ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జ‌ట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్ | Virender Sehwag Backs This Side To Win IPL 2025 | Sakshi
Sakshi News home page

ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జ‌ట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్

Jun 3 2025 9:48 AM | Updated on Jun 3 2025 10:34 AM

Virender Sehwag Backs This Side To Win IPL 2025

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025 సీజ‌న్ తుది అంకానికి చేరుకుంది. రెండు నెల‌ల పాటు అభిమానులను అల‌రించిన ఈ మెగా టోర్నీ.. మంగ‌ళ‌వారంతో ముగియ‌నుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ పోరులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరంభం నుంచి బరిలో నిలిచినా ఒక్కసారి కూడా ఈ రెండు జ‌ట్లు టైటిల్‌ను ముద్దాడాలేక‌పోయాయి. దీంతో ఇరు జ‌ట్లు కూడా త‌మ 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఇరు జ‌ట్లు స‌మ‌వుజ్జీల‌గా ఉండ‌డంతో ఫైన‌ల్ పోరు ఉత్కంఠ భ‌రితంగా సాగ‌డం ఖాయం. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచ‌నా వేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకుంటుంద‌ని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

"ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజ‌యం సాధిస్తుంద‌ని నేను అనుకుంటున్నాను.  అయితే సాధ‌ర‌ణంగా గ‌త కొన్ని మ్యాచ్‌ల‌గా నేను స‌పోర్ట్ చేసే జ‌ట్టు ఓడిపోతోంది. క్వాలిఫ‌య‌ర్‌-1లో ఆర్సీబీపై పంజాబ్ విజ‌యం సాధిస్తుంద‌ని అంచ‌నా వేశాను. కానీ ఆ మ్యాచ్‌లో పంజాబ్ చిత్తు అయింది.

అదేవిధంగా ఎలిమినేట‌ర్‌లో ముంబైపై గుజ‌రాత్ గెలుస్తుంద‌ని చెప్పా. కానీ గుజ‌రాత్ కూడా ఓడిపోయింది. ఆ త‌ర్వాత క్వాలిఫ‌య‌ర్‌-2లో ముంబై ఇండియ‌న్స్‌కు స‌పోర్ట్ చేశా. అక్క‌డ కూడా ముంబై ప‌రాజ‌యం పాలైంది. టీమిండియా విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతోంది. నేను గెలుస్తుంద‌ని చెప్పినా ప్ర‌తీసారి భార‌త్ ఓడిపోయింద‌ని" క్రిక్‌బ‌జ్ లైవ్‌షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.

తుది జట్ల వివరాలు (అంచనా)  
బెంగళూరు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్‌), కోహ్లి, సాల్ట్, మయాంక్‌ అగర్వాల్, లివింగ్‌స్టోన్, జితేశ్‌ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్‌ పాండ్యా, యశ్‌ దయాళ్, హాజల్‌వుడ్‌.

పంజాబ్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెపె్టన్‌), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్‌సిమ్రన్, ఇన్‌గ్లిస్, నేహల్‌ వధేరా, స్టొయినిస్, శశాంక్‌ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్‌దీప్‌ సింగ్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement