-
బంగ్లాదేశ్ పర్యటనకు భారత టీ20 జట్టు ప్రకటన
ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ పర్యటన కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (ఏప్రిల్ 15) ప్రకటించారు. ఈ పర్యటనలో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును భారత సెలెక్టర్లు నిన్న వెల్లడించారు. ఈ జట్టుకు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధన వ్యవహరించనున్నారు. ఈ సిరీస్కు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ దూరంగా ఉండనుండగా.. కేరళ అమ్మాయిలు ఆశా శోభన, సజనా సజీవన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. శోభన 2024 డబ్ల్యూపీఎల్లో ఛాంపియన్ ఆర్సీబీ తరఫున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలువగా.. సజనా గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటింది. బంగ్లా సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మిన్ను మణి, మన్నత్ కశ్యప్కు చోటు దక్కకపోగా.. డి హేమలత, రాధా యాదవ్ చాలాకాలం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే టీ20 వరల్డ్కప్కు ముందు టీమిండియా ఆడబోయే అతి పెద్ద టీ20 సిరీస్ ఇదే కావడంతో ఈ సిరీస్కు ప్రాధాన్యత సంతరించుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దయాళన్ హేమలత, సజన సజీవన్, రిచా ఘోష్ (వికెట్కీపర్), యాస్తికా భాటియా (వికెట్కీపర్), రాధా యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ , ఆశా శోభనా, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ వివరాలు.. ఏప్రిల్ 28- తొలి టీ20 (సిల్హెట్) ఏప్రిల్ 30- రెండో టీ20 (సిల్హెట్) మే 2- మూడో టీ20 (సిల్హెట్) మే 6- నాలుగో టీ20 (సిల్హెట్) మే 9- ఐదో టీ20 (సిల్హెట్) -
ICC Under 19 World Cup: ఆరో టైటిల్ లక్ష్యంగా...
రాబోయే క్రికెట్లో కాబోయే స్టార్లు అయ్యేందుకు అండర్–19 వన్డే ప్రపంచకప్కు మించిన టోర్నీ ఏదీ లేదు. అంతర్జాతీయ కెరీర్కు కచి్చతంగా సోపానమయ్యే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు కుర్రాళ్లంతా సై అంటే సై అంటున్నారు. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఐదుసార్లు విజేత అయిన భారత జట్టు ఆరో టైటిల్ లక్ష్యంగా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. బ్లూమ్ఫొంటెన్ (దక్షిణాఫ్రికా): గతంలో యువరాజ్ సింగ్ (2000–ప్రపంచకప్)... ప్రస్తుతం రోహిత్ శర్మ (2006), కోహ్లి (2008)... ఇకపై ఇషాన్ కిషన్ (2016), గిల్ (2018) భారత క్రికెట్ చరిత్రలో బంగారు బాట వేసుకున్నారు. వీళ్లంతా అండర్–19 ప్రపంచకప్ నుంచి వెలుగులోకి వచి్చనవారే! వీళ్లే కాదు... మనీశ్ పాండే, ఉన్ముక్త్ చంద్, యశ్ ధుల్, మన్జోత్ కల్రా, కమలేశ్ నాగర్కోటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. క్రికెట్ క్రేజీ భారత్ను మరో స్థాయిలో నిలబెట్టారు. అందువల్లే భారత్ కుర్రాళ్ల మెగా ఈవెంట్లో ఎప్పటికప్పుడు హాట్ ఫేవరెట్గా ఉంది. ఇప్పుడు కూడా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో సఫారీలో ఆరో ప్రపంచకప్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్ను శనివారం బంగ్లాదేశ్తో ఆడనుంది. భారత్ మిగతా రెండు లీగ్ మ్యాచ్లను ఈనెల 25న ఐర్లాండ్తో, 28న అమెరికాతో ఆడుతుంది. ఇదీ ఫార్మాట్... ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో ఉన్నాయి. వీటిని నాలుగు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మూడు లీగ్ మ్యాచ్లను ఆడుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు గ్రూప్ దశలో 24 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఓ రోజు విశ్రాంతి అనంతరం 30 నుంచి ‘సూపర్ సిక్స్’ దశ పోరు ఉంటుంది. అనంతరం ఫిబ్రవరి 6, 8 తేదీల్లో రెండు సెమీఫైనల్ పోటీలు జరుగుతాయి. టైటిల్ పోరు 11న జరుగనుంది. -
కోహ్లి సెంచరీపై పుజారా సంచలన వ్యాఖ్యలు! రాహుల్ ఎందుకలా? జట్టుకు నష్టం..
ICC ODI WC 2023- Kohli 78th Century: సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023.. బంగ్లాదేశ్తో పుణెలో మ్యాచ్.. లక్ష్య ఛేదనలో టీమిండియా జోరు చూస్తే గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవు. రన్మెషీన్ విరాట్ కోహ్లి సెంచరీ సెంచరీలకు మరో ముందడుగు పడే అవకాశం.. ఛేజింగ్లో 36 ఓవర్ల తర్వాత జట్టు విజయానికి 48 పరుగులు కావాల్సి ఉండగా... కోహ్లి అప్పటికి 68 పరుగుల వద్ద ఉన్నాడు. తర్వాతి ఓవర్లో కేఎల్ రాహుల్ 6, 4 సహా 12 పరుగులు చేయడంతో ఈ అంతరం మరింత తగ్గింది. మరుసటి ఓవర్ తర్వాత టీమిండియా గెలవాలంటే 28 పరుగులు, కోహ్లి సెంచరీకి 27 పరుగులు కావాలి. ఇద్దరు ప్రధాన బ్యాటర్లు క్రీజ్లో ఉంటే ఒక్కడే పరుగులు చేయడం దాదాపుగా జరగదు. కానీ తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉండటంతో సమస్య లేదు కాబట్టి ఈ దశలో కోహ్లి శతకం పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించాడు. అతడి ఆలోచనకు తగ్గట్లుగా రాహుల్ కూడా పరుగులు చేయకుండా వెనక్కి తగ్గాడు. సింగిల్స్ తీసే అవకాశమున్నా కోహ్లి- రాహుల్ పరస్పర సమన్వయంతో ముందుకు సాగారు. ఫలితంగా కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో 78వ శతకం సాధ్యమైంది. తర్వాతి 32 పరుగుల్లో కోహ్లి ఒక్కడే 30 పరుగులు సాధించగా రాహుల్ సింగిల్ మాత్రమే తీశాడు. మరో పరుగు వైడ్ రూపంలో వచ్చింది. నసుమ్ వేసిన ఫుల్టాస్ బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది విరాట్ కోహ్లి శతక(103- నాటౌట్) గర్జన చేశాడు. ఫ్యాన్స్ సంబరాలు.. మరోవైపు విమర్శలు దీంతో కింగ్ కోహ్లి అభిమానులతో పాటు.. క్రికెట్ ప్రేమికులంతా సంబరాల్లో మునిగిపోయారు. అయితే, రాహుల్ కోహ్లికి సహకరించిన తీరు, వైడ్ విషయంలో అంపైర్ వ్యవహరించిన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. కోహ్లి స్వార్థంగా వ్యవహరించాడని కొందరు.. అంపైర్ కావాలనే టీమిండియా బ్యాటర్కు సహకరించాడని మరి కొందరు విమర్శలు గుప్పించారు. కోహ్లి సెంచరీ చేసిన తీరును తప్పుబట్టిన పుజారా ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు, వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా భిన్నంగా స్పందించాడు. వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించే కంటే.. జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయాలంటూ కోహ్లి తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘విరాట్ కోహ్లి శతకం సాధించాలని నేనెంతగా కోరుకున్నానో.. వీలైనంత త్వరగా లక్ష్యాన్ని ఛేదించాలని కూడా అంతగా కోరుకున్నాను. ఎందుకంటే.. ఇలాంటి మెగా టోర్నీల్లో నెట్ రన్రేటు ఎంతో కీలకం. జట్టు గురించి కూడా ఆలోచించాలి.. త్యాగం చేయాలి అగ్రస్థానంలో నిలవాలంటే... నెట్ రన్రేటు కోసం మనం పోరాడాల్సిన స్థితిలో ఉన్నాం. అలాంటపుడు జట్టు గురించే మనం మొదట ఆలోచించాలి. పరస్పర అవగాహనతోనే ఇలా జరిగి ఉండొచ్చు. అయితే, ఒక్కోసారి జట్టు కోసం మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మన కెరీర్లో ఓ మైలురాయిని అందుకునేందుకు జట్టు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదు. మైండ్సెట్ను బట్టే ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్న హక్కు ఆటగాడిగా మనకు ఉంటుంది. అయితే, కొంతమంది తాము ఈ మ్యాచ్లో సెంచరీ చేస్తే తదుపరి మ్యాచ్కు ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇదంతా కేవలం ఆటగాడి మైండ్సెట్పై మాత్రమే ఆధారపడి ఉంటుంది’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో ఛతేశ్వర్ పుజారా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తనకైతే బంగ్లాదేశ్తో మ్యాచ్లో కోహ్లి సెంచరీ కంటే నెట్ రన్రేటు పెంచుకోవడమే ముఖ్యమైనదిగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆటగాళ్ల మైలురాళ్ల కోసం చూస్తే ఒక్కోసారి జట్టు నష్టపోవాల్సి వస్తుందని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లిని ఉద్దేశించి పుజారా చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కింగ్ కోహ్లి ఫ్యాన్స్ అయితే.. ‘‘జట్టు ప్రయోజనాల గురించి విరాట్కు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ పుజ్జీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్పై విజయంతో వరల్డ్కప్-2023లో టీమిండియా వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసినప్పటికీ.. న్యూజిలాండ్(4 విజయాలు) కంటే రన్రేటు పరంగా వెనుకబడటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి View this post on Instagram A post shared by ICC (@icc) -
బంగ్లాతో మ్యాచ్లో అతడిని ఎందుకు ఆడించారు? భారత జట్టు మేనెజ్మెంట్పై గవాస్కర్ ఫైర్
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లోనూ రెండు కీలక వికెట్లు పడగొట్టి తన మార్క్ను చూపించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 4 మ్యాచ్లు ఆడిన బుమ్రా.. 10 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రాను ఆడించాడన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. సూపర్ ఫామ్లో ఉన్న న్యూజిలాండ్తో మ్యాచ్కు ముందు బుమ్రాకి విశ్రాంతి ఇచ్చి ఉంటే బాగుండేది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో టీమిండియా తాడోపేడో తెల్చుకోనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్లో గవాస్కర్ మాట్లాడుతూ.. గత రెండు మ్యాచ్ల నుంచి భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. ఒకట్రెండు రోజుల్లో న్యూజిలాండ్ వంటి పెద్ద జట్టుతో టీమిండియా ఆడనుంది. కాబట్టి బంగ్లాతో మ్యాచ్కు బుమ్రాకి విశ్రాంతి ఇచ్చి ఉండాల్సింది. అయితే భారత జట్టుకు బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు మూడు రోజుల విశ్రాంతి లభించింది. బహుశా అది సరిపోతుందని జట్టు మేనెజ్మెంట్ భావించి వుండవచ్చు. కానీ బుమ్రా గాయం నుంచి కోలుకుని వచ్చాడు కాబట్టి మరింత విశ్రాంతి అవసరమని" పేర్కొన్నాడు. కాగా కివీస్తో మ్యాచ్కు భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. చదవండి: ODI WC 2023 IND Vs BAN: కొంచెం కూడా ఓపిక లేదు.. అలా వికెట్లు పారేసుకుంటే ఎలా?: యువ బ్యాటర్లపై భారత దిగ్గజం ఫైర్ -
కొంచెం కూడా ఓపిక లేదు.. అలా వికెట్లు పారేసుకుంటే ఎలా?: టీమిండియా దిగ్గజం
ICC ODI WC 2023- Virat Kohli: టీమిండియా యువ బ్యాటర్లు శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ల ఆట తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుని భారీ స్కోర్లు చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారని విమర్శించాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్కు క్రీజులో నిలబడే ఓపిక ఉండటం లేదని.. విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ యువ ప్లేయర్కు చురకలు అంటించాడు. అయ్యర్తో పోలిస్తే గిల్ కాస్త నయమేనని.. అయితే, ఇలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో ఫిఫ్టీలను సెంచరీలుగా మార్చడంపై మరింత దృష్టి సారించాలని గావస్కర్ సూచించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వన్డే ప్రపంచకప్-2023లో పుణె వేదికగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్కప్ తాజా ఎడిషన్లో వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రన్మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో 78వ సెంచరీ నమోదు చేశాడు. క్రీజులో నిలదొక్కుకుని ఓపికగా ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ తన వ్యక్తిగత స్కోరు పెంచుకోవడంతో పాటు.. జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. సిక్స్తో విజయలాంఛనం పూర్తి చేసి వన్డేల్లో 48వ శతకం పూర్తి చేసుకుని పలు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా తర్వాత వేగం పెంచి 53 పరుగులతో రాణించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే, బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇవ్వడంతో గిల్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక గిల్ ఫర్వాలేదనిపించినా.. అయ్యర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. మరో ఎండ్లో కోహ్లి తన అనుభవాన్ని రంగరించి అద్భుతంగా ముందుకు సాగుతున్న వేళ.. శ్రేయస్ అయ్యర్ మాత్రం 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ నాలుగో నెంబర్ బ్యాటర్ కూడా మిరాజ్ చేతికే చిక్కి చెత్త షాట్ సెలక్షన్తో వికెట్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్కు ఓపిక లేదు. 19 పరుగుల వద్ద ఉన్నపుడు తన వికెట్ పారేసుకున్నాడు. ఇక శుబ్మన్ గిల్ ఫిఫ్టీ(53) పూర్తి చేసుకున్న తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. ఇలాంటి టోర్నీల్లో సెంచరీ ఎలా చేయాలో అయ్యర్, గిల్ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే, గిల్ ఇటీవల సెంచరీలు సాధించి ఫామ్లోనే కనిపిస్తున్నాడు. కానీ.. శ్రేయస్ అయ్యర్ నుంచి మంచి ఇన్నింగ్స్ కరువైంది. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో వచ్చిన ఆటగాడికి అప్పటికే పిచ్ గురించి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. నిజానికి నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేయడం ఒకరకంగా సువర్ణావకాశం లాంటిదే. పరిస్థితులను అర్థం చేసుకుని ముందు సాగాలే తప్ప సహనం కోల్పోతే ఇలాగే వికెట్ పారేసుకోవాల్సి వస్తుంది’’ అని అయ్యర్ ఆట తీరును విమర్శించాడు. ఇక శతకాల వీరుడు కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఎప్పుడూ ఇలా నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నది లేదు. జాగ్రత్తగా ఆడటం అతడికి అలవాటు. ప్రతిఒక్క క్రికెటర్కు ఉండాల్సిన లక్షణం ఇదే. 70-80 పరుగుల వద్ద ఉన్నపుడు సెంచరీ ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ముందుకు సాగుతాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం సహా అనుకున్నది సాధించడం కోసం ఓపికగా ఎదురుచూస్తాడు. ప్రతిరోజూ.. ప్రతి మ్యాచ్లోనూ సెంచరీ చేసే అవకాశం రాదు కదా!’’ అని గావస్కర్.. కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి -
WC 2023: టీమిండియాకు షాక్! బీసీసీఐ కీలక ప్రకటన.. వైస్ కెప్టెన్ అవుట్.. ఇక
BCCI Medical Update On Hardik Pandya- ICC ODI WC 2023: వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు షాక్ తగిలింది. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో అతడికి పరీక్షలు నిర్వహించారు. పాండ్యాకు విశ్రాంతి అవసరం ఈ క్రమంలో స్కానింగ్ రిపోర్టులు పరిశీలించిన అనంతరం హార్దిక్ పాండ్యాకు కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో టీమిండియా మ్యాచ్కు ఈ స్టార్ ఆల్రౌండర్ దూరం కానున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సూచన మేరకు హార్దిక్ పాండ్యా రెస్ట్ తీసుకోనున్నాడని.. జట్టుతో కలిసి అతడు ధర్మశాలకు పయనం కావడం లేదని తెలిపింది. న్యూజిలాండ్తో మ్యాచ్కు పాండ్యా దూరం: బీసీసీఐ అదే విధంగా.. కివీస్తో మ్యాచ్కు దూరమైనప్పటికీ.. ఇంగ్లండ్తో మ్యాచ్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇంగ్లండ్(అక్టోబరు 29)తో మ్యాచ్ కోసం పాండ్యా నేరుగా లక్నోకు చేరుకుని జట్టుతో కలుస్తున్నాడని బీసీసీఐ వెల్లడించింది. కాగా పుణెలో గురువారం బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో పాండ్యా బౌలింగ్కు వచ్చాడు. బంతిని ఆపబోయి కిందపడ్డ పాండ్యా ఈ క్రమంలో పాండ్యా వేసిన మొదటి రెండు బంతుల్లో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ వరుసగా 0,4 పరుగులు రాబట్టగా.. మూడో బంతిని సైతం బౌండరీకి తరలించేందుకు స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఈ బంతిని ఆపేందుకు తన కుడికాలిని అడ్డుపెట్టిన