IPL 2022
-
IPL 2023: 2022 సీన్ రిపీట్.. అప్పుడెలాగో, ఇప్పుడూ అలాగే..!
2022 సీన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ రిపీట్ కాబోతుందా అంటే..? కొన్ని గణాంకాలు ఆ ఫలితాన్నే సూచిస్తున్నాయి. గత సీజన్లో ఛాంపియన్గా అవతరించిన గుజరాత్, ఏరకంగా అయితే తమ ప్రస్థానాన్ని ప్రారంభించిందో (తొలి మ్యాచ్లో విజయం), ప్రస్తుత సీజన్లోనూ అలాగే మక్కీ టు మక్కీ సీన్ రిపీట్ చేస్తోంది. గత సీజన్లో 14 గ్రూప్ స్టేజీ మ్యాచ్లు ఆడిన గుజరాత్.. ప్రస్తుత సీజన్లోనూ అన్నే మ్యాచ్లు ఆడి గత సీజన్లోలాగే 10 విజయాలు, 4 అపజయాలను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ, గుజరాత్ మాత్రం కాపీ పేస్ట్ అన్న తరహాలోనే తమ జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఇక్కడ గుజరాత్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఓ రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. గ్రూప్ స్టేజీ మ్యాచ్ల్లో వరుస సీజన్లలో 5 కంటే తక్కువ మ్యాచ్లు ఓడిన తొలి జట్టుగా హార్ధిక్ సేన చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో జోరు కొనసాగిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్.. తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్లో ఆర్సీబీని మట్టికరిపించి, ముంబైని ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేలా చేసింది. నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలవ్వడంతో ప్లే ఆఫ్స్కు చేరిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది. గుజరాత్ ఓపెనర్ శుభ్మర్ గిల్ సుడిగాలి శతకంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: IPL 2023: ధోనితో విభేదాలు.. మధ్యలో రవీంద్ర జడేజా భార్య..! -
CSK: అట్టడుగు నుంచి అగ్రస్థానానికి.. ఒక్క సీజన్లో ఎంత మార్పు..!
ఐపీఎల్ 2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయాలు సాధిస్తూ (7 మ్యాచ్ల్లో 5 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. చివరి నుంచి రెండో స్థానంతో గత సీజన్ను ముగించిన సీఎస్కే.. ప్రస్తుత సీజన్లో అనూహ్యంగా పుంజుకుని ఓ రేంజ్లో ఇరగదీస్తుంది. ఈ సీజన్ను సైతం ఓటమితో (గుజరాత్ చేతిలో) ప్రారంభించిన ధోని సేన.. ఆతర్వాత ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క ఓటమిని (రాజస్థాన్) మూటగట్టుకుని బ్రేకుల్లేని బుల్డోజర్గా దూసుకుపోతుంది. నిన్న (ఏప్రిల్ 23) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా భారీ జంప్ చేసింది. కేకేఆర్పై భారీ స్కోర్ చేయడంతో ఆ జట్టు రన్రేట్ సైతం గణనీయంగా మెరుగుడింది. సీఎస్కేలో ఒక్క సీజన్లో ఇంత మార్పు రావడంతో ఆ జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు ఇదే జోరును కొనసాగించి, ఐదో టైటిల్ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు యువకులు, వెటరన్ ఆటగాళ్ల సమ్మేళనంలా ఉన్న సీఎస్కే సైతం ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని దృడ నిశ్చయంతో ఉంది. తమ సారధి ధోనికి బహుశా ఈ సీజన్ ఆఖరిది కావొచ్చనే సంకేతాలు అందడంతో సీఎస్కే సభ్యులంతా తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు లాంటి వెటరన్లకు కూడా ఇదే సీజన్ ఆఖరిది అయ్యే అవకాశం ఉండటంతో, వారిని సైతం ఘనంగా సాగనంపాలని భారీగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అయిన తమ నాయకుడికి టైటిల్తో వీడ్కోలు పలకడమే తామందించగలిగే గౌరవమని సీఎస్కే సభ్యులు భావిస్తున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్ బౌలర్లపై సీఎస్కే బ్యాటర్లు ఓ రేంజ్లో డామినేషన్ చలాయించారు. రహానే (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినప్పటికీ కేకేఆర్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
IPL 2023: ఏప్రిల్ 6.. ఏడాది గ్యాప్.. కేకేఆర్ బ్యాటర్ల మహోగ్రరూపం
ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పూనకం వచ్చినట్లు ఊగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. Still in awe of this... 🥰pic.twitter.com/amSg9sZdvU — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికర విషయం ఏంటంటే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున (ఏప్రిల్ 6, 2022) కేకేఆర్ ఆల్రౌండర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. నాడు ముంబై ఇండియన్స్పై కమిన్స్ 14 బంతుల్లోనే హాఫ్సెంచరీ కొట్టాడు. నిన్నటి మ్యాచ్లో శార్దూల్ కూడా కమిన్స్ తరహాలోనే రెచ్చిపోయి ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒకే రోజు, ఏడాది గ్యాప్లో కేకేఆర్ బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చడం యాదృచ్చికంగా జరిగినప్పటికీ కేకేఆర్ అభిమానులు మాత్రం ఏప్రిల్ 6 గురించి చెప్పుకుంటూ తెగ సంబురపడిపోతున్నారు. 𝘚𝘢𝘮𝘢𝘫𝘩 𝘳𝘢𝘩𝘦 𝘩𝘰! 😌@imShard @patcummins30 #KKRvRCB | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/shanGi5s82 — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ ఇన్నింగ్స్లో శార్దుల్తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. Pat Cummins finishes things off in style! Also brings up the joint fastest half-century in #TATAIPL off 14 deliveries.#KKR win by 5 wickets with 24 balls to spare. Scorecard - https://t.co/22oFJJzGVN #KKRvMI #TATAIPL pic.twitter.com/r5ahBcIWgR — IndianPremierLeague (@IPL) April 6, 2022 అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..?
ఈ ఏడాది (2022) మే 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం (మొతేరా) వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 1,01,566 మంది హాజరయ్యారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్కు ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరుకావడం అదే తొలిసారి. దీంతో ఐపీఎల్-2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. A proud moment for everyone as India creates the Guinness World Record. This one is for all our fans for their unmatched passion and unwavering support. Congratulations to @GCAMotera and @IPL pic.twitter.com/PPhalj4yjI— BCCI (@BCCI) November 27, 2022 ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇవాళ (నవంబర్ 27) వెల్లడించింది. బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి నుంచి అవార్డు ప్రతిని అందుకున్న దృష్యాన్ని షేర్ చేసింది. భారతీయులకు ఇదో గర్వించదగ్గ క్షణం. భారత్.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఇది మా అభిమానులకు అంకితం.. మొతేరా, ఐపీఎల్కు అభినందనలు అంటూ బీసీసీఐ ట్విటర్లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే, నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ఆడిన తొలి లీగ్లోనే అండర్ డాగ్గా బరిలోకి దిగిన హార్ధిక్ సేన ఛాంపియన్గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా, గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టి, 30 బంతుల్లో 34 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. -
IPL 2023: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2023 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్ నిర్హహకాకులు ఆయా ఫ్రాంచైజీలకు సమాచారం కూడా అందించినట్లు తెలస్తోంది. కాగా ఈ మినీ వేలం దాదాపు డిసెంబర్ 16న జరిగే అవకాశం ఉంది. అయితే వేలంకు సంబంధించి వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కాగా ఐపీఎల్ 16వ సీజన్ వచ్చే ఏడాది మార్చి అఖరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సారి ఐపీఎల్ మ్యాచ్లను హోమ్, అవే పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అదే విదంగా ఈ మినీ వేలంలో ప్రతీ ప్రాంఛైజీ పర్స్ బ్యాలెన్స్ను 5 కోట్లు పెంచి 95 కోట్లుగా నిర్ణయించారు. ఒక వేళ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వదిలివేయడం లేదా ఇతర జట్ల నుంచి తీసుకుంటే పర్స్ బ్యాలెన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ను గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంది. అరంగేట్ర సీజన్లోనే హార్దిక్ పాండ్యా నేతత్వంలోని గుజరాత్ అదరగొట్టింది. ఆహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ టైటిల్ను సొంతం చేసుకుంది. చదవండి: T20 WC 2022: పంత్కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్ దిగ్గజం -
హార్దిక్ పూర్తిగా మారిపోయాడు.. ఈ మార్పునకు కారణం అతడే: మాజీ పేసర్
Asia Cup 2022- Hardik Pandya: ‘‘కాలం.. అనుభవం మనిషికి అన్ని విషయాలు నేర్పిస్తాయి. ఇందుకు పాండ్యా కూడా అతీతుడు కాడు. వ్యక్తిగా.. ఆటగాడిగా తనలో వచ్చిన మార్పులను నేను స్పష్టంగా చూశాను’’ అని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. భారత జట్టు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. తండ్రిగా మారిన తర్వాత హార్దిక్ పరిణితి చెందాడని.. ఆటపై మరింత దృష్టి సారించాడని పేర్కొన్నాడు. చేదు అనుభవాలు ఎదుర్కొని.. కాగా గడ్డు పరిస్థితులను దాటుకుని ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ ఇచ్చిన అవకాశంతో మరోసాని తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. అదే జోష్లో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్లో ముందుకు సాగున్నాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ను టైటిల్ విజేతగా నిలిపిన కెప్టెన్గా ఘనత వహించి.. టీమిండియాలో పునరగామనం చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ టీ20 ఫార్మాట్లో ఏకంగా టీమిండియా పగ్గాలు చేపట్టి వరుస విజయాలు నమోదు చేశాడు. అంతేకాదు.. ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి తన విలువ చాటుకున్నాడు. అయితే, గతంలో మాదిరి మరీ దూకుడుగా కాకుండా.. వివాదాల జోలికి పోకుండా.. కాస్త కామ్గా ఉంటూనే తన పనిని తాను చక్కబెట్టుకుంటున్నాడు. ఆశిష్ నెహ్రా, హార్దిక్ పాండ్యా(PC: IPL/BCCI) ఒకేలా ఉంటానంటే కుదరదు! ఈ నేపథ్యంలో.. గుజరాత్ టైటాన్స్ కోచ్గా హార్దిక్కు మరింత సన్నిహితంగా మెలిగిన ఆశిష్ నెహ్రా.. తమ కెప్టెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొడుకు అగస్త్య రాకతో హార్దిక్ పూర్తిగా మారిపోయాడన్నాడు. ఐసీసీ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘మనిషికి మార్పు అవసరం. అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉంటానంటే కుదరదు. పాండ్యా విషయంలోనూ అదే జరిగింది. అగస్త్య వచ్చాకే! అనుభం తనకు చాలా నేర్పిందన్న విషయాన్ని అతడే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు కూడా! తను ఇప్పుడు వివాహితుడు.. ఓ బిడ్డకు తండ్రి.. అలాగే పరిణితి కలిగిన వ్యక్తి. నిజంగా అగస్త్య రాకతో తను చాలా మారిపోయాడు. తన పని ఏమిటో తాను చూసుకుంటూ.. కెరీర్పై మరింత దృష్టి సారించాడు. ఈ విషయాలను నేను దగ్గరగా గమనించాను’’ అని హార్దిక్ పాండ్యా గురించి నెహ్రా చెప్పుకొచ్చాడు. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram ) ఇక పాండ్యా వయసు ఇంకా 28 ఏళ్లేనన్న నెహ్రా.. ఆటను ఇలాగే కొనసాగిస్తే.. కెరీర్ మరింత ఉజ్వలంగా సాగుతుందన్నాడు. కఠిన శ్రమకు ఓర్వడంతో పాటుగా నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే తత్వం గలవాడని హార్దిక్ను కొనియాడాడు. కాగా హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషాను పెళ్లాడాడు. వీరికి కొడుకు అగస్త్య సంతానం. ఇక హార్దిక్కు తన కొడుకంటే పంచప్రాణాలు. ఆట నుంచి విరామం దొరికితే కుటుంబానికే మొత్తం సమయం కేటాయిస్తాడు పాండ్యా. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram ) చదవండి: Nazibulla Zardan: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్ Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతడు కెప్టెనా? ఫిట్నెస్ పరీక్షలో నెగ్గుతాడా? బౌలింగ్ చేయగలడా? పడిలేచిన కెరటంలా..
‘‘ప్రస్తుతం.. క్రికెట్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆల్రౌండర్ తానేనని అతడికి తెలిసి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా అతడు రాణిస్తున్నాడు. బహుశా తన మైండ్సెట్ అలా మారిపోయి ఉంటుంది. గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు.. కీలకమైన సమయంలో బ్యాట్తో రాణిస్తున్నాడు.. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా ఎదుగుతున్నాడు’’ - పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. హార్దిక్ పాండ్యా బంతితోనూ, బ్యాట్తోనూ అద్భుతం చేశాడు- టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆఖర్లో టీమిండియాపై ఒత్తిడి పెంచాలనుకున్నాం. కానీ హార్దిక్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు- పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పునరాగమనం తర్వాత అత్యద్భుతంగా రాణిస్తూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఒత్తిడిని జయించి.. జట్టును గెలిపించాడు- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. Asia Cup 2022 India Vs Pakistan- Hardik Pandya: ఆసియా కప్-2022లో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు దక్కిన ప్రశంసల్లో మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి! కీలక పోరులో అదీ దాయాది జట్టుపై విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు హార్దిక్. ఆల్రౌండ్ ప్రదర్శన.. పాకిస్తాన్ను కట్టడి చేయడంలో బౌలర్గా తన వంతు పాత్ర పోషించాడు. 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. వికెట్లు పడుతున్నా భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(43 పరుగులు)ను అద్భుత బంతితో పెవిలియన్కు పంపించాడు. అదే విధంగా.. ప్రమాదకరంగా పరిణమిస్తున్నాడునుకుంటున్న సమయంలో ఇఫ్తికర్ అహ్మద్(28)ను అవుట్ చేశాడు. ఖుష్దిల్ను కూడా కేవలం రెండు పరుగులకు పెవిలియన్కు పంపాడు. తద్వారా పాకిస్తాన్ను 147 పరుగులకు ఆలౌట్ చేయడంలో తన వంతు సహకారం అందించాడు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ తడబడుతున్న వేళ మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు హార్దిక్. సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో 15 ఓవర్ ఆరంభంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. తనదైన స్టైల్లో ఫోర్ బాది ఆ ఓవర్ను ముగించాడు. ఆ తర్వాత వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా సింగిల్స్ తీశాడు. బ్యాట్తోనే సమాధానం ఇక జడేజా ఆఖరి ఓవర్ మొదటి బంతికి అవుటైన తర్వాత.. గెలుపు సమీకరణం 4 బంతుల్లో 6 పరుగులుగా ఉన్న వేళ సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆల్రౌండ ప్రతిభతో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గతేడాది ప్రపంచకప్-2021 సమయంలో వ్యక్తిగతంగా తనను విమర్శించిన వారికి ఈ మ్యాచ్తో దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు హార్దిక్ పాండ్యా! గడ్డు పరిస్థితులు ఎదుర్కొని.. ఐపీఎల్-2021లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. ఆ సీజన్లో 11 ఇన్నింగ్స్లో అతడు సాధించిన మొత్తం పరుగులు 127. సెకండ్ ఫేజ్లో అయితే అసలు బౌలింగ్ చేయలేదు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2021 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా.. మెగా ఈవెంట్లోనూ రాణించలేకపోయాడు. ఈ క్రమంలో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు తన కెరీర్ ఆరంభం నుంచి అండగా ఉన్న ముంబై ఫ్రాంఛైజీ సైతం ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు హార్దిక్ను వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి ఫిట్నెస్ సాధించడం కోసం జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు ఈ ‘ఆల్రౌండర్’. రాత మార్చిన ఐపీఎల్-2022.. కెరీర్ చిక్కుల్లో పడిన వేళ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూపంలో అదృష్టం హార్దిక్ తలుపుతట్టింది. తన ప్రతిభను నిరూపించుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. ఐపీఎల్-2022 నేపథ్యంలో హార్దిక్ను తమ కెప్టెన్గా నియమించింది గుజరాత్ ఫ్రాంఛైజీ. జాతీయ జట్టుకు దూరమై క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్న హార్దిక్ తిరిగి బౌలింగ్ చేస్తాడా లేదా అన్న అనుమానాల నడుమ ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఫిట్నెస్ టెస్టు ఎదుర్కొన్నాడు పాండ్యా. అందులో సఫలీకృతం కావడంతో అభిమానులతో పాటు గుజరాత్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. పడిలేచిన కెరటంలా.. అప్పటి వరకు కెప్టెన్గా ఏమాత్రం అనుభవం లేని హార్దిక్ పాండ్యా.. అవలీలగా టైటాన్స్ను ముందుకు నడిపించాడు. సీజన్ ఆరంభానికి ముందు చెప్పినట్లుగానే ధోని స్టైల్లో కెప్టెన్సీ చేసి జట్టును విజేతగా నిలిపాడు. సారథిగా.. బ్యాటర్గా(15 ఇన్నింగ్స్లో 487 పరుగులు- అత్యధిక స్కోరు 87 నాటౌట్)... బౌలర్గా(10 ఇన్నింగ్స్లో 8 వికెట్లు).. మూడు పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేసి అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ను టైటిల్ విజేతగా నిలిపాడు. అదే వేదికపై.. ఆ తర్వాత హార్దిక్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. టీమిండియాలో పునరాగమనం.. ఐర్లాండ్తో టీ20 సిరీస్కు సారథిగా ఎంపికవడం.. క్లీన్స్వీప్ చేయడం.. వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఆఖరి మ్యాచ్లో రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్గా వ్యవహరించి విజయం సాధించడం.. ఇప్పుడు ఇలా గతేడాది ఏ వేదికపై అయితే తనకు, తన జట్టుకు అవమానం జరిగిందో అదే వేదికపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటం.. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు కాబోయే కెప్టెన్ అంటూ నీరాజనాలు అందుకోవడం.. ఇలా పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసి తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఇంకో 15 పరుగులు చేయాల్సి ఉన్నా.. మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం హార్దిక్ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. ‘‘పరిస్థితులకు తగ్గట్టుగా ప్రత్యర్థి బలాబలాలు అంచనా వేసి మన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలు సంధించాలి. బౌలింగ్లో షార్ట్ బంతులు నా బలం. బ్యాటర్లను తప్పుదోవ పట్టించి.. బంతిని అంచనా వేయలేని స్థితికి తీసుకురావాలి. ఇక ఛేజింగ్ విషయానికొస్తే.. ఓ యువ బౌలర్.. ఓ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆడతారని తెలుసు. ఆఖరి ఓవర్లో మా విజయానికి 7 పరుగులు కావాలి. ఒకవేళ 15 పరుగులు చేయాల్సి ఉన్నా నేను ఇలాగే ఆడేవాడిని. నిజానికి 20వ ఓవర్లో నాకంటే కూడా ఆ బౌలర్ మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని తెలుసు’’ అని హార్దిక్ పేర్కొన్నాడు. ఆల్ ది బెస్ట్ హీరో.. గడ్డు పరిస్థితులను దాటుకుని కెరీర్ను తిరిగి ఉజ్వలంగా మలచుకుంటున్న హార్దిక్ పాండ్యా.. భవిష్యత్తులోనూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుదాం. పేసర్లు ప్రతాపం చూపినా.. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ మ్యాచ్ హీరో ఎవరంటే మాత్రం మొగ్గు పాండ్యావైపే చూపాల్సి వస్తుంది మరి! కీలకమైన సమయంలో 17 బంతుల్లోనే 33 పరుగులు చేసి అజేయంగా నిలిచి సిక్సర్తో విజయం అందించిన హార్దిక్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే! ఏమంటారు? చదవండి: Asia Cup Ind Vs Pak: ‘కేవలం లక్ వల్లే ఇండియా గెలిచింది’! అసలేం మాట్లాడుతున్నావు? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆరోజు కోహ్లి రెండున్నర గంటలు బ్యాటింగ్ చేశాడు.. నేను షాకయ్యా!
Asia Cup 2022- Rashid Khan Comments On Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఆట కోసం ఎంతటి శ్రమకైనా ఓర్చేతత్వం అతడిదని.. పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడని కొనియాడాడు. కోహ్లి ఇప్పటికే కెరీర్లో అత్యుత్తమ దశకు చేరుకున్నాడన్న రషీద్.. అందుకే అతడిపై అంచనాలు భారీగా ఉంటాయని పేర్కొన్నాడు. కాబట్టి ప్రతి మ్యాచ్లోనూ సెంచరీ సాధించాలని అభిమానులు భావిస్తున్నారని.. అందుకు కోహ్లి గొప్ప ఆటతీరే కారణమని చెప్పుకొచ్చాడు. చాలా రోజులుగా జట్టుకు దూరమైన కోహ్లి ఆసియా కప్-2022 టోర్నీతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. యూఏఈ వేదికగా ఆగష్టు 27 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. నిజంగా చెప్తున్నా.. రెండున్నర గంటలు బ్యాటింగ్! ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వూలో అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్కు ముందు జరిగిన సంఘటన తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. ఈ మేరకు రషీద్ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో భాగంగా ఆ మరుసటి రోజు మేము ఆర్సీబీతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అప్పుడు నెట్స్లో ప్రాక్టీసు చేస్తున్న కోహ్లిని చూశాను. నిజం చెప్తున్నా.. అతడు రెండున్నర గంటల పాటు బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. అది చూసి నేను షాక్ అయిపోయాను. అర్ధ శతకంతో మెరిశాడు.. తర్వాతి రోజు మాతో మ్యాచ్లో కోహ్లి 70కి పైగా పరుగులు సాధించాడు. తను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఇక అందరూ అంటున్నట్లుగా కోహ్లి ఫామ్ కోల్పోయినట్లు తాను భావించడం లేదని.. తనపై ఉన్న అంచనాల కారణంగానే విమర్శలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. కోహ్లి స్థానంలో ఓ సాధారణ బ్యాటర్ ఉంటే ఇలాంటి మాటలు వినిపించేవి కావని పేర్కొన్నాడు. వాళ్లిద్దరికీ బౌలింగ్ చేయడం ఇష్టం ఇక విరాట్ కోహ్లి, బాబర్ ఆజం వంటి టాప్ క్లాస్ బ్యాటర్లుకు బౌలింగ్ చేయడం తనకు ఇష్టమని రషీద్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు అరంగేట్ర సీజన్లోనే విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. కాగా ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి.. గుజరాత్తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా బెంగళూరును 8 వికెట్ల తేడాతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆ మ్యాచ్కు ముందు కోహ్లి ప్రాక్టీసు చేసిన విషయాన్ని రషీద్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్తోనూ ముచ్చట! Hello DUBAI 🇦🇪 Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1sz — BCCI (@BCCI) August 24, 2022 -
9 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! భావోద్వేగంతో..
Mumbai Indians -Kumar Kartikeya: అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కష్టాల కడలిని ఈదాల్సి వచ్చినా వెనకడుగు వేయక ముందుకు సాగేవాళ్లు కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో ముంబై ఇండియన్స్ యువ స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ కూడా ఒకడు. క్రికెటర్ కావాలన్న తన ఆశయం కుటుంబానికి భారం కావొద్దనే తలంపుతో 15 ఏళ్ల వయస్సులో ఇంటిని వీడాడు. సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ను వీడి ఢిల్లీ చేరుకున్నాడు. కష్టనష్టాలకోర్చి.. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. పగలంతా పనిచేసుకుని.. ఏడాదిపాటు కేవలం రాత్రిపూట భోజనంతో సరిపెట్టుకుని లక్ష్యం దిశగా అడుగులు వేశాడు. కఠిన శ్రమ, ప్రతిభకు తోడు కాలం కలిసి రావడంతో 2018లో మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు. తన ఆట తీరుతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్రంలోనే.. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న కార్తికేయ ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో తాను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసి క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఐదు వికెట్లతో మెరిసి.. ఇక ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2021-22 టోర్నీలో మధ్యప్రదేశ్కు ప్రాతినిథ్యం వహించిన 24 ఏళ్ల కుమార్ కార్తికేయ.. ఫైనల్లో 5 వికెట్లతో రాణించాడు. తద్వారా మధ్యప్రదేశ్ తొలిసారిగా రంజీ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా తన కలలను సాకారం చేసుకుంటున్న కార్తికేయ తొమ్మిదేళ్ల తర్వాత తాజాగా తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నాడు. ఈ విషయాన్ని కార్తికేయ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘తొమ్మిదేళ్ల 3 నెలల తర్వాత నా కుటుంబాన్ని.. మా అమ్మను కలిశాను. ఈ అనుభూతిని వర్ణించడానికి, నా మనసులోని భావనలు తెలిపేందుకు మాటలు రావడం లేదు’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి దిగిన ఫొటోను కార్తికేయ షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. క్రికెటర్ కావాలన్న లక్ష్యం కోసం కార్తికేయ చేసిన త్యాగాన్ని కొందరు కొనియాడుతుంటే.. తల్లిదండ్రులను కలుసుకోవడానికి నీకు ఇన్నేళ్లు పట్టిందా అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. చదవండి: ICC T20 Rankings: బాబర్ ర్యాంకుకు ఎసరుపెట్టిన సూర్య! నెంబర్ 1 స్థానానికి చేరువలో! -
T20 WC: అతడు మరీ అంత బ్యాడ్ ఛాయిస్ కాదు! ప్రపంచకప్ జట్టులో ఉంటే..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో భారత జట్టులో మహ్మద్ షమీకి స్థానం కల్పిస్తే బాగుంటుందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్తో పాటు షమీ కూడా జట్టులో ఉండేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. వరల్డ్కప్ టోర్నీలో అనుభవజ్ఞులైన ఈ పేస్ త్రయంతో బరిలోకి దిగితే మెరుగైన ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రయోగాలు చేస్తున్న టీమిండియా! ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో దూకుడైన బ్యాటింగ్తో ముందుకు సాగుతామన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా పలు ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. ముఖ్యంగా హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లను మెగా ఈవెంట్కు సన్నద్ధం చేసే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షమీకి అవకాశం ఇవ్వాలంటూ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. మహ్మద్ షమీ(PC: BCCI) ఐపీఎల్లో అదరగొట్టిన షమీ! అయినా.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో షమీ.. ఆరు వికెట్లు(ఎకానమీ 9.57) పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన షమీ 20 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత టీమిండియా తరఫున టీ20ల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్ షమీకి సూట్ కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. మరింత మెరుగయ్యాడు! ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రదర్శనతో దినేశ్ కార్తిక్ టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు. నిజానికి మహ్మద్ షమీ కూడా ఐపీఎల్లో అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్కు ట్రోఫీ అందించాడు. గత ప్రపంచకప్ మ్యాచ్ కంటే ఇప్పుడు మరింత మెరుగయ్యాడు. కాబట్టి అతడు ఈసారి మరీ అంత బ్యాడ్ ఛాయిస్ ఏమీ కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా, భువీ, అర్ష్దీప్తో పాటు 31 ఏళ్ల షమీని మేనేజ్మెంట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్-2022లో అదరగొట్టిన 37 ఏళ్ల దినేశ్ కార్తిక్ భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చి.. ఫినిషర్గా స్థానం సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. చదవండి: Suryakumar Yadav: ఇదే కొనసాగితే సూర్య కెరీర్ నాశనమవడం ఖాయం! తగ్గేదేలే అంటున్న రోహిత్! -
'పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల జట్లలో ఆడనున్నారు'
పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాక్ ఆటగాళ్లు ఒక్క ఐపీఎల్ మినహా మిగితా దేశాల ప్రాంఛైజీ క్రికెట్ టోర్నీల్లో భాగం అవుతున్నారు. ఇక త్వరలో జరగనున్న యూఏఈ, దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో పాక్ ఆటగాళ్లు భాగమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఐపీఎల్కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు యూఏఈ టీ20 లీగ్లో జట్లను కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాళ్లు ఆటగాళ్లు మరోసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల కోసం ఆడనున్నారని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లపై నిషేధం ఉంది. కానీ పాక్ ఆటగాళ్లు మిగతా టీ20 లీగ్లలో ఆడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు దక్షిణాఫ్రికా, యూఏఈ టీ20 లీగ్లలో జట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. కాబట్టి వారి జట్లులో పాక్ ఆటగాళ్లు కూడా భాగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరోసారి పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానుల తో జతకట్టనున్నారు" అని ఆకాష్ చోప్రా యూ ట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Rashid Latif: "పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు " -
తండ్రైన కేకేఆర్ బ్యాటర్.. శుభాకాంక్షల వెల్లువ
సౌరాష్ట్ర వెటరన్ వికెట్ కీపర్, కోల్కతా నైట్రైడర్స్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తమకు మంగళవారం మగ బిడ్డ జన్మించినట్లు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిన్నారి కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు షెల్డన్ జాక్సన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేకేఆర్ సైతం లిటిల్ నైట్కు క్లబ్లోకి స్వాగతం అంటూ జాక్సన్ను విష్ చేసింది. కాగా దేశవాళీ క్రికెట్లో రాణించినప్పటికీ 35 ఏళ్ల షెల్డన్ జాక్సన్కు ఇంత వరకు టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో తాను నిరాశకు గురైనట్లు జాక్సన్ గతంలో పలు సందర్భాల్లో వెల్లడించాడు. ఒకానొక సమయంలో తాను ఈ విషయం గురించి ఒకరిద్దరిని అడుగగా.. తనకు వయసైపోయిందన్నారని, అందుకే బీసీసీఐ నుంచి పిలుపు రావడం లేదన్నారని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో 30 ఏళ్లు పైబడిన వారిని జట్టుకు ఎంపిక చేయడం చూశానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2011లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన షెల్డన్ జాక్సన్ 79 మ్యాచ్లు ఆడాడు. 5947 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 67 మ్యాచ్లలో 2346 పరుగులు చేశాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో 1534 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు షెల్డన్ జాక్సన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే ఎవరూ లేరు! Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్ను కాదని అర్ష్దీప్ సింగ్కు ఛాన్స్! ఇంకా.. Blessed with a boy❤️😇 pic.twitter.com/Kh5zmBTy43 — Sheldon Jackson (@ShelJackson27) July 12, 2022 💜💜 https://t.co/Xr70sHk5eG — Sheldon Jackson (@ShelJackson27) July 12, 2022 -
'37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు.. అతడిని జట్టులోకి తీసుకోండి'
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు ఫాప్ డు ప్లెసిస్ను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కాగా డుప్లెసిస్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్కు సంబంధించిన ప్రణాళికలలో భాగంగా లేడు. అదే విధంగా అతడు తన దక్షిణాఫ్రికా క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. కాగా డుప్లెసిస్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2020లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్ పర్వాలేదనిపించాడు. ఈ ఏడాది సీజన్లో 468 పరుగులు చేసిన డుప్లెసిస్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. "డు ప్లెసిస్ 37 ఏళ్ల వయస్సులో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ఫీల్డింగ్లో కూడా అదరగొడుతున్నాడు. డుప్లెసిస్ ఐపీఎల్లో ఆర్సీబీ తరుపున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కాబట్టి అటువంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టులో ఉండాలి. క్రికెట్ సౌతాఫ్రికా పునరాలోచన చేసి అతడిని ప్రపంచకప్కు జట్టులోకి తీసుకురావాలి" అని మోర్కెల్ పేర్కొన్నాడు. చదవండి: Sourav Ganguly 50th Birthday: లండన్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న దాదా -
తిలక్ వర్మతో స్నేహం దేవుడిచ్చిన గొప్ప బహుమతి! మేమిద్దరం..
అండర్-19 ప్రపంచకప్-2022 టోర్నీలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన బేబీ ఏబీడీని.. ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మెగా వేలం-2022లో భాగంగా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ తాజా ఎడిషన్లో అతడు 7 ఇన్నింగ్స్లో కలిపి 161 పరుగులు చేశాడు. అయితే, ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం పద్నాలుగింటికి కేవలం 4 మ్యాచ్లే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, బ్రెవిస్కు మాత్రం పలువురు మేటి క్రికెటర్ల సలహాలతో పాటు కొంతమంది స్నేహితులూ దొరికారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్కీడాతో మాట్లాడిన డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స్తో తన ప్రయాణంలోని జ్ఞాపకాలు పంచుకున్నాడు. ‘‘ఇంతకంటే గొప్ప జట్టు ఉంటుందని నేను అనుకోను.. ఒక పెద్ద కుటుంబంలో భాగస్వామినైనందుకు చాలా సంతోషంగా ఉంది. దిగ్గజాలతో కలిసి ఆడటం గొప్ప అనుభవం. నా ఆటను మెరుగుపరుచుకునే ఎన్నో సలహాలు నాకు లభించాయి’’ అని బ్రెవిస్ పేర్కొన్నాడు. దేవుడిచ్చిన వరం ఇక హైదరాబాదీ బ్యాటర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మతో స్నేహం గురించి చెబుతూ.. ‘‘నాకు అక్కడ ఓ స్పెషల్ ఫ్రెండ్ ఉన్నాడు. తనతో స్నేహం నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తాను. ఈ స్నేహబంధం నా గుండెల్లో ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుంది. నాకోసం తిలక్ అన్ని వేళలా అండగా నిలబడతాడు’’ అని బేబీ ఏబీడీ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘మేము ఇద్దరం ఒకరినొకరం సపోర్టు చేసుకుంటాం. మాకు కాస్త హాస్య చతురత ఎక్కువ. ఒకరినొకరం ప్రాంక్ చేసుకోవడమే కాదు.. సహచర ఆటగాళ్లను కూడా ఆటపట్టించేవాళ్లం. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) బస్సు ప్రయాణాల్లోనూ మా అల్లరికి అంతే ఉండేది కాదు. వేకువజామునా.. లేదంటే అర్ధరాత్రులు అనే తేడా లేకుండా ఇద్దరం కలిసి నెట్ఫ్లిక్స్ చూసేవాళ్లం’’ అంటూ తిలక్తో గడిపిన మధుర జ్ఞాపకాలను బ్రెవిస్ గుర్తు చేసుకున్నాడు. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్ స్కోరర్గా నిలిచి విషయం తెలిసిందే. చదవండి: Trolls On BCCI: కోహ్లి తప్పుకొన్నాక.. పరిస్థితి మరీ ఇంతలా దిగజారిందేంటి? బీసీసీఐపై ట్రోల్స్ View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్ క్రికెటర్! వేడుకలో తమ చిన్నారి కూడా!
ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్ తన చిరకాల ప్రేయసి బ్రియర్ నీల్ను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల నడుమ బుధవారం(జూన్ 29) జరిగిన వేడుకలో ఆమెను వివాహమాడాడు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన చిన్నారి సమక్షంలో వీరి వివాహం జరుగడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీన్ అబాట్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. ‘‘నా ‘ప్రేమ’ను నేను పెళ్లాడాను. నా బెస్ట్ ఫ్రెండ్ బ్రియర్ అబాట్! స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మా జీవితంలోని ప్రత్యేక వేడుక ఇలా జరిగింది’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్-2022లో సీన్ అబాట్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి సందర్భంగా సోషల్ మీడియాలో అబాట్ దంపతులకు రైజర్స్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. కాగా అబాట్ 2014లో పాకిస్తాన్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆసీస్ తరఫున 5 వన్డేలు, ఎనిమిది టీ20లు ఆడాడు.ఇక ఐపీఎల్- 2022లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన సీన్ అబాట ఒక వికెట్ తీశాడు. చదవండి: IND VS ENG 5th Test: ఇంగ్లండ్తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్ అలీ View this post on Instagram A post shared by Sean Abbott (@sean_abbott) View this post on Instagram A post shared by Sean Abbott (@sean_abbott) -
ఫ్యాన్స్కు గుడ్న్యూస్! సర్జరీ విజయవంతం.. కోలుకుంటున్నా: రాహుల్
KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిమానులకు శుభవార్త! గాయంతో ఇన్నాళ్లు ఆటకు దూరమైన అతడు త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు మొదలుపెట్టినట్లు కేఎల్ రాహుల్ స్వయంగా వెల్లడించాడు. కాగా ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్కు సారథ్యం వహించిన రాహుల్.. తొలి సీజన్లోనే జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. బ్యాటర్గా, కెప్టెన్గా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. 15 ఇన్నింగ్స్లో 616 పరుగులు చేసి తాజా సీజన్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు రాహుల్. అయితే, ఆఖరి నిమిషంలో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో రిషభ్ పంత్ భారత జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టు నాటికైనా రాహుల్ కోలుకుంటాడనుకుంటే అలా జరుగలేదు. గతేడాది జరిగిన సిరీస్లో రెండో టాప్ స్కోరర్గా ఉన్న అతడు ఈ మ్యాచ్కు దూరం కావడంతో అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. కనీసం వన్డే, టీ20 సిరీస్కైనా అందుబాటులో ఉంటాడా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ట్విటర్ వేదికగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు. ‘‘అందరికీ హలో.. గత రెండు వారాలుగా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయితే, సర్జరీ విజయవంతంగా పూర్తైంది. ఇప్పుడు బాగున్నాను. కోలుకుంటున్నాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’’ అని రాహుల్ పేర్కొన్నాడు. కాగా రాహుల్కు జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగినట్లు సమాచారం. త్వరలోనే అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట అకాడమీకి చేరుకుని అక్కడే ఆరు నుంచి 12 వారాల పాటు శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక పొట్ట దిగువ భాగంలో(మృదువైన కణజాలం) తీవ్రమైన నొప్పి రావడాన్ని సాధారణంగా స్పోర్ట్స్ హెర్నియాగా వ్యవహరిస్తారు. చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" Hello everyone. It's been a tough couple of weeks but the surgery was successful. I'm healing and recovering well. My road to recovery has begun. Thank you for your messages and prayers. See you soon 🏏♥️ pic.twitter.com/eBjcQTV03z — K L Rahul (@klrahul) June 29, 2022 -
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు భలే ఛాన్స్.. ఇంగ్లండ్కు పయనం!
IPL 2022- Mumbai Indians: ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లకు ఆటను మెరుగుపరచుకునే మంచి అవకాశం దక్కింది. ఇంగ్లండ్లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్లతో మ్యాచ్లు ఆడేందుకు వీలుగా ఫ్రాంఛైజీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వారు మూడు వారాల పాటు యూకేలో గడుపనున్నారు. కాగా ఐపీఎల్-2022లో ముంబై దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. గతంలో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన రోహిత్ శర్మ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. అయితే, అరంగేట్ర ఆటగాళ్లు తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్ తదితరులు రాణించడం కాస్త ఊరటనిచ్చిన అంశం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎడిషన్కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఫ్రాంఛైజీ ఈ మేరకు యువ ఆటగాళ్లను ఇంగ్లండ్ టూర్కు పంపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి టాప్ కౌంటీ క్లబ్తో పోటీ పడేందుకు వీలుగా సుమారు 10 టీ20 మ్యాచ్లు ఆడించనున్నట్లు సమాచారం. వాళ్లందరికీ అవకాశం ఈ విషయాల గురించి ముంబై వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, రమణ్దీప్ సింగ్, హృతిక్ షోకీన్ తదితర యువ క్రికెటర్లకు టాప్ టీ20 క్లబ్లతో పోటీ పడే అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే అర్జున్ టెండుల్కర్ యూకే చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ సైతం వీరితో చేరునున్నాడు’’ అని పేర్కొన్నాయి. ఇక భారత్కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్లను మాత్రమే ఈ ట్రిప్నకు తీసుకువెళ్తున్నామని.. ఇది కమర్షియల్ టూర్ కాదని.. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్ స్కోరర్గా నిలిచి విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ట్రిప్లో భాగమైన ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జాబితా(అంచనా) ఎన్టీ తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకేన్, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ధి, రమణ్దీప్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, ఆర్యన్ జుయాల్, ఆకాశ్ మెధ్వాల్, అర్షద్ ఖాన్, అర్జున్ టెండుల్కర్, డెవాల్డ్ బ్రెవిస్. చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! "Talking to Sachin sir, Rohit bhai and Mahela gave me a lot of confidence." 💯 Tilak caps off an excellent debut season with this honest chat about what he learnt and where he has improved 💪#OneFamily #DilKholKe #MumbaiIndians @TilakV9 MI TV pic.twitter.com/Qc3nQeTZJs — Mumbai Indians (@mipaltan) May 26, 2022 -
T20 Captaincy: టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పించండి! అప్పుడే!
Rohit Sharma T20 Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడికి టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి సూచించాడు. అప్పుడు హిట్మ్యాన్పై భారం తగ్గి టెస్టు, వన్డేల్లో మరింత మెరుగ్గా కెప్టెన్సీ చేయగలడని అభిప్రాయపడ్డాడు. వరుస సిరీస్లు గెలిచి! కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో వరుస టీ20 సిరీస్లు గెలిచాడు. వన్డే సిరీస్లలోనూ విజయం సాధించాడు. అయితే, దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్కు ముందు గాయం కారణంగా రోహిత్ జట్టుకూ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఇంతవరకు టీమిండియా తరఫున పూర్తి స్థాయి కెప్టెన్గా బరిలోకి దిగలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో రీషెడ్యూల్డ్ టెస్టుతో సారథిగా తన ప్రయాణం ప్రారంభిస్తాడనుకున్నా కరోనా బారిన పడటం గమనార్హం. టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పించండి! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఘోర పరాభవం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఐదు సార్లు చాంపియన్ అయిన ఈ జట్టు తాజా సీజన్లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ టీ20 కెప్టెన్సీ గురించి సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు సెహ్వాగ్ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్కు గనుక కొత్త కెప్టెన్ ఫలానా వ్యక్తి అని భారత క్రికెట్ జట్టు యాజమాన్యం మదిలో ఎవరి పేరైనా ఉంటే.. కచ్చితంగా రోహిత్ శర్మను రిలీవ్ చేయాలి. తద్వారా.. ఒకటి.. రోహిత్పై పనిభారం తగ్గుతుంది. ముఖ్యంగా తన వయసు దృష్ట్యా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే.. రోహిత్కు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. తను పునరుత్తేజం పొందుతాడు. టెస్టులు, వన్డేల్లో మరింత దృష్టి సారించి జట్టును ముందుకు నడిపించగలుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? -
అతడి ఎంపిక సరైంది.. భారత్కు ఇప్పుడు అలాంటి ఆటగాడు అవసరం!
India Vs Ireland T20I Series: ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టులో దీపక్ హుడాను ఎంపిక చేయడం మంచి నిర్ణయమని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. లోయర్ ఆర్డర్లో భారత్కు ఇప్పుడు హుడా వంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2022లో అద్భుతంగా ఆకట్టుకున్న అతడు.. టీమిండియా తరఫున ఏ మేరకు రాణిస్తాడో చూడాలని ఉందన్నాడు. అద్భుతంగా రాణించినా! కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు దీపక్ హుడా. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ 14 ఇన్నింగ్స్లో కలిపి 451 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. మిడిలార్డర్లో కీలకంగా వ్యవహరించి లక్నో ప్లే ఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో హుడాకు జాతీయ జట్టులో చోటు దక్కుతుందని భావించినా మొండిచేయి ఎదురైంది. అయితే, కీలక ఆటగాళ్లు లేకుండా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమ్లో అతడు స్థానం సంపాదించుకున్నాడు. భారత్కు ఇలాంటి ఆటగాడి అవసరం ఉంది! ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐర్లాండ్తో సిరీస్లో హుడా రాణిస్తాడనే అనుకుంటున్నా. ఐపీఎల్లో దీపక్ హుడా తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. నిజానికి లోయర్ ఆర్డర్లో వచ్చి ఆకట్టుకునే ప్రదర్శన చేయడం కష్టం. అయితే, హుడా ఐపీఎల్లో ఈ కఠినతరమైన పనిని ఎంతో సులువుగా చేశాడు. టీమిండియాకు ఇప్పుడు ఇలాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. ఐపీఎల్లోనే కాదు భారత్ తరఫున కూడా అతడు అత్యుత్తమంగా రాణిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 26, 28 తేదీల్లో భారత్- ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. చదవండి: ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు పాకిస్తాన్లో సెకండ్ హ్యాండ్ దుస్తులు అమ్ముతూ! డబ్బు మీద ఆశలేదు కానీ! India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! -
Ranji Trophy: మూడు సెంచరీలు.. సంతోషం! ఆయన వల్లే ఇదంతా!
Ranji Trophy 2021- 2022: Mumbai- Yashasvi Jaiswal: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2021-22 సీజన్లో ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తమ జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్తో సెమీస్లో యశస్వి రెండు ఇన్నింగ్స్లో వరుసగా 100, 181 పరుగులు చేయడం విశేషం. తద్వారా ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు బాదిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు కూడా! ఇక మధ్యప్రదేశ్తో జరుగుతున్న ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్లో భాగంగా మరో శతకం బాదే అవకాశం చేజారినా యశస్వి.. 78 పరుగులతో రాణించాడు. ఇక ఈ 20 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్.. ఈ ఎడిషన్లో మొత్తంగా 497 పరుగులు చేయడం గమనార్హం. నాకు గర్వకారణం ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో యశస్వి జైశ్వాల్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్తో కలిసి పలు ఇన్నింగ్స్లో ఈ కుర్ర బ్యాటర్ ఓపెనింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీలో తన ప్రదర్శ, బట్లర్తో అనుబంధం గురించి బీసీసీఐ ఇంటర్వ్యూలో యశస్వి మాట్లాడాడు. యశస్వి జైశ్వాల్(PC: Yashasvi Jaiswal Twitter) ఈ మేరకు.. ‘‘మూడు సెంచరీలు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరో శతకం చేజారినా.. మరేం పర్లేదు. ఒక్కోసారి ఇలా జరుగుతుంది. నిజానికి ముంబై క్యాప్ ధరించగానే నేను ఎంతో అదృష్టవంతుడినన్న భావన కలుగుతుంది. ముంబైకి ఆడుతున్నామంటే ఎల్లప్పుడూ ఎంతో జాగరూకతతో ఉండాలి. మానసికంగా దృఢంగా ఉంటేనే సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగగలం. ముంబైకి ఆడటం నిజంగా నాకు గర్వకారణం’’అని యశస్వి చెప్పుకొచ్చాడు. ఆయన వల్లే ఇదంతా ఇక తన బ్యాటింగ్ మీద జోస్ బట్లర్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు నిజంగా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బంతిని చూస్తూ.. పరిస్థితులను అంచనా వేసుకుంటూ షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇవన్నీ ఏకకాలంలో జరిగిపోవాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాన్ని పొందగలం అని అన్నాడు. ఆయన టిప్స్ ఫాలో అవుతున్నాను’’ అని యశస్వి జైశ్వాల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో 10 ఇన్నింగ్స్లో 258 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు.. 68. చదవండి: Ranji Trophy 2022 FInal: 'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ What does it mean to play for Mumbai? 🤔 How does it feel to score runs in tons? 🤔 The @josbuttler impact 👍 Aman Khan interviews @ybj_19 as he sums up the Day 1 of the @Paytm #RanjiTrophy #Final. 👌 👌 - By @ameyatilak Full interview 🎥 🔽 #MPvMUM https://t.co/1xxSOsxoEE pic.twitter.com/sqv77EY0tW — BCCI Domestic (@BCCIdomestic) June 22, 2022 50*, 181, 100, 103 👏 Yashasvi Jaiswal just loves to bat. 😋💗#MPvMUM | 📸: @bccidomestic pic.twitter.com/n64y2yLazB — Rajasthan Royals (@rajasthanroyals) June 22, 2022 -
ఐపీఎల్లో రాణించినా పట్టించుకోలేదు.. ఇక నేను టీమిండియాకు ఆడటం కష్టమే..!
Wriddhiman Saha: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వెటరన్ వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహా తాను టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమని రాహుల్ ద్రవిడ్తో పాటు సెలెక్షన్ కమిటీ సభ్యుడొకరు ఇదివరకే తనతో స్పష్టం చేశారని, నేనే ఆటపై మమకారం చంపుకోలేక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తనను ఎంపిక చేస్తారని ఆశగా ఎదురుచూశానని వైరాగ్యంతో చెప్పుకొచ్చాడు. గడిచిన ఐపీఎల్ సీజన్లో తన పర్ఫామెన్స్ను కొలమానంగా తీసుకుని ఉంటే ఈ పాటికి టీమిండియాతో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఉండాల్సి ఉండిందని బాధను వెల్లగక్కాడు. యువకులతో పోటీపడి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా అవకాశం రాలేదంటే ఇక తాను టీమిండియాకు ఆటడం కష్టమేనని వాపోయాడు. కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని టెస్ట్లకు గుడ్బై చెప్పిన తర్వాత భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్గా ఉంటూ వచ్చిన సాహా, గతేడాది ఆడిలైడ్ టెస్టు తర్వాత వెనకబడ్డాడు. నాటి ఆస్ట్రేలియా సిరీస్లో రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి టెస్టుల్లో టీమిండియా ప్రధాన వికెట్ కీపర్గా మారాడు. తదనంతరం సాహా, టీమిండియాకు సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్గా మారిపోయాడు. పంత్ గాయం కారణంగా లేక విశ్రాంతి తీసుకున్న మ్యాచుల్లోనే సాహాకు అవకాశం దొరికేది. ఇలాంటి పరస్థితుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి నిమిషంలో గుజరాత్ టైటాన్స్లో భాగమైన సాహా తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని 11 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీల సాయంతో 31.70 సగటున 317 పరుగులు చేశాడు. ఇదే ప్రదర్శన ఆధారంగా తనను టీమిండియాకు ఎంపిక చేస్తారని సాహా ఆతృతగా ఎదురుచూశాడు. అయితే సెలెక్టర్లు మాత్రం అతనికి మరోసారి మొండి చేయి చూపించారు. చదవండి: త్రిపుర జట్టుకు మెంటార్గా వృద్ధిమాన్ సాహా..! -
నేను ఆడిన కెప్టెన్లలో అతడే అత్యుత్తమం: యష్ దయాల్
గుజరాత్ టైటాన్స్ పేసర్ యష్ దయాల్ తమ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఇప్పటి వరకు ఆడిన కెప్టెన్లలో పాండ్యానే అత్యుత్తమ సారథని అని యష్ దయాల్ తెలిపాడు. కాగా ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా ఎంపికయ్యాడు. అదే విధంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా హార్ధిక్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్స్గా నిలిపి హార్ధిక్ చరిత్ర సృష్టించాడు. “హార్దిక్ పాండ్యా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మ్యాచ్లో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అతడికి బాగా తెలుసు. మనపై మనకు నమ్మకం ఉంటే అతడు మనల్ని స్వంత నిర్ణయాలు తీసుకునేలా సపోర్ట్ చేస్తాడు. అది బౌలర్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇప్పటి వరకు ఆడిన కెప్టెన్లలో పాండ్యానే అత్యుత్తమ కెప్టెన్. అదే విధంగా ఆశిష్ నెహ్రా నాకు మొదటి నుంచి చాలా మద్దతుగా నిలిచాడు. టోర్నీ ఆరంభానికి ముందు నా బౌలింగ్లో రకరకాల ప్రయోగాలు చేసేవాడిని. కానీ ఆశిష్ సర్ నాకు ఒక సలహా ఇచ్చారు. మొదట ఓపెనర్లుకు ఒక విధంగా, డెత్ ఓవర్లలో సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయమని చెప్పారు" అని యష్ దయాల్ పేర్కొన్నాడు. చదవండి: William Porterfield Retirement: ఆటకు గుడ్బై చెప్పిన ఐర్లాండ్ మూలస్థంభం -
ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు.. దటీజ్ తిలక్ వర్మ
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ఒక జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం క్రికెట్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. సీజన్లో 14 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టుగా విఫలమైనా.. ఒకరిద్దరు మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. అందులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లను మినహాయిస్తే మరొకరు తెలుగుతేజం తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. డెబ్యూ సీజన్లోనే అదరగొట్టే ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్లాడిన తిలక్ వర్మ 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. తిలక్ వర్మ ఆటతీరుపై రోహిత్ శర్మ సహా ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే ప్రశంసల వర్షం కురిపించారు. అతను ఆడుతున్నది డెబ్యూ సీజన్ అయినప్పటికి.. ఐదు, ఆరు సీజన్ల అనుభవం తిలక్లో కనిపించిందని పేర్కొన్నారు. కాగా ముంబై ఇండియన్స్ తిలక్వర్మను రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తిలక్ వర్మ.. టోర్నీ ద్వారా తనకు వచ్చిన రూ. 1.70 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా తండ్రికే మొత్తం డబ్బును అందజేశాడు. ఈ విషయాన్ని తిలక్ వర్మ ది వీక్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''నా బుర్రలో ఆట తప్ప ఇంకేం ఆలోచనలు రానివ్వను. ఐపీఎల్ ద్వారా నేను పొందిన మొత్తాన్ని నా తండ్రికి ఇచ్చేశాను. ఏ వ్యక్తి అయినా డబ్బుకు దాసోహం అవ్వడం సహజం. అందుకే డబ్బు ఉంచుకోవడం ద్వారా వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. మా నాన్నకు డబ్బు ఇస్తూ.. 'ప్లీజ్ నన్ను వాటికి కాస్త దూరంగా ఉంచండి' అని'' పేర్కొన్నా అంటూ తెలిపాడు. ఒక ఎలక్ట్రిషియన్ కొడుకుగా ఎదిగిన తిలక్ వర్మ చిన్నప్పటి నుంచి దుబారా ఖర్చులు చేయడం అలవాటు చేసుకోలేదు. అందుకే తాను సంపాదించిన ప్రతీ రూపాయిని ఇప్పటికి తండ్రికే ఇవ్వడం అలవాటు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు..''తిలక్ వర్మ లాంటి వాళ్లు ఇంకా ఉన్నారా.. తండ్రి చాటు తనయుడు.. కష్టం అంటే ఏంటో తెలిసిన కుర్రాడు తిలక్ వర్మ'' అని పొగడ్తలతో ముంచెత్తారు. చదవండి: ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్ ఐపీఎల్లో తెలుగుతేజం తిలక్ వర్మ కొత్త చరిత్ర -
ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్ హిట్టర్.. వీడియో వైరల్!
IPL 2022- Andre Russell: ‘‘పెద్ద పెద్ద కలలు కనాలి! అయితే, కఠిన శ్రమతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే వాటిని నిజం చేసుకోగలం. ఆ దేవుడు మంచివాడు! అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను’’ అంటూ వెస్టిండీస్ హిట్టర్, కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ తాను కారు కొన్న విషయాన్ని వెల్లడించాడు. తన పట్టుదల, కృషితో కలలను సాకారం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 నేపథ్యంలో కేకేఆర్ రసెల్ను 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్లో అతడు 12 ఇన్నింగ్స్లో 335 పరుగులు(అత్యధిక స్కోరు 70 నాటౌట్) చేసి ఆకట్టుకున్నాడు. ఇక 13 ఇన్నింగ్స్లో కలిపి 17 వికెట్లు పడగొట్టి తనకు వెచ్చించిన ధరకు న్యాయం చేశాడు ఈ ఆల్రౌండర్. ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ ముగింపు నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న రసెల్ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఏమ్జీ(Mercedes-Benz AMG) కారును కొన్నాడు. కారులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆనందం పంచుకున్నాడు. ఇందుకు స్పందించిన క్రిస్ గేల్, డారెన్ సమీ, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఈ ఆల్రౌండర్కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రసెల్ కొన్న ఈ స్టైలిష్ కారు విలువ సుమారు 2 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్-2021 తర్వాత జాతీయ జట్టుకు దూరమైన ఆండ్రీ రసెల్.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన విండీస్ జట్టులో లేకపోవడం గమనార్హం. చదవండి: Mohsin Khan: ‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దుతా’ View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) -
‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దుతా’
IPL 2022: ఐపీఎల్-2022 సీజన్లో పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు ఉత్తరప్రదేశ్కు చెందిన యువ క్రికెటర్ మొహసిన్ ఖాన్. కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు 6 కంటే తక్కువ ఎకానమీ (5.96)తో రెండో స్థానంలో కేవలం 14.07 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. మొహసిన్ సత్తా ఏమిటో అర్థం చేసుకోవడానికి ఈ గణాంకాలు చాలు. ఇలా అవకాశం వచ్చిన ఆరంభ సీజన్లోనే తానేంటో నిరూపించుకుని పలువురి దృష్టిని ఆకర్షించాడు. ఈ జాబితాలో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఉన్నాడు. మొహసిన్ ప్రతిభకు షమీ ఫిదా అయినట్లు అతడి కోచ్ బరుద్దీన్ సిద్ధిఖి పేర్కొన్నాడు. ఐపీఎల్ మెగా వేలం-2022 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘వేలం జరుగుతున్న సమయంలో నేను షమీతో పాటే అతడి ఫామ్హౌజ్లో ఉన్నాను. షమీ సెలక్ట్ అయినట్లు తెలిసింది. అలాగే మొహసిన్ను కూడా లక్నో కొనుగోలు చేసింది. ఈ విషయం తెలియగానే.. ‘‘నాకొక నాలుగు నెలల సమయం ఇవ్వండి. మొహసిన్ను ఇండియాలోనే అత్యుత్తమ ఆల్రౌండర్గా తీర్చిదిద్దుతా. నిజానికి తను చాలా మంచి బ్యాటర్. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లు ఆడతాడని కేఎల్ రాహుల్ సైతం నాతో అన్నాడు’’ అని షమీ నాతో చెప్పాడు’’ అని సిద్ధిఖి స్పోర్ట్స్ యారీతో వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో షమీ ఎల్లప్పుడూ ముందుంటాడని ప్రశంసించాడు. కాగా సిద్ధిఖి గతంలో షమీతో కలిసి పనిచేశాడు. ఇక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అయిన మొహసిన్కు ఎప్పుడు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 2018 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన 2019లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే, ఆడే అవకాశం మాత్రం రాలేదు. మెగా వేలం 2022లో ఈ లెఫ్టార్మ్ బౌలర్ను లక్నో 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆరంభ మ్యాచ్లలో అవకాశం ఇవ్వకపోయినా కొన్ని కీలక మ్యాచ్లలో అదరగొట్టి 23 ఏళ్ల మొహసిన్ ఖాన్ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించిన షమీ.. జట్టును చాంపియన్గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Hardik Pandya: ఎన్నెన్ని మాటలు అన్నారో.. అదో పెద్ద యుద్ధం.. ఎన్ని త్యాగాలు చేశానో ఎవరికీ తెలియదు! ENG vs NZ: డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్ గ్లాస్లో పడ్డ బంతి.. వీడియో వైరల్! An elated dugout as @LucknowIPL win by 6 runs against #DelhiCapitals.#TATAIPL #DCvLSG pic.twitter.com/EVagwBHHVA — IndianPremierLeague (@IPL) May 1, 2022 -
Ind Vs SA: అదో పెద్ద యుద్ధం.. ఎన్ని త్యాగాలు చేశానో ఎవరికీ తెలియదు!
India Vs South Afrcia T20 Series: ‘‘నా పునరాగమనానికి ముందు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో తెలుసు. అయితే, ఆ విమర్శలకు సమాధానం ఇవ్వడం నా పని కాదు. కేవలం నా ఆట, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాను. ఆరు నెలల సెలవు కాలంలో నేను ఎంతగా కష్టపడ్డానో ఎవరికీ తెలియదు’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. తన రీ ఎంట్రీ వెనుక కఠిన శ్రమ దాగి ఉందని పేర్కొన్నాడు. గడ్డు పరిస్థితులు దాటుకుని.. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత ఐపీఎల్-2022 ఆరంభం వరకు హార్దిక్ పాండ్యా మైదానంలో దిగలేదన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ గత సీజన్, వరల్డ్కప్ టోర్నీలో వైఫల్యం తర్వాత అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక పాండ్యా పని అయిపోయింది అంటూ పలువురు విశ్లేషకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, పాండ్యా మాత్రం సైలెంట్గా జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఫిట్నెస్పై దృష్టి సారించి విజయవంతమయ్యాడు. ఈ క్రంమలో ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్గా నియమించుకోవడంతో అతడి దశ తిరిగింది. చాంపియన్గా నిలిపి.. సగర్వంగా సారథిగా గత అనుభవం లేకున్నా గుజరాత్ను ముందుకు నడిపించడంలో పాండ్యా సఫలమయ్యాడు. ఆటగాడిగా, కెప్టెన్గా ఆకట్టుకుని తొలి సీజన్లోనే జట్టును ఏకంగా టైటిల్ విజేతగా నిలిపాడు. దీంతో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్తో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులతో అజేయగా నిలిచాడు. ఒక ఓవర్ బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో కటక్ వేదికగా జరిగే రెండో టీ20కి సన్నద్ధమవుతున్నాడు. నాకు తెలిసింది అదే.. ఉప్పొంగిపోవడం లేదు.. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘రోజూ తెల్లవారు జామున 5 గంటలకే నిద్ర లేచేవాడిని. ట్రెయినింగ్ సెషన్లో ఉన్నా తగినంత విశ్రాంతి తీసుకునేలా జాగ్రత్తపడేవాడిని. ఆ నాలుగు నెలల పాటు రాత్రి తొమ్మిదిన్నరకే నిద్రపోయేవాడిని. ఎన్నెన్నో త్యాగాలు చేశాను. ఐపీఎల్ ఆరంభానికి ముందు నాతో నేను పెద్ద యుద్ధమే చేశానని చెప్పవచ్చు. అయితే, అందుకు తగ్గ ఫలితాలు రావడంతో పూర్తి సంతృప్తిగా ఉన్నా. వీటి కోసం నేను ఎంత కఠిన శ్రమకోర్చానో నాకే తెలుసు. నాకు మొదటి నుంచి కష్టపడటం అలవాటే.. ఫలితాల గురించి పెద్ద ఆలోచించేవాడిని కాదు. నిజాయితీగా నా పని చేసుకున్నా. అందుకే ఈ విజయాలకు ఉప్పొంగిపోవడం లేదు. ఈ క్షణం ఎలా ఉంది? తర్వాత ఏమవుతుందో తెలియదు కదా! ఏదైనా ఒక్క రోజు, ఒక్క క్షణాకి సంబంధించి కాదు.. ప్రయాణం ఎలా కొనసాగుతుందన్నదే అసలు విషయం’’ అని ఉద్వేగానికి గురయ్యాడు. ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్న హార్దిక్ పాండ్యా.. అక్కడ తనను తాను నిరూపించుకుంటాననని చెప్పుకొచ్చాడు. చదవండి: టీ20 ప్రపంచకప్కు ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేయద్దు: రవిశాస్త్రి From emotions on making a comeback to #TeamIndia and #TATAIPL triumph to goals for the future. 👏 👍 DO NOT MISS as @hardikpandya7 discusses this and more. 👌 👌 Full interview 🎥 🔽 #INDvSA | @Paytm https://t.co/2q8kGRpyij pic.twitter.com/BS2zvnxbpP — BCCI (@BCCI) June 11, 2022 -
'అతడు టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అవుతాడు'
టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్కు భారత జట్టులో కార్తీక్కు కచ్చితంగా చోటు దక్కుతందని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఐపీఎల్-2022లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కార్తీక్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్నటీ20 సిరీస్లో టీమిండియాలో భాగంగా ఉన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ తరపున ఆడిన కార్తీక్.. జట్టుకు అత్యుత్తమ ఫినిషర్గా మారాడు. 16 మ్యాచ్లు ఆడిన డీకే 330 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. "కార్తీక్కు టీ20 ప్రపంచకప్కు భారత జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నాను. అతడు ఐదు లేదా ఆరో స్థానంలో అత్యుత్తమంగా బ్యాటింగ్ చేయగలడు. ఈ ఏడాది ఆర్సీబీ తరపున కార్తీక్ మ్యాచ్లు ఫినిష్ చేసిన విధానం అద్భుతమైనది. సీజన్ అంతటా కార్తీక్ మెరుగైన ప్రదర్శన చేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్లో కూడా కార్తీక్ టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ పాత్ర పోషిస్తాడని నేను అశిస్తున్నా" అని పేర్కొన్నాడు. చదవండి: టీ20 ప్రపంచకప్కు ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేయవద్దు: రవిశాస్త్రి -
అక్కడ ఉంది నేను కాదు.. డీకే కదా.. హార్దిక్ సింగిల్ తీయాల్సింది!
ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్ అఖరి ఓవర్లో హార్ధిక్ పాండ్యా తీరు కాస్త విడ్డూరంగా అనిపించింది. సింగిల్ తీయడానికి వీలున్నప్పటికీ దినేష్ కార్తీక్కు స్ట్రైక్ ఇవ్వకుండా హార్ధిక్ తిరష్కరించాడు. ఈ క్రమంలో హార్ధిక్ తీరుపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. కాగా తాజాగా ఈ ఘటనపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. అఖరి ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసి పాండ్యా దినేష్ కార్తీక్కు స్ట్రైక్ ఇచ్చి ఉండాల్సిందని భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. "చివరి ఓవర్లో పాండ్యా సింగిల్ తీసి ఉండాల్సింది. మరో ఎండ్లో దినేష్ కార్తీక్ ఉన్నాడు. అక్కడ ఉన్నది నేను కాదు కదా" అని ఆశిష్ నెహ్రా చమత్కరించాడు ఏం జరిగిదంటే.. భారత ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన నార్జే బౌలింగ్లో తొలి బంతికే కెప్టెన్ రిషబ్ పంత్ పెవిలియన్కు చేరాడు. అనంతరం దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. కార్తీక్ ఆడిన తొలి బంతికి ఎటువంటి పరుగు రాలేదు. ఇక మూడో బంతికి సింగిల్ తీసి హార్ధిక్కు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి లాంగ్ ఆఫ్ దిశగా పాండ్యా భారీ సిక్స్ బాదాడు. అయితే ఐదో బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని హార్ధిక్ తిరష్కరించాడు. ఇక ఇరో బంతికి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన హార్ధిక్.. కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు.. ఐపీఎల్-2022లో ఆర్సీబీ బెస్ట్ ఫినిషర్ ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీకు కార్తీక్ అత్యుత్తమ ఫినిషర్గా మారాడు. చాలా మ్యాచ్ల్లో తన అద్భుత ఇన్నింగ్స్లతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 16 మ్యాచ్లు ఆడిన కార్తీక్ 330 పరుగులు సాధించాడు. చదవండి: Hari Nishaanth: ఘనంగా యువ క్రికెటర్ పెళ్లి.. ‘సూపర్ కపుల్’ అంటూ సీఎస్కే విషెస్! pic.twitter.com/kzuyHH5Gpq — RohitKohliDhoni (@RohitKohliDhoni) June 9, 2022 -
Hari Nishaanth: ఘనంగా యువ క్రికెటర్ పెళ్లి.. సీఎస్కే విషెస్!
Hari Nishaanth Wedding: ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్, తమిళనాడు ఆటగాడు సి. హరి నిషాంత్ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. ఇరవై ఐదేళ్ల ఈ యువ ప్లేయర్ గురువారం(జూన్ 9) మనసుకు నచ్చిన అమ్మాయిని మనువాడాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ హరి నిషాంత్కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. హరి పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలను పోస్ట్ చేస్తూ.. ‘‘హరి వివాహం జరిగింది. మిమ్మల్ని మేము సూపర్ కపుల్ అని పిలుస్తాం’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ క్రమంలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Hari got hitched! 😍 Here's to the one where we pronounce you “Super Couple!“ 🥳💛#WhistlePodu #Yellove 🦁 @harinishaanth16 pic.twitter.com/J8uh9BVrbh — Chennai Super Kings (@ChennaiIPL) June 10, 2022 దేశవాళీ టోర్నీలో అదరగొట్టి.. తమిళనాడుకు చెందిన హరి నిషాంత్ దేశవాళీ టోర్నీల్లో ఆ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2019లో టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్.. 2021 సీజన్లో 246 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో 35 పరుగులు చేసి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో చెన్నై ఫ్రాంఛైజీ దృష్టిని ఆకర్షించిన హరి నిషాంత్ను ఐపీఎల్-2021 వేలం సందర్భంగా సొంతం చేసుకుంది. అయితే, ఇంత వరకు అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్ తాజా సీజన్కు ముందు 20 లక్షల కనీస ధరతో అతడి మళ్లీ కొనుగోలు చేసింది. కాగా ఐపీఎల్-2022లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైకి అస్సలు కలిసి రాలేదన్న సంగతి తెలిసిందే. తొలుత రవీంద్ర జడేజాను కెప్టెన్గా నియమించగా వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో మరోసారి ఎంఎస్ ధోనికే పగ్గాలు అప్పజెప్పారు. ఈ క్రమంలో పద్నాలుగింట కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చదవండి: IND vs SA: 'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి' -
ఐపీఎల్లో దుమ్ము లేపాడు.. ఇక్కడా అదరగొట్టాడు! మొత్తంగా 235 క్యాచ్లు!
