ముగిసిన మూడో రోజు ఆట.. 125 పరుగుల వెనుకంజలో భారత్‌ | IND VS NZ 1st Test Day 3 Stumps: India Trail By 125 Runs | Sakshi
Sakshi News home page

IND VS NZ 1st Test: ముగిసిన మూడో రోజు ఆట.. 125 పరుగుల వెనుకంజలో భారత్‌

Published Fri, Oct 18 2024 5:46 PM | Last Updated on Fri, Oct 18 2024 5:59 PM

IND VS NZ 1st Test Day 3 Stumps: India Trail By 125 Runs

బెంగళూరు వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. మూడో రోజు చివరి బంతికి విరాట్‌ కోహ్లి (70) ఔటయ్యాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (70) క్రీజ్‌లో ఉన్నాడు.

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 125 పరుగులు వెనుకపడి ఉంది. భారత్‌ చేతిలో మరో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా రెండు రోజు ఆట మిగిలి ఉంది. భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (35), రోహిత్‌ శర్మ (52), విరాట్‌ కోహ్లి ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 2, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్‌ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్‌ కాన్వే (91), టిమ్‌ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్‌, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ రెండు, అశ్విన్‌, బుమ్రా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 46 పరుగులకే కుప్పకూలింది. మ్యాట్‌ హెన్రీ (5/15), విలియమ్‌ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) టీమిండియా పతనాన్ని శాశించారు. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (కోహ్లి, సర్ఫరాజ్‌, రాహుల్‌, జడేజా, అశ్విన్‌) డకౌట్‌ కాగా.. రిషబ్‌ పంత్‌ (20), యశస్వి జైస్వాల్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రోహిత్‌ 2, కుల్దీప్‌ 2, బుమ్రా 1, సిరాజ్‌ 4 పరుగులు చేశారు.

చదవండి: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement