India vs Bangladesh
-
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్.. రిషభ్ పంత్ భావోద్వేగం
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు(Laureus World Sports Awards)కు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ వెల్లడించింది. అత్యుత్తమ పునరాగమనం(బెస్ట్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్) విభాగంలో అతడిని నామినేట్ చేసినట్లు తెలిపింది. ఈ అవార్డు కోసం పంత్తో పాటు మరో ఐదుగురు పోటీపడుతున్నారు.పంత్ భావోద్వేగంఇక తన పేరు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అవడం పట్ల రిషభ్ పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఆ దేవుడు మనకు ఇచ్చిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలని నేను విశ్వసిస్తాను. కారు ప్రమాదంలో దాదాపు చావు అంచుల దాకా వెళ్లిన నేను ఆ దేవుడి దయ వల్లే బయటపడ్డాను.ఆ తర్వాత నాలో చాలా పరివర్తన వచ్చింది. పిచ్పై తిరిగి పరుగుల వరద పారించాలనే కసి మరింతగా పెరిగింది. అదంత సులువు కాదని తెలుసు. అయినా.. సరే నేను పోరాడాలనే నిర్ణయించుకున్నా. తిరిగి ఫిట్నెస్ సాధించి టీమిండియాకు మళ్లీ ఆడాలనే కలను నెరవేర్చుకున్నాను.అయితే, నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. నాతో నేను ఓ యుద్ధమే చేశా. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా. లారెస్ వరల్డ్ కమ్బ్యాక్ అవార్డుకు నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవం.నేను మళ్లీ సాధారణ జీవితం గడపడానికి నా కుటుంబం, బీసీసీఐ, వైద్యులు, నా వైద్య బృందం, మా జట్టు సహాయక సిబ్బంది, ట్రెయినర్లు.. ముఖ్యంగా నా అభిమానులు కారణం. నాకు దక్కిన గొప్ప గౌరవంగా దీనిని భావిస్తున్నా. ఎప్పుడూ ఓటమిని అంగీకరించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నది నేను నేర్చుకున్న పాఠం. మానసికంగా బలంగా ఉంటే మునుపటి సంతోషాలు అవే వెతుక్కుంటూ వస్తాయి’’ అని రిషభ్ పంత్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.తీవ్రంగా గాయపడి2022, డిసెంబరు 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న క్రమంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో డెహ్రాడూన్ ఆస్పత్రిలో ప్రాథమిక చికత్స అనంతరం బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్లిఫ్ట్ చేసింది. ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందించింది.ఈ నేపథ్యంలో క్రమక్రమంగా కోలుకున్న 27 ఏళ్ల పంత్.. ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం బంగ్లాదేశ్తో టెస్టుల సందర్భంగా టీమిండియా తరఫున పునరాగమనం చేయడంతో పాటు టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులోనూ భాగమయ్యాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్లకు(లక్నో సూపర్ జెయింట్స్) అమ్ముడుపోయి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడుతున్న భారత జట్టులో పంత్ భాగం. ఇదిలా ఉంటే పంత్తో పాటు బ్రెజిల్ జిమ్నాస్ట్ రెబెక ఆండ్రడే, అమెరికా స్విమ్మర్ సెలెబ్ డ్రెసెల్, స్విట్జర్లాండ్కు చెందిన లారా గట్- బెహ్రామీ, స్పెయిన్మోటార్ సైక్లిస్ట్ మార్క్ మార్కేజ్, ఆస్ట్రేలియా స్విమ్మర్ అరియానే టైట్మస్ కమ్బ్యాక్ అవార్డు పోటీలో నిలిచారు. ఇక భారత్ నుంచి లారెస్ వరల్డ్ స్పోర్ట్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్లలో సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని పంత్ ఆక్రమించాడు. కాగా ఏప్రిల్ 21న స్పెయిన్లోని మాడ్రిడ్లో ఈ అవార్డు వేడుక జరుగనుంది. చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
మిస్టరీ గర్ల్తో శిఖర్ ధవన్.. సోషల్మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) అఫీషియల్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఫిబ్రవరి 20న దుబాయ్లో జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్కు హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెటర్లతో కలియ తిరిగిన ధవన్.. ఆతర్వాత వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ను వీక్షించాడు. Who is this lady with Shikhar Dhawan?🥲 #ShikharDhawan #IndvsBan #RohitSharma𓃵 #ChampionsTrophy pic.twitter.com/JqFTeY4kAp— lei 🌼 (@sakshimadik03) February 20, 2025ఆ సమయంలో ధవన్ పక్కనే ఓ విదేశీ యువతి తారసపడింది. ధవన్.. సదరు విదేశీ యువతి పక్కపక్కనే కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ధనవ్ కొత్త అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. Hahahha such a cute video 😆😆😆 #ShikharDhawan pic.twitter.com/P0PSrC9ydc— Prernaa (@theprernaa) February 21, 2025ఇంతకీ ఆ విదేశీ అమ్మాయి ఎవరని ఆరా తీయగా.. ఆమె పేరు సోఫీ షైన్ అని తెలిసింది. ఐర్లాండ్కు చెందిన ఈ యువతిని ధవన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా చేస్తున్నట్లు బయటపడింది. దీంతో సోఫీ, ధవన్ మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ధవన్ కొద్ది రోజుల కిందట ఇదే యువతితో ఎయిర్పోర్ట్లో కూడా కనిపించాడని అంటున్నారు.కాగా, 39 ఏళ్ల ధవన్.. తన మాజీ భార్య, ఆసీస్ పౌరురాలైన అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్గా ఉంటున్నాడు. ధవన్, ఆయేషాకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయేషాతో విడిపోయాక ధవన్ ఎక్కువగా తన కుమారుడి గురించి సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నాడు. అయేషా.. బిడ్డను తనతో కలువనివ్వట్లేదని ధవన్ పలు సందర్భాల్లో వాపోయాడు. ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక ధవన్ ప్రస్తుతం పలు ప్రైవేట్ లీగ్ల్లో పాల్గొంటున్నాడు. ధవన్ ఇటీవలే నేపాల్ క్రికెట్ లీగ్లో ఆడాడు. ధవన్ 2012లో అయేషాను పెళ్లాడాడు. వీరిద్దరికి సోషల్మీడియాలో పరిచయం ఏర్పడింది. అయేషా ధవన్ కంటే పదేళ్లు పెద్దది. ధవన్తో పెళ్లి కాక ముందే అయేషాకు వేరే వ్యక్తితో వివాహమైంది. అయేషా ఆ వ్యక్తితో ఇద్దరు కుమార్తెలను కనింది. అయేషా మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆసీసా?.. ముందే కొట్టేస్తారు అనుకున్నా: సెహ్వాగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. అయితే భారత్ విజయం సాధించినప్పటికి ఛేజింగ్లో మాత్రం కాస్త తడబడిందనే చెప్పాలి.ఎందకంటే 229 పరుగుల టార్గెట్ను చేధించేందుకు భారత్ ఏకంగా 46.3 ఓవర్ల సమయం తీసుకుంది. లక్ష్య చేధనలో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్లో స్పీడ్ తగ్గింది. 30 ఓవర్లు ముగిసే సరికి 144/4 స్కోరుతో భారత్ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది.కానీ శుబ్మన్ గిల్(101), కేఎల్ రాహుల్(41) ఆచితూచి ఆడుతూ భారత్ను విజయతీరాలకు చేర్చారు. తాజాగా ఈ స్లో రన్ ఛేజింగ్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఇంకాస్త ముందుగానే టార్గెట్ను చేధిస్తుందని భావించానని సెహ్వాగ్ అన్నాడు."బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత అభిమానులు టెన్షన్ పడి ఉంటారు నేను అనుకోను. ఎందుకంటే ప్రత్యర్ధిగా ఉన్నది బంగ్లాదేశ్. మీరు బంగ్లాను చాలా అద్భుతమైన జట్టుగా నాతో పొగిడించు కోవాలనుకుంటున్నారా? అలా జరగాలంటే వారు ఆట తీరులో మార్పు రావాలి.బంగ్లాదేశ్తో ఆడేటప్పుడే నేను భయపడలేదు, ఇప్పుడు ఇంకా ఏమి భయపడతాను. టెన్షన్ పడడానికి ప్రత్యర్ది ఏమైనా పాకిస్తానా..? ఆస్ట్రేలియానా? ఇది చాలా ఈజీ మ్యాచ్. దాదాపు నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేదా శ్రేయాస్ అయ్యర్ ఎక్కువసేపు క్రీజులో ఉండి ఉంటే, ఈ మ్యాచ్లో 35 ఓవర్లలోనే ముగిసి ఉండేదని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీ అనంతరం సోషల్మీడియాలో ఓ టాపిక్ హైలైట్గా మారింది. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని.. మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్లో తిలక్ వర్మ (49) హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్స్తో మ్యాచ్ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్లో వస్తాడో అని అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్ను ఏకి పారేసి, రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్.. గిల్తో కలిసి ఐదో వికెట్కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో రాహుల్ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్.. రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. ఇలాంటి తరుణంలో రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్ సహకారంతో గిల్ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్ చివరి వరకు క్రీజ్లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగట్టుగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్, రాహుల్ భాగస్వామ్యం భారత్ను గెలిపించింది. అంతకుముందు రాహుల్ కీపింగ్లోనూ అదరగొట్టాడు. మూడు అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
CT 2025: వారిద్దరు బాగా ఆడారు.. అయినా క్రెడిట్ మా వారికే దక్కుతుంది: రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో (Champions Trophy) టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించింది. ఫీల్డింగ్లో నిరాశపరిచినా బౌలర్లు, బ్యాటర్లు టీమిండియాకు విజయం చేకూర్చారు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ను ఓడించడంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లా బ్యాటర్లు హృదయ్, జాకిర్ అలీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. వారిద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని అభినందించాడు. షమీ ఐదు వికెట్ల ప్రదర్శనను కొనియాడాడు. ఇలాంటి ప్రదర్శనల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నామని అన్నాడు. షమీ సామర్థ్యం గురంచి తెలుసని చెప్పాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి షమీ అద్భుత ప్రదర్శనలతో ముందుకొస్తాడని కితాబునిచ్చాడు. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ను కూడా ప్రశంసించాడు. గిల్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు ఆశ్చర్యానికి గురి చేయవని అన్నాడు. గిల్ స్థాయి ఏంటో తమకు తెలుసని తెలిపాడు. అతనో క్లాసికల్ ప్లేయర్ అని కొనియాడాడు. గిల్ చివరి వరకు క్రీజ్లో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.అక్షర్ హ్యాట్రిక్ను నేలపాలు చేయడంపై స్పందిస్తూ.. అది చాలా సులభమైన క్యాచ్. నా స్థాయి క్రికెటర్ అలాంటి క్యాచ్ను తప్పక పట్టుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరుగలేదు. సునాయాసమైన క్యాచ్ను వదిలేసినందుకు చింతిస్తున్నాను. అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయినందుకు చాలా బాధేసింది. రేపు అతన్ని డిన్నర్కు తీసుకెళ్తానంటూ నవ్వులు పూయించాడు.పిచ్ తీరుపై స్పందిస్తూ.. ఊహించిన దానికంటే నిదానంగా ఉందని అన్నాడు. తర్వాతి మ్యాచ్లో కూడా పిచ్ ఇలాగే ఉంటుందని చెప్పలేమని తెలిపాడు. ఒక్క మ్యాచ్తోనే పిచ్ను అంచనా వేయడం కష్టమని పేర్కొన్నాడు. ముందుగా పిచ్ ఇలా ఉంటుందని చెప్పడానికి నేను క్యూరేటర్ను కాదని జోక్ చేశాడు. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి ఉంటుందని, జట్టుగా మేము దాన్ని అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు. భారత ఇన్నింగ్స్లో విరాట్ (22), శ్రేయస్ (15), అక్షర్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 23న దుబాయ్లోనే జరుగుతుంది. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా 100 విజయాలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో (Ricky Ponting) కలిసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు (బంగ్లాతో మ్యాచ్) 138 మ్యాచ్ల్లో భారత కెప్టెన్గా వ్యవహరించి 100 విజయాలు సాధించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 33 మ్యాచ్ల్లో ఓడింది. మూడు మ్యాచ్లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది.కెప్టెన్గా రోహిత్ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా.. 38 వన్డేల్లో, 12 టెస్ట్ల్లో వచ్చాయి. కెప్టెన్గా రోహిత్ విజయాల శాతం 70కి పైగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్కు ముందు రికీ పాంటింగ్ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్ పర్సంటేజీతో విజయాలు సాధించాడు. ఓ విషయంలో పాంటింగ్తో పోలిస్తే రోహితే గ్రేట్ అని చెప్పాలి. పాంటింగ్ 28 ఏళ్ల వయసులో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఈ స్థాయి విజయాలు సాధిస్తే.. హిట్ మ్యాన్ 30 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి విజయాల సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 30 ఏళ్ల వయసు తర్వాత 100 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్గానూ హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రికీ తన కెరీర్లో ఆసీస్కు 324 మ్యాచ్ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్ల్లో గెలిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200కు పైగా విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ పాంటింగ్ మాత్రమే. పాంటింగ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి దక్కుతుంది. ధోని 332 మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్ వ్యవహరించి 178 మ్యాచ్ల్లో గెలిపించాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లి (135) అత్యధికంగా టీమిండియాను గెలిపించాడు.2017లో మొదలైన రోహిత్ ప్రస్తానం2017లో తొలిసారి టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. 2021-22లో టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా గతేడాది టీ20 వరల్డ్కప్ గెలిచింది. రోహిత్ టీమిండియాను 2023 వన్డే వరల్డ్కప్, 2021-2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేర్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తొలి విజయం సాధించింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. ఈ మ్యాచ్లో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు.11000 పరుగుల క్లబ్లో రోహిత్ఈ మ్యాచ్లో రోహిత్ వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతను కోహ్లి 222 ఇన్నింగ్స్ల్లో సాధించగా.. రోహిత్కు 261 ఇన్నింగ్స్లు పట్టింది. -
IND Vs BAN: చాంపియన్స్ ట్రోఫీ తొలి పోరులో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
IND Vs BAN: శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీ.. బంగ్లాపై భారత్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో చేధించింది. భారత యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను గిల్ ఫినిష్ చేశాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. వరుసగా వికెట్ల పడడంతో కాస్త ఆచితూచి ఆడాడు. ఎప్పుడైతే లక్ష్యానికి జట్టు చేరువైందో గిల్ తన బ్యాటింగ్లో జోరును పెంచాడు. ఈ క్రమంలో 125 బంతుల్లో గిల్ తన ఎనిమిదవ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 129 బంతులు ఎదుర్కొన్న గిల్..9 ఫోర్లు, 2 సిక్స్లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 100) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఫీట్ను చేరుకోవడానికి రోహిత్కు 261 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్లలో సాధించాడు. తాజా మ్యాచ్తో లిటల్మాస్టర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్..కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్.. మూడో ఓవర్ నుంచి బౌండరీల మోత మొదలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి హిట్మ్యాన్ తన వికెట్ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..1 - విరాట్ కోహ్లి: 222 ఇన్నింగ్స్లు2 - రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్3 - సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్4 - రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్లు5 - సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్చదవండి: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
Champions Trophy 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు (43 ఓవర్ల వరకు) తీసిన షమీ.. వన్డేల్లో 200 వికెట్ల పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు.బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..షమీ-5126 బంతులుస్టార్క్- 5240సక్లెయిన్ ముస్తాక్- 5451బ్రెట్ లీ- 5640ట్రెంట్ బౌల్ట్- 5783వకార్ యూనిస్- 5883మ్యాచ్ల ప్రకారం చూస్తే.. షమీ.. మిచెల్ స్టార్క్ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు..స్టార్క్- 102షమీ/సక్లెయిన్ ముస్తాక్- 104ట్రెంట్ బౌల్ట్- 107బ్రెట్ లీ- 112అలన్ డొనాల్డ్- 117ఓవరాల్గా చూస్తే.. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43 బౌలర్గా షమీ రికార్డుల్లోకెక్కాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్గా నిలిచాడు. షమీకి ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253), రవీంద్ర జడేజా (226) భారత్ తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), కపిల్ దేవ్ (253) తర్వాత 200 వికెట్ల క్లబ్లో చేరిన ఐదో భారత పేసర్గా షమీ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో భారత బౌలర్లు చెలరేగడంతో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి బంగ్లాదేశ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. 46.2 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 215/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (91 నాటౌట్), తస్కిన్ అహ్మద్ క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. -
రోహిత్ శర్మ మంచి మనసు.. ఫ్యాన్స్ ఫిదా! వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్మ్యాన్ తనదైన శైలిలో సహచర ఆటగాళ్లపై పంచ్లు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల పట్ల కూడా రోహిత్ తన మంచి మనుసు చాటుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.తాజాగా రోహిత్ శర్మ మరో తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, భారత జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లా బ్యాటర్ జాకర్ అలీ షూ లేస్ను రోహిత్ కట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.దీంతో సోషల్ మీడియా వేదికగా భారత కెప్టెన్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ హిట్మ్యాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో జాకర్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్ను రోహిత్ జారవిడిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకంగా 68 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 100) విరోచిత సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు జాకర్ అలీ(68) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.35 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను జాకర్ అలీ, హృదయ్ తమ అద్భుత ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs BAN: ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్ -
ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్(Bangladesh) కు ఆరంభంలోనే పేసర్లు మహ్మద్ షమీ, హర్షిత్ రాణా చుక్కలు చూపించగా.. ఆ తర్వాత అక్షర్ పటేల్ తన స్పిన్ మయాజాలంతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. అక్షర్ పటేల్ తృటిలో తన తొలి హ్యాట్రిక్ను కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన తప్పిదం వల్ల అక్షర్ ఈ ఫీట్ను సాధించలేకపోయాడు.అసలేం జరిగిందంటే..?బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. రెండో బంతికి తాంజిద్ హసన్, మూడో బంతికి ముష్ఫికర్ రహీంలను పెవిలియన్కు పంపాడు. దీంతో అక్షర్కు తొలి హ్యాట్రిక్ సాధించే అవకాశం లభించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జాకీర్ అలీకి రోహిత్ శర్మ క్లోజ్ ఫీల్డ్ను సెట్ చేశాడు.ఆ ఓవర్లో నాలుగో బంతిని అక్షర్.. అలీకి ఔట్సైడ్ ఆఫ్ దిశగా ఆఫ్ బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని జాకీర్ అలీ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మొదటి స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ ఈజీ క్యాచ్ను జారవిడిచాడు. అందరూ రోహిత్ అందుకున్నాడని భావించినప్పటికి ఆఖరి నిమిషంలో బంతి అతడి చేతి నుంచి జారిపోయింది. అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. రోహిత్ క్యాచ్ విడిచిపెట్టిన వెంటనే అక్షర్కు సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక 25 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్.. 31 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత కూడా జాకీర్ అలీకి రెండు ఛాన్స్లు లభించాయి. భారత బౌలర్లలో ఇప్పటివరకు అక్షర్ పటేల్, మహ్మద్ షమీ తలా రెండు వికెట్లు సాధించగా.. హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: CT 2025: ‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్కప్ వరకు అతడే కెప్టెన్’This moment could have put Axar's name in the record books for decades. But Rohit Sharma successfully ruined it 😒 pic.twitter.com/zDnFk83r0D— Mark. (@CheekuGang) February 20, 2025 -
Champions Trophy: టీమిండియాను వెంటాడుతున్న బ్యాడ్ లక్
టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ నుంచి భారత్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ప్రపంచ క్రికెట్లో ఒక్క నెదర్లాండ్స్ మాత్రమే భారత్లా వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ తాజాగా టాస్ ఓడింది.రోహిత్ సారథ్యంలో 8 రాహుల్ కెప్టెన్సీలో 3వన్డేల్లో భారత్ వరుసగా కోల్పోయిన 11 టాస్ల్లో.. ఎనిమిది రోహిత్ శర్మ సారథ్యంలో కాగా.. మూడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్కప్ ఫైనల్లో భారత్.. రోహిత్ శర్మ నేతృత్వంలో టాస్ ఓడింది. ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. కేఎల్ రాహుల్ సారథ్యంలో టాస్ ఓడింది. అనంతరం శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టాస్లు ఓడింది. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ సారథ్యంలో టాస్లు ఓడింది. తాజాగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్.. రోహిత్ శర్మ సారథ్యంలో టాస్ ఓడింది.పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన షమీ.. బంగ్లా పతనానికి నాంది పలికాడు. ఆతర్వాత రెండో ఓవర్లో యువ పేసర్ హర్షిత్ రాణా వికెట్ తీశాడు. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన షమీ.. తిరిగి ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు.అక్షర్కు హ్యాట్రిక్ మిస్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. ఈ ఓవర్లో వరుసగా రెండు, మూడు బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి స్లిప్స్లో జాకిర్ అలీ అందించిన సునాయాసమైన క్యాచ్ను రోహిత్ జారవిడిచాడు.13 ఓవర్లలో 50 పరుగులు13 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 50 పరుగులుగా ఉంది. తంజిద్ హసన్ 25, సౌమ్య సర్కార్ 0, కెప్టెన్ షాంటో 0, మెహిది హసన్ 5, ముష్ఫికర్ 0 పరుగులకు ఔట్ కాగా.. తౌహిద్ హృదోయ్ (10), జాకిర్ అలీ (7) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ, అక్షర్ తలో రెండు.. హర్షిత్ ఓ వికెట్ పడగొట్టారు. -
Champions Trophy 2025: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో సూపర్గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్కు పెవిలియన్కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్లో శుభ్మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్కప్ వరకు అతడే కెప్టెన్’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2027 వరకు హిట్మ్యాన్ సారథిగా కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అసాధారణ విజయాలు సాధించాడన్న కైఫ్.. అతడు సమీపకాలంలో రిటైర్ అయ్యే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా బుధవారం ఈ మెగా టోర్నీ మొదలుకాగా.. దుబాయ్లో భారత జట్టు తమ మ్యాచ్లన్నీ ఆడనుంది. తొలుత గురువారం బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన.. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్లతో మ్యాచ్లు ఆడుతుంది.ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ?ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందంటూ సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా ఓడిపోయినా రోహిత్ శర్మ భవిష్యత్తుకు ఢోకా ఏమీ ఉండబోదని జోస్యం చెప్పాడు.కోచ్లకే ఇబ్బంది.. రోహిత్ సేఫ్ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా.. ‘‘కెప్టెన్గా రోహిత్ శర్మ సాధించిన విజయాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్లో టీమిండియాను ఫైనల్కు చేర్చాడు. ఆ తర్వాత మనవాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదు. ఆ దేవుడి దయ వల్ల ఇలా జరుగకూడదు.. కానీ ఒకవేళ టీమిండియా గనుక చాంపియన్స్ ట్రోఫీలో గొప్పగా రాణించకపోతే కోచ్లు మాత్రమే ఇబ్బందుల్లో పడతారు.అప్పటి దాకా అతడే కెప్టెన్అయితే, రోహిత్ శర్మకు మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. టెస్టుల్లో చోటు విషయంలో స్పష్టత లేదు గానీ.. వన్డేల్లో మాత్రం అతడి స్థానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రస్తుతం అతడు ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో వన్డేల్లో విధ్వంసర సెంచరీ బాదాడు.జట్టుకు అద్భుతమైన క్లీన్స్వీప్ విజయం అందించాడు. బ్యాటర్గా వన్డేల్లో అతడి రికార్డు గొప్పగా ఉంది. సారథిగా విజయాల శాతం కూడా ఎక్కువే. అందుకే ఈ టోర్నమెంట్లో టీమిండియా కాస్త చెత్తగా ఆడినా.. ఓడినా జట్టులో అతడి స్థానం పదిలంగానే ఉంటుంది. 2027 వన్డే వరల్డ్ప్ వరకు అతడు కొనసాగుతాడు’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
Champions Trophy 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. రోహిత్ను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్గా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. 2007 జూన్ 23న బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 268 మ్యాచ్లు ఆడి 10,988 పరుగులు చేశాడు.వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 18,426కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234విరాట్ కోహ్లీ (భారత్)- 13,963రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579సౌరవ్ గంగూలీ (భారత్)- 11,363ఈ మ్యాచ్లో రోహిత్ 11000 పరుగులు పూర్తి చేస్తే మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసకుంటాడు. సహచరుడు విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా 11000 వన్డే పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్గా రికార్డుకెక్కుతాడు. విరాట్ 222 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకగా.. రోహిత్కు 260వ ఇన్నింగ్స్లో 11000 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లీ (భారత్)- 222 ఇన్నింగ్స్లుసచిన్ టెండూల్కర్ (భారత్)- 276రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286సౌరవ్ గంగూలీ (భారత్)- 288జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293 నేటి మ్యాచ్లో రోహిత్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 10వ క్రికటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 100విరాట్ కోహ్లీ (భారత్)- 81రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53జో రూట్ (ఇంగ్లాండ్)- 52రోహిత్ శర్మ (భారత్)- 49ఇవాళ జరుగబోయే మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్గా రోహిత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. నేటి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే..రోహిత్ ఖాతాలో 100 అంతర్జాతీయ విజయాలు నమోదవుతాయి. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 99 విజయాలు (137 మ్యాచ్ల్లో) సాధించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు..ఎంఎస్ ధోనీ- 179విరాట్ కోహ్లీ- 137మొహమ్మద్ అజారుద్దీన్- 104రోహిత్ శర్మ- 99సౌరవ్ గంగూలీ- 97నేటి మ్యాచ్లో రోహిత్ 14 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృస్టిస్తాడు. ప్రస్తుతం పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ ఇప్పటివరకు 268 మ్యాచ్ల్లో 338 సిక్సర్లు బాదాడు. -
Ind vs Ban: ‘నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ప్రయాణం గురువారం మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్లో రోహిత్ సేన తొలుత దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియోహాట్స్టార్లో వీక్షించవచ్చు.గంభీర్తో జడ్డూ వాదన!ఇక తొలి మ్యాచ్లో భారత తుదిజట్టు ఎలా ఉంటుందన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసిన భారత జట్టు యాజమాన్యం ప్లేయింగ్ ఎలెవన్లో ఎవరికి చోటు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో చర్చిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.ఈ క్రమంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో జడ్డూకు గౌతీ తుదిజట్టులో స్థానం ఇవ్వడం లేదని.. తనకు ఇష్టమైన వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మాజీ కోచ్ మైక్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం‘‘జడేజా ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు. అతడి బాడీలాంగ్వేజ్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ‘నా నిర్ణయం ఇదే. నేను ఫిక్సైపోయాను. నువ్వు నా నిర్ణయంతో అంగీకరించకపోవచ్చు. అయినా మరేం పర్లేదు. థాంక్స్.. తదుపరి మ్యాచ్లో నువ్వే ఆడతావు. కానీ ఇప్పుడు మాత్రం మేము ఆఫ్ స్పిన్నర్తో బరిలోకి దిగుతాం’ అని గంభీర్ జడేజాకు చెప్పి ఉంటాడు’’ అని మైక్ హసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.వాళ్లిద్దరికి జట్టులో చోటుఅయితే, టీమిండియా మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా మాత్రం.. ‘‘బంగ్లాదేశ్ తుదిజట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. గత కొద్ది రోజులుగా జడేజా, అక్షర్ మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి వాళ్లిద్దరికి జట్టులో చోటు ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా జట్టులో తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్తో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో కూడా లెఫ్టాండర్ బ్యాటర్లేనన్న విషయం తెలిసిందే.ఇక చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కు ఎంపిక చేసిన జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐదుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్(ఇద్దరూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే), వాషింగ్టన్ సుందర్(రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్)లతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(రైటార్మ్ లెగ్ బ్రేక్)లను ఎంపిక చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్
మెగా క్రికెట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా గురువారం చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) బరిలో దిగనుంది. తొలి పోరులో రోహిత్ సేన బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ క్రమంలో శనివారమే దుబాయ్(Dubai)కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. లీగ్ దశలో మూడు మ్యాచ్లు కీలకమే కాబట్టి విజయంతో టోర్నమెంట్ను మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది.మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు ఎంపిక తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశాం. మరో ముగ్గురు బ్యాటింగ్ చేయగల ఆల్రౌండర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల ప్లేయర్లు జట్టుకు అవసరం. ఈ ముగ్గురు జట్టుకు వైవిధ్యాన్ని అందిస్తారు. అయినా మేం మా బలాన్ని బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటాం. జడేజా, అక్షర్, వాషీ జట్టులో ఉంటే మాకు భిన్న రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మాకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాళ్ల అవసరం ఉంది.టీమిండియా గురించి మాట్లాడేవారు ఇతర జట్లలో ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉంటే.. వారి వద్ద ఆరుగురు పేసర్లు ఉన్నారేంటి అని అడగరు’’ అంటూ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న హిట్మ్యాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్తో మ్యాచ్పైనే తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉందని తెలిపాడు.కొత్తగా వరుణ్ చక్రవర్తికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల భారత జట్టులో స్పిన్ దళానికి ప్రాధాన్యం దక్కింది. ప్రాథమిక జట్టులో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. అయితే, ఫైనల్ టీమ్ను ఖరారు చేసే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్పై వేటు వేసి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఫలితంగా జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కినట్లయింది.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరును విమర్శించారు. మెగా టోర్నీకి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’ పోటీలో భాగంగా గురువారం తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. అనంతరం లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్తో మార్చి 2న మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. కాగా మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
CT 2025 IND Vs BAN: శుభారంభంపై భారత్ గురి
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పోరు నేటి నుంచి మొదలవుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగే తమ తొలి మ్యాచ్లో గురువారం బంగ్లాదేశ్తో టీమిండియా తలపడుతుంది. బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన ప్రత్యర్థికంటే ఎంతో బలంగా ఉంది. అయితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని ఆశిస్తోంది. బ్యాటింగ్తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ బరిలోకి దిగుతుండగా... బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్పై ఆశలు పెట్టుకుంది. సమష్టిగా చెలరేగితే... భారత్ తుది జట్టు కూర్పు విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఓపెనర్లుగా రోహిత్, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగించగలడు. ఇటీవల ఇంగ్లండ్తో చివరి వన్డేలో చక్కటి అర్ధసెంచరీ సాధించిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే తిరుగుండదు. గత సిరీస్లో వరుస ప్రయోగాలతో రాహుల్ స్థానం పదే పదే మారింది. అయితే ఈసారి మాత్రం అతనికి అచ్చొచ్చిన ఐదో స్థానంలోనే ఆడించే అవకాశం ఉంది. పాండ్యా, జడేజా, అక్షర్ల ఆల్రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలం.కుల్దీప్ చాలా కాలంగా చక్కటి ఆటతీరు కనబరుస్తున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాల్. అనుభవజు్ఞడైన షమీతో పాటు అర్ష్ దీప్ ఆరంభంలో బంగ్లాదేశ్ను కట్టిపడేయగల సమర్థులు. బలహీన బ్యాటింగ్... తమ దేశపు స్టార్ ఆటగాడు షకీబ్ లేకుండా 2004 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఒక పెద్ద టోర్నీ ఆడుతోంది. లిటన్ దాస్ కూడా ఈ టోర్నీలో లేడు. అయితే ఇతర సీనియర్లు ముషి్ఫకర్, మహ్ముదుల్లా లాంటి ప్లేయర్లు మరోసారి జట్టు భారం మోయాల్సి ఉంది. యువ బ్యాటర్లలో తన్జీద్, తౌహీద్ ఇటీవల పెద్దగా ప్రభావం చూపలేదు.కెప్టెన్ నజు్మల్ చాలా కాలంగా ఫామ్లో లేడు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్ను ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోగలదనేది సందేహమే. పేసర్లు ముస్తఫిజుర్, నాహిద్ రాణా, తస్కీన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్ ఆల్రౌండర్ మెహదీ మిరాజ్ కీలకం కానున్నాడు. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, షమీ, అర్ష్ దీప్. బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), తన్జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముషి్ఫకర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్.పిచ్, వాతావరణంఈ వేదికపై వన్డేలు అరుదుగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని మ్యాచ్లలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. నెమ్మదైన పిచ్పై స్పిన్నర్ల ప్రభావం ఖాయం. వర్ష సమస్య లేదు.41 భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 41 వన్డేలు జరిగాయి. భారత్ 32 మ్యాచ్ల్లో...బంగ్లాదేశ్ 8 మ్యాచ్ల్లో నెగ్గాయి. ఒక మ్యాచ్ రద్దయింది. చాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఒక్కసారి 2017 సెమీఫైనల్లో ఇరు జట్లు తలపడ్డాయి. భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. -
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గురువారం(ఫిబ్రవరి 19)న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రోహిత్ తెలిపాడు."దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతీ ఐసీసీ టైటిల్ కూడా మాకు ముఖ్యమైనదే. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చాము. అయితే ప్రస్తుతం మా దృష్టి బంగ్లాదేశ్ మ్యాచ్పైనే ఉంది. ఈ మెగా టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాము.మాపై ఎటువంటి ఒత్తడి లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరికి వారి రోల్పై ఓ క్లారిటీ ఉంది. ఇంతకుముందు టోర్నీలో భారత్ తరపున ఎలా ఆడామో, ఇప్పుడు కూడా అలానే ఆడుతాము. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో మా కుర్రాళ్లు బాగా రాణించారు. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాము. కానీ ప్రతీ సిరీస్, వేదిక ఒక కొత్త సవాలు వంటిందే. గతంలో దుబాయ్లో మేము చాలా క్రికెట్ ఆడాము. పిచ్ను వీలైనంత త్వరగా అంచనా వేయడం చాలా ముఖ్యం. పరిస్థితులను బట్టి మన ప్లాన్స్ను మార్చుకోవాలి" అని ప్రెస్కాన్ఫరెన్స్లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీ కోసం ఐదు రోజుల ముందే దుబాయ్కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది.బుమ్రా లేకుండానే..ఇక ఈ మెగా ఈవెంట్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఆడనుంది. బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ మినీ వరల్డ్కప్నకు దూరమయ్యాడు. అతడి స్దానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. అతడికి బదులుగా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు.బంగ్లాపై మనదే పై చేయి..కాగా వన్డేల్లో బంగ్లాదేశ్పై భారత్ మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు వన్డే ఫార్మాట్లో 41 సార్లు తలపడగా.. భారత్ 32 విజయాలు నమోదు చేయగా, బంగ్లా జట్టు కేవలం ఎనిమిదింట మాత్రమే గెలుపొందింది. ఇందులో మూడు విజయాలు చివరి ఐదు మ్యాచ్ల్లో రావడం గమనార్హం. చివరగా ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్-2023లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్కు ఛాన్సులు ఎక్కువే! -
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్స్టార్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్స్టార్లో ఉచితంగా మ్యాచ్లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్దీప్ సింగ్కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్లు దుబాయ్లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్లో ఐదు వికెట్లు -
'భారత జట్టులో అతడు లేడు.. మీకు ఇదే మంచి ఛాన్స్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్లో పటిష్టమైన టీమిండియాను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఎలాగైనా భారత్ను ఓడించాలని బంగ్లా టైగర్స్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే దుబాయ్కు చేరుకున్న బంగ్లా జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. బంగ్లా క్రికెట్ జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది.ఈ టోర్నీకి ముందు వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. అదేజోరును ఈ మినీ వరల్డ్కప్లోనూ కనబరచాలని బంగ్లా జట్టు భావిస్తోంది. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావడం బంగ్లాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ఓపెనర్ ఇమ్రాల్ కైస్ తమ జట్టుకు పలు సూచనలు చేశాడు. భారత జట్టులో బుమ్రాలేని లోటును బంగ్లా సొమ్ముచేసుకోవాలని కైస్ అభిప్రాయపడ్డాడు."భారత్ బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ను కలిగి ఉంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. అయితే జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం మా జట్టుకు కలిసొచ్చే ఆంశం. బుమ్రా గత రెండేళ్లలో భారత జట్టుకు ఎటువంటి విజయాలను అందించాడో మనకు మనందరికీ తెలిసిందే. అతడి గైర్హాజరును బంగ్లాదేశ్ సద్వినియోగం చేసుకోవాలి. బుమ్రా లేనప్పటికి మహ్మద్ షమీ వంటి స్పీడ్ స్టార్ జట్టులోకి వచ్చాడు. అయితే అతడు ప్రస్తుతం ఫిట్నెస్తో కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతడు తన రిథమ్ను తిరిగి పొందితే, బంగ్లాదేశ్కు పెనుముప్పులా మారుతాడని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైస్ పేర్కొన్నాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్ ఎమాన్, నాసుమ్ అహ్మద్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా.చదవండి: మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ -
బంగ్లాతో మ్యాచ్.. స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్! గంభీర్ సపోర్ట్ అతడికే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. 1996 వరల్డ్కప్ తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్కు పాక్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. దీంతో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.ఇక భారత్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరగనున్న మ్యాచ్తో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే దుబాయ్కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అదేవిధంగా తొలి మ్యాచ్ కోసం తుది జట్టు కూర్పుపై కూడా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.హర్షిత్కు నో ఛాన్స్..బంగ్లాతో మ్యాచ్కు పేసర్ హర్షిత్ రాణాకు బదులుగా అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేయాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా వెటరన్ మహ్మద్ సిరాజ్ను కాదని మరి అర్ష్దీప్ను సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉందని అజిత్ అగార్కకర్ అండ్ కో సెలక్ట్ చేశారు.ఈ క్రమంలోనే హర్షిత్ కంటే అర్ష్దీప్కు టీమ్ మెనెజ్మెంట్ తొలి ప్రాధన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అర్ష్దీప్ అంచనాలకు తగ్గట్టు రాణించకపోతే రాణా తర్వాతి మ్యాచ్ల్లో ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. వాస్తవానికి తొలుత ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో రాణా లేడు.జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో రాణాకు భారత జట్టులో చోటు దక్కింది. అయితే ఇంగ్లండ్పై వన్డే అరంగేట్రం చేసిన రాణా పర్వాలేదన్పించాడు. ఈ ఢిల్లీ పేసర్ మూడు మ్యాచ్ల సిరీస్లో మొత్తంగా వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్కు తీసుకు వెళ్లారు.బంగ్లాతో మ్యాచ్కు భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs PAK: షాకింగ్.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.4 లక్షలు -
చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాట్ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్కు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.అయితే, పంత్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్తో పాటు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడనుంది.ఎడమ మోకాలికి బలంగా తాకిన బంతిఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్ జరుగగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్ జైన్ పంత్ను పరీక్షించాడు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్ కీపర్ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.కాగా 27 ఏళ్ల రిషభ్ పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.పంత్ బెంచ్కే పరిమితం!ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్ రాహుల్కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పంత్ బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్ రాహుల్ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్కప్-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్ కీపర్గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్లో తమ తొలిమ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
CT 2025: రోహిత్ శర్మ ఇంకో 183 పరుగులు చేస్తే...
ఇంగ్లండ్తో స్వదేశంలో వన్డే సిరీస్(India vs England)ను ఘనంగా ముగించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీ కానుంది. బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆత్మవిశ్వాసంతో ఈ ఐసీసీ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.ఇక ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన దుబాయ్లో ఆడనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న.. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో.. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్తో భారత జట్టు తలపడనుంది.అరుదైన రికార్డు ముంగిట హిట్మ్యాన్ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. దుబాయ్లో చరిత్ర సృష్టించేందుకు హిట్మ్యాన్ ఇంకా 183 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ఫామ్తో సతమతమైన రోహిత్ శర్మ ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా వింటేజ్ హిట్మ్యాన్ను గుర్తు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ... తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కటక్లో జరిగిన ఈ మ్యాచ్లో మొత్తంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్స్ల సాయంతో 119 పరుగులు చేశాడు. అయితే, తదుపరి మ్యాచ్లో మాత్రం పేసర్ మార్క్ వుడ్ సంధించిన సూపర్ డెలివరీని ఆడలేక.. మళ్లీ విఫలమై ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.ఇంకో 183 పరుగులు జతచేశాడంటేఇక తదుపరి రోహిత్ శర్మ దుబాయ్ వేదికగా ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. కాగా దుబాయ్లో ఇప్పటి వరకు అతడు వన్డేల్లో 317 పరుగులు సాధించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా ఇందుకు ఇంకో 183 పరుగులు జతచేశాడంటే.. దుబాయ్లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్రకెక్కుతాడు.ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు స్కాట్లాండ్కు చెందిన రిచీ బెరింగ్టన్ పేరిట ఉంది. అతడు ఇప్పటి వరకు దుబాయ్లో వన్డేల్లో 424 పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 342 పరుగులతో భారత బ్యాటర్లలో టాప్లో కొనసాగుతున్నాడు.కాగా వన్డేల్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 264. ఇక మొత్తంగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 260 వన్డేలు పూర్తి చేసుకుని 10988 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 338 వన్డే సిక్సర్లు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
BCCI: బుమ్రా ఆడతాడా?.. రిస్క్ వద్దు!.. ఆ డాక్టర్ చేతిలోనే అంతా..
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో అంతా తానై ముందుండి నడిపించిన ఈ పేస్ దళ నాయకుడు ఆఖర్లో గాయపడిన విషయం తెలిసిందే. కంగారూ దేశ పర్యటనలో చివరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో విలవిల్లాడాడు. మూడు వారాలుగా విశ్రాంతిమ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. స్కానింగ్ అనంతరం జట్టుతో చేరినా మళ్లీ బంతితో బరిలోకి దిగలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా ఆటకు దూరమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయింది. అయితే, అతడి ఫిట్నెస్ గురించి ఇంత వరకు స్పష్టత రాలేదు.ఇప్పటికే స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్(India vs England)కు దూరమైన బుమ్రా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికైనా జట్టుతో చేరాలని టీమిండియా యాజమాన్యం ఆశిస్తోంది. ఈ మెగా టోర్నీ నాటికి అతడు ఫిట్గా మారతాడనే ఆశాభావంతోనే జట్టుకు ఎంపిక చేసింది. ఒకవేళ బుమ్రా గనుక ఈ ఐసీసీ ఈవెంట్కు దూరమైతే.. జట్టుపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే.. అతడి విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు.న్యూజిలాండ్ స్పెషలిస్టుతో సంప్రదింపులుఇందులో భాగంగా.. ఇప్పటికే బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు బుమ్రా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అంతేకాదు.. వెన్నునొప్పి తీవ్రత, దాని తాలుకు ప్రభావాన్ని అంచనా వేసేందుకు న్యూజిలాండ్ స్పెషలిస్టు డాక్టర్ రొవాన్ షోటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.అదొక అద్భుతమని తెలుసుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ వైద్య బృందం షోటన్తో కాంటాక్టులో ఉంది. బుమ్రాను స్వయంగా అక్కడికి పంపాలని బోర్డు భావించింది. అయితే, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. తనకు విధించిన గడువులోగా బుమ్రా గనుక వందశాతం ఫిట్నెస్ సాధిస్తే అదొక అద్భుతమని సెలక్టర్లకు కూడా తెలుసు.అదే జరగాలని యాజమాన్యం కోరుకుంటోంది కూడా! అందుకే బుమ్రా స్కానింగ్ రిపోర్టులను షోటన్కు పంపించి.. ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. ఏదేమైనా.. బుమ్రా వీలైనంత త్వరగా జట్టుతో చేరితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. అతడు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.ఫిబ్రవరి 12 వరకు అవకాశంఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బుమ్రాకు కూడా చోటు దక్కింది. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడి విషయంలో తుది నిర్ణయం ఉంటుందని.. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్కు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో తమ మ్యాచ్లు ఆడనుంది. తొలి మ్యాచ్లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. మార్చి 2న న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడుతుంది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్తో సమస్యా? -
‘నితీశ్ రెడ్డికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వాల్సిందే’
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చంతా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) గురించే!.. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే ప్రాథమిక జట్లను ప్రకటించడానికి సోమవారమే(జనవరి 13) ఆఖరి తేదీ అయినా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని మరింత గడువు కోరింది.ఇందుకు ఐసీసీ నుంచి సానుకూల స్పందన రాగా.. జనవరి 18 లేదా 19న చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి ఈ మెగా టోర్నీకి తమ జట్టును ఎంచుకున్నారు.కెప్టెన్కు నో ఛాన్స్!టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ఈ వన్డే ఫార్మాట్ జట్టులో గావస్కర్, పఠాన్ చోటివ్వలేదు. అయితే, అనూహ్యంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం తమ టీమ్లో చేర్చారు. ఈ విషయం గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో వన్డేల్లో ఎవరు అదరగొట్టారో వారిని మాత్రమే నేను ఎంచుకుంటాను. వన్డే ప్రపంచకప్-2023లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు.సంజూను ఎలా కాదనగలం?ఇక శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అతడు కూడా ప్రపంచకప్ టోర్నీలో మునుపెన్నడూ లేనివిధంగా దుమ్ములేపాడు. కాబట్టి తనకు సెలక్టర్లు మద్దతుగా నిలవాలి. గత కొన్ని నెలలుగా అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఫామ్లో ఉన్నా సరే అతడికి సెలక్టర్ల నుంచి పిలుపురావడం లేదు.నా అభిప్రాయం ప్రకారం వీరిద్దరికి కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్టులో చోటివ్వాలి. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ను ఆడించాలి. ఆరో స్థానంలో రిషభ్ పంత్ ఆడాలి. ఇక సంజూ శాంసన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో వరుస శతకాలు సాధించాడు. అలాంటి ఆటగాడిని మనం ఎలా విస్మరించగలం?’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డికి చోటు ఇవ్వాల్సిందేఇక ఇర్ఫాన్ పఠాన్ ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు చెప్పింది బాగుంది. ఇక ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఇక జట్టులో సమతూకం ఉండాలంటే.. బౌలింగ్ ఆప్షన్లు కూడా చూసుకోవాలి. జట్టులో కచ్చితంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కు ఒక బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో మనకు అద్భుతమైన ఆటగాడు అందుబాటులో ఉన్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కువ మందికి సాధ్యం కాని ఘనతను సెంచరీ ద్వారా అతడు సాధించాడు’’ అని పేర్కొన్నాడు.కాగా నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఇటీవల ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో శతకంతో ఆకట్టుకున్నాడు.ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తప్పకుండా తుదిజట్టులో ఉంటారని అంచనా వేసిన ఇర్ఫాన్ పఠాన్.. బుమ్రా గాయం త్వరగా నయమైపోవాలని ఆకాంక్షించాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ తిరస్కరించగా.. హైబ్రిడ్ విధానంలో భారత్ మ్యాచ్లు జరుగనున్నాయి. తటస్థ వేదికైన దుబాయ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో మ్యాచ్లో రోహిత్ సేన తమ ప్రయాణం ఆరంభించనుంది.సునిల్ గావస్కర్- ఇర్ఫాన్ పఠాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శుబ్మన్ గిల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: CT 2025: వరల్డ్కప్లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ: శ్రేయస్ అయ్యర్ -
BCCI: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సమయం సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ తదితర బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం ఇంత వరకు ఈ టోర్నీలో పాల్గొనే సభ్యుల పేర్లు వెల్లడించలేదు.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajiv Shukla) కీలక అప్డేట్ అందించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ఈనెల 18 లేదా 19వ తేదీల్లో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 2017లో టైటిల్ గెలిచిన పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.భద్రతా కారణాల దృష్ట్యాఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో అనేక చర్చోపచర్చల అనంతరం ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. దీని ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్లను తటస్థ వేదికైన దుబాయ్లో ఆడనుంది.ఇక తమ తొలి మ్యాచ్లో భాగంగా భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. కాగా ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఆసీస్తో పాటు టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. మరోవైపు.. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయిన పాకిస్తాన్.. సొంతగడ్డపై జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారీ అంచనాలతో ముందుకు రానుంది. ఆసీస్ను వారి స్వదేశంలో వన్డే సిరీస్లో ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకూ ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును వన్డే సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ చేసి జోరు మీదుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025గ్రూప్-‘ఎ’- ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’- ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్డబ్ల్యూపీఎల్ వేదికలు ఎంపిక చేశాంఇదిలా ఉంటే..వచ్చే నెల 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుంది. గతేడాది రెండు (లక్నో, బరోడా) వేదికల్లో ఈ లీగ్ నిర్వహించగా... ఈ సారి నాలుగు నగరాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2న డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరగనుండగా... అదే నెల 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.ఇక మే 25న ఐపీఎల్ తుదిపోరుకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ ట్రోఫీ చేజిక్కించుకోవడంతో... తొలిపోరు కూడా అక్కడే జరగనుంది.బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడేఈ సమావేశంలో బోర్డు కార్యదర్శిగా దేవజిత్ సైకియా(Devjith Saikiya), కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు వీరిద్దరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక అవసరం లేకుండా పోయిందని... ఎన్నికల అధికారి వెల్లడించారు. మరోవైపు.. డబ్ల్యూపీఎల్ వేదికల ఎంపిక గురించి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. అతి త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని కూడా రాజీవ్ శుక్లా తెలిపారు.చదవండి: CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు -
భారత క్రికెట్కు దుర్దినం.. ఒకే రోజు మూడు పరాభవాలు
భారత క్రికెట్కు సంబంధించి ఇవాళ (డిసెంబర్ 8) దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు భారత క్రికెట్ జట్లకు మూడు పరాభవాలు ఎదురయ్యాయి. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 122 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఇవాళే జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో యంగ్ ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. ఫైనల్లో భారత్పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్గా అవతరించింది. ఇలా ఒకే రోజు భారత క్రికెట్ జట్లు మూడు పరాభవాలు ఎదుర్కోవడంతో సగటు భారత క్రికెట్ అభిమాని బాధ పడుతున్నాడు. భారత క్రికెట్కు ఇవాళ దుర్దినం అని అభిప్రాయపడుతున్నాడు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో టీమిండియా గెలుపొందగా.. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరుగనుంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. తద్వారా ఆసీస్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది.అండర్-19 ఆసియా కప్ విషయానికొస్తే.. ఇవాళ జరిగిన ఫైనల్లో భారత్పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్
ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. యుద్ధజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చోర్మలే, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో రిజాన్ హొసేన్ (47) టాప్ స్కోరర్గా నిలువగా.. మొహమ్మద్ షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హసన్ ఫైసల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 199 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అజీజుల్ హకీమ్ తమీమ్ (3/8), ఇక్బాల్ హొసేన్ ఎమోన్ (3/24), అల్ ఫహద్ (2/34), మరూఫ్ మ్రిద (/36), రిజాన్ హొసేన్ (1/14) దెబ్బకు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (26), హార్దిక్ రాజ్ (24), కేపీ కార్తికేయ (21), అండ్రే సిద్దార్థ్ (20), చేతన్ శర్మ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
ICC: తొలిసారి మెగా టోర్నీలోకి జింబాబ్వే.. భారత్ షెడ్యూల్ ఇదే
అంతర్జాతీయ మహిళా క్రికెట్కు సంబంధించిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం(FTP) ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఐసీసీ వుమెన్స్ చాంపియన్షిప్తో పాటు మహిళల వన్డే ప్రపంచకప్ 2029కు సన్నాహకంగా ఈ షెడ్యూల్ ఉండబోతోందని పేర్కొంది. అంతేకాదు.. ఈసారి వరల్డ్కప్ టోర్నీలో అదనంగా మరో జట్టు కూడా చేరుతోందని తెలిపింది. జింబాబ్వే తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టనుందని ఐసీసీ పేర్కొంది.44 సిరీస్లుఇక 2025-29 మధ్యకాలంలో వుమెన్స్ చాంపియన్షిప్లో మొత్తంగా 44 సిరీస్లు నిర్వహించబోతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందులో 132 వన్డేలు ఉంటాయని.. ప్రతి సిరీస్లోనూ మూడు మ్యాచ్ల చొప్పున జట్లు ఆడతాయని తెలిపింది.కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాంలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో స్వదేశంలో మ్యాచ్లు ఆడనుంది. ఇక విదేశీ గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లను ఎదుర్కోనుంది.ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా 2025లో ఐసీసీ వుమెన్స్ వనన్డే వరల్డ్కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అదే విధంగా.. యునైటెడ్ కింగ్డమ్లో 2026లో టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, 2028 టీ20 వరల్డ్కప్నకు మాత్రం ఇంకా వేదికను ప్రకటించలేదు.ఐసీసీ వుమెన్స్ చాంపియన్షిప్లో పాల్గొనబోయే దేశాలుఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే.ఆస్ట్రేలియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్లతో.. అదే విధంగా భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక పర్యటన.ఇండియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనబంగ్లాదేశ్ షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పర్యటనఇంగ్లండ్ షెడ్యూల్స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్లతో.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక పర్యటనఐర్లాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్లతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక పర్యటనన్యూజిలాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్ పర్యటనపాకిస్తాన్ షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ పర్యటనసౌతాఫ్రికా షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్లతో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే పర్యటనశ్రీలంక షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్లతో... న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనవెస్టిండీస్ షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంకలతో.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్ పర్యటనజింబాబ్వే షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్లతో.. భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటన.చదవండి: ఉత్కంఠ పోరులో పాక్పై ఆస్ట్రేలియా గెలుపు -
Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు!.. ఎట్టకేలకు కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ఎట్టకేలకు తిరిగి ఫామ్లోకి వచ్చాడు. న్యూజిలాండ్తో తొలి టెస్టులో అర్ధ శతకం బాది.. తొమ్మిది నెలల నిరీక్షణకు తెరదించాడు. తనకు సొంత మైదానం(ఐపీఎల్- ఆర్సీబీ)లాంటి బెంగళూరు చిన్వస్వామి స్టేడియంలో.. చక్కని షాట్లతో అలరిస్తూ.. టెస్టుల్లో తన 31వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. డెబ్బై బంతుల్లో ఫిఫ్లీ పూర్తి చేసుకున్నాడు.అరుదైన మైలురాయికాగా సంప్రదాయ క్రికెట్లో కోహ్లి చివరగా గతేడాది డిసెంబరులో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి మరో అరుదైన మైలురాయిని దాటాడు. టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టుల్లో కోహ్లి నిరాశపరిచిన విషయం తెలిసిందే.బంగ్లాతో తొలి మ్యాచ్లో కేవలం 23 పరుగులే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టులో 76(47, 29*) చేయగలిగాడు. అయితే, న్యూజిలాండ్తో బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయి పాత కథనే పునరావృతం చేశాడు. అయితే, శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు.ధీటుగా బదులిస్తున్న టీమిండియాఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 402 పరుగులు చేసింది. అయితే, రోహిత్ సేన ఇందుకు ధీటుగా బదులిస్తోంది. 40 ఓవర్ల ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ(52) చేయగా.. సర్ఫరాజ్ ఖాన్, కోహ్లి అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
టెస్టుల్లో త్వరలోనే ఎంట్రీ!.. గంభీర్ భయ్యా చెప్పారు: సంజూ
కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడా? కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ గౌతం గంభీర్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను రెడ్బాల్ క్రికెట్ ఆడించేందుకు సుముఖంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సంజూ శాంసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు.దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన సంజూ 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20ల సందర్భంగా అరంగేట్రం చేసిన అతడికి ఆరేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం లభించింది. ఇప్పటి వరకు భారత్ తరఫున 16 వన్డేలు, 33 టీ20లు ఆడిన సంజూ శాంసన్.. ఆయా ఫార్మాట్లలో 510, 594 పరుగులు చేశాడు.టీమిండియా తరఫున టీ20 సెంచరీఇక వన్డేల్లో ఓ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లో శతకం నమోదు చేశాడు. అయితే, పరిమిత ఓవర్ల జట్టులోనే ఇప్పటి వరకు సంజూకు నిలకడైన స్థానం లేదు. అయినప్పటికీ టెస్టుల్లోనూ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. మేనేజ్మెంట్ పిలిచి మరీ రెడ్బాల్ క్రికెట్పై దృష్టి పెట్టాలని చెప్పడంతో లక్ష్యానికి చేరువవుతున్నాడు.మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిందిఈ విషయాల గురించి సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్కే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. రెడ్బాల్ క్రికెట్లో రాణించగలననే నమ్మకం నాకుంది. టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడాలనేది నా చిరకాల కోరిక.దులిప్ ట్రోఫీ ఆరంభానికి ముందు నాకు నాయకత్వ బృందం(కెప్టెన్, కోచ్) నుంచి సందేశం వచ్చింది. రెడ్బాల్ క్రికెట్ జట్టులోనూ నా పేరును పరిశీలిస్తున్నామని మేనేజ్మెంట్లోని ముఖ్యులు చెప్పారు. రంజీ ట్రోఫీపై దృష్టి పెట్టి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని.. రెడ్బాల్ క్రికెట్ను సీరియస్గా తీసుకోవాలని చెప్పారు’’ అని పేర్కొన్నాడు.గంభీర్ భయ్యా మద్దతు ఉంది అదే విధంగా హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గౌతం భయ్యా నాకెల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. కష్టకాలంలో నాకు అండగా నిలబడ్డాడు. నిజానికి టీమిండియాకు ఆడుతున్నపుడు బ్యాటింగ్ స్థానం సుస్థిరంగా ఉండదు. మూడు వారాల ముందే చెప్పారు!అయితే, బంగ్లాతో సిరీస్కు మూడు వారాల ముందే నేను ఓపెనర్గా రావాలని మేనేజ్మెంట్ చెప్పింది. కొత్త పాత్రలో ఇమిడిపోయేలా నేను మానసికంగా సిద్ధపడేందుకు తగిన సమయం ఇచ్చింది’’ అంటూ 29 ఏళ్ల సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్ స్టార్తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.సంజూకు అంత ఈజీ కాదుకాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో సంజూ శాంసన్ ఇప్పటి వరకు 64 మ్యాచ్లు ఆడి 38.96 సగటుతో 3819 పరుగులు చేశాడు. ఇందులో 11 శతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-డి జట్టుకు ఆడిన అతడు మెరుపు సెంచరీ(101 బంతుల్లో 106) సాధించాడు. అయితే, టెస్టుల్లో వికెట్ కీపర్ స్థానంలో రిషభ్ పంత్ పాతుకుపోగా.. ధ్రువ్ జురెల్ బ్యాకప్గా ఉన్నాడు. సంజూ కూడా రేసులోకి రావాలంటే వికెట్ కీపింగ్ స్కిల్స్తో పాటు బ్యాటింగ్ పరంగానూ మరింత గొప్పగా రాణించాల్సి ఉంటుంది. అలా అయితే, జురెల్ను దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.చదవండి: W T20 WC: ‘హర్మన్పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకు ఛాన్స్’ -
Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..
టీమిండియా క్రికెటర్లు ఎవరైనా సరే తమ సహజ శైలిలో చెలరేగుతుంటే... జట్టు వ్యూహాల పేరుతో వారి దూకుడుకు హద్దులు పెట్టబోమని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ‘బ్యాటింగ్ కింగ్’ విరాట్ కోహ్లి ఫామ్పై తమకెలాంటి ఆందోళనా లేదని, అతని పరుగుల దాహం ఎప్పటికీ తీరదని గంభీర్ తెలిపాడు. అయితే, బుధవారం నుంచి న్యూజిలాండ్తో జరిగే మూడు టెస్టుల సిరీస్లో టీమిండియాకు కఠిన సవాళ్లు తప్పవన్నాడు.ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్ సహ కివీస్తో టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలపై గంభీర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించాడు. భవిష్యత్తులో జరిగే సిరీస్లకంటే ప్రస్తుత సిరీస్పైనే తమ దృష్టి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే...అడ్డు ఎందుకు? ‘‘భారత బ్యాటింగ్కు నిర్దిష్టమైన శైలి ఇదని, ఇలాగే ఆడాలనే కచ్చితమైన ప్రణాళికలేమీ లేవు. ఆటగాళ్లు దూకుడుగా ఆడితే ఆడని... చెలరేగితే చెలరేగని ఇందులో అడ్డుకట్టలెందుకు పెట్టాలి. వారి సహజశైలిని వారు కొనసాగించే స్వేచ్ఛ ఇవ్వాలి కదా! గట్టిగా చెప్పాలంటే... మేం ఒక రోజులో 400–500 పరుగులైనా చేయాలనుకుంటాం. తప్పదు అవసరమనుకుంటే రెండు రోజుల పాటు జిడ్డుగా ఆడి ‘డ్రా’ అయినా చేసుకోగలుగుతాం.ఎందుకంటే కొన్నిసార్లు 100 పరుగులకే ఆలౌటయ్యే ప్రమాదం రావొచ్చు. అప్పుడు క్రీజులో నిలబడే ఓపిక, గంటల తరబడి ఆడే సామర్థ్యం కూడా అవసరం. టీమిండియా ఇలా తయారుకావడమే ముఖ్యం. అప్పుడే దూకుడైన ఆటతో అభిమానులకు మజా దక్కుతుంది. పరిస్థితులను బట్టే నిర్ణయాలు ఈ సిరీస్లో ఇలా ఆడాలని, ఆ ప్రత్యర్థిని అలా ఎదుర్కోవాలనే ముందస్తు ప్రణాళికలపైనే ఆధారపడటం కుదరదు. వీలును బట్టి, అప్పటి పరిస్థితులు, పిచ్లో ఎదురయ్యే సవాళ్లు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలుంటాయి. దీనికి పక్కా ప్రణాళికంటూ అమలు కాదు... అప్పటి పరిస్థితులే ప్రామాణికం. దాన్నిబట్టే ఆటతీరు మారుతుంది. ఆడే శైలి మరో దశకు చేరుకుంటుంది.కివీస్తో గట్టిపోటీ న్యూజిలాండ్ సాదాసీదా ప్రత్యర్థి కానేకాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా షాక్లు తప్పవు. సొంతగడ్డ అనే అనుకూలతలు, గత సిరీస్ గెలిచాం... ఇదీ గెలుస్తామనే ధీమా తప్పు. బంగ్లాదేశ్తో పోల్చితే కివీస్ పూర్తిగా భిన్నమైన ప్రత్యర్థి. ఆ జట్టు గట్టి పోటీ ఇస్తుంది. నాణ్యమైన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు.కాబట్టి ప్రతీ మ్యాచ్లోనూ మాకు సవాళ్లు తప్పవు. అయితే ప్రత్యర్థి కివీసా లేదంటే ఆసీసా అని చూడం. జట్టు గెలుపొందడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. వచ్చే నెలలో మొదలయ్యే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ఫైనల్ బెర్తే లక్ష్యంగా కివీస్ను ఓడించేపనిలో ఉంటాం .వరల్డ్క్లాస్ ప్లేయర్కోహ్లిపై నా ఆలోచనలు సుస్పష్టం. అతనో విశ్వవిఖ్యాత క్రికెటర్. సుదీర్ఘకాలంగా గొప్పగా రాణిస్తున్న బ్యాటర్. కోహ్లి అరంగేట్రం చేసినపుడు ఎలాంటి పరుగుల దాహంతో ఉన్నాడో... ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఇప్పటికి అలాంటి ఆకలితోనే ఉన్నాడు. కివీస్తో జరిగే మూడు టెస్టుల సిరీస్లో తప్పకుండా రాణిస్తాడనే ఆశిస్తున్నాను.ఇకపైనా అదే ఆటతీరును ఆస్ట్రేలియా పర్యటనలోనూ కొనసాగిస్తాడనే నమ్మకంతో ఉన్నాను. వరుసగా కొన్ని మ్యాచ్ల్లో... లేదంటే ఒకట్రెండు సిరీస్లలోనే విఫలమైనంత మాత్రాన అతడిబ్యాటింగ్లో సత్తా లేదని కాదు. ఆటగాళ్లు కదా... ఎవరికైనా వైఫల్యాలు సహజం. అలాగే వాటిని అధిగమించడం కూడా జరుగుతుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
‘పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు’
టీ20 క్రికెట్లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.లంక పర్యటనతో మొదలుకాగా టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్లో లంకను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడింది.బంగ్లా బౌలింగ్ ఊచకోతసొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్లలో బంగ్లా బౌలింగ్ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారువిధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.బలహీన జట్లపై మాత్రమేనా?జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్రేటుతో పరుగులు చేశారు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
India vs Bangladesh: దసరా ధమాకా
హైదరాబాద్లో విజయదశమి రోజున సాయంత్రం...పండగ సంబరాలను కాస్త పక్కన పెట్టి క్రికెట్ వైపు వచి్చన అభిమానులు అదృష్టవంతులు! అటు స్టేడియంలో గానీ ఇటు ఇంట్లో గానీ మ్యాచ్ చూసినవారు ఫుల్ దావత్ చేసుకున్నట్లే! అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చి భారత క్రికెటర్లు పారించిన పరుగుల ప్రవాహంతో పండగ ఆనందం రెట్టింపు అయిందంటే అతిశయోక్తి కాదు. 25 ఫోర్లు, 23 సిక్స్లు...ఈ 47 బౌండరీలతోనే ఏకంగా 232 పరుగులు...రెండు ఓవర్లు మినహా మిగతా 18 ఓవర్లూ పదికి పైగా పరుగులు వచి్చన పవర్ప్లే ఓవర్లే! 43 బంతులకే 100, 84 బంతులకే 200 వచ్చేశాయి...అలా వెళ్లిన స్కోరు 300కు కాస్త ముందు ఆగింది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు బద్దలు...సరికొత్త రికార్డులు నమోదు. అంతర్జాతీయ టి20ల్లో 28 ఇన్నింగ్స్ల తర్వాత కూడా 2 అర్ధసెంచరీలు, ఇరవై లోపు లోపు 20 స్కోర్లతో తన సెలక్షన్పై సందేహాలు రేకెత్తిస్తూ వచి్చన సంజు సామ్సన్ ఎట్టకేలకు అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సహా అతని మెరుపు సెంచరీ హైలైట్గా నిలిచింది. అతి భారీ లక్ష్యం ముందుండగా ముందు చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ఆడి లాంఛనం ముగించింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై బంగ్లాదేశ్తో సమరాన్ని భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో ముగించింది. టెస్టు సిరీస్ను 2–0తో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్ను కూడా 3–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్లోనే 86 పరుగుల ఓటమి తర్వాత సిరీస్ కోల్పోయి కునారిల్లిన బంగ్లాకు చివరి పోరులో అంతకంటే పెద్ద దెబ్బ పడింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ 133 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్స్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్స్లు) ఎప్పటిలాగే చెలరేగాడు. సామ్సన్, సూర్య రెండో వికెట్కు 70 బంతుల్లోనే 173 పరుగులు జోడించడం విశేషం. వీరిద్దరికి తోడు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్లు) రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్స్లు) కూడా దూకుడు కనబర్చడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేయగలిగింది. తౌహీద్ హృదయ్ (42 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు), లిటన్ దాస్ (25 బంతుల్లో 42; 8 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 6, 6, 6, 6, 6... అభిషేక్ (4)ను తొందరగా అవుట్ చేయడం ఒక్కటే బంగ్లాకు దక్కిన ఆనందం. ఆ తర్వాత 69 బంతుల పాటు వారికి సామ్సన్, సూర్య చుక్కలు చూపించారు. తస్కీన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 4 ఫోర్లు కొట్టగా, తన్జీమ్ ఓవర్లో సూర్య వరుసగా 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్ప్లేలోనే జట్టు 82 పరుగులు చేసింది. 22 బంతుల్లో సామ్సన్ అర్ధసెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత బంగ్లా స్పిన్నర్ రిషాద్ బాధితుడయ్యాడు. రిషాద్ తొలి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన సామ్సన్...అతని తర్వాతి ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. తొలి బంతికి పరుగు తీయని సామ్సన్ తర్వాతి ఐదు బంతుల్లో 6, 6, 6, 6, 6తో చెలరేగాడు. మరో వైపు 23 బంతుల్లో సూర్య హాఫ్ సెంచరీ పూర్తయింది. మహేదీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా ఫోర్ కొట్టడంతో సామ్సన్ 40 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఎట్టకేలకు సెంచరీ తర్వాత సామ్సన్ను ముస్తఫిజుర్ వెనక్కి పంపడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. తర్వాతి ఓవర్లోనే సూర్య అవుటయ్యాడు. ఆ తర్వాతా భారత్ను నిలువరించడం బంగ్లా వల్ల కాలేదు. పాండ్యా తన జోరును చూపిస్తూ తన్జీమ్ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టగా...మహేదీ ఓవర్లో పరాగ్ వరుసగా 6, 4, 6 బాదాడు. వీరిద్దరు 26 బంతుల్లోనే 70 పరుగులు జత చేశారు. మూడు బంతులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో క్రీజ్లోకి వచి్చన నితీశ్ కుమార్ రెడ్డి (0) తొలి బంతికే వెనుదిరగ్గా...300కు 3 పరుగుల ముందు భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తౌహీద్, దాస్ నాలుగో వికెట్కు 38 బంతుల్లో 53 పరుగులు జోడించి కాస్త పోరాడటం మినహా చెప్పుకునేందుకు ఏమీ లేకపోయింది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) మహేదీ (బి) ముస్తఫిజుర్ 111; అభిషేక్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 4; సూర్యకుమార్ (సి) రిషాద్ (బి) మహ్ముదుల్లా 75; పరాగ్ (సి) దాస్ (బి) తస్కీన్ 34; పాండ్యా (సి) రిషాద్ (బి) తన్జీమ్ 47; రింకూ (నాటౌట్) 8; నితీశ్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 0; సుందర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 297. వికెట్ల పతనం: 1–23, 2–196, 3–206, 4–276, 5–289, 6–289. బౌలింగ్: మహేదీ 4–0–45–0, తస్కీన్ 4–0–51–1, తన్జీమ్ 4–0–66–3, ముస్తఫిజుర్ 4–0–52–1, రిషాద్ 2–0–46–0, మహ్ముదుల్లా 2–0–26–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (సి) పరాగ్ (బి) మయాంక్ 0; తన్జీద్ (సి) వరుణ్ (బి) సుందర్ 15; నజ్ముల్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 14; లిటన్దాస్ (సి) (సబ్) తిలక్ (బి) బిష్ణోయ్ 42; తౌహీద్ (నాటౌట్) 63; మహ్ముదుల్లా (సి) పరాగ్ (బి) మయాంక్ 8; మహేదీ (సి) పరాగ్ (బి) నితీశ్ 3; రిషాద్ (సి) అభిషేక్ (బి) బిష్ణోయ్ 0; తన్జీమ్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–0, 2–35, 3–59, 4–112, 5–130, 6–138, 7–139. బౌలింగ్: మయాంక్ 4–0–32–2, పాండ్యా 3–0–32–0, సుందర్ 1–0–4–1, నితీశ్ 3–0–31–1, రవి 4–1– 30–3, వరుణ్ 4–0–23–0, అభిషేక్ 1–0–8–0. -
శాంసన్ సరికొత్త చరిత్ర.. ధోనికి కూడా సాధ్యం కాలేదు
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి రెండు టీ20ల్లో 29, 10 పరుగులతో నిరాశపరిచిన సంజూ.. ఆఖరి టీ20లో మాత్రంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లా బౌలర్లకు శాంసన్ చుక్కులు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్గా ఈ కేరళ స్టార్ క్రికెటర్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 111 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సంజూ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. శాంసన్ సాధించిన రికార్డులు ఇవే..➔అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాల్గవ బ్యాటర్గా శాంసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్పై 35 బంతుల్లో మిల్లర్ సెంచరీ సాధించాడు. అదే విధంగా భారత్ తరపున ఈ ఘనత అందుకున్న రెండో ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. ఈ లిస్ట్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ శ్రీలంకపై 35 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.➔ఈ మ్యాచ్లో బంగ్లా స్పిన్నర్ రిషద్ హోస్సేన్ను సంజూ ఊతికారేశాడు. హోస్సేన్ వేసిన 10 ఓవర్లో వరుసగా ఐదు సిక్స్లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్స్లు పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా శాంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 వరల్డ్కప్లో ఇంగ్లండ్పై యువీ ఆరు సిక్స్లు బాదాడు.➔భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్గా సంజు శాంసన్ సంజూ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోర్ 89 పరుగులు మాత్రమే. 2022లో శ్రీలంకతో జరిగిన టీ20లో ఇషాన్ కిషన్ 89 పరుగులు చేశాడు.➔బంగ్లాదేశ్పై టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన భారత క్రికెటర్గా సంజూ నిలిచాడు. ఈ మ్యాచ్లో శాంసన్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2019లో రాజ్కోట్ వేదికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ 23 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్తో హిట్మ్యాన్ రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
'టీమ్ కంటే ఏదీ ఎక్కువ కాదు.. జట్టులో నిస్వార్థ క్రికెటర్లు ఉండాలి'
టీ20ల్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. తద్వారా టీ20 సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో 297 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్లో 164 పరుగులకే ప్రత్యర్ధిని కట్టడి చేసింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తమ కుర్రాళ్ల ఆటతీరు పట్ల సూర్య సంతోషం వ్యక్తం చేశాడు."బంగ్లాతో టీ20 సిరీస్ను వైట్ వాష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక జట్టుగా చాలా సాధించాము. నా జట్టులో నిస్వార్థమైన క్రికెటర్లు ఉండాలని కోరుకుంటా. హార్దిక్ చెప్పినట్లుగా ఫీల్డ్లోనైనా, ఆఫ్ది ఫీల్డ్లోనైనా ఒకరి ప్రదర్శనలను ఒకరు ఆస్వాదించాలనుకుంటున్నాము.వీలైనంత ఎక్కువ సమయం సరదగా గడపాలని అనుకుంటున్నాము. మైదానంలో కూడా మా స్నేహాన్ని కొనసాగిస్తాము. ఇక గతంలో శ్రీలంకతో సిరీస్కు వెళ్లినప్పుడు గౌతీ భాయ్(గౌతమ్ గంభీర్) ఏం చెప్పాడో.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కూడా అదే సలహా ఇచ్చాడు. జట్టు కంటే ఏది ముఖ్యం కాదు. ఎవరైనా 99 లేదా 49 మీద ఉన్నప్పుడు షాట్ ఆడే ఆవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఆడేయాలి. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ అదే చేశాడు. నిజంగా అతడి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో ఖచ్చితంగా ఆప్షన్స్ ఉండాలి. ఓవరాల్గా ఈ సిరీస్లో మా జట్టు ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది. జట్టు విజయాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావడం చాలా అనందంగా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
సంజూకు ఊపు వచ్చింది.. ఉప్పల్లో ఊచకోత! వీడియో వైరల్
సంజూ శాంసన్.. ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచిన సంజూ.. ఒకే ఒక ఇన్నింగ్స్తో తనపై విమర్శల చేస్తున్న వారి నోరు మూయించాడు. తను బ్యాట్కు పని చెబితే ఏ విధంగా ఉంటుందో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. బంగ్లాదేశ్తో తొలి రెండు టీ20ల్లో పెద్దగా రాణించకపోయిన శాంసన్.. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉప్పల్లో బంగ్లా బౌలర్లను ఈ కేరళ బ్యాటర్ ఊచకోత కోశాడు. ఓపెనర్గా వచ్చిన సంజూను అపడం ఎవరూ తరం కాలేదు. అతడు బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు. మైదానం నలుమూలల సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. రోహిత్ శర్మ తర్వాత వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాటర్గా శాంసన్ రికార్డులకెక్కాడు. రోహిత్ శ్రీలంకపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఓవరాల్గా 47 బంతులు ఎదుర్కొన్న సంజూ 11 ఫోర్లు, 8 సిక్స్లతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒకే ఓవర్లో 5 సిక్స్లుఇక ఈ మ్యాచ్లో బంగ్లా స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ను సంజూ ఊతికారేశాడు. 10 ఓవర్ వేసిన రిషాద్ బౌలింగ్లో వరుసగా అయిదు సిక్స్లు బాది అదరహో అనిపించాడు. ఈ ఓవర్ తొలి బంతిని డాట్ చేసిన సంజూ శాంసన్.. ఫుల్టాస్గా వచ్చిన రెండో బంతిని సిక్సర్గా తరలించాడు.మూడో బంతిని లాంగాఫ్ దిశగా... నాలుగో బంతిని స్ట్రైట్గా.. ఐదో బంతిని లాంగాన్ దిశగా.. చివరి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా మలిచాడు. అతడి విధ్వంసం చూసి బంగ్లా ఆటగాళ్లు షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Sanju Samson - you beauty!🤯#IDFCFirstBankT20ITrophy #INDvBAN #JioCinemaSports pic.twitter.com/JsJ1tPYKgD— JioCinema (@JioCinema) October 12, 2024 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా జూలు విధిల్చింది. ఈ ఆఖరి టీ20లో బంగ్లాను 133 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన భారత జట్టు పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.భారత్ సాధించిన రికార్డులు ఇవే..➔అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఈ రికార్డు సాధించిన జాబితాలో నేపాల్ ఉంది. ఆసియా క్రీడలు-2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ 314 పరుగులు చేసింది. కాగా ఈ 297 పరుగులే భారత్కు టీ20ల్లో అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 260 పరుగులు భారత అత్యధిక స్కోర్గా ఉండేది.➔ఒక టీ20 ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సాధించింది. బంగ్లాతో మ్యాచ్లో భారత్ ఏకంగా 47 బౌండరీలు బాదింది. అందులో22 సిక్స్లు, 25 ఫోర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు చెక్ రిపబ్లిక్(43 పేరిట ఉండేది.➔వరల్డ్ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటివరకు భారత జట్టు టీ20ల్లో 37 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టు సొమర్సెట్ పేరిట ఉండేది. సొమర్సెట్ 36 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. తాజా మ్యాచ్తో సొమర్సెట్ ఆల్టైమ్ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.➔టీ20ల్లో వేగంగా 100 పరుగుల మార్క్ అందుకున్న జట్టు కూడా టీమిండియానే. ఈ మ్యాచ్లో భారత్ 7.1 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది. ఇప్పటివరకు ఈ రికార్డు 7.6 ఓవర్లతో భారత్ పేరిటే ఉండేది.➔ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్ల బాదిన జాబితాలో భారత్ మూడో స్ధానంలో నిలిచింది. బంగ్లాతో మ్యాచ్లో భారత్ 22 సిక్స్లు కొట్టింది.చదవండి: IND vs BAN: చెలరేగిన సంజూ, సూర్య.. బంగ్లాను చిత్తు చేసిన భారత్ -
చెలరేగిన సంజూ, సూర్య.. బంగ్లాను చిత్తు చేసిన భారత్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఊతికారేశారు.అభిషేక్ శర్మ మినహా మిగితా అందరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత బ్యాటర్లలో ఓపెనర్ సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా కీలక ఇన్నింగ్స్లు ఆడారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.3 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్..అనంతరం బ్యాటింగ్కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లతో మెరిశాడు. అతడితో పాటు మయాంక్ యాదవ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో తహిద్ హృదాయ్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..! 🚨 ONE OF THE MOST RIDICULOUS SHOTS EVER 🚨- Sanju Samson is a beast...!!!! pic.twitter.com/e3hblLeXyA— Johns. (@CricCrazyJohns) October 12, 2024 -
సంజూ శాంసన్ విధ్వంసకర శతకం.. టీమిండియా అతి భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా భారత్ అంతర్జాతీయ టీ20 చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా తలో చేయి వేయడంతో భారత్ రికార్డు స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 4, రింకూ సింగ్ 8, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ ఒక్క పరుగు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS BAN 3rd T20: మరోసారి విఫలమైన అభిషేక్ శర్మ
బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ ఈ సిరీస్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో 16, 15, 4 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ల గైర్హాజరీలో జట్టులో చోటు దక్కించుకున్న అభిషేక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక ఉసూరుమనిపించాడు. ఇటీవలే జింబాబ్వేపై మెరుపు సెంచరీ చేసిన అభిషేక్పై భారీ అంచనాలు ఉండేవి. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించగలడని మేనేజ్మెంట్ అతనిపై విశ్వాసం ఉంచింది. అయితే అభిషేక్ అందరి అంచనాలను వమ్ము చేస్తూ తేలిపోయాడు. ప్రస్తుతమున్న కాంపిటీషన్లో అభిషేక్కు మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమే.కాగా, హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా 23 పరుగుల వద్దే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. అయితే సంజూ శాంసన్ (25 బంతుల్లో 59; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిసున్నారు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 113/1గా ఉంది. చదవండి: దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..! -
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో టీ20 లైవ్ అప్డేట్స్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
రోహిత్, కోహ్లి సరసన చేరేందుకు 31 పరుగుల దూరంలో ఉన్న సూర్య
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల్లో మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. బంగ్లాదేశ్తో ఇవాళ (అక్టోబర్ 12) జరుగబోయే మ్యాచ్లో స్కై మరో 31 పరుగులు చేస్తే 2500 పరుగుల క్లబ్లో చేరతాడు. భారత్ తరఫున కేవలం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాత్రమే 2500 పరుగుల మార్కును దాటారు. స్కై నేటి మ్యాచ్లో 31 పరుగులు సాధిస్తే.. కోహ్లి, రోహిత్ సరసన చేరతాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో 2469 పరుగులు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక టీ20 పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ పొట్టి ఫార్మాట్లో 4231 పరుగులు చేశాడు. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి 125 మ్యాచ్ల్లో 4188 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్కప్-2024 విజయానంతరం రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుంటే భారత్కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు టీమిండియానే గెలిచింది. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. గ్వాలియర్లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్ -
IND VS BAN: మూడో టీ20కి వర్షం ముప్పు..?
భారత్, బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 12) జరగాల్సిన మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లో ఇవాళ సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించవచ్చని వారు పేర్కొన్నారు. నగరంలో ఇవాళ సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని అంచనా.నిన్న సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా తొలి రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గ్వాలియర్లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే ఈ మ్యాచ్ను కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చదవండి: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
బంగ్లాతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తాము: టీమిండియా కోచ్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శనివారం సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. ఆఖరి టీ20లో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్టెన్ డోస్చేట్ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు.ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్నదే మా జట్టు, అభిమానుల కోరిక. కచ్చితంగా అలాగే ముగించేందుకు ప్రయత్నిస్తాము అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనస్తత్వం గురించి మాట్లాడాడు.దేశం తరపున ఆడే ప్రతీ మ్యాచ్లోనూ విజయం సాధించాలని గంభీర్ భావిస్తాడు. ప్రతీసారి ఆటగాళ్లని కూడా ఒత్తిడికి గురిచేస్తాడన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్కు కూడా అన్ని మ్యాచ్లకు సన్నద్దమైనట్లే సిద్దమయ్యాము. ప్రస్తుతం భారత జట్టు అద్బుతంగా ఆడుతోంది. కుర్రాళ్లు కూడా బాగా రాణిస్తున్నారు. తొలిసారి భారత జట్టు తరపున ఆడుతున్న కుర్రాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సిరీస్లో ఇప్పటివరకు జితేష్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రానాలకు ఆడే అవకాశం ఇంకా రాలేదు. మూడో టీ20 జట్టు ఎంపిక కు ఈ యంగ్ ప్లేయర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. కుర్రాళ్లందరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నామని ప్రెస్ కాన్ఫరెన్స్లో ర్యాన్టెన్ డోస్చేట్ పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రాబిన్ ఉతప్ప -
ఉప్పల్లో గెలుపెవరిదో!
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్– బంగ్లాదేశ్ టీ20 క్రికెట్ మ్యాచ్కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సు«దీర్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2,600 మంది బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం, పరిసర ప్రాంతాలను తమ అ«దీనంలోకి తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ గదికి అనుసంధానం చేసినట్లు తెలిపారు. 3 గంటల ముందే అనుమతి.. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్కు 3 గంటల ముందుగానే స్డేడియంలోకి అనుమతిస్తారు. ఈవ్టీజింగ్లను అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీం బృందాలు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోకి బయటి వస్తువులు, తినుబండారాలను తీసుకురావద్దు. కారు పాస్ ఉన్న వారు రామంతాపూర్ నుంచి వచ్చి గేట్ నంబర్ 1, 2 ద్వారా తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. దివ్యాంగులు రామంతాపూర్ గేట్– 3 ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. గేట్ నంబర్ –4 నుంచి 10కి వచ్చే వారు తమ వాహనాలను ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద, రామంతాపూర్ చర్చి గ్రౌండ్లో పార్క్ చేసుకోవాలి. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ సేవలను రాత్రి ఒంటి గంట వరకు పొడిగించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ నుంచి స్టేడియం వైపు, సికింద్రాబాద్ నుంచి స్టేడియం వైపు వచ్చే అన్ని దారులను మళ్లించనున్నారు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్ రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ నుంచి వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు సైతం నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. -
భారత్– బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12న (శనివారం) భారత్– బంగ్లాదేశ్ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.వరంగల్ వైపు నుంచి ఎల్బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: ఒక్కసారిగా వాతావరణం.. హైదరాబాద్లో భారీ వర్షంరామంపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి. -
బంగ్లాతో మూడో టీ20 ఆడే భారత జట్టు ఇదే..! అతడి అరంగేట్రం?
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత జట్టు 2-0 తేడాతో సొంతం చేసుకుంది. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. మరో పొట్టి క్రికెట్ సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది.అయితే సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక జట్టుతో తలపడనుంది. శనివారం హైదరాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో ప్రయోగాలకు సిద్దమైనట్లు భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమచారం. తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్తో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా తొలి రెండు టీ20లకు బెంచ్కే పరిమితమైన తిలక్ వర్మ, స్పిన్నర్ రవి బిష్ణోయ్లు ఆఖరి టీ20లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో టీ20కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ మయాంక్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.బంగ్లాదేశ్తో ఆఖరి టీ20 ఆడే భారత జట్టు (అంచనా)సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా -
ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే ప్రపంచకప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన పాక్.. ఆ తర్వాత టీ20 వరల్డ్కప్లోనూ అదే తీరును కనబరిచింది.ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా టెస్టు సిరీస్ను కోల్పోయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా పాక్ ఓటమి అంచున నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఇంకా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో 115 పరుగుల వెనకబడింది. ఆఖరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. తొలి సెషన్లో పాక్ ఏమైనా మరో రెండు వికెట్లు కోల్పోతే ఓటమి ఖాయమవ్వక తప్పదు.ఈ క్రమంలో తమ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ విమర్శలు వర్షం కురిపించాడు. ఇప్పటికైనా టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు. "ఏ జట్టు అయినా విజయ పథంలో ముందుకు వెళ్లాలంటే సరైన ప్లానింగ్, ఆలోచన విధానం చాలా ముఖ్యం. కానీ ఆ రెండు విషయాలే పాకిస్తాన్ క్రికెట్లో లేవు. దయచేసి భారత్ను చూసి నేర్చుకోండి. వారి ద్వితీయ శ్రేణి జట్టుతో కూడా అద్బుతాలు చేస్తున్నారు. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్లకు విశ్రాంతి ఇచ్చారు. అయినప్పటకి మరో సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. అదే పాక్ జట్టుకు మాత్రం అందరు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా గెలవరు. పాక్ జట్టు మెనెజ్మెంట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి.ప్రస్తుతం బారత జట్టు మెన్జ్మెంట్ అదే పనిచేస్తుంది. బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, రింకూ సింగ్ అదరగొట్టారు. నితీష్ కొట్టి సిక్సర్ల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పవర్ ఫుల్ షాట్లు ఆడాడు. మరోవైపు రింకూ మైఖల్ బెవాన్లా చెలరేగాడు. అయితే వీరిద్దరి విధ్వసంకర ఇన్నింగ్స్ల వెనక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఆటగాళ్లు విఫలమైనా కూడా సపోర్ట్గా ఉంటాడు. అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేసే పనిలో గంభీర్ ఉన్నాడు. అందుకు ఊదహరణే నితీష్" అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. -
బంగ్లాతో మూడో టీ20.. హైదరాబాద్కు చేరుకున్న టీమిండియా
బంగ్లాదేశ్తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. శనివారం ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు హైదరాబాద్కు చేరుకుంది.గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇరు జట్లు తమకు కేటాయించిన హోటల్స్కు పయనమయ్యారు. ఇందుకు సబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక భాగ్యనగరానికి చేరుకున్న భారత్, బంగ్లా జట్లు శుక్రవారం ఉప్పల్లో ప్రాక్టీస్ చేయనున్నాయి. కాగా తొలి రెండు టీ20ల్లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే టిక్కెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి.చదవండి: విండీస్ మహిళల ధనాధన్ విక్టరీ -
వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్లా డైవ్ చేస్తూ! వీడియో
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను టీమిండియా చిత్తు చేసింది.దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్ను 2-0 తేడాతో యంగ్ ఇండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్తో బంగ్లా బ్యాటర్ రిషద్ హొస్సేన్ను పాండ్యా పెవిలియన్కు పంపాడు.సూపర్ మ్యాన్లా..221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషద్ హొస్సేన్ భారత బౌలర్లను ఆడటానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వరుసగా రెండు బౌండరీలు బాది టచ్లోకి వచ్చినట్లు కన్పించాడు.ఈ క్రమంలో బంగ్లా ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి మూడో బంతిని రిషద్కు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆబంతిని రిషద్ లాంగాన్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. అయితే దాదాపు డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో తన ఎడమవైపు పరుగెత్తుకుంటూ వచ్చి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ను అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పాండ్యా బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి బంతిని మాత్రం విడిచిపెట్టలేదు.అతడి క్యాచ్ చూసిన బంగ్లా బ్యాటర్ బిత్తర పోయాడు. మైదానంలో ప్రేక్షకులు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాండ్యాను అభినంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Athleticism at its best! 😎An outstanding running catch from Hardik Pandya 🔥🔥Live - https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/ApgekVe4rB— BCCI (@BCCI) October 9, 2024 -
రియాన్ పరాగ్ ఓవరాక్షన్.. షాకిచ్చిన అంపైర్(వీడియో)
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో భారత యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ వింత బౌలింగ్ యాక్షన్తో అందరిని ఆశ్యర్యపరిచాడు. కొత్త బౌలింగ్ యాక్షన్ను ప్రయత్నించి నవ్వుల పాలయ్యాడు.అసలేం జరిగిందంటే?బంగ్లా ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగ్ చేతికి బంతి అందించాడు. అయితే ఈ మ్యాచ్లో రియాన్ వేసిన మొదటి బంతినే బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లా భారీ సిక్సర్గా మలిచాడు.తద్వారా పరాగ్ కాస్త నిరాశచెందాడు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించి బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. దీంతో లసిత్ మలింగ స్టైల్లో బౌలింగ్ చేయాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని రియాన్.. మహ్మదుల్లాకు స్లింగ్లింగ్ డెలివరీగా సంధించాడు. అతడి బౌలింగ్ యాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడి బౌలింగ్ యాక్షన్పై అనుమానం వచ్చిన ఫీల్డ్ అంపైర్ మధన్ గోపాల్ థర్డ్ అంపైర్ను సంప్రదించాడు. రిప్లేలో బ్యాక్ఫుట్ నో బాల్గా తేలింది. డెలివరీ సంధించే క్రమంలో పరాగ్ బ్యాక్ ఫుట్ ట్రామ్లైన్ వెలుపల ఉంది. అందుకునే థర్డ్ అంపైర్ బ్యాక్ఫుట్ నో బాల్గా ప్రకటించాడు. దీంతో మహ్మదుల్లాకు ఫ్రీ హిట్ లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. What was that Riyan Parag ? 🤣🤣#INDvsBAN pic.twitter.com/JAOTn2mLZM— sajid (@NaxirSajid32823) October 9, 2024 -
నితీష్ రెడ్డి ఒక అద్భుతం.. నేను అనుకున్నదే జరిగింది: భారత కెప్టెన్
టీ20ల్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో యంగ్ ఇండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అభిషేక్ శర్మ, అర్ష్దీప్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలా వికెట్ పడగొట్టారు.ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."మరో టీ20 సిరీస్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో మా టాపార్డర్ బ్యాటర్ల విఫలమైనందుకు మేము నిరాశ చెందలేదు. నిజంగా చెప్పాలంటే నేను కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే మిడిలార్డర్ బ్యాటర్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలని నేను భావించాను. క్లిష్ట సమయంలో ఎలా ఆడుతారో పరీక్షించాలనకున్నాము. ముఖ్యంగా ఐదు, ఆరు, ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చే వారు ఆటగాళ్లు జట్టుకు చాలా ముఖ్యం. ఒకవేళ టాపర్డర్ విఫలమైనా వారు జట్టును ఆదుకునే విధంగా ఉండాలి. అయితే ఈ మ్యాచ్లో నేను కోరుకున్న విధంగానే మా మిడిలార్డర్ బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు.రింకూ, నితీష్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. బౌలర్లను కూడా టెస్టు చేయాలనుకున్నాను. ప్రస్తుత తరం క్రికెట్లో జట్టులో పార్ట్టైమ్ బౌలర్లు ఉండటం చాలా ముఖ్యం. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలి. అందుకే ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే -
టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు అదరగొట్టింది.నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది.చరిత్ర సృష్టించిన భారత్..ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మార్క్ను చూపించాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించి ఔరా అన్పించాడు. అర్ష్దీప్ సింగ్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ బంతిని పంచుకున్నారు. అయితే ఆ ఏడుగురు బౌలర్లలో ప్రతీ ఒక్కరు వికెట్ సాధించారు. కాగా 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్లో ఏడుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా తీయడం ఇదే తొలిసారి. 1932లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు.. ఢిల్లీ టీ20 ముందు వరకు ఏ ఫార్మాట్(వన్డే, టీ20, టెస్టు)లో కూడా భారత జట్టు ఈ అరుదైన ఫీట్ నమోదు చేయలేదు. ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో టెస్టుల్లో 4 సార్లు, వన్డేల్లో 10 సార్లు, టీ20ల్లో 4 సార్లు ఈ ఫీట్ నమోదు అయింది.చదవండి: కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..! -
బంగ్లాదేశ్తో రెండో టీ20.. నితీశ్ కుమార్ ఊచకోత.. టీమిండియా భారీ స్కోర్
న్యూఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ను నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 108 పరుగులు జోడించారు.హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 8, రియాన్ పరాగ్ 15, వరుణ్ చక్రవర్తి 0. సుందర్ 0 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 6, మయాంక్ యాదవ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు. తుది జట్లు..భారత్: సంజు శాంసన్(వికెట్కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(వికెట్కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకెర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
బంగ్లాతో రెండో టీ20.. అరుదైన రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్
ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో బంగ్లాను చిత్తు చేసి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లా కూడా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.కోహ్లి రికార్డుపై కన్నేసిన సూర్య.. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20లో సూర్య మరో 39 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా విరాట్ కోహ్లితో సమంగా నిలుస్తాడు.కోహ్లి 73 మ్యాచ్ల్లో ఈ రేర్ ఫీట్ అందుకోగా.. ఇప్పుడు సూర్యకుమార్ కూడా ఢిల్లీ టీ20లో 39 పరుగులు చేస్తే సరిగ్గా 73 మ్యాచ్ల్లోనే అందుకుంటాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం అగ్రస్ధానంలో ఉన్నాడు. బాబర్ 67 మ్యాచ్ల్లోనే 2500 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్. -
Ind vs Ban మెదడు సరిగ్గా వాడితేనే: యువీ ఘాటు విమర్శలు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి ‘చురకలు’ అంటించాడు. బ్యాటింగ్ చేసేటపుడు మెదడును కాస్త అదుపులో పెట్టుకుంటేనే రాణించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయమేమిటంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టులో అభిషేక్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు.మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపుఈ క్రమంలో ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ పంజాబీ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. అయితే, మరుసటి మ్యాచ్లోనే సెంచరీ చేసి తనను తాను నిరూపించుకున్నాడు. ఈ సిరీస్ ముగిసిన దాదాపు రెండు నెలల తర్వాత అభిషేక్ శర్మ మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.రనౌట్గా వెనుదిరిగిస్వదేశంలో బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో సంజూ శాంసన్తో కలిసి అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, దూకుడుగా ఆడుతున్న క్రమంలో అనూహ్య రీతిలో రనౌట్గా వెనుదిరిగాడు.టీమిండియా ఇన్నింగ్స్లో రెండో ఓవర్ వేసిన టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో ఆఖరి బంతికి సంజూ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్కు ఆస్కారం ఉందని భావించిన సంజూ, అభిషేక్ పరుగుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ప్రమాదాన్ని గ్రహించిన సంజూ.. అభిషేక్ను వెనక్కి వెళ్లమని సూచించాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.బంతిని అందుకున్న బంగ్లాదేశ్ ఫీల్డర్ తౌహీద్ హృదోయ్..నేరుగా స్టంప్స్ వైపునకు విసిరాడు. దీంతో.. నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు వెళ్లిపోయిన అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16 పరుగులు) పెవిలియన్కు చేరకతప్పలేదు. అయితే, మిగతా బ్యాటర్లు రాణించడంతో మ్యాచ్ ఫలితంపై ప్రతికూల ప్రభావం పడలేదు. సంజూ శాంసన్(29), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో టీమిండియా బంగ్లాదేశ్పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! ఈ నేపథ్యంలో విజయానంతరం అభిషేక్ శర్మ ఇన్స్టాలో టీమిండియా ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! సిరీస్లో మాకు శుభారంభం’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు బదులుగా ఓ నెటిజన్.. అభిషేక్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. అయితే, ఆ కామెంట్కు యువీ.. ‘‘కేవలం మెదడు ఉపయోగిస్తే మాత్రమే అది సాధ్యం’’ అన్న అర్థంలో జవాబు ఇచ్చాడు.కాగా అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఎదుగుదలలో యువీది కీలక పాత్ర. ఈ విషయాన్ని అభిషేక్ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు. అయితే, బాగా ఆడినపుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే విమర్శించడం యువీకి అలవాటు. ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదారాబాద్ తరఫున అభి వీరబాదుడు బాది.. నిర్లక్ష్యపు షాట్కు అవుటైనపుడు.. ‘నీ కోసం స్లిప్పర్ ఎదురు చూస్తోంది’ అంటూ యువీ చొరవగా ట్వీట్ చేశాడు. చదవండి: Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’ -
బంగ్లాతో రెండో టీ20.. తెలుగోడికి నో ఛాన్స్! అతడి అరంగేట్రం
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. ఆక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టీ20లో బంగ్లాతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సూర్య సేనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.నితీష్ కుమార్కు నో ఛాన్స్..ఇక రెండో టీ20లో అదే జోరును కొనసాగించి సిరీస్ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన నితీష్ కుమార్ రెడ్డికి రెండో మ్యాచ్కు పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తోంది.అతడి స్ధానంలో పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇదొక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. కాగా అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఒకవేళ టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం.రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్.చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన -
అలా ఎలా కొట్టావు హార్దిక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో)
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.తొలుత బౌలింగ్లో ఓ కీలక వికెట్ పడగొట్టిన పాండ్యా.. తర్వాత బ్యాటింగ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హార్దిక్.. 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. అయితే హార్దిక్ ఆడిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచింది.పాండ్యా నో లుక్ షాట్.. భారత ఇన్నింగ్స్ 12 ఓవర్లో మూడో బంతిని హార్దిక్కు బంగ్లా పేసర్ టాస్కిన్ అహ్మద్ షార్ట్ పిచ్ బాల్ డెలివరీగా సంధించేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం తను ఆశించిన మేరకు బౌన్స్ కాలేదు. అయితే ఇక్కడే హార్దిక్ తన యూటిట్యూడ్ను చూపించాడు. బంతిని చూడకుండానే నో లుక్ ర్యాంప్ షాట్ ఆడాడు.ఆడిన తర్వాత కనీసం బంతి ఎటువైపు వెళ్లింది అన్నది కూడా పాండ్యా చూడలేదు. బంతి కీపర్ తలపై నుంచి మెరుపు వేగంతో బౌండరీకి దూసుకెళ్లింది. ఆ తర్వాత బౌలర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. పాండ్యా షాట్ చూసిన బంగ్లా ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు షాట్ ఆఫ్ ది ఇయర్గా అభివర్ణిస్తున్నారు. 𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!The shot. The reaction. The result ➡️ EPIC 😎WATCH 🎥🔽 #TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank https://t.co/mvJvIuqm2B— BCCI (@BCCI) October 6, 2024 -
ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత జట్టు.. బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బౌలింగ్లో ప్రత్యర్ధిని కేవలం 127 పరుగులకే కట్టడి చేసిన సూర్య సేన.. అనంతరం లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఈ నేపథ్యంలో యువ భారత జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు.ఇది కేవలం భారత జట్టు కాదని, ఐపిఎల్ స్టార్లతో కూడిన జట్టు అని అలీ కొనియాడాడు. కాగా బంగ్లాతో సిరీస్కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ మినహా మిగితా సీనియర్ ఆటగాళ్లంతా దూరమయ్యారు. ఈ క్రమంలో ఐపీఎల్లో అదరగొట్టిన మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి యువ ఆటగాళ్లకు బంగ్లాతో టీ20 సిరీస్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. వీరితో పాటు గత రెండు ఐపీఎల్ సీజన్లో సంచలన ప్రదర్శన కనబరిచిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కూడా మూడేళ్ల తర్వాత భారత జట్టులో చోటు దక్కింది. అయితే వీరు ముగ్గురూ తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్నారు. వరుణ్, మయాంక్ బౌలింగ్లో అదరగొట్టగా.. నితీష్ బ్యాటింగ్లో 16 పరుగులతో పర్వాలేదన్పించాడు."ఇది భారత్ టీమ్ కాదు, యువకులతో కూడిన ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్. ఈ సిరీస్కు యశస్వీ జైశ్వాల్, గిల్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లకు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా తొలి టీ20లో ఆడలేదు. అయినప్పటకి భారత్ 11.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. హార్దిక్ సిక్స్తో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అస్సలు పాకిస్తాన్ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ జట్టు ఇదేనా? భారత్పై టెస్టు సిరీస్లో ఘోర ఓటమిని చవిచూశారు. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే ఆటతీరును కనబరుస్తున్నారు. భారత్ గత కొంత కాలంగా వరల్డ్ క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మరోసారి బంగ్లా దేశ్ భారత్ ముందు తలొగ్గక తప్పదు. మరోవైపు మయాంక్ యాదవ్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.తొలి ఓవర్నే మెయిడెన్గా మలిచాడు. 149.8 kmph వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెట్టాడు. అతడు 150 కి.మీ పైగా వేగంతో అతడు బౌలింగ్ చేయగలడు. కానీ అతడు ఇప్పుడే గాయం నుంచి కోలుకుని రావడంతో ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. కచ్చితంగా అతడు బుమ్రా, షమీ, సిరాజ్ల సరసన చేరుతుడాని" తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు.చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు సమం -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
బంగ్లాదేశ్తో తొలి టీ20లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ఆల్రౌండ్ ప్రతిభతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. సిక్సర్ బాది టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు.విరాట్ కోహ్లి అరుదైన రికార్డు బద్దలుఈ క్రమంలో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున అత్యధిక సార్లు సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేసిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. కాగా బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భాగంగా టీమిండియా ఆదివారం గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచిన సూర్యకుమార్ సేన తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో.. బ్యాటర్లు విఫలం కావడంతో 19.5 ఓవర్లలో 127 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.ధనాధన్ దంచికొట్టారుఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగింది. ఓపెనర్లు సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(ఏడు బంతుల్లో 16) వేగంగా ఆడగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 29) ధనాధన్ దంచికొట్టాడు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి 16(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని చూడకుండానే వికెట్ కీపర్ తల మీదుగా పాండ్యా ఆడిన ర్యాంప్ షాట్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.పాండ్యా మెరుపు ఇన్నింగ్స్.. సిక్సర్తో ముగింపుఈ క్రమంలో పాండ్యా కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులతో 243కు పైగా స్ట్రైక్రేటు నమోదు చేశాడు. పన్నెండవ ఓవర్ ఐదో బంతికి.. టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో సిక్స్ కొట్టి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో ఛేజింగ్లో హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున ఇలా మ్యాచ్ ఫినిష్ చేయడం ఐదోసారి. అంతకు ముందు విరాట్ కోహ్లి నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు. అర్ష్దీప్ సింగ్ను అధిగమించిఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్న హార్దిక్ పాండ్యా.. భారత్ తరఫున 87 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అర్ష్దీప్ సింగ్(86)ను అధిగమించి.. టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో టాప్లో ఉన్నాడు.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
టీమిండియా ప్రపంచ రికార్డు.. పాకిస్తాన్తో పాటు టాప్లో
అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. బంగ్లాదేశ్తో తొలి టీ20లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి.. పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది.127 పరుగులకు బంగ్లా ఆలౌట్తొలుత రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-0తో రోహిత్ సేన పర్యాటక జట్టును క్లీన్స్వీప్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ టీ20లలోనూ శుభారంభం చేసింది. గ్వాలియర్లోని మాధవ్రావ్ సింధియా కొత్త క్రికెట్ స్టేడియంలో టీమిండియా ఆదివారం బంగ్లాదేశ్తో తలపడింది.టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అర్ష్దీప్ సింగ్ మూడు(3/14), హార్దిక్ పాండ్యా(1/26), మయాంక్ యాదవ్(1/21) ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లలో రీ ఎంట్రీ వీరుడు వరుణ్ చక్రవర్తి మూడు(3/31), వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్(1/12) తీశారు.పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సమంఈ క్రమంలో టీమిండియా.. అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధిక సార్లు ఆలౌట్ చేసిన జట్టుగా నిలిచింది. తద్వారా పాకిస్తాన్ ప్రపంచ రికార్డును సమం చేసింది. ఈ జాబితాలో భారత్- పాకిస్తాన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, ఉగాండా, వెస్టిండీస్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధికసార్లు ఆలౌట్ చేసిన జట్లు👉టీమిండియా- 42 సార్లు👉పాకిస్తాన్- 42 సార్లు👉న్యూజిలాండ్- 40 సార్లు👉ఉగాండా- 35 సార్లు👉వెస్టిండీస్- 32 సార్లుఇదిలా ఉంటే.. తొలి టీ20లో బంగ్లా విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 11.5 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు సంజూ శాంసన్(29), అభిషేక్ శర్మ(16) ధనాధన్ దంచికొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(29) కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన అరంగేట్ర ఆటగాడు నితీశ్ రెడ్డి 16.. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39) పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం భారత్ సొంతమైంది. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్Hardik Pandya finishes off in style in Gwalior 💥#TeamIndia win the #INDvBAN T20I series opener and take a 1⃣-0⃣ lead in the series 👌👌Scorecard - https://t.co/Q8cyP5jXLe@IDFCFIRSTBank pic.twitter.com/uYAuibix7Q— BCCI (@BCCI) October 6, 2024 -
నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్
ఢిల్లీ ఎక్స్ప్రెస్ మయాంక్ యాదవ్ టీమిండియా తరఫున అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లో తన తొలి ఓవర్లోనే మెయిడెన్ వేసి ఔరా అనిపించాడు. బంగ్లాదేశ్తో తొలి టీ20లో.. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగలిగాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న తర్వాత నేరుగా టీమిండియాలో అడుగుపెట్టి మయాంక్ ఈ మేర రాణించడం విశేషం.కాస్త ఆందోళనగానే ఉన్నాఇక ఈ మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయానంతరం మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. అరంగేట్రానికి ముందు తన మనఃస్థితి ఎలా ఉందో వివరించాడు. ‘‘మ్యాచ్కు ముందు నేను కాస్త ఆందోళనగానే ఉన్నా. ఎందుకంటే.. గాయం తర్వాత నేను కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు.డైరెక్ట్గా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాను. అయితే, మా కెప్టెన్ వచ్చి నాతో మాట్లాడాడు. బౌలింగ్లో వైవిధ్యం ప్రదర్శించాలనే ఆతురత వద్దని.. సహజమైన శైలిలో ఆడాలని సూచించాడు. గ్వాలియర్ వికెట్ కూడా మరీ అంత బౌన్సీగా లేదు.అందుకే స్లో బాల్స్ వేశానుకాబట్టి నేను మరీ ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయలేదు. ఐపీఎల్లోనూ నేను కొన్ని స్లో బాల్స్ వేశాను. ఇక గంభీర్ భయ్యా కూడా మ్యాచ్ ఆరంభానికి ముందే నాతో మాట్లాడారు. ఇది అంతర్జాతీయ మ్యాచ్ అనే విషయం మరిచిపోతేనే ఒత్తిడి నుంచి బయటపడగలనని చెప్పారు.ఆందోళన చెందకుండా కూల్గా ఉండాలని.. ప్రయోగాలకు వెళ్లకుండా సహజమైన శైలినే అనుసరించాలని చెప్పారు. కెప్టెన్, కోచ్ సూచనలు పాటించడం వల్లే సానుకూల ఫలితం వచ్చింది’’ అని మయాంక్ యాదవ్ పేర్కొన్నాడు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టీ20వేదిక: శ్రీమంత్ మాధవ్రావ్ సింధియా క్రికెట్ స్టేడియం.. గ్వాలియర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ స్కోరు: 127 (19.5)టీమిండియా స్కోరు: 132/3 (11.5)ఫలితం: బంగ్లాదేశ్పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్దీప్ సింగ్(3/14).చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లోనూ టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కొత్త మైదానంలో తొలుత బంగ్లాను 127 పరుగులకే పరిమితం చేసిన భారత్.. మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇక యువ ఆటగాళ్లతో నిండిపోయిన జట్టు ముందు కూడా చతికిల పడిన బంగ్లాదేశ్ మరోసారి చేతులెత్తేసింది. ఈ గెలుపు ద్వారా భారత టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో నాలుగో విజయం నమోదైంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే‘‘జట్టు సమావేశమైన సమయంలో మా నైపుణ్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని పక్కాగా అమలు చేయడంలో సఫలమయ్యాము. మా వాళ్లు పట్టుదలగా ఆడారు. కొత్త గ్రౌండ్లో మేము బ్యాటింగ్ చేసిన విధానం గొప్పగా అనిపించింది.ఇక ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియనన్ని మంచి ఆప్షన్లు ఉండటం మాకు ఒక రకంగా తలనొప్పి కలిగించేదే. అయితే, అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ప్రతి మ్యాచ్లోనూ మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. తదుపరి మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కూర్చుని చర్చించి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.నజ్ముల్ షాంటో బృందం విలవిలకాగా గ్వాలియర్లో కొత్తగా ప్రారంభించిన ‘శ్రీమంత్ మాధవ్రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’లో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. భారత బౌలర్ల దెబ్బకు నజ్ముల్ షాంటో బృందం పరుగులు రాబట్టడానికి ఆపసోపాలు పడింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ ఓపెనర్లు పర్వేజ్ హొసేన్ ఎమాన్(8), లిటన్ దాస్(4) రూపంలో కీలక వికెట్లతో పాటు.. టెయిలెండర్ ముస్తాఫిజుర్(1) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇతర పేసర్లలో అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టాడరు. ఇక స్పిన్నర్లలో వరుణ్ చకవర్రి(3/31), వాషింగ్టన్ సుందర్(1/12) కూడా మెరవగా.. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.మెరుపు ఇన్నింగ్స్లక్ష్య ఛేదనలో టీమిండియాకు బంగ్లా బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కొత్త ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16) సహా వన్డౌన్లో వచ్చిన సూర్య(14 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా.. హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు.ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్తో టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్ష్దీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ 2-0తో క్లీన్స్వీప్ అయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్లోనూ 1-0తో వెనుకబడింది. ఇరుజట్ల మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND Vs BAN 1st T20I: పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా? 𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥Live - https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq— BCCI (@BCCI) October 6, 2024 -
తొలి టీ20.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఊదిపడేసింది. కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా ( 39 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(29), సంజూ శాంసన్(29) పరుగులతో రాణించారు. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.ఇక బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్, మెహాది హసన్ మిరాజ్ తలా వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. -
చెలరేగిన భారత బౌలర్లు.. 127 పరుగులకే బంగ్లా ఆలౌట్
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చేరిగారు. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లా జట్టు కేవలం 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచాడు. వచ్చినవారు వచ్చినట్టుగానే పెవిలియన్కు చేరారు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్.. -
చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్..
టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ తన అరంగేట్ర మ్యాచ్లోనే సత్తాచాటాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మయాంక్.. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.తన ఇంటర్ననేషనల్ కెరీర్ను మెయిడెన్ ఓవర్తో యాదవ్ ప్రారంభించాడు. బంగ్లా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మయాంక్.. ఎటువంటి పరుగులు ఇవ్వకుండా మెయిడిన్గా ముగించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 అరంగేట్ర మ్యాచ్లో తొలి ఓవర్ను మెయిడెన్ చేసిన మూడో భారత బౌలర్గా ఈ ఢిల్లీ పేస్ సంచలనం రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, అర్ష్దీప్ సింగ్ ఉన్నారు.అగార్కర్ 2006లో సౌతాఫ్రికాపై, అర్ష్దీప్ 2022లో ఇగ్లండ్పై ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో ఓవరాల్గా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. 21 పరుగులిచ్చి ఓ కీలక వికెట్ సాధించాడు. -
పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా?
టీమిండియా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జెర్సీలో కన్పించాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత తుది జట్టులో వరుణ్ చోటు దక్కించుకున్నాడు.86 మ్యాచ్లు గ్యాప్ తర్వాత మళ్లీ అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్లో చోటిచ్చిన భారత జట్టు మెనెజ్మెంట్ మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ను మాత్రం బెంచ్కే పరిమితం చేసింది.గంభీర్ ఎఫెక్ట్.. కాగా వరుణ్ చక్రవర్తి పునరాగమనం వెనక గంభీర్ మార్క్ ఉంది. చక్రవర్తికి గంభీర్కు మధ్య మంచి అనుబంధం ఉంది. గత సీజన్లో కేకేఆర్ మెంటార్గా గంభీర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చక్రవర్తి తన ప్రదర్శనతో గౌతీని ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా ఈ తమిళనాడు స్పిన్నర్ రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023, 24 సీజన్లలో మొత్తంగా వరుణ్ 41 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిని గంభీర్ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.పాపం బిష్ణోయ్బిష్ణోయ్ గత కొన్నాళ్లగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తన సత్తా ఏంటో బిష్ణోయ్ నిరూపించుకున్నాడు. గతంలో నెం1 టీ20 బౌలర్గా రవి నిలిచాడు. అయితే టీ20 వరల్డ్కప్-2024కు మాత్రం అతడిని సెలక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఈ లెగ్ స్పిన్నర్ను జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు ఎంపిక చేశారు. ఈ రెండు పర్యటనలలోనూ బిష్ణోయ్ సత్తాచాటాడు. జింబాబ్వేపై 6 వికెట్లు పడగొట్టిన బిష్ణోయ్..శ్రీలంకపై 6 కూడా 6 వికెట్లు సాధించాడు. అయినప్పటకి బంగ్లాతో తొలి టీ20కు బిష్ణోయ్ను పక్కటన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. -
IND Vs BAN: బంగ్లాతో తొలి టీ20.. మయాంక్, నితీష్ అరంగేట్రం
భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్తో ఆంధ్రా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, ఢిల్లీ యువ పేసర్ మయాంక్ యాదవ్ భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ చేతుల మీదగా వీరిద్దరూ భారత క్యాప్లను అందుకున్నారు. ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేయడంతో ఈ యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. కాగా గ్వాలియర్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.తుది జట్లుబంగ్లాదేశ్: లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాంభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్ -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియా ఓపెనర్లు వాళ్లే: సూర్య
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో టీమిండియా కొత్త ఓపెనింగ్ జోడీతో ముందుకు వెళ్లనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపాడు. అంతేకాదు.. మయాంక్ యాదవ్ ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.సూర్యకుమార్ సారథ్యంలోకాగా రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్కు వచ్చింది. ఈ క్రమంలో చెన్నై, కాన్పూర్ టెస్టుల్లో గెలుపొందిన రోహిత్ సేన.. సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా టీ20లకు సిద్దమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం గ్వాలియర్లో తొలి మ్యాచ్ జరుగనుంది. టీ20 మ్యాచ్కు సరిపోయే పిచ్ ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తమ ప్రణాళికల గురించి వెల్లడించాడు. ‘‘ఈసారి అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇక మేము ఇక్కడ రెండు రోజులు ప్రాక్టీస్ చేశాం. అయితే, వికెట్ మరీ లోగా, స్లోగా ఏమీ లేదు. కొంతమంది మూడు రోజులు కూడా ఇక్కడ ప్రాక్టీస్లో పాల్గొన్నారు.వికెట్లో ఎవరికీ పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. టీ20 మ్యాచ్కు సరిగ్గా సరిపోయే పిచ్ ఇది. అయితే, మ్యాచ్ ఏకపక్షంగా మాత్రం ఉండబోదనే అనుకుంటున్నాం’’ అని సూర్య తెలిపాడు. ఇక తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన యువ పేసర్ మయాంక్ యాదవ్ గురించి ప్రస్తావనకు రాగా.. అతడిని ‘ఎక్స్ ఫ్యాక్టర్’గా సూర్యకుమార్ అభివర్ణించాడు.అతడొక ఎక్స్ ఫ్యాక్టర్‘‘ప్రస్తుతం జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వారిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఇక మయాంక్ విషయానికొస్తే.. అతడు ఎక్కువగా నెట్స్లో ప్రాక్టీస్ చేయలేదు. అయితే, మయాంక్ ఆట తీరు ఎలా ఉంటుందో అందరూ ఇప్పటికే చూశారు.అతడి రాక వల్ల జట్టు బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు. అతడొక ఎక్స్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్లో అతడి ఎక్స్ ట్రా పేస్ను మనం చూశాము. కాబట్టి మయాంక్పైనే అందరి దృష్టి ఉంది. జట్టులోని మిగతా యువ ఆటగాళ్లు కూడా తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా మయాంక్ జట్టుతో చేరడం శుభసూచకం. టీమిండియాకు అతడి వల్లే మేలు జరుగుతుందని భావిస్తున్నా’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకునికాగా ఈ ఏడాది ఐపీఎల్-2024లో అరంగేట్రం చేశాడు ఢిల్లీ ఎక్స్ప్రెస్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్కు ఆడిన రెండు మ్యాచ్లలో గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన అతడు ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకుని ఆటలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. చదవండి: ‘టీమిండియా డ్రెస్సింగ్రూంలో గడపడం వల్లే ఇలా’ 🗣️ It's a good opportunity for the youngsters & newcomers.#TeamIndia Captain @surya_14kumar ahead of the T20I series against Bangladesh.#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/T7kM6JO02o— BCCI (@BCCI) October 5, 2024 -
ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్గా సూర్య?.. స్పందించిన ‘స్కై’
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో విజయాలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం(అక్టోబరు 6) గ్వాలియర్ వేదికగా తొలి టీ20కి షెడ్యూల్ ఖరారైంది.అది సానుకూలాంశమేఈ నేపథ్యంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. జట్టులో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయగల బ్యాటర్లు ఉండటం సానుకూలాంశమని తెలిపాడు. శ్రీలంక పర్యటనలోనూ ఈ తరహా ప్రయోగం చేశామని.. ఆటగాళ్లలో ఉన్న భిన్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదన్నాడు. అందుకే బ్యాటర్ల చేతికీ బంతిని ఇచ్చేందుకు వెనుకాడమని తెలిపాడు.రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడాఈ క్రమంలో సూర్యకుమార్ ఐపీఎల్ భవితవ్యం, ఫ్రాంఛైజీ క్రికెట్ కెప్టెన్సీ గురించి విలేఖరులు ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు నన్ను ఇరుకున పెట్టేశారు(నవ్వుతూ). ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నా. ముంబై ఇండియన్స్లో రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడా.. అవసరమైనపుడు సలహాలు ఇచ్చేవాడిని. మీకే తెలుస్తుందిఇక టీమిండియా విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో పాటు.. గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్లలోనూ నేను కెప్టెన్గా వ్యవహరించాను. జట్టును ఎలా ముందుకు నడిపించాలో ఇతర కెప్టెన్లను చూసి నేర్చుకోవడానికి సందేహించను.జీవితం ఇలా ముందుకు సాగుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఏం జరుగబోతుందో మీకే తెలుస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెప్టెన్సీ అంశంపై సంకేతాలు ఇచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా సూర్య ముంబై ఇండియన్స్కు ఆడుతున్నాడు.పాండ్యా సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవంకాగా ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జట్టును ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, పాండ్యా సారథ్యంలో ముంబై ఘోర పరాభవం చవిచూసింది. ముంబై ఇండియన్స్ సారథిగా సూర్య?ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంలో నిలిచింది. ఇక ఇదే జట్టులో ఉన్న సూర్య గతంలో అతడి గైర్హాజరీలో కెప్టెన్గా వ్యవహరించాడు. అంతేకాదు.. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను రీప్లేస్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులోనూ ఇదే తరహా మార్పు జరుగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూర్య వ్యాఖ్యలు కూడా వాటికి కాస్త ఊతమిచ్చేలాగానే ఉన్నాయి.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ దూరం
గ్వాలియర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో వైట్బాల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. వెన్ను గాయం కారణంగా దూబే బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని తిలక్ వర్మతో సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. ఆదివారం ఉదయం గ్వాలియర్లో తిలక్ జట్టుతో చేరనున్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. తిలక్ వర్మ భారత్ తరపున ఇప్పటివరకు 16 టీ20లు ఆడి 336 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2024 తర్వాత ఈ హైదరాబాదీ గాయ పడ్డాడు. దీంతో అతడిని జింబాబ్వే, శ్రీలంకతో టీ20లకు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో మరోసారి అతడికి భారత జట్టులో చోటు దక్కింది.భారత టీ20 జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మచదవండి: IPL 2025: రోహిత్, కిషన్కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
Ind vs Ban: హైదరాబాద్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం షురూ
సాక్షి, హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైదరాబాద్లో ఈ నెల 12న మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం గం. 2:30 నుంచి ఆన్లైన్లో టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అభిమానులు paytm insider వెబ్సైట్/యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ప్రారంభ ధర రూ. 750 కాగా, గరిష్ట ధర రూ. 15 వేలు. ఆన్లైన్లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్స్లో మార్పిడి చేసుకొని మ్యాచ్ టికెట్లను పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏదైనా ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అన్ని టికెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే అమ్ముతున్నామని...ఆఫ్లైన్లో/కౌంటర్ల వద్ద ఎలాంటి టికెట్లూ విక్రయించడం లేదని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు గతంలో రెండు టి20 మ్యాచ్లు ఆడింది. 2019లో వెస్టిండీస్పై, 2022లో ఆ్రస్టేలియాపై జరిగిన ఈ మ్యాచ్లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో భారత్–ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచి్చంది. -
టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్
టీమిండియాతో టెస్టు సిరీస్ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అదే జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్దమైంది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.మొదటి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని ఇరు జట్లు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. కాగా తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత్పై టీ20 సిరీస్ను సొంతం చేసుకుంటామని శాంటో థీమా వ్యక్తం చేశాడు."భారత్తో టీ20 సిరీస్కు మేము అన్ని విధాల సన్నద్దమయ్యాం. ఈ సిరీస్ను గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాము. దూకుడుగా ఆడాలనుకుంటున్నాము. ఈ ఏడాది టీ20 వరల్డ్కప్లో సెమీ-ఫైనల్కు చేరేందుకు మాకు మంచి అవకాశం లభించింది. కానీ దురదృష్టవశాత్తూ మేము సెమీస్కు చేరుకోలేకపోయాము.మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరూ భారత్పై సత్తాచాటుతారని భావిస్తున్నాను. మేము భారత్తో టెస్ట్లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. మేము ప్రస్తుతం ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. టెస్టు క్రికెట్కు టీ20 పూర్తిగా భిన్నం. ఆ రోజున ఎవరూ మెరుగైన ప్రదర్శన చేస్తే వారిదే విజయమని" షాంటో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2024: ఓపెనర్లే కొట్టేశారు.. వరల్డ్కప్లో దక్షిణాఫ్రికా బోణీ -
భారత్-బంగ్లా తొలి టీ20.. స్టేడియం వద్ద మూడంచెల భద్రత
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ కన్నేసింది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టాయి.అయితే మొదటి టీ20కు ఇవ్వనున్న గ్వాలియర్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్గా మారింది. న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేసే హోటల్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.కాగా మ్యాచ్ జరిగే అక్టోబర్ 6న హిందూ మహాసభ బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందుస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ మహాసభ ఆదివారం నల్లజెండాలతో ర్యాలీని నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీంతో ఎటువంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రతమత్తమయ్యారు.తుది జట్లు అంచనాభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్ -
ఇదేం బౌలింగ్?.. హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!
దాదాపు రెండు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్తో టీ20 సందర్భంగా ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో యువ పేస్ దళంతో కలిసి నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్ శైలి పట్ల మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. స్టంప్స్నకు మరీ దగ్గరగా బంతిని విసిరే విధానాన్ని మార్చుకోవాలని హార్దిక్కు సూచించినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. పరిగెత్తుతూ.. బాల్ను రిలీజ్ చేసేటపుడు కూడా ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఆల్రౌండర్తో మోర్కెల్ గట్టిగానే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తన శైలికి భిన్నంగా మోర్కెల్ కాస్త స్వరం హెచ్చించి మరీ.. పాండ్యాకు పదే పదే బౌలింగ్ యాక్షన్ గురించి హితభోద చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. అయితే, ఇందుకు పాండ్యా కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అనంతరం.. యువ ఫాస్ట్బౌలర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్లపై మోర్కెల్ దృష్టి సారించి.. వారి చేత ప్రాక్టీస్ చేయించినట్లు సమాచారం.సూర్యకుమార్ యాదవ్కు పెద్దపీటఇదిలా ఉంటే.. పేస్ బ్యాటరీ స్పీడ్ గన్స్ను తీసుకువచ్చిందంటూ ఈ బౌలర్ల ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా హార్దిక్ పాండ్యా చివరగా శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 సిరీస్లో పాల్గొన్నాడు. అయితే, ఈ టూర్ సందర్భంగా భారత పొట్టి క్రికెట్ జట్టు కెప్టెన్గా హార్దిక్ పేరును ప్రకటిస్తారనుకుంటే.. బీసీసీఐ మాత్రం సూర్యకుమార్ యాదవ్కు పెద్దపీట వేసింది. మూడు టీ20లు.. వేదికలు ఇవేఅరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్కు గాయాల బెడద పొంచి ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇక తాజా సిరీస్ విషయానికొస్తే.. ఆదివారం(అక్టోబరు 6) నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా జరిగే మూడు మ్యాచ్లకు గ్వాలియర్(అక్టోబరు 6), ఢిల్లీ(అక్టోబరు 9), హైదరాబాద్(అక్టోబరు 12) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో మొదటి టీ20 కోసం గ్వాలియర్కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్లో తలమునకలైంది. ఇక బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా యువ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ తొలిసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.బంగ్లాతో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.చదవండి: T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3— BCCI (@BCCI) October 4, 2024 -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..!
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. అక్టోబర్ 6న బంగ్లాదేశ్తో జరుగబోయే తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధిస్తే.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. స్కై ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 71 మ్యాచ్లు ఆడి 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. స్కైతో పాటు మలేషియా ఆటగాడు విరన్దీప్ సింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే వీరిద్దరితో పోలిస్తే స్కై అతి తక్కువ మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. విరన్దీప్ 84 మ్యాచ్ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. విరాట్ 125 మ్యాచ్ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు సాధించాడు. ఈ జాబితాలో స్కై, విరన్దీప్, విరాట్ తర్వాత జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (15), ఆఫ్ఘన్ ఆటగాడు మొహమ్మద్ నబీ (14), టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (14) ఉన్నారు.కాగా, బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్కు గ్వాలియర్లోని మాధవరావ్ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టు..అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాచదవండి: టీమిండియా స్పీడ్ గన్స్... ఫైరింగ్కు సిద్ధం! -
టీమిండియా స్పీడ్ గన్స్... ఫైరింగ్కు సిద్ధం!
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియా పేస్ బౌలర్లు నెట్స్లో కఠోరంగా శ్రమిస్తున్నారు. భారత స్పీడ్ గన్స్ అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా పసికూన బంగ్లాదేశ్పై ఫైరింగ్కు సిద్దమవుతున్నారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో భారత పేస్ విభాగం రాటుదేలుతుంది. టీమిండియా పేసర్లు ప్రాక్టీస్లో నిమగ్నమైన వీడియోను బీసీసీఐ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది.Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3— BCCI (@BCCI) October 4, 2024కాగా, బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్కు గ్వాలియర్లోని మాధవరావ్ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టు..అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాచదవండి: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ -
బంగ్లాదేశ్తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 (అక్టోబర్ 6న) గ్వాలియర్ వేదికగా జరుగనుండగా.. రెండో టీ20 (అక్టోబర్ 9న) ఢిల్లీలో.. మూడో టీ20 (అక్టోబర్ 12న) హైదరాబాద్లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లను ఇదివరకే ప్రకటించారు. తొలి టీ20 ప్రారంభానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో భారత తుది జట్టులో ఎవరెవరు ఉంటారన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.ఈ సిరీస్ కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు సూర్యకుమార్ నాయకత్వం వహిస్తుండగా.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా మిగతా సభ్యులుగా ఉన్నారు.ఓపెనర్లుగా సంజూ, అభిషేక్యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం దాదాపుగా ఖరారైంది. వన్డౌన్లో కెప్టెన్ సూర్య, ఆ తర్వాత రియాన్ పరాగ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వరుసగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.నితీశ్కు ఎదురుచూపు తప్పదు..!పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్, దూబే తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఎదురుచూపు తప్పేలా లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయ్ ఎంపిక దాదాపుగా ఖరారు కాగా.. వరుణ్ చక్రవర్తికి నిరాశ తప్పదు. పేసర్ల కోటాలో అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.బంగ్లాదేశ్తో తొలి టీ20కు భారత తుది జట్టు (అంచనా):అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్చదవండి: T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్ -
ఆ సిరీస్కు దూరమయ్యానని బీసీసీఐ చెప్పిందా?
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసిన టీమిండియా తదుపరి న్యూజిలాండ్తో తలపడనుంది. సొంతగడ్డపై అక్టోబరు 16 నుంచి కివీస్తో మూడు టెస్టుల సిరీస్ మొదలుపెట్టనుంది. అనంతరం నవంబరులో బోర్డర్ గావస్కర్ ట్రోపీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.ఫైనల్గా ఆసీస్తోఅక్కడ భారత జట్టు కంగారూ టీమ్తో ఐదు టెస్టులు ఆడనుంది. ఇక ఆసీస్తో ఈ సిరీస్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-2లో టీమిండియా ప్రయాణం ముగియనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఫైనల్కు చేరువైన రోహిత్ సేన.. ఆసీస్పై మరోసారి పైచేయి సాధించి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.ఇంకా ఫిట్నెస్ సాధించలేదంటూ..అయితే, ఈ మెగా సిరీస్తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, అతడు ఇంకా ఫిట్నెస్ సాధించలేదని.. ఆసీస్తో సిరీస్కూ దూరమయ్యాడని వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ విషయంపై షమీ ఘాటుగా స్పందించాడు.సిరీస్కు దూరమయ్యానని బీసీసీఐ చెప్పిందా?‘‘ఎందుకీ నిరాధారణ వార్తలు? పూర్తిగా కోలుకోవడానికి నా శక్తినంతా ధారపోస్తూ.. తీవ్రంగా శ్రమిస్తున్నాను. బీసీసీఐ గానీ.. లేదంటే నేను గానీ.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నుంచి నేను తప్పుకొన్నానని చెప్పలేదు కదా!మీ పబ్లిసిటీ కోసం దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి. ఎవరో పనికిమాలిన వ్యక్తులు, తమకు తోచింది మాట్లాడే వ్యక్తులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా నకిలీ వార్తలను సృష్టించకండి. ముఖ్యంగా.. నేను ఏదేనా స్వయంగా చెప్పిన తర్వాతే ఓ అంచనాకు రండి’’ అని షమీ సోషల్ మీడియా వేదికగా గాసిప్రాయుళ్లకు చురకలు అంటించాడు.చీలమండ గాయానికి సర్జరీకాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్బుత ప్రదర్శన కనబరిచిన మహ్మద్ షమీకి.. ఈ టోర్నీ తర్వాత చీలమండ గాయం తీవ్రమైంది. దీంతో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ ఫాస్ట్ బౌలర్ ఇంతవరకు మళ్లీ బరిలోకి దిగలేదు. దాదాపు పది నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు.చదవండి: WTC: ఫైనల్ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే! -
గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడు: మయాంక్ యాదవ్
తాను టీమిండియాకు ఎంపికవుతానని ఊహించలేదన్నాడు యువ బౌలర్ మయాంక్ యాదవ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెబ్సైట్ చూసిన తర్వాతే తనకు నమ్మకం కుదిరిందన్నాడు. ఆ తర్వాత తనను అభినందిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఆ సమయంలో ఒక్కసారిగా గతం కళ్ల ముందు కదలాడిందని ఉద్వేగానికి లోనయ్యాడు.లక్నోకు ఆడిన మయాంక్టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయని మయాంక్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. కాగా ఢిల్లీకి చెందిన మయాంక్.. 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్కు ఆడిన ఈ పేస్ బౌలర్.. గంటకు 150కి పైగాకిలో మీటర్ల వేగంతో బంతులు విసిరి క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.స్పీడ్కు గాయాల బ్రేక్వరుసగా రెండు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించి.. పేస్ స్టన్ గన్గా ప్రశంసలు అందుకున్నాడు. అయితే, గాయం కారణంగా అతడి స్పీడ్కు బ్రేక్ పడింది. పక్కటెముకల నొప్పితో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన మయాంక్ యాదవ్ ఇటీవలే మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. నెట్స్లో అతడి బౌలింగ్ పట్ల సంతృప్తివ్యక్తం చేసిన టీమిండియా సెలక్టర్లు బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు మయాంక్ను ఎంపిక చేశారు.గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడుఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘‘కొంత మంది ఆటగాళ్లు వరుసగా విఫలమైనా.. తమను తాము నిరూపించుకోవడానికి వరుస అవకాశాలు వస్తాయి.. కానీ కొంతమందికి మాత్రం ఎప్పుడో ఒకసారి ఒక్క ఛాన్స్ మాత్రమే వస్తుంది’ అని గౌతం గంభీర్ భయ్యా ఓసారి నాతో చెప్పాడు. నిజానికి నన్ను ఓ ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసిన తర్వాత కూడా షూ స్పాన్సర్ కోసం వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్న రోజులవి..నన్ను నేను నిరూపించుకున్నానుఆ సమయంలో గౌతం భయ్యా మాటలో నా మనసులో అలాగే ఉండిపోయాయి. ఆయనతో పాటు విజయ్ దహియా(లక్నో మాజీ కోచ్) కూడా.. కనీసం రెండేళ్ల తర్వాతైనా నువ్వు మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడతావు. అప్పటి వరకు ఓపికగా వేచిచూడు అని చెప్పారు. ఈ ఏడాది ఆ అవకాశం వచ్చింది. నన్ను నేను నిరూపించుకున్నాను.ఇక నేను టీమిండియాకు ఎంపికయ్యాననే విషయం కాస్త ఆలస్యంగానే తెలిసింది. ఎన్సీఏలో నా సహచర ఆటగాళ్లకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను బీసీసీఐ అధికారిక వెబ్సైట్ చూస్తే టీ20 జట్టులో నా పేరు కూడా కనిపించింది. అప్పుడు ఒక్కసారిగా గతం గుర్తుకు వచ్చింది. అరంగేట్రం ఖాయమే!వరుస గాయాలతో సతమతమవుతూ నేను ఎన్సీఏకు చేరడం.. నాలుగు నెలలు అక్కడే ఇప్పుడిలా జట్టుకు ఎంపిక కావడం.. అన్నీ గుర్తుకువచ్చాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా 22 ఏళ్ల మయాంక్ స్వదేశంలో బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైనట్లే! లక్నో సూపర్ జెయింట్స్ మాజీ మెంటార్ గంభీర్, మాజీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్లకు మయాంక్ నైపుణ్యాల గురించి అవగాహన ఉంది. వీరిద్దరిలో ఒకరు ఇప్పుడు టీమిండియా హెడ్కోచ్, మరొకరు బౌలింగ్ కోచ్ అన్న సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా స్టార్లంతా రెండు నెలలు ఆటకు దూరం -
కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ
టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లి, రవిశాస్త్రి తనకు పునర్జన్మను ప్రసాదించారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వారిద్దరి వల్లే తన రెండో ఇన్నింగ్స్ మొదలైందని.. తనను టాపార్డర్కు ప్రమోట్ చేసి ఓపెనర్గా అవకాశమిచ్చింది కూడా వారేనంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా 2013లో కోల్కతా వేదికగా వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో అడుగుపెట్టాడు.అరంగేట్రంలోనే అద్భుత శతకంతొలి మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే అద్భుత శతకం(177)తో ఆకట్టుకున్నాడు. విండీస్తో నాటి సిరీస్లో జరిగిన ఈ తొలి టెస్టులో ధోని సేన ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తన రెండో టెస్టులోనూ శతక్కొట్టి వారెవ్వా అనిపించాడు. కానీ టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు.దాదాపు ఆరేళ్ల పాటు చోటే కరువుఅరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు భారత టెస్టు తుదిజట్టులో రోహిత్ శర్మకు స్థానమే కరువైంది. అయితే, 2018-19లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో రోహిత్ చోటు దక్కించుకోగలిగాడు. ఈ సిరీస్లోనూ అతడు ఆరో స్థానంలోనే బరిలోకి దిగాడు.అలా రీఎంట్రీఇక ఆ తర్వాత వన్డే వరల్డ్కప్-2019లో వరుసగా ఐదు సెంచరీలు బాదినా.. టెస్టుల్లో మాత్రం రోహిత్ రాత పెద్దగా మారలేదు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత వెస్టిండీస్తో ఆడిన టెస్టు సిరీస్లో అతడిని బెంచ్కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, నాడు ఓపెనర్గా ఉన్న కేఎల్ రాహుల్ పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో.. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్కోచ్ రవిశాస్త్రి రోహిత శర్మను ఓపెనర్గా బరిలోకి దించారు. ఓపెనర్గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్అప్పటి నుంచి రోహిత్కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా ఓపెనర్గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్ కెప్టెన్గా ఎదగడమే గాకుండా.. భారత్ను ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)కు చేర్చిన సారథిగానూ ఘనత సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్తో సొంతగడ్డపై టీమిండియాను గెలిపించి.. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ వేటలో జట్టును నిలిపాడు.వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారుఈ నేపథ్యంలో కామెంటేటర్ జతిన్ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టెస్టు కెరీర్ రెండో ఇన్నింగ్స్లో రవిశాస్త్రి, విరాట్ కోహ్లిలకు నేను చాలా రుణపడిపోయాను. నన్ను టాపార్డర్కు ప్రమోట్ చేసింది వాళ్లే. టెస్టుల్లో నన్ను ఓపెనర్గా పంపడం అంత సులువు కాదు. అయినా, వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారు.తొలి బంతికే అవుటయ్యానునా ఆటను పరిశీలించేందుకు ఓ ప్రాక్టీస్మ్యాచ్ ఆడమని చెప్పారు. అయితే, అప్పుడు నేను తొలి బంతికే అవుటయ్యాను. ఇక నాకు ఓపెనర్గా ఎలాంటి అవకాశం లేదని నిరాశచెందాను. టెస్టుల్లో ఐదు లేదంటే ఆరో స్థానంలోనైనా.. లేదంటే లోయర్ఆర్డర్లోనైనా బ్యాటింగ్కు వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యాను.నమ్మకం నిలబెట్టుకుంటూకానీ రవి భాయ్ టెస్టుల్లో నన్ను ఓపెనర్గా పంపాలని భావించాడు. 2015లోనే నాకు ఈ అవకాశం వస్తే బాగుంటుందని చెప్పాడు. అయితే, అప్పుడు అది సాధ్యం కాలేదు. కానీ తర్వాత రవిభాయ్, కోహ్లి వల్ల టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లి పట్ల ఈ సందర్భంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా రోహిత్ తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్తో బిజీ కానున్నాడు. చదవండి: రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్ శర్మ While @ImRo45 Rohit’s legacy in test cricket is being discussed - Here’s a little story of his comeback into test cricket .. Also a sneak peek into how @RaviShastriOfc and @imVkohli planned India’s ascendancy in tests. pic.twitter.com/LO0jVtqP7O— Jatin Sapru (@jatinsapru) October 1, 2024 -
టీమిండియా స్టార్లంతా రెండు వారాలు ఆటకు దూరం
టీమిండియా స్టార్ క్రికెటర్లు రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నారు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడిన జట్టు మొత్తానికి దాదాపు పదిహేను రోజుల విరామం లభించనుంది. బంగ్లాపై కాన్పూర్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువ తరంగాలు శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తదితరులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.ముంబైలో రోహిత్ శర్మ.. లండన్కు వెళ్లిపోయిన కోహ్లిరోహిత్ ఇప్పటికే ముంబైకి చేరుకోగా.. కోహ్లి లండన్కు పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా సీనియర్లకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతోంది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడేజా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుబ్మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన జట్టులో దాదాపు అంతా కొత్త వాళ్లకే చోటు దక్కింది.CAPTAIN ROHIT IS BACK IN MUMBAI...!!!! 🔥- Hitman in his Lamborghini, heading back home after a great Test series victory. pic.twitter.com/1wKCxrzcm9— Johns. (@CricCrazyJohns) October 2, 2024Virat Kohli On His Way To London After Departing From Delhi.✈️🖤#ViratKohli #London @imVkohli pic.twitter.com/x2XlRLeQtF— virat_kohli_18_club (@KohliSensation) October 2, 2024 టెస్టుల్లో బంగ్లాదేశ్ వైట్వాష్ అనంతరం శ్రీలంక పర్యటనకు టీ20 జట్టుకూ జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తదితరులు దూరం కాగా.. వన్డే సిరీస్తో రోహిత్, కోహ్లి పునరాగమనం చేశారు. ఈ క్రమంలో స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్ నేపథ్యంలో బుమ్రా కూడా తిరిగి వచ్చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే క్రమంలో సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్లో టీమిండియా 2-0తో క్లీన్స్వీప్ చేసింది. టీ20 సిరీస్ మొదలయ్యేది అప్పుడేఈ క్రమంలో అక్టోబరు 6, 9, 12వ తేదీల్లో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు షెడ్యూల్ ఖరారు కాగా.. టెస్టు సిరీస్ ఆడిన సీనియర్లకే కాకుండా జట్టు మొత్తానికి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అక్టోబరు 16 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుండటమే ఇందుకు కారణం. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో గనుక గెలిస్తే రోహిత్ సేన నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటుంది. అందుకే ఈ కీలకమైన సిరీస్కు ముందు బోర్డు ఈ మేర నిర్ణయం తీసుకుంది. ఇక కివీస్తో మూడు టెస్టులు ఆడిన తర్వాత టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం ఆస్ట్రేలియాకు పయనం కానుంది. డబ్ల్యూటీసీ తాజా సీజన్లో ఆఖరుగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. నవంబరు 22 నుంచి ఇరు జట్ల మధ్య బీజీటీ మొదలుకానుంది.బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడిన జట్టుప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.బెంచ్: కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాళ్, ధృవ్ జురెల్.చదవండి: రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్ శర్మ -
ఇంగ్లండ్ బజ్బాల్ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కేవలం మూడు రోజుల పాటు జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇంగ్లండ్ బ్రాండ్ క్రికెట్ 'బాజ్బాల్ను భారత్ కాపీ చేసిందని వాన్ ఆరోపించాడు.నిజంగా ఇదొక అద్భుతమైన టెస్టు మ్యాచ్. నాలుగో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్లో అదరగొట్టింది. భారత క్రికెటర్లు బాజ్బాలర్స్గా మారడం గొప్ప విషయం. కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసి ఇంగ్లండ్ బ్యాటింగ్ స్టైల్ను కాపీ కొట్టారు' అని ఓ క్రికెట్ షోలో వాన్ పేర్కొన్నాడు. అయితే ఇదే షోకు కో హోస్ట్గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ వాన్కు కౌంటిరిచ్చాడు."వాన్ నీవు బాగానే ఉన్నావా? భారత్ ఆడింది బజ్బాల్ కాదు.. గాంబాల్. వారి హెడ్కోచ్ గంభీర్ ఇప్పటికే గాంబాల్పై పేటెంట్ పొందాడు. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా జాగ్రత్తగా ఉండాలి" అని గిల్లీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇందుకు స్పందించిన వాన్.. భారత్ గాంబాల్ అచ్చెం బజ్బాల్ లానే ఉందంటూ చెప్పుకొచ్చాడు. వర్షం కారణంగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయిన తర్వాత నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. టీ20లను తలపిస్తూ కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది.చదవండి: IND-W vs SA_W: దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. -
షకీబ్కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి..
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో హాఫ్ సెంచరీలతో సత్తాచాటిన యశస్వీ జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలవగా.. రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.షకీబ్కు గిఫ్ట్ ఇచ్చిన విరాట్..త్వరలో రిటైరవుతున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబుల్ హసన్కు భారత స్టార్ విరాట్ కోహ్లి తన బ్యాట్ను కానుకగా అందజేశాడు. షకీబ్ టెస్టు ఫార్మాట్పై ఇది వరకే తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ తర్వాత టెస్టులకు గుడ్బై చెబుతానన్నాడు. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు బైబై చెప్పే యోచన లో ఉన్నాడు.రెండో టెస్టు ముగిసిన తర్వాత కోహ్లి స్వయంగా బంగ్లాదేశ్ జట్టు వద్దకు వెళ్లి తన గుర్తుగా బంగ్లా మేటి క్రికెటర్ అయిన షకీబ్కు బ్యాట్ను బహూకరించాడు. ఈ సందర్భంగా ఇరు జట్ల హేమాహేమీలు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. షకీబ్ స్టార్ ఆల్రౌండర్. బంగ్లాదేశ్కే కాదు... మన ఐపీఎల్ అభిమానులకు చిరపరిచితుడు. అతను కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున 71 మ్యాచ్లాడాడు. చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం.. -
అశ్విన్కే సాధ్యం.. ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ రికార్డు సమం
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఎడిషన్లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా బంగ్లాదేశ్తో సిరీస్లోనూ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సత్తా చాటాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న వేళ సెంచరీతో ఆదుకున్నాడు.సొంత మైదానం చెపాక్లో నిలకడగా ఆడి 113 పరుగులు సాధించాడు. అంతేకాదు.. అదే మ్యాచ్లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు. ఇలా ఆల్రౌండ్ ప్రతిభతో రాణించి.. బంగ్లాదేశ్పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి అశూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.రెండో టెస్టులోనూ అదరగొట్టిఇక కాన్పూర్లో జరిగిన రెండో టెస్టులోనూ అశ్విన్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను తిప్పలుపెట్టి కీలక వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(31), షకీబ్ అల్ హసన్(9) వికెట్లు తీసిన అశూ.. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ జకీర్ హసన్(10), మొమినుల్ హక్(2), హసన్ మహమూద్(4)లను పెవిలియన్కు పంపాడు. అలా మొత్తంగా రెండో టెస్టులో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సమంఈ మ్యాచ్లోనూ భారత్ బంగ్లాపై గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన అశ్విన్ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. అశూ టెస్టుల్లో ఈ పురస్కారం అందుకోవడం ఇది పదకొండోసారి కావడం విశేషం. తద్వారా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ చెన్నై బౌలర్ సమం చేశాడు. మురళీధరన్ కూడా సంప్రదాయ క్రికెట్లో 11 సార్లు ఈ అవార్డు గెలిచాడు. కాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్తో చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన రోహిత్ సేన.. కాన్పూర్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.టెస్టుల్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన క్రికెటర్లుముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 11 సార్లురవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 11 సార్లుజాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా)- 9 సార్లుసర్ రిచర్డ్ హాడ్లీ(న్యూజిలాండ్)- 8 సార్లుఇమ్రాన్ ఖాన్(పాకిస్తాన్)- 8 సార్లుషేన్ వార్న్(ఆస్ట్రేలియా)- 8 సార్లు.చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డు -
WTC: ఆస్ట్రేలియా కంటే ముందుగా ఫైనల్ చేరాలంటే?!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్కు టీమిండియా మరింత చేరువైంది. బంగ్లాదేశ్తో కాన్పూర్ టెస్టులో దూకుడైన బ్యాటింగ్తో ఫలితాన్ని తేల్చి డ్రా గండం నుంచి గట్టెక్కింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది.కాగా డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో టీమిండియా ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడింది. ఇందులో ఎనిమిది గెలిచి.. రెండు ఓడిపోగా.. ఒకటి డ్రాగా ముగిసిపోయింది. ఈ క్రమంలో రోహిత్ సేన విజయాల శాతాన్ని 74.24గా నమోదు చేసి.. 98 పాయింట్లు సాధించింది. తద్వారా టాప్లో కొనసాగుతోంది. ఇక పన్నెండింట 8 విజయాలు, మూడు ఓటములు, ఒక డ్రాతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.ఫైనల్ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే!కాబట్టి ఫైనల్ పోరులో ఈ రెండు జట్లే పోటీపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియా కంటే ముందు టీమిండియానే తుదిపోరుకు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. రోహిత్ సేన ఇంకో మూడు మ్యాచ్లలో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా తుదిపోటీకి అర్హత సాధిస్తుంది.కాగా భారత జట్టు తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టులు ఆడనుంది. సొంతగడ్డపై భారత జట్టుకు తిరుగులేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలా అయితే ముందుగానే బెర్తు ఖరారుప్రస్తుత ఫామ్ను బట్టి కివీస్ను వైట్వాష్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక చేతిలో తాజా టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ ఓడిపోయి చతికిలపడటమే ఇందుకు కారణం. ఒకవేళ అంచనాలు నిజమై టీమిండియా కివీస్ జట్టును 3-0తో క్లీన్స్వీప్ చేసిందంటే ఫైనల్ బెర్తు ఖరారైనట్లే!ఇక తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో ఆడనున్న ఐదు టెస్టుల్లో ఫలితం ఎలా ఉన్నా పెద్దగా తేడా ఉండదు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో శ్రీలంక మూడో స్థానం(9 మ్యాచ్లలో ఐదు గెలుపు, నాలుగు ఓటమి)లో ఉండగా.. ఇంగ్లండ్(పదహారు మ్యాచ్లో 8 గెలుపు, ఏడు ఓటమి, ఒక డ్రా)నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. మరోవైపు.. టీమిండియా చేతిలో పరాజయంతో బంగ్లాదేశ్ ఐదు నుంచి ఏడో స్థానానికి పడిపోయింది.ఈసారైనా టైటిల్ గెలవాలనికాగా 2019 నుంచి ప్రతి రెండేళ్లకొకసారి డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తున్నారు. ఆరంభ ఎడిషన్లో టీమిండియా- న్యూజిలాండ్ ఫైనల్ చేరగా.. కేన్ విలియమ్సన్ ట్రోఫీని ముద్దాడింది. ఇక 2021-23 సీజన్లో ఆస్ట్రేలియాతో పాటు టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ మరోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. మరి ఈసారి ఫైనల్ ఆ గండాన్ని అధిగమిస్తుందో.. లేదంటే హ్యాట్రిక్ ఫైనలిస్టుగా మాత్రమే మిగిలిపోతుందో చూడాలి.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టుసెప్టెంబరు 27- అక్టోబరు 1: గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 233 పరుగులు ఆలౌట్టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 285/9 డిక్లేర్డ్బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 146 పరుగులకు ఆలౌట్టీమిండియా రెండో ఇన్నింగ్స్: 98/3ఫలితం: ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపుచదవండి: Ind vs Aus: టీ20 తరహా ఇన్నింగ్స్.. వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ 2⃣-0⃣A memorable Test Victory 🙌#TeamIndia win the 2nd Test by 7 wickets and win the series 👏👏Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kxvsWxlNVw— BCCI (@BCCI) October 1, 2024 -
రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్
కాన్పూర్ టెస్టులో ప్రణాళికలు పక్కాగా అమలు చేయడం వల్లే విజయం సాధ్యమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. నాలుగో రోజు ఆటలో రిస్క్ తీసుకున్న మాట వాస్తవమేనని.. అందుకు ప్రతిఫలంగా గెలుపు వరించిందని హర్షం వ్యక్తం చేశాడు. రెండున్నర రోజుల ఆట ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసిపోయినా.. సమిష్టి కృషితో అనుకన్న ఫలితం రాబట్టగలిగామని పేర్కొన్నాడు.చివరి రెండు రోజుల్లో ఫలితం తేల్చిప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2022-25 సీజన్లో భాగంగా సొంతగడ్డపై బంగ్లాదేశ్తో టీమిండియా రెండు మ్యాచ్లు ఆడింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించిన రోహిత్ సేన.. తాజాగా రెండో టెస్టులోనూ గెలుపు జెండా ఎగురువేసింది. కాన్పూర్లోని గ్రీన్పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారినా.. చివరి రెండు రోజుల్లో టీమిండియా అద్భుత ప్రణాళికలతో విజయాన్ని సొంతం చేసుకుంది.రిస్క్ అని తెలిసినా తప్పలేదుతొలుత ప్రత్యర్థిని పడగొట్టి.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పరుగులు రాబట్టి.. ఆఖరికి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్పై 2-0తో క్లీన్స్వీప్ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘రెండున్నర రోజుల ఆట రద్దైపోయింది. అలాంటి సమయంలో నాలుగోరోజు పూర్తి స్థాయిలో ఆడే అవకాశం దక్కినపుడు రిస్క్ తీసుకోవడానికి వెనకాడలేదు. ముందు వాళ్లను త్వరగా అవుట్ చేయాలి.అతడొక అద్భుతంఆ తర్వాత త్వరత్వరగా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్లో 100- 150 పరుగులకే మేము ఆలౌట్ అయినా ఫర్వాలేదని భావించాం. ఫలితం తేల్చడమే లక్ష్యంగా ముందుకు సాగి సఫలమయ్యాము’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక బంగ్లాపై విజయంలో తన వంతు పాత్ర పోషించిన పేసర్ ఆకాశ్ దీప్ అద్బుతం రోహిత్ శర్మ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్‘‘అతడు బాగా బౌలింగ్ చేశాడు. దేశవాళీ క్రికెట్లో చాన్నాళ్ల పాటు ఆడిన అనుభవం అతడికి ఉంది. మేనేజ్మెంట్ అతడి నుంచి ఏం ఆశించిందో అందుకు తగ్గట్లుగా రాణించాడు. నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అతడు. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయగల ఫిట్నెస్ అతడి సొంతం’’ అని రోహిత్ శర్మ ఆకాశ్ ప్రతిభను కొనియాడాడు. ఇక గాయాల వల్ల ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఉంది.. కాబట్టి బెంచ్ స్ట్రెంత్ను స్ట్రాంగ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో సిరీస్లో ఆకాశ్ దీప్ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డు Captain @ImRo45 collects the @IDFCFIRSTBank Trophy from BCCI Vice President Mr. @ShuklaRajiv 👏👏#TeamIndia complete a 2⃣-0⃣ series victory in Kanpur 🙌Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN pic.twitter.com/Wrv3iNfVDz— BCCI (@BCCI) October 1, 2024 -
Ind vs Ban: అంచనాలు తలకిందులు చేసి.. ఫలితం తేల్చేశారు!
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.కాన్పూర్లో వెంటాడిన వరణుడు డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆడింది. చెన్నై మ్యాచ్లో 280 పరుగులతో బంగ్లాను మట్టికరిపించి శుభారంభం అందుకున్న టీమిండియాను.. కాన్పూర్లో వరణుడు వెంటాడాడు. వర్షం కారణంగా ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలిరోజు కేవలం 35 ఓవర్ల ఆటే సాగగా.. రెండు, మూడో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దైపోయింది.డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా రెండో టెస్టు డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, టీమిండియా మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ‘బజ్బాల్’ క్రికెట్ను తలదన్నే ఫార్ములాతో అద్భుతం చేసింది. వర్షం లేకపోవడం.. మైదానం పొడిగా ఉండటంతో నాలుగో రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.భారత బౌలర్ల విజృంభణబంగ్లాదేశ్ సోమవారం... తమ తొలి ఇన్నింగ్స్ స్కోరు 107/3ను మొదలుపెట్టగా.. ఆది నుంచే భారత బౌలర్లు విజృంభించారు. బంగ్లాను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లా ఓపెనర్లను అవుట్ చేయగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు కూల్చారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.‘బజ్బాల్’ క్రికెట్కే వణుకుపుట్టించే వేగంతోఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన ఆకాశమే హద్దుగా బంగ్లా బౌలింగ్ను చితక్కొట్టింది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా.. ‘బజ్బాల్’ క్రికెట్కే వణుకుపుట్టించే వేగంతో 50, 100. 200 పరుగుల మైలురాళ్లను దాటింది. వచ్చిన ప్రతి బ్యాటరూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచి వీలైనన్ని పరుగులు పిండుకున్నారు.ఈ క్రమంలో 34.4 ఓవర్లలోనే తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 285 పరుగులు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ మీద 52 పరుగుల ఆధిక్యం సంపాదించి. ఈ క్రమంలో బంగ్లా నాలుగో రోజే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి సోమవారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసంఇక ఆఖరి రోజు ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన రోహిత్ సేన.. ఆది నుంచే వికెట్ల వేట మొదలుపెట్టింది. నైట్ వాచ్మన్ మొమినుల్ హక్(2) వికెట్ తీసి శుభారంభం అందించగా.. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(50)ను ఆకాశ్ దీప్ పెవిలియన్కు పంపాడు. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ముష్ఫికర్ రహీం(37)ను బుమ్రా అవుట్ చేశాడు.చకచకా పడగొట్టేశారుమొత్తంగా బుమ్రా, అశూ, జడ్డూ మూడేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతా కలిసి రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ మీద బంగ్లాదేశ్ ఆధిక్యం 94 పరుగులు కాగా.. రోహిత్ సేన విజయ లక్ష్యంగా 95 పరుగులుగా మారింది.ఫోర్తో విజయం ఖరారు చేసిన పంత్ఇక త్వరగా మ్యాచ్ ముగించేయాలని భావించిన టీమిండియా దూకుడుగానే ఛేజింగ్ మొదలుపెట్టింది. దీంతో రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. యశస్వి జైస్వాల్(51) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. శుబ్మన్ గిల్ 6 పరుగులకే పరిమితం కాగా.. కోహ్లి 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషభ్ పంత్ ఫోర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. డ్రా అవుతుందని ఊహించిన ఈ మ్యాచ్లో టీమిండియా పక్కా ప్రణాళికతో గెలుపొందడం అభిమానులను ఖుషీ చేసింది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టువేదిక: గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 233 పరుగులు ఆలౌట్టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 285/9 డిక్లేర్డ్బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 146 పరుగుల ఆలౌట్టీమిండియా రెండో ఇన్నింగ్స్: 98/3ఫలితం: ఏడు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంచదవండి: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్.. Rishabh Pant hits the winning runs 💥He finishes off in style as #TeamIndia complete a 7-wicket win in Kanpur 👏👏Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Nl2EdZS9VF— BCCI (@BCCI) October 1, 2024 -
1877 నుంచి ఇదే తొలిసారి: అసలైన మజానిచ్చే రికార్డు!
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా వీరబాదుడును క్రికెట్ ప్రేమికులు అంత తేలికగా మర్చిపోలేరు. కాన్పూర్లో పొట్టి ఫార్మాట్ తరహాలో ఒక్కో భారత బ్యాటర్ చెలరేగుతూ ఉంటే అభిమానులు పండుగ చేసుకున్నారు. అంతకు ముందు వర్షం వల్ల రెండు రోజుల ఆట రద్దైన కారణంగా ఉసూరుమన్న ఫ్యాన్స్కు.. రోహిత్ సేన పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చి లెక్క సరిచేసింది.50, 100, 200, 250 పరుగుల రికార్డుటెస్టు ఫార్మాట్లో అత్యంత వేగంగా 50, 100, 200, 250 పరుగుల రికార్డును సాధించి.. ప్రపంచంలో ఈ ఘనతలు నమోదు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 11 బంతుల్లోనే 23 పరుగులు చేస్తే.. అతడి జోడీ యశస్వి జైస్వాల్(72) కేవలం 32 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.1877 నుంచి ఇదే తొలిసారివిరాట్ కోహ్లి 35 బంతుల్లో 47 పరుగులు చేస్తే.. కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ నలుగురు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ నేపథ్యంలో భారత జట్టు ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు ఒకటి నమోదైంది.ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. తద్వారా ఇంగ్లండ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 1877 నుంచి ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టెస్టుల్లో 90 సిక్సర్లు నమోదు చేసిన టీమ్గా చరిత్రకెక్కింది.కాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ మూడు, యశస్వి జైస్వాల్ రెండు, శుబ్మన్ గిల్ ఒకటి, విరాట్ కోహ్లి ఒకటి,. కేఎల్ రాహుల్ రెండు, ఆకాశ్ దీప్ రెండు సిక్సర్లు బాదారు. ఇక నవంబరులో టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడనుంది. కాబట్టి తన సిక్సర్ల రికార్డును రోహిత్ సేన తానే బద్దలు కొట్టే అవకాశం ఉంది.టెస్టుల్లో ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లుటీమిండియా- 90 సిక్స్లు(2024లో ఇప్పటి వరకు)ఇంగ్లండ్- 89 సిక్స్లు(2022లో)టీమిండియా- 87 సిక్స్లు(2021లో)న్యూజిలాండ్- 81 సిక్స్లు(2014లో)న్యూజిలాండ్- 71 సిక్స్లు(2013లో).చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డు
టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో ఇంత వరకు ఏ బౌలర్కూ సాధ్యం కాని ఘనత నమోదు చేశాడు. కాగా సొంతగడ్డపై భారత జట్టు బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డుఈ క్రమంలో సొంతమైదానం చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్లో అశూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెపాక్లో రెండో టెస్టు సందర్భంగా అశూ సెంచరీ(113) చేయడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇదిలా ఉంటే.. కాన్పూర్ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టు సందర్భంగా అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యంత వేగంగా 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఘనత సాధించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో షకీబ్ అల్ హసన్ను అవుట్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా సీజన్లో ఆడిన తొలి పది మ్యాచ్లలోనే ఈ రికార్డు నెలకొల్పాడు.డబ్ల్యూటీసీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వికెట్స్ బౌలర్ అశూ2019-21 సీజన్- 14 మ్యాచ్లలో 71 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 7/1452021-23 సీజన్- 13 మ్యాచ్లలో 61 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 6/912023-25 సీజన్- 10* మ్యాచ్లలోనే 50* వికెట్లు()-అత్యుత్తమ గణాంకాలు 7/71.ధనాధన్ఇక కాన్పూర్ టెస్టులో టీమిండియా విజయమే లక్ష్యంగా ఐదో రోజు ఆట మొదలుపెట్టింది. రెండో ఇన్నింగ్స్లో 26/2(11) ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన బంగ్లాదేశ్ను అశూ ఆదిలోనే దెబ్బకొట్టాడు. మొమినుల్ హక్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆకాశ్ దీప్ షాద్మన్ ఇస్లాం, రవీంద్ర జడేజా నజ్ముల్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ వికెట్లు కూల్చారు. దీంతో వందలోపు(94) పరుగులకే బంగ్లా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. త్వరగా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి..బజ్బాల్ క్రికెట్తో గెలుపొందాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
Ind vs Ban: బంగ్లాపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్స్వీప్
Ind vs Ban 2ndTest Day 5 Updates: బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా గెలుపొందింది. కాన్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్ విజయం సాధించింది.టీమిండియా టార్గెట్ 95 రన్స్రెండో వికెట్ కోల్పోయిన టీమిండియాగిల్(6) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జైస్వాల్ 20 పరుగులతో ఆడుతున్నాడు. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 35/2 (5)రోహిత్ శర్మ అవుట్2.1: బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో రోహిత్ హసన్ మహమూద్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కేవలం 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ సేన టార్గెట్ ఎంతంటేరెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను టీమిండియా 146 పరుగులకు ఆలౌట్ చేసింది. భోజన విరామ సమయానికి బంగ్లా ఆట కట్టించి.. విజయానికి బాట వేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే బంగ్లాదేశ్ కేవలం 94 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంటే.. రోహిత్ సేన టార్గెట్ 95.తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బుమ్రా బౌలింగ్లో తైజుల్ ఇస్లాం(0) తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకున్న బుమ్రా డకౌట్గా వెనక్కి పంపాడు. బంగ్లాదేశ్ స్కోరు: 130/9 (40.5). ఖలీద్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్ 27 పరుగలతో ఆడుతున్నాడు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్మెహదీ హసన్ మిరాజ్ రూపంలో బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో మిరాజ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్చేరాడు. బంగ్లా స్కోరు: 118/8 (36.5) . తైజుల్ ఇస్లాం క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్ రహీం 15 పరుగులతో ఆడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్జడేజా బౌలింగ్లో షకీబ్ అల్ హసన్ ఏడో వికెట్గా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. బంగ్లా స్కోరు: 94-7 (32 ఓవర్లు). ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్జడేజా బౌలింగ్ లిటన్ దాస్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. బంగ్లా స్కోరు: 94-6(30)ఐదో వికెట్ డౌన్ఆకాశ్ దీప్ బౌలింగ్లో హాఫ్ సెంచరీ వీరుడు షాద్మన్ ఇస్లాం(50) జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లా ఐదో వికెట్ కోల్పోయింది. లిటన్ దాస్ క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్ ఒక పరుగుతో ఆడుతున్నాడు. బంగ్లా స్కోరు: 94/5 (29).నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్జడేజా బౌలింగ్లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో బౌల్డ్ అయ్యాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ముష్ఫికర్ రహీం క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 49 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లా స్కోరు: 92/4 (27.5).నిలకడగా ఆడుతున్న షాద్మన్25 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు 87-3. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 47 పరుగులతో నిలకడగా ఆడుతుండగా.. షాంటో 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్తమ రెండో ఇన్నింగ్స్లో 26/2(11) ఓవర్నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఆదిలోనే మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో మొమినుల్ హక్(2) కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 15 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ స్కోరు: 36-3(14 ఓవర్లలో). భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టువేదిక:గ్రీన్ పార్క్ స్టేడియం, కా న్పూర్టాస్: భారత్.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 233భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 285/9 డిక్లేర్డ్టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా రెండో టెస్టు ఐదో రోజు ఆట మొదలైంది. కాగా సోమవారం నాటి ఆటలో రోహిత్ సేన మెరుపు వేగంతో పరుగులు సాధించి.. డ్రా అవుతుందేమోనన్న మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ముందడుగు వేసింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ఆట కట్టించే క్రమంలో ఆఖరి రోజు వికెట్ల వేటను మొదలు పెట్టి శుభారంభం అందుకుంది.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్. -
కోహ్లికి సారీ చెప్పిన పంత్.. హగ్ చేసుకుని మరి(వీడియో)
బంగ్లాదేశ్తో సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన బ్యాట్ను ఝళిపించాడు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 47 పరుగులు చేశాడు.అయితే ఈ మ్యాచ్లో కూడా కోహ్లి సింగిల్ డిజిట్ స్కోర్ పరిమితమయ్యే వాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బంగ్లా బౌలర్ తెలివి తక్కువ పనికి కోహ్లి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.అసలేం జరిగిందంటే?భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఖాలీద్ ఆహ్మద్ బౌలింగ్లో తొలి బంతిని కోహ్లి కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని తన ఫ్రంట్ప్యాడ్కు తాకుతూ పిచ్ దగ్గరలోనే ఉండిపోయింది. అయితే నాన్స్ట్రైక్లో ఉన్న పంత్ రన్కు కాల్ ఇవ్వడంతో విరాట్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ పంత్ మాత్రం కాస్త ముందుకు వచ్చి మధ్యలోనే ఆగిపోయాడు. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ ఖాలీద్ ఆహ్మద్ వికెట్ కీపర్ ఎండ్కు పరిగెత్తి బంతిని అందుకుని స్టంప్స్కు త్రో చేశాడు. కానీ బంతి మాత్రం స్టంప్స్కు తాకలేదు. అయితే కోహ్లి మాత్రం తన రనౌట్ అని భావించి వెనక్కి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే బంతి స్టంప్స్కు తాకలేదో వెంటనే కోహ్లి సేఫ్గా క్రీజులోకి వచ్చేచాడు. కాగా బంగ్లా బౌలర్ ఏ మాత్రం సమయస్పూర్తి ఉపయెగించలేదు.స్టంప్స్ దగ్గరకు వెళ్లి పడగొట్టే అంతసమయం ఉన్నప్పటకి దూరం నుంచి త్రో చేసి కోహ్లికి లైఫ్ ఇచ్చేశాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు మొత్తం నిరాశలో కూరుకుపోయారు. పంత్ మాత్రం కోహ్లి దగ్గరకు వచ్చి హాగ్ చేసుకుని మరీ సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Luck favours the brave🫨Kohli survives to hug it out with Pant in the middle! 😍#IDFCFirstBankTestSeries #JioCinemaSports #INDvBAN pic.twitter.com/XVDyR0ffD3— JioCinema (@JioCinema) September 30, 2024 -
బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరో గానీ..: పాక్ క్రికెటర్ విమర్శలు
టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ టెస్టు మ్యాచ్కు వరుస అవాంతరాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంకోసారి ఇలాంటి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు. ఈ మ్యాచ్ టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నై మ్యాచ్లో 280 పరుగుల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ జయభేరి మోగించి బంగ్లాదేశ్ను క్లీన్స్వీప్ చేయడం ఖాయమనిపించింది. తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే అయితే, వర్షం, వెలుతురులేమి, మైదానం సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అది సాధ్యపడేలా కనిపించడం లేదు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్య పడగా... వరుసగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదివారం వర్షం అంతరాయం కలిగించకపోయినా... క్రితం రోజు కురిసిన వానతో మైదానం చిత్తడిగా మారడం వల్ల ఆట సాధ్యపడలేదు.దీంతో వరుసగా రెండో రోజు ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు టీ విరామ సమయంలో మూడో రోజు ఆటను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులను ఉద్దేశించి బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు అసలు మైదానాన్ని ఆరబెట్టనేలేదు. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారోగత రాత్రి వర్షం లేకపోయినా.. సూపర్ సాపర్స్ ఉన్నా.. సోమవారం ఉదయానికి కూడా గ్రౌండ్ ఇంకా చిత్తడిగానే ఉంది. అంటే.. అక్కడి కవర్స్ సరిగ్గా లేవని అర్థం. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారో.. వాళ్లు మాత్రం కాన్పూర్లో ఇంకోసారి టెస్టు మ్యాచ్ నిర్వహించకుండా నిషేధం విధించాలి’’ అని విజ్ఞప్తి చేశాడు. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిస్తే.. డబ్ల్యటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్తో మూడు టెస్టుల్లో టీమిండియా గెలుస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోఅగ్రస్థానంలో టీమిండియా అయితే, అందులో ఒక్క మ్యాచ్ డ్రా అయినా.. రోహిత్ సేన చిక్కుల్లో పడుతుంది. ఏదేమైనా కాన్పూర్ స్టేడియానికి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చే అర్హత మాత్రం లేదు’’ అని బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్లలో ఏడు గెలిచి.. రెండు ఓడిన భారత్.. ఒకటి డ్రా చేసుకుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా పన్నెండు మ్యాచ్లలో ఎనిమిది గెలిచి రెండోస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టులు ఆడనున్న రోహిత్ సేన.. ఆతర్వాత ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక... కాన్పూర్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మున్సిపల్ గ్రౌండ్ కాగా... ఇక్కడ మ్యాచ్ నిర్వహించిన ప్రతిసారి బీసీసీఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటుంది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లే తప్ప పూర్తిస్థాయి ఏర్పాట్లపై బోర్డు కూడా దృష్టి పెట్టలేదు. మ్యాచ్కు ముందే స్టాండ్స్ నాణ్యత విషయంలో పెద్ద చర్చ జరగగా... ‘సి’ బ్లాకు నాణ్యత సరిగ్గా లేని కారణంగా అందులోకి ప్రేక్షకులను అనుమతించలేదు.అందుకే కాన్పూర్కు టెస్టు మ్యాచ్ కేటాయించారుదేశంలో ఎన్నో మైదానాలు ఉన్నప్పటికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సొంత మైదానం కావడం వల్లే కాన్పూర్కు టెస్టు మ్యాచ్ కేటాయించారు. సౌకర్యాల విషయంలో ప్రధాన వేదికల దరిదాపుల్లో కూడా లేని కాన్పూర్లో... డ్రైనేజీ వ్యవస్థతో పాటు కనీస వసతులు లేకపోవడంతోనే ఆదివారం ఒక్క చుక్క వర్షం పడకపోయినా మ్యాచ్ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సోమవారం నాటి నాలుగో రోజు మాత్రం ఆట సజావుగా సాగింది. 107/3తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 34.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.చదవండి: ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్.. షాక్లో సహచరులు! వీడియో -
విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే
భారత స్టార్ క్రికెటర్, రన్మిషన్ విరాట్ కోహ్లి మరో ప్రపంచరికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంతవేగంగా 27,000 వేల పరుగులు మైలు రాయిని అందుకున్న క్రికెటర్గా విరాట్ నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో 47 పరుగులు చేసిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి 594* ఇన్నింగ్స్లలో ఈ ఘనతను అందుకున్నాడు.సచిన్ రికార్డు బ్రేక్.. ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 623 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను నమోదు చేశాడు. 226 టెస్టు, 396 వన్డే, ఒక టీ20 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని అతడు అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును కోహ్లి (594* ) బ్రేక్ చేశాడు.ఆగని రన్ మిషన్..విరాట్ కోహ్లి 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తన అరంగేట్రం నుంచి కోహ్లి సత్తాచాటుతునే ఉన్నాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా పరుగులు వరద పారిస్తూ రన్మిషన్గా పేరుగాంచాడు. కోహ్లి ఇప్పటి వరకు టెస్టుల్లో 8871, వన్డేల్లో 13906, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20లో ఒక శతకం కోహ్లి ఖాతాలో ఉన్నాయి.చదవండి: IND vs BAN: టీమిండియా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
జడేజా సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్గా
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏడో భారత బౌలర్గా రవీంద్ర జడేజా నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఖాలీల్ ఆహ్మద్ను ఔట్ చేసిన జడ్డూ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు అనిల్ కుంబ్లే (619), అశ్విన్ (524), కపిల్ (434), హర్భజన్ (417), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) ఉన్నారు.మరో అరుదైన రికార్డు.. ఈ మ్యాచ్లో జడేజా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 3,000 పరుగులతో పాటు 300 వికెట్లు అత్యంత వేగంగా సాధించిన భారత క్రికెటర్గా జడేజా రికార్డులకెక్కాడు. 78* టెస్టు మ్యాచ్లు ఆడిన జడేజా.. 3122 పరుగులతో పాటు 300 వికెట్లు పడగొట్టాడు.ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా జడేజా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్ పేరిట ఉంది. ఆయన కేవలం 72 మ్యాచ్ల్లోనే ఈ ఫీట్ను అందుకున్నాడు. చదవండి: IND vs BAN: టీమిండియా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. సంప్రదాయ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఈ లెఫ్టాండర్.. తాజాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టు సందర్భంగా మరో రికార్డు నమోదు చేశాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ను జైస్వాల్ అధిగమించాడు. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చెన్నై టెస్టులో 280 పరుగులతో గెలిచిన టీమిండియా.. కాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్ ఆడుతోంది. గ్రీన్పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్కు తొలిరోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో రెండు, మూడో రోజు ఆట రద్దు కాగా.. సోమవారం మ్యాచ్ మళ్లీ మొదలైంది.ఆది నుంచే దూకుడుగాఈ నేపథ్యంలో 107/3 స్కోరుతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 11 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. 209కి పైగా స్ట్రైక్రేటుతో ఆకట్టుకున్నాడు.టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం ‘బజ్బాల్’ తరహా ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై బ్యాటర్.. 12 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 72 పరుగులు రాబట్టాడు.టీమిండియా తరఫున టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం సాధించినది వీరే👉రిషభ్ పంత్- బెంగళూరులో 2022 నాటి శ్రీలంకతో మ్యాచ్లో 28 బంతుల్లోనే 50 రన్స్👉కపిల్ దేవ్- కరాచిలో 1982 నాటి మ్యాచ్లో పాకిస్తాన్తో మ్యాచ్లో 30 బంతుల్లోనే 50 రన్స్👉శార్దూల్ ఠాకూర్- ఓవల్లో 2021 నాటి మ్యాచ్లో ఇంగ్లండ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉యశస్వి జైస్వాల్- కాన్పూర్లో 2024 నాటి మ్యాచ్లో బంగ్లాదేశ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉వీరేంద్ర సెహ్వాగ్- చెన్నైలో 2008 నాటి మ్యాచ్లో ఇంగ్లండ్ మీద 32 బంతుల్లో 50 రన్స్.ప్రపంచ రికార్డుఇక ధనాధన ఇన్నింగ్స్తో అలరించిన రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ జోడి టెస్టుల్లో హయ్యస్ట్ స్కోరింగ్ రేటు(14.34) పార్ట్నర్షిప్ సాధించిన తొలి జంటగా అరుదైన ఘనత సాధించింది. ఇద్దరూ కలిసి 23 బంతుల్లోనే 55 పరుగులు సాధించి ఈ ఫీట్ నమోదు చేశారు. వీరి తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ జోడీ బెన్ స్టోక్స్- బెన్ డకెట్(44 బంతుల్లో 87 నాటౌట్), వాగ్నర్- ట్రెంట్ బౌల్ట్(27 బంతుల్లో 52) ఉన్నారు. చదవండి: రాహుల్ ద్రవిడ్ కుమారుడికి షాక్.. ఇకపై ఆ జట్టుకు ఆడలేడు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
టీమిండియా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే
కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగారు.107/3 ఓవర్ నైట్స్కోర్తో నాలుగో రోజును ప్రారంభించిన బంగ్లాదేశ్.. అదనంగా 126 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్ను ముగించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్,అశ్విన్,ఆకాష్ దీప్ తలా రెండు వికెట్లు సాధించారు.టీమిండియా వరల్డ్ రికార్డు..అనంతరం మొదటి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి దూకుడు ధాటికి భారత్ స్కోర్ కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ను అందుకుంది. తద్వారా ఓ వరల్డ్ రికార్డును టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి ఈ రికార్డు సాధించింది. తాజా మ్యాచ్తో ఇంగ్లండ్ ఆల్టైమ్ రికార్డును రోహిత్ సేన బ్రేక్ చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(37), రిషబ్ పంత్(4) పరుగులతో ఉన్నారు. అదేవిధంగా యశస్వీ జైశ్వాల్(51 బంతుల్లో 72, 12 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ 23 పరుగులు చేశాడు. -
గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్!