India Vs South Africa T20 Series: దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ శుక్రవారం(జూన్ 10) 33వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రొటిస్ జట్టు భారత పర్యటనలో భాగంగా గురువారం నాటి తొలి టీ20 విజయంలో మిల్లర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 31 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. హ్యాపీ బర్త్డే మిల్లర్.. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి అంటూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా అతడిని విష్ చేసింది. కాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కీలక మ్యాచ్లలో జట్టును విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ ఫ్రాంఛైజీ ట్విటర్ వేదికగా అతడికి శుభాకాంక్షలు తెలిపింది. రాజస్తాన్ రాయల్స్ సైతం అతడిని విష్ చేసింది. అలా మొదలై.. దక్షిణాఫ్రికాలోని నాటల్లో 1989, జూన్ 10న జన్మించిన డేవిడ్ మిల్లర్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వెస్టిండీస్తో టీ20 మ్యాచ్(మే 20)తో అరంగేట్రం చేసిన ఈ ప్రొటిస్ ఆటగాడు.. ఆ తర్వాత రెండ్రోజులకే వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి స్ట్రైకు రేటు 100కు పైగా ఉండటం విశేషం. అయితే, 12 ఏళ్లయినా ఈ హిట్టర్కు టెస్టు జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఉత్తమ బ్యాటర్.. అత్యుత్తమ ఫీల్డర్.. ఇక బ్యాటర్గానే కాకుండా మైదానంలో పాదరసంలా వేగంగా కదిలే ఫీల్డర్గానూ మిల్లర్కు పేరుంది. ఇప్పటి వరకు 96 టీ20 మ్యాచ్లు ఆడిన అతడు 70 క్యాచ్లు పట్టాడు. ఓవరాల్గా పొట్టి ఫార్మాట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన క్రికెటర్గా అతడు రికార్డుకెక్కాడు. ఇక మొత్తంగా 378 మ్యాచ్లలో కలిపి మిల్లర్ అందుకున్న క్యాచ్ల సంఖ్య 235. వెస్టిండీస్ ఆటగాళ్లు కీరన్ పొలార్డ్(595 మ్యాచ్లలో 325 క్యాచ్లు), డ్వేన్ బ్రావో(534 మ్యాచ్లలో 252 క్యాచ్లు) అత్యధిక క్యాచ్లు అందుకున్న జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. నాలుగో స్థానంలో.. ఐపీఎల్-2022లో అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ డేవిడ్ 16 ఇన్నింగ్స్లో 481 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 94 నాటౌట్. అర్ధ శతకాలు 2. బాదిన బౌండరీలు 32. కొట్టిన సిక్సర్లు 23. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానం. ట్రోఫీ గెలిచిన జట్టులో మిల్లర్ సభ్యుడు. చదవండి: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే.. అయితే: పంత్ Rishabh Pant: అయ్యో పంత్! ఒకే మ్యాచ్లో.. అరుదైన ఘనత.. అప్రదిష్ట కూడా! Here’s hoping aapda @DavidMillerSA12 bhai starts the year ahead the way he finished it - in style 😎 pic.twitter.com/dl7voRcO4F — Gujarat Titans (@gujarat_titans) June 10, 2022 Happy birthday, Killer Miller. 😁💗#RoyalsFamily | @DavidMillerSA12 pic.twitter.com/gotrxzBIMr — Rajasthan Royals (@rajasthanroyals) June 10, 2022 The celebrations continue for David Miller 🥳 Happy Birthday and have a smashing day 🎂 pic.twitter.com/iBSzigccuN — Cricket South Africa (@OfficialCSA) June 10, 2022 -
Ind Vs SA T20: నాడు ‘బెస్ట్ ఫినిషర్’ ధోని ‘జీరో’.. డీకే సూపర్ షో! ఇప్పుడు కూడా
India Vs South Africa 2022 T20 Series: డిసెంబరు 1.. 2006.. దక్షిణాఫ్రికాతో టీమిండియా మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్.. వేదిక జొహన్నస్బర్గ్లోని ది వాండరర్స్ స్టేడియం.. టాస్ గెలిచిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గ్రేమ్ స్మిత్, లూట్స్ బోస్మన్ వరుసగా 16, 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. వన్డైన్లో వచ్చిన హర్షల్ గిబ్స్ సైతం 7 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత వరుసగా ఏబీ డివిల్లియర్స్ 6, ఆల్బీ మోర్కెల్ 27, జొహన్ వాన్ డెర్వాత 21, రాబిన్ పీటర్సన్ 8, టైరన్ హెండర్సన్ 0, రోజర్ 5(నాటౌట్), చార్ల్ 0(నాటౌట్) పరుగులు చేశారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్కు రెండు, శ్రీశాంత్కు ఒకటి, అజిత్ అగార్కర్కు రెండు, హర్భజన్కు ఒకటి.. అదే విధంగా సచిన్ టెండుల్కర్కు ఒక వికెట్ దక్కాయి. దినేశ్ మోంగియా అభయమిచ్చాడు! ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ 34 పరుగులతో శుభారంభం అందించగా సచిన్ టెండుల్కర్ 10 పరుగులకే వెనుదిరిగాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన దినేశ్ మోంగియా 38 పరుగులు సాధించి విజయంపై విశ్వాసం పెంచాడు. అయితే అతడు ఈ స్కోరు నమోదు చేయడానికి 45 బంతులు తీసుకోవడం గమనార్హం. దినేశ్ కార్తిక్ ఫినిష్ చేశాడు! ఇక తర్వాత బ్యాటింగ్కు దిగిన ఎంఎస్ ధోని డకౌట్గా వెనుదిరగడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. అంతలో నేనున్నానంటూ దినేశ్ కార్తిక్ ధైర్యం నింపాడు. 28 బంతుల్లో 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. డీకేకు మరో ఎండ్లో సురేశ్ రైనా(3- నాటౌట్) సహకరించడంతో కేవలం ఒకే ఒక్క బంతి మిగిలి ఉండగా గెలుపు భారత్ సొంతమైంది. ఆ మ్యాచ్లో సెహ్వాగ్ సేన ప్రొటిస్ జట్టుపై విజయం సాధించింది. సుమారు 16 ఏళ్ల క్రితం నాటి ఈ మ్యాచ్లో దినేశ్ కార్తిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన దినేశ్ కార్తిక్ ఇలాగే అద్భుతమైన ఫినిషింగ్ టచ్తో కీలక సమయాల్లో జట్టుకు ఉపయోగపడ్డాడు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో డీకే అదరగొట్టాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అతడు 8 బంతుల్లోనే ఒక ఫోర్, 4 సిక్సర్ల సాయంతో 30 పరుగులు సాధించి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తద్వారా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఐపీఎల్లో ఆకట్టుకుని తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు నిదహాస్ ట్రోఫీ మ్యాచ్ హీరో. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జూన్ 9 నాటి తొలి మ్యాచ్లో డీకే తుది జట్టులో స్థానం సంపాదించడం ఖాయంగానే కనిపిస్తోంది. ధోని స్కోరు అప్పుడు జీరో.. డీకే హీరో! ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్సీబీ డీకేను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రొటిస్ జట్టుతో భారత్ మొదటి టీ20 విజయంలో అతడు ముఖ్య భూమిక పోషించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘2006లో దక్షిణాఫ్రికాతో టీమిండియా మొదటి టీ20.. ఈ మ్యాచ్లోభారత్ విజయంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. మన డీకేది కీలక పాత్ర. ఈరోజు కూడా అదే పునరావృతం కాబోతుంది! ఇంకా ఎదురుచూడటం మా వల్ల కాదు’’ అంటూ నాటి ఫొటోలు పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ‘వారెవ్వా డీకే.. నువ్వు సూపర్! ఆనాటి మ్యాచ్లో బెస్ట్ ఫినిషర్ ధోని ‘జీరో’.. ఇప్పటి ఫినిషర్ డీకే 31 నాటౌట్.. బాగుంది.. ఈరోజు కూడా నువ్వు బాగా ఆడాలి భయ్యా’’ అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: KL Rahul-Rishabh Pant: జీర్ణించుకోలేకపోతున్నా.. రాహుల్ భావోద్వేగం! పంత్ ఏమన్నాడంటే! PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..! We have a challenge ahead of us against a strong South African side: #TeamIndia Head Coach Rahul Dravid 💪#INDvSA | @Paytm pic.twitter.com/AFaZ2XTuNn — BCCI (@BCCI) June 7, 2022 M. O. O. D in the camp ahead of the #INDvSA T20I series. ☺️ 👌#TeamIndia | @Paytm pic.twitter.com/ZMB1XEvU7I — BCCI (@BCCI) June 7, 2022 #Throwback to 2006, when Team India played their first T20I, against South Africa. A Man of the Match performance from our very own DK helped the Men in Blue secure their first T20I win. 👏🥇 We go again tonight! CAN NOT WAIT!#PlayBold #WeAreChallengers #ನಮ್ಮRCB #INDvSA pic.twitter.com/aiVVdtTHAh — Royal Challengers Bangalore (@RCBTweets) June 9, 2022 -
టీమిండియాకు ఎంపికవుతానని ఆయన ముందే చెప్పారు!
India Vs South Africa 2022 T20 Series: టీమిండియాలో చోటు దక్కడం పట్ల కశ్మీర్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ సంతోషం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న తన కల నెరవేరిందని, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్బౌలర్గా స్థానం సంపాదించిన ఉమ్రాన్ మాలిక్.. తుదిజట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తన స్పీడ్తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ సన్రైజర్స్లో కీలక బౌలర్గా ఎదిగాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. క్రీడా, రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనన్ను భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రాక్టీసు సెషన్లో భాగంగా ఉమ్రాన్ మాలిక్ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ‘‘నాకు 2022 పూర్తిస్థాయి ఐపీఎల్ సీజన్. 14 మ్యాచ్లు ఆడి 22 వికెట్లు తీశాను. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాను. టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలన్న నా కల నెరవేరింది. మొదటి రోజు ట్రెయినింగ్ నుంచే నేను పూర్తి ఉత్సుకతో ఉన్నాను. బాగా బౌలింగ్ చేస్తాననే అనుకుంటున్నా. జట్టులో చేరే ముందే నేను ఎంతో మంది ప్రేమకు పాత్రుడినయ్యాను. ఇక్కడ ప్రతి ఒక్కరు నన్ను తమ సోదరుడిలా భావిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇక సన్రైజర్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్తో అనుబంధం గుర్తు చేసుకుంటూ.. ‘‘జాతీయ జట్టు నుంచి నాకు పిలుపు వచ్చినపుడు ఎస్ఆర్హెచ్ టీమ్ బస్సులో డేల్ సర్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు నాకు శుభాకాంక్షలు చెబుతుంటే.. ఆయన మాత్రం.. ‘‘నువ్వు కచ్చితంగా టీమిండియాకు ఎంపికవుతావని ఐపీఎల్ ఆరంభానికి ముందే చెప్పాను కదా’’ అని సంతోషం వ్యక్తం చేశారు’’ అని ఉమ్రాన్ మాలిక్ పేర్కొన్నాడు. చదవండి: Mithali Raj: రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్... భావోద్వేగ నోట్తో వీడ్కోలు Ind Vs SA: పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా! 💬 💬 "A dream come true moment to get India call up." Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 - By @28anand Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl — BCCI (@BCCI) June 8, 2022 -
ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదు.. అక్కడ మాత్రం దుమ్ము రేపాడు!
నెదర్లాండ్స్తో జరిగిన వన్డే సిరీస్ను వెస్టిండీస్ 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో విండీస్ ఆల్రౌండర్ కైల్ మైర్స్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు అతడికి కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఇక నెదర్లాండ్స్తో జరిగిన మూడో వన్డేలో మాత్రం మైర్స్ సెంచరీతో చెలరేగాడు. ఇది అతడి కెరీర్లో తొలి సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్లో 106 బంతులు ఎదర్కొన్న మైర్స్ 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అతడు 142 పరుగులతో పాటు మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్-2022 మెగా వేలంలో మైర్స్ను రూ.50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్లో ఒక్క మ్యాచ్లో కూడా మైర్స్ అవకాశం దక్కలేదు. సీజన్ మొత్తం బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే తాజాగా అతడిని అభినందిస్తూ.. లక్నో సూపర్ జెయింట్స్ ట్వీట్ చేసింది. ఇక లక్నో ట్వీట్పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. "అతడు విధ్వంసకర ఆల్రౌండర్.. ఒక్క మ్యాచ్లోనైనా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అరంగేట్ర సీజన్లోనే లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్కు చేరిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022-Harshal Patel: డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం Superb performance from the big man! Congratulations @kyle_mayerson a smashing maiden ODI century and taking a wicket against the Netherlands during the 3rd ODI. #AbApniBaariHai💪 #IPL2022 🏆 #bhaukaalmachadenge #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/DVdJM5GTJV — Lucknow Super Giants (@LucknowIPL) June 6, 2022 Shamarh Brooks and @kyle_mayers talk us through their experience batting together in the third ODI against @KNCBcricket #MenInMaroon 🏏🌴 pic.twitter.com/iejsOlXn8T — Windies Cricket (@windiescricket) June 6, 2022 -
యార్కర్లతో అదరగొట్టిన అర్ష్దీప్ సింగ్.. పాపం ఉమ్రాన్ మాలిక్..!
ఐపీఎల్ అదరగొట్టిన యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్,అర్ష్దీప్ సింగ్ దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కు భారత జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్ 9న జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్లో బీజీ బీజీగా గడుపుతోంది. తొలి టీ20కు ముందు భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్ను నిర్వహించాడు. కాగా నెట్స్లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. First practice session ✅ Snapshots from #TeamIndia's training at the Arun Jaitley Stadium, Delhi. 👍 👍 #INDvSA | @Paytm pic.twitter.com/6v0Ik5nydJ — BCCI (@BCCI) June 6, 2022 అయితే నెట్స్లో ఉమ్రాన్పై అర్ష్దీప్ పై చేయి సాధించాడు. అద్బుతమైన యార్కర్లతో అర్ష్దీప్ అదరగొట్టాడు. కాగా ఉమ్రాన్ నెట్స్లో రిషబ్ పంత్కు బౌలింగ్ చేశాడు. అయితే ఉమ్రాన్ బౌలింగ్లో ఒక్క బంతిని కూడా పంత్ విడిచి పెట్టలేదు. ఉమ్రాన్ చాలా ఎక్కువ పేస్తో బౌలింగ్ చేయడం వల్ల పంత్ సులభంగా ఎదర్కొన్నాడు. ఇక వీరిద్దరుతో పాటు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. అదే విధంగా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తీక్ కూడా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. టీమిండియా నెట్ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: Ind Vs SA T20I Series: ప్రొటిస్తో టీ20 సిరీస్.. ప్రాక్టీసులో తలమునకలైన టీమిండియా Back in Blue - Prep mode 🔛#TeamIndia begin training in Delhi ahead of the 1st T20I against South Africa.@Paytm #INDvSA pic.twitter.com/kOr8jsGJwL — BCCI (@BCCI) June 6, 2022 Arshdeep Singh's special yorker simulation training under bowling coach Paras Mhambrey's guidance ahead of South Africa series pic.twitter.com/ChvHH2pxyU — Aritra Mukherjee (@aritram029) June 6, 2022 -
MS Dhoni: 'ధోని కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా'
తన అంతర్జాతీయ అరంగేట్ర రోజుల్లో టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోని ఎంతో మద్దతుగా నిలిచాడని భారత స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా చెప్పాడు. కాగా ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా ధోని తీర్చిదిద్దాడు. ధోని సారథ్యంలో 2016లో భారత తరపున హార్ధిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న పాండ్యా.. ‘‘నేను భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు సురేష్ రైనా, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్లో నేను కాస్త ఒత్తిడిని ఎదర్కొన్నాను. నేను వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాను. ఇక ఆ మ్యాచ్లో అదే నా చివరి ఓవర్ కావచ్చు అని నేను భావించాను. అయితే మహి భాయ్ నాపై నమ్మకంతో మరో రెండు ఓవర్లు వేసే అవకాశం ఇచ్చాడు. ఈ మ్యాచ్లో నేను వేసిన మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాను. సదరు సిరీస్ ముగిసిన తర్వాత ప్రపంచకప్ జట్టులో ఉంటావంటూ ధోని చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఎందుకంటే అప్పటికీ అది నా మూడో అంతర్జాతీయ మ్యాచ్. నిజంగా ధోని కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని ఎస్జీటీవీ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్ధిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ 20 సిరీస్కు భారత జట్టులో హార్ధిక్ చోటు దక్కించుకున్నాడు. ఇక ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన కొత్త జుట్టకు సారథ్యం వహించిన హార్దిక్ తొలి సీజన్లోనే టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. సీజన్ ఆరంభంలో ధోని కెప్టెన్సీ నుంచి పాఠాలు నేర్చుకున్న తాను అదే విధంగా ముందుకు సాగుతానంటూ చెప్పిన పాండ్యా.. ఆ మాటను నిలబెట్టుకున్నాడంటూ అభిమానులు మురిసిపోయారు. చదవండి: అందుకే నేను వికెట్ కీపర్ అయ్యాను: రిషబ్ పంత్ .@gujarat_titans - The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍 The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground - the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f — IndianPremierLeague (@IPL) May 29, 2022 Back in Blue - Prep mode 🔛#TeamIndia begin training in Delhi ahead of the 1st T20I against South Africa.@Paytm #INDvSA pic.twitter.com/kOr8jsGJwL — BCCI (@BCCI) June 6, 2022 -
'హార్ధిక్ పాండ్యా ఇద్దరి ఆటగాళ్లతో సమానం.. అయితే వన్డేల్లో మాత్రం ఆడకూడదు'
అరంగేట్రంలోనే జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యాపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తకిర వాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్లో హార్ధిక్ కెప్టెన్గానే కాకుండా ఆల్రౌండర్గా అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్లు ఆడిన అతడు 487 పరుగులతో పాటు 8 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే గత కొద్ది కాలంగా పేలవ ఫామ్తో భారత జట్టుకు దూరంగా ఉన్న హార్ధిక్.. ఐపీఎల్లో అదరగొట్టి తిరిగి జట్టులోకి వచ్చాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కి హార్ధిక్ పాండ్యా ఎంపికయ్యాడు. "హార్ధిక్కు జట్టులో బ్యాటర్గా లేదా ఆల్రౌండర్గా చోటు దక్కింది. అయితే అతడు గాయం నుంచి కోలుకున్నప్పటికీ కేవలం 2 ఓవర్లు బౌలింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత హార్ధిక్కు మంచి విశ్రాంతి లభించింది. ఇకపై కూడా అతడికి చాలా విశ్రాంతి అవసరం. హార్ధిక్ను టీ20 ప్రపంచకప్ వరకు వన్డేల్లో ఆడించే ప్రయత్నం చేయకూడదు. అతడు టీ20 ప్రపంచకప్కు ఫిట్గా ఉండడం భారత్కు చాలా ముఖ్యం. ఫిట్గా ఉంటే హార్ధిక్ పాండ్యా ఒక్కడూ ఇద్దరి ఆటగాళ్లతో సమానం. పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో ఏ పొజిషన్లో అయినా అద్భుతంగా ఆడగలడు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
'వకార్ యూనిస్ ఎవరో తెలియదు.. ఆ ముగ్గురు పేసర్లే నా ఆదర్శం'
ఐపీఎల్-2022లో సన్రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన మాలిక్.. ఏకంగా భారత జట్టులో చోటు కొట్టేశాడు. ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టీ20లో మాలిక్ భారత తరపున అరేంగట్రం చేయనున్నాడు. కాగా ఐపీఎల్లో దుమ్ము రేపిన ఈ స్పీడ్ స్టార్పై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్ను ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసించాడు. ఉమ్రాన్ పేస్ చూస్తుంటే పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకొస్తున్నాడంటూ చెప్పాడు. అయితే తాజగా ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్ను ఇదే విషయం ప్రశ్నించగా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఎప్పడూ వకార్ యూనిస్ను అనుసరించలేదని, భారత పేస్ దిగ్గజాలు జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ షమీ,భువనేశ్వర్ కుమార్ను ఆదర్శంగా తీసుకున్నాని మాలిక్ తెలిపాడు. "నేను వకార్ యూనిస్ బౌలింగ్ను ఎప్పడూ ఫాలో కాలేదు. నాకంటూ ఓ బౌలింగ్ స్టైల్ ఉంది. టీమిండియా స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ భాయ్ నేను క్రికెట్లో ఎక్కువగా ఆరాదించే బౌలర్లు. నా కెరీర్ ఆరంభం నుంచే ఈ ముగ్గరి దిగ్గజాలని అనుసరిస్తూ ఉన్నాను. దేశం తరపున ఆడటం నాకు గర్వంగా ఉంది. నా దేశం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. ఈ ఐదు టీ20ల సిరీస్లో నాకు అవకాశం లభించింది. ఈ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఒంటి చేత్తో గెలిపించి భారత్కు అందించడమే నా లక్ష్యం" అని ఉమ్రాన్ మాలిక్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA T20: టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా నెట్ బౌలర్గా ఢిల్లీ యువ ఆటగాడు..! -
దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్కు నో ఛాన్స్..!
దక్షిణాఫ్రికాతో 5మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జూన్ 9న జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20 కోసం భారత అత్యుత్తమ ప్లేయింగ్ ఎలవెన్ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్, ఫామ్లో ఉన్న దినేష్ కార్తీక్కు చోటు దక్కలేదు. ఈ జట్టుకు ఓపెనర్లుగా కెప్టెన్ కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్లను రవిశాస్త్రి ఎంచుకున్నాడు. వరుసగా మూడు నాలుగు స్థానాల్లో వరుసగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్కు అతడు చోటిచ్చాడు. ఇక తమ జట్టులో వికెట్ కీపర్గా రిషభ్ పంత్కు చోటు దక్కింది. ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ను రవిశాస్త్రి ఎంపిక చేశాడు. ఇక తన జట్టులో బౌలర్లగా భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ను అవకాశం ఇచ్చాడు. రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలవెన్: కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ చదవండి: IPL 2022: 'ధోని భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా' -
'ధోని భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన సీఎస్కే.. కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే సీఎస్కే పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. ఆ జట్టు యువ ఆటగాళ్లు ముఖేష్ చౌదరి, సిమ్రంజీత్ సింగ్ తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా సీఎస్కే టివీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ కెప్టెన్ ఎంస్ ధోనిపై సిమ్రంజీత్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టులోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించి వారిని సిద్ధం చేయడంలో ధోని కీలక పాత్ర పోషిస్తాడని సిమ్రంజీత్ తెలిపాడు. ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన సిమ్రంజీత్ 4 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేటు 7.67గా ఉంది. "ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎలా ఉండాలో మహి భాయ్ నుంచి నేర్చుకున్నాను. నేను బౌలింగ్ చేసేటప్పడు ధోని నాకు ఎప్పుడూ సలహాలు ఇస్తూ ఉంటాడు. అదే విధంగా బౌలింగ్ను మెరుగ్గా చేయమని నన్ను ప్రోత్సహించాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో నేను బాగా బౌలింగ్ చేశానని మహి భాయ్ చెప్పాడు. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎస్ఆర్హెచ్తో నా తొలి ఐపీఎల్ మ్యాచ్లో నేను భయపడలేదు. అయితే మ్యాచ్ మధ్యలో కాస్త ఒత్తిడికి గురయ్యాను. నేను ప్రేక్షకుల మధ్య తొలి సారిగా స్టేడియంలోకి అడుగుపెట్టినప్పుడు కొత్తగా అనిపించింది. బెంచ్పై కూర్చోవడానికి, ప్లేయింగ్ ఎలెవెన్లో భాగం కావడానికి చాలా తేడా ఉంది" అని సిమ్రంజీత్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: 'రోహిత్ శర్మకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్ధం కావడం లేదు' -
ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్బై చెప్పనున్న పంజాబ్ కింగ్స్ ..!
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన మయాంక్ అగర్వాల్ జట్టును నడిపించడంలో విఫలమ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించిన పంజాబ్.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాది సీజన్లో నిరాశ పరిచిన ఆటగాళ్లను ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఓడియన్ స్మిత్ వెస్టిండీస్కు చెందిన ఈ ఆల్రౌండర్ను మెగా వేలంలో రూ.6 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే స్మిత్ పంజాబ్ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే పంజాబ్ అంచనాలను అందుకోవడంలో స్మిత్ విఫలమయ్యాడు. అతడు తన పేలవ ప్రదర్శనతో తుది జట్టులో తన చోటును కోల్పోయాడు. ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన అతడు 6 వికెట్లతో పాటు,51 పరుగులు సాధించాడు. బౌలింగ్లో 11.87 ఏకానమీ రేటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్కు అతడి స్థానంలో నాణ్యమైన ఆల్రౌండర్ను తీసుకోవాలని పంజాబ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ శర్మ ఐపీఎల్లో అనుభవజ్ఞుడైన సందీప్ శర్మను మెగా వేలంలో రూ.50లక్షలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అయితే ఈ సీజన్లో సందీప్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. 5 మ్యాచ్లు ఆడిన సందీప్ కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. సందీప్ శర్మకు పంజాబ్ పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకంటే అతడు ఆడిన తొలి మ్యాచ్లోనే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి అతడు అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే పంజాబ్ జట్టులో కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్ వంటి ఫ్రంట్ లైన్ పేసర్లుగా ఉన్నారు. మరో వైపు ఆల్రౌండర్ రిషి ధావన్ను మూడవ పేసర్గా పంజాబ్ ఉపయోగించుకుంటుంది. దీంతో వచ్చే ఏడాది సీజన్కు ముందు సందీప్ శర్మను పంజాబ్ విడిచి పెట్టే అవకాశం ఉంది. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఐపీఎల్- 2022 మెగా వేలంలో మరోసారి యువ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. జానీ బెయిర్ స్టో, జితేష్ శర్మ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో ప్రభ్సిమ్రాన్ సింగ్కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు దూరం కావడంతో ప్రభ్సిమ్రాన్కు ఆ మ్యాచ్లో అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్లో ప్రభ్సిమ్రాన్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు ఇప్పటికే ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో వచ్చే ఏడాది సీజన్కు ముందు ప్రభ్సిమ్రాన్ను పంజాబ్ విడిచి పెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం. చదవండి: IPL 2022: 'మా జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపించింది' -
'మా జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపించింది'
ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఢిల్లీ ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తమ జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడంపై ఢిల్లీ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ ప్లేఆఫ్కు చేరుకోలేకపోవడం తమకు సిగ్గుగా ఉందని మార్ష్ తెలిపాడు. "మేము ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరుకోలేకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మా జట్టు ఆటగాళ్లను చాలా బాగా చూసుకున్నాడు. అతడు నాయకుడిగా, జట్టు ప్రధాన కోచ్గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. అతడి కోసమైనా మేము టైటిల్ సాధించాలని భావించాము. అదే విధంగా ఢిల్లీ జట్టుకు నేను చాలా ముఖ్యమైన ఆటగాడిగా పాంటింగ్ భావించాడు" అని మార్ష్ పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు మార్ష్ దూరమయ్యాడు. అనంతరం జట్టులోకి వచ్చిన ఒక్క మ్యాచ్ తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే కరోనా నుంచి కోలుకున్నాక మార్ష్ ఆద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన మార్ష్ 251 పరుగులు చేశాడు. చదవండి: Mitchell Marsh: 'భారత్లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
'రోహిత్ శర్మకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్ధం కావడం లేదు'
టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్లు మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్9న ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి,జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్కు రోహిత్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. "రోహిత్ ఈ సిరీస్ ఆడాలని నేను భావిస్తున్నాను. విశ్రాంతి తీసుకోవాలా వద్దా అనేది అతడి వ్యక్తిగత ఆలోచన. విశ్రాంతి అనేది అతడు ఎంత అలసటను అనుభవిస్తున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ అతడికి బ్రేక్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది సుదీర్ఘ సిరీస్ అని మనకు తెలుసు. అంతేకాకుండా అతడు కెప్టెన్ కాబట్టి ఈ సిరీస్లో ఖచ్చితంగా ఆడాలి. ఐపీఎల్లో రోహిత్ గత కొన్ని సీజన్లో 400కి పైగా పరుగులు చేయలేదు. 400 పరుగుల మార్క్ను దాటిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ టోర్నమెంట్లో అతడు నిలకడగా రాణించలేకపోతున్నాడు. కానీ రెండు మూడు సార్లు అద్భుత ఇన్నింగ్స్లతో జట్టును గెలిపించాడు. కాబట్టి రోహిత్ దూకుడుగా బ్యాటింగ్ చేయగలడని అందరూ భావిస్తారు. టీ ఫార్మాట్లో జట్టుకు మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడే బ్యాటర్లు కావాలి. ఒకట్రెండు మ్యాచ్ల్లో చెలరేగిన జట్టు విజయం సాధిస్తుందిని" ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లోను రోహిత్ తీవ్రంగా నిరాశ పరిచాడు. 14 మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం 268 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: బీజేపీకి షాక్.. అమిత్ షాకు క్రీడా శాఖ ఇవ్వాల్సింది.. షాకింగ్ కామెంట్స్ -
తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా!
అర్జున్ టెండూల్కర్.. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు. తండ్రి పేరును తనలో జోడించుకొని అతని కంటే గొప్ప క్రికెటర్గా రాణిస్తాడని అంతా భావించారు. కానీ ప్రతీ ఇంట్లో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. తండ్రి ఎంత పెద్ద క్రికెటర్ అయినా.. తనలో స్కిల్ ఉంటేనే ఎవరి కొడుకైనా గొప్ప క్రికెటర్ అవుతాడు. తాజాగా అర్జున్ టెండూల్కర్కు సంబంధించి ఒక విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఐపీఎల్ 2022లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. రూ. 30 లక్షలతో కొనుగోలు చేసిన ముంబై అతనికి ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం కల్పించలేదు. కేవలం ఒక గొప్ప క్రికెటర్ తనయుడు కావడం.. ముంబై ఇండియన్స్తో తండ్రికున్న అనుబంధం అతన్ని జట్టులోకి తీసుకునేలా చేసింది. ఇది ఒక పరిది వరకు బాగానే ఉంటుంది.. అవకాశాలు ఇవ్వకుండా జట్టుతో అట్టిపెట్టుకొని తిరిగితే ఏంటి లాభమని క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు కురిపించారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్.. ''అర్జున్ బౌలింగ్లో ఇంకా చాలా మెళుకువలు నేర్చుకోవాలి.. ఇప్పుడు అతనిలో ఉన్న స్కిల్స్ ఏ మాత్రం సరిపోవు.'' అని కామెంట్ చేశాడు. అర్జున్ టెండూల్కర్ విషయంలో నిజంగా దురదృష్టమే.. ఎందుకంటే తనతో సమానమైన.. తనకంటే తక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్లో ఇరగదీస్తున్నారు. ''ఎంతైనా అవకాశమిస్తేనే కదా అతనిలో లోపాలు ఉన్నాయా లేదా అనేది తెలిసేది'' అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజం.. మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అర్జున్ టెండూల్కర్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''అర్జున్లో టెండూల్కర్ గురించి అంతా మాట్లాడుతున్నారు.. ఎందుకంటే అతను దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు కాబట్టి. అయితే అతన్ని అంతా సచిన్తో పోలుస్తున్నారు. అలా కాకుండా అర్జున్ను తన ఆటను ఆడనిస్తే మంచిది. అతనికి ఇంకా 22 ఏళ్లు మాత్రమే. ఒక క్రికెటర్గా రాణించడానికి ఇదే సరైన సమయం. తండ్రిలా అద్బుతాలు చేయకపోవచ్చు.. కానీ ఒక మంచి క్రికెటర్గా పేరు సంపాదించే అవకాశం ఉంటుంది. అర్జున్లో ఉన్న టెండూల్కర్.. పేరు చాలా ఇబ్బంది పెడుతుంది. నిజానికి టెండూల్కర్ అనే పేరు అర్జున్ను వెలుగులోకి రానీయడం లేదు.. అంతేకాదు ఆ పేరు అతన్ని ట్రోల్ చేయడంతో పాటు అవమానాలు ఎదుర్కొనేలా చేస్తుంది. అతని ఆట అతనే ఆడాలి. కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక లెజెండరీ ఆటగాడి కుమారుడిగా అతను కనీసం 50 శాతమైనా నిరూపించుకోవాలి. అలా జరగాలంటే అర్జున్.. ముందు తన పేరులో ఉన్న ''టెండూల్కర్'' పదాన్ని తొలగించుకోవాలి. దిగ్గజ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్మన్ కుమారుడు.. బ్రాడ్మన్ అనే పదాన్ని తన పేరు నుంచి తొలగించుకున్నాడు. ఎందుకంటే ప్రతీ ఒక్కరు అతన్ని తండ్రితో పోల్చడమే ఇందుకు కారణమంట. అనవసరంగా అర్జున్పై ఒత్తిడి పెంచొద్దు.'' అని పేర్కొన్నాడు. చదవండి: Mitchell Marsh: 'భారత్లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు IPL 2022: అర్జున్ టెండూల్కర్ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్ -
'భారత్లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో తనకు శాపం తగిలిందని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఏదో కారణంగా తాను గాయపడుతున్నానని పేర్కొన్నాడు. ప్రస్త్తుతం మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వచ్చింది. ప్రాక్టీస్ ముగించుకున్న మార్ష్ ఒక మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ‘నేను ఇండియాకు రావడానికి కొద్దిరోజుల ముందే (పాకిస్తాన్ లో) గాయపడ్డాను. ఇక్కడికొచ్చి ఒక మ్యాచ్ ఆడాక నాకు కోవిడ్ వచ్చింది.. అప్పుడు నేను నిజంగా షాక్ కు గురయ్యా. ఏదైనా శాపం తగిలిందా..? అని అనిపించింది. కానీ నేను కోవిడ్ నుంచి త్వరగానే కోలుకున్నా. తిరిగి ఢిల్లీ జట్టుతో చేరి మంచి ప్రదర్శనలు చేశా. అక్కడున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇక నేను జట్టులో చేరినప్పుడు అందరూ రికీ పాంటింగ్ గురించి గొప్పగా చెప్పారు. ఆటలో అతడు ఏం సాధించాడో ఒక ఆస్ట్రేలియన్ గా నాకు తెలుసు. అయితే అతడితో కలిసి చేసిన ప్రయాణంలో పాంటింగ్ తన ఆటగాళ్లను ఎంత బాగా చూసుకుంటాడో అర్థమైంది. నేను ఢిల్లీ జట్టుకు ఎంత ముఖ్యమైన ఆటగాడినో పాంటింగ్ నాకు చెప్పేవాడు. ఆ దిశగా నన్ను మోటివేట్ చేసేవాడు. నాలో నమ్మకం సన్నగిల్లినప్పుడల్లా నాతో మాట్లాడి నా ఆత్మ విశ్వాసం పెంచేలా దోహదం చేసేవాడు.’ అని మార్ష్ చెప్పాడు. కాగా 2020, 21 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన మార్ష్.. అప్పుడు కూడా గాయం కారణంగా అర్థాంతరంగా టోర్నీల నుంచి తప్పుకున్నాడు. ఇక తాజా సీజన్ లో 8 మ్యాచులాడి.. 251 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా లంకతో మూడు టి20ల సిరీస్ జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆలౌట్..! -
IPL 2022: అమ్మో.. క్రీజులో అతడు ఉన్నాడంటే అంతే! ఆహా ఏమి షాట్లు!
IPL 2022 Gujarat Titans: శుభ్మన్ గిల్ నెట్స్లో తనను బాగా ఇబ్బంది పెట్టాడని, తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ అతడేనని గుజరాత్ టైటాన్స్ యువ బౌలర్ యశ్ దయాల్ అన్నాడు. గిల్ క్లాసికల్ బ్యాటర్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో ఉత్తరప్రదేశ్కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్ యశ్ దయాల్ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కోల్కతా, ఆర్సీబీ ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ.. అతడి కోసం ఏకంగా 3.20 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన యశ్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. రాజస్తాన్ రాయల్స్తో ఫైనల్లోనూ ఒక వికెట్ తీశాడు. రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను పెవిలియన్కు పంపి గుజరాత్కు శుభారంభం అందించాడు. తద్వారా అరంగేట్రంలోనే టైటిల్ గెలిచిన గుజరాత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్-2022 అనుభవాల గురించి ఇండియా న్యూస్తో పంచుకున్న యశ్ దయాల్.. తనను ఇబ్బంది పెట్టిన బ్యాటర్ల గురించి చెప్పుకొచ్చాడు. ‘‘నెట్స్లో శుభ్మన్ గిల్ను ఎదుర్కోవడం అత్యంత కష్టం. ఏ షాట్ అయినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాదడమే తనకు అలవాటు. అద్భుతమైన షాట్లు ఆడతాడు. క్లాసికల్ బ్యాటర్’’ అంటూ ఈ లెఫ్టార్మ్ పేసర్ సహచర ఆటగాడిని కొనియాడాడు. అదే విధంగా.. వృద్ధిమాన్ సాహా క్రీజులో ఉంటే కష్టమేనని, పవర్ప్లేలో అతడిని ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి బౌలర్ ఆచితూచి ఆడాల్సిందేనని యశ్ దయాల్ చెప్పుకొచ్చాడు. డేవిడ్ మిల్లర్ కూడా ప్రమాదకరమైన బ్యాటర్ అని పేర్కొన్నాడు. ఇక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లలో జోస్ బట్లర్, రుతురాజ్ గైక్వాడ్ను ఎదుర్కోవడం కష్టంగా అనిపించిందని తన అనుభవాన్ని పంచుకున్నాడు. చదవండి👉🏾 IPL 2022: 'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది' చదవండి👉🏾IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..! .@gujarat_titans - The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍 The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground - the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f — IndianPremierLeague (@IPL) May 29, 2022 -
T20 WC: కోహ్లి, రోహిత్ తమ మార్కు చూపించాలి.. లేదంటే ఇదే చివరి వరల్డ్కప్!
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి మరింత ఒత్తిడిలో కూరుకుపోయే అవకాశం ఉందని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఫామ్లేమి కారణంగా వారు ఇబ్బంది పడుతున్నారని.. ఒకవేళ వాళ్లిద్దరికీ ఇది చివరి వరల్డ్కప్ అనుకుంటే ఒత్తిడి రెట్టింపు అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఏ ఆటగాడి కెరీర్లోనైనా ఇలాంటి పరిస్థితులు ఎదురవడం సహజమని, సచిన్ టెండుల్కర్ సైతం చాలా కాలం పాటు సెంచరీ చేయలేక సతమైన సందర్భాన్ని ఈ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ గుర్తు చేశాడు. కాగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్కప్లో కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఘోర వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్ అయ్యాడు. ఇద్దరిదీ ఒకే కథ! హిట్మ్యాన్ సారథ్యంలో స్వదేశంలో వరుస టీ20 సిరీస్లు గెలిచిన టీమిండియా ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్నకు సిద్ధమవుతోంది. అయితే, ఐపీఎల్-2022లో కోహ్లి, రోహిత్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆర్సీబీ బ్యాటర్ విరాట్ 341 పరుగులు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కేవలం 268 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ఎన్నడూ లేని విధంగా ముంబై జట్టు సైతం ఘోరంగా విఫలమైంది. ఆఖరి స్థానంతో ఐపీఎల్-2022 సీజన్ను ముగించింది. సచిన్కే తప్పలేదు! అవును.. అందుకే! ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్, టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ మధ్య వీరిద్దరి భవిష్యత్ గురించి ఆసక్తికర చర్చ నడిచింది. స్పోర్ట్స్కీడాతో అక్తర్ మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు ఇదే రకమైన ఆట కొనసాగిస్తే.. వారికి ఇదే చివరి ఐపీఎల్, చివరి వరల్డ్కప్ అని అనుకుంటే.. ఫామ్లేమి కారణంగా మరింత ఒత్తిడిలో కూరుకుపోతారు. కెరీర్పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇందుకు సచిన్నే ఉదాహరణగా తీసుకుంటే.. ఒకానొక సందర్భంలో అతడు సెంచరీ సాధించడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో, ఎంతగా ఎదురుచూడాల్సి వచ్చిందో తెలుసు కదా’’ అని పేర్కొన్నాడు. ఇందుకు భజ్జీ బదులిస్తూ.. ‘‘అవును.. వాళ్లిద్దరికీ ఈ ఐపీఎల్ సీజన్ అంత గొప్పగా ఏమీలేదు. నిజానికి వాళ్లిద్దరికీ టీ20 వరల్డ్కప్ కీలకం. నవతరం ఆటగాళ్లు దూసుకువస్తున్నారు. ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. కాబట్టి కోహ్లి, రోహిత్ కచ్చితంగా ఈ ప్రపంచకప్లో తమ మార్కు చూపించాలి’’ అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ సరిగ్గా ఆడకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డాడు. చదవండి: IPL 2022: 'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది' IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..! -
'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది'
అరంగేట్ర సీజన్లోనే జట్టుకు టైటిల్ను అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రసింశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ 20 ప్రపంచకప్లో టీమిండియా తరపున పాండ్యా అద్భుతంగా రాణిస్తాడని బాండ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా గతంలో ముంబై ఇండియన్స్ తరపున హార్ధిక్ ఆడిన సంగతి తెలిసిందే. "హార్దిక్ చాలా కూల్ కెప్టెన్. నేను బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్ నుంచి హార్దిక్ నాకు తెలుసు. పాండ్యా వేరే ఫ్రాంచైజీకి కెప్టెన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మేము అతడి సేవలను కోల్పోయాము. అతడు అద్భుతమైన ఆటగాడు కాబట్టి మా జట్టులో ఉంటే బాగుండేది. ఇక టీ20 ప్రపంచకప్కు అతడి సేవలు భారత్కు చాలా అవసరం. అతడు ఒక కెప్టెన్గా, ఆల్ రౌండర్గా తన సత్తా ఎంటో చూపించాడు" అని స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేన్ బాండ్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022లో హార్దిక్ అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్లు ఆడిన పాండ్యా 487 పరుగులతో పాటు, వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్ -
అర్జున్ టెండూల్కర్ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ గత రెండేళ్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్-2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ అర్జున్ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే గతేడాది సీజన్ మొత్తం బెంచ్కే అర్జున్ పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది. కాగా మెగా వేలంలో మళ్లీ అతడిని రూ.30 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది సీజన్లోనైనా అర్జున్ టెండూల్కర్కు జట్టులో చోటు దక్కుతుందని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. అయితే మరోసారి క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం అతడికి దక్కలేదు. అర్జున్ టెండూల్కర్కి ఐపీఎల్ 2022లో ఎందుకు అవకాశం ఇవ్వలేదో తాజాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వెల్లడించాడు. "అర్జున్ ఇంకా చాలా మెరుగుపడాలి. ఏ ఆటగాడైనా జట్టులోకి రావడం ఒకవంతు అయితే.. ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కాలంటే చాలా కష్టపడాలి. అతడు ఇంకా చాలా వర్కవుట్స్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్లో అతడు మరింత రాటుతేలాలి. అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్లో పురోగతి సాధించాడని జట్టు భావిస్తే ఖచ్చితంగా అతడికి అవకాశం ఇస్తాం" అని షేన్ బాండ్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచుల్లో 10 పరాజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..! -
ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..!
ఐపీఎల్-2022లో సన్రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశ పరిచింది. మరోసారి లీగ్ దశలోనే ఎస్ఆర్హెచ్ ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్ను ఓటములతో ఆరంభించిన ఎస్ఆర్హెచ్.. సీజన్ మధ్యలో వరుసగా ఐదు విజయాలు సాధించి హైదరాబాద్ తిరిగి గాడిలో పడింది. అయితే తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక డేవిడ్ వార్నర్ తర్వాత ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కేన్ విలియమ్సన్.. జట్టును విజయం పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా విలియమ్సన్ నిరాశపరిచాడు.13 మ్యాచ్లు ఆడిన విలియమ్సన్ 216 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ విఫలమైనప్పటికీ కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ అత్యుత్తమంగా రాణించారు. ఇక మరి కొంత మంది ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్కు ముందు ఓ ముగ్గురి ఆటగాళ్లని ఎస్ఆర్హెచ్ విడిచి పెట్టే అవకాశం ఉంది. సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల పేసర్ను ఐపీఎల్-2022 మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. సీన్ అబాట్కు ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడిన అనుభవం ఉంది. బిగ్బాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్కు అబాట్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ ఏడాది సీజన్లో అతడికి చాలా తక్కువ అవకాశాలు లభించాయి. కేవలం ఒకే మ్యాచ్ ఆడిన అబాట్.. తన నాలుగు ఓవర్ల కోటాలో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో అతడికి తర్వాత మ్యాచ్ల్లో తుది జట్టులో చోటు దక్క లేదు. ఇప్పటికే నటరాజన్, భవనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉండటంతో రాబోయే సీజన్కు ముందు అబాట్ను ఎస్ఆర్హెచ్ విడిచి పెట్టే అవకాశం ఉంది. ఫజల్హక్ ఫారూఖీ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గత కొద్ది కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో ఫారూఖీని రూ. 50 లక్షలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కాగా ఫారూఖీ మాత్రం ఐపీఎల్లో రాణించడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో మూడు మ్యాచ్లు ఆడిన కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని విడిచి పెట్టి మరో కొత్త పేసర్ను సన్రైజర్స్ కొనుగోలు చేయచ్చు. శ్రేయస్ గోపాల్ ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్న శ్రేయస్ గోపాల్ను మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే జట్టులో వాషింగ్టన్ సుందర్, జగదీషా సుచిత్ వంటి ఆల్రౌండర్లు ఉండటంతో గోపాల్ పెద్దగా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సీజన్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన గోపాల్.. 3 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఇక వికెట్ సాధించాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్లో గోపాల్ స్థానంలో ఓ యువ ఆటగాడిని భర్తీ చేసే అవకాశం ఉంది. చదవండి: IND vs SA: టీమిండియాను భయపెడుతోన్న దక్షిణాఫ్రికా త్రయం.. గెలవడం అంత ఈజీ కాదు..! -
అది తప్పు! నేను సెలక్షన్కు అందుబాటులో ఉంటే కదా: హార్దిక్ పాండ్యా
‘‘టీమిండియా నుంచి నన్ను తప్పించారంటూ చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి అది నా వ్యక్తిగత నిర్ణయం. నేను సెలవు తీసుకున్నాను అంతే! మనం అందుబాటులో ఉండి కూడా జట్టుకు ఎంపిక కాకపోతే తప్పుడు జట్టు నుంచి తప్పించినట్టు! కానీ నా విషయంలో అలా జరుగలేదు. సుదీర్ఘకాలం పాటు విరామం తీసుకోవాలనుకుంటున్నానన్న నా అభ్యర్థనను మన్నించిన బీసీసీఐకి రుణపడి ఉంటాను. సెలక్షన్కు అందుబాటులో ఉండాలని వారు నన్ను బలవంతం చేయలేదు. అంతా బాగుంది కాబట్టే ఇప్పుడు పాత హార్దిక్ను మీరు చూడగలుగుతున్నారు’’ అంటూ టీమిండియా సీనియర్ ఆల్రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. కాగా ఐపీఎల్-2021లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్.. పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2021 భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఐసీసీ మెగా టోర్నీలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఫిట్నెస్ సమస్యలతో సతమతమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో చేరి శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా పయనమైన వేళ.. తాను సెలక్షన్కు అందుబాటులో ఉండలేనని ప్రకటించాడు. అయితే, ఫామ్లో లేని నిన్ను ఎందుకు సెలక్ట్ చేస్తారులే అంటూ హార్దిక్ను విపరీతంగా ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. ఆది నుంచి ముంబైతో ఉన్న హార్దిక్ను ముంబై వదిలేయగా.. కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ అతడిని దక్కించుకుని కెప్టెన్గా నియమించింది. కానీ, ఫిట్నెస్ సమస్యలతో అతడు తుదిజట్టులో ఉంటాడో లేదోనన్న అనుమానాల నడుమ జట్టులోకి వచ్చిన హార్దిక్.. ఏకంగా గుజరాత్ను టైటిల్ విజేతగా నిలపడం విశేషం. తద్వారా గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చిన ఈ ఆల్రౌండర్ విమర్శకుల నోళ్లు మూయించాడు. అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేకాదు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఫ్రాంఛైజీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో.. దేశం కోసం అంతకంటే ఎక్కువగానే కష్టపడతానంటూ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. అలాగే తనను ఎవరూ భారత జట్టు నుంచి తప్పించలేదని, తనకు తానుగా విశ్రాంతి కోరానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ ట్విటర్లో షేర్ చేసింది. అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్ ఆడలేదు.. అయినా కోటికి పైగా వెనకేశారు! టైటిల్స్ కూడా! IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ “The old Hardik will be back!” 💪 🎥 #PapaPandya will be back in Blue, and we are excited! 🔥 #INDvSA #TeamIndia @hardikpandya7 pic.twitter.com/6KaQBb7860 — Gujarat Titans (@gujarat_titans) June 3, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీమిండియాను భయపెడుతోన్న దక్షిణాఫ్రికా త్రయం.. గెలవడం అంత ఈజీ కాదు..!
టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్కు భారత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇక ఈ సిరీస్ కోసం టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు గురువారం భారత్కు చేరుకుంది. ఢిల్లీ వేదికగా జూన్ 9న తొలి టీ20 జరగనుంది. ఇక ఇరు జట్ల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగింది. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో స్వదేశంలో జరగనున్న టీ 20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ప్రోటీస్ జట్టును ఓడించడం అంత సులభం కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు టీమిండియాకు దూరం కాగా... ప్రోటీస్ మాత్రం తమ బలమైన జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇక ఈ సిరీస్కు ఇప్పటికే దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ఐపీఎల్లో ఆడిన వారే కావడం గమనార్హం. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. కాబట్టి భారత్కు వీరి నుంచి గట్టి పోటి ఎదురుకానుంది. ఈ ముగ్గురు ఆటగాళ్ల పట్ల టీమిండియా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఈ ఏడాది సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన డికాక్ దుమ్మురేపాడు. 15 మ్యాచ్ లు ఆడిన డికాక్ 508 పరుగులు చేశాడు. ఇందులో ఒక భారీ సెంచరీ కూడా ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో డికాక్ 140 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక డేవిడ్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో గుజరాత్కు అద్భుమైన ఫినిషర్గా మిల్లర్ మారాడు. 16 మ్యాచ్లు ఆడిన మిల్లర్ 481 పరుగులు సాధించాడు. అదే విధంగా పంజాబ్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రబాడ.. 13 మ్యాచ్ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక వీరితో పాటు ఐడెన్ మారక్రమ్, ఫాస్ట్ బౌలర్ జానేసన్ పర్వాలేదనిపించారు. టీ20 సిరీస్: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్. చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ -
'అతడు అద్భుతమైన కెప్టెన్... ధోని జూనియర్ వెర్షన్'
ఐపీఎల్-2022 ఛాంపియన్స్గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అరేంగట్ర సీజన్లో జట్టుకు టైటిల్ను అందించిన గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది సీజన్లో హార్ధిక్ కెప్టెన్గా కాకుండా ఆల్రౌండర్గాను అద్భుతంగా రాణించాడు. తాజాగా ఆ జట్టు యువ ఆటగాడు రవి సాయి కిషోర్.. పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోనితో సాయి కిషోర్ పోల్చాడు. "ధోని, హార్ధిక్ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ధోని లాగే హార్దిక్ కూడా తన జట్టులో ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి.. అత్యుత్తమ ప్రదర్శన చేసేలా కృషి చేస్తాడు. హార్దిక్ కూడా ధోని లాగా గొప్ప కెప్టెన్ అవుతాడు. కాబట్టి హార్దిక్ని ధోని జూనియర్ వెర్షన్గా అభివర్ణిస్తాను. ఇది నాకు బెస్ట్ సీజన్. అయితే వచ్చే ఏడాది సీజన్లో మరింత మెరుగ్గా రాణిస్తాను అని భావిస్తున్నాను. నెట్స్లో ధోనికి బౌలింగ్ చేయడం, అతడితో మాట్లడటం నాకు ఎంతో ఆనుభూతిని కలిగించింది. అదే విధంగా ధోని నుంచి నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి కిషోర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సాయి కిషోర్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో కిషోర్ పర్వాలేదనిపించాడు. 5 మ్యాచ్లు ఆడిన కిషోర్ 6 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ENG vs IND: 'ఇంగ్లండ్లో అతడు చెలరేగి ఆడుతాడు.. ఒక్క సెంచరీ సాధిస్తే చాలు..' -
ఒక్క మ్యాచ్ ఆడలేదు.. కోటికి పైగా వెనకేశారు! టైటిల్ కూడా!