పాండ్యా.. పట్టుతప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు. ఆరేళ్ల తర్వాత తొలిసారి బౌలింగ్ చేసిన కోహ్లి ఈ నేపథ్యంలో మడిమకు దెబ్బ బలంగా తాకడంతో పాండ్యా నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో అతడిని స్కానింగ్ కోసం పంపించగా.. గాయం తీవ్రంగానే ఉన్నట్లు తేలింది. ఈ నేప్యథంలో పాండ్యా మళ్లీ మైదానంలోకి రాలేదు. ఇక అసంపూర్తిగా పాండ్యా వదిలేసిన ఓవర్ను విరాట్ కోహ్లి పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) టీమిండియా- కివీస్ 4/4.. ఇక హోరాహోరీ ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో కోహ్లి అద్భుత అజేయ సెంచరీ(103)తో టీమిండియా బంగ్లా మీద ఘన విజయం సాధించింది. వరుసగా నాలుగో గెలుపు అందుకుంది. ఇక తదుపరి మ్యాచ్లో ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో టీమిండియా అక్టోబరు 22(ఆదివారం)న తలపడనుంది. కాగా న్యూజిలాండ్ సైతం వరల్డ్కప్ తాజా ఎడిషన్లో ఓటమన్నదే ఎరుగక వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా- కివీస్ మధ్య పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం ఆదివారం హోరాహోరీ ఖాయమనిపిస్తోంది. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: ఒకేరోజు కోహ్లి- రోహిత్ సరికొత్త చరిత్ర.. లారా, ఏబీడీ రికార్డులు బ్రేక్
ICC ODI WC 2023- Virat Kohli- Rohit Sharma: వన్డే ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగ్లా విధించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ గెలుపునకు పునాది వేస్తే.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ అర్ధ శతకం(53)తో దానిని మరింత బలపరిచాడు. ఇక వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లి.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(34- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. View this post on Instagram A post shared by ICC (@icc) రోహిత్ దూకుడు.. కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ ఇలా పుణెలో బంగ్లాతో మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లను ఒత్తిడిలోకి నెడితే.. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని కోహ్లి విజయంగా మలిచి మరోసారి ఛేజింగ్ కింగ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో.. రన్మెషీన్ కోహ్లి పలు అరుదైన రికార్డులు సాధించగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ సైతం కోహ్లితో కలిసి ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్కప్ చరిత్రలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల లిస్టులో ‘విరాహిట్’ ద్వయం ఒకేరోజు(అక్టోబరు 19) టాప్-5లోకి చేరుకోవడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) లారా, ఏబీడీ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి, రోహిత్ ఈ క్రమంలో కోహ్లి, రోహిత్.. వరుసగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ను అధిగమించారు. ఈ జాబితాలో ఓవరాల్గా నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి.. భారత బ్యాటర్లలో సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో విరాట్ కోహ్లి 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్తో జట్టు విజయాన్ని ఖరారు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వన్డే వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు ►సచిన్ టెండుల్కర్(ఇండియా)- 2278 రన్స్- 44 ఇన్నింగ్స్లో ►రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 1743 రన్స్- 42 ఇన్నింగ్స్లో ►కుమార్ సంగక్కర- 1532 రన్స్- 35 ఇన్నింగ్స్లో ►విరాట్ కోహ్లి- 1286 రన్స్- 30 ఇన్నింగ్స్లో ►రోహిత్ శర్మ- 1243 రన్స్- 21 ఇన్నింగ్స్లో ►బ్రియన్ లారా- 1225 రన్స్- 33 ఇన్నింగ్స్లో ►ఏబీ డివిలియర్స్- 1207 రన్స్- 22 ఇన్నింగ్స్లో. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి View this post on Instagram A post shared by ICC (@icc) -
సెంచరీ కోసం స్వార్ధం.. కోహ్లి చేసిన దాంట్లో తప్పేముంది..?
బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతమైన సెంచరీ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ చేసినప్పటికీ విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోహ్లి సెంచరీ మార్కును చేరుకునే క్రమంలో స్ట్రయిక్ రొటేట్ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, కోహ్లి సెంచరీకి అంపైర్ రిచర్డ్ కెటిల్బొరో కూడా సహకరించాడని (వైడ్ ఇవ్వకుండా) కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో కోహ్లికి టీమిండియా మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బాసటగా నిలిచాడు. కోహ్లి చేసిన దాంట్లో తప్పేముందని కోహ్లిని ట్రోల్ చేస్తున్న వారిని ప్రశ్నించాడు. క్రికెట్ పరిజ్ఞానం లేని వాళ్లే ఈ విషయంలో కోహ్లిని నిందిస్తారని అన్నాడు. మామూలుగా సెంచరీ చేయడమంటేనే విశేషం. అలాంటిది వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలో, అందులోనూ ఛేదనలో మూడంకెల స్కోర్ను చేరుకోవడమంటే మామూలు విషయం కాదు. What is wrong in what virat did? I question ppl who don't understand cricket,note it is a huge deal to score A century in a world cup,@imVkohli deserves this & much more! kudos to a team man like @klrahul who deserved it against Aus in Chennai ! Enjoy when u still can #INDvsBAN — Kris Srikkanth (@KrisSrikkanth) October 19, 2023 అలాంటప్పుడు కోహ్లి చేసింది తప్పెలా అవుతుందని నిలదీశాడు. వాస్తవానికి కోహ్లి సాధించిన దాని గురించి పొగడాల్సింది పోయి, విమర్శలు చేయడమేంటని ప్రశ్నించాడు. ఛేదనలో ఒత్తిడికి లోనుకాకుండా, సహనం కోల్పోకుండా చివరివరకు బ్యాటింగ్ చేసినప్పుడు సెంచరీ మార్కును చేరాలనుకోవడంలో తప్పేమీ లేదని అన్నాడు. కోహ్లి ఈ సెంచరీకి వందకు వంద శాతం అర్హుడని పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లి స్వార్ధపరుడని విమర్శిస్తున్న జనాలు.. కొన్ని మ్యాచ్ల పాటు అతను సెంచరీ చేయకపోతే దుమ్మెత్తిపోయరా అని ప్రశ్నించాడు. ఇక అంపైర్ వైడ్ ఇవ్వడం, ఇవ్వకపోవడం (కోహ్లి 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు) అనేది అతని పరిధిలోని అంశమని, దీనికి కోహ్లి సెంచరీని ముడిపెట్టడం సమంజసం కాదని ట్విటర్ వేదికగా కోహ్లిని విమర్శిస్తున్న వారికి చురకలు పెట్టాడు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
కోహ్లి సెంచరీకి సాయపడ్డ అంపైర్.. క్లియర్ వైడ్బాల్ ఇవ్వకుండా..!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్ధేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లి చేసిన సెంచరీ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కోహ్లి సెంచరీకి అంపైర్ రిచర్డ్ కెటిల్బొరో సాయపడ్డాడని కోహ్లి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కోహ్లి 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా బంగ్లా బౌలర్ నసుమ్ అహ్మద్ లైగ్ సైడ్ దిశగా వైడ్బాల్ వేశాడు. ఏ తరహా క్రికెట్లో అయినా దీన్ని వైడ్బాల్ కాదనే వారు ఉండరు. Umpire doesn't give wide to virat Best moment of match. 🤣🔥🔥#INDvsBAN #ViratKohli pic.twitter.com/L621N4ciur — Saurabh Raj (@sraj57454) October 19, 2023 అయితే, కెటిల్బొరో ఈ బంతిని వైడ్బాల్గా ప్రకటించకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. బంతి లెగ్ సైడ్ దిశగా వెళ్లగానే కోహ్లి అంపైర్ వైపు దీనంగా చూశాడు. దీనికి అంపైర్ చలించిపోయాడో ఏమో కాని, మొత్తానికి వైడ్ ఇవ్వకుండా కోహ్లి సెంచరీకి పరోక్షంగా తోడ్పడ్డాడు. అనంతరం ఓ బంతిని వృధా చేసిన కోహ్లి, 42వ ఓవర్ మూడో బంతికి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి సెంచరీ మాట అటుంచితే, అతను సెంచరీ మార్కును చేరుకున్న వైనాన్ని జనాలు తప్పుపడుతున్నారు. అంతకుముందు ఓవర్లో కూడా కోహ్లి 92 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాహుల్ సింగిల్కు పిలుపునివ్వగా నిరాకరించి వ్యతిరేకులకు టార్గెట్గా మారాడు. వ్యక్తిగత మైలురాళ్లకు కోహ్లి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఈ ఒక్క ఇన్నింగ్స్ చూస్తే అర్ధమవుతుందని కోహ్లి వ్యతిరేకులు సోషల్మీడియాలో ట్రోలింగ్కు దిగారు. -