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్భుత రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టి అభిమానులకు కనువిందు చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో గెలుపొంది.. 1-0తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. ప్రస్తుతం కాన్పూర్లో రెండో మ్యాచ్ ఆడుతోంది.233 పరుగులకు బంగ్లా ఆలౌట్శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో గ్రీన్ పార్క్ స్టేడియంలో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యపడగా.. రెండు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దై పోయింది. ఈ క్రమంలో సోమవారం వరణుడు కరుణించడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ 74.2 ఓవర్లలో 233 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అయితే, బంగ్లా ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుకు సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ సహచరులతో పాటు.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లనూ ఆశ్చర్యపరిచింది. 50వ ఓవర్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ బౌండరీకి తరలించాలనే యోచనతో షాట్ బాదినట్లు కనిపించింది. ఒక్క ఉదుటున పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్ఈ క్రమంలో 30 యార్డ్ సర్కిల్ లోపలి ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న రోహిత్.. తన తల మీదుగా వెళ్తున్న బంతిని ఒక్క ఉదుటన పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో సిరాజ్తో పాటు లిటన్ దాస్, భారత ఫీల్డర్లు నమ్మలేమన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అలా లిటన్దాస్(13) రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా మూడు, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించిన టీమిండియా 55 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మెహది హసన్ మిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మ 23 పరుగుల వద్ద నిష్క్రమించాడు.చదవండి: పూరన్ సుడిగాలి శతకంHits blinks Out! ☝🏻🥳 #IndvBan #WhistlePodupic.twitter.com/A32vPxSlyP— Chennai Super Kings (@ChennaiIPL) September 30, 2024 -
IND vs BAN: కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. 107/3 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. బుమ్రా (3/50), సిరాజ్ (2/57), అశ్విన్ (2/45), ఆకాశ్దీప్ (2/43), జడేజా (1/28) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ అజేయ సెంచరీతో (107) బంగ్లాదేశ్ను ఆదుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్లో జకీర్ హసన్ 0, షద్మాన్ ఇస్లాం 24, నజ్ముల్ హసన్ షాంటో 31, ముష్ఫికర్ రహీం 11, లిట్టన్ దాస్ 13, షకీబ్ అల్ హసన్ 9, మెహిది హసన్ మిరాజ్ 20, తైజుల్ ఇస్లాం 5, హసన్ మహమూద్ 1, ఖలీద్ అహ్మద్ 0 పరుగులు చేసి ఔటయ్యారు.నిప్పులు చెరిగిన బుమ్రానాలుగో రోజు ఆటలో బుమ్రా చెలరేగిపోయాడు. ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ముష్ఫికర్ రహీంను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా, ఆతర్వాత మెహిది హసన్, తైజుల్ ఇస్లాంలను పెవిలియన్కు పంపాడు. బుమ్రా ధాటికి బంగ్లా బ్యాటింగ్ లైనప్ విలవిలలాడిపోయింది.WHAT A BLINDER BY CAPTAIN ROHIT SHARMA. 🔥- Captain Rohit leads by example for India...!!!! 🙌 pic.twitter.com/XqJORqHvF6— Tanuj Singh (@ImTanujSingh) September 30, 2024రోహిత్ సూపర్ క్యాచ్నాలుగో రోజు తొలి సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. సిరాజ్ బౌలింగ్లో రోహిత్ నమ్మశక్యం కాని రీతిలో గాల్లోకి ఎగురుతూ అద్బుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. రోహిత్ విన్యాసం చూసి గ్రౌండ్లో ఉన్నవారంతా షాక్కు గురయ్యారు.• @fairytaledustt_ pic.twitter.com/yqDDcJcTCq— V. (@was_fairytale) September 30, 2024కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్లు రెండు అద్భుతమైన క్యాచ్లు పట్టుకున్నారు. తొలుత లిట్టన్ దాస్ క్యాచ్ను రోహిత్.. ఆతర్వాత షకీబ్ క్యాచ్ను సిరాజ్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన క్యాచ్లుగా మలిచారు. షకీబ్ క్యాచ్ను సిరాజ్ వెనక్కు పరిగెడుతూ సూపర్ మ్యాన్లా అందుకున్నాడు. రోహిత్, సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్లకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్లో రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్లు వీరే..? -
IND vs BAN: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియాదే పైచేయి
IND VS BAN 2nd Test Day 4 Updates: నాలుగో రోజు ముగిసిన ఆటటీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్లో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. సోమవారం నాటి ఆట పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. మొమినుల్ హక్ సున్నా, షాద్మన్ ఇస్లాం ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.కాగా సోమవారం 107/3 ఓవర్ నైట్స్కోర్తో ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టింది. 289/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్అశూ బౌలింగ్లో హసన్ మహమూద్(4) రెండో వికెట్గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్స్కోరు- 26/2 (9.4). షాద్మన్ ఏడు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్కు అశ్విన్ ఆదిలోనే షాకిచ్చాడు. అశూ బౌలింగ్లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్(10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ స్కోరు: 18/1 (7.1). షాద్మన్ ఇస్లాం 3 పరుగులతో ఆడుతున్నాడు. హసన్ మహమూద్ క్రీజులోకి వచ్చాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్.. స్కోర్ ఎంతంటే?టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 285/9 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్కు మొదటి ఇన్నింగ్స్లో 52 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బంగ్లాను సెకెండ్ ఇన్నింగ్స్ ఆడించాలన్న ఆలోచనతో టీమిండియా దూకుడుగా ఆడింది. వచ్చినవారు వచ్చినట్లగా తమ వంతు పాత్ర పోషించి పెవిలయన్కు వెళ్లిపోయారు. భారత బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(72) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్(68), కోహ్లి(47), గిల్(39) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, షకీబ్ అల్ హసన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.34.1: రాహుల్ అవుట్మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. బుమ్రా క్రీజులోకి వచ్చాడు. టీమిండియాస్కోరు: 284/8 (34.1). తొలి ఇన్నింగ్స్లో బంగ్లా కంటే 51 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.33.3: ఏడో వికెట్ డౌన్రవిచంద్రన్ అశ్విన్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. షకీబ్ బౌలింగ్లో అశూ(1) బౌల్డ్ అయ్యాడు. ఆకాశ్ దీప్ క్రీజులోకి వచ్చాడు.32.2: జడ్డూ అవుట్మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో జడేజా(8) షాంటోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. కోహ్లి అవుట్.. హాఫ్ సెంచరీ మిస్29.1: విరాట్ కో హ్లి రూపంలో టీమిండియా ఐదో వికెట్ ల్పోయింది. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో 47 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. జడేజాక్రీజులోకి వచ్చాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్ 33 బంతుల్లోనే హా ఫ్ సెంచరీ మార్కు దాటేశాడు. స్కోరు: 249/5 (30)26 ఓవర్లలో టీమిండియాస్కోరు: 219-4కోహ్లి 41, రాహుల్ 30 పరుగులతో ఆడుతున్నారు.నాలుగో వికెట్ డౌన్..రిషబ్ పంత్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పంత్.. షకీబ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 20 ఓవర్లకు భారత్ స్కోర్: 162-4భారత మూడో వికెట్ డౌన్.. శుబ్మన్ గిల్ ఔట్టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన గిల్.. భారీ షాట్కు ప్రయత్నించి షకీబ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో విరాట్ కోహ్లి వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 144-3రెండో వికెట్ డౌన్.. జైశ్వాల్ ఔట్యశస్వీ జైశ్వాల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 72 పరుగుల చేసిన జైశ్వాల్ను బంగ్లా పేసర్ హసన్ మహమూద్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 15 ఓవర్లకు భారత్ స్కోర్: 130/2జైశ్వాల్ ఫిప్టీ..కాన్పూర్ టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 72 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో శుబ్మన్ గిల్(30) క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది.3.6: కాన్పూర్లోబ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(23) మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 30 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియాస్కోరు: 55-1(4)233 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్74.2వ ఓవర్: 233 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. జడేజా బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి ఖలీద్ అహ్మద్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. అంతకుముందు సిరాజ్ హసన్ మహమూద్ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు మొత్తం ఏడు వికెట్లు తీశారు. బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అశ్విన్, ఆకాశ్దీప్ తలో 2, జడేజా ఓ వికెట్ దక్కించుకున్నారు. మొమినుల్ హక్ 107 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.బుమ్రా ఖాతాలో మరో వికెట్71.1వ ఓవర్: 230 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో తైజుల్ ఇస్లాం (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో బుమ్రాకు ఇది మూడో వికెట్. మొమినుల్కు జతగా హసన్ మహమూద్ క్రీజ్లోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్69.4వ ఓవర్: 226 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో శుభ్మన్కు క్యాచ్ ఇచ్చి మెహిది హసన్ మిరాజ్ (20) ఔటయ్యాడు. 70 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 225/7గా ఉంది. మొమినుల్ (106), తైజుల్ ఇస్లాం క్రీజ్లో ఉన్నారు. మొమినుల్ హక్ సెంచరీ.. బంగ్లాదేశ్ 205/6లంచ్ విరామానికి ముందు మొమినుల్ హక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హక్ 172 బంతుల్లో సెంచరీ మార్కును తాకాడు. హక్ సెంచరీలో 16 బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. 66 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 205/6గా ఉంది. హక్తో పాటు మెహిది హసన్ మిరాజ్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 55.6వ ఓవర్: 170 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో సిరాజ్ సూపర్ క్యాచ్ పట్టడంతో షకీబ్ (9) పెవిలియన్ బాట పట్టాడు. 56 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 170/6గా ఉంది. మొమినుల్ హక్ (75), మెహిది హసన్ క్రీజ్లో ఉన్నారు.WHAT A BLINDER BY CAPTAIN ROHIT SHARMA. 🔥- Captain Rohit leads by example for India...!!!! 🙌 pic.twitter.com/XqJORqHvF6— Tanuj Singh (@ImTanujSingh) September 30, 2024ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 49.4వ ఓవర్: 148 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో లిట్టన్ దాస్ (13) ఔటయ్యాడు. మొమినుల్ హక్కు (62) జతగా షకీబ్ అల్ హసన్ క్రీజ్లోకి వచ్చాడు.JASPRIT JASBIR SINGH BUMRAH.- The master at the work...!!!! 🐐 pic.twitter.com/nE9hUNHAeJ— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2024నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్రెండు రోజుల విరామానంతరం ఎట్టకేలకు ఆట మొదలైంది. నాలుగో రోజు ఆట ప్రారంభంలో బంగ్లా బ్యాటర్లు నిదానంగా ఆడారు. ఇన్నింగ్స్ 41వ ఓవర్ రెండో బంతికి బుమ్రా ముష్ఫికర్ రహీంను (11) క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 133/4గా ఉంది. మొమినుల్ హక్ (48), లిట్టన్ దాస్ (12) క్రీజ్లో ఉన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు వర్షం ఆటంకం కలిగించే సమయానికి బంగ్లాదేశ్ స్కోర్ 107/3గా ఉంది. మొమినుల్ హక్ 40, ముష్ఫికర్ రహీం 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్లో రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. బంగ్లా ఇన్నింగ్స్లో జకీర్ హసన్ 0, షద్మాన్ ఇస్లాం 24, నజ్ముల్ హసన్ షాంటో 31 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. -
భారత్తో టీ20 సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
త్వరలో భారత్తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 29) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా నజ్ముల్ హొస్సేన్ శాంటో నియమితుడయ్యాడు. ఆల్రౌండర్ మెహిది హసన్ 14 నెలల విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ పర్వేజ్ హొసేన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ రకీబుల్ హసన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, బంగ్లాతో సిరీస్ కోసం భారత జట్టును నిన్ననే ప్రకటించారు.భారత్తో టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహమూద్ ఉల్లా, లిట్టన్ కుమార్ దాస్, జాకెర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షక్ మహేదీ హసన్, రిషద్ హొసేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, రకీబుల్ హసన్.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్. భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ షెడ్యూల్..అక్టోబర్ 6: తొలి టీ20 (గ్వాలియర్)అక్టోబర్ 9: రెండో టీ20 (ఢిల్లీ)అక్టోబర్ 12: మూడో టీ20 (హైదరాబాద్)చదవండి: మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్లోనే భారత్ -
IND Vs BAN 2nd Test: మూడో రోజు కూడా తుడిచిపెట్టుకుపోయిన ఆట
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు ఆట కూడా రద్దైంది. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఇవాళ (సెప్టెంబర్ 29) ఒక్క బంతి కూడా పడలేదు. ఈ రోజు ఉదయం నుంచి వర్షం పడనప్పటికీ.. నిర్వహకులు గ్రౌండ్ను సిద్దం చేయలేకపోయారు. మ్యాచ్ పూర్తిగా రద్దు కావడం వరుసగా ఇది రెండో రోజు. తొలి రోజు ఆటలో కూడా కేవలం 35 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. వర్షం కురువడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జాకిర్ హసన్ (0), షద్మాన్ ఇస్లాం (24), నజ్ముల్ హసన్ షాంటో (31) ఔట్ కాగా.. మొమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీం (6) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్లోని తొలి మ్యాచ్లో (చెన్నై) భారత్ 280 పరుగుల తేడాతో గెలుపొందింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం అంతరాయాల నడుమ నిదానంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో ఫలితం తేలడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఈ మ్యాచ్లో మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు రోజులు ఆట కూడా సజావుగా సాగే అవకాశాలు లేవు. టెస్ట్ సిరీస్ అనంతరం టీ20 సిరీస్ మొదలవుతుంది. అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: ధోనిని చిన్న పిల్లాడిలా మార్చిన విజయం..! -
IND Vs BAN: టీమిండియా ఓపెనర్గా సంజూ శాంసన్..?
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ అనంతరం అదే జట్టుతో మూడు టీ20ల సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఐపీఎల్ యువ సంచలనం మయాంక్ యాదవ్కు ఈ జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని సెలక్టర్లు ఎంపిక చేశారు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.ఓపెనర్గా సంజూ శాంసన్..?ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లాతో టీ20లకు రెగ్యూలర్ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, శుబ్మన్ గిల్కు సెలక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. ప్రస్తుతం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో అభిషేక్ శర్మ ఒక్కడే రెగ్యూలర్ ఓపెనర్గా ఉన్నాడు. దీంతో భారత ఇన్నింగ్స్ను అభిషేక్తో కలిసి ప్రారభించేది ఎవరన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. అయితే అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ను వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. అతడిని ఓపెనర్గా ప్రమోట్ చేయాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గతంలో ఐర్లాండ్ సిరీస్లో ఓసారి భారత జట్టు ఓపెనర్గా సంజూ బరిలోకి దిగాడు. కాగా ఈ సిరీస్ శాంసన్కు చాలా కీలకం. శ్రీలంకతో టీ20 సిరీస్లో నిరాశపరిచినప్పటకి ఈ కేరళ స్టార్కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. మరి ఓపెనర్గా ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. -
'అతడేం తప్పు చేశాడు.. నిజంగా సిగ్గు చేటు'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే ఈ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.టీమిండియా తరపున అవకాశం వచ్చినప్పుడల్లా ఆకట్టుకున్న రుతురాజ్కు చోటు కల్పించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అతడి అభిమానులు భారత సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి కెరీర్ను నాశనం చేస్తున్నారు అంటూ తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు.రుతురాజ్ గైక్వాడ్ టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. జింబాబ్వే పర్యటనలో అతడు అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఏ స్ధానంలో నైనా బ్యాటింగ్ చేస్తే సత్తా రుతుకు ఉంది. అటువంటి ఆటగాడి ఎందుకు పక్కన పెడుతున్నారు. నిజంగా సిగ్గు చేటు అంటూ ఓ యూజర్ ఎక్స్లో రాసుకొచ్చాడు.భీకర ఫామ్లో రుతు..రుతురాజ్ ఫార్మాట్తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. దేశీవాళీ క్రికెట్తో పాటు టీమిండియా తరపున కూడా తాను ఏంటో నిరూపించుకున్నాడు. భారత్ తరఫున 23 టీ20లు ఆడిన రుతురాజ్ 39.56 యావరేజ్ 633 రన్స్ చేశాడు. అటువైపు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ రుతురాజ్ తన ప్రదర్శనలతో అకట్టుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో కూడా గైక్వాడ్ దమ్ములేపాడు. ఈ ఏడాది సీజన్లో సీఎస్కే తరపున 14 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ ఏకంగా 583 పరుగులు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలోనూ సత్తాచాటాడు. ఆ తర్వాత అతడికి వరుసగా శ్రీలంక, బంగ్లాతో సిరీస్లకు సెలక్టర్లు చోటు ఇవ్వలేదు. బంగ్లాతో టీ20లకు ఓపెర్లు జైశ్వాల్, గిల్కు విశ్రాంతి ఇచ్చినప్పటికి.. రుతురాజ్ వైపు మాత్రం సెలక్టర్లు మొగ్గు చూపలేదు. ఇక ఈ మూడు మ్యాచ్ల సిరీస్ ఆక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.బంగ్లాతో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్రెడ్డి, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా . -
భారత్- బంగ్లా టెస్టుకు వర్షం అడ్డంకి.. మూడో రోజు ఆట కూడా డౌటే?
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా ప్రారంభం కాలేదు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ పార్క్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.అయితే ప్రస్తుతం కాన్పూర్లో వర్షం కురవడం లేదు. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు. గ్రీన్ పార్క్ స్టేడియంలో మెరుగైన డ్రైనజీ వ్యవస్ధ లేకపోవడంతో గ్రౌండ్ను రెడీ చేసేందుకు సిబ్బందికి కష్టతరం అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు అంపైర్లు పిచ్ను పరిశీలించనున్నారు. కాగా ఇప్పటికే రెండో రోజు(శనివారం) ఆట కనీసం బంతి పడకుండానే రద్దు అయింది. ఇప్పుడు మూడో రోజు ఆటకు కూడా భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మళ్లీ వర్షం ఏమైనా తిరుగుముఖం పడితే మూడో రోజు ఆట కూడా రద్దు అయ్యే అవకాశముంది. కాగా బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్. -
IND Vs BAN: బంగ్లాతో టీ20 సిరీస్.. మూడేళ్ల తర్వాత భారత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
బంగ్లాదేశ్తో టీ20తో సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. ఈ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో స్ధానం లభించగా.. స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్కు తొలి సారి జాతీయ జట్టులో చోటు దక్కింది. బంగ్లాతో టీ20 సిరీస్కు స్టార్ క్రికెటర్లు శుబ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్లు దూరమయ్యారు. వర్క్ లోడ్ కారణంగా వీరిముగ్గురికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వికెట్ కీపర్గా సంజూ శాంసన్ ఛాన్స్ కొట్టేశాడు.మిస్టరీ స్పిన్నర్ రీఎంట్రీఇక ఈ సిరీస్కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సెలక్టర్లు పిలుపు నిచ్చారు. అతడికి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జట్టులో చోటుదక్కింది. చక్రవర్తి చివరగా టీమిండియా తరపున 2021 టీ20 ప్రపంచకప్లో ఆడాడు. అయితే ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో సెలక్టర్లు అతడికి మళ్లీ పిలునివ్వాలని నిర్ణయించుకున్నారు.అయితే అతడి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేయడంలో హెడ్కోచ్ గంభీర్ది కీలక పాత్ర అని చెప్పవచ్చు. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మెంటార్గా పనిచేసిన గంభీర్ను.. చక్రవర్తి తన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లకు గౌతీ అతడిని ఎంపిక చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. చక్రవర్తి టీమిండియా తరపున ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనప్పటకి.. దేశీవాళీ క్రికెట్లో మాత్రం వరుణ్కు మంచి రికార్డు ఉంది. 87 టీ20లు ఆడి 98 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.బంగ్లాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్ -
WTC- Ind vs Ban: ఆట రద్దు.. టీమిండియాకు కష్టమేనా?
టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కాన్పూర్లో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తొలుత తెలిపింది. అయితే, భోజన విరామ సమయం వరకూ వరణుడు కరుణించలేదు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో గ్రీన్ పార్క్స్టేడియంలో ఆట ఆరంభమవుతుందని ప్రేక్షకులు ఎదురుచూశారు. కానీ.. అవుట్ఫీల్డ్ మొత్తం తడిగా ఉండటంతో శనివారం ఆటను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.తొమ్మిదేళ్లలో తొలిసారికాగా గత తొమ్మిదేళ్లలో టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్ మొత్తంలో ఒక రోజు ఆట ఇలా రద్దు కావడం ఇదే తొలిసారి. బెంగళూరులో 2015లో సౌతాఫ్రికాతో టెస్టులో సైతం ఇలాగే జరిగింది. నాడు మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇదిలా ఉంటే.. ఒకవేళ కాన్పూర్ టెస్టు కూడా ఫలితం తేలకుండా ముగిసిపోతే టీమిండియాకు కాస్త ఇబ్బందే.న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రూపంలో కఠిన సవాలుప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో రోహిత్ సేన ప్రస్తుతం అగ్రస్థానంలోనే ఉంది. అయితే, బంగ్లాదేశ్తో సొంతగడ్డపై సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేస్తే గనుక ఫైనల్ మార్గం మరింత సుగమమయ్యేది. ఎందుకంటే.. మిగిలిన ఎనిమిదింటిలో మూడు మ్యాచ్లు గెలిస్తే ఫైనల్ బెర్తు దాదాపుగా ఖరారవుతుంది. అయితే, ఆ ఎనిమిది టెస్టుల్లో టీమిండియాకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. అంతా వరణుడి దయ!సొంతగడ్డపై కివీస్తో మూడు టెస్టులు ఆడిన అనంతరం.. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు మ్యాచ్లు ఆడుతుంది. వీటిలో నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రోహిత్ సేనకు ఇదేమీ అంత కష్టం కాకపోయినా.. బంగ్లాదేశ్తో మ్యాచ్ డ్రా కాకుండా ఉంటే.. పని సులువవుతుంది. ఈ మ్యాచ్ సజావుగా సాగి.. టీమిండియా గెలిస్తే సరి. లేదంటే.. ఎంతో కొంత తలనొప్పి మాత్రం తప్పదు. అంతా వరణుడి దయ!చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
బంగ్లాతో టీ20లు.. టీమిండియాలోకి పేస్ గన్ ఎంట్రీ!
భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ యువ స్పీడ్స్టర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు.మెరుపు వేగంతో దూసుకువచ్చే బంతులు విసరడంలో దిట్టలక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించిన ఈ రైటార్మ్ బౌలర్.. తన మెరుపు వేగంతో హాట్టాపిక్గా మారాడు. గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతూ యువ బౌలర్లందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. లక్నో తరఫున వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్గా రికార్డులకెక్కాడు.మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు!అయితే, ఆ వెంటనే గాయం కారణంగా మయాంక్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న అతడు.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరాడు. అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన 22 ఏళ్ల మయాంక్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు.టీమిండియా సెలక్టర్ల ఆరాఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత నెల రోజులుగా మయాంక్ గాయం కారణంగా ఎలాంటి ఇబ్బందిపడలేదు. ఎన్సీఏ నెట్స్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా? అని టీమిండియా సెలక్టర్లు ఆరా తీశారు.స్వదేశంలో వరుస టెస్టు సిరీస్లు ఉన్న కారణంగా.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా ఎక్కువగా కొత్త ముఖాలకే చోటు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. మయాంక్ ఇక్కడ రోజుకు 20 ఓవర్ల పాటు వైట్బాల్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఎన్సీఏలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత.. టీమిండియా సెలక్టర్లు అతడి బంగ్లాతో టీ20 సిరీస్కు ఎంపిక చేస్తారనే నమ్మకం బలపడింది. ఎన్సీఏ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం కోసం టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అగార్కర్ బెంగళూరుకు రానున్నాడు. అప్పుడు ఈ విషయంపై స్పష్టత వస్తుంది.గంభీర్, మోర్కెల్లకు తెలుసుఅయినా.. మయాంక్ను కేవలం టీ20 ఫార్మాట్కే పరిమితం చేయాలని సెలక్టర్లు భావించడం లేదు. టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్తో ఉన్న సమయంలో మయాంక్ను దగ్గరగా గమనించారు. అతడి ప్రతిభ గురించి వారికి తెలుసు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాయి. దీనిని బట్టి బంగ్లాదేశ్తో అక్టోబరు 6-12 మధ్య జరుగనున్న టీ20 సిరీస్కు మయాంక్ యాదవ్ ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: లివింగ్స్టోన్ విధ్వంసం.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. మట్టికరిచిన ఆసీస్ -
Ind vs Ban 2nd Test: అభిమానులకు బ్యాడ్న్యూస్
India vs Bangladesh, 2nd Test Day 2 Updates: క్రికెట్ అభిమానులకు బ్యాడ్న్యూస్!!... టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటకూ వరణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా శనివారం నాటి ఆట ఒక్క బంతి పడకుండానే ముగిసిపోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ‘ఎక్స్’ ద్వారా ఈ మేరకు అప్డేట్ అందించింది. వర్షం తగ్గుముఖం పట్టినా.. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేశారు. లంచ్బ్రేక్ సమయానికీ మొదలుకాని ఆటవర్షం తగ్గినా మైదానంలో కప్పిన కవర్లు మాత్రం తీయలేదు. మరికాసేపు వేచి చూసి.. వాన రాకపోతే.. కవర్లు తీసే అవకాశం ఉందని తెలుస్తోందిఆట ఆలస్యంకాగా మైదానం కవర్లతో కప్పబడి ఉండగా.. అంపైర్లు వెళ్లి పిచ్ను పరిశీలించారు. అయితే, ఇప్పట్లో ఆట మొదలయ్యే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్తో స్వదేశంలో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. తొలిరోజు కూడా అంతరాయమేచెన్నైలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో మట్టికరిపించిన రోహిత్ సేన.. కాన్పూర్లోని గ్రీన్పార్క్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. అయితే, వర్షం కారణంగా అవుట్ఫీల్డ్ చిత్తడిగా మారటంతో తొలి రోజు ఆట కూడా ఆలస్యంగా ప్రారంభమైంది.ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. నజ్ముల్ షాంటో బృందాన్ని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అయితే, వాన కారణంగా తొలి రోజు ఆట 35 ఓవర్ల వద్దే ముగిసిపోయింది. అంపైర్లు ఆటను నిలిపివేసే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.మొదటి రోజు ఆకాశ్కు రెండు వికెట్లుఓపెనర్ జకీర్ హసన్(0)ను భారత పేసర్ ఆకాశ్ దీప్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(24) వికెట్ను సైతం ఆకాశ్ తన ఖాతాలోనే వేసుకోగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(31)ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి వన్డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్ 40, ముష్ఫికర్ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
Ind vs Ban: ‘టైగర్’కు అస్వస్థతే.. దాడి జరుగలేదు!
బంగ్లాదేశ్ వీరాభిమాని మాట మార్చాడు. అకస్మాత్తుగా తన ఆరోగ్యం పాడైందని.. అందుకే పోలీసులు ఆస్పత్రికి తరలించారని చెప్పాడు. తద్వారా తనపై దాడి జరగలేదని పరోక్షంగా స్పష్టతనిచ్చాడు. కాగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా ఓ వ్యక్తి అక్కడ వాలిపోతాడు. ఒళ్లంతా పులిచారలతో పెయింటింగ్ వేసుకొని తమ జట్టును ఉత్సాహపరుస్తాడు. అతడి అసలు పేరు ‘రాబీ’. అయితే, తనను తాను ‘టైగర్’ అని చెప్పుకొంటాడు.ఆస్పత్రికి వెళ్లే ముందు దాడి జరిగిందని..తనపై దాడి జరిగిందనిఇదిలా ఉంటే... టీమిండియాతో బంగ్లాదేశ్ రెండో టెస్టు కాన్పూర్లో జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మొదలైన.. ఈ మ్యాచ్ భోజన విరామం సమయంలో రాబీ.. స్టేడియం గేటు వద్ద కాస్త స్పృహ తప్పినట్లు కనిపించాడు. దాంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. తనపై దాడి జరిగిందని... కొందరు వ్యక్తులు తన వీపు, పక్కటెముకల్లో పిడిగుద్దులు కురిపించినట్లు రాబీ తనను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో చెప్పాడు.డీహైడ్రేషన్కు లోనయ్యాను.. అంతేఇక హాస్పిటల్లో అతడికి తగిన చికిత్స అందించడంతో పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ప్రమాదమేమీ లేదని తేల్చారు. అక్కడి నుంచి రాబీ తన వ్యాఖ్యను మార్చాడు. ‘నాకు ఆరోగ్యం ఒక్కసారిగా పాడైంది. డీహైడ్రేషన్కు లోనయ్యాను. పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతా బాగుంది’ అని అతనే చెప్పాడు. దాడి వార్తను ఖండించిన పోలీసులుమరోవైపు పోలీసులు కూడా దాడి జరిగిందనే వార్తను ఖండించారు. అయితే రాబీ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం ‘సి’ బ్లాక్లో నిలబడి ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు వాదనకు దిగి అతని చేతుల్లోంచి జాతీయ పతాకాన్ని లాక్కున్నారని మాత్రం తేలింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాను ఈ టెస్టుకు వస్తే తనపై.. ఇక్కడ కొందరు దాడి చేయవచ్చని గురువారం రాబీ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టాడు. మరోవైపు.. బంగ్లాదేశ్ జట్టు భారత్లో ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం సమీపంలో కొందరు వ్యక్తులు నిరసన కూడా వ్యక్తం చేశారు. చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
56 ఏళ్ల కిందటి చెత్త రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్
కాన్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్ జాకిర్ హసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 24 బంతులు ఎదుర్కొన్న జాకిర్ డకౌట్గా వెనుదిరిగాడు. టెస్ట్ల్లో భారత్కు వ్యతిరేకంగా ఇన్ని ఎక్కువ బంతులు ఆడి డకౌటైన తొలి బ్యాటర్ జకీరే. 56 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా ఆటగాడు ఇయాన్ ఛాపెల్ సిడ్నీ టెస్ట్లో 22 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. ఆతర్వాత 1986లో స్టీవ్ వా (21 బంతుల్లో), 2017లో షాన్ మార్ష్ (21 బంతుల్లో), 2021 కెమరూన్ గ్రీన్ (21 బంతుల్లో) భారత్పై టెస్ట్ల్లో అత్యధిక బంతులు ఎదుర్కొని డకౌట్లుగా వెనుదిరిగారు. తాజా ప్రదర్శనలతో జాకిర్.. ఇయాన్ ఛాపెల్ పేరిట ఉన్న చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.బంగ్లాదేశ్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక బంతులు ఎదుర్కొని డకౌటైన రికార్డు మంజురుల్ ఇస్లాం పేరిట ఉంది. 2002లో శ్రీలంకపై ఇస్లాం 41 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. ఆతర్వాత 2007లో రజిన్ సలేహ్ అదే శ్రీలంకపై 29 బంతుల్లో డకౌటయ్యాడు. వీరి తర్వాత అఫ్తాబ్ అహ్మద్ (న్యూజిలాండ్పై 25 బంతుల్లో డకౌట్), జకీర్ హసన్ (భారత్పై 24 బంతుల్లో డకౌట్) అత్యధిక బంతులు ఎదుర్కొని డకౌట్లు అయిన వారిలో ఉన్నారు.కాగా, భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా అర్దాంతరంగా ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జకీర్ హసన్ (0), షద్మాన్ ఇస్లాం (24), నజ్ముల్ హసన్ షాంటో (31) ఔట్ కాగా.. మొమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీం (6) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వెలుతురు లేమి, వర్షం కారణంగా పలు మార్లు అంతరాయాలు కలిగాయి. 35 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు.చదవండి: కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించి రూ. 50 లక్షల ప్రశ్న -
‘చెత్తగా ఆడండి.. అప్పుడు అసలైన గంభీర్ను చూస్తారు’
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును విజయపథంలో నడపగల సత్తా గౌతీకి ఉందని.. అయితే, అతడి కోచింగ్ స్టైల్ గురించి ఇప్పుడే అంచనాకు రాలేమన్నాడు. టీమిండియా చెత్తగా ఆడినపుడు గంభీర్ ‘నిజ స్వరూపం’ బయటపడుతుందని వ్యాఖ్యానించాడు.ద్రవిడ్ తర్వాతటీ20 ప్రపంచకప్-2024లో రోహిత్ సేన చాంపియన్గా నిలిచిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను టీమిండియా హెడ్కోచ్గా నియమించింది బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లక్నో సూపర్ జెయింట్స్(రెండుసార్లు ప్లే ఆఫ్స్) జట్టుకు మార్గదర్శనం చేయడంతో పాటు.. కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన మెంటార్గా ఘనత వహించిన అతడికి భారత జట్టు బాధ్యతలు అప్పగించింది.తన దూకుడు వైఖరికి విరుద్ధంగాశ్రీలంక పర్యటన సందర్భంగా జూలైలో కోచ్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గంభీర్కు శుభారంభం దక్కింది. సూర్యకుమార్ సేన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం రోహిత్ సేనకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ ఓడిపోయింది. రెండో ప్రయత్నంలోనే గంభీర్కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా.. తన దూకుడు వైఖరికి విరుద్ధంగా ప్రశాంతంగానే కనిపించాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా బంగ్లాదేశ్తో సిరీస్తో టెస్టుల ప్రయణాన్ని మొదలుపెట్టిన గంభీర్కు.. రోహిత్ సేన ఘన విజయంతో స్వాగతం పలికింది. చెన్నై టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో చిత్తు చేసి క్లీన్స్వీప్పై కన్నేసింది. గంభీర్ విశ్వరూపం చూస్తారుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా సిరీస్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న తమీమ్ ఇక్బాల్ జియో సినిమా షోలో మాట్లాడుతూ గంభీర్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘మీరు(టీమిండియా) వరుసగా గెలుస్తూ ఉంటే.. అతడి మనసులో నిజంగా ఏం దాగుందో బయటకు రాదు. మీరు ఎప్పుడైతే ఓ సిరీస్ కోల్పోతారో.. ఆ వెంటనే మరొకటి ఓడిపోతారో.. అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించగల సామర్థం అతడికి ఉంది. అయితే, ఇప్పుడే తన కోచింగ్ స్టైల్పై నిశ్చితాభిప్రాయానికి రాకూడదు. టీమిండియా ఒక్క చెత్త మ్యాచ్ ఆడనివ్వండి.. అప్పుడు తెలుస్తుంది’’ అని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. గంభీర్ మరీ అంత కూల్ కాదని.. జట్టు ఓటములపాలైతే ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడడని అభిప్రాయపడ్డాడు.గంభీర్ ముందున్న సవాళ్లువరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరడం సహా చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026, వన్డే వరల్డ్కప్-2027 రూపంలో గంభీర్కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
Ind vs Ban: అక్కడ కొండముచ్చులే కాపలా!
‘‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొండముచ్చుల(Langurs) ‘సాయం’ కోరింది. ప్రేక్షకులు, తమ కెమెరాల భద్రతకై కాపలాగా ఉండేందుకు వాటి యజమానులను ఒప్పించింది’’.. ఏంటీ విడ్డూరం అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే!.. అసలు విషయం ఏమిటంటే..!?కాన్పూర్లో రెండో టెస్టుటీమిండియాతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్కు వచ్చింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలుత చెన్నైలో టెస్టు జరుగగా.. రోహిత్ సేన 280 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అనంతరం రెండో టెస్టు కోసం ఇరుజట్లు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు వచ్చాయి.ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్- బంగ్లా మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా 35 ఓవర్లకే తొలి రోజు ఆట ముగిసిపోయింది. బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ ఆకాశ్ దీప్ రెండు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే.. టీమిండియా- బంగ్లా మధ్య రెండో టెస్టుకు వేదికైన గ్రీన్ పార్క్ స్టేడియం అంటే కోతులకు బాగా ఇష్టమట. గ్రౌండ్ ఖాళీగా ఉన్నపుడు గుంపులుగా అక్కడికి వచ్చి ఆటలాడుతాయని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. మ్యాచ్ సమయంలోనూ ప్రేక్షకుల వద్దకు వచ్చి తినుబండారాలు, వాటర్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయట. అందుకే కొండముచ్చులను తీసుకువచ్చాంఈ నేపథ్యంలో భారత్ మ్యాచ్కు ముందు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొండముచ్చులను హ్యాండిల్ చేసే వ్యక్తులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి గ్రీన్ పార్క్ స్టేడియం డైరెక్టర్ సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. ‘‘కోతులు ఇక్కడ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. అందుకే వాటిని కట్టడి చేసేందుకు, ఇక్కడికి వచ్చే వాళ్లకు భద్రత కల్పించేందుకు కొండముచ్చులను తీసుకువచ్చాం’’ అని ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నాడు. కాగా గ్రీన్ పార్క్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్లకు కొండముచ్చులు కాపలా కాయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ముఖ్యంగా బ్రాడ్కాస్టింగ్ కెమెరా పర్సన్ దగ్గర కోతుల బెడదను నివారించేందుకు వీటిని అక్కడ మోహరించేవారు. అదీ సంగతి!!చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
భారత్తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు
కాన్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ వీరాభిమాని 'టైగర్ రాబీ'పై దాడి జరిగింది. కొందరు ఆకతాయిలు రాబీ వీపు, పక్కటెముకలపై దాడి చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు రాబీని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాబీ డీహైడ్రేషన్తో బాధపడుతూ మాట్లాడలేకపోతున్నాడు. దాడికి గత కారణాలు తెలియాల్సి ఉంది.కాగా, తొలి రోజు భారత బౌలింగ్ సందర్భంగా రాబీ సి బ్లాక్ బాల్కనీ నుండి వారి జాతీయ జెండాను ఊపుతూ, నినాదాలు చేస్తూ కనిపించాడు. మొదటి సెషన్లో అతను కొంతమంది భారత అభిమానులతో వాదనకు దిగాడు. బహుశా ఈ సందర్భంగానే రాబీపై దాడి జరిగి ఉండవచ్చు.Bangladeshi fan Tiger Roby was beaten by some people.- The Kanpur police took him to the hospital. pic.twitter.com/F3ZwKqvarM— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2024ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా అర్దాంతరంగా ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జకీర్ హసన్ (0), షద్మాన్ ఇస్లాం (24), నజ్ముల్ హసన్ షాంటో (31) ఔట్ కాగా.. మొమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీం (6) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వెలుతురు లేమి, వర్షం కారణంగా పలు మార్లు అంతరాయాలు కలిగాయి. 35 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
IND VS BAN 2nd Test: వర్షం కారణంగా అర్ధాంతరంగా ముగిసిన తొలి రోజు ఆట
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా అర్దాంతరంగా ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జకీర్ హసన్ (0), షద్మాన్ ఇస్లాం (24), నజ్ముల్ హసన్ షాంటో (31) ఔట్ కాగా.. మొమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీం (6) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లొ భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వెలుతురు లేమి, వర్షం కారణంగా పలు మార్లు అంతరాయాలు కలిగాయి. 35 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో బంగ్లాపై పైచేయి సాధించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ పర్యటనలో టీ20 మ్యాచ్లు అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదారాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్టైమ్ రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్టైమ్ రికార్డు బద్దలు
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా యాష్ రికార్డులకెక్కాడు.తొలి ఇన్నింగ్స్లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోను ఔట్ చేసిన అశ్విన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు ఆసియాలో 420 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే తన కెరీర్లో ఆసియాలో 419 వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 612 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానంలో అశ్విన్(420) ఉన్నాడు. అశ్విన్ తర్వాత స్ధానాల్లో కుంబ్లే, రంగనా హెరత్(354), హార్భజన్ సింగ్(300) ఉన్నారు. ఓవరాల్గా టెస్టు క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 2.82 ఏకానమీతో 522 వికెట్లు పడగొట్టాడు.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టు సందర్భంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో టెస్టులో మరొక వికెట్ తీస్తే చాలు.. మరో ఎలైట్ జాబితాలోనూ చోటు దక్కించుకుంటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన.. నజ్ముల్ షాంటో బృందాన్ని 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సమిష్టి ప్రదర్శనతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లోఇక ఈ మ్యాచ్లో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జడేజా.. 86 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించి.. ఓ రేర్ ఫీట్ నమోదు చేశాడు. తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు.. 200కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.టీమిండియా గెలిచిన సందర్భాల్లో ఇప్పటి వరకు జడ్డూ 2003 రన్స్ చేశాడు. అంతేకాదు 218 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (1943 రన్స్, 369 వికెట్లు) జడ్డూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇంకొక్క వికెట్ తీస్తే..కాన్పూర్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్తో మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే.. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్లో చేరతాడు. తద్వారా.. సంప్రదాయ క్రికెట్లో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా నిలుస్తాడు. అంతేకాదు.. ఈ ఫీట్ నమోదు చేసిన టీమిండియా తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్గానూ రికార్డు సాధిస్తాడు.టీ20లకు గుడ్బైకాగా 2012లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా.. ఇప్పటి వరకు 73 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20లు ఆడాడు. ఈ లెఫ్టాండర్ టెస్టులో 3122 పరుగులు, 299 వికెట్లు.. వన్డేల్లో 2756 రన్స్, 220 వికెట్లు, టీ20లలో 515 పరుగులు, 54 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో సభ్యుడైన 35 ఏళ్ల జడ్డూ.. ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో కలిసి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టులు, ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్గా వెస్టిండీస్ లెజెండ్ -
ఆకాష్ మాస్టర్ మైండ్.. రోహిత్ శర్మ షాకింగ్ రియాక్షన్ (వీడియో)
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్తో బంగ్లా ఓపెనర్లకు చుక్కలు చూపించాడు.తొలి సెషన్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం ఇద్దరినీ ఆకాష్ పెవిలియన్కు పంపాడు. తొలుత జకీర్ హసన్ను ఔట్ చేసిన దీప్.. ఆ తర్వాత షాద్మాన్ను ఎల్బీ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆకాష్ దీప్ చాకచక్యానికి రోహిత్ పిధా అయిపోయాడు.అసలేం జరిగిందంటే?బంగ్లా ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన ఆకాష్.. తొలి బంతిని షాద్మన్ ఇస్లామ్కు లెంగ్త్ బాల్గా సంధించాడు. అయితే దానిని లెగ్ సైడ్ ఫ్లిక్ చేయడానికి బంగ్లా బ్యాటర్ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి అతడి బ్యాక్పాడ్కు తాకింది. వెంటనే ఎల్బీకి ఆకాష్ గట్టిగా అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తలఊపాడు. రోహిత్ రివ్యూకు వెళ్లాళా వద్ద అన్న సందిగ్ధంలో పడ్డాడు. కానీ దీప్ మాత్రం రివ్యూకు వెళ్లాలని పట్టుబట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లేలా చేశాడు. బాల్ ట్రాకింగ్లో బంతి లెగ్ స్టంప్ను క్లిప్ చేసినట్లు తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. అయితే రిప్లే చూసిన రోహిత్ వావ్ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. మిగితా సహాచర ఆటగాళ్లు ఆకాష్ వద్దకు వచ్చి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 😮 When the giant screen showed three Reds ⭕⭕⭕Akash Deep gets his second courtesy of a successful DRS! Live - https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/ZyGJfgBdjW— BCCI (@BCCI) September 27, 2024 -
జైశ్వాల్ సంచలన క్యాచ్.. బంగ్లా బ్యాటర్ మైండ్ బ్లాంక్(వీడియో)
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. బంగ్లాను తొలుత బ్యాటింగ్ ఆహ్హనించాడు.ఈ మ్యాచ్లో టీమిండియా తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లా జట్టు రెండు మార్పులు చేసింది. పేసర్ ఖాలీద్ ఆహ్మద్, స్పిన్నర్ తైజుల్ ఇస్లాం తుది జట్టులోకి వచ్చారు.యశస్వీ సూపర్ క్యాచ్.. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన క్యాచ్తో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ను పెవిలియన్కు పంపాడు. బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఆకాష్ దీప్ మూడో బంతిని గుడ్-లెంగ్త్ డెలివరీ జకీర్కు సంధించాడు. ఆ డెలివరీని జకీర్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి థిక్స్ ఎడ్జ్ తీసుకుని గల్లీ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న జైశ్వాల్ తన కుడివైపునకి డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన బంగ్లా బ్యాటర్ దిమ్మతిరిగిపోయింది. దీంతో 24 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే జకీర్ నిరాశతో పెవిలియన్కు చేరాడు. జైశ్వాల్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IPL 2025: సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్గా వెస్టిండీస్ లెజెండ్ Jaiswal pounces like a panther to take the catch! 👌#INDvBAN #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/cfg394XfMm— JioCinema (@JioCinema) September 27, 2024 -
తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి: అందుకే కుల్దీప్నకు నో ఛాన్స్
బంగ్లాదేశ్ను వైట్వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగింది. కాన్పూర్లో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇక తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని.. చెన్నైలో తొలి టెస్టు ఆడిన టీమ్నే కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.కుల్దీప్ యాదవ్కు మరోసారి మొండిచేయినిజానికి కాన్పూర్లో బ్లాక్ సాయిల్(నల్లమట్టి) పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అయినప్పటికీ... టీమిండియా ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లనే ఆడించడం విశేషం. మ్యాచ్కు ముందు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నెట్స్లో తీవ్రంగా శ్రమించడం చూసి.. అతడు తుదిజట్టులోకి రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారిఅయితే, గ్రీన్ పార్క్ స్టేడియం వద్ద వాతావరణానికి అనుగుణంగా టీమిండియా తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా కాన్పూర్లో గురువారం రాత్రి కురిసిన భారీ వాన వల్ల గ్రీన్ ఫీల్డ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై టెస్టు మ్యాచ్లో.. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి.ఇంతకు ముందు.. 2015లో బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి ఇదే తరహా నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి టెస్టు డ్రాగా ముగిసిపోయింది. ఇక.. కాన్పూర్లో సైతం భారత జట్టు 1964 తర్వాత.. దాదాపు 24 టెస్టుల అనంతరం ఇలా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తోంది.పిచ్ కాస్త సాప్ట్గా కనిపిస్తోందిఇక టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేస్తాం. పిచ్ కాస్త సాప్ట్గా కనిపిస్తోంది. ఆరంభంలోనే వికెట్లు తీయాలి. కాబట్టి మా ముగ్గురు సీమర్ల సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నాం.తొలి టెస్టులో ఆరంభంలో సరిగ్గా ఆడలేకపోయాం. అయితే, మా బౌలర్ల వల్ల విజయం సాధ్యమైంది. ఇక్కడ కూడా బంగ్లాదేశ్ గట్టి పోటీనిస్తుందనే భావిస్తున్నాం. అయితే, ఎలాంటి సవాలునైనా.. అనుభవంతో మేము అధిగమించగలం’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. నహీద్ రాణా, టస్కిన్ అహ్మద్ స్థానాల్లో తైజుల్ ఇస్లాం, ఖలీద్ను తీసుకువచ్చింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా.. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్.. 1-0తో ఆధిక్యంలో ఉంది.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.చదవండి: మీ ఇంగితానికే వదిలేస్తున్నా: రిషభ్ పంత్ ఆగ్రహం 🚨 Toss Update 🚨Captain @ImRo45 wins the toss and #TeamIndia have elected to bowl in Kanpur.Live - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Hsl0HcoVTa— BCCI (@BCCI) September 27, 2024 -
Ind vs Ban 2nd Test: 35 ఓవర్లకే ముగిసిన ఆట
IND vs BAN 2nd test live updates and highlights: టీమిండియా- బంగ్లాదేశ్ తొలి రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. వర్షం కారణంగా 35 ఓవర్లకే ఆగిపోయింది. దీంతో శుక్రవారం ఆట పూర్తయినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. కాన్పూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లా 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఆటంకంటీమిండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆటకు ఆటంకం కలిగింది. వెలుతురులేమి కారణంగా ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.సెంచరీ మార్కు దాటిన బంగ్లాదేశ్34 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 102-3.మొమినుల్ హక్ 36, ముష్ఫికర్ రహీం 5 పరుగులతో ఆడుతున్నారు. అశ్విన్ మ్యాజిక్.. బంగ్లా మూడో వికెట్ డౌన్కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో రూపంలో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన శాంటో.. అశ్విన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 30 ఓవర్లకు బంగ్లా స్కోర్: 80/3. క్రీజులోకి రహీం వచ్చాడు.నిలకడగా ఆడుతున్న బంగ్లాబంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. తొలి రోజు లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో మమూనల్ హాక్(17), శాంటో(28) పరుగులతో ఉన్నారు. కాన్పూర్లో వర్షం కూడా మొదలైంది.రెండో వికెట్ డౌన్..షాద్మాన్ ఇస్లాం రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన షాద్మాన్.. ఆకాష్ దీప్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ శాంటో వచ్చాడు. 13 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 37/2తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాబంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. పేసర్ ఆకాష్ దీప్ బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ను పెవిలియన్కు పంపాడు. జైశ్వాల్ స్లిప్లో అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్రీజులోకి మమూనల్ హాక్ వచ్చాడు.5 ఓవర్లకు బంగ్లా స్కోర్: 13/05 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(8), జకీర్ హసన్(0) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్నభారత్..కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లా మాత్రం రెండు మార్పులు చేసింది. జట్టులోకి టాస్కిన్ ఆహ్మద్, నహిద్ రాణా స్ధానంలో ఖాలీల్ ఆహ్మద్, తైజుల్ ఇస్లాం వచ్చారు. గ్రీన్ పార్క్ పిచ్ కాస్త స్పిన్కు అనుకూలించే ఛాన్స్ ఉన్నందన అదనపు స్పిన్నర్తో బంగ్లా ఆడుతోంది.తుది జట్లుబంగ్లాదేశ్: షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్టాస్ ఆలస్యంకాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమవ్వాల్సిన రెండో టెస్టుకు వరుణుడు ఆడ్డంకిగా మారాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ ఫీల్డ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.ప్రస్తుతం వర్షం ఆగడంతో గ్రౌండ్ను సిద్దం చేసే పనిలో సిబ్బంది పడ్డారు. దీంతో 9:00 గంటలకు పడాల్సిన టాస్ కాస్త ఆలస్యం కానుంది. మైదానాన్ని అంపైర్లు 9:30లకు పరిశీలించనున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు బయటకు వచ్చి సాధన చేస్తున్నారు. -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. వాతావరణం ఎలా ఉందంటే?
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమించిన ఇరు జట్లు గెలుపుపై థీమాగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. మరోవైపు భారత గడ్డపై తొలి టెస్టు విజయం సాధించాలని బంగ్లా పట్టుదలతో ఉంది. కాగా దాదాపు మూడేళ్ల కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడనుంది. చివరగా 2021లో న్యూజిలాండ్తో భారత్ ఆడింది. ఆ టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. ఈ క్రమంలో కాన్పూర్ పిచ్, వాతావరణం ఎలా వుందో ఓ లుక్కేద్దాం.పిచ్, వాతావరణంచెన్నై పిచ్తో పోల్చుకుంటే కాన్పూర్ పిచ్ మందకొడిగా ఉండనుంది. నల్లమట్టితో రూపొందించిన పిచ్పై బంతి ఆగి వస్తుంది. స్పిన్నర్లు ఈ వికెట్పై చెలరేగే అవకాశముంది. ఇక ఉక్కపోత అధికంగా ఉండనుంది. మ్యాచ్కు తొలి రోజు, మూడో రోజు వర్షం ముప్పు పొంచి ఉండగా... వెలుతురు లేమి కారణంగా ఆటకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే గురువారం రాత్రి కాన్పూర్లో ఓ మోస్తారు వర్షం కురిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మ్యాచ్ జరిగే వేదిక వద్ద వర్షం లేకపోయినప్పటకి... ఆట మధ్యలో అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. అయితే ఆఖరి రెండు రోజుల ఆటకు ఎటువంటి వర్షం ముప్పు లేదు.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్/అక్షర్, బుమ్రా, సిరాజ్.బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్ ), షాద్మన్, జాకీర్, మోమినుల్, ముషి్ఫకర్, షకీబ్, లిటన్ దాస్, మెహిది హసన్, తైజుల్, హసన్ మహమూద్, తస్కీన్ అహ్మద్. -
Ind vs Aus: వర్తమానంలో జీవిస్తా.. ఆ ఆశ లేదు: టీమిండియా బౌలర్
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని టీమిండియాలో అడుగుపెట్టిన ఆకాశ్ దీప్.. పేస్ దళంలో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయితే, కెరీర్ ప్లాన్ చేసుకునే విషయంలో తానేమీ తొందరపడటం లేదని.. మెరుగ్గా రాణిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నాడు. ఇప్పుడే పెద్ద పెద్ద సిరీస్లు ఆడాలనే కోరిక కూడా తనకు లేదన్నాడు.అరంగేట్రంలోనే రాణించిబిహార్లో జన్మించిన ఆకాశ్ దీప్.. డొమెస్టిక్ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో సత్తా చాటిన ఈ రైటార్మ్ మీడియం పేసర్కు ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాంచిలో ఇంగ్లిష్ జట్టుతో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే మూడు వికెట్లతో సత్తా చాటాడు.ఇక తాజాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపికైన ఆకాశ్ దీప్.. చెన్నై మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లతో కలిసి పేస్ దళంలో భాగమైన ఆకాశ్.. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో కాన్పూర్లో జరిగే రెండో టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.వర్తమానంలో బతకడం నాకిష్టం.. ఆ ఆశ లేదుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆకాశ్ దీప్నకు ఆస్ట్రేలియా జరుగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టులో చోటు గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను కెరీర్ ప్లానింగ్ విషయంలో కన్ఫ్యూజ్ కాకూడదు. రంజీలతో పోలిస్తే.. ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి నేను ఆస్ట్రేలియాకు వెళ్లాలి. ఇంకెక్కడికో ప్రయాణించాలని నా మీద ఒత్తిడి పెట్టుకోలేను.ప్రస్తుతం నా దృష్టి ఆట మీదేవర్తమానంలో బతకడం నాకిష్టం. తర్వాత ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. గత రెండేళ్లలో నేను చాలా క్రికెట్ ఆడాను. మాకు కేవలం 2-3 నెలలపాటే షెడ్యూల్ ఉండదు. రంజీ.. తర్వాత దులిప్ ట్రోఫీ.. ఆ తర్వాత ఇరానీ కప్.. ఇలా ఎప్పుడూ ఏదో ఒక టోర్నీ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడునైపుణ్యాలు మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని 27 ఏళ్ల ఆకాశ్ దీప్ తన మనసులోని మాట వెల్లడించాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా నవంబరులో అక్కడికి వెళ్లనుంది. అప్పటికి భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఆకాశ్ దీప్నకు ఛాన్స్ రాకపోవచ్చు.చదవండి: బంగ్లాతో టీ20 సిరీస్: టీమిండియా మెరుపు సెంచరీ వీరుడి ఎంట్రీ! -
Ind vs Ban: గిల్, జైస్వాల్లకు రెస్ట్.. వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!
టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 6, 9, 12వ తేదీల్లో మూడు మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలోనే జట్టును ప్రకటించనుంది.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ పొట్టి సిరీస్కు శుబ్మన్ గిల్తో పాటు యశస్వి జైస్వాల్కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. కాగా సొంతగడ్డపై నవంబరులో టీమిండియా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే భారత్కు ఈ సిరీస్ కీలకం.గిల్, జైస్వాల్పై పనిభారం పడకుండాఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్పై పనిభారం పడకుండా చూసుకునేందుకు.. మేనేజ్మెంట్ ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. గిల్- జైస్వాల్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా ప్రధాన ఓపెనింగ్ జోడీగా మారారు.వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!అయితే, కివీస్తో సిరీస్ కారణంగా వీరిద్దరు గనుక దూరమైతే.. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లే! వీరిద్దరు బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. అయితే, రుతురాజ్ ఇరానీ కప్-2024 మ్యాచ్ కారణంగా తొలి టీ20కి దూరం కానున్నాడని.. అందుకే జైస్వాల్ ఆ ఒక్కమ్యాచ్కి అందుబాటులో ఉంటాడనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘సి’ కెప్టెన్గా ఉన్న రుతురాజ్.. ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ అక్టోబరు 1-5 వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్గా ఎంపిక కానుండగా.. జితేశ్ శర్మను అతడికి బ్యాకప్గా సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.విధ్వంసకర సెంచరీ హీరో అభిషేక్ శర్మటీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో స్థానం దక్కించుకున్న పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తొలిటీ20 సందర్భంగా అరంగేట్రం చేశాడు.అయితే, తొలి మ్యాచ్లోనే డకౌట్ అయి విమర్శపాలైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టీ20లో శతకంతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకుని.. ఆ తర్వాత అవుటయ్యాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు అతడికి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ఇక టీమిండియా విషయానిస్తే.. బంగ్లాతో తొలి టెస్టు గెలిచి.. శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్ -
Ind vs Ban: షకీబ్ అల్ హసన్ సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. టీమిండియతో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ షకీబ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్టు సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు.ఈ మేరకు షకీబ్ కాన్పూర్లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్లో మిర్పూర్లో సౌతాఫ్రికాతో ఆడబోయే మ్యాచ్ నా కెరీర్లో ఆఖరిది. సొంతగడ్డపై నా అభిమానుల మధ్య టెస్టు కెరీర్ ముగించడం సంతోషకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ నాకెంతో చేసింది. పేరు, ప్రతిష్ట అన్నీ ఇచ్చింది. అందుకే నా ఆఖరి టెస్టు స్వదేశంలోనే ఆడాలని నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నాడు.అక్కడకు వెళ్తే బయటకు రాకపోవచ్చుఇక బంగ్లాదేశ్లో తన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘బంగ్లాదేశీ పౌరుడిగా.. ఇండియా నుంచి అక్కడికి వెళ్లేందుకు నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాకపోవచ్చు. అయితే, ఒక్కసారి అక్కడకు వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు బంగ్లాదేశ్లోని పరిస్థితుల గురించి ఎప్పటికపుడు నాకు చెబుతూనే ఉన్నారు. నేను కూడా ప్రస్తుతం సందిగ్దావస్థలోనే ఉన్నాను’’ అని షకీబ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఎంపీ పదవి పోయిందికాగా బంగ్లాదేశ్లో కొంతకాలంగా చెలరేగిన అల్లర్లు రాజకీయ సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన అవామీ లీగ్ హెడ్షేక్ హసీనా భారత్లో తలదాచుకున్నారు. ఆమె ప్రభుత్వం రద్దు కావడంతో.. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన షకీబ్ పదవి కూడా ఊడిపోయింది.హత్య కేసు నమోదుఆ సమయంలో కెనడా లీగ్తో బిజీగా ఉన్న షకీబ్.. నేరుగా పాకిస్తాన్తో టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే, షకీబ్ బంగ్లాదేశ్లో లేని సమయంలో అతడిపై హత్య కేసు నమోదైంది. దేశంలో చెలరేగిన అల్లర్లలో తన కుమారుడు చనిపోవడానికి కారణం ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ సభ్యులు కారణమంటూ ఓ వ్యక్తి షకీబ్పైకూడా కేసు పెట్టాడు. దీంతో అతడిని అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు మాత్రం ఆటగాడిగా షకీబ్ దేశానికి ఎంతో సేవ చేశాడని.. అతడిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జట్టుతో కలిసి షకీబ్ పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆడాడు. బంగ్లా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీబంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన గొప్ప ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్. ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. బంగ్లా తరఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. ఇప్పటి వరకు 70 మ్యాచ్లు ఆడి 4600 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. అదే విధంగా.. టెస్టుల్లో 242 వికెట్లు పడగొట్టాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా తన చివరి అంతర్జాతీయ టీ2మ్యాచ్ ఆడిన షకీబ్ అల్ హసన్.. దేశం తరఫున 129 పొట్టి మ్యాచ్లలో 2551 రన్స్ చేయడంతో పాటు.. 149 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు 247 వన్డేల్లో 7570 పరుగుల సాధించి.. 317 వికెట్లు కూల్చాడు. చదవండి: IND Vs BAN: ఇలా అయితే కష్టం కోహ్లి!.. 15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్! -
విరాట్ కోహ్లి మరో 35 పరుగులు చేస్తే..
శుక్రవారం నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు కాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పర్యాటక బంగ్లా జట్టు మాత్రం భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. కాన్పూర్ టెస్టులో కోహ్లి మరో 35 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్న నాలుగో క్రికెటర్గా నిలుస్తాడు. ఇప్పటివరకు 514 మ్యాచ్లు ఆడిన కోహ్లి..26,965 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(34357) , కుమార సంగర్కకర(28016), రికీ పాంటింగ్(27483) ఉన్నారు.కోహ్లి ఫామ్లోకి వస్తాడా?కాగా టీ20 వరల్డ్కప్-2024 తర్వాత కోహ్లి తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో విఫలమైన విరాట్.. ఇప్పుడు బంగ్లాదేశ్తో తొలి టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అందరి కళ్లు కోహ్లిపైనే ఉన్నాయి. కాన్పూర్ టెస్టులో విరాట్ ఎలా రాణిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
Ind vs Ban: ఆ స్టాండ్ బాలేదు.. యాభై మంది ఉన్నా ప్రమాదకరమే!
బంగ్లాదేశ్తో రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు ఇప్పటికే కాన్పూర్కు చేరుకుంది. ప్రత్యర్థిని వైట్వాష్ చేయడమే లక్ష్యంగా ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమిస్తోంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుందన్న అంచనాల నడుమ ఇరుజట్లు తమ ముగ్గురేసి స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కాన్పూర్ స్టేడియం గురించి ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) సీఈఓ అంకిత్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలు.. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న అభిమానుల్లో అలజడి రేపుతున్నాయి. కాగా 2021 తర్వాత కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.శిథిలావస్థలో ఆ స్టాండ్అయితే, స్టేడియంలో ఓ స్టాండ్ శిథిలావస్థకు చేరినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ) అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. ఈ విషయం గురించి అంకిత్ ఛటర్జీ ప్రస్తావిస్తూ.. ‘‘పీడబ్ల్యూడీ అధికారులు..గ్రీన్ పార్క్లోని బాల్కనీ ‘సీ’కి సంబంధించి టికెట్లు అమ్మవద్దని మాతో చెప్పారు. అక్కడి పరిస్థితి బాగాలేదన్నారు.ప్రస్తుతం ఆ బాల్కనీకి సంబంధించి ప్రస్తుతం రిపేర్లు జరుగుతున్నాయి. నిజానికి అక్కడ 4800 మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. కానీ.. పీడబ్ల్యూడీ అధికారుల సూచన మేరకు కేవలం 1700 టికెట్లే సేల్ చేశాం’’ అని పేర్కొన్నాడు. ఒకవేళ పంత్ సిక్సర్ కొట్టాడనుకోండిఇక పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం.. బాల్కనీ సి కనీసం యాభై మంది ప్రేక్షకుల బరువును కూడా మోయలేదు. ఒకవేళ రిషభ్ పంత్ సిక్సర్ కొట్టాడనుకోండి. అభిమానులు లేచి గంతులేయడం మొదలుపెడతారు. అలా అయితే,స్టాండ్ ఓ పక్కకి ఒరిగిపోయినా ఆశ్చర్యం లేదు. అక్కడి పరిస్థితి అస్సలు బాగాలేదు’’ అని పేర్కొన్నారు. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇక చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా బంగ్లాను 280 పరుగుల తేడాతో మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ద్వారా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్బ్యాటర్ రిషభ్ పంత్ శతకం(109)తో ఆకట్టుకున్నాడు.చదవండి: ఇలా అయితే కష్టం కోహ్లి!.. 15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్! -
ఇలా అయితే కష్టం కోహ్లి!.. అసహనంగా వెళ్లిపోయిన బ్యాటర్
బంగ్లాదేశ్తో టీమిండియా రెండో టెస్టు నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల దృష్టి విరాట్ కోహ్లిపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ స్టార్ ప్లేయర్ బ్యాట్ ఝులిపిస్తాడా? లేదంటే మరోసారి నిరాశనే మిగులుస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి భారత బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడన్న విషయం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.తొలి టెస్టులో పూర్తిగా విఫలంసుమారు ఏడాదిన్నర విరామం తర్వాత.. బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి సొంతగడ్డపై టెస్టు బరిలో దిగాడు. అయితే, చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో వరుసగా 6, 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్లో అవుటైన ఈ ఢిల్లీ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ చేతికి చిక్కాడు.ఈ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే కోహ్లి వైఫల్యంపై విమర్శలు తారస్థాయికి చేరేవే! అయితే, ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అంటూ ఈ రన్మెషీన్కు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. రెండోటెస్టులో మునుపటి కోహ్లిని చూస్తామని జోస్యం చెబుతున్నారు.15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్!ఈ నేపథ్యంలో నెట్స్లో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ అందించిన వివరాల ప్రకారం.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 15 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగుసార్లు అవుటయ్యాడు. తను వేసిన నాలుగో బంతికే కోహ్లి వికెట్ల ముందు దొరికిపోవడంతో.. బుమ్రా.. ‘‘యూ ఆర్ ప్లంబ్(ఎల్బీడబ్ల్యూ)’’ అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు.ఆ తర్వాత రెండో బంతికే ఆఫ్ స్టంప్ పక్క దిశగా వెళ్తున్న బంతిని టచ్ చేసి.. వికెట్ పారేసుకున్నాడు. మరో రెండుసార్లు కూడా బుమ్రా బౌలింగ్లో ఇలాగే బంతిని తప్పుగా అంచనా వేసిమూల్యం చెల్లించిన కోహ్లి.. ఆ తర్వాత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లను ఎదుర్కొన్నాడు.జడ్డూ బౌలింగ్లో తడబడ్డ కోహ్లిఈ ముగ్గురిలో ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జడ్డూ బౌలింగ్లో తడబడ్డ కోహ్లి.. అక్షర్ బౌలింగ్లో మరింత తేలిపోయాడు. దీంతో.. కోహ్లి అసహనంగా నెట్స్ను వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్మన్ గిల్ వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.కాగా రెండో టెస్టుకు వేదికైన కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో బంగ్లా స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ వంటి వారిని కోహ్లి ఎలా ఎదుర్కోనున్నాడన్నది ఆసక్తికంరగా మారింది. భారత్- బంగ్లా మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
Ind vs Ban 2nd Test: భారత తుదిజట్టు నుంచి అతడు అవుట్!
బంగ్లాదేశ్ను క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగనుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్ ఫైనల్ చేరే క్రమంలో మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్కు వచ్చిన విషయం తెలిసిందే.తొలి టెస్టులో పేసర్లకే పెద్దపీటఈ క్రమంలో ఇరు జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ను 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా చెపాక్లోని ఎర్రమట్టి పిచ్పై ఈ మ్యాచ్ జరగగా.. ఇరు జట్లు ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చాయి. టీమిండియా ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్లకు తుదిజట్టులో చోటిచ్చింది.అదే విధంగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కూడా ఆడించింది. దీంతో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మొండిచేయి ఎదురైంది. అయితే, రెండో టెస్టులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండబోతుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాన్పూర్లోని నల్లమట్టి పిచ్పై మ్యాచ్ జరుగనుండటంతో కుల్దీప్ తుదిజట్టులో స్థానం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఒక ఫాస్ట్ బౌలర్కు ఉద్వాసన‘‘నల్లమట్టి పిచ్పై గ్రాస్ వేసి.. కాస్త తేమగా ఉంచితే.. ఆట మొదటి రోజు, రెండో రోజు అరపూట వరకు బంతి బాగానే బౌన్స్ అవుతుంది. చెన్నై మాదిరే ఈ పిచ్ కూడా ఉంటే.. టీమిండియా మరోసారి ముగ్గురు ఫాస్ట్బౌలర్లతో రంగంలోకి దిగుతుంది. అలా కాకుండా ఇది పక్కాగా కాన్పూర్ పిచ్ అయితే మాత్రం.. రోజురోజుకీ వికెట్ బాగా నెమ్మదిస్తుంది.స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ కచ్చితంగా తుదిజట్టులోకి వస్తాడు. అదే జరిగితే.. ఒక ఫాస్ట్ బౌలర్కు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. పనిభారాన్ని తగ్గించేందుకు బుమ్రాకు విశ్రాంతినిస్తే.. ఆకాశ్ దీప్ జట్టులో ఉంటాడు. లేదంటే.. ఆకాశ్ స్థానాన్ని కుల్దీప్ భర్తీ చేస్తాడు. రెండో టెస్టులో ఆడబోయే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో ఇంతకంటే వేరే మార్పులేమీ ఉండకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత తుదిజట్టు కూర్పు గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. శుక్రవారం నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది.బంగ్లాదేశ్తో రెండో టెస్టు భారత తుది జట్టు అంచనారోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII— BCCI (@BCCI) September 26, 2024 -
టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు అదిరిపోయే గుడ్ న్యూస్
కాన్పూర్ వేదికగా భారత్తో రెండో టెస్టులో తలపడేందుకు బంగ్లాదేశ్తలపడేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కాన్పూర్ చేరుకున్న బంగ్లా జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను డ్రాగా ముగించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు ముందు పర్యాటక బంగ్లా జట్టుకు గుడ్న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో షకీబ్ చేతి వేలికి గాయమైంది. స్పిన్కు స్వర్గధామమైన చెపాక్ లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అతను కేవలం 21 ఓవర్లే వేయగలిగాడు. షకీబ్ నొప్పితో బాధపడూతూనే మ్యాచ్లో కొనసాగాడు. అయితే తన గాయం నుంచి షకీబ్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని బంగ్లా హెడ్ కోచ్ హతురుసింఘే ధ్రువీకరించారు. "రెండో టెస్టుకు షకీబ్ అందుబాటులో ఉంటాడు. అతడి ఫిట్నెస్పై ఏ బెంగా లేదన్నాడు. తొలిటెస్టులో మా ఆటగాళ్లు స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేకపోయారు. అందుకే ఓడిపోయాం. ఇప్పుడు కాన్పూర్ టెస్టులో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉందని" హతురుసింఘే పేర్కొన్నారు. -
బంగ్లాదేశ్తో రెండో టెస్ట్.. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా
సెప్టెంబర్ 27 నుంచి బంగ్లాదేశ్తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం టీమిండియా జోరుగా సాధన చేస్తుంది. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే కాన్పూర్కు (మ్యాచ్కు వేదిక) చేరుకున్న భారత బృందం ప్రాక్టీస్లో నిమగ్నమై ఉంది. టీమిండియా ఆటగాళ్లు నెట్స్లో చెమటోడుస్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. తొలి టెస్ట్లో విఫలమైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కఠోరంగా సాధన చేస్తూ కనిపించారు. రెండో టెస్ట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కోచ్ గంభీర్తో జట్టు సభ్యులతో డిస్కస్ చేశారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ బౌలర్లకు సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు. ఆటగాళ్లంతా బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ చేశారు. మొత్తంగా టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది.తుది జట్టు విషయానికొస్తే.. రెండో టెస్ట్ కోసం భారత్ ఓ మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగవచ్చు. దీంతో అశ్విన్, జడేజాకు జతగా కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్ దిగే అవకాశం ఉంది. కుల్దీప్, అక్షర్లలో ఎవరు తుది జట్టులోకి వచ్చినా సిరాజ్ లేదా ఆకాశ్దీప్లలో ఎవరో ఒకరిపై వేటు పడుతుంది. ఈ ఒక్క మార్పు మినహా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కాన్పూర్లోని గ్రీన్ పార్క్లో సెప్టెంబర్ 27న రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: ENG VS AUS 3rd ODI: కుక్ రికార్డు బ్రేక్ చేసిన బ్రూక్ -
Ind vs Ban: 'టీమిండియాకు ఇది మంచికాదు'
దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు బరిలో దిగిన భారత క్రికెట్ జట్టు విజయంతో పునరాగమనం చేసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థిని ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.ఇక బంగ్లాదేశ్తో టెస్టులో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, యువ బ్యాటర్లు రిషభ్ పంత్, శుబ్మన్ గిల్ శతకాలతో మెరవగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో రాణించాడు. సెంచరీ కొట్టడంతో పాటు ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలంఅంతాబాగానే ఉన్నా.. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వైఫల్యం మాత్రం అభిమానులను నిరాశపరిచింది. రెండు ఇన్నింగ్స్లో కలిపి రోహిత్ 11, కోహ్లి 23 పరుగులు మాత్రమే చేయడం మేనేజ్మెంట్లో ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు.టీమిండియాకు ఇది మంచికాదురోహిత్, కోహ్లి దులిప్ ట్రోఫీ-2024లో ఆడితే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయినా.. ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతుల ఆధారంగా తారతమ్యాలు చూపించడం.. భారత క్రికెట్కి మంచిది కాదని పేర్కొన్నాడు. ఈ మేరకు సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లిద్దరు వరల్డ్క్లాస్ బ్యాటర్లు. తిరిగి ఫామ్లోకి రాగలరు. కానీ ఈ సిరీస్కు ముందు దులిప్ ట్రోఫీ ఆడితే బాగుండేది.వారిని ఈ రెడ్బాల్ టోర్నీలో ఆడించే వీలున్నా విశ్రాంతినిచ్చారు. మిగతా వాళ్లకు మాత్రం ఆ వెసలుబాటు లేదు. అయినా.. ఒక్కక్కళ్లను ఒకలా ట్రీట్ చేయడం భారత క్రికెట్కు నష్టంచేకూర్చే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లిల క్రేజ్ దృష్ట్యా వారు కోరినట్లు చేయడం సరికాదు. దులిప్ ట్రోఫీ ఆడి ఉంటే వారిద్దరు ఫామ్లోకి వచ్చేవారు’’ అని పేర్కొన్నాడు. తొలి టెస్టులో మిగతా ప్లేయర్లు రాణించారు కాబట్టి సరిపోయిందని.. లేదంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా రోహిత్, కోహ్లితో పాటు అశ్విన్, బుమ్రా సైతం దులిప్ ట్రోఫీ ఆడలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆరంభం కానుంది.చదవండి: నేను హార్డ్ హిట్టర్ని.. వచ్చే వరల్డ్కప్లోనూ ఆడతా: విండీస్ స్టార్ -
Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ టీమిండియాలో పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, రెస్టాఫ్ ఇండియా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపైనే ఈ విషయం ఆధారపడి ఉంది. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.రెడ్బాల్ క్రికెట్లో రీఎంట్రీరంజీల్లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరకు చేయడం వల్ల.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడంటూ బోర్డు ఇషాన్కు గట్టి షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్ ఇటీవలే బుచ్చిబాబు టోర్నీ ద్వారా రెడ్బాల్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. సెంచరీతో ఆకట్టుకుని.. దులిప్ ట్రోఫీ-2024లో చోటు దక్కించుకున్నాడు.రెస్టాఫ్ ఇండియా టీమ్కు ఎంపికబీసీసీఐ ఆధ్వర్యంలోని ఈ దేశీ రెడ్బాల్ టోర్నీలోనూ ఇషాన్ కిషన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఇండియా-‘సి’ జట్టు తరఫున శతకంతో అలరించాడు. ఈ క్రమంలో ఇరానీ కప్-2024 మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా టీమ్కు ఎంపికయ్యాడు.రిషభ్ పంత్కు విశ్రాంతిరంజీ చాంపియన్ ముంబైతో అక్టోబరు 1- 5 వరకు జరుగనున్న మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది. ఆ వెంటనే అంటే.. అక్టోబరు 6- 12 వరకు టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.బంగ్లా సిరీస్ తర్వాత.. న్యూజిలాండ్తో టెస్టుల నేపథ్యంలో ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి పంత్ స్థానంలో ఇషాన్ను బంగ్లాదేశ్తో టీ20సిరీస్కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన వికెట్ కీపర్గా సంజూ శాంసన్కు ఛాన్స్ ఇవ్వనున్న సెలక్టర్లు.. అతడికి బ్యాకప్గా ఇషాన్కు జట్టులోస్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రెస్టాఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేస్తేనేఅయితే, అదే సమయంలో.. ఇరానీ కప్ మ్యాచ్ ఉన్నందున రెస్టాఫ్ ఇండియా నుంచి ఇషాన్ను రిలీజ్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఏదేమైనా.. ఒకప్పుడు జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఈ లెఫ్టాండర్.. స్వీయ తప్పిదాల వల్ల ఇప్పుడు జట్టులో అదనపు ప్లేయర్గానైనా చోటు దక్కించుకోవడం గగనమైపోయింది.చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్!
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. భారత్ క్లీన్ స్వీప్పై కన్నేయగా.. మరోవైపు బంగ్లా ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట తొలి రెండు రోజుల పాటు కాన్పూర్లో భారీ వర్షం కురిసే అవకాశన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27(శుక్రవారం), శనివారం నాడు 90 శాతానికి పైగా వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఆదివారం కూడా వర్షం కురవడానికి 50 శాతం ఆస్కారం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ తెలుపుతుంది.ఆఖరి రెండు రోజులకు ఎటువంటి వర్షం ముప్పులేనిట్లు సమాచారం. అయితే భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఆప్రమత్తమైంది. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ నుంచి అదనపు కవర్లను తెప్పించేందుకు యూపీసీఎ సిద్దమైంది. ముందు జాగ్రత్తగా మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచాలని యూపీసీఎ అధికారులు భావిస్తున్నారు. అయితే కాన్పూర్ గ్రౌండ్లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. దీంతో చిన్నపాటి వర్షం పడిన కూడా మ్యాచ్కు తీవ్ర అంతరాయం కలిగే చాన్స్ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా ఈ సిరీస్ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో కాన్పూర్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇరు జట్లు ఇప్పటికే కాన్పూర్కు చేరుకున్నాయి. -
గంభీర్ మరో మాస్టర్ ప్లాన్.. ఇక బంగ్లాకు చుక్కలే?
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు సమయం అసన్నమైంది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలి టెస్టులో విఫలమైన బంగ్లాదేశ్ కనీసం కాన్పూర్ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.మూడేళ్ల తర్వాత..కాగా కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 2021లో న్యూజిలాండ్తో భారత్ తలపడింది. ఆఖరి సెషన్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో కివీస్ అసాధారణ పోరాటం కనబరిచింది. ఈమ్యాచ్తోనే రచిన్ రవీంద్ర కివీస్ తరపున టెస్టు క్రికెట్లోకకి అడుగుపెట్టాడు.బంగ్లాకు స్పిన్ ఉచ్చు..ఇక రెండో టెస్టుకు ముందు భారత జట్టు మెనెజ్మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. ఈ మ్యాచ్ కోసం గ్రీన్ పార్క్ మైదానంలో బ్లాక్ సోయిల్ పిచ్ను తాయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గరుండి పిచ్ను తాయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ సోయిల్ పిచ్ బౌన్స్ తక్కువగా ఉండి, టర్న్ ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ కొనసాగే కొద్దీ వికెట్ స్లో కానుంది. దీంతో ఈ ట్రాక్పై స్పిన్నర్లు పండుగ చేసుకుంటారు. ఈ క్రమంలో భారత స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరోసారి బంగ్లా బెండు తీసే అవకాశముంది. మరోవైపు బంగ్లాలో కూడా షకీబ్, మెహదీ హసన్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు.కాగా చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెడ్ సాయిల్ పిచ్ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఈ వికెట్ పేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్, స్పిన్కు సహకరించింది. కానీ నల్లమట్టి పిచ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో కాన్పూర్ టెస్టులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: IT 2024: జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్ -
Ind vs Ban: అశ్విన్ ఇంకో నాలుగు వికెట్లు తీశాడంటే..
టెస్టు కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటికే భారత్ తరఫున సంప్రదాయ క్రికెట్లో 522 వికెట్లు పూర్తి చేసుకున్న ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్యాటింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా బంగ్లాదేశ్ ఇటీవల జరిగిన తొలి టెస్టులో అశూ అదరగొట్టాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్సొంతమైదానం చెన్నైలోని చెపాక్లో ఆకాశమే హద్దుగా చెలరేగి విలువైన శతకం(113) బాదడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా బంగ్లాపై టీమిండియా 280 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు(సెప్టెంబరు 27) కాన్పూర్లో మొదలుకానుంది.నాలుగు వికెట్లు తీస్తే..ఈ నేపథ్యంలో అశ్విన్ ఓ అరుదై రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాతో రెండో టెస్టులో గనుక ఈ దిగ్గజ స్పిన్నర్ నాలుగు వికెట్లు తీస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సాధిస్తాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ను అధిగమించి మొదటిస్థానానికి చేరుకుంటాడు. ఈ డబ్ట్యూటీసీ తాజా సీజన్లో హాజిల్వుడ్ ఇప్పటి వరకు 51 వికెట్లు తీయగా.. అశూ 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ చేరడమే లక్ష్యంగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా)- 51రవిచంద్రన్ అశ్విన్ఇండియా)-48ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 48మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)-48క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)-43నాథన్ లియోన్(ఆస్ట్రేలియా)-43.చదవండి: అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే: కమిన్స్ -
టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు ఊహించని ఎదురు దెబ్బ!
భారత్ చేతిలో తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన బంగ్లాదేశ్కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న కాన్పూర్ వేదికగా భారత్తో జరగనున్న రెండో టెస్టుకు బంగ్లా స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కానున్నట్లు సమాచారం.చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో షకీబ్ చేతి వేలికి గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా బుమ్రా బౌలింగ్లో బంతి బలంగా షకీబ్ కూడి చేతికి వేలికి తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే అతడికి ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ తర్వాత షకీబ్ తన ఇన్నింగ్స్ను కొనసాగించినప్పటికి నొప్పితో బాధపడుతున్నట్లు మైదానంలో కన్పించాడు. మ్యాచ్ అనంతరం అతడిని స్కానింగ్కు తరలించగా ఎటువంటి పగులు లేనిట్లు తేలినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ వారం రోజుల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాన్పూర్ టెస్టుకు షకీబ్ దూరమైతే బంగ్లాకు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే షకీబ్ తొలి టెస్టులో తన మార్క్ను చూపించలేకపోయాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సత్తాచాటలేకపోయాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
పంత్కు అలా జరిగినప్పుడు.. పాక్లోనూ భయపడ్డాము: వసీం అక్రమ్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన టెస్టు క్రికెట్ రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్న సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో పంత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తనదైన స్టైల్లో బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. టెస్టుల్లో తనొక బ్రాండ్ అని మరోసారి రిషబ్ నిరూపించుకున్నాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్లతో 109 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భయంకరమైన కారు ప్రమాదం నుంచి కోలుకుని మళ్లీ తన మార్క్ చూపించిన పంత్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ చేరాడు. పంత్ తిరిగి రావడంతో ఆస్ట్రేలియా జట్టు జాగ్రత్తగా ఉండాలని అక్రమ్ హెచ్చరించాడు."రిషబ్ పంత్ ఆటను చూస్తుంటే సూపర్ మ్యాన్లా అద్భుతం చేశాడన్పిస్తోంది. అంతటి ప్రమాదం నుంచి కోలుకుని అతడు రీ ఎంట్రీ ఇవ్వడం చాలా గ్రేట్. అతడి కారు ప్రమాదం జరిగిన తీరును చూసి పాకిస్తాన్లో మేమంతా ఆందోళన చెందాము. అందులో నేను కూడా ఉన్నాను.అతడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ కూడా చేశాను. టెస్టుల్లో పంత్ ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆస్ట్రేలియా గడ్డపై అతడి సెంచరీ, ఇంగ్లండ్పై బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ఒక అద్భుతం. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం పంత్ రివర్స్ స్వీప్ ఆడాడు. ఇందులో అతడిని మించినవారే లేరు.రోడ్డు ప్రమాదం తర్వాత ఎవరైనా సరే కోలుకోవడానికి చాలా రోజుల సమయం పడుతోంది. మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. కానీ అందుకు భిన్నంగా పంత్ మాత్రం చాలా తక్కువ వ్యవధిలోనే తన ఫిట్నెస్ను సాధించాడు. పంత్ కథను తరతరాలు గుర్తు పెట్టుకుంటాయి. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఐపీఎల్ రీఎంట్రీలోనూ సత్తాచాటాడు. 40కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్కప్లోనూ రాణించాడు. అనంతరం తనకు ఇష్టమైన రెడ్బాల్ క్రికెట్లోనూ మెరిశాడు. పంత్ కమ్బ్యాక్ ఇవ్వడంతో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ మరింత రసవత్తరంగా మారడం ఖాయమనిపిస్తోంది. అతడిని ఆపేందుకు ఆసీస్ ఇప్పటి నుంచే వ్యూహాలను రచించాలని " అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. గ్రీన్ పార్క్ స్టేడియం వద్ద భారీ భద్రత
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్పై టీమిండియా కన్నేసింది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో బంగ్లాతో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ సోమవారం గ్రీన్ పార్క్ స్టేడియం ముందు అఖిలేష్ భారతీయ హిందూ మహాసభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బంగ్లా జట్టు బస చేసే హోటల్ వద్ద భద్రతను భారీగా పెంచినట్లు కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు.యూపీ పోలీస్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అదనపు భద్రతను ఏర్పాటు ఆయన వెల్లడించారు. అదే విధంగా మ్యాచ్ జరిగే సమయంలో సీనియర్ ర్యాంక్ స్ధాయి ఆధికారులు కూడా బందోబస్తులో ఉంటరాని హరీష్ చందర్ స్పష్టం చేశారు. కాగా రెండో టెస్టు కోసం ఇరు జట్లు మంగళవారం సాయంత్రం కాన్పూర్కు చేరుకోనున్నాయి.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమైంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-0 క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి బంగ్లా-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను రిలీజ్ చేయాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయించుకున్నట్లు సమచారం. దేశవాళీ టోర్నీ ఇరానీ ట్రోఫీ కోసం సర్ఫరాజ్ పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆక్టోబర్ 1 నుంచి లక్నో వేదికగా ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ ప్రారంభం కానుంది.ఇందులో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరపున ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రెండు టెస్టుకు ముందు ఆఖరి నిమషంలో భారత జట్టులో ఎవరైనా గాయపడితే సర్ఫరాజ్ మళ్లీ వెనక్కి వచ్చే అవకాశముంది. కాగా తొలి టెస్టు తుది జట్టులో కూడా సర్ఫరాజ్కు చోటు దక్కలేదు. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దాదాపు చెపాక్లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్నే భారత జట్టు మెనెజ్మెంట్ కొనసాగించే ఛాన్స్ ఉంది."భారత జట్టులోని ప్రధాన బ్యాటర్లలో ఎవరికైనా ఫిట్నెస్ సమస్యలు లేదా గాయపడితే సర్ఫరాజ్కు రెండో టెస్టులో ఆడే అవకాశం కచ్చితంగా దక్కుతుంది. లేనియెడల ఇరానీ ట్రోఫీ కోసం అతడిని ప్రధాన జట్టు నుంచి రిలీజ్ చేసేందుకు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సిద్దంగా ఉన్నాడు. కాన్పూర్ నుంచి లక్నోకు ప్రయాణానికి కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. తుది జట్టును ఎంపిక మ్యాచ్కు ముందే ఎంపిక చేస్తారు. కాబట్టి కాన్పూర్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత కూడా సర్ఫరాజ్ లక్నోకు బయలుదేరవచ్చు అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. -
మోర్నీ మోర్కెల్ పనికిరాడన్నట్లు చూశారు: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ బౌలర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. అహంభావం పెరిగిపోయి.. ఆటను, కోచ్లను కూడా లెక్కచేయని స్థితికి చేరారని మండిపడ్డాడు. అందుకు జట్టు పరాజయాల రూపంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.వరుస వైఫల్యాలతో..గత కొంతకాలంగా పాక్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టిన బాబర్ సేన.. టీ20 ప్రపంచకప్-2024లోనూ మరీ దారుణంగా నిరాశపరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓటమి కారణంగా కనీసం సూపర్-8 దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ద్వైపాక్షిక సిరీస్లనూ ఇదే తంతు.ఆస్ట్రేలియలో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన షాన్ మసూద్ బృందం.. ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్తో సిరీస్లోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. పాక్ టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా బంగ్లా చేతిలో మ్యాచ్ ఓడటమే కాకుండా.. 2-0తో క్లీన్స్వీప్ అయింది.టీమిండియా వరుస విజయాలతోమరోవైపు.. పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థిగా భావించే టీమిండియా ఇటీవలే పొట్టి వరల్డ్కప్ రెండోసారి సొంతం చేసుకోవడంతో పాటు... వరుస విజయాలతో దూసుకుపోతూ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరవవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తమ జట్టు బౌలర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా‘‘పాకిస్తానీ బౌలర్లు ... క్రికెట్ కంటే కూడా తామే గొప్ప అన్నట్లుగా భావిస్తారు. తమ ముందు మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా ప్రవర్తించారు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ మమ్మల్ని ఓడించింది. అదే భారత్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆటగాళ్ల ఆలోచనా విధానం, ప్రవర్తనపైనే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని బసిత్ అలీ పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు.బౌలింగ్ కోచ్గాటీమిండియా ప్రస్తుత పేస్ దళం పాక్ దిగ్గజాలు వసీం అక్రం, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ల మాదిరి అద్భుతంగా ఉందని బసిత్ అలీ ఈ సందర్భంగా కొనియాడాడు. కాగా గతేడాది వరకు పాక్ బౌలింగ్ కోచ్గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్.. ప్రస్తుతం టీమిండియా తరఫున విధులు నిర్వర్తిస్తున్నాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టు సందర్భంగా బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్Ind vs Aus: ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్.. మాకు కష్టమే: స్మిత్ -
బంగ్లాదేశ్తో రెండో టెస్ట్.. టీమిండియాలో ఓ మార్పు..?
సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత మేనేజ్మెంట్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన తొలి టెస్ట్లో ఆడిన పేసర్ ఆకాశ్దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్ప్ ఉంది. ఇప్పటివకే అశ్విన్, జడేజా వంటి నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. వీరికి కుల్దీప్ తోడైతే స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్పై ప్రత్యర్ధికి కష్టాలు తప్పవు. అశ్విన్, జడేజా, కుల్దీప్తో పాటు పేసర్లుగా బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగడం దాదాపు ఖరారైనట్లే.బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. తొలి టెస్ట్లో ఆడిన బ్యాటర్లే రెండో టెస్ట్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, వన్డౌన్లో శుభ్మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో ప్లేస్లో రిషబ్ పంత్, ఆరో స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లే. వీరిలో రోహిత్, కోహ్లి, రాహుల్ మినహా మిగతా ముగ్గురూ మాంచి టచ్లో ఉన్నారు. మొత్తంగా చూస్తే రెండో టెస్ట్లో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది.కాగా, చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం చలాయింది. అశ్విన్ (113, 6/88), జడేజా (86, 2/19, 3/58) ఆల్రౌండ్ షోతో ఇరగదీయగా.. గిల్ (119 నాటౌట్), పంత్ (109) అదిరిపోయే శతకాలతో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, సెకెండ్ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
మా వాళ్లకు ఇలాంటివి చేతకావు: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్ల తయారీ ఎలా ఉండాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. చెన్నై వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు అద్భుతంగా సాగిందని.. ఇందుకు పిచ్ క్యూరేటర్లే కారణమని కొనియాడాడు.280 పరుగుల తేడాతో విజయంకాగా పాకిస్తాన్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్లో ఆతిథ్య జట్టును 2-0తో క్లీన్స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ప్రస్తుతం భారత్ టూర్లో ఉంది. ఇందులో భాగంగా చెపాక్ వేదికగా సెప్టెంబరు 19న మొదలైన తొలి టెస్టు మూడున్నర రోజుల్లో ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.అయితే, పేసర్లకు అనుకూలంగా ఉండే ఎర్రమట్టి పిచ్పై జరిగిన భారత్- బంగ్లా మ్యాచ్లో ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటగా.. పాతబడే కొద్ది స్పిన్నర్లు దుమ్ములేపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. చెన్నై పిచ్ క్యూరేటర్ల పనితనాన్ని ప్రశంసించాడు.ప్రతి బౌలర్ వికెట్లు తీశాడు‘‘బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. జడేజా ఐదు వికెట్లు కూల్చాడు. సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా టీమిండియా 20 వికెట్లూ పడగొట్టింది. జట్టులోని ప్రతి బౌలర్ అన్ని రకాలుగా పరీక్షలో పాసయ్యారు.మా వాళ్లకు ఇలాంటివి సాధ్యం కావుపిచ్ స్వభావాన్ని సరిగ్గా అంచనా వేసిన భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లనూ తుదిజట్టులోకి తీసుకుంది. అందుకు తగ్గట్లుగానే మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్ బౌలర్లు ప్రభావం చూపారు. ఈ మ్యాచ్ ఇంత బాగా సాగడానికి కారణం పిచ్ క్యూరేటర్లు. క్రెడిట్ మొత్తం వాళ్లకే ఇవ్వాలి. టెస్టు మ్యాచ్ను ఎలా నిర్వహించాలో వారికి ఎంతబాగా తెలుసో మ్యాచ్ చూశాక అర్థమైంది.మా వాళ్లకు మాత్రం ఇలాంటివి సాధ్యం కావు. మా దేశంలో పిచ్లకు ఎలాంటి విలువా లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి వాళ్లు నిరక్షరాస్యులేనని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు. పాకిస్తాన్కు ఆడినందుకు గర్వపడే తనకు.. ఇప్పటి పిచ్ క్యూరేటర్లను చూసి కోపం వస్తోందంటూ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా బంగ్లాదేశ్తో తొలి టెస్టులో టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్లతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఆడించింది.చదవండి: రోహిత్పై విమర్శలు.. ఎన్ని పరుగులు చేస్తారో చేయండి! పంత్ చెప్పిందిదే! -
రోహిత్పై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన పంత్!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే క్రమంలో టీమిండియా మరో ముందడుగు వేసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో శుభారంభం చేసింది. తొలి టెస్టులో గెలుపొంది.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. చెన్నైలోని చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 280 పరుగులతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.పునరాగమనంలో పంత్ అదుర్స్.. కానీ రాహుల్ మాత్రంఅయితే, బంగ్లాదేశ్ కూడా అంత తేలికగా రోహిత్ సేన ముందు తలొగ్గలేదు. ఆరంభంలో గట్టిపోటీనిచ్చింది. తమ స్థాయికి మించిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే, టీమిండియా సమిష్ఠిగా రాణించడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో చెపాక్ మ్యాచ్ ద్వారా ద్వారా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, సీనియర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో పునరాగమనం చేశారు.పంత్ తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులకే పరిమితమైనా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం సెంచరీ(109)తో దుమ్ములేపాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం తనను తాను నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 16 పరుగులే చేసిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులతో ఆడుతున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఫలితంగా రాహుల్ మైదానాన్ని వీడకతప్పలేదు.రోహిత్పై విమర్శలుఅయితే, రాహుల్కు మరికొంత సేపు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాల్సిందని.. అలా అయితే, అతడు ఫామ్లోకి వచ్చేవాడంటూ అభిమానులు రోహిత్ శర్మ నిర్ణయాన్ని విమర్శించారు. ఈ విషయంపై రిషభ్ పంత్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. ‘‘మేము భోజన విరామానికి వెళ్లినపుడే ఇన్నింగ్స్ డిక్లరేషన్ గురించి చర్చ జరిగింది.ఎవరు ఎన్ని పరుగులు చేస్తారో చేయండిఅప్పుడు రోహిత్ భాయ్.. ‘ఇంకో గంటసేపు మనం బ్యాటింగ్ చేస్తాం. ఈలోపు ఎవరు ఎన్ని పరుగులు చేస్తారో చేయండి’ అని చెప్పాడు. దీంతో.. తిరిగి బ్యాటింగ్కు వెళ్లగానే వీలైనన్ని రన్స్ చేయాలని నిర్ణయించుకున్నా. ఏమో నేను ఇంకాసేపు క్రీజులో ఉంటే 150 పరుగులు కూడా చేసేవాడిని’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. తద్వారా రాహుల్ విషయంలో రోహిత్ను విమర్శిస్తున్న వాళ్ల నోళ్లకు తాళం వేశాడు.కాగా ఈ మ్యాచ్లో పంత్తో పాటు శుబ్మన్ గిల్ శతకంతో అలరించాడు. అయితే, గిల్ 119, కేఎల్ రాహుల్ 22 కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అప్పటికి టీమిండియా 514 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్కు 515 పరుగుల రూపంలో ముందుంచాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌట్ కావడంతో భారీ తేడాతో విజయం టీమిండియా సొంతమైంది. చదవండి: రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే: బంగ్లాదేశ్ క్రికెటర్Rishabh pant bodied all haters who trolled Rohit sharma for not giving enough time to kl Rahul at the creasepic.twitter.com/MVPiWkhr4w— Gillfied⁷⁷ (@Gill_era7) September 22, 2024 -
‘రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ జట్టుకు అశూ సేవలు మరువలేనివని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు అతడు ఏమాత్రం తీసిపోడని కొనియాడాడు. తన దృష్టిలో టీమిండియాలో అత్యంత ముఖ్యమైన ఆటగాడు అతడేనని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్తో టీమిండియా తొలి టెస్టులో అశ్విన్ సత్తా చాటిన విషయం తెలిసిందే. చెన్నైలోని సొంతమైదానం చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో విలువైన సెంచరీ చేయడంతో పాటు.. ఆరు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఆరు శతకాలు.. 522 వికెట్లుఈ క్రమంలో టెస్టు క్రికెట్లో ఇప్పటికే 522 వికెట్లతో పాటు... 3422 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇందులో ఆరు సెంచరీలు ఉండం విశేషం. ఇక గతంలోనూ పలు టెస్టుల్లో టీమిండియా చిక్కుల్లో పడ్డవేళ ఆపద్భాందవుడిలా తన ఇన్నింగ్స్తో గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘‘తొలి టెస్టులో అశ్విన్ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. స్పెషలిస్టు బ్యాటర్ మాదిరి ఇన్నింగ్స్ ఆడాడు. నేను విదేశీయుడిని.. అయితే, నాలాగే చాలా మందికి ఎక్కువగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లే వినిపిస్తున్నాయి.రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమేఅయితే, నా దృష్టిలో మాత్రం వాళ్లిద్దరితో పాటు టీమిండియాకు అశ్విన్ కూడా అంతే ముఖ్యం. కానీ.. అశూ లాంటి వాళ్లు సెంచరీ చేసినపుడు.. ఐదు లేదా ఆరు వికెట్లు పడగొట్టినపుడు మాత్రమే మనం వాళ్ల గురించి మాట్లాడతాం. అయితే, భారత క్రికెట్ జట్టు విజయపథంలో నడవడంలో అశ్విన్ వంటి మేటి ఆటగాళ్ల కృషి ఎంతగానో ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లి మాదిరే అతడూ టాప్ ప్లేయరేనని తమీమ్ ఇక్బాల్ ఈ సందర్భంగా అశ్విన్ను ప్రశంసించాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!📽️ WATCHThe dismissal that completed five-wicket haul number 37 in Test Cricket for @ashwinravi99 👏👏#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/tDKMeNn33O— BCCI (@BCCI) September 22, 2024 -
IND VS BAN 1st Test: జడేజా ఖాతాలో అరుదైన రికార్డు
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ల్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (86) చేసిన జడేజా.. మ్యాచ్ మొత్తంలో ఐదు వికెట్లు తీశాడు. ఇలా ఓ టెస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ, ఐదు వికెట్లు తీయడం జడేజాకు ఇది 12వ సారి. భారత క్రికెటర్లలో ఈ ఘనతను ఇన్ని సార్లు ఎవ్వరూ సాధించలేదు. జడ్డూ తర్వాతి స్థానంలో అశ్విన్ (11) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత కపిల్ దేవ్ (7), హర్భజన్ సింగ్ (6) ఉన్నారు. వీరి మినహా ఏ భారత క్రికెటర్ రెండు కంటే ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించలేదు.చెన్నై టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్పై 280 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం చలాయింది. అశ్విన్ (113, 6/88), జడేజా (86, 2/19, 3/58) ఆల్రౌండ్ షోతో ఇరగదీయగా.. గిల్ (119 నాటౌట్), పంత్ (109) అదిరిపోయే శతకాలతో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, సెకెండ్ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!