IPL 2022: కొంతమంది ఆటగాళ్లు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. మరికొంత మంది ఒక్కసారి తమ ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. అదృష్టం వెంటపడి మరీ వరిస్తుంది. అలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా కనకవర్షం కురిపిస్తుంది. ఇక ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్లీగ్లో ఇలాంటి ఘటనలు జరగడం సహజమే! కొన్ని ఫ్రాంఛైజీలు వేలంలో కోట్లు పోసి కొన్న క్రికెటర్లను కూడా బెంచ్కే పరిమితం చేసే పరిస్థితులు ఉంటాయి. జట్టు అత్యుత్తమ కూర్పులో భాగంగా కొందరిని పక్కనపెడతాయి. అయినా సరే వాళ్లకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించక తప్పదు కదా! అలా ఐపీఎల్-2022లో బెంచ్కే పరిమితమై కోటి రూపాయలకు పైగా సంపాదించిన టాప్-3 క్రికెటర్లను పరిశీలిద్దాం! వీరిలో ఇద్దరు ఆడకుండానే టైటిల్ గెలిచిన జట్టులో భాగం కావడం విశేషం. 1.జయంత్ యాదవ్ ఐపీఎల్ మెగా వేలం-2022లో టీమిండియా ఆల్రౌండర్ జయంత్ యాదవ్ను 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. కనీస ధర కోటితో ఆక్షన్లోకి వచ్చిన అతడిని లక్నో సూపర్ జెయింట్స్తో పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. రషీద్ ఖాన్తో కలిసి అతడిని బరిలోకి దింపుతారనే అంచనాలు ఉన్నా.. అలా జరుగలేదు. సీజన్ ఆసాంతం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జయంత్కు ఒక్కసారి కూడా తుది జట్టులో చోటు లభించలేదు. రషీద్, సాయి కిషోర్, రాహుల్ తెవాటియాలతో పోటీలో అతడు వెనుకబడిపోయాడు. ఇక ఐపీఎల్-2022తో ఎంట్రీ ఇచ్చిన సీజన్లోనే గుజరాత్ చాంపియన్స్గా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. View this post on Instagram A post shared by Jayant Yadav (@jyadav19) 2. డొమినిక్ డ్రేక్స్ ఐపీఎల్లో అత్యంత అదృష్టవంతుడైన ప్లేయర్గా కరేబియన్ ఆల్రౌండర్ డొమినిక్ డ్రేక్స్ పేరొందాడు. కనీసం ఒక్కసారైనా క్యాష్ రిచ్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమవ్వాలని ప్రతి ఒక్క ఆటగాడి కల. డొమినిక్ డ్రేక్స్కు ఇది రెండుసార్లు నెరవేరింది. అది కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే. గత సీజన్ రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ఇక ఆ 2021 ఎడిషన్లో చెన్నై టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022 మెగావేలంలో ఆర్సీబీతో పోటీ పడి మరీ గుజరాత్ టైటాన్స్ డొమినిక్ను దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా 1.1 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో అతడు బెంచ్కే పరిమితమైనా కోటితో పాటు మరో ఐపీఎల్ టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by Filter Cricket ⬇️ (@filtercricket) 3. రాజ్వర్ధన్ హంగర్కర్ భారత అండర్-19 జట్టులో సభ్యుడైన రాజ్వర్ధన్.. వన్డే ప్రపంచకప్లో అదరగొట్టి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీఎస్కే ఈ యువ ఆల్రౌండర్ను 1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ.. తుదిజట్టులో చోటు కల్పించలేదు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగల.. జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేయగల రాజ్వర్ధన్కు అవకాశం ఇవ్వలేదు. చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
'ఇంగ్లండ్లో అతడు చెలరేగి ఆడుతాడు.. ఒక్క సెంచరీ సాధిస్తే చాలు..'
టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లోనూ కోహ్లి అంతగా రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన విరాట్ 341 పరుగులు మాత్రమే సాధించాడు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్నటీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఫామ్పై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లి మరింత బలంగా పుంజుకుంటాడని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ కోహ్లి 50పైగా పరుగులు చేసినా అతడు విఫలమైనట్లు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది కోహ్లి పెద్దగా ఆడలేదు. ఎటువంటి స్టార్ ఆటగాళ్లైనా ఏదో ఒక దశలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. కోహ్లి కూడా అంతే. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతి లభించింది. కాబట్టి ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లి తిరిగి ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నాను. కోహ్లి ఒక సెంచరీ సాధిస్తే.. అతడిలో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది" అని అజారుద్దీన్ పేర్కొన్నాడు. చదవండి: Hardik Pandya: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్
ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ‘ఫోర్డీ ప్లేయర్’గా అభివర్ణించాడు. ''హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫోర్ డైమెన్షనల్ ప్లేయర్. ఇంతకుముందు అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేసేవాడు...ఇప్పుడు ఈ త్రీడీ ప్లేయర్కి కెప్టెన్సీ కూడా తోడైంది. కెప్టెన్సీ కూడా అదరగొడతానని నిరూపించుకున్నాడు. అతనిలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు...ఐపీఎల్ సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ ఆడిన విధానం అద్భుతం. హార్ధిక్ పాండ్యా కెప్టెన్గా మారడం, తొలి సీజన్లోనే టైటిల్ గెలవడం, వ్యక్తిగతంగానూ బ్యాటింగ్, బౌలింగ్లో రాణించడం... అంత తేలికైన విషయం కాదు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా కెరీర్ మొదటి రోజుల్లో తన అకాడమీలో క్రికెట్ ఆడిన రోజులను కూడా కిరణ్ మోరే గుర్తుచేసుకున్నాడు ''కృనాల్ పాండ్యా నా అకాడమీలో జాయిన్ అయ్యి, క్రికెటర్గా రాణించాలని శిక్షణ తీసుకుంటున్నాడు. హార్ధిక్ పాండ్యా, అన్న కోసం ఎప్పుడూ అక్కడికి వచ్చేవాడు...చిన్నతనంలోనే నెట్స్లో పరుగెడుతూ క్యాచ్లు అందుకునేవాడు. అప్పుడు కృనాల్కి తన తమ్ముడిని కూడా ప్రాక్టీస్కి తీసుకురమ్మని చెప్పాను. అతని కళ్లల్లో ఆటపై ఇష్టాన్ని అప్పుడే గమనించా... చిన్నప్పటి నుంచే అన్ని మ్యాచుల్లో అదరగొట్టాలనే తపన, తాపత్రయం హార్ధిక్ పాండ్యాలో కనిపించేవి'' అని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక త్రీడీ ప్లేయర్ అనే మాట వినగానే గుర్తొచ్చేది విజయ్ శంకర్. 2019 వన్డే వరల్డ్ కప్ జట్టులో లక్కీగా చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ గురించి అప్పటి ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన కామెంట్లపై అంబటి రాయుడు వేసిన ట్వీట్... చాలా పెద్ద దుమారమే రేపింది...బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లోనూ రాణించే విజయ్ శంకర్, జట్టుకి ‘త్రీడీ ప్లేయర్’గా ఉపయోగపడతాడని ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించడం... వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ చేశానంటూ’ అంబటి రాయుడు ట్వీట్ వేయడం... అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. చదవండి: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! Rafael Nadal Unknown Facts: ఫుట్బాలర్ కావాల్సిన వ్యక్తి.. క్లేకోర్టు రారాజు ఎలా అయ్యాడు -
IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ కోచ్లలో తనూ ఒకడు! ఎందుకంటే!
IPL 2022- Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాపై ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్స్టన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు ఏ పనిచేసినా మనసు పెట్టి అంకితభావంతో పూర్తి చేస్తాడని కితాబిచ్చాడు. నెహ్రాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కిర్స్టన్.. ఐపీఎల్లోని బెస్ట్ కోచ్లలో అతడూ ఒకడంటూ ఆకాశానికెత్తాడు. ఆశిష్ నెహ్రా మార్గదర్శనంలోని కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్లోనే లీగ్ దశలో టాపర్గా నిలిచి.. ఆపై రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఫైనల్లోనూ సత్తా చాటింది. క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి ఎడిషన్లోనే ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. గుజరాత్ టైటిల్ గెలవడంలో గ్యారీ కిర్స్టన్, నెహ్రాదే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐసీసీ వరల్డ్కప్-2011 సమయంలో టీమిండియా కోచ్గా ఉన్న కిర్స్టన్, అప్పటి భారత జట్టులో సభ్యుడైన ఆశిష్ నెహ్రా 2018లో ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్గా నెహ్రా బాధ్యతలు స్వీకరిస్తే.. మెంటార్గా కిర్స్టన్ సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో గ్యారీ కిర్స్టన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ నాకు ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరిది సుదీర్ఘ ప్రయాణం. ఆటను అర్థం చేసుకోవడంలో.. అత్యంత ప్రొఫెషనల్గా వ్యవహరించడంలో తనకు తానే సాటి. తను మనసు పెట్టి పని చేస్తాడు. కోచ్గా కూడా అంతే! ఎల్లప్పుడూ తన జట్టులోని ఆటగాళ్ల గురించి, వాళ్లకు మెలకువలు నేర్పడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎప్పుడూ లో ప్రొఫైల్లోనే ఉంటాడు. అందరి దృష్టిలో పడాలనుకోవడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. అత్యంత నేర్పరులుగా వ్యవహరించే ఐపీఎల్ అత్యుత్తమ కోచ్లలో ఆశిష్ నెహ్రా కూడా ఒకడు’’ అని నెహ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్ను వదిలేస్తే.. చీప్గానే కొనుక్కోవచ్చు! వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్ Kal ki yeh yaadgar shaam, aap ke pyaar aur support ke naam 🥰😁 Jald lautenge, tab tak khayal rakhna Amdavad 💙#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/IMgH0izYAL — Gujarat Titans (@gujarat_titans) May 31, 2022 -
IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! అతడిని వదిలేస్తే.. చీప్గానే!
IPL 2023- RCB: ఐపీఎల్ మెగావేలం-2022కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ను ఏడు కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్ను కాదని సిరాజ్ను అట్టిపెట్టుకుంది. అయితే, వేలంలో 10.75 కోట్లు వెచ్చించి అతడిని మళ్లీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో హర్షల్ ఈ సీజన్లో 15 మ్యాచ్లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు. కానీ, సిరాజ్ మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. ఆడిన 15 మ్యాచ్లలో అతడు తీసినవి కేవలం 9 వికెట్లు. సమర్పించుకున్న పరుగులు 514. ఇందులో 31 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఈ క్రమంలో సిరాజ్ బౌలింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా సిరాజ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న సీజన్లో వేలానికి ముందే అతడిని రిలీజ్ చేయాలని ఆర్సీబీ యాజమాన్యానికి సూచించాడు. ‘‘మహ్మద్ సిరాజ్ను ఏడు కోట్లకు రిటైన్ చేసుకున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే మీరు అతడిని వదిలేయొచ్చు. ఒకవేళ అతడిని రిలీజ్ చేస్తే ఎవరిని తీసుకోవాలి? అనేది పెద్ద ప్రశ్న. నిజానికి అతడి స్థానంలో మరో ఇండియన్ బౌలర్ను తీసుకోవాలి. ఇదంతా పక్కన పెడితే.. సిరాజ్ను వదిలేస్తే వేలంలో చీప్గా కొనుక్కోవచ్చు’’ అని సలహా ఇచ్చాడు. ఇప్పుడు అతడికి ఏడు కోట్ల ధర పలికే సీన్ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ ఎడిషన్లో జోష్ హాజిల్వుడ్, హర్షల్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారన్న ఆకాశ్ చోప్రా.. ఆకాశ్ దీప్ సైతం పర్వాలేదనిపించాడన్నాడు. ఒకవేళ సిరాజ్ను ఆర్సీబీ రిటైన్ చేసుకోవాలని భావిస్తే బాగానే ఉంటుందని, అయితే సీజన్ మాత్రం బాగుండదు అంటూ కామెంట్ చేశాడు. చదవండి 👇 Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా Mohammed Siraj: 'చెత్త ప్రదర్శనతో తక్కువంచనా వేయొద్దు.. నేనేంటో నిరూపించుకుంటా' IPL 2022: పర్పుల్ క్యాప్ హోల్డర్ చహల్, హసరంగ కూడా ఆ చెత్త జాబితాలో! -
'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్ను చంపేసింది'
ఐపీఎల్ 2022 సీజన్ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్లు ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న వేళ ఐపీఎల్ వారికి కలిసొచ్చింది. అయితే కోహ్లి, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ సహా మరికొంత మంది ఆటగాళ్లు మాత్రం ఘోర ప్రదర్శన చేశారు. బ్యాటింగ్ స్టార్స్ కోహ్లి, రోహిత్ల సంగతి పక్కనబెడితే. వీరి కంటే ఎక్కువగా ఇబ్బంది పడింది మాత్రం మయాంక్ అగర్వాల్ అని చెప్పొచ్చు. PC: IPL Twitter కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్కు వెళ్లిపోవడంతో పంజాబ్ కింగ్స్ ఫుల్టైమ్ కెప్టెన్గా మయాంక్ ఎంపికయ్యాడు. దీంతో కెప్టెన్సీ భారం మీద పడడంతో మయాంక్ తనలోని బ్యాట్స్మన్ను పూర్తిగా మరిచిపోయాడు. 13 మ్యాచ్లు ఆడిన మయాంక్ ఒకే ఒక హాఫ్ సెంచరీతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే మయాంక్ గత ఐపీఎల్ సీజన్లో 12 మ్యాచ్ల్లో 441 పరుగులతో దుమ్మురేపాడు. ఇక ఈ సీజన్లో కెప్టెన్గా జట్టును కూడా అంతంత మాత్రంగానే నడిపించాడు. పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలు.. ఏడు ఓటములతో ఈ సీజన్ను ఆరో స్థానంతో ముగించింది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మయాంక్ అగర్వాల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. PC: IPL Twitter ''అసలు మయాంక్ అగర్వాల్కు ఏమైంది.. అతన్ని చూడగానే నా మదిలోకి వచ్చిన మొదటి ప్రశ్న. నిజానికి అతను మంచి స్ట్రైకింగ్ ప్లేయర్. అయితే ఐపీఎల్లో కెప్టెన్సీ అతని కొంపముంచింది. కెప్టెన్సీ భారం అతనిలోని మంచి బ్యాటర్ను చంపేసింది. ఈ సీజన్లో పంజాబ్కు కెప్టెన్గా పనిచేసిన మయాంక్ ఓపెనింగ్ నుంచి నాలుగో స్థానం వరకు బ్యాటింగ్ చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. నాయకత్వం తలకు మించిన భారం కావడంతో ప్రతీసారి మయాంక్ మొహంలో చిరాకు స్పష్టంగా కనిపించేది. అతన్ని కెప్టెన్ చేయకుండా ఒక బ్యాటర్గా స్వేచ్ఛగా ఆడనిచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.'' అని చెప్పుకొచ్చాడు. PC: IPL Twitter ఇక ఆర్సీబీ బౌలర్ వనిందు హసరంగాను భజ్జీ ప్రశంసల్లో ముంచెత్తాడు.'' హసరంగా ఒక దశలో ఆర్సీబీకి మ్యాచ్ విన్నర్గా మారాడు. నిజానికి అతను సర్ప్రైజ్ బౌలర్. తన బౌలింగ్తో బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెట్టాడు. సక్సెస్ వెనుకు అతను పడ్డ కష్టం కనిపించింది. అతని బౌలింగ్ను నేను బాగా ఎంజాయ్ చేశాను.'' అంటూ తెలిపాడు. ఇక హసరంగా పర్పుల్ క్యాప్కు ఒక్క వికెట్ దూరంలో ఆగిపోయాడు. ఈ సీజన్లో హసరంగా 16 మ్యాచ్లాడి 27 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Krunal- Hardik Pandya: 'నిన్ను మరిచిపోయే స్టేజ్కు వచ్చారు.. గోడకు కొట్టిన బంతిలా' -
'చెత్త ప్రదర్శనతో తక్కువంచనా వేయొద్దు.. నేనేంటో నిరూపించుకుంటా'
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహించిన సిరాజ్ అతి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. 15 మ్యాచ్లాడి..10.07 ఎకానమీతో కేవలం తొమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు. కాగా వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరగబోయే టెస్టులో బాగా ఆడతాననే విశ్వాసంతో సిరాజ్ ఉన్నాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్లో నేను బాగా ఆడలేదు. ఇంగ్లండ్తో జరిగే చివరి టెస్టు కోసం డ్యూక్స్ బంతులతో సాధన చేస్తున్నా. మంచి ప్రదర్శన ఇవ్వగలననే నమ్మకముంది. సిరీస్లో 2–1తో ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి మాలో ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. ఇక ఆర్సీబీ ఈ సీజన్లో మరోసారి ప్లేఆఫ్స్కే పరిమితమైంది. లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో దుమ్మురేపిన ఆర్సీబీ అదే టెంపోనూ రాజస్తాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో మాత్రం చూపట్టలేక చతికిలపడింది. -
'నిన్ను మరిచిపోయే స్టేజ్కు వచ్చారు.. గోడకు కొట్టిన బంతిలా'
ఐపీఎల్ 2022 సీజన్ చాంపియన్స్గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్లోనే టైటిల్ను ఎగురేసుకుపోయింది. కెప్టెన్గా అన్నీ తానై నడిపించిన పాండ్యా ఫైనల్లోనూ 32 పరుగులు చేయడంతో పాటు మూడు కీలక వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడమేగాక జట్టుకు టైటిల్ను అందించాడు. అయితే ఇదే హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ ప్రారంభానికి ముందు క్రికెట్ అభిమానుల నుంచి అవమానాలు ఎదురయ్యాయి. గాయంతో టీమిండియాకు కొన్నినెలల పాటు దూరమవ్వడం.. ఆ తర్వాత జట్టులోకి వచ్చినా దారుణ ప్రదర్శన చేయడం.. ముఖ్యంగా టి20 ప్రపంచకప్లో ఆల్రౌండర్గా కాకుండా ఒక బ్యాట్స్మన్గా బరిలోకి దిగినప్పటికి ఘోరంగా విఫలమవ్వడంతో పాండ్యా విమర్శలు వచ్చాయి. అయితే వీటిన్నింటిని ఓర్చుకున్న పాండ్యా తనను విమర్శించిన వారికి ఐపీఎల్తోనే సమాధానం ఇచ్చాడు. జాస్ బట్లర్, కేఎల్ రాహుల్ తర్వాత సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పాండ్యా ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ ప్రదర్శనపై సోదరుడు కృనాల్ పాండ్యా ఎమోషనల్ నోట్ రాయడం వైరల్గా మారింది. తన తమ్ముడు దీనికోసం ఎంత కష్టపడ్డాడో కృనాల్ వివరించాడు. ''కంగ్రాట్స్ హార్దిక్.. ఈ విజయం వెనుక నీ కష్టం ఎంత ఉందో నాకు మాత్రమే తెలుసు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ప్రతీరోజు తెల్లవారుజామునే నిద్ర లేవడం.. గంటల పాటు ట్రైనింగ్ సెషన్లో గడపడం, మానసికంగా దృడంగా తయారయ్యేదుకు చాలా కష్టపడ్డావు. నీ నిజాయితీ ఊరికే పోలేదు. ఐపీఎల్ టైటిల్ రూపంలో నీ ముందుకొచ్చింది. కెప్టెన్గా ఐపీఎల్ టైటిల్ అందుకోవడంలో వంద శాతం నువ్వు అర్హుడివి. ఇక క్రికెట్ ఫ్యాన్స్ నీ గురించి ఎలా విమర్శించారో నాకు తెలుసు. అందరు నిన్ను మరిచిపోయే స్టేజ్లో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చావు.. నీ పేరు మళ్లీ వాళ్ల నోళ్లలో నానేలా చేశావు.'' అంటూ ఎమెషనల్ అయ్యాడు. ఇక ఐపీఎల్ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్కు ఎంపికయ్యాడు. జూన్ 9 నుంచి మొదలుకానున్న టి20 సిరీస్లో హార్దిక్ తన మెరుపులు మెరిపిస్తాడోమే చూడాలి. ఇక కృనాల్ పాండ్యా ఈ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ తరపున ఆడాడు. సీజన్లో పెద్దగా ఆకట్టుకోని కృనాల్ 14 మ్యాచ్లాడి 183 పరుగులతో పాటు బౌలింగ్లో 10 వికెట్లు తీశాడు. చదవండి: Jos Buttler: పరుగులే కాదు.. ప్రైజ్మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన..కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా..! My bro 🤗 Only you know the amount of hard work that’s gone behind this success of yours - early mornings, countless hours of training, discipline and mental strength. And to see you lift the trophy is the fruits of your hard work ❤️ You deserve it all and so much more 😘😘 pic.twitter.com/qpLrxmjkZz — Krunal Pandya (@krunalpandya24) May 31, 2022 -
IPL 2022: ఏంటో! చహల్, హసరంగ కూడా ఆ చెత్త జాబితాలో..!
