
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మొహిత్ శర్మకు మరో ఓవర్ ఇవ్వకపోవడమే గుజరాత్ ఓటమికి కారణమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
కాగా ఈ మ్యాచ్లో మొహిత్ శర్మ రెండు ఓవర్లు వేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయినప్పటికీ హార్దిక్.. మొహిత్ పూర్తి ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. అహ్మదాబాద్ వికెట్పై పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లను ఎదుర్కొవడం కష్టమని గుజరాత్ భావించింది.
అందుకే హార్దిక్ మోహిత్ శర్మకు మరో ఓవర్ ఇవ్వలేదు అనుకుంటా. రషీద్, నూర్ అహ్మద్ వికెట్లు తీస్తారని గుజరాత్ ఆశించింది. కానీ గుజరాత్ ప్లాన్ బెడిసి కొట్టింది. కనీసం ఆఖరి ఓవర్ అయినా మొహిత్ శర్మ ఇవ్వాల్సింది. తన మొదటి రెండు ఓవర్లలో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన బౌలర్కు మరో ఓవర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది" అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023 GT Vs RR: షమీపై సీరియస్ అయిన హార్దిక్.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? వీడియోవైరల్