CWC 2023: హార్ధిక్ గాయంపై కీలక అప్డేట్
బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ (భారత బౌలింగ్) 8వ ఓవర్ మూడో బంతికి లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్ను ఆపబోయి హార్దిక్ కుడి కాలిని గాయపరుచుకున్నాడు. బంతి బలంగా తాకడంతో హార్దిక్ తీవ్ర అసౌకర్యానికి లోనై ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మిగిలిన ఓవర్ను కోహ్లి పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా హార్ధిక్ బరిలోకి దిగలేదు. హార్ధిక్ నొప్పితో విలవిలలాడుతుండటంతో గాయం తీవ్రతను తెలుసుకునేందుకు డాక్టర్లు స్కానింగ్కు రెఫర్ చేశారు. రిపోర్ట్లపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. 🚨 Update 🚨 Hardik Pandya's injury is being assessed at the moment and he is being taken for scans. Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #TeamIndia | #INDvBAN | #MeninBlue pic.twitter.com/wuKl75S1Lu — BCCI (@BCCI) October 19, 2023 అయితే, హార్ధిక్ గాయంపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ కీలక అప్డేట్ ఇచ్చి అభిమానులను ఊపిరిపీల్చుకునేలా చేశాడు. హార్ధిక్ గాయం తీవ్రతపై ఆందోళన చెందుతున్న అభిమానులకు రోహిత్ గుడ్న్యూస్ చెప్పాడు. హార్ధిక్ గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడు. బంతి బలంగా తాకడంతో నొప్పి అధికంగా ఉందని, త్వరలోనే అది సర్దుకుంటుందని తెలిపాడు. రోహిత్ ఇచ్చిన క్లూతో ఊపిరిపీల్చుకున్న హార్ధిక్ అభిమానులు.. తమ ఫేవరెట్ క్రికెటర్ టీమిండియా ఆడబోయే అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని నిర్ధారించుకున్నారు. ఏదిఏమైనప్పటికీ బీసీసీఐ నుంచి అప్డేట్ వస్తే తప్పించి, హార్ధిక్ విషయంలో ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. -
Virat Kohli: కలిస్ను దాటేశాడు.. ఇక మిగిలింది ముగ్గురే..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో ఆల్టైమ్ రికార్డుకు చేరువవుతున్నాడు. బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో శతక్కొట్టిన అతను.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు (212) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో కోహ్లి సౌతాఫ్రికా లెజెండ్ జాక్ కలిస్ (211) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (264) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (217), శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (216) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో కోహ్లి మరో 53 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేస్తే సచిన్ ఆల్టైమ్ రికార్డును అధిగమిస్తాడు. ఇదిలా ఉంటే, నిన్న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి ఖాతాలో మరిన్ని రికార్డులు.. ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన కోహ్లి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 48వ సెంచరీని, ఓవరాల్గా (అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో) 78వ సెంచరీని నమోదు చేసిన కోహ్లి.. తాజాగా చేసిన 103 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్లో 26000 పరుగుల మైలురాయిని (26026 పరుగులు) దాటాడు. గతంలో ఈ మైలురాయిని సచిన్ (34357), సంగక్కర (28016), పాంటింగ్ (27483) మాత్రమే దాటారు. 26000 పరుగుల మార్కును చేరుకునే క్రమంలో కోహ్లి.. జయవర్ధనేను (25957) అధిగమించాడు. 26000 పరుగుల మైలురాయిని కోహ్లి అందరికంటే తక్కువ ఇన్నింగ్స్ల్లో (567) చేరుకోవడం విశేషం. కొద్ది రోజుల కిందట కోహ్లి అత్యంత వేగంగా 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. -
అతను క్రీజ్లో ఉండివుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి: బంగ్లాదేశ్ కెప్టెన్
టీమిండియాతో నిన్న (అక్టోబర్ 19) జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మిడిలార్డర్ వైఫల్యం.. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్కు శుభారంభమే లభించినప్పటికీ, మిడిలార్డర్ విఫలం కావడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్ (51), లిటన్ దాస్ (66) అర్ధసెంచరీలతో రాణించగా.. మిడిలార్డర్ ఆటగాళ్లు షాంటో (8), మెహిది హసన్ (3), తౌహిద్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో ముష్ఫికర్ రహీం (38), మహ్మదుల్లా (46) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. మ్యాచ్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ భారత బౌలర్లు ఆ తర్వాత పుంజుకుని బంగ్లాదేశ్ను కట్టడి చేశారు. బుమ్రా, సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ను బంగ్లాదేశ్ బౌలర్లు ఎలాంటి ఇబ్బంది పెట్టలేకపోయారు. గిల్ (53), రోహిత్ (48) మెరుపు ఇన్నింగ్స్లతో శుభారంభాన్ని అందించగా.. కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డేల్లో 48వ శతకాన్ని నమోదు చేశాడు. శ్రేయస్ (19) తక్కువ స్కోర్కే ఔటైనా.. రాహుల్ (34 నాటౌట్) సూపర్ ఫామ్ను కొనసాగించాడు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 2, హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు. మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో స్పందిస్తూ.. టీమిండియాకు శుభాకాంక్షలు. ఎప్పటిలాగే వారు ఈ మ్యాచ్లోనూ మాపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. టీమిండియా సామర్థ్యం గురించి మాకు తెలుసు. వారు ఏంటో మరోసారి నిరూపించారు. ఇవాళ మేము అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాం. అందుకే ఓటమిపాలయ్యాం. లిటన్, తంజిద్ శుభారంభాన్ని అందించారు. మిడిలార్డర్ వైఫల్యమే మా కొంపముంచింది. మా బౌలర్లు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. అయితే చేయాల్సినన్ని పరుగులు చేయలేకపోవడంతో టీమిండియాను నిలువరించలేకపోయాం. లిటన్ కాసేపు క్రీజ్లో ఉండివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మొత్తంగా ఈ ఓటమికి మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యమే కారణమని చెప్పాలి. టోర్నీలో తదుపరి మ్యాచ్ల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం. షకీబ్ గాయంపై ఏమన్నాడంటే.. షకీబ్ బాగానే ఉన్నాడు. అతని గాయం అంత పెద్దదేమీ కాదు. అతను తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడు. -
మా ఫీల్డింగ్ అద్భుతం.. జట్టుగా రాణిస్తున్నాం.. ఇదే జోరు కొనసాగిస్తాం: రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. పూణే వేదికగా బంగ్లాదేశ్తో నిన్న (అక్టోబర్ 19) జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ కేవలం 41.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్, రికార్డుల రారాజు, కింగ్ కోహ్లి వన్డే కెరీర్లో 48వ శతకాన్ని సాధించి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. బంగ్లాదేశ్పై విజయానంతరం రోహిత్ ఏమన్నాడంటే.. చాలా మంచి విజయం. ఇలాంటి విజయాలనే కోరుకున్నాం. సరైన ఆరంభం లభించనప్పటికీ, మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. టోర్నీ ప్రారంభం నుంచి మా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో మా ఫీల్డర్లు మైదనంలో పాదరసంలా కదిలారు. అద్భుతమైన క్యాచ్లు అందుకున్నారు. పరిస్థితులకు అనుగణంగా ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలో మా బౌలర్లకు బాగా తెలుసు. ఈ మ్యాచ్లోనూ అదే ఆచరణలో పెట్టారు. ఇవాళ జడ్డూ బౌలింగ్ అత్యుత్తమంగా ఉంది. సూపర్ క్యాచ్ కూడా అందుకున్నాడు. కానీ కోహ్లి సెంచరీ ముందు ఇవన్ని తక్కువే. జట్టుగా రాణిస్తుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మైదానంలో అన్ని ప్రదర్శనలకు పతకం (డ్రెస్సింగ్ రూమ్ అవార్డులు) లభిండచం ఆటగాళ్లను బాగా ప్రేరేపిస్తుంది. హార్దిక్ గాయం అంత తీవ్రమైందేమీ కాదు. నొప్పితో బాధపడుతున్నాడు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి మ్యాచ్ల్లో ఎలా ముందుకు వెళ్లాలో ప్లాన్ చేస్తాము. ప్రేక్షకులు భారీ సంఖ్యలో మైదానాలకు వచ్చి మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపరుస్తున్నారు. ఈ అనుభూతి చాలా బాగుంది. ఇది మాలోని అత్యుత్తమ ప్రదర్శనలు వెలికితీయడానికి దోహదపడుతుంది. టోర్నీలో మున్ముందు కూడా ప్రేక్షకుల నుంచి ఇదే ఆశిస్తున్నాం. రాణించిన ఓపెనర్లు.. తేలిపోయిన మిడిలార్డర్ తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్కు ఓపెనర్లు తంజిద్ హసన్ (51), లిటన్ దాస్ (66) శుభారంభాన్ని అందించారు. మధ్యలో బంగ్లా బ్యాటర్లు తడబడ్డారు. ఆఖర్లో ముష్ఫికర్ రహీం (38), మహ్మదుల్లా (46) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ భారత బౌలర్లు ఆ తర్వాత పుంజుకుని బంగ్లాదేశ్ను కట్టడి చేశారు. బుమ్రా, సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. శతక్కొట్టిన కోహ్లి.. రాణించిన గిల్, హిట్మ్యాన్ 257 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్కు కూడా శుభారంభయే లభించింది. గిల్ (53), రోహిత్ (48) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్లో మరో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ (19) తక్కువ స్కోర్కే ఔటైనా.. రాహుల్ (34 నాటౌట్) తన ఫామ్ను కొనసాగించాడు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 2, హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు. -
Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి
ICC ODI WC 2023- Virat Kohli: ‘‘విజయంలో కీలక పాత్ర పోషించాలని భావించాను. జడ్డూ నుంచి ఈ అవార్డు దొంగిలించినందుకు క్షమాపణలైతే చెప్పాల్సిందే మరి! నిజానికి వరల్డ్కప్ టోర్నీల్లో నేను కొన్నిసార్లు ఫిఫ్టీలు సాధించాను. కానీ వాటిని శతకాలుగా మలచలేకపోయాను. చివరి వరకు అజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించాలనుకున్నాను. వాస్తవానికి చాలా ఏళ్లుగా జట్టు కోసం నేను చేస్తున్నది కూడా ఇదే! ఈరోజు నిజంగా నాకిది కలలాగే ఉంది. ఎదుర్కొన్న తొలి నాలుగు బంతుల్లో రెండు ఫ్రీ హిట్లు.. ఒక సిక్స్.. ఒక ఫోర్. పుణె పిచ్ చాలా బాగుంది. నా సహజశైలిలో గేమ్ ఆడేందుకు వెసులుబాటు కల్పించింది. View this post on Instagram A post shared by ICC (@icc) వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడం.. అదునుచూసి గ్యాప్స్ మధ్య బంతిని బౌండరీ దిశగా తరలించి పరుగులు రాబట్టడం.. డ్రెస్సింగ్ రూంలో వాతావరణం చాలా చాలా బాగుంది. ఆటగాళ్లంతా ఒకరి కంపెనీని మరొకరు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. అదే సమన్వయం, సహకారం మైదానంలోనూ కనిపిస్తోంది. కో- ఆర్డినేషన్తో ముందుకు వెళ్లగలుగుతున్నాం. నాకైతే ఇక్కడ హోం గ్రౌండ్లో ఆడినట్లే అనిపిస్తోంది. ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చిన మద్దతు మరువలేనిది. ఈ టోర్నీలో మేమింకా ముందుకు వెళ్లాల్సి ఉంది. ఏదేమైనా ఈరోజు ఇలా ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహి హర్షం వ్యక్తం చేశాడు. వరుసగా నాలుగో విజయం వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా పుణెలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను 256 పరుగులకు కట్టడి చేసిన భారత్.. 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 48, శుబ్మన్ గిల్ 53 పరుగులతో రాణించగా.. రన్మెషీన్ కోహ్లి సెంచరీతో చెలరేగాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 103 పరుగలతో నాటౌట్గా నిలిచాడు. రాహుల్ సహకారంతోనే సాధ్యమైంది అయితే, శతకానికి చేరువయ్యే క్రమంలో కేఎల్ రాహుల్(34- నాటౌట్) కోహ్లికి పూర్తి సహకారం అందించాడు. ఈ క్రమంలో టార్గెట్కు దగ్గరవుతున్న కొద్దీ స్ట్రైక్ రొటేట్ కాకుండా జాగ్రత్తపడిన.. కోహ్లి ఎట్టకేలకు 41.3 ఓవర్లో సిక్సర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. స్పెషల్ ఇన్నింగ్స్ అంతర్జాతీయ కెరీర్లో 78వ, వన్డేల్లో 48 శతకం నమోదు చేసి రికార్డులు బద్దలు కొట్టాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకున్న తరుణంలో కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. జడ్డూ కూడా అర్హుడే బంగ్లా ఇన్నింగ్స్లో కీలక సమయంలో కీలక వికెట్లు తీసిన రవీంద్ర జడేజా కూడా ఈ అవార్డుకు అర్హుడన్న నేపథ్యంలో అతడికి కింగ్ కోహ్లి సారీ చెప్పడం విశేషం. ఇక వరల్డ్కప్ ఛేజింగ్లో కోహ్లికి ఇదే తొలి శతకం కావడం గమనార్హం. చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యా అవుట్! బీసీసీఐ ప్రకటన View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: కింగ్ కోహ్లి సంచలన శతకం.. రోహిత్ ఏమో అలా! టీమిండియా ఘన విజయం
ICC Cricket World Cup 2023- India vs Bangladesh, 17th Match: సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన గురువారం మరో గెలుపు నమోదు చేసింది. బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించి వరుసగా నాలుగో విజయం అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 తరహా దూకుడుకు తోడు.. రన్మెషీన్ విరాట్ కోహ్లి సంచలన శతకంతో అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో 78వ సెంచరీ నమోదు చేస్తాడా అన్న ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు 103 పరుగులతో మెరిసి ఫ్యాన్స్ను ఖుషీ చేశాడు. బంగ్లా శుభారంభం చేసినా పుణె వేదికగా సాగిన మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్(66) హాఫ్ సెంచరీలతో మెరవగా.. లోయర్ ఆర్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం 38, మహ్మదుల్లా 46 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా రెండేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. టీ20 తరహాలో రోహిత్ దూకుడు ఇక శాంటో బృందం విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి ఓవర్ నుంచే దూకుడు ప్రదర్శించాడు. టీమిండియా ఇన్నింగ్స్ రెండో బంతికే ఫోర్ బాదిన హిట్మ్యాన్ మొత్తంగా 40 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. తాను కూడా తక్కువేం కాదన్న గిల్ తృటిలో అర్ధ శతకం చేజారినా క్రీజులో ఉన్నంతసేపు.. టీ20 తరహాలో పూర్తి వినోదం అందించాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ నెమ్మదిగా ఆరంభించినా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 55 బంతుల్లో 53 పరుగులు రాబట్టాడు. ఈ పంజాబీ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. రికార్డుల రారాజు కింగ్ కోహ్లి సంచలన శతకం మరోవైపు వన్డౌన్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి వన్డే కెరీర్లో 48వ అంతర్జాతీయ శతకం నమోదు చేసి.. కేఎల్ రాహుల్(34- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అద్భుత ఇన్నింగ్స్తో అజేయ సెంచరీ(103)తో జట్టును విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓవరాల్గా అంతర్జాతీయ కెరీర్లో 78వ శతకం నమోదు చేశాడు. చదవండి: #Virat Kohli: కోహ్లి సరికొత్త చరిత్ర.. జయవర్దనే రికార్డు బద్దలు! ఇక మిగిలింది ఆ ఇద్దరు.. తర్వాత View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: వదినమ్మా! పనీపాటా ఏం లేదా? ఎందుకో ఇలా?
ICC ODI WC 2023- Ind Vs Ban: వన్డే వరల్డ్కప్-2023.. గురువారం.. పుణెలో టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది.. ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్(66) శుభారంభం అందించారు. ఈ జంటను విడదీసిన భారత బౌలర్లు మిడిలార్డర్ను కోలుకోలేని దెబ్బకొట్టారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(38) తన భుజాల మీద వేసుకున్నాడు. మరో ఎండ్లో తౌహీద్ హృదోయ్ కూడా తన వంతు పోరాటం చేస్తున్నాడు. అయితే, 38వ ఓవర్ రెండో బంతికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో హృదోయ్ ఇచ్చిన క్యాచ్ను టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ ఒడిసిపట్టాడు. సింపుల్ క్యాచ్ అందుకున్న గిల్ మిడ్వికెట్ మీదుగా హృదోయ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను గిల్ అందుకోగానే.. కెమెరాలన్నీ స్టేడియంలో ఓ అమ్మాయి వైపునకు తిరిగాయి. ఆమె మరెవరో కాదు.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ గారాల కుమార్తె సారా టెండుల్కర్. కాగా గిల్, సారా సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్న క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారంటూ అప్పట్లో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. వాటిని బలపరుస్తూ తామిద్దరం డేటింగ్లో ఉన్నట్లు ఈ జంట ఎన్నోసార్లు సంకేతాలు కూడా ఇచ్చింది. గిల్- సారా బ్రేకప్ కూడా అంటూ అయితే, దేవతలతో ప్రేమలో పడకూడదంటూ గిల్ పెట్టిన పోస్టుతో వీరిద్దరు బ్రేకప్ చెప్పుకొన్నారని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్తో శుబ్మన్ గిల్ కనిపించడంతో ఆమెతో అతడి పేరును లింక్ చేసేశారు. అయినప్పటికీ సారా టెండుల్కర్ ఎక్కడ కనిపించినా గిల్ ఇష్టసఖిగా పేర్కొంటూ ఆమె ఫొటోలను వైరల్ చేయడం నెటిజన్లకు పరిపాటిగా మారింది. తాజాగా టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా బ్రాడ్కాస్టర్స్ సైతం గిల్ క్యాచ్ అందుకోగానే కెమెరాను మరోసారి సారా వైపునకు ఫోకస్ చేయడం గమనార్హం. టీమిండియాకు సపోర్టుగా సారా ఈ నేపథ్యంలో.. ‘‘వదినమ్మ సూపర్’’ అంటూ గిల్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా.. ‘‘కెమెరామెన్కు కూడా.. మీలాగే ఏం పనీపాటా లేనట్లుంది. సారా టీమిండియాకు సపోర్టుగా వచ్చింది’’ అంటూ సచిన్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. మరికొంతమందేమో.. ‘‘కెమెరాపర్సన్కి పబ్లిక్ పల్స్ బాగా తెలుసు.. అందుకే సారాను స్పెషల్గా చూపిస్తున్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 256 పరుగులు స్కోరు చేసింది. చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన Shubman Gill took a catch and cameraman show sara tendulkar 👀👀 #INDvsBAN pic.twitter.com/6dkKn3x634 — Jashan (@Jashan1705) October 19, 2023 Sara Tendulkar in the stands. pic.twitter.com/H0N5KWToiA — Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023 Sara Tendulkar is in the house😀#INDvBAN #indiavsbangladesh #Saratendulkar #ShubmanGill pic.twitter.com/HolLVxNIpK — Nikhil 🇮🇳 (@niks9326) October 19, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) Sara Tendulkar clapping after Shubman Gill's two sixes. pic.twitter.com/cGKHDUyyX4 — Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023 -
WC 2023: మహ్మదుల్లా అరుదైన ఘనత! తొలి బ్యాటర్గా రికార్డు! కానీ బుమ్రా దెబ్బకు..
ICC Cricket World Cup 2023- Ind vs Ban: వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ మహ్మదుల్లా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. 36 బంతులు ఎదుర్కొని 46 పరుగులు రాబట్టాడు. బంగ్లాదేశ్ మిడిలార్డర్ కుప్పకూలిన వేళ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(38)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 256 పరుగుల మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అదిరే ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు ఇక పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లా ఓపెనర్లు తాంజిద్ హసన్, లిటన్ దాస్ అర్ధ శతకాలతో మెరిశారు. 51 పరుగులు సాధించిన తాంజిద్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా టీమిండియా వంటి పటిష్ట జట్టు మీద.. అదీ వరల్డ్కప్ ఈవెంట్లో!! మహ్మదుల్లా సరికొత్త చరిత్ర ఇక లిటన్ దాస్(66)కు సైతం భారత జట్టు మీద వన్డేల్లో ఇదే తొలి అర్ధ శతకం. ఇలా వీరిద్దరు ఈ మ్యాచ్ను ప్రత్యేకంగా మార్చుకోగా.. ఫిఫ్టీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయినప్పటికీ మహ్మదుల్లా సరికొత్త చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా మహ్మదుల్లా రికార్డు టీమిండియాతో మ్యాచ్లో మహ్మదుల్లా ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ చరిత్రలో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా మహ్మదుల్లా రికార్డు సాధించాడు. ఇక భారత జట్టుతో గురువారం నాటి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో మహ్మదుల్లా సిక్సర్లు బాదాడు. అయితే, ఆఖరి ఓవర్ రెండో బంతికి జస్ప్రీత్ బుమ్రా అద్భుత బంతితో మహ్మదుల్లాను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది. View this post on Instagram A post shared by ICC (@icc) ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే! 1. మహ్మదుల్లా- 16 2. ముష్ఫికర్ రహీం- 13 3. షకీబ్ అల్ హసన్- 10. చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన -
WC 2023: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్కప్ హిస్టరీలో..
