
ఆసియా కప్-2025 గత మ్యాచ్లో భారత జట్టు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాటు యుద్ధం, సైనికుల ప్రస్తావన తీసుకొచ్చి క్రీడలతో రాజకీయాలు చేసిందని పాకిస్తాన్ వైపు నుంచి విమర్శలు వచ్చాయి. అయితే తాము మాత్రం అలాంటి రెచ్చగొట్టే పనులు, సైగలను తగ్గించుకోమని వారు చూపించారు.
సూపర్-4 మ్యాచ్లో భాగంగా ఆదివారం భారత్తో మ్యాచ్ సందర్భంగా 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత.. ఫర్హాన్ బ్యాట్ను ఏకే–47 గన్ తరహాలో ఎక్కు పెట్టి పేలుస్తున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ సైగ వారి ఆలోచనాధోరణిని చూపించింది. కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆసియా కప్ 202 సూపర్-4 : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు
👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్
👉టాస్: టీమిండియా.. తొలుత బౌలింగ్
👉పాక్ స్కోరు: 171/5 (20)
👉టీమిండియా స్కోరు: 174/4 (18.5)
👉ఫలితం: పాక్పై ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74).