IPL 2022: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం. అభిమానులు ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తుంటే స్టేడియం ఈలలతో మారుమోగిపోవాల్సిందే! భారీ హిట్టర్లు, ఫ్యాన్స్కు ఇలా పండుగ చేసుకుంటే.. పాపం ఆ బ్యాటర్ ప్రతాపానికి బలైపోయిన బౌలర్ మాత్రం ఉసూరుమంటాడు. ఒక్క పరుగు కూడా ఫలితాన్ని తారుమారు చేయగల సందర్భాల్లో ఇలా జరిగితే ఆ బౌలర్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కొంతమందేమో వికెట్లు పడగొట్టినా పరుగులు ఎక్కువగా సమర్పించుకుని విమర్శల పాలవుతారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్లు ఎవరో గమనిద్దాం! 1.మహ్మద్ సిరాజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంతో ఇష్టపడి మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకడు. అయితే, ఈ సీజన్లో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్-2022లో 15 మ్యాచ్లు ఆడిన అతడు 514 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 31 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఐపీఎల్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు ఇచ్చిన బౌలర్గా సిరాజ్ చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు. 2. వనిందు హసరంగ ఐపీఎల్-2022 సీజన్లో శ్రీలంక ఆల్రౌండర్ వనిందు హసరంగ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. మొత్తంగా 26 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్నకు అడుగు దూరంలో నిలిచిపోయాడు. అయితే, ఎక్కువ సిక్స్లు ఇచ్చిన రెండో బౌలర్గా నిలిచాడు. ఆర్సీబీ తరఫున ఆడిన అతడు 16 మ్యాచ్లలో సిక్సర్ల రూపంలో 180 పరుగులు(30 సిక్స్లు) సమర్పించుకున్నాడు. మొత్తంగా 430 పరుగులు ఇచ్చాడు. 3. యజువేంద్ర చహల్ ఐపీఎల్-2022లో పర్పుల్ క్యాప్ విన్నింగ్ బౌలర్ యజువేంద్ర చహల్. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా సీనియర్ స్పిన్నర్.. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. ఒక 4 వికెట్, 4 వికెట్హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతాబాగానే ఉన్నా ఐపీఎల్-2022లో తాను సమర్పించుకున్న 527 పరుగులలో 27 సిక్సర్ల రూపంలో ఉండటం గమనార్హం. 4. శార్దూల్ ఠాకూర్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడాడు. మొత్తంగా 473 పరుగులు ఇచ్చి 15 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 సిక్సర్లు ఉన్నాయి. మెగా వేలంలో 10.75 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఢిల్లీ ఫ్రాంఛైజీ అంచనాలకు అనుగుణంగా ఈ సీమర్ రాణించలేదనే చెప్పాలి. 5. కుల్దీప్ యాదవ్ ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ కోసం చహల్తో పోటీ పడ్డాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్లలో ఈ చైనామన్ స్పిన్నర్ 21 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 419 పరుగులు ఇచ్చాడు. ఇందులో 22 సిక్సర్ల రూపంలో ఇచ్చినవే. ఇక తనదైన శైలితో రాణించిన కుల్దీప్ యాదవ్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చాలా కాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్ 9 నుంచి భారత్లో టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న దక్షిణాఫ్రికాతో పోరుకు అతడు సిద్ధమవుతున్నాడు. చదవండి: Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విమర్శలు పట్టించుకోకు కోహ్లి.. నువ్వేంటో నిరూపించు.. అప్పుడే: అక్తర్
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శలు చేయడం సరికాదని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కోహ్లి ఫామ్లేమి గురించి విమర్శించే వారు.. ఒక్కసారి అతడు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలన్నాడు. ఓ క్రికెటర్గా, అత్యుత్తమ ఆటగాడిగా గౌరవం పొందేందుకు కోహ్లి అర్హుడని పేర్కొన్నాడు. కాగా గతేడాది నుంచి ఫామ్లేమితో ఈ ‘రన్మెషీన్’ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతానన్న కోహ్లి.. మెగా టోర్నీలో ఘోర పరాభవంతో సారథ్య బాధ్యతలకు ముగింపు పలికాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సుదీర్ఘకాలంగా సారథిగా వ్యవహరించిన కోహ్లి.. గతేడాది ఆ బాధ్యతల నుంచి కూడా వైదొలిగాడు. ఇక కెప్టెన్సీ భారం లేకపోవడంతో ఈ సీజన్లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడనుకుంటే.. పూర్తిగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2022లో పదహారు మ్యాచ్లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు 341. సగటు 22.73. కేవలం రెండు అర్ధ శతకాలు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, వీరేంద్ర సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్లు కోహ్లి ఫామ్పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ కోహ్లికి అండగా నిలిచాడు. ఈ మేరకు స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కాస్త ముందూ వెనుకా ఆలోచించాలి. చిన్న పిల్లలు కూడా ఈ విషయాలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి కోహ్లి గురించి, అతడి ఆట గురించి కాస్త మంచి మాటలు చెప్పండి. గౌరవం పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు. ఆల్టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్. అతడు అంతర్జాతీయ క్రికెట్లో 110 సెంచరీలు చేయాలని నేను కోరుకుంటున్నా. 45 ఏళ్లు వచ్చే వరకు కోహ్లి క్రికెట్ ఆడుతూనే ఉండాలి’’ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. ‘‘110 సెంచరీలకు చేరువయ్యే క్రమంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నపుడు కొంతమంది నిన్ను తారస్థాయిలో విమర్శిస్తారు. నీకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తారు. నువ్వు దీపావళి గురించి ట్వీట్ చేసినా అందులో తప్పులు వెతుకుతారు. నీ భార్య, బిడ్డ గురించి కామెంట్లు చేస్తారు. నువ్వు వరల్డ్కప్లో ఓడిపోతే దారుణంగా విమర్శలు చేస్తారు. ఇలాంటివి అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీదైన శైలిలో ముందుకు సాగు. విరాట్ కోహ్లి అంటే ఏంటో వాళ్లకు ఒక్కసారి చూపించు’’ అని అక్తర్ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. చదవండి: Rafael Nadal: జొకోవిచ్కు షాకిచ్చిన నాదల్.. వరల్డ్ నంబర్ 1 ఘోర పరాజయం -
'ఉమ్రాన్ మాలిక్కు పెద్ద అభిమానిని.. మదిలోకి పాక్ దిగ్గజ బౌలర్'
ఎస్ఆర్హెచ్ స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022 సీజన్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రతీ బంతిని గంటకు 150 కిమీ వేగంతో సంధించే ఉమ్రాన్ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని(157.8 కిమీ) సంధించి రికార్డు సృష్టించాడు. ఇక బౌలింగ్లో దుమ్మురేపిన ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచ్ల్లో 22 వికెట్లు కొల్లగొట్టాడు. లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 5/25తో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. కాగా ఈ సీజన్లో తన ప్రదర్శనకు గానూ ఉమ్రాన్ మాలిక్ ''ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్'' అవార్డును కైవసం చేసుకున్నాడు. అతని బౌలింగ్కు ఫిదా అయిన మాజీ క్రికెటర్లు త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని పేర్కొనడమే తరువాయి.. దక్షిణాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికవ్వడం విశేషం.తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పీడస్టర్ బ్రెట్ లీ ఉమ్రాన్ మాలిక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను ఉమ్రాన్ మాలిక్కు పెద్ద అభిమానిని. అతని బౌలింగ్లో ఉండే వేగం ప్రత్యర్థి బ్యాటర్లను తగలెట్టేస్తుంది. ఫాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉమ్రాన్లో స్పష్టంగా ఉన్నాయి. కచ్చితమైన వేగం.. బులెట్ వేగంతో వచ్చే బంతులు.. ఇవన్నీ కలిపి ఉమ్రాన్ గురించి ఆలోచిస్తుంటే నాకు పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకు వస్తున్నాడు. వకార్ యూనిస్ కూడా ఫాస్ట్ బౌలింగ్కు పెట్టింది పేరు. గంటకు 150 కిమీవేగంతో బంతులు సందిస్తూ వికెట్లు తీసేవాడు. అందుకే అంత గొప్ప ఫాస్ట్ బౌలర్ అయ్యాడు. ఉమ్రాన్ కూడా ఏదో ఒకరోజు ఆ స్థాయికి చేరుకుంటాడని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Jos Buttler: పరుగులే కాదు.. ప్రైజ్మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..! -
పరుగులే కాదు.. ప్రైజ్మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు
ఐపీఎల్ 15వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా జాస్ బట్లర్ నిలిచాడు.17 మ్యాచ్ల్లో 863 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన బట్లర్.. ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అంతేకాదు బట్లర్ ఈ సీజన్లో నాలుగు సెంచరీతో దుమ్మురేపాడు. రాజస్తాన్ రాయల్స్కు బట్లర్ బ్యాటింగే ప్రధాన బలం అని చెప్పొచ్చు. అయితే బట్లర్ పరుగుల విషయంలోనే కాదు.. ప్రైజ్మనీ అందుకోవడంలోనూ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్ మొత్తంలో ఏకంగా 37 అవార్డులు అందుకున్న బట్లర్ వాటిద్వారా రూ.95 లక్షల ప్రైజ్మనీ ఖాతాలో వేసుకొని ఔరా అనిపించాడు. PC: IPL Twitter ఐపీఎల్ 15వ సీజన్ అవార్డుల్లో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్, గేమ్ చేంజర్, మ్యాగ్జిమమ్ ఫోర్స్, మ్యాగ్జిమమ్ సిక్సెస్, పవర్ ప్లేయర్ పురస్కారాలతో రూ. 60 లక్షలు గెలుచుకున్నాడు. లీగ్ స్టేజ్లో రెండుసార్లు, క్వాలిఫయర్–2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బట్లర్ వీటి ద్వారా రూ. 7లక్షలు సాధించాడు. వివిధ మ్యాచ్ల్లో పవర్ ప్లేయర్, గేమ్ చేంజర్, మోస్ట్ ఫోర్స్, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ అవార్డులతో మరో 28 లక్షలు కైవసం చేసుకున్నాడు. కాగా రాజస్థాన్ బట్లర్ను రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ ఫైనల్ చేరిందంటే అదంతా బట్లర్ చలువే. ఫైనల్లో బట్లర్ 39 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వడం.. ఆ తర్వాత ప్రధాన బ్యాటర్లంతా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైన రాజస్తాన్ రాయల్స్.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి' RuPay On-The-Go 4s of the Final between @gujarat_titans and @rajasthanroyals is Jos Buttler.#TATAIPL @RuPay_npci #RuPayOnTheGoFours #GTvRR pic.twitter.com/1bfGPK2dOc — IndianPremierLeague (@IPL) May 29, 2022 -
ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..!
టీమిండియా స్పిన్నర్ కరణ్ శర్మకు ఐపీఎల్లో అత్యంత అదృష్టవంతమైన ఆటగాడిగా పేరుంది. అతడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టుదే టైటిల్ అని అంతా భావిస్తారు. గత ఐదు సీజన్లలో మూడు సార్లు ఛాంపియన్స్గా నిలిచిన జట్టులో సభ్యుడిగా కరణ్ శర్మ ఉన్నాడు. అయితే ఈ సారి మాత్రం అతడి అదృష్టం ఆర్సీబీకి కలిసి రాలేదు. ఐపీఎల్-2022లలో ఆర్సీబీకి కరణ్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్లోనే ఇంటిముఖం పట్టింది. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్లో కరణ్ శర్మ కంటే అదృష్టవంతమైన మరో ఆటగాడు ఉన్నాడు. అతడే వెస్టిండీస్ యువ పేసర్ డొమినిక్ డ్రాక్స్. కరణ్ శర్మ కనీసం ఒకటో,రెండో మ్యాచ్లు ఆడి టైటిల్స్ గెలిస్తే.. డ్రాక్స్ మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా ఆడకుండా రెండు సార్లు ఛాంపియన్స్గా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. ఐపీఎల్-2021లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన డ్రాక్స్కు ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే గతేడాది ఛాంపియన్స్గా సీఎస్కే నిలిచింది. అదే విధంగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన డ్రాక్స్.. అన్నీ మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. చదవండి: Sachin Tendulkar Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు నో ఛాన్స్..! -
ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు నో ఛాన్స్..!
ఐపీఎల్ 15వ సీజన్ ఛాంపియన్స్గా హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్లోనే టైటిల్ సాధించి గుజరాత్ చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఏడాది సీజన్లో తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లు దుమ్ము రేపగా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ క్రికెటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో తన బెస్ట్ ఎలెవన్ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. తన ఎంచుకున్న జట్టుకు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్గా హార్ధిక్ పాండ్యాను మాస్టర్ బ్లాస్టర్ నియమించాడు. అదే విధంగా ఓపెనర్లుగా జోస్ బట్లర్, శిఖర్ ధావన్ను ఎంపిక చేశాడు. వరుసగా మూడు నాలుగు స్థానాల్లో కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. ఐదు ఆరు స్థానాల్లో డేవిడ్ మిల్లర్, లియమ్ లివింగ్ స్టోన్కు చోటు దక్కింది. ఏడో స్దానంలో ఫినిషర్గా డేవిడ్ మిల్లర్ అవకాశం ఇచ్చాడు. ఇక బౌలింగ్ ఆల్రౌండర్గా రషీద్ ఖాన్కి చోటు దక్కింది. అదే విధంగా బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ను లిటిల్ మాస్టర్ ఎంపిక చేశాడు. ఇక తన ప్రకటించిన జట్టులో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ 2022 బెస్ట్ ఎలెవన్: జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్స్టోన్, దినేష్ కార్తీక్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్. చదవండి: Irfan Pathan Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన..కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా..! -
రియల్ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా..
ఐపీఎల్-2022లో భాగమైన పిచ్ క్యూరేటర్లు,గ్రౌండ్స్మెన్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటిచింది. ఈ ఏడాది టోర్నీ జరిగిన ఆరు వేదికలలో పనిచేసిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్లకు రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటెరీ జై షా తెలిపారు. కాగా ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోడీ స్టేడియాల్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే నిర్వహించబడినందున.. ఒక్కో స్టేడియానికి రూ. 12.5 లక్షలు కేటాయించారు. మరో వైపు లీగ్ మ్యాచ్లకు అతిథ్యమిచ్చిన నాలుగు వేదికల క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్లకు రూ. 25 లక్షలు అందజేయనున్నారు. లీగ్ దశలో మ్యాచ్లు అన్నీ మహరాష్ట్రలోనే జరిగాయి. బ్రబౌర్న్,వాంఖడే, డివై పాటిల్ స్టేడియం, ఎంసీఎ స్టేడియం వేదికగా మ్యాచ్లు జరిగాయి. ఒక్కో స్టేడియానికి రూ. 25 లక్షలు రివార్డుగా అందనుంది. "ఐపీఎల్-2022లో అద్భుతమైన మ్యాచ్లు అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్లకు రూ. 1.25 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో 6 వేదికలలో పనిచేసిన మా క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్ తెర వెనుక రియల్ హీరోలు" అని జై షా ట్విటర్లో పేర్కొన్నారు. ఇక ఐపీఎల్-2022 ఛాంపియన్స్గా గుజరాత్ టైటన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: Darren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు -
IPL 2022: ‘ప్రపంచకప్ అందుకోవడమే లక్ష్యం’
అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా నాలుగుసార్లు ఐపీఎల్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఐదోసారి ట్రోఫీని అందుకున్న అతనికి ఇది మరింత ప్రత్యేకం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా జట్టుకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా నాయకుడిగా మరో మెట్టెక్కాడు. కెప్టెన్ కావడం తన బాధ్యతను పెంచిందని, నాయకత్వాన్ని ప్రతీ క్షణం ఆస్వాదించానని అతను వ్యాఖ్యానించాడు. ‘అదనపు బాధ్యత తీసుకునేందుకు నేనెప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎప్పుడు అవకాశం లభించినా మిగతా వారిలో స్ఫూర్తి నింపేలా జట్టును ముందుండి నడిపించాలని భావించేవాడిని. నా జట్టు సహచరుల నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నానో వారికంటే ముందు నేను చేసి చూపించాలి. అలా చేస్తేనే దాని ప్రభావం ఉంటుంది. ఐపీఎల్లో నేను అలాగే చేశానని నమ్ముతున్నా’ అని పాండ్యా అన్నాడు. కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే సాధించిన ఐపీఎల్ ట్రోఫీకి తన దృష్టిలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని అతను చెప్పాడు. ‘గతంలో నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో ఉన్నాను. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఈసారి నా కెప్టెన్సీలో టైటిల్ గెలిచాం కాబట్టి సహజంగానే ఇది మరింతగా ఇష్టం. ఈ గెలుపు రాబోయే రోజుల్లో ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. ఫైనల్కు వెళ్లిన ఐదుసార్లూ కప్ను అందుకోగలిగిన నేను చాలా అదృష్టవంతుడిని. ఈ రోజు నాది. పైగా లక్షకు పైగా అభిమానులు మాకు అండగా నిలిచారు. మా కష్టానికి దక్కిన ప్రతిఫలమిది’ అని ఈ ఆల్రౌండర్ విశ్లేషించాడు. టి20లు బ్యాటర్ల ఆట మాత్రమే అని చాలా మంది అనుకుంటారని, అయితే ఈ ఫార్మాట్లో బౌలర్లే మ్యాచ్ గెలిపించగలరని హార్దిక్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్లో తగినంత స్కోరు లేని సమయంలోనూ మంచి బౌలర్లు ఉంటే మ్యాచ్ను మలుపు తిప్పగలరని అతను అన్నాడు. హార్దిక్ పాండ్యా తన తదుపరి లక్ష్యం ప్రపంచకప్ గెలుచుకోవడమే అని ప్రకటించాడు. టీమిండియా తరఫున మూడు ఐసీసీ టోర్నీలలో భాగంగా ఉన్నా... ఒక్కసారి కూడా అతనికి విజయానందం దక్కలేదు. ‘ఎవరికైనా భారత జట్టు తరఫున ఆడటమనేది ఒక కల. నేను ఇప్పటికే ఎన్నో మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించి మనోళ్ల అభిమానాన్ని చూరగలిగాను. ఇక టీమిండియా సభ్యుడిగా వరల్డ్కప్ గెలుపులో భాగం కావడమనేదే నా లక్ష్యం. అందుకోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. నేను ఏ రకంగా జట్టుకు ఉపయోగపడినా చాలు’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ వేదికలకు నజరానా ఈ ఐపీఎల్ సీజన్లో జరిగిన 74 మ్యాచ్లను సమర్థంగా నిర్వహించడంతో పాటు చక్కటి పిచ్లను రూపొందించిన ఆరు వేదికలకు బీసీసీఐ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ముంబైలోని వాంఖెడే, బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు పుణేలోని ఎంసీఏ మైదానంలో లీగ్ దశ మ్యాచ్లు జరగగా... కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియాలు ప్లే ఆఫ్స్కు ఆతిథ్యం ఇచ్చాయి. లీగ్ మ్యాచ్లు జరిగిన స్టేడియాలు ఒక్కో దానికి రూ.25 లక్షలు, ప్లే ఆఫ్స్ నిర్వహించిన మైదానాలకు ఒక్కోదానికి రూ. 12.5 లక్షల చొప్పున బహుమతిని బోర్డు ప్రకటించింది. -
ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా..!
Irfan Pathan best XI IN IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ ఆదివారంతో ముగిసింది. ఐపీఎల్-2022 చాంఫియన్స్గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ ఏడాది సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టాయి. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే టైటిల్ను ముద్దాడగా.. రాహుల్ కెప్టెన్సీలోని లక్నో ప్లే ఆఫ్స్లో తన ప్రయాణాన్ని ముగించింది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో ఆయా జట్ల యువ ఆటగాళ్లు దుమ్మురేపారు. అదే విధంగా దినేష్ కార్తీక్, చాహల్,కుల్ధీప్ యాదవ్ వంటి వెటరన్ ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో తన బెస్ట్ ఎలెవన్ను మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు. తన ఎంచుకున్న జట్టుకు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్గా పఠాన్ ఎంచుకున్నాడు. అదే విధంగా ఓపెనర్లుగా జోస్ బట్లర్, కేఎల్ రాహుల్ను ఎంపిక చేశాడు. వరుసగా మూడు నాలుగు స్థానాల్లో సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. ఐదు ఆరు స్థానాల్లో లాయమ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్కు చోటు దక్కింది. ఇక బౌలింగ్ ఆల్ రౌండర్లగా రషీద్ ఖాన్,హార్షల్ పటేల్ను పఠాన్ ఎంపిక చేశాడు. ఆదే విధంగా బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, యజువేంద్ర చహాల్, ఉమ్రాన్ మాలిక్కు అతడు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులో 12వ ఆటగాడిగా స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్-2022 బెస్ట్ ఎలెవన్: జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ (12వ ఆటగాడు- కుల్దీప్ యాదవ్) చదవండి: IPL 2022: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్ కోచ్గా! -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్ కోచ్గా..!
ఐపీఎల్లో టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత హెడ్ కోచ్గా ఆశిష్ నెహ్రా నిలిచాడు. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్గా నెహ్రా బాధ్యతలు నిర్వహించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ ఈ ఏడాది టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక హెడ్ కోచ్గా గుజరాత్ విజయంలో నెహ్రా కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పటి వరకు షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్,జయవర్ధనే వంటి విదేశీ హెడ్కోచ్ల నేతృత్వంలో ఆయా జట్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాయి. కాగా అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న హెడ్ కోచ్ల జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆయన కోచింగ్లో సీఎస్కే నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే మూడు టైటిల్స్తో రెండవ స్థానంలో ఉన్నాడు. చదవండి: IPL GT Mentor Gary Kirsten: గుజరాత్ టైటాన్స్ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే -
ఐపీఎల్-2022లో ఉమ్రాన్ మాలిక్ ఎంత సంపాదించాడంటే..!
సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్-2022లో అద్భుతంగా రాణించాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఉమ్రాన్.. ఏకంగా భారత జట్టలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్కు ఉమ్రాన్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్లో ఉమ్రాన్ మాలిక్ ఎంత సంపాందించాడో ఓసారి గమనిద్దాం. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు మాలిక్ దే. ఈ అవార్డుల ద్వారా మాలిక్ రూ. 14 లక్షలు సంపాదించాడు. అదే విధంగా పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన మాలిక్కు రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు కూడా లభించింది. ఈ రెండు అవార్డుల ద్వారా అతడు రూ. 2లక్షలు సంపాదించాడు. ఇవే గాక గుజరాత్, పంజాబ్ తో మ్యాచ్ లలో ప్రదర్శనకు గాను గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల ద్వారా మరో రెండు లక్షలు పొందాడు. పంజాబ్ తో మ్యాచ్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఉమ్రాన్కే దక్కింది. దీనికి ఓ లక్ష. మొత్తంగా రూ. 3 లక్షలు ఉమ్రానక్కు దక్కాయి. అదే విధంగా అతడికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డు రూపంల మరో రూ.10 లక్షలు దక్కాయి. కాగా ఈ ఏడాది సీజన్లో మొత్తం అవార్డుల రూపంలో ఉమ్రాన్ మాలిక్ రూ. 29 లక్షలు సంపాదించాడు. చదవండి: IPL 2022 Final Prize Money, Awards: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్మనీ ఎంతంటే! -
'హార్ధిక్ పాండ్యా ఖచ్చితంగా టీమిండియా కెప్టెన్ అవుతాడు'
అరంగేట్ర సీజన్లోనే జట్టుకు టైటిల్ను అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్ధిక్ అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ను కలిగి ఉన్నాడని గవాస్కర్ కొనియాడాడు. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఫైనల్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్-2022లో హార్ధిక్ పాండ్యా సారథిగా అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో 10 విజయాలు సాధించి గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ప్రస్తుత సీజన్లో హార్ధిక్ బాల్తో,బ్యాట్తో కూడా అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్లు ఆడిన హార్ధిక్ 487 పరుగుల తో పాటు, 8 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక రాజస్తాన్తో జరిగిన ఫైనల్లో కూడా పాండ్యా మూడు కీలక వికెట్లతో పాటు, 34 పరుగులు సాధించాడు. ఇక పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ అవకాశాలు గురించి గవాస్కర్ మాట్లాడూతూ.. " హార్ధిక్ ఖచ్చితంగా భారత జట్టుకు సారథి అవుతాడు. ఇది నా అంచనా మాత్రమే కాదు. అందరి అంచానా కూడా. ఈ సీజన్లో అతడు బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించాడు. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు పాండ్యా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలడా అన్న సందేహం అందరిలో నెలకొంది. వాటిని పటాపంచలు చేస్తూ అతడు తన సత్తా ఎంటో చూపించాడు. ఏ ఆటగాడైనా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే.. భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్గా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ రేసులో పాండ్యాతో పాటు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు కూడా ఉన్నారు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 Winner: క్రెడిట్ మొత్తం ఆయనకేనన్న హార్దిక్.. అంతా అబద్ధం! కాదు నిజమే! -
'అదృష్టం అంటే అతడిదే.. సరిగా ఆడకపోయినా.. నుదుటన రాసిపెట్టి ఉంది'
ఐపీఎల్లో అదృష్టవంతమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది మన విజయ్ శంకర్ మాత్రమే. కాకపోతే చెప్పండి.. వేలంలో విజయ్ శంకర్పై ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ రూ. 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. మల్టీ డైమన్షల్ ప్లేయర్గా ముద్రించుకున్న విజయ్ శంకర్ ఐపీఎల్లో ఏన్నాడు పెద్దగా మెరిసింది లేదు. ఈ సీజన్లోనూ నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడిన విజయ్ శంకర్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. తన ఆటతీరుతో జట్టుకు భారమయ్యాడు తప్ప అతని వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదు. ఈ విషయాన్ని తొందరగానే గ్రహించిన హార్దిక్.. అతన్ని బెంచ్కే పరిమితం చేశాడు. PC: IPL Twitter అయితే నుదుటన అదృష్టం రాసిపెట్టి ఉంటే మ్యాచ్లు ఆడకపోయినా టైటిల్ కొల్లగొట్టిన జట్టులో సభ్యుడిగా ఉండడం విజయ్ శంకర్కు మాత్రమే చెల్లింది. అతని విషయంలో ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2016లోనూ ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టులోనూ విజయ్ శంకర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇంకో విచిత్రమేంటంటే ఆ సీజన్లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో వార్నర్ సేన విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. 2016లో ఎస్ఆర్హెచ్ తరపున(PC: IPL Twitter) దీంతో అభిమానులు విజయ్ శంకర్ను తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''అదృష్టమంటే విజయ్ శంకర్దే.. సరిగా ఆడకపోయినా ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో భాగస్వామ్యమయ్యాడు.. బహుశా ఇలాంటి రికార్డు విజయ్ శంకర్కు మాత్రమే సాధ్యమైందనుకుంటా'' అంటూ కామెంట్స్ చేశారు.ఇక ఐపీఎల్ 15వ సీజన్లో ఆదివారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఫైనల్లో హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ కొల్లగొట్టి గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి' -
'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి'
ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఆటతీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సీజన్లో రాజస్తాన్ తరపున వ్యర్థమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రియాన్ పరాగేనని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. అసలు సీజన్లో పరాగ్ది ఏ రోల్ అనేది(ఉదా: బ్యాటింగ్, బౌలర్, ఆల్రౌండర్) క్లారిటీ లేదని తెలిపారు. గత సీజన్లో కొన్ని మంచి ఇన్నింగ్స్లతో పేరు పొందిన రియాన్ పరాగ్.. ఐపీఎల్ 15వ సీజన్లో సూపర్గా రాణిస్తాడని అంతా భావించారు. PC: IPL Twitter కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 15 మ్యాచ్ల్లో ఒకే ఒక్క అర్థశతకంతో 183 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పరాగ్ బ్యాటింగ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. బట్లర్ విఫలమయ్యాడు.. ప్రధాన బ్యాటర్స్ అంతా అప్పటికే వెనుదిరిగారు. ఇక క్రీజులో ఉన్న రియన్ పరాగ్ ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ అనుకుంటే కనీసం రాజస్తాన్ పోరాడే స్కోరు అందించినా బాగుండేది. అలా జరగకపోగా.. చివరి వరకు నిలిచిన పరాగ్ 15 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 15 పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యాడు. అతని కంటే బౌల్ట్, మెకాయ్లు చాలా నయం.. ఎందుకుంటే వాళ్లిదరు రెండు సిక్సర్లు బాది 19 పరుగులు జత చేసి వెళ్లారు. ఇక గత సీజన్లో మంచి స్ట్రైక్రేట్ కలిగిన పరాగ్.. తన చెత్త ఆటతీరుతో ఈ సీజన్లో అశ్విన్ తర్వాత బ్యాటింగ్కు రావడం అతని పరిస్థితిని తెలియజేస్తుంది. ఇంత ఘోరంగా విఫలమైనప్పటికి సంజూ శాంసన్ పరాగ్కు ఇన్ని అవకాశాలు ఎందుకు ఇచ్చాడనేది ప్రశ్నార్థకమే. దీనికి తోడూ పరాగ్ క్యాచ్ పట్టినా.. రనౌట్ చేసినా.. బ్యాటింగ్లో ఫోర్ లేదా సిక్సర్ బాదిన.. అతను చేసే ఓవర్ యాక్షన్ తట్టుకోవడం అభిమానులకు కష్టంగా మారింది. రియాన్ పరాగ్పై వచ్చిన ఫన్నీ ట్రోల్స్పై ఒక లుక్కేయండి. Riyan Parag didn’t take a single of the 1st bowl of shami and also hits a six…but honestly im still wondering what is riyan specialised in…??? Feel obed mccoy was more capable of hitting sixes than Riyan…Riyan 15ball 15runs n then bowled by shami 🤦♂️🤦♂️🤦♂️ @rajasthanroyals — Samip Rajguru (@samiprajguru) May 29, 2022 When R Ashwin came to play at number 5 it was proven that the team does not have a strong batting lineup. The overhyped player Riyan Parag did nothing, he didn't even try to hit big shots when only a few balls were left for the inning. #RRvGT #IPLFinals — Ali shaikh (@alishaikh3310) May 29, 2022 Trent Boult + Obed McCoy - 19(12) with 2 sixes Riyan Parag - 15(15) with one four I still don't know his role in the team — mister t-man (@techsaturation) May 29, 2022 ఇక ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ చివరి వరకు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. 2008 తర్వాత మరోసారి ఫైనల్ చేరిన రాజస్తాన్ రెండోసారి కప్ కొట్టబోతుందని చాలా మంది అభిమానులు భావించారు. అయితే ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఫేలవ ప్రదర్శనతో ఓటమిపాలై రెండోసారి టైటిల్ కొట్టాలన్న కలను నెరవేర్చుకోలేకపోయింది. అయితే ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఒక మ్యాచ్ గెలిచింది అంటే ఆ మ్యాచ్లో బట్లర్ మెరుపులు మెరిపించాడు అనేంతలా పేరొచ్చింది. ఎందుకంటే రాజస్తాన్ బ్యాటింగ్లో బట్లర్ ఒక ఎత్తు అయితే.. మిగతావారు మరొక ఎత్తు. జట్టుకు బట్లర్ బలం.. అతనే బలహీనత. మొత్తానికి సీజన్లో రన్నరప్గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ వచ్చే సీజన్లోనైనా కప్ కొడుతుందేమో చూడాలి. చదవండి: Trolls On GT IPL 2022 Win: 'ఊహించిందే జరిగింది.. మ్యాచ్ ఫిక్సింగ్ గట్రా.. ఏమి లేవుగా?!' IPL 2022 Winner: క్రెడిట్ మొత్తం ఆయనకేనన్న హార్దిక్.. అంతా అబద్ధం! కాదు నిజమే! -
IPL 2022: క్రెడిట్ మొత్తం ఆయనకేనన్న హార్దిక్.. అంతా అబద్ధం!
IPL 2022 Winner GT: ‘‘మొదటి సీజన్లోనే మనం సిక్సర్ కొట్టాము. చాంపియన్లుగా నిలిచాం. ఇది మనకు గర్వకారణం. మన బ్యాటింగ్, బౌలింగ్ విభాగం మరీ అంత గొప్పగా ఏమీ లేదని చాలా మంది అన్నారు. అయినా మనం ట్రోఫీ గెలిచాం. నిజంగా ఇది చాలా బాగుంది కదా’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. తమ కోచ్ ఆశిష్ నెహ్రాతో ముచ్చటిస్తూ ఐపీఎల్-2022లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. కాగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ ఆరంభం నుంచి ఆధిక్యం కనబరిచి.. రాజస్తాన్ రాయల్స్తో ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో తమ మొదటి సీజన్లోనే టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆశిష్ నెహ్రా- హార్దిక్ పాండ్యా సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఆశిష్ నెహ్రాపై పాండ్యా ప్రశంసలు కురిపించాడు. ‘‘మాలో మొదట ప్రాక్టీసుకు వెళ్లేది నెహ్రా. 20 నిమిషాల సమయం ఉన్నా సరే ప్రాక్టీసు అయిపోయినా మళ్లీ మళ్లీ బ్యాటింగ్ చేయమంటారు. నిజానికి ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది. అంకితభావంతో పనిచేశారు. మాలో ప్రతి ఒక్కరు హార్డ్వర్క్ చేసేలా ప్రోత్సహించారు’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, హార్దిక్ పాండ్యా మాటలకు మొహమాటపడిన నెహ్రా.. ‘‘ఇదంతా అబద్ధం’’ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అబద్ధం కాదు నిజమే! హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి వేలం రోజు నుంచి గుజరాత్ విజేతగా నిలిచే క్రమంలో తమదైన రీతిలో జట్టును తీర్చిదిద్దారు. లీగ్ సాగినంత కాలం జట్టు యాజమాన్యం ‘సీవీసీ క్యాపిటల్స్’ నుంచి ఒక్క వ్యక్తి కూడా ‘చిత్రం’లో ఎక్కడా కనిపించలేదు. అంతా వీరిద్దరికే అప్పగించారు. బ్యాటింగ్ కోచ్గా గ్యారీ కిర్స్టెన్ ఉన్నా... నిర్ణయాత్మక పాత్ర పై ఇద్దరిదే. చాలా మంది కోచ్లతో పోలిస్తే పూర్తి భిన్నమైన శైలితో నెహ్రా పని చేశాడు. ఆధునిక కోచ్ల తరహాలో చేతిలో పెన్నూ, పేపర్తో నోట్స్ రాసుకోవడం, ప్రతీ దానిని విశ్లేషణాత్మకంగా చూడటం అతను ఎప్పుడూ చేయలేదు. తాను చెప్పదల్చుకున్న అంశంపై డ్రెస్సింగ్ రూమ్లోనే ఒకే ఒక స్పష్టతనిచ్చేయడం, అమలు చేసే అంశాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటగాళ్లకే వదిలేసి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. సరిగ్గా చూస్తే గుజరాత్ టైటాన్స్ టీమ్లో ఫలానా ఆటగాడు ఘోరంగా విఫలమయ్యాడని ఒక్కరిని కూడా వేలెత్తి చూపలేం! వేలంలో 37 మంది పేర్లు వచ్చినప్పుడు గుజరాత్ పోటీ పడినా... చివరకు తమ అవసరాలను అనుగుణంగా కచ్చితంగా ఎంచుకుంటూ 20 మందినే తీసుకోవడంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సోలంకిదే ముఖ్య భూమిక. ఆటతో పాటు అన్నీ కలిసొచ్చిన గుజరాత్ సొంత అభిమానుల సమక్షంలో ఐపీఎల్ ట్రోఫీని అందుకోగలిగింది. ఐపీఎల్-2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ ►టాస్: రాజస్తాన్ ►రాజస్తాన్ స్కోరు: 130/9 (20) ►గుజరాత్ స్కోరు: 133/3 (18.1) ►విజేత: ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్-2022 చాంపియన్గా గుజరాత్ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, 30 బంతుల్లో 34 పరుగులు) చదవండి 👇 IPL 2022 Final Prize Money, Awards: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్మనీ ఎంతంటే! Hardik Pandya-Natasa Stankovic:'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' View this post on Instagram A post shared by IPL (@iplt20) Let's ꜱᴀᴠᴇ this forever, #TitansFAM! 💙pic.twitter.com/66X3QqQXH7 — Gujarat Titans (@gujarat_titans) May 29, 2022 -
'ఊహించిందే జరిగింది.. మ్యాచ్ ఫిక్సింగ్ గట్రా.. ఏమి లేవుగా?!'
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తేం కాదు. 2013 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. రాజస్తాన్ రాయల్స్కు చెందిన ఆటగాళ్లు సహా ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్లు సహా పలువురు వ్యక్తులు అరెస్టవడం సంచలనం కలిగించింది. ఈ ఉదంతం ఐపీఎల్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. ఒక రకంగా ఐపీఎల్ ఫిక్సింగ్ అని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్లో నాటుకుపోయేలా చేసింది. ఎంత ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పటికి ఐపీఎల్కున్న క్రేజ్ 15 ఏళ్లలో ఇసుమంతైనా తగ్గలేదు. PC: IPL Twitter తాజాగా ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్స్గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్లో టైటిల్ కొట్టి గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. అయితే మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ అనే అంశం తెరమీదకు వచ్చింది. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం నుంచి అందరూ ఊహించినట్లుగానే హార్దిక్ సేన కప్ కొట్టడంపై సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్, మీమ్స్ వైరల్గా మారాయి. గుజరాత్ టైటాన్స్ నిజాయితీగా కప్ కొట్టుంటే సమస్య లేదు గానీ.. ఒకవేళ ఫిక్సింగ్ గట్రా ఏమైనా ఉంటే మాత్రం చర్చించాల్సిన విషయమే అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. PC: IPL Twitter సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ రావడం వెనుక ఒక కారణం ఉంది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ.. బీసీసీఐ సెక్రటరీ జై షా దగ్గరి వ్యక్తులకు చెందింది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక జై షా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు కూడా కావడం.. తొలిసారి ఒక ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్లో బరిలోకి దిగడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాదు ప్రధాని మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ పేరుతో ఒక ఫ్రాంచైజీ బరిలోకి దిగుతుందంటే మాములుగా ఉండదు. ఎలాగైనా ఆ జట్టే కప్ కొట్టాలని ముందుగానే నిర్ణయించినట్లు వార్తలు వినిపించాయి. అందుకే లీగ్లో విజయాలతో అప్రతిహాతంగా దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్, ఫైనల్లోనూ అదే దూకుడు కనబరిచింది. ఇంకో విషయమేంటంటే.. ఫైనల్కు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వచ్చారు. దేశాన్ని పరిపాలిస్తున్న ఒక పార్టీ నుంచి ముఖ్యమైన వ్యక్తి వేలాది మంది భద్రత మధ్య ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రావడం కూడా ఫిక్సింగ్ అనే పదం వినిపించడానికి కారణం అయింది. ఇక దీనికి సంబంధించిన ట్రోల్స్, మీమ్స్పై ఒక లుక్కేయండి. మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదం పక్కనబెడితే.. గుజరాత్ టైటాన్స్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సీజన్ ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యం చూపించిన గుజరాత్.. అరంగేట్రం సీజన్లోనే టైటిల్ను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. లీగ్ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకమైన ఫైనల్లో తానెంత గొప్ప ఆల్రౌండర్ అనేది మరోసారి రుచి చూపించాడు.అటు కెప్టెన్గా రాణించడంతో పాటు.. ముందు బౌలింగ్లో మూడు కీలక వికెట్లు, బ్యాటింగ్లో 34 పరుగులు చేసిన పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: గుజరాత్ టైటాన్స్ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' 𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆 🙌 That moment when the @gujarat_titans captain @hardikpandya7 received the IPL trophy from the hands of Mr. @SGanguly99, President, BCCI and Mr. @JayShah, Honorary Secretary, BCCI. 👏 👏#TATAIPL | #GTvRR pic.twitter.com/QKmqRcemlY — IndianPremierLeague (@IPL) May 29, 2022 #fixing Post fixing scenes pic.twitter.com/atznnAVrKk — Vishnu K B (@Vishnukb8055) May 29, 2022 Game Changer Of The Match !! 🤣😂#ipl #iplfinal #gujarattitans #IPL2022Final #IPL2022 #fixing #GT #Congratulation pic.twitter.com/XDAGFuhXTd — Omkar Balekar (@MrOmkarBalekar) May 29, 2022 Next election in Gujarat#fixing pic.twitter.com/blbt96Yudr — imran baig (@imranba41465365) May 29, 2022 Hardik pandya doesn't look that excited..looks like he knew the result before the game #fixing — Deeraj (@deerajpnrao) May 29, 2022 most boring IPL final EVER. Congratulations GT #IPLFinal #IPL2022Final pic.twitter.com/2g3dkrSyRs — AkshayKTRS (@AkshayKtrs) May 29, 2022 -
IPL 2022: అంబరాన్నంటిన గుజరాత్ సంబరాలు.. ఫొటో హైలైట్స్
IPL 2022: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది గుజరాత్ టైటాన్స్. సీవీసీ క్యాపిటల్స్కు చెందిన ఈ జట్టు అరంగేట్రంలోనే ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకంగా మార్చుకుంది. దీంతో హార్దిక్ పాండ్యా సేన సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలపై ఓ లుక్కేయండి. హార్దిక్ పాండ్యా ముఖానికి కేక్ పూస్తున్న రషీద్ ఖాన్(PC: IPL/BCCI) భార్య నటాషాతో హార్దిక్ పాండ్యా(PC: IPL/BCCI) కోచ్ ఆశిష్ నెహ్రాతో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(PC: IPL/BCCI) ఐపీఎల్ ట్రోఫీతో హార్దిక్ పాండ్యా దంపతులు(PC: IPL/BCCI) ట్రోఫీతో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్(PC: IPL/BCCI) ట్రోఫీ గెలిచిన సంబరంలో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్(PC: IPL/BCCI) (మరిన్ని ఫొటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IPL 2022 Winner: అప్పుడు రాజస్తాన్.. ఇప్పుడు గుజరాత్
IPL 2022: ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్లో ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి వరుస విజయాలతో దూసుకుపోయిన హార్దిక్ సేన తొలుత టేబుల్ టాపర్గా నిలిచిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో 14 మ్యాచ్లలో ఏకంగా పది గెలిచి 20 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక క్వాలిఫైయర్-1లో రాజస్తాన్ రాయల్స్పై విజయం సాధించిన గుజరాత్.. ఫైనల్లోనూ ఆ జట్టును ఓడించి టైటిల్ గెలిచింది. ఈ విధంగా అప్రహిత విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్లో నిలవడమే గాకుండా కప్ గెలిచిన హార్దిక్ పాండ్యా బృందం అరుదైన ఘనత సొంతం చేసుకుంది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో లీగ్ దశలో టాపర్ కావడంతో పాటు టైటిల్ విజేతగా నిలిచిన మూడో జట్టుగా గుర్తింపు దక్కించుకుంది. అంతకు ముందు రాజస్తాన్ రాయల్స్(2008), ముంబై ఇండియన్స్(2017, 2019, 2020) రికార్డు సాధించాయి. ఇక రాజస్తాన్ ఐపీఎల్ తొలి సీజన్ విజేత కాగా.. ముంబై ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ ►టాస్: రాజస్తాన్ ►రాజస్తాన్ స్కోరు: 130/9 (20) ►గుజరాత్ స్కోరు: 133/3 (18.1) ►విజేత: ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్-2022 చాంపియన్గా గుజరాత్ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, 30 బంతుల్లో 34 పరుగులు) చదవండి 👇 IPL 2022 Final Prize Money, Awards: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్మనీ ఎంతంటే! Hardik Pandya: సాహో హార్దిక్.. గతంలో కెప్టెన్సీ అనుభవం లేదు.. అప్పటికే ఎత్తుపల్లాలు.. అయినా Let's ꜱᴀᴠᴇ this forever, #TitansFAM! 💙pic.twitter.com/66X3QqQXH7 — Gujarat Titans (@gujarat_titans) May 29, 2022 -
గుజరాత్ టైటాన్స్ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే
క్రికెట్లో ఒక జట్టు మేజర్ కప్ గెలిచిదంటే ముందుగా పేరొచ్చేది జట్టు కెప్టెన్కే. ఎందుకంటే కెప్టెన్ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి. ఒక కెప్టెన్గా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై జట్టును ముందుండి నడిపించి చాంపియన్గా నిలపడం అతని లక్ష్యం. కానీ కెప్టెన్ పేరు ప్రత్యక్షంగా కనిపిస్తే.. తెరవెనుక కనిపించని హీరో మరొకరు ఉంటారు. అతనే టీమ్ కోచ్. జట్టులో ఎవరు సరిగా ఆడుతున్నారు.. ఎవరు బలహీనంగా ఉన్నారు.. బాధ్యతగా ఎవరు ఆడుతున్నారు.. ఒక ఆటగాడి వల్ల జట్టుకు ఎంత ఉపయోగం అనేది కోచ్ దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. ప్రత్యక్షంగా కెప్టెన్కు ఎంత పేరు వస్తుందో.. కోచ్కు కూడా అంతే ఉంటుంది. అయితే అది తెర వెనుక మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా అన్నీ తానై నడిపించిన హార్దిక్ పాండ్యాను మెచ్చుకోవడానికి ముందు మరొక అజ్ఞాతవ్యక్తిని తప్పక పొగడాల్సిందే. గుజరాత్ టైటాన్స్ మెంటార్స్గా టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టెన్ ఉన్న సంగతి తెలిసిందే. ఆశిష్ నెహ్రా గురించి పక్కనబెడితే కిర్స్టెన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. PC: IPL Twitter ఎప్పుడైతే గ్యారీ కిర్స్టెన్ గుజరాత్ టైటాన్స్కు మెంటార్గా వచ్చాడో.. ఆ జట్టు అప్పుడే సగం విజయం సాధించినట్లయింది. ఎందుకంటే కిర్స్టెన్ ఎంత గొప్ప కోచ్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011 వన్డే వరల్డ్కప్ టీమిండియా గెలవడంలో కోచ్ కిర్స్టెన్ పాత్ర కీలకం. నాయకుడిగా ధోని జట్టును ముందుండి నడిపిస్తే.. తెరవెనుక కోచ్ పాత్రలో కిర్స్టెన్ విలువైన సలహాలు ఇచ్చి టీమిండియాను 28 ఏళ్ల తర్వాత జగజ్జేతగా నిలిపాడు. అలాంటి వ్యక్తి.. గుజరాత్ టైటాన్స్కు మెంటార్గా రావడం.. అతని సలహాలు కెప్టెన్ పాండ్యా తప్పకుండా పాటించడం జట్టుకు మేలు చేశాయి. PC: IPL Twitter ఐపీఎల్ 2022లో ''మ్యాచ్ కిల్లర్''గా మారినడేవిడ్ మిల్లర్ ఆరంభ మ్యాచ్ల్లో పెద్దగా రాణించింది లేదు. అయినప్పటికి హార్దిక్ అతన్ని జట్టులో కొనసాగించడంపై మాస్టర్ ప్లాన్ కిర్స్టెన్దే. కట్చేస్తే మిల్లర్ ఫైనల్లోనూ చెలరేగి గుజరాత్ టైటాన్స్కు కప్ అందించాడు. అంతేకాదు లీగ్ ఆరంభానికి ముందు పాండ్యాపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అంతకముందు జరిగిన టి20 ప్రపంచకప్లో దారుణ ప్రదర్శనతో జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో గుజరాత్కు కెప్టెన్గా రావడం.. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేలా కిర్స్టెన్ పాండ్యాను ప్రోత్సహించడం జరిగిపోయాయి. మాటలు ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువ చేతల్లోనే పనిని చూపించే వ్యక్తి కిర్స్టెన్.. ఒక రకంగా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంలో తన పాత్ర కూడా ఉంటుంది. చదవండి: 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక -
'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే'
ఐపీఎల్ 2022 సీజన్ చాంపియన్స్గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యం చూపించిన గుజరాత్.. అరంగేట్రం సీజన్లోనే టైటిల్ను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. లీగ్ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకమైన ఫైనల్లో తానెంత గొప్ప ఆల్రౌండర్ అనేది మరోసారి రుచి చూపించాడు. అటు కెప్టెన్గా రాణించడంతో పాటు.. ముందు బౌలింగ్లో మూడు కీలక వికెట్లు, బ్యాటింగ్లో 34 పరుగులు చేసిన పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. PC: IPL Twitter సీజన్ ప్రారంభానికి ముందు పాండ్యాపై విమర్శలు దారుణంగా వచ్చాయి. ఫామ్లో లేని హార్దిక్ పాండ్యా జట్టును ఏం నడిపిస్తాడు.. ఆల్రౌండర్గా పనికిరాలేడు.. ఇక కెప్టెన్గా ఏం చేస్తాడంటూ అవమానించారు. ఆ సమయంలో పాండ్యాకు తన భార్య నటాషా స్టాంకోవిక్ అండగా నిలబడింది. తన కొడుకు అగస్త్యతో కలిసి గుజరాత్ టైటాన్స్ ఆడిన ప్రతీ మ్యాచ్కు హాజరై ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. హార్దిక్ ఔటైన రోజున ముఖం మాడ్చుకోవడం.. అతను విజృంభించిన రోజున పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేయడం.. ఇలా తన చర్యలతో సీజన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. PC: IPL Twitter ఇక ఫైనల్లో తన భర్త కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పాటు బౌలింగ్లోనూ.. కెప్టెన్గానూ మెరవడంతో నటాషా ఊరుకుంటుందా.. అందుకే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్ గెలవగానే గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చి పాండ్యాను గట్టిగా హగ్ చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీజన్ ఆరంభానికి ముందు పాండ్యా కెప్టెన్గా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టులో ఇద్దరు, ముగ్గురు మినహా పెద్ద పేరున్న ఆటగాళ్లు లేకపోవడంతో ప్లేఆఫ్కు వెళ్లడమే ఎక్కువని అంతా భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంతో ప్లే ఆఫ్ చేరుకుంది. ఆ తర్వాత క్వాలిఫయర్-1లో.. మరోసారి ఫైనల్లో రాజస్తాన్ను చిత్తు చేసి చాంపియన్గా నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) pic.twitter.com/1wXDKuCKXm — Ashok (@Ashok94540994) May 29, 2022