
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022 శనివారం(మార్చి 26) నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో బరిలో ఉన్న 10 జట్లలో ఎనిమిది జట్లకు భారత క్రికెటర్లు నాయకత్వం వహిస్తున్నారు. ఏ జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తున్నారో ఓ సారి పరిశీలిద్దాం.
రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్కతా నైట్రైడర్స్), కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్), హార్దిక్ పాండ్యా (గుజరాత్ జెయింట్స్), మయాంక్ అగర్వాల్ (పంజాబ్ కింగ్స్), సంజూ సామ్సన్ (రాజస్తాన్ రాయల్స్), రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఈ జాబితాలో ఉన్నారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ డు ప్లెసిస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు... న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్లుగా ఉన్నారు.
చదవండి: CSK VS KKR: ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ రికార్డులేంటో చూద్దాం..!
Comments
Please login to add a commentAdd a comment