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా వరల్డ్కప్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్- టీమిండియాతో పుణె వేదికగా మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 27.4 ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్లో ఓపెనర్ లిటన్ దాస్(66) అవుట్ కాగా.. ముష్ఫికర్ రహీం క్రీజులోకి వచ్చాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్కు దిగిన అతడు.. 29.4 ఓవర్ వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్లో రెండు పరుగులు తీశాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా ముష్ఫికర్ రహీం కంటే ముందు ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు షకీబ్ వరల్డ్కప్ చరిత్రలో 1201 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. 42.3 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ముష్ఫికర్ రహీం 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్(42.3)లో అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఇప్పటి వరకు రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యా అవుట్! బీసీసీఐ ప్రకటన
ICC Cricket World Cup 2023- India vs Bangladesh: బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. గాయం తీవ్రతను అంచనా వేసేందుకు అతడిని స్కానింగ్ కోసం పంపించారు. వైద్య పరీక్షల అనంతరమే హార్దిక్ పాండ్యా పరిస్థితిపై అంచనాకు వచ్చే అవకాశం ఉందంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా పుణె వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడుతోంది. నిలకడగా ఆడిన బంగ్లాదేశ్ ఓపెనర్లు ఈ సందర్భంగా టాస్ గెలిచిన షాంటో బృందం తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది. ఆది నుంచే ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్ (66) నిలకడగా ఆడుతూ జట్టుకు శుభారంభం అందించారు. ఇదిలా ఉంటే.. బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. పాండ్యా బౌలింగ్లో తొలి మూడు బంతుల్లో లిటన్ దాస్ వరుసగా 0, 4, 4 బాదగా.. స్ట్రెయిట్ డ్రైవ్(రెండో బౌండరీ)ని ఆపేందుకు పాండ్యా విఫలయత్నం చేశాడు. గాయం కారణంగా.. కుడికాలితో బంతిని అడ్డుకోవాలని చూసి పట్టుతప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు. మడిమకు గాయం కావడంతో పాండ్యా మైదానం వీడాడు. దీంతో స్టార్ బ్యాటర్, రైటార్మ్ మీడియం పేసర్ విరాట్ కోహ్లి వచ్చి పాండ్యా ఓవర్ పూర్తి చేయగా.. పాండ్యాను స్కానింగ్ కోసం తీసుకువెళ్లారు. ఇక... గాయపడ్డ హార్దిక్ పాండ్యా స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్కు వచ్చాడు. పాండ్యా తిరిగి బౌలింగ్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా గనుక గాయం తీవ్రత ఎక్కువై జట్టుకు దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే! ఇక రోహిత్ సేనతో మ్యాచ్లో బంగ్లాదేశ్ 30 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. చదవండి: IPL 2024: క్రేజీ.. ఐపీఎల్-2024లో సీఎస్కేకు ఆడనున్న సంజూ? View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: ఆరేళ్ల తర్వాత తొలిసారి.. బౌలింగ్ చేసిన కోహ్లి! కారణమిదే..
వరల్డ్కప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వన్డే ఫార్మాట్లో దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి బాల్తో రంగంలోకి దిగాడు. వేసిన మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. పుణె వేదికగా టీమిండియాతో మ్యాచ్తో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ సందర్భంగా.. భారత జట్టు సారథి రోహిత్ శర్మ.. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి బంతినిచ్చాడు. ఈ క్రమంలో పాండ్యా బౌలింగ్లో తొలి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన లిటన్ దాస్ మరుసటి రెండు బంతుల్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే, రెండోసారి బౌండరీ దిశగా వెళ్తున్న బంతిని ఆపే క్రమంలో పాండ్యా తన కుడికాలిని అడ్డుపెట్టాడు. ఈ క్రమంలో పట్టుతప్పి జారిపడిపోయాడు. పాండ్యా నొప్పితో విలవిల్లాడటంతో.. ఓవర్ పూర్తి చేసేందుకు రోహిత్ శర్మ.. కోహ్లిని పిలిచాడు. ఇక పాండ్యా ఓవర్లో మిగిలిన మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు రైటార్మ్ మీడియం పేసర్ కోహ్లి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వన్డేల్లో ఆఖరిసారిగా.. 2017లో శ్రీలంకతో మ్యాచ్లో కోహ్లి బౌలింగ్ చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక వన్డే ప్రపంచకప్ ఈవెంట్ల విషయానికొనిస్తే.. 2011 క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో(0/6 (1)), ఫైనల్లో శ్రీలంకతో(0/6 (1)).. అదే విధంగా 2015 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో(0/7 (1)) మ్యాచ్లో కోహ్లి బంతితో రంగంలోకి దిగాడు. ఇదిలా ఉంటే.. టీమిండియాతో తాజా మ్యాచ్లో బంగ్లాదేశ్ 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. Virat Kohli bowling!!!! Right Arm Quick Bowler in Action 😂🔥#ViratKohli | #WorldCup2023 |#INDvsBAN |#CricketWorldCup2023 | #CricketWorldCup pic.twitter.com/mcQBxHQ3s7 — CSK ARMY 🦁 (@Bikrant51950320) October 19, 2023 -
Ind Vs Ban: కోహ్లి సెంచరీ.. బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయం
ICC Cricket World Cup 2023- India vs Bangladesh- Pune- Updates& Highlights: వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా పుణె వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన అప్డేట్లు... కోహ్లి సెంచరీ.. బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయం వన్డే వరల్డ్కప్-2023లో రోహిత్ సేన వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్లో టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీ(103)తో చెలరేగాడు. వన్డే కెరీర్లో 48వ శతకం నమోదు చేసిన జట్టును విజయతీరాలకు చేర్చాడు. స్కోరు: టీమిండియా- 261/3 (41.3) బంగ్లాదేశ్- 256/8 (50) టీమిండియా విజయ లక్ష్యం- 257 37: టీమిండియా స్కోరు: 223-3 29.1: అయ్యర్ అవుట్ శ్రేయస్ అయ్యర్(19) మూడో వికెట్గా వెనుదిరిగాడు. కోహ్లి 56, రాహుల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 178/3 (29.1). 26.6: కోహ్లి అర్ధ శతకం టీమిండియా వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 27 ఓవర్లలో టీమిండియా స్కోరు: 171-2 19.2: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా గిల్(53) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కోహ్లి 29, శ్రేయస్ అయ్యర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 133/2 (19.3) 18.1: గిల్ హాఫ్ సెంచరీ షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్లో పరుగు తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న గిల్. కోహ్లి 29, గిల్ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 130/1 (19) 17 ఓవర్లలో టీమిండియా స్కోరు: 122/1 గిల్ 47, కోహ్లి 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయ లక్ష్యం 257.. దంచికొడుతున్న గిల్.. రోహిత్ ఫిఫ్టీ మిస్ 12.4: బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిన రోహిత్ శర్మ 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్గా వెనుదిరిగాడు. హసన్ మహమూద్ బౌలింగ్లో హృదోయ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ గిల్ 40 పరుగులతో, కోహ్లి 0తో క్రీజులో ఉన్నారు. స్కోరు: 91/1 (12.4). ►పవర్ ప్లే(10 ఓవర్లు)లో టీమిండియా స్కోరు: 63-0 ►8.6: అర్ధ శతకం పూర్తి చేసుకున్న టీమిండియా రోహిత్ 33, గిల్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 50-0(9) ►ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతున్న రోహిత్ శర్మ ఆరు ఓవర్లలో టీమిండియా స్కోరు: 37-0. రోహిత్ శర్మ 5 ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 31 పరుగులతో క్రీజులో ఉన్నాడు. గిల్ 6 పరుగులతో ఆడుతున్నాడు. రాణించిన ఓపెనర్లు.. బంగ్లాదేశ్ స్కోరెంతంటే ►టీమిండియాతో మ్యాచ్లో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్(66) అర్ధ శతకాలు సాధించారు. లోయర్ ఆర్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం 38, మహ్మదుల్లా 46 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా రెండు, మహ్మద్ సిరాజ్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా రెండు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc) 46.5: సిరాజ్ బౌలింగ్లో అహ్మద్ అవుట్ మహ్మద్ సిరాజ్బౌలింగ్లో నసూం అహ్మద్(14) అవుటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. 42.3: ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ జడేజా బౌలింగ్లో ముష్ఫికర్ రహీం(38) అవుట్. 42.3 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది 37.2: ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో తౌహిద్ హృదోయ్(16) అవుట్. 37 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు: 178/4 ముష్ఫికర్ రహీం 29, హృదోయ్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. 27.4: నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజులో పాతుకుపోయిన లిటన్ దాస్ ఎట్టకేలకు అవుటయ్యాడు. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో లిటన్ దాస్ ఇచ్చిన క్యాచ్ను గిల్ అందుకోవడంతో బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు: 137/4 (27.4) 26 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు:133/3 మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 24.1: సిరాజ్ బౌలింగ్లో 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్కు క్యాచ్ ఇచ్చి మెహదీ హసన్ మిరాజ్ పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లా మూడో వికెట్ కోల్పోయింది. హృదోయ్, లిటన్ దాస్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు. 23 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 118/2 లిటన్ దాస్ 53, హసన్ మిరాజ్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. 19.6: షాంటో అవుట్ జడేజా బౌలింగ్లో నజ్ముల్ షాంటో ఎల్బీడబ్ల్యూ. 8 పరుగులకే వెనుదిరిగిన బంగ్లా కెప్టెన్. 14.4: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో తాంజిద్ హసన్(51) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. లిటన్ దాస్ 39, శాంటో ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 94-1(15) అర్ద శతకం పూర్తి చేసుకున్న తాంజిద్ హసన్ 13.5: శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పరుగు తీసి వన్డే కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన తాంజిద్. మొత్తంగా 41 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బంగ్లా స్కోరు: 90/0 (14). నిలకడగా ఆడుతున్న బంగ్లా ఓపెనర్లు బంగ్లా ఓపెనర్లు తాంజిద్ 42, లిటన్ దాస్ 28 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరి మెరుగైన భాగస్వామ్యంతో బంగ్లా 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. 8 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోరు: 37-0 తాంజిద్ 23, లిటన్ దాస్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 10/0. ►టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ►తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ►రెగ్యులర్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కావడంతో ఈ మ్యాచ్ బంగ్లా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన నజ్ముల్ షాంటో. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తుది జట్లు: ►టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ►బంగ్లాదేశ్ లిటన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, నసూమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం. -
CWC 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. కెప్టెన్ ఔట్
పూణే వేదికగా ఇవాళ (అక్టోబర్ 19) భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో బంగ్లా కెప్టెన్గా నజ్ముల్ హసన్ షాంటో వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా షకీబ్ ఈ మ్యాచ్కు దూరంగా ఉండటంతో నజ్ముల్ బంగ్లా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ రెండు మార్పులు చేసింది. షకీబ్ స్థానంలో నసుమ్, తస్కిన్ స్థానంలో హసన్ జట్టులో వచ్చారు. మరోవైపు భారత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. తుది జట్లు.. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్: తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), నసుమ్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), తౌహిద్ హృదొయ్, మెహది హసన్, హసన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
నేనెప్పుడు విరాట్ జోలికి పోను.. అతన్ని రెచ్చగొడితే ఏం చేస్తాడో తెలుసు..!
బంగ్లాదేశ్ వెటరన్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగబోయే మ్యాచ్కు ముందు అతను స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ కోహ్లి ఆన్ ఫీల్డ్ మనస్తత్వంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా స్లెడ్జింగ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ముష్ఫికర్ మాట్లాడుతూ.. సాధారణంగా కోహ్లి బ్యాటింగ్ చేసేప్పుడు చాలా నెమ్మదిగా ఉంటాడని, పొరపాటున అతన్ని ఎవరైనా స్లెడ్జ్ చేస్తే అతనిలోని అత్యుత్తమ ప్రదర్శన బయటివచ్చి ఉగ్రుడిలా మారిపోతాడని అన్నాడు. అందుకే నేనెప్పుడూ కోహ్లిని స్లెడ్జ్ చేసే సాహసం చేయనని.. మా బౌలర్లకు కూడా ఇదే చెబుతానని తెలిపాడు. సహజంగానే కోహ్లి ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోవాలని అనుకోడని, స్లెడ్జింగ్ చేస్తే అతను మరింత రెచ్చిపోయి, అదనపు సంకల్పంతో బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. ప్రపంచంలో ఏ ఆటగాడినైనా స్లెడ్జింగ్ చేసి తమకనుకూలంగా ఫలితం రాబట్టవచ్చు కానీ, కోహ్లి ముందు ఆ పప్పులు ఉడకవని అన్నాడు. 36 ఏళ్ల ముష్ఫికర్ రహీం తన 17 ఏళ్ల కెరీర్లో కోహ్లిని చాలా దగ్గరగా చూశాడు. కోహ్లితో అతనికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో రహీం.. కోహ్లికి సంబంధించి తన అనుభవాలను పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, పూణే వేదికగా ఇవాళ జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. టీమిండియాను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వరల్డ్కప్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో (ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్) జయభేరి మోగించిన భారత్.. ఇవాల్టి మ్యాచ్లోనూ గెలుపుపై కన్నేసింది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఓ గెలుపు (ఆఫ్ఘనిస్తాన్), రెండు పరాజయాలతో (ఇంగ్లండ్, న్యూజిలాండ్) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. భారత్.. న్యూజిలాండ్ తర్వాత రెండో స్థానంలో ఉంది. -
CWC 2023 IND VS BAN: హిట్మ్యాన్ వరుసగా నాలుగో సెంచరీ చేసేనా..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐసీసీ ఈవెంట్లలో బంగ్లాదేశ్పై ఘనమైన రికార్డు ఉంది. హిట్మ్యాన్.. ఐసీసీ టోర్నీల్లో బంగ్లాదేశ్తో తలపడిన గత మూడు సందర్భాల్లో సెంచరీలు చేశాడు. 2015 వన్డే వరల్డ్కప్లో 126 బంతుల్లో 137 పరుగులు చేసిన రోహిత్.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో 129 బంతుల్లో శతక్కొట్టాడు (123 నాటౌట్). అనంతరం 2019లో హిట్మ్యాన్ మరోసారి బంగ్లాదేశ్పై విరుచుకుపడ్డాడు. ఈ మెగా టోర్నీలో అతను కేవలం 92 బంతుల్లోనే శతకం (104) బాది, బంగ్లాదేశ్పై ఐసీసీ టోర్నీల్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుత వరల్డ్కప్లో టీమిండియా ఇవాళ (అక్టోబర్ 19) బంగ్లాదేశ్తో తలపడుతున్న నేపథ్యంలో రోహిత్కు సంబంధించిన ఈ ఆసక్తికర రికార్డు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం హిట్మ్యాన్ ఉన్న ఫామ్లో బంగ్లాదేశ్పై వరుసగా నాలుగో సెంచరీ కూడానమోదు చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు. మరి పూణే వేదకగా బంగ్లాదేశ్తో ఇవాళ జరిగే మ్యాచ్లో హిట్మ్యాన్ ఎన్ని పరుగులు సాధిస్తాడో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో రోహిత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో సెంచరీ, ఓ అర్ధసెంచరీ చేసి భీకరఫామ్లో ఉన్నాడు. హిట్మ్యాన్ ఇదే ఊపును కొనసాగించి, ఇవాళ మరో సెంచరీ చేయాలని టీమిండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రోహిత్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 72.33 సగటున సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 217 పరుగులు చేసి, టోర్నీ లిడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ప్రస్తుత టోర్నీలో టీమిండియా సైతం వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఖంగుతినిపించిన భారత్.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లపై వరుస విజయాలు సాధించి, హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. పూణే వేదికగా బంగ్లాదేశ్తో ఇవాళ జరిగే మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: CWC 2023: బంగ్లాదేశ్తో మ్యాచ్.. మరో రికార్డుపై కన్నేసిన కోహ్లి ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
CWC 2023: బంగ్లాదేశ్తో మ్యాచ్.. మరో రికార్డుపై కన్నేసిన కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డుపై కన్నేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (అక్టోబర్ 19) జరిగే మ్యాచ్లో కింగ్ మరో 77 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 26000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇటీవలే అత్యంత వేగంగా 25000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కోహ్లి.. ఇవాల్టి మ్యాచ్లో సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్దమయ్యాడు. ఇదిలా ఉంటే, టీమిండియా ఇవాళ పూణే వేదికగా బంగ్లాదేశ్తో తలపడనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వరల్డ్కప్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో జయభేరి మోగించిన భారత్.. మరో గెలుపుపై కన్నేసింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లపై ఘన విజయాలు సాధించిన భారత్.. అదే జోరును బంగ్లాదేశ్పై కూడా కొనసాగించాలని భావిస్తుంది. ప్రస్తుతం భారత్ జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ను నిలువరించడం ఎంతటి జట్టుకైనా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్.. భారత్ను ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement