వరకు ఊరించి ఓడిపోవడం పంజాబ్ కింగ్స్కు కొత్తేం కాదు. అలాగే సన్రైజర్స్ కూడా ఆఖరి వరకు అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ కలిగించి విజయబావుటా ఎగురువేయడం అలవాటేనని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ రెండు జట్లలో సన్రైజర్స్ 2016లో టైటిల్ విజేతగా నిలవగా.. పంజాబ్ కింగ్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. ఐపీఎల్ చరిత్రలో విజయానికి అత్యంత చేరువగా వచ్చి పంజాబ్ కింగ్స్ ఓడిన సందర్భాలు(పరుగుల పరంగా) ►2016- మొహాలీ- ఆర్సీబీతో మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఓటమి ►2020- అబుదాబి- కేకేఆర్తో మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో ఓటమి ►2021- దుబాయ్- రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో ఓటమి ►2024- ముల్లన్పూర్-సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో ఓటమి ఐపీఎల్ చరిత్రలో ఆఖరి వరకు ఊరించి పరుగుల పరంగా స్వల్ప తేడాతో సన్రైజర్స్ గెలిచిన సందర్భాలు ►2024- ముల్లన్పూర్- పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో విజయం ►2022- ముంబై- ముంబై ఇండియన్స్పై మూడు పరుగుల తేడాతో విజయం ►2014- దుబాయ్- ఢిల్లీ క్యాపిటల్స్పై నాలుగు పరుగుల తేడాతో విజయం ►2016- వైజాగ్- రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్పై నాలుగు పరుగుల తేడాతో విజయం ►2021- అబుదాబి- ఆర్సీబీపై నాలుగు పరుగుల తేడాతో విజయం. మ్యాచ్ విషయానికొస్తే... PBKS vs SRH Scores ►వేదిక: ముల్లన్పూర్.. చండీగఢ్ ►టాస్: పంజాబ్ కింగ్స్.. బౌలింగ్ ►సన్రైజర్స్ స్కోరు: 182/9 (20) ►టాప్ స్కోరర్: నితీశ్ కుమార్ రెడ్డి: 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 64 పరుగులు ►పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ సూపర్ స్పెల్: 4/29 ►పంజాబ్ కింగ్స్ స్కోరు: 180/6 (20) ►ఫలితం: రెండు పరుగులు తేడాతో సన్రైజర్స్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నితీశ్ కుమార్ రెడ్డి(64 రన్స్తో పాటు ఒక వికెట్) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); A Fantastic Finish 🔥 Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛 Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌 Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI — IndianPremierLeague (@IPL) April 9, 2024 -
నరాలు తెగే ఉత్కంఠ: ఆఖరి ఓవర్లో ‘భయపెట్టిన’ ఉనాద్కట్! వీడియో
ఆఖరి ఓవర్.. మ్యాచ్ గెలవాలంటే ఆరు బంతుల్లో 29 పరుగులు కావాలి.. ఇదీ సమీకరణం.. ఇంతలో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు బౌలర్.. విజయావకాశం మీకే అన్నట్లుగా.. మొదటి బంతికే సిక్సర్.. ఆ తర్వాత వైడ్.. మళ్లీ వైడ్.. ఇప్పుడు గెలుపు సమీకరణం ఐదు బంతుల్లో 21 పరుగులు... ఫీల్డర్ తప్పిదం కారణంగా మళ్లీ సిక్సర్.. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు... ఫలితంగా గెలుపు సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులు... ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు.. మిగిలినవి ఆఖరి రెండు బంతులు.. ఇందులో మొదటిది వైడ్... రెండో బంతికి ఒక్క పరుగు.. ఇప్పటిదాకా డ్రామా నడిపించిన బ్యాటర్ కథ అప్పుడే ముగిసిపోవాల్సింది.. కానీ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అతడు బతికిపోయాడు. గెలవడానికి ఒక్క బంతికి తొమ్మిది పరుగులు కావాలి.. ఏమో మళ్లీ వైడ్ బాల్స్ పడతాయేమోనన్న ఉత్కంఠ.. కానీ ఈసారి అలా జరుగలేదు.. ఆఖరి బంతికి సిక్స్ బాదడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెండు పరుగుల తేడాతో ప్రత్యర్థి విజయం సాధించింది. A Fantastic Finish 🔥 Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛 Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌 Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI — IndianPremierLeague (@IPL) April 9, 2024 ఓడిపోతామేమో.. భయపెట్టిన ఉనాద్కట్.. ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ మధ్య ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన ఈ హోరాహోరీ పోరులో విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. ఆఖరి ఓవర్లో రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. జయదేవ్ ఉనాద్కట్ చేతికి బంతినివ్వగా.. పంజాబ్ బ్యాటర్ అశుతోశ్ శర్మ వరుసగా.. 6, వైడ్, వైడ్, 6, 2, 2, వైడ్, 1.. ఇలా 20 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి శశాంక్ సింగ్ సిక్స్ బాది స్కోరుకు మరో ఆరు పరుగులు జత చేశాడు. మధ్యలో రాహుల్ త్రిపాఠి ఓసారి క్యాచ్ జారవిడిచాడు. ఇలా సన్రైజర్స్ బౌలర్, ఫీల్డర్ తప్పిదాలు చేసినా ఆఖరికి విజయం వారినే వరించింది. ఫలితంగా తాజా ఎడిషన్లో హైదరాబాద్ జట్టు ఖాతాలో మూడో గెలుపు చేరింది. అదరగొట్టిన నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్ కాగా ముల్లన్పూర్లో మంగళవారం జరిగిన పంజాబ్- సన్రైజర్స్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేపింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 64), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 189 రన్స్ స్కోరు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడిన పంజాబ్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ధనాధన్ ఇన్నింగ్స్తో పాటు ఒక వికెట్ తీసిన నితీశ్ రెడ్డిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక అభిమానులకు అసలైన టీ20 మజా అందించిన పంజాబ్- సన్రైజర్స్ ఆఖరి ఓవర్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. So close, yet so far for Shashank and #PBKS 💔#IPLonJioCinema #TATAIPL #PBKSvSRH pic.twitter.com/F51V0OzroY — JioCinema (@JioCinema) April 9, 2024 -
వైజాగ్ కుర్రాడి మెరుపు ప్రదర్శనతో సన్రైజర్స్ విజయం (ఫొటోలు)