Gujarat Titans
-
సిరాజ్తో డేటింగ్ రూమర్స్పై స్పందించిన మహిర శర్మ
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్తో డేటింగ్ రూమర్స్పై బిగ్బాస్ సెలబ్రిటీ మహిర శర్మ స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్మీడియా వేదికగా కోరింది. ఇదే విషయంపై సిరాజ్ కూడా స్పందించాడు. మహిరతో డేటింగ్ చేయడం లేదని సోషల్మీడియా వేదికగా స్పష్టం చేశాడు. జర్నలిస్ట్లు ఈ విషయంపై తనను ప్రశ్నించడం మానుకోవాలని కోరాడు. తాను మహిరతో డేటింగ్ చేయడమనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సిరాజ్ తన సోషల్మీడియా ఖాతా నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. సిరాజ్ ఏదో దాయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సోషల్మీడియాలో మహీరకు చెందిన ఓ పోస్ట్ను సిరాజ్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం సిరాజ్, మహిర ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో పుకార్లు బలపడ్డాయి. ఓ దశలో సిరాజ్, మహిర పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వదంతులు వ్యాపించాయి. సిరాజ్తో డేటింగ్ రూమర్లను మహిర తల్లి చాలాసార్లు ఖండించారు. అయినా ఈ ప్రచారానికి పుల్స్టాప్ పడలేదు.ఇటీవల ముంబైలో జరిగిన ఓ క్రికెట్ అవార్డుల ఫంక్షన్లో మహిర కనిపించినప్పుడు జర్నలిస్ట్లు ఈ విషయమై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. త్వరలో జరుగబోయే ఐపీఎల్లో ఆమెకు ఇష్టమైన జట్టు ఏదని పదేపదే ప్రశ్నించి రాక్షసానందం పొందారు.ఇంతకీ ఈ మహిర ఎవరు..?రియాలిటీ షో బిగ్ బాస్-13 సీజన్తో మహిర శర్మ ఫేమస్ అయ్యింది. మహిర.. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్ వంటి షోలలో పనిచేస్తూ టీవీ పరిశ్రమలో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. గతంలో మహిర బిగ్ బాస్ ద్వారా పరిచయమైన టీవీ నటుడు పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసింది. మహిర ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్లో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్ను వదిలేయగా.. మెగా వేలంలో గుజరాత్ సిరాజ్ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. 2018 నుంచి సిరాజ్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. -
సాహసోపేత నిర్ణయాలు.. టైటాన్స్ ఈసారి విజృంభిస్తుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే (2022)లో టైటిల్ సాధించి తనదైన ముద్రవేసింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). ఆ తర్వాత సీజన్లో మళ్ళీ ఫైనల్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే, గతేడాది గుజరాత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకి స్ఫూర్తిదాయకంగా నిలిచి ముందుండి నడిపించిన భారత్ అల్ రౌండర్, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్కు బదిలీ అయ్యాడు.ఈ మార్పుతో భారత్ యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు కెప్టెన్గా పగ్గాలు అప్పగించారు. కానీ గత సీజన్ గుజరాత్ కి పెద్దగా కలిసిరాలేదు. కేవలం 5 విజయాలు, 7 ఓటములతో గుజరాత్ 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో కొత్త సీజన్ కోసం గుజరాత్ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ళని పక్కకుపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు బదులుగా కొత్త తరహా జట్టుని నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.మాజీ ఆరెంజ్ క్యాప్ విజేత జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా పేస్ స్పియర్హెడ్ కగిసో రబాడను దక్కించుకోవడానికి గుజరాత్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో తన వీరోచిత ప్రదర్శనలతో అందరినీ ఆశ్చర్యపరిచిన గ్లెన్ ఫిలిప్స్ను కూడా తీసుకున్నారు.వేలంలో గుజరాత్ ఎలా రాణించింది?ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. గిల్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్లతో పాటు రషీద్ ఖాన్ను వేలానికి ముందు రెటైన్ చేసింది. వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ని రూ 15.75 కోట్లు కు కనుగోలు చేసారు.ఇంకా భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ( (రూ12.25 కోట్లు), రబాడ (రూ 10.75 కోట్లు) మరియు ప్రసిధ్ కృష్ణ (రూ 9.5 కోట్లు) ముగ్గురితో పేస్ బౌలింగ్ ని బలోపేతం చేశారు. గత సీజన్లో వారికి సమస్యగా ఉన్న రంగాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇక మిల్లర్ స్థానంలో జిటి ఫిలిప్స్ మరియు షెర్ఫేన్ రూథర్ఫోర్డ్లను జట్టులోకి తీసుకువచ్చారుగుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రధాన ఆటగాళ్లుశుబ్మన్ గిల్ఒకప్పుడు భారత టీ20ఐ జట్టులో ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇప్పుడు మునుపటి రీతిలో రాణించలేక పోతున్నాడన్నది వాస్తవం. 2023 ఐపీఎల్ లో చెలరేగిపోయిన గిల్ దాదాపు 900 పరుగులు సాధించాడు.గత సీజన్ను ఆశాజనకంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అతని ఫామ్ తగ్గింది . 2024లో తన మొదటి ఆరు మ్యాచ్ల్లో 151.78 స్ట్రైక్ రేట్తో 255 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత 147.40 సగటుతో 426 పరుగులు చేశాడు. ఈ సీజన్లో గిల్ మళ్ళీ మునుపటి ఫామ్ ని ప్రదర్శించాలని, జట్టుని విజయ బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.జోస్ బట్లర్జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడు కావడంతో, బట్లర్ పై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. 2022 ఐపిఎల్ లో ఏకంగా 863 పరుగులు చేసిన తర్వాత, బట్లర్ 2023 మరియు 2024 సీజన్లలో 400 కి మించి పరుగులు చేయలేకపోయాడు. అయితే గత సంవత్సరం ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా పై జరిగిన ఫైనల్లో 224 పరుగుల లక్ష్యం సాధించడంలో బట్లర్ చేసిన సెంచరీ లీగ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచింది. బట్లర్ ఈ సీజన్ లో గిల్ తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. లేదా గత సీజన్లో లేని ఫైర్పవర్ను అందించడానికి 3వ స్థానంలోకి వస్తాడని భావిస్తున్నారు. అదనంగా అతన్ని స్టంప్స్ వెనుక కూడా చూడవచ్చు.రషీద్ ఖాన్గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోసారి గుజరాత్కు ట్రంప్ కార్డ్ గా భావించవచ్చు. గత సీజన్లో, రషీద్ శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నందున తన పూర్తి స్థాయిలో ఆడలేక పోయాడు. ఈసారి మాత్రం గుజరాత్ టైటిల్ సాధించాలన్న ఆశయాన్ని సాధించడంలో రషీద్ పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.కగిసో రబాడపంజాబ్ కింగ్స్ తరుపున ఆది కాస్త నిరాశబరిచిన కగిసో రబాడ ఇప్పుడు గుజరాత్ జట్టులో చేరడంతో కోచ్ ఆశిష్ నెహ్రా ఆధ్వర్యంలో మళ్ళీ పుంజుకోగలడని భావిస్తున్నారు.మహ్మద్ సిరాజ్ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేక పోతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కి మళ్ళీ మునుపటి వైభవం సాధించడానికి ఐపీఎల్ మంచి అవకాశం కల్పిస్తోంది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు లో స్థానం పొందలేకపోయిన సిరాజ్ తన విమర్శకులను సమాధానము చెప్పాలని, తన కెరీర్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు.గుజరాత్ టైటాన్స్ జట్టురషీద్ ఖాన్, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిషాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, జెరాల్డ్ కోట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా. చదవండి: విధ్వంసకర వీరులు.. పంత్కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా? -
‘ఎంపిక నా చేతుల్లో లేదు’
బెంగళూరు: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్తో పాటు టీమిండియా విజేతగా నిలిచిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్లోనూ అతనికి స్థానం లభించలేదు. అయితే ఈ హైదరాబాదీ పేసర్ జాతీయ జట్టులోకి త్వరలోనే పునరాగమనం చేస్తానని ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం అంతగా ఆందోళన చెందడం లేదని, ఐపీఎల్లో సత్తా చాటాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నట్లు అతను చెప్పాడు.ఐపీఎల్లో సిరాజ్ ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ‘భారత జట్టు ఎంపిక నా చేతుల్లో ఉండదనేది వాస్తవం. నా చేతుల్లో బంతి మాత్రమే ఉంటుంది. దాంతో ఏం చేయగలను అనేదే ముఖ్యం. టీమ్ సెలక్షన్ గురించి అతిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకోను. అలా చేస్తే నా ఆటపై ప్రభావం పడుతుంది. మున్ముందు ఇంగ్లండ్ పర్యటన, ఆసియా కప్లాంటివి ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి దృష్టంతా ఐపీఎల్ పైనే ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. టీమిండియా తరఫున ఆడని సమయంలో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంతో పాటు ఫిట్నెస్పై దృష్టి పెట్టినట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను. సాధారణంగా విశ్రాంతి తక్కువగా దొరుకుతుంది. కానీ ఈసారి మంచి విరామం లభించింది. అందుకే బౌలింగ్, ఫిట్నెస్పై మరింత దృష్టి పెట్టా. కొత్త బంతులు, పాత బంతులతో బౌలింగ్ చేశాం. స్లో బంతులు, యార్కర్ల విషయంలో ప్రత్యేక సాధన చేశాను. కొత్తగా నేర్చుకున్న అంశాలను ఐపీఎల్లో ప్రదర్శిస్తా’ అని అతను చెప్పాడు. శుబ్మన్ గిల్ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘బెంగళూరు జట్టుకు దూరం కావడం కొంత బాధకు గురి చేసిందనేది వాస్తవం. కోహ్లి అన్ని రకాలుగా అండగా నిలిచాడు. అయితే ఇక్కడా గిల్ సారథ్యంలో చాలా మంచి జట్టుంది. గిల్ కెపె్టన్సీలో బౌలర్లకు మంచి స్వేచ్ఛ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ఎప్పుడూ వారించడు. మేమిద్దరం ఒకే టెస్టుతో అరంగేట్రం చేశాం. వ్యక్తిగతంగా కూడా మంచి సాన్నిహిత్యం ఉంది’ అని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ టీమ్లో రబాడ, రషీద్, ఇషాంత్, కొయెట్జీ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండటం సానుకూల విషయమని, ఇది అందరిపై ఒత్తిడి తగ్గిస్తుందని అతను అభిప్రాయ పడ్డాడు. గత సీజన్ వరకు ఇదే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ షమీతో తనను పోల్చడంపై స్పందిస్తూ... ‘టైటాన్స్ టీమ్ తరఫున షమీ భాయ్ చాలా బాగా ఆడాడు. కీలక సమయాల్లో స్వింగ్తో వికెట్లు తీశాడు. నేను కూడా ఆయనలాగే పెద్ద సంఖ్యలో వికెట్లు తీసి జట్టుకు ఉపయోగపడితే చాలు. మొతెరా మైదానంలో కొత్త బంతితో షమీ వికెట్లు తీయడం నేను చూశాను. అదే తరహాలో పవర్ప్లేలో వికెట్లు తీయడమే నా పని’ అని సిరాజ్ చెప్పాడు. టైటాన్స్ కోచ్గా ఉన్న మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాతో కలిసి పని చేసేందుకు, ఆయన వద్ద కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు. -
‘ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే’
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వినోదం పంచేందుకు సిద్ధమైంది. రెండు నెలలకు పైగా నిర్విరామంగా క్రికెట్ ప్రేమికులకు పొట్టి క్రికెట్ మజా అందించనుంది. ఐపీఎల్-2025 మార్చి 22న మొదలై.. మే 25న ఫైనల్తో ముగియనుంది.గతేడాది.. కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి నుంచి పది స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.పది జట్లలో భారీ మార్పులువీటిలో కోల్కతా- హైదరాబాద్ ఫైనల్లో తలపడగా.. రైజర్స్పై నైట్ రైడర్స్ విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. ఇక ఏడాది ఈ పది జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మెగా వేలం-2025 నేపథ్యంలో ఐదు జట్ల కెప్టెన్లూ మారారు. లక్నోకు రిషభ్ పంత్, పంజాబ్కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్ పటేల్, బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్కతాకు అజింక్య రహానే సారథులుగా నియమితులయ్యారు.అత్యధికంగా పదికి 9 పాయింట్లుఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఐపీఎల్-2025లో పది జట్లకు తనదైన శైలిలో రేటింగ్ ఇచ్చాడు. అదే విధంగా.. ప్లే ఆఫ్స్ చేరే జట్లు, విజేతపై తన అంచనా తెలియజేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు అత్యధికంగా పదికి 9 పాయింట్లు ఇచ్చిన మైకేల్ వాన్.. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్కు 5 పాయింట్లు వేశాడు.అయితే, గతేడాది పేలవ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్కు ఏడేసి పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇక 2024లో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్కు ఏకంగా 7.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. అన్ని జట్ల కంటే ఈసారి గుజరాత్ టైటాన్స్ గొప్పగా ఉందన్న మైకేల్ వాన్.. ఆ జట్టును తొమ్మిది పాయింట్లతో టాప్లో నిలిపాడు.ఇక గతేడాది ఫైనలిస్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్కు 6.5 పాయింట్లే ఇచ్చిన వాన్.. ఈసారి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానం కోసం ఎస్ఆర్హెచ్.. పంజాబ్, లక్నోలతో పోటీ పడుతుందని అంచనా వేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ చాంపియన్గా నిలవడం ఖాయమని వాన్ జోస్యం చెప్పాడు. ఈ మేరకు క్రిక్బజ్తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఐపీఎల్-2025 జట్లకు మైకేల్ వాన్ ఇచ్చిన రేటింగ్(పది పాయింట్లకు)👉గుజరాత్ టైటాన్స్- 9👉కోల్కతా నైట్ రైడర్స్- 8👉లక్నో సూపర్ జెయింట్స్- 7👉పంజాబ్ కింగ్స్- 7👉సన్రైజర్స్ హైదరాబాద్- 6.5👉రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 6.5👉రాజస్తాన్ రాయల్స్- 6.5👉చెన్నై సూపర్ కింగ్స్- 6👉ఢిల్లీ క్యాపిటల్స్- 5.మైకేల్ వాన్ ఎంచుకున్న టాప్-4 జట్లు(ప్లే ఆఫ్స్)గుజరాత్, కోల్కతా, ముంబై ఇండియన్స్ టాప్-3లో ఉండగా.. నాలుగో స్థానం కోసం లక్నో, పంజాబ్, సన్రైజర్స్ పోటీ.విజేతపై మైకేల్ వాన్ అంచనాఈసారి ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్యాన్ని, బ్యాటింగ్ను విడివిడిగా చూడగలిగితేనే విజయవంతమవుతామని అభిప్రాయపడ్డాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘కెప్టెన్సీని, బ్యాటింగ్ను వేర్వేరుగా ఉంచాలి. అప్పుడే విజయవంతం కాగలం. క్రీజులో అడుగుపెట్టినప్పుడు కేవలం బ్యాటింగ్పైనే దృష్టి పెడతా. నా అనుభవంలో ఇదే నేర్చుకున్నా. ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రం కెప్టెన్గా మరింత బాధ్యతగా వ్యవహరిస్తా’ అని అన్నాడు.2023 సీజన్లో టైటాన్స్ తరఫున హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన గిల్ 890 పరుగులతో సత్తా చాటాడు. ఇక గత ఏడాది సారథిగా బాధ్యతలు తీసుకున్న గిల్ 426 పరుగులు చేశాడు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే అతడి స్ట్రయిక్రేట్ 10 శాతం తగ్గింది. ‘సారథిగా ప్రతి రోజు నేర్చుకుంటూనే ఉంటా. అదే ఒక ఆటగాడిగా, కెప్టెన్గా నన్ను మరింత మెరుగు పరుస్తుందని నమ్ముతున్నా. కోచ్ ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి సూచనలతో ముందుకు సాగుతున్నా. ఇంటా బయట అనే తేడా ఏమీ లేదు. మంచి లయలో ఉంటే వేదికతో సంబంధం ఉండదు. గత మూడేళ్ల ఫలితాలు పరిశీలిస్తే లీగ్లో అత్యధిక విజయాల శాతం మా జట్టుదే. దాన్నే కొనసాగిస్తే ఈ సీజన్ను కూడా చిరస్మరణీయం చేసుకోగలం’ అని వివరించాడు. మ్యాచ్లు గెలవాలంటే భారీ స్కోర్లు చేయడం మాత్రమే కాదని... పిచ్, పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా, ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్లో (మార్చి 25) పంజాబ్ కింగ్స్ను ఢీకొట్టనుంది. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్.. ఈ సీజన్లో కొత్తగా కనిపిస్తుంది. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం ప్రమాదకరంగా కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రబాడ, సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, గెరాల్డ్ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళకళలాడుతుంది. ప్రపంచ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్ సుందర్ చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, మహిపాల్ లోమ్రార్ గుజరాత్కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రషీద్ ఖాన్, మహిపాల్ లోమ్రార్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, షారుఖ్ ఖాన్, నిషాంత్ సింధు, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్: శుబ్మన్ గిల్
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 ఆరంభానికి ముందు గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరింత వినోదాత్మకంగాఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లకు అదనపు ప్రయోజనం కలుగుతుందని శుబ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ఈ రూల్ కారణంగా అదనపు బ్యాటర్ లేదంటే బౌలర్ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందని.. ఈసారి స్కోర్లు 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నాడు. ఈ నిబంధన ఐపీఎల్ను మరింత వినోదాత్మకంగా మార్చిందని గిల్ జియోహాట్స్టార్ షోలో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఐపీఎల్తో ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గిల్ గుర్తు చేసుకున్నాడు. ‘‘పంచకులలోని తౌ దేవి లాల్ స్టేడియానికి మా నాన్నతో కలిసి మూడు, నాలుగు మ్యాచ్లకు వెళ్లాను. నాకు తెలిసి అప్పటికి ఐపీఎల్ మొదలై మూడేళ్లు గడిచి ఉంటాయి.నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్అప్పట్లో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చింది. నాకప్పుడు తొమ్మిదేళ్లు ఉంటాయనుకుంటా.. సచిన్ సర్తో గ్లెన్ మాక్స్వెల్తో నేను ఫొటో తీసుకున్నా.వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నపుడు బాల్స్ త్రో చేసేవాడిని. ఐపీఎల్తో నాకున్న తొలి జ్ఞాపకం అదే. సచిన్ సర్ గురించి నాకు ముందు నుంచే తెలుసు. ఆయనను చూసే నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను.మా నాన్న ఆయనకు వీరాభిమానిఇక మా నాన్న అయితే.. సచిన్ సర్కి వీరాభిమాని. మా గ్రామంలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపించేవి’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు. ఇక కెప్టెన్సీ అనేది ఓ నిరంతర ప్రయాణమన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. నాయకుడిగా భిన్న అనుభవాలు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాడు.జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడి నైపుణ్యాలపై అవగాహన పెంచుకుని.. వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకున్న వారే నాయకులుగా రాణిస్తారని గిల్ అన్నాడు. ప్రతి మ్యాచ్ సరికొత్తగా ఉంటుందని.. ఆటగాళ్ల బలాలు, బలహీనతలు అర్థం చేసుకుంటే.. వారి సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నాడు. కెప్టెన్గా అనుభవం గడించినపుడే..ఇక సారథిగా చేసే ప్రయాణంలో అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత రాటుదేలతామని.. అయితే, ఒక్కోసారి కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటపుడు సంయమనంతో ముందుకు సాగితే ప్రతికూల ప్రభావం పడదని గిల్ చెప్పుకొచ్చాడు. టైటాన్స్ పగ్గాలు చేపట్టిన కొత్తల్లో తాను సహచర ఆటగాళ్లతో ఎక్కువగా మమేకం కాలేకపోయానన్న.. అయితే, నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో తనకు తెలియకుండానే ఎంతో మారిపోయానని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడటం.. వారి మైండ్సెట్ను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నానని గిల్ తెలిపాడు.చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
మాథ్యూస్, స్కివర్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
డబ్ల్యూపీఎల్-2025లో ముంబై వేదికగా గుజరాత్ జెయింట్స్తో జరుగుతున్న ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ముంబై బ్యాటర్లలో హీలీ మాథ్యూస్(50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77), నాట్ స్కివర్ బ్రాంట్(41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 77) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ రెండో వికెట్కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీనియర్ ద్వయంతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 36) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.గుజరాత్ బౌలర్లలో గిబ్సన్ రెండు, గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డర్లు సునాయస క్యాచ్లను జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ ఎలిమినేటర్ మ్యాచ్కు గుజరాత్ స్టార్ ప్లేయర్ డాటిన్ దూరమైంది. డాటిన్ లేని లోటు గుజరాత్ టీమ్లో స్పష్టంగా కన్పించింది. తుది జట్లుముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), సజీవన్ సజన, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్గుజరాత్: బెత్ మూనీ (వికెట్ కీపర్), కష్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), ఫోబ్ లిచ్ఫీల్డ్, డేనియల్ గిబ్సన్, భారతీ ఫుల్మాలి, సిమ్రాన్ షేక్, మేఘనా సింగ్, తనూజా కన్వర్, ప్రియా మిశ్రా -
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం
ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు యాజమాన్యం మాజీ ఆటగాడు, మాజీ ఆస్ట్రేలియా వికెట్కీపర్ మాథ్యూ వేడ్కు అసిస్టెంట్ కోచ్గా నియమించుకుంది. వేడ్ 2022, 2024 సీజన్లలో గుజరాత్ టైటాన్స్లో సభ్యుడిగా ఉన్నాడు. వేడ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ ప్రైవేట్ లీగ్ల్లో పాల్గొంటున్నాడు. We love this Saturday Surprise, Wadey! 😁Welcome back as our 𝐀𝐬𝐬𝐢𝐬𝐭𝐚𝐧𝐭 𝐂𝐨𝐚𝐜𝐡. Matthew Wade | #AavaDe | #TATAIPL2025 pic.twitter.com/kIbV73qxL9— Gujarat Titans (@gujarat_titans) March 8, 2025వేడ్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనలేదు. వేడ్ ఆటగాడిగా కాకుండా కోచింగ్ రోల్లో గుజరాత్తో జతకట్టడం విశేషం. వేడ్ను అసిస్టెంట్ కోచ్గా నియమించిన విషయాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం సోషల్మీడియా వేదికగా ప్రకటించింది. ఐపీఎల్లో వేడ్ మొత్తంగా 15 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 12 గుజరాత్ తరఫున ఆడాడు. 2022 సీజన్లో గుజరాత్ టైటిల్ గెలిచిన జట్టులో వేడ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. వేడ్ తదుపరి ఐపీఎల్ సీజన్లో హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్, అసిస్టెంట్ కోచ్లు ఆశిష్ కపూర్, నరేందర్ నేగిలతో కలిసి పని చేస్తాడు. 37 ఏళ్ల వేడ్ ఇటీవలే హోబర్ట్ హరికేన్స్ తరఫున బిగ్బాష్ లీగ్ గెలిచాడు. ఆటగాడిగా ఉంటూనే వేడ్ కోచింగ్ అవకాశాల కోసం వెతుకుతున్నాడు. విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ కూడా ఇలాగే (ఆటగాడిగా కొనసాగుతూనే) కోచింగ్ డిపార్ట్మెంట్లో సెట్ అయ్యాడు. పోలార్డ్ కూడా గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన ఫ్రాంచైజీలోనే (ముంబై ఇండియన్స్) కోచ్గా స్థిరపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ 2025 సీజన్ నుంచి కొత్త యాజమాన్యం అండర్లో మ్యాచ్లు ఆడనుంది. 2025 సీజన్ను గుజరాత్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. ఈ సీజన్లోనూ గుజరాత్ శుభ్మన్ గిల్ సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గుజరాత్ గత సీజన్ను ఎనిమిదో స్థానంతో ముగించింది. 2024 సీజన్లో గుజరాత్ 14 మ్యాచ్లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయాలు సాధించింది.2025 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, మహిపాల్ లోమ్రార్, షారుక్ ఖాన్, నిషాంత్ సింధు, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయికిషోర్, కుమార్ కుషాగ్రా, జోస్ బట్లర్, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిస రబాడ, ప్రసిద్ద్ కృష్ణ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్ -
గుజరాత్ టైటాన్స్ సహ యజమానిగా టోరెంట్ కంపెనీ.. ప్రాంచైజీలో 67 శాతం వాటా కొనుగోలు
అహ్మదాబాద్: ఐపీఎల్ (IPL) టీమ్ గుజరాత్ టైటాన్స్లో (Gujarat Titans) ప్రముఖ పారిశ్రామిక సంస్థ టోరెంట్ గ్రూప్ (Torrent Group) 67 శాతం వాటాను దక్కించుకుంది. ఈ ఒప్పందం గతంలోనే ఖాయమైనా... బుధవారం ఫ్రాంచైజీ యాజమాన్యం దీనిని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత యజమాని సీవీసీ క్యాపిటల్స్ ఇక ముందు మిగిలిన 33 శాతం వాటాతో సహ యజమానిగా కొనసాగుతోంది. ఐపీఎల్ జట్టులో భాగమయ్యేందుకు సీవీసీ క్యాపిటల్స్కు టోరెంట్ సుమారు రూ.5,025 కోట్లు చెల్లించినట్లు సమాచారం. 2021లో టైటాన్స్ను సీవీసీ రూ.5,625 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఈ టీమ్ ప్రస్తుత విలువను రూ.7,500 కోట్లుగా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో సీవీసీ గ్రూప్ తాము పెట్టిన పెట్టుబడిలో సుమారు 89 శాతాన్ని తిరిగి తెచ్చుకోవడంతో పాటు 33 శాతం వాటాను ఇంకా తమ వద్దే ఉంచుకోవడం విశేషం. కొత్త ఒప్పందం కారణంగా ఐపీఎల్లో భాగం కావ డం పట్ల సంతోషంగా ఉన్నామని... లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు టోరెంట్ గ్రూప్ డైరెక్టర్ జినాల్ మెహతా వ్యాఖ్యానించారు. టోరెంట్ దేశవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్స్, విద్యుత్, గ్యాస్ రంగాల్లో పెద్ద ఎత్తున తమ వ్యాపారాలను సాగిస్తోంది. కంపెనీ విలువ దాదాపు రూ.41 వేల కోట్లుగా ఉంది. 2022 ఐపీఎల్ సీజన్లో టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్ 2023తో రన్నరప్గా నిలిచింది. -
IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) యాజమాన్యంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత్కు చెందిన టొరంట్ గ్రూపు(Torrent Group) ఈ ఫ్రాంఛైజీలో అరవై ఏడు శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కాగా అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్) 2021లో ఐపీఎల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.నాడు రూ. 5,625 కోట్లతోభారీ స్థాయిలో ఏకంగా రూ. 5,625 కోట్లతో గుజరాత్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. అయితే, తమ వాటలో మెజారిటీ మొత్తాన్ని అమ్మేందుకు సీవీసీ క్యాపిటల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి సంస్థ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.‘‘టొరంట్ గ్రూపుతో చర్చలు కొలిక్కివచ్చినట్లే. మూడింట రెండు వంతుల వాటాను అమ్మేందుకు నిర్ణయం జరిగింది. యజమానులుగా సీవీసీ గ్రూప్ లాక్- ఇన్ పీరియడ్ ఫిబ్రవరి 2025తో ముగుస్తుంది. కాబట్టి అప్పుడు వారు తమ వాటాలను అమ్ముకునేందుకు స్వేచ్ఛ లభిస్తుంది.బీసీసీఐ అనుమతి తప్పనిసరిటొరంట్ గ్రూపు భారత ఫార్మాసుటికల్ రంగంలో కీలకమైనది. బీసీసీఐ 2021లో రెండు కొత్త ఫ్రాంఛైజీల నిర్వహణకు బిడ్లను ఆహ్వానించినపుడు ఈ గ్రూపు ఆసక్తి కనబరిచింది. ఈసారి తన ఆకాంక్షను నెరవేర్చుకోనుంది. అయితే, ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమాన్య మార్పు జరగాలంటే బీసీసీఐ నుంచి అనుమతి తప్పనిసరి. త్వరలోనే ఇది జరుగుతుంది’’ అని పేర్కొన్నాయి.కాగా ఐపీఎల్ పాలక మండలి నుంచి అనుమతి లభించిన తర్వాత గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేతులు మారనున్నాయి. ఐపీఎల్-2025 సీజన్ నుంచే యాజమాన్యంలో మార్పులు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక 2021లో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. తమ అరంగేట్ర ఎడిషన్లోనే చాంపియన్గా నిలిచింది.హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో చాంపియన్గాటీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. ఆ మరుసటి ఏడాది పాండ్యా సారథ్యంలోనే ఫైనల్కు చేరింది. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ను వీడి.. తన సొంతగూటికి చేరాడు. అతడు ముంబై ఇండియన్స్ సారథిగా బాధ్యతలు చేపట్టగా.. మరో టీమిండియా స్టార్, భవిష్య కెప్టెన్ శుబ్మన్ గిల్ టైటాన్స్ పగ్గాలు చేపట్టాడు. గిల్ సారథ్యంలో ఇలాఅయితే, గిల్ సారథ్యంలో గతేడాది టైటాన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్లకు గానూ కేవలం ఐదే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. టొరంట్ గ్రూపు విలువ దాదాపుగా 41 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక టొరంట్ స్పోర్ట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2021లో అహ్మదాబాద్ కోసం రూ. 4653 కోట్లు, లక్నో ఫ్రాంఛైజీ కోసం రూ. 4356 కోట్లతో బిడ్ వేసింది. ఆ తర్వాత వుమెన్స్ ప్రీమియర్ లీగ్ బరిలోకి వచ్చిన టొరంట్ గ్రూప్ ఫ్రాంఛైజీ కొనుగోలు విషయంలో సఫలం కాలేకపోయింది. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా మార్కులు కొట్టేసిన టైటాన్స్కు యజమానిగా మారనుంది.కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ పేరిట మొత్తం పదిజట్లు ఉన్నాయి.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
బిగ్బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్గా మారింది. బాలీవుడ్కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.రూమర్లకు కారణం ఇదే!అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్తో గ్లామరస్ లుక్లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు. లైక్ కొట్టినంత మాత్రానఅంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. క్రికెట్కు- బాలీవుడ్కు విడదీయరాని అనుబంధంకాగా క్రికెట్కు- బాలీవుడ్కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమేఇక భారత ఆల్రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది. అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్మన్ గిల్- సారా అలీఖాన్ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.ఆస్ట్రేలియా పర్యటనలోఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..! View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
వాషింగ్టన్ సుందర్పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు.. ఆఖరికి!
టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు ఐపీఎల్ మెగా వేలం-2025లో షాక్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో ఆక్షన్లోకి వచ్చిన వాషీ కోసం తొలుత ఏ ఫ్రాంఛైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాసేపటికి.. గుజరాత్ టైటాన్స్ తొలుత బిడ్ వేసేందుకు ముందుకు వచ్చింది. కనీస ధరకు అతడిని దక్కించుకోవాలని చూసింది.ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగగా.. గుజరాత్ కూడా వెనక్కి తగ్గలేదు. అయితే, ధర రూ. 3 కోట్లు దాటిన తర్వాత లక్నో తప్పుకోగా.. టైటాన్స్ ఆఖరికి రూ. 3.20 కోట్లకు వాషింగ్టన్ సుందర్ను దక్కించుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వాషీ.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.మూడు జట్లకుక్యాష్ రిచ్ లీగ్లో 2017లో రైజింగ్ పుణె సూపర్జెయింట్ తరఫున అడుగుపెట్టిన వాషీ.. ఆ ఏడాది ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వాషీని రూ. 3.2 కోట్లకు కొనుక్కుంది. ఆర్సీబీ తరఫున అతడు మొత్తంగా 31 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ వాషీని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసి 2024 వరకు కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని వదిలేసింది. కాగా ఎస్ఆర్హెచ్ తరఫున వాషీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. సన్రైజర్స్కు మొత్తంగా 18 మ్యాచ్లు ఆడిన వాషీ 10 వికెట్లు తీయడంతో పాటు 161 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది అతడు గుజరాత్ టైటాన్స్కు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్గా ఐపీఎల్లో వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు 60 మ్యాచ్లు ఆడి 378 రన్స్ చేయడంతో పాటు.. 37 వికెట్లు తీశాడు. -
సిరాజ్కు షాకిచ్చిన ఆర్సీబీ.. ఆఖరికి ఆ జట్టు సొంతం.. ధర మాత్రం..
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్కు ఆడబోతున్నాడు. మెగా వేలంలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిరాజ్కు షాకివ్వగా.. టైటాన్స్ మాత్రం భారీ మొత్తం వెచ్చించింది. కాగా హైదరాబాద్కు చెందిన సిరాజ్ సన్రైజర్స్ తరఫున 2017లో క్యాచ్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు.ఏడేళ్లు అక్కడేఅయితే, ఆ మరుసటి ఏడాది(2018) ఆర్సీబీ అతడిని రెండున్నర కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంది. 2022లో రూ. 7 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుని అంతే మొత్తానికి 2024 వరకు కొనసాగించింది. అయితే, 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్ను వదిలేసింది. దీంతో అతడు ఆక్షన్లోకి వచ్చాడు.చెన్నై కూడా రేసులోఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన ఆదివారం నాటి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో అతడు రేసులోకి వచ్చాడు. గుజరాత్ అతడి కోసం ఆదినుంచే పోటీ పడగా.. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆసక్తి చూపాయి. అయితే, రూ. 8 కోట్ల వరకు గుజరాత్తో నువ్వా- నేనా అన్నట్లు తలపడిన చెన్నై.. ఆ తర్వాత రేసు నుంచి నిష్క్రమించింది.మాకు వద్దు.. సిరాజ్ను మొత్తంగా వదిలేసుకున్న ఆర్సీబీఈ దశలో రాజస్తాన్ మళ్లీ పోటీకి రాగా.. గుజరాత్ రూ. 12.25 కోట్ల మెరుగైన ధరకు సిరాజ్ను సొంతం చేసుకుంది. అయితే, సిరాజ్ విషయంలో రైటు మ్యాచ్ కార్డును వినియోగించుకుంటారా అని ఆక్షనీర్ మల్లికా సాగర్ ఆర్సీబీని అడుగగా.. సదరు ఫ్రాంఛైజీ మాత్రం అంత ధర పెట్టే ఉద్దేశం తమకు లేదంటూ సిరాజ్ను మొత్తంగా వదిలేసుకుంది. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం పేసర్ 93 మ్యాచ్లు ఆడి 93 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో సిరాజ్కు గుజరాత్ మూడో ఫ్రాంఛైజీ. అదే విధంగా ఇదే అత్యధిక ధర.ఇక ఐపీఎల్-2022 ద్వారాక్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేసిన గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే చాంపియన్గా నిలిచింది. గతేడాది రన్నరప్గా నిలిచింది. అయితే, ఈసారి మాత్రం ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.చదవండి: IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్కు భారీ షాక్.. -
మంజ్రేకర్పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మండిపడ్డాడు. ఇతరుల కోసం జ్ఞానం వృథా చేసుకుని.. తమ గురించి ఆలోచించుకోవడం మర్చిపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జోస్యం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటే బాబా అవతారం ఎత్తితే బాగుంటుందంటూ చురకలు అంటించాడు.నవంబరు 24, 25 తేదీల్లోఐపీఎల్-2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరిగే వేలంపాటకు ముందే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఆ ఐదుగురు మాత్రమేఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్(రూ. 18 కోట్లు ), శుబ్మన్ గిల్(రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ. 4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుని.. షమీని విడిచిపెట్టింది.ఏడాది తర్వాత రీ ఎంట్రీకాగా వన్డే వరల్డ్కప్-2023లో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమీ దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. బాల్తోనే గాకుండా బ్యాట్తోనూ సత్తా చాటాడు.షమీ ధర పడిపోవచ్చుఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందు షమీని ఉద్దేశించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘షమీపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేమం లేదు. కానీ.. అతడిని గాయాల బెడద వేధిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.అతడు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూశాం. కాబట్టి ఇలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలంటే.. ఫ్రాంఛైజీలు కాస్త ఆలోచిస్తాయి. ఒకవేళ ఎవరైనా షమీపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. మధ్యలోనే అతడు జట్టుకు దూరమైతే..వారికి సరైన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవు. అందుకే.. షమీ ధర పడిపోవచ్చు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.బాబాజీని సంప్రదించండిఇందుకు ఘాటుగా స్పందించిన షమీ ఇన్స్టా స్టోరీలో మంజ్రేకర్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. ‘‘బాబాకీ జై! మీ భవిష్యత్తు కోసం కూడా కాస్త జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే బాబాజీని సంప్రదించండి’’ అంటూ సెటైర్లు వేశాడు.రూ. 6.25 కోట్లకు కొనుగోలుకాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ షమీని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఎడిషన్లో షమీ 16 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో.. రిషభ్ పంత్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డబ్బు విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ను విడిచిపెట్టాడని సన్నీ అంచనా వేశాడు. అయితే, పంత్ ఎక్స్ వేదికగా గావస్కర్ వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా షమీ సైతం అదే పంథాను అనుసరించాడు.చదవండి: IPL 2025 Mega Auction: అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్గా టీమిండియా మాజీ ప్లేయర్
గుజరాత్ టైటాన్స్ నూతన అసిస్టెంట్ మరియు బ్యాటింగ్ కోచ్గా టీమిండియా మాజీ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని టైటాన్స్ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. భారత్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్గా పార్థివ్కు ఉన్న సుదీర్ఘ అనుభవం తమ జట్టుకు మేలు చేస్తుందని జీటీ మేనేజ్మెంట్ అభిప్రాయపడింది. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్గా ఆశిష్ నెహ్రా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టుకు సారధిగా శుభ్మన్ గిల్ ఉన్నాడు. ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా విక్రమ్ సోలంకి పని చేస్తున్నాడు. వీరందరితో కలిసి పార్థివ్ పని చేస్తాడు.కాగా, పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్లో సభ్యుడిగా పని చేశాడు. దేశవాలీ క్రికెట్ నుంచి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పార్థివ్ కీలకంగా వ్యవహరించేవాడు. పార్థివ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు ముంబై ఇండియన్స్లో సభ్యుడిగా ఉన్నాడు. పార్థివ్ జట్టులో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2020 ఎడిషన్ టైటిల్ నెగ్గింది.గుజరాత్ టైటాన్స్ 2022 ఎడిషన్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నెహ్రా ఆథ్వర్యంలో, హార్దిక్ నేతృత్వంలో ఆ జట్టు తొలి ఎడిషన్లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్లో గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. అనంతరం 2024 ఎడిషన్లో గిల్ సారథ్యంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.39 ఏళ్ల పార్థివ్ పటేల్ 2002-2018 మధ్యలో టీమిండియా తరఫున 25 టెస్ట్లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడి 1700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్కీపర్ కమ్ బ్యాటర్ అయిన పార్థివ్ టెస్ట్ల్లో 73, వన్డేల్లో 41, టీ20ల్లో ఒక్కరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. 2008-2020 వరకు ఐపీఎల్ ఆడిన పార్థివ్ 139 మ్యాచ్ల్లో 2848 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో పార్థివ్ 95 మంది ఔట్ చేయడంలో భాగమయ్యాడు. -
IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ రిటెన్షన్ లిస్టు ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను కూడా టైటాన్స్ రిటైన్ చేసుకోనుందట!పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంకాగా 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే చాంపియన్గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో శుబ్మన్ గిల్కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.అయితే, ఐపీఎల్-2024లో గిల్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.అతడికి రూ. 18 కోట్లుఅయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్గా గుర్తింపు పొందిన శుబ్మన్ గిల్పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ సైతం ఈ సీజన్లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్ చేసుకోనున్నారట.సాయి కిషోర్ను కూడా...అదే విధంగా.. ఐపీఎల్-2024లో శతకం బాది.. ఓవరాల్గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్ను కూడా టైటాన్స్ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్,రాహుల్ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా షమీ వన్డే వరల్డ్కప్-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్! -
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్గా టీమిండియా మాజీ ప్లేయర్
ఐపీఎల్ 2025 ఎడిషన్ కోసం గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్గా టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ ఎంపికైనట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్లో గుజరాత్కే ప్రాతినిథ్యం వహించిన పార్థివ్ తన సొంత జట్టుతో మరోసారి జత కట్టనున్నాడని సమాచారం. పార్థివ్.. గ్యారీ కిర్స్టన్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. కిర్స్టన్ పాకిస్తాన్ వైట్ బాల్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్గా ఆశిష్ నెహ్రా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టుకు సారధిగా శుభ్మన్ గిల్ ఉన్నాడు. ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా విక్రమ్ సోలంకి పని చేస్తున్నాడు.కాగా, పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్లో సభ్యుడిగా పని చేశాడు. దేశవాలీ క్రికెట్ నుంచి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పార్థివ్ కీలకంగా వ్యవహరించేవాడు. పార్థివ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు ముంబై ఇండియన్స్లో సభ్యుడిగా ఉన్నాడు. పార్థివ్ జట్టులో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2020 ఎడిషన్ టైటిల్ నెగ్గింది.గుజరాత్ టైటాన్స్ 2022 ఎడిషన్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నెహ్రా ఆథ్వర్యంలో, హార్దిక్ నేతృత్వంలో ఆ జట్టు తొలి ఎడిషన్లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్లో గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. అనంతరం 2024 ఎడిషన్లో గిల్ సారథ్యంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.39 ఏళ్ల పార్థివ్ పటేల్ 2002-2018 మధ్యలో టీమిండియా తరఫున 25 టెస్ట్లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడి 1700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్కీపర్ కమ్ బ్యాటర్ అయిన పార్థివ్ టెస్ట్ల్లో 73, వన్డేల్లో 41, టీ20ల్లో ఒక్కరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. 2008-2020 వరకు ఐపీఎల్ ఆడిన పార్థివ్ 139 మ్యాచ్ల్లో 2848 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో పార్థివ్ 95 మంది ఔట్ చేయడంలో భాగమయ్యాడు. చదవండి: రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకునేందుకు రెడీ: వార్నర్ -
డబుల్ సెంచరీ బాదిన సాయి సుదర్శన్.. సెంచరీకి చేరువలో సుందర్
రంజీ ట్రోఫీ-2024 ఎలైట్ గ్రూప్-డి పోటీల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో తమిళనాడు ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఓపెనర్ సాయి సుదర్శన్ అజేయ డబుల్ సెంచరీతో (202) విరుచుకుపడగా.. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన వాషింగ్టన్ సుందర్ సెంచరీకి (96 నాటౌట్) చేరువయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన తమిళనాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 379 పరుగులు చేసింది. ఎన్ జగదీశన్ 65 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నవ్దీప్ సైనీకి జగదశన్ వికెట్ దక్కింది.కాగా, ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా భీకర ఫామ్లో ఉన్నాడు. సాయి 2023 నుంచి పాకిస్తాన్-ఏపై, ఇంగ్లండ్-ఏపై, ఐపీఎల్లో, తమిళనాడు ప్రీమియర్ లీగ్ నాకౌట్స్లో, కౌంటీ క్రికెట్లో, దులీప్ ట్రోఫీలో, రంజీ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. 23 ఏళ్ల సాయి సుదర్శన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 25 మ్యాచ్లు ఆడి ఆరు సెంచరీలు చేశాడు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్లో 28 మ్యాచ్లు ఆడి ఆరు సెంచరీలు బాదాడు. -
సిక్సర్లతో శివాలెత్తిపోయిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్
మహారాజా టీ20 టోర్నీలో షిమోగా లయన్స్ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ 10 మ్యాచ్ల్లో 6 అర్ద సెంచరీల సాయంతో 84.50 సగటున 507 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ ఏకంగా 52 సిక్సర్లు బాదాడు.నిన్న జరిగిన మ్యాచ్లోనూ అభినవ్ మరోసారి చెలరేగిపోయాడు. బెంగళూరు బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో అభినవ్ 24 బంతుల్లో 7 సిక్సర్లు, బౌండరీ సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. లయన్స్ ఇన్నింగ్స్లో అభినవ్తో పాటు మోహిత్ (56), రోహన్ నవీన్ (45) కూడా విజృంభించారు. బ్లాస్టర్స్ బౌలర్లలో ఆతిథ్య గోయల్ 2 వికెట్లు పడగొట్టగా.. సంతోక్ సింగ్, ప్రతీక్ జైన్, కౌశల్ తలో వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బ్లాస్టర్స్.. సూరజ్ అహూజా (82 నాటౌట్), శుభంగ్ హేగ్డే (85 నాటౌట్) వీర బాదుడు బాదడంతో మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్లాస్టర్స్ ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. షిమోగా బౌలర్లలో శరత్ 2, రాజ్వీర్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో అభినవ్ చెలరేగినా అతని జట్టు షిమోగా లయన్స్ ఓడిపోవడం విచారకరం. -
ఉత్తమ స్పిన్నర్లలో ఒకడిని.. జట్టులో చోటివ్వండి: భారత బౌలర్
తనకు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని టీమిండియా యువ ఆల్రౌండర్ ఆర్. సాయి కిశోర్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. భారత్లో ఉన్న ఉత్తమ స్పిన్నర్లలో తానూ ఒకడినని.. ఒక్క అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని మేనేజ్మెంట్ను అభ్యర్థించాడు. తమిళనాడుకు చెందిన సాయి కిశోర్ ఆసియా క్రీడలు-2023 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి పంపిన క్రికెట్ జట్టులో భాగమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్.. మొత్తంగా మూడు టీ20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి కిశోర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా అత్యుత్తమ గణాంకాలు(4/33) నమోదు చేశాడు.మెడకు తీవ్ర గాయంఅయితే, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మ్యాచ్ల విరామ సమయంలో గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన సాయి కిశోర్.. మెడకు తీవ్రమైన గాయమైంది. ఫలితంగా ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్లన్నింటికీ అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందిన సాయి.. ఈ ఏడాది జూలైలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా తిరుప్పూర్ తమిళన్స్ తరఫున పునరాగమనం చేశాడు.తదుపరి దులిప్ ట్రోఫీ-2024లో సాయి భాగం కానున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్-బిలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన సాయి కిశోర్.. తీవ్రమైన గాయం నుంచి కోలుకోవడం వెనుక ఎన్సీఏ ఫిజియోల కృషి ఎంతగానో ఉందని తెలిపాడు. వారితో పాటు తన భార్య కూడా కంటికి రెప్పలా కాచుకుని తనను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చిందన్నాడు.భయపడ్డాను‘‘మనం నడవాలన్నా.. నిద్రించాలన్నా.. దేనికైనా మెడనే ఉపయోగిస్తాం. మెడకు గాయమైన తర్వాత.. క్రికెట్ మాట పక్కనపెడితే.. నేనసలు తిరిగి సాధారణ జీవితం గడపుతానో లేదోనని భయపడ్డాను. ఆటకు దూరమైనా బాధను దిగమింగుకోవాలని నా మనసును సన్నద్ధం చేసుకున్నాను. అయితే, తులసి అన్న(తులసిరామ్ యువరాజ్, ఎన్సీఏలో ఫిజియో) నేను కోలుకోవడంలో ఎంతో తోడ్పాటునందించారు.నా వ్యక్తిగత మసాజర్, ట్రైనర్ హర్షా.. ఇలా అందరూ నాకు సహాయం అందించారు. గాయం వల్ల అసలు ఎక్కువ సేపు కూర్చునే వీలు కూడా ఉండేది కాదు. ప్రతి పనికీ ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది. నా భార్య సహకారం వల్లే ఇప్పుడిలా కోలుకోగలిగాను’’ అని సాయి కిశోర్ తెలిపాడు.ఒక్క ఛాన్స్ ఇవ్వండిఇక తనకు టెస్టుల్లో ఆడాలని ఉందన్న సాయి కిశోర్.. రవీంద్ర జడేజాతో కలిసి ఒక్క మ్యాచ్లో భాగమైనా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘దేశంలోని ఉత్తమ స్పిన్నర్లలో నేనూ ఒకడినని భావిస్తా. టెస్టుల్లో నన్ను ఆడించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జడేజాతో కలిసి ఆడటం నాకు ఇష్టం. అతడిని దగ్గరగా గమనిస్తూ.. తన నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని సాయి కిశోర్ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు!
ఐపీఎల్-2025కు ముందు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుజరాట్ టైటాన్స్ ఫ్రాంచైజీ సైతం తమ జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.తమ జట్టు హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా, క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకిని తప్పించాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు సంవత్సరాల ఆశిష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం.. ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ఈ ఏడాది చివరలో జరగనున్న మెగా వేలానికి ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా గుజరాత్ హెడ్కోచ్గా నెహ్రా విజయవంతమయ్యాడనే చెప్పుకోవాలి. తమ అరంగేట్ర సీజన్లో గుజరాత్ను ఛాంపియన్గా నిలిపిన నెహ్రా.. తర్వాతి సీజన్లో జీటీ రన్నరప్ నిలిచింది.అయితే ఐపీఎల్ 2024లో మాత్రం గుజరాత్ దారుణ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడంలో గుజరాత్ విఫలమైంది. అందుకు కెప్టెన్సీ మార్పు కూడా ఓ కారణం కావచ్చు. ఈ ఏడాది సీజన్కు ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో గుజరాత్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. కానీ జట్టును నడిపించడంలో శుబ్మన్ ఎంపికయ్యాడు.ఇక గత మూడు సీజన్లలో మెంటార్గా వ్యవహరించిన గ్యారీ కిరెస్టన్ ఇప్పటికే తన పదవి నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల హెడ్కోచ్గా గ్యారీ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు గుజరాత్ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.గుజరాత్ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ నుంచి కొంత వాటాను భారత వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ డీల్పై అధికారికంగా ప్రకటన విడుదల కానుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. -
‘అందుకే అప్లై చేయలేదు.. నేను గంభీర్లా కాదు’
శ్రీలంక తాజా పర్యటనతో భారత క్రికెట్లో నూతన శకం ఆరంభం కానుంది. ఇంతవరకు కోచ్గా అనుభవం లేని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటర్మెంట్ తర్వాత భారత్ తొలిసారి టీ20 సిరీస్లో పాల్గొననుంది.ఇక ఈ జట్టుకు నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిస్థాయికి కెప్టెన్గా నియమితుడైన విషయం తెలిసిందే. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా సైతం తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.ఆశ్చర్యం కలిగించలేదు‘‘హార్దిక్ పాండ్యా మూడు ఫార్మాట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టులకు దూరమైన అతడు యాభై ఓవర్ల క్రికెట్లోనూ పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఆటగాడి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకోవడం కత్తిమీద సాము లాంటిదే.అయినా క్రికెట్లో ఇవన్నీ సహజం. హార్దిక్పై వేటు వేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్గా ఉన్న అతడిని ఇలా అకస్మాత్తుగా రేసు నుంచి తప్పించడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే, కొత్త కోచ్ ఆలోచనలేమిటో మనకు తెలియదు. ప్రతి కోచ్, కెప్టెన్ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కదా’’ అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదని 45 ఏళ్ల నెహ్రా తెలిపాడు. ఇందుకు గల కారణాలు కూడా వెల్లడించాడు.నేను గంభీర్లా కాదు‘‘ఈ విషయం గురించి నేను ఎన్నడూ ఆలోచించనేలేదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. గౌతం గంభీర్ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు.ప్రస్తుతం నా పనులతో నేను బిజీగా, సంతోషంగా ఉన్నాను. జట్టుతో కలిసి తొమ్మిది నెలల పాటు ప్రయాణించే ఓపిక నాకు లేదు’’ అని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. కాగా ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్తో కలిసి పనిచేస్తున్నాడు.టైటాన్స్తో అనుబంధంఐపీఎల్-2022లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు నెహ్రా మార్గదర్శనంలోని హార్దిక్ పాండ్యా సారథ్యంలో చాంపియన్గా అవతరించింది. మరుసటి ఏడాది కూడా ఫైనల్ చేరింది. అయితే, ఐపీఎల్-2024లో పాండ్యా టైటాన్స్తో బంధం తెంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు.చదవండి: ‘ప్రేమ’తో నటాషా పోస్ట్.. హార్దిక్ పాండ్యా కామెంట్ వైరల్ -
IPL 2025: గుజరాత్ హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొన్ని ఫ్రాంచైజీలేమో ఆటగాళ్లను వదిలించుకోవాలని భావిస్తుంటే.. మరికొన్ని కోచింగ్ స్టాఫ్, మెంటార్లను మార్చే పనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా గుజరాత్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతనితో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరి పర్యవేక్షణలో గుజరాత్ తమ తొలి రెండు సీజన్లలో ఫైనల్స్కు చేరింది. 2022లో ఛాంపియన్గా, 2023లో రన్నరప్గా నిలిచింది. ఇంతటి విజయవంతమైన జోడీ ప్రస్తుతం గుజరాత్ను వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో (2024) వైఫల్యాల కారణంగా ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం వీరిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మేనేజ్మెంట్ తప్పించాలని నిర్ణయం తీసుకునే లోపే తామే స్వచ్చందంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని వీరు భావిస్తుండవచ్చు. గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఈ టాపిక్ నడుస్తుండగానే మరో వార్త సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. నెహ్రా గుజరాత్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటే టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. యువరాజ్తో గుజరాత్ యాజమాన్యం సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యువీకి గతంలో ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం లేదు. ఒకవేళ అతన్ని గుజరాత్ టైటాన్స్ పంచన చేర్చుకుంటే ఇదే అతనికి తొలి కోచింగ్ పదవి అవుతుంది. గుజరాత్ ఆఫర్పై యువీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, గుజరాత్ గత సీజన్లో ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. హార్దిక్ ఎగ్జిట్తో శుభ్మన్ గిల్ గుజరాత్ నూతన కెప్టెన్గా ఎంపికయ్యాడు. గిల్ నేతృత్వంలో గుజరాత్ గత సీజన్లో 14 మ్యాచ్ల్లో ఐదింట మాత్రమే విజయాలు సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించింది. -
అదానీ చేతికి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ..?
ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్లో మెజారిటీ వాటాను తగ్గించుకోవాలని యోచిస్తోంది. సదరు వాటాను విక్రయించేందుకు అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్లతో చర్చలు జరుపుతున్నట్లు కొన్ని మీడియా నివేదికల ద్వారా తెలిసింది.సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ 2021లో గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీని రూ.5,625 కోట్లకు దక్కించుకుంది. అయితే ప్రస్తుతం తన వాటాను తగ్గించుకోవాలని యోచిస్తోంది. దాంతో అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్లకు మేజర్ వాటాను విక్రయించడానికి చర్చలు సాగుతున్నట్లు సమాచారం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 2025తో ఫ్రాంచైజీ వాటాలను విక్రయించడానికి లాక్-ఇన్ పీరియడ్ ముగుస్తుంది. ఆలోపే ఈ తంతు పూర్తి చేయాలని సీవీసీ క్యాపిటల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ విలువ 1-1.5 బిలియన్ డాలర్ల(రూ.8,500 కోట్లు) మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టొరెంట్ సంస్థ క్రికెట్ వ్యాపారంలోకి ఇంకా ప్రవేశించలేదు. కానీ, అదానీ గ్రూప్ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో పెట్టుబడులను కలిగి ఉంది. డబ్ల్యూపీఎల్లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ 2023లో రూ.1,289 కోట్ల బిడ్తో సొంతం చేసుకుంది. ఈ గ్రూప్ 2021లోనే గుజరాత్ టైటాన్స్ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదురలేదు.ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఇదిలాఉండగా, సీవీసీకి ఇప్పటికే లాలిగా, ప్రీమియర్షిప్ రగ్బీ, వాలీబాల్ వరల్డ్, ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్లో పెట్టుబడులు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ తన తొలి సీజన్ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. -
ప్లే ఆఫ్స్లో సన్రైజర్స్: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్
ఐపీఎల్- 2021, 2022, 2023లో పాయింట్ల పట్టికలో వరుసగా 8, 8, 10వ స్థానాలు.. పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలపాలైన జట్టు.. అయితే, ఈ ఏడాది ఆ జట్టు రాత పూర్తిగా మారింది.కొత్త కెప్టెన్ వచ్చాడు... అదిరిపోయే ఓపెనింగ్ కాంబినేషన్ కుదిరింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లోనూ మెరుపులు మెరిపించగల ఆటగాళ్లు.. వీరికి తోడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు.. వెరసి లీగ్ దశలో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్నకు అర్హత. అర్థమైంది కదా! అవును ఆరెంజ్ ఆర్మీ గురించే ఇదంతా! సన్రైజర్స్ హైదరాబాద్ చివరిసారిగా 2020లో టాప్-4లో అడుగుపెట్టింది. ఇదిగో మళ్లీ ఇప్పుడే ఈ ఘనత సాధించడం. వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీకి తోడు హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడం.. అవసరమైన సమయంలో నితీశ్కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్.. కమిన్స్తో పాటు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే రాణించడం జట్టుకు సానుకూలాంశాలుగా మారాయి.సమిష్టి కృషితో టాప్-4 వరకుఈ క్రమంలో విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారిపోయిన సన్రైజర్స్.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం పక్కా అని అభిమానులు మురిసిపోయారు. అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో రాణిస్తూ సమిష్టి కృషితో టాప్-4 వరకు చేరింది సన్రైజర్స్.గుజరాత్ టైటాన్స్తో గురువారం నాటి మ్యాచ్ రద్దైన నేపథ్యంలో నేరుగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. నిజానికి ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్లో రైజర్స్ గెలిచేదే! కానీ వర్షం కారణంగా ఇలా పెద్దగా కష్టపడకుండానే అర్హత సాధించింది.పట్టరాని సంతోషంలో కావ్యా మారన్దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఐపీఎల్-2024 వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఇలా ఫలితాలు ఇస్తుండటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు.కేన్ మామను హత్తుకున్న సన్రైజర్స్ ఓనర్ఇలా ఆనందంలో ఉన్న కావ్యా మారన్కు ‘పాత చుట్టం’ ఎదురయ్యారు. అతడిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే గాకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అతడు మరెవరో కాదు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్. అదేనండీ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ముద్దుగా కేన్ మామగా పిలుచుకునే న్యూజిలాండ్ కెప్టెన్. 2021, 2022లో సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరించాడు విలియమ్సన్. పాత ఓనర్ను కలుసుకునిఅయితే, ఆ రెండు సీజన్లలో జట్టు దారుణ వైఫల్యాల నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేయగా.. 2023 వేలంలో గుజరాత్ కొనుక్కుంది. ఇప్పుడిలా తన పాత జట్టు.. ప్రస్తుత జట్టుతో మ్యాచ్ రద్దు కావడం వల్ల ప్లే ఆఫ్స్ చేరడం... ఆ సమయంలో పాత ఓనర్ను విలియమ్సన్ కలుసుకోవడం విశేషంగా నిలిచింది. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ 🧡 pic.twitter.com/QVyGH6KdNP— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
IPL 2024- SRH: ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన దెబ్బ ఐపీఎల్ మ్యాచ్పై కూడా పడింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. వాన తెరిపినివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. మధ్యాహ్నం తర్వాత కురిసిన వానకు నగరం మొత్తం జలమయమైంది. రాజీవ్గాంధీ స్టేడియంలో కూడా అవుట్ఫీల్డ్ను కవర్స్తో కప్పేశారు. అయితే ఏ దశలోనూ వాన పూర్తిగా ఆగలేదు. టాస్ కాస్త ఆలస్యం కాగా... నిర్ణీత రాత్రి 7:30 గంటల సమయంలో కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ వెంటనే చిరు చినుకులతో మొదలై మళ్లీ విరామం లేకుండా కురిసింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా రాత్రి 10:15 గంటలకు పూర్తిగా వాన ఆగాలి. కానీ అలా జరగలేదు. దాంతో అంపైర్లు గ్రౌండ్ను పరిశీలించి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గుజరాత్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా రద్దు కావడం గమనార్హం. ఈ ఫలితంతో సన్రైజర్స్ 13 మ్యాచ్ల తర్వాత 15 పాయింట్ల వద్ద మూడో స్థానంలో నిలిచింది. దాంతో టీమ్కు ప్లే ఆఫ్స్ స్థానం ఖాయమైంది. ఆదివారం సన్రైజర్స్ సొంతగడ్డపైనే పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచి... అదే రోజు రాత్రి కోల్కతా నైట్రైడర్స్తో తమ చివరి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓడితే సన్రైజర్స్కు రెండో స్థానం ఖాయమవుతుంది. 2020లో చివరిసారి ప్లే ఆఫ్స్కు అర్హత పొందిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 2021, 2022, 2023 సీజన్లలో వరుసగా 8వ, 8వ, 10వ స్థానాల్లో నిలిచింది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
SRH vs GT: మ్యాచ్కు వర్షం అడ్డంకి.. హెచ్సీఏ కీలక ప్రకటన
ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు.అయితే ఇంకా చిన్నపాటి జల్లు కురుస్తుండడంతో సెంట్రల్ పిచ్ను మాత్రం కవర్స్తో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కానుంది. ఇక ఈ మ్యాచ్ నిర్వహణపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు. వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మైదానాన్ని సిద్దం చేసుందుకు 100 మందికి పైగా గ్రౌండ్ స్టాప్ శ్రమిస్తున్నారని జగన్ మోహన్ రావు తెలిపారు. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఉప్పల్ స్టేడియంలో ఫుల్ జోష్లో SRH, GT ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
IPL 2024: గుజరాత్ అవుట్
అహ్మదాబాద్: సొంతగడ్డపైనే గుజరాత్ టైటాన్స్ పుట్టి మునిగింది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉన్న నిరుటి రన్నరప్ టైటాన్స్ ఆశల్ని భారీ వర్షం ముంచేసింది. తెరిపినివ్వని వానతో నరేంద్ర మోదీ స్టేడియం తడిసిముద్దయ్యింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్గానైనా నిర్వహించేందుకు గ్రౌండ్ సిబ్బంది చాలా కష్టపడింది. కానీ ఆగినట్లే ఆగిన వాన మళ్లీ చినుకు చినుకుగా పడటంతో నిర్వాహకులు చేసేదేమీలేక తుది నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది. నిజానికి రాత్రి 10 గంటలైనా అసలు టాస్ వేసేందుకే అవకాశం లేకపోయింది. చివరిసారిగా రాత్రి 10.36 గంటలకు మైదానాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు నవ్దీప్ సింగ్, నిఖిల్ పట్వర్దన్ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించగా, ఆటగాళ్లు పరస్పర కరచాలనంతో మైదానంలోని ప్రేక్షకుల్ని పలుకరిస్తూ డ్రెస్సింగ్ రూమ్వైపు నడిచారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వర్షంవల్ల రద్దయిన తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. పటిష్టస్థితిలో కోల్కతా ఫలితం తేలని మ్యాచ్తో టాప్–2 స్థానాలు మాత్రం తేలిపోయాయి. మ్యాచ్ రద్దుతో వచి్చన ఒక పాయింట్తో కోల్కతా 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ మిగిలున్న ఆఖరి మ్యాచ్లో ఓడినా... తొలి రెండు స్థానాల్లో ఉండటం ఖాయమైంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్తాన్ రాయల్స్ తమ రెండు లీగ్ మ్యాచ్ల్లోనూ ఒకవేళ గెలిస్తే 20 పాయింట్లతో అగ్రస్థానంలోకి ఎగబాకుతుంది. అప్పుడు నైట్రైడర్స్ రెండో స్థానానికి పడిపోయినా ఎలిమినేటర్ ఆడే పరిస్థితి అయితే రాదు. ఐపీఎల్లోకి ప్రవేశించిన గత రెండేళ్ల నుంచి ఫైనల్ చేరిన గుజరాత్ ఈసారి ఇంకో మ్యాచ్ మిగిలున్నా... లీగ్ దశలోనే ని్రష్కమించనుంది. 2022లో టైటిల్ గెలిచిన టైటాన్స్ గతేడాది రన్నరప్తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో ఐదింట గెలిచిన టైటాన్స్ ఖాతాలో 11 పాయింట్లున్నాయి. ఒకవేళ ఆఖరిపోరు గెలిచినా... 13 పాయింట్లవద్దే ఆగిపోతుంది. అయితే పట్టికలో ఇప్పటికే కోల్కతా (19), రాజస్తాన్ (16), చెన్నై (14), హైదరాబాద్ (14) ముందు వరుసలో ఉండటంతో గుజరాత్ ఖేల్ లీగ్తోనే ముగిసింది. -
వర్షం ఎఫెక్ట్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షర్ఫాణమైంది. ఎడతరిపి లేని వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దు అయింది. సాయంత్రం నుంచే అహ్మదాబాద్లో వర్షం కురుస్తోంది. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఇరు జట్లకూ చేరో పాయింట్ లభించింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన గుజరాత్ ఐదింట విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే . ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ తొమ్మిదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
సీఎస్కేకు షాకిచ్చిన గుజరాత్.. ఘన విజయం
-
GTvsCSK: టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. గిల్కు ఏకంగా!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకున్న గుజరాత్ టైటాన్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శతక వీరుడు కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు.కాగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(103), శుబ్మన్ గిల్(104) సునామీ శతకాలతో చెలరేగగా.. 231 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నైని 196 పరుగులకే కట్టడి చేసి.. ఈ సీజన్లో ఐదో విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో నిలవగలిగింది. దీంతో ఫుల్ జోష్లో ఉన్న గుజరాత్ టైటాన్స్కు జరిమానా రూపంలో భారీ షాక్ తగిలింది.నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున కెప్టెన్ శుబ్మన్ గిల్కు రూ.24 లక్షలు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం మేర బీసీసీఐ కోత విధించింది. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఈ ఎడిషన్లో గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు కెప్టెన్కు రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత(ఏది తక్కువగా ఉంటే అది) ఫైన్ వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.గుజరాత్ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: అహ్మదాబాద్.. నరేంద్ర మోదీ స్టేడియం👉టాస్: చెన్నై.. బౌలింగ్👉గుజరాత్ స్కోరు: 231/3 (20)👉చెన్నై స్కోరు: 196/8 (20)👉ఫలితం: 35 పరుగుల తేడాతో చెన్నైపై గుజరాత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్చదవండి: Rohit Sharma: అది నా ఇల్లు.. కానీ ఇదే లాస్ట్: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్A record-breaking opening partnership followed by an effective bowling display to earn 2️⃣ points 🙌Recap the #GTvCSK clash 🎥 #TATAIPL pic.twitter.com/f9RI6iP8eL— IndianPremierLeague (@IPL) May 11, 2024 -
MS Dhoni: తలా ధోనిపై అభిమానంతో మ్యాచ్ మధ్యలో వీరాభిమాని పాదాభివందనం (ఫొటోలు)
-
మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మిస్టర్ కూల్ అని నిరూపించుకున్నాడు. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.గుజరాత్ టైటాన్స్- సీఎస్కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడ్డాయి.సొంతమైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతకాల మోతసాయి సుదర్శన్(103), శుబ్మన్ గిల్(104) శతకాల మోతతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్ ఆదుకుంది. కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్ ముందు తలవంచింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాది ధోని జోరు మీద ఉండగా... మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు. కానీ బాల్ వికెట్స్ మిస్ చేసినట్లుగా తేలడంతో ధోని నాటౌట్గా నిలిచాడు.పాదాలకు నమస్కరించగానేఅయితే, ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు. అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్గా డీల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలా క్రేజ్, ఫ్యాన్స్ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చదవండి: కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్లోనూ అలా! పాపం..Best moments of IPL 🥹💛That Hug and That smile Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024Ms Dhoni knows exactly how to make the stadium roar with his mass entry 🥹🔥🔥#CSKvsGT | #DHONI𓃵pic.twitter.com/U5DA5meNaw— 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) May 10, 2024The Helicopter Shot 🚁A maximum from #CSK's Number 7️⃣💥Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvCSK pic.twitter.com/2QAN3jPjTb— IndianPremierLeague (@IPL) May 10, 2024 -
గిల్, సాయి శతకాల మోత
అహ్మదాబాద్: గుజరాత్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో పడదామనుకున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటాన్స్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ చుక్కలు చూపించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూపర్కింగ్స్ ఊహించని ఉపద్రవంతో చేతులెత్తేసింది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. మొదట టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. గిల్ (55 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్లు), సుదర్శన్ (51 బంతుల్లో 103; 5 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగారు.తుషార్ దేశ్పాండేకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఓడింది. డారిల్ మిచెల్ (34 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్స్లు), మొయిన్ అలీ (36 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించారు. మోహిత్ శర్మ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. జోరు కాదు... ఓపెనర్ల హోరు... పవర్ ప్లేలో 58/0 స్కోరు చేసిన టైటాన్స్ ఓపెనర్లు ఆ తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ముందుగా సాయి సుదర్శన్ 32 బంతుల్లో, గిల్ 25 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేశారు. పేస్, స్పిన్, స్లో మీడియం ఇలా ఆరుగురు చెన్నై బౌలర్లు 17 ఓవర్ల వరకు వైవిధ్యం చూపినా... వాళ్లిద్దరు మాత్రం అడ్డు అదుపు లేకుండా శరవేగంగా పరుగుల్ని రాబట్టారు. సెంచరీ మాత్రం ముందుగా శుబ్మన్ 50 బంతుల్లో పూర్తిచేయగా, తర్వాత సుదర్శన్ కూడా 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ పరుగుల తుఫాన్ను ఎట్టకేలకు డెత్ ఓవర్లకు గానీ విడగొట్టలేకపోయారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్కు యత్నించిన సాయి సుదర్శన్... శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి నిష్క్ర మించాడు.దీంతో ఓపెనింగ్ వికెట్కు 210 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో చెన్నై శిబిరంలో తొలిసారి ఆనందం కనబడింది. అదే ఓవర్లో కెపె్టన్ గిల్ కూడా అవుట్ కావడంతో సూపర్కింగ్స్ ఊపిరి పీల్చుకుంది. అన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు... ఇద్దరివే! 17.2 ఓవర్లు ఓపెనర్లే ఆడారు. దీంతో స్కోరు బోర్డు పరుగందుకుంది. మెరుపులతో జోరందుకుంది. ఓపెనింగ్కు ఇరువైపుల వేగం, వేగం కనిపించడంతో మోదీ స్టేడియం గుజరాత్ అభిమానుల కేరింతలతో మార్మోగింది. సుదర్శన్, గిల్ ఇద్దరు అదేపనిగా దంచేయడంతో ఫోర్లతో సిక్సర్లు కూడా పోటీపడ్డాయి. 14 ఫోర్లు, 13 సిక్స్లు బాదేయడంతో 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో 134 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆరో ఓవర్లో 50కి చేరిన గుజరాత్ స్కోరు... 100 పరుగుల్ని పదో ఓవర్లో దాటింది. 150 పరుగుల్ని మరింత వేగంగా 13వ ఓవర్లోనే అధిగమించింది. 17వ ఓవర్లో 200 మైలురాయికి చేరింది. ఆరంభంలోనే దెబ్బ తొలి ఓవర్లో రచిన్ రవీంద్ర (1), రెండో ఓవర్లో రహానే (1), మూడో ఓవర్లో కెపె్టన్ రుతురాజ్ (0) వరుస కట్టడంతో కొండంత లక్ష్యఛేదన చెన్నైకి అసాధ్యంగా మారింది. మిచెల్, మొయిన్ అలీ అర్ధసెంచరీలతో చేసిన పోరాటం సూపర్కింగ్స్ ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే ఉపయోగపడింది తప్ప... లక్ష్యంవైపు నడిపించలేకపోయింది. హిట్టర్ శివమ్ దూబే (21; 2 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (18; 2 ఫోర్లు, 1 సిక్స్) టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్కు తలొగ్గారు. ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) ఆఖర్లో సిక్సర్లతో అలరించాడు. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు సాధించడం ఇది రెండోసారి. 2019లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్స్టో, వార్నర్ తొలుత ఈ ఘనత సాధించారు.100 శుబ్మన్ గిల్ శతకం ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 100వ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ ప్రారంభమైన ఏడాది 2008 ఏప్రిల్ 18న జరిగిన తొలి మ్యాచ్లోనే కోల్కతా నైట్రైడర్స్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ మొదటి సెంచరీ చేశాడు. మొత్తం 17 ఐపీఎల్ సీజన్లలో ఇప్పటి వరకు 1084 మ్యాచ్లు జరిగాయి. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో తొలి వికెట్కు 200 అంతకంటే ఎక్కువ పరుగుల భాగ స్వామ్యం నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (68 నాటౌట్), డికాక్ (140 నాటౌట్) తొలి వికెట్కు అజేయంగా 210 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) దూబే (బి) తుషార్ 103; శుబ్మన్ గిల్ (సి) జడేజా (బి) తుషార్ 104; మిల్లర్ (నాటౌట్) 16; షారుఖ్ ఖాన్ (రనౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–210, 2–213, 3–231. బౌలింగ్: సాన్ట్నర్ 2–0–31–0, తుషార్ 4–0–33–2, శార్దుల్ 4–0–25–0, సిమర్జీత్ 4–0–60–0, జడేజా 2–0–29–0, మిచెల్ 4–0–52–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) తెవాటియా (బి) సందీప్ వారియర్ 1; రచిన్ (రనౌట్) 1; రుతురాజ్ (సి) రషీద్ ఖాన్ (బి) ఉమేశ్ 0; మిచెల్ (సి) షారుఖ్ (బి) మోహిత్ 63; అలీ (సి) నూర్ అహ్మద్ (బి) మోహిత్ 56; దూబే (సి) నూర్ (బి) మోహిత్ 21; జడేజా (సి) మిల్లర్ (బి) రషీద్ 18; ధోని (నాటౌట్) 26; సాన్ట్నర్ (బి) రషీద్ 0; శార్దుల్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–10, 4–119, 5–135, 6–165, 7–169, 8–169. బౌలింగ్: ఉమేశ్ 3–0–20–1, సందీప్ వారియర్ 3–0–28–1, త్యాగి 4–0–51–0, నూర్ అహ్మద్ 2–0–25–0, రషీద్ ఖాన్ 4–0–38–2, మోహిత్ 4–0–31–3. ఐపీఎల్లో నేడుకోల్కతా X ముంబై వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs GT: సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్లే ఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ అద్భుత విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో గుజరాత్ విజయ భేరి మ్రోగించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మొయిన్ అలీ(56) పరుగులతో రాణించినప్పటికి మిగితా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో సీఎస్కే ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు, సందీప్ వారియర్, ఉమేశ్ యాదవ్ తలా వికెట్ సాధించారు.సాయి, గిల్ విధ్వంసం..అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. 51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. సీఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. -
CSK Vs GT: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
గుజరాత్ టైటన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సాయిసుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సుదర్శన్ సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి స్కోర్ను బోర్డును పరుగులు పెట్టించాడు. గిల్, సుదర్శన్ కలిసి తొలి వికెట్ కు 210 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్(104) కూడా సెంచరీ చేశాడు.సచిన్ రికార్డు బద్దలు..ఇక మ్యాచ్లో సుదర్శన్ సెంచరీతో పాటు.. ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు.సాయి సుదర్శన్ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉండేది.సచిన్, గైక్వాడ్ ఇద్దరూ 1000 పరుగుల మైలు రాయిని 31 ఇన్నింగ్స్లలో అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్తో వీరిద్దరి ఆల్టైమ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.ఓవరాల్గా ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైల్స్టోన్ను అందుకున్న మూడో క్రికెటర్గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ క్రికెటర్ షాన్ మార్ష్ (21) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాత విండీస్ ఆటగాడు లెండిల్ సిమన్స్(23) సిమ్మన్స్ ఉన్నాడు. -
CSK Vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సాయి.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసం సృష్టించారు. కీలక మ్యాచ్లో గిల్, సాయి సుదర్శన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. సీఎస్కే బౌలర్లను వీరిద్దరూ ఓ ఆట ఆడుకున్నారు.51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. తొలి వికెట్కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా సాయిసుదర్శన్కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. Shubman Gill is one of the most aesthetic batsman in the world right now, what a hundred by Gujarat Titans captain ⭐❤️pic.twitter.com/iJZRy0VPDC— Shubman Gang (@ShubmanGang) May 10, 2024 -
సీఎస్కేతో గుజరాత్ కీలక పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కీలక పోరుకు సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ గ్లీసన్ స్ధానంలో కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర వచ్చాడు. మరోవైపు గుజరాత్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. లిటిల్, వృద్దిమాన్ సాహా స్ధానంలో మాథ్యూ వేడ్, కార్తీక్ త్యాగీ వచ్చారు. కాగా గుజరాత్ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. పాయింట్ల పట్టికలో సీఎస్కే నాలుగో స్ధానంలో ఉండగా.. గుజరాత్ ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయిసుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగిచెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్ -
MS Dhoni: ధోనిని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ గురించి ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నాడు.అదే విధంగా.. ధోని ఏ స్థానంలోనైనా ఆడగలడని అందుకే గత మ్యాచ్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడని ఫ్లెమింగ్ తెలిపాడు. కాగా గతేడాది నుంచి ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.అయినప్పటికీ 42 ఏళ్ల తలా ఐపీఎల్-2024 బరిలో దిగాడు. ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ ఆడి 110 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ధోని తన టీ20 కెరీర్లో తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని తప్పుబట్టారు. జట్టు కోసం అతడు ఏడో స్థానంలోనే రావాలని.. అలా కాని పక్షంలో తుదిజట్టులో ఉండకూడదని ఘాటు విమర్శలు చేశారు.ఈ క్రమంలో మోకాలి నొప్పి కారణంగానే బ్యాటింగ్ తగ్గించి.. వికెట్ కీపర్గా పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సీఎస్కే హెడ్కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు.గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం చెన్నై మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు కేవలం సిక్సర్లు, ఫోర్లు కొట్టడమే కాదు.. ఏ స్థానంలో వచ్చినా తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు.అతడు తొమ్మిదో స్థానంలో వచ్చినంత మాత్రాన ప్రభావం చూపలేడని భావించవద్దు. జట్టు కోసం తనేం చేయగలడో తప్పకుండా చేస్తాడు.అతడి సేవలను అన్ని రకాలుగా మేము ఉపయోగించుకుంటాం. అయితే, ఒత్తిడి పెంచి అతడు జట్టుకు దూరమయ్యేలా చేసుకోలేం. జట్టు కోసం తను ఎల్లప్పుడూ పరితపిస్తాడు. అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు. ప్రస్తుతం తన ఫిట్నెస్కు వచ్చిన ఇబ్బందులేమీ లేవు’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన 11 మ్యాచ్లలో ఆరు గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అహ్మదాబాద్లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది. చదవండి: Mohammed Shami Slams LSG Owner: కాస్తైనా సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా? -
సీఎస్కేతో పోరు.. గుజరాత్ గెలిచేనా?
-
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
-
బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
తొలి ఎనిమిది మ్యాచ్లలో ఒక విజయం, ఏడు పరాజయాలు... అంతా లెక్కలోంచి తీసేసిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత రెండు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు సొంతగడ్డపై చెలరేగి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి పదినుంచి ఏడుకు చేరింది. అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపుతీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన ల„ ్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ స్కోరు 92/0...ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో అభిమానులకు ఆర్సీబీ ఆనందం పంచింది. శనివారం జరిగిన కీలక పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్లు) తొలి వికెట్కు 35 బంతుల్లోనే 92 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. జోష్ లిటిల్కు 4 వికెట్లు దక్కాయి. టపటపా... సిరాజ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. తన తొలి రెండు ఓవర్లలో సాహా (1), గిల్ (2)లను సిరాజ్ అవుట్ చేయగా, సుదర్శన్ (6)ను గిల్ వెనక్కి పంపించాడు. దాంతో పవర్ప్లేలో గుజరాత్ 23 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో షారుఖ్, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిల్లర్ను అవుట్ చేసి ఈ 61 పరుగుల భాగస్వామ్యానికి కరణ్ తెర దించగా...లేని పరుగు కోసం ప్రయత్నించి షారుఖ్ రనౌట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఆ తర్వాత తెవాటియా కాస్త దూకుడుగా ఆడటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాదాడు. యశ్ దయాళ్ ఒకే ఓవర్లో రషీద్ (18), తెవాటియాను అవుట్ చేసి దెబ్బ కొట్టగా...వైశాక్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఒకే స్కోరు వద్ద గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది. మెరుపు భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ బౌండరీలు బాదుతూ వేగంగా లక్ష్యం దిశగా సాగిపోయారు. మోహిత్ వేసిన తొలి ఓవర్లో కోహ్లి 2 సిక్స్లు కొట్టగా, లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మానవ్ వేసిన తర్వాతి ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన డుప్లెసిస్...మోహిత్ ఓవర్లో 4 ఫోర్లు బాది 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మానవ్ ఓవర్లో కోహ్లి 2 సిక్స్లు కొట్టగా...లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అదే జోరులో డుప్లెసిస్ అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించిన ఆర్సీబీ...ఐపీఎల్లో తమ అత్యుత్తమ పవర్ప్లే స్కోరును నమోదు చేసింది. అయితే డుప్లెసిస్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ బృందం తడబడింది. కొంత ఉత్కంఠ నెలకొన్నా... దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్కు అభేద్యంగా 35 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కార్తీక్ (బి) సిరాజ్ 1; గిల్ (సి) వైశాక్ (బి) సిరాజ్ 2; సుదర్శన్ (సి) కోహ్లి (బి) గ్రీన్ 6; షారుఖ్ (రనౌట్) 37; మిల్లర్ (సి) మ్యాక్స్వెల్ (బి) కరణ్ 30; తెవాటియా (సి) వైశాక్ (బి) దయాళ్ 35; రషీద్ (బి) దయాళ్ 18; విజయ్శంకర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 10; మానవ్ (సి) స్వప్నిల్ (బి) వైశాక్ 1; మోహిత్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–19, 4–80, 5–87, 6–131, 7–136, 8–147, 9–147, 10–147. బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 1–0–1–0, సిరాజ్ 4–0–29–2, యశ్ దయాళ్ 4–0–21–2, గ్రీన్ 4–0–28–1, విజయ్కుమార్ వైశాక్ 3.3–0–23–2, కరణ్ శర్మ 3–0–42–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి) సాహా (బి) నూర్ 42; డుప్లెసిస్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 64; జాక్స్ (సి) షారుఖ్ (బి) నూర్ 1; పటిదార్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 2; మ్యాక్స్వెల్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 4; గ్రీన్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 1; కార్తీక్ (నాటౌట్) 21; స్వప్నిల్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 2; మొత్తం (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–92, 2–99, 3–103, 4–107, 5–111, 6–117. బౌలింగ్: మోహిత్ శర్మ 2–0–32–0, జోష్ లిటిల్ 4–0–45–4, మానవ్ సుథర్ 2–0–26–0, నూర్ అహ్మద్ 4–0–23–2, రషీద్ ఖాన్ 1.4–0–25–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X చెన్నైవేదిక: ధర్మశాలమధ్యాహ్నం 3: 30 గంటల నుంచిలక్నో X కోల్కతావేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్కుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024 -
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన పరిచాడు.కళ్లు చెదిరే త్రోతో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారూఖ్ ఖాన్ను రనౌట్ చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన విజయ్ కుమార్ బౌలింగ్లో రాహుల్ తెవాటియా ఆఫ్సైడ్ డిఫెన్స్ ఆడాడు.అయితే నాన్స్ట్రైక్లో ఉన్న షారూఖ్ ఖాన్ క్విక్ సింగిల్ కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ స్ట్రైక్లో ఉన్న తెవాటియా మాత్రం నో అంటూ వెనుక్కి వెళ్లమని కాల్ ఇచ్చాడు. అయితే షారూఖ్ ఖాన్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసే లోపే మెరుపు వేగంతో బంతిని అందుకున్న విరాట్ బౌలర్ ఎండ్లో స్టంప్స్ను పడగొట్టాడు. వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ రిఫర్ చేయగా.. రీప్లేలో కూడా రనౌట్గా తేలింది. కోహ్లి సంచలన త్రో చూసిన అందరూ బిత్తరపోయారు. కామెరాన్ గ్రీన్ అయితే కోహ్లి వైపు చూస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
ఐపీఎల్-2024లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. నిర్ణీత 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఓపెనర్లు శుబ్మన్ గిల్(2), వృద్దిమాన్ సహా(1) తీవ్ర నిరాశపరిచారు. వీరిద్దరితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయిసుదర్శన్(6) పరుగులు చేశాడు. 19 పరుగులకే 3 విట్లుల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రమంలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), గుజరాత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరితో పాటు రాహుల్ తెవాటియా(35) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. -
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఆర్సీబీ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో బెంగళూరు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. గుజరాత్ టైటాన్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. గుజరాత్ జట్టులోకి మానవ్ సుత్తార్, జౌషువా లిటిల్ వచ్చారు. కాగా కాగా మానవ్ సత్తార్కు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ ఆర్సీబీ చాలా ముఖ్యం. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. 10 మ్యాచ్ల్లో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో పదో స్ధానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధిస్తే తమ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్కుమార్ వైషాక్గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ -
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
-
జాక్స్ ధమాకా...
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం. అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగారు. అనంతరం ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) సిక్సర్లతో హోరెత్తించారు. జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో... కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1. ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X ఢిల్లీ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కోహ్లి అదరగొట్టాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో కోహ్లికి ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 500 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అయితే తన స్ట్రైక్ రేటుపై విమర్శల చేస్తున్న వారికి కోహ్లి గట్టి కౌంటిరిచ్చాడు."నా స్ట్రైక్ రేట్, ఆట గురించి మాట్లాడే వ్యక్తుల గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే జట్టు కోసం, మ్యాచ్ గెలవడానికి ఏమో చేయాలో నాకు తెలుసు. జట్టులో నా పాత్రపై నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఆడే జట్టును గెలిపించడానికి 100 శాతం ఎఫెక్ట్ పెడతాను గత 15 ఏళ్లగా అదే చేస్తున్నాను. ఎక్కడో కూర్చోని మాట్లాడేవారు ఏదైనా మాట్లాడతారు. కాబట్టి వ్యక్తిల స్వంత ఆలోచనలు, వారి ఊహలతో నాకు సంబంధం లేదు. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడమే నా లక్ష్యమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో కోహ్లి పేర్కొన్నాడు. -
విల్ జాక్స్ సుడిగాలి శతకం.. గుజరాత్ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ మూడో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాక కోలుకున్న ఆర్సీబీ గుజరాత్తో ఇవాళ (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్ సునామీ ఇన్నింగ్స్ ముందు విరాట్ కోహ్లి (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ మరుగున పడింది. ఛేదనలో ఆర్సీబీకి డుప్లెసిస్ (12 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జాక్స్ తానెదుర్కొన్న చివరి 13 బంతుల్లో ఏకంగా 64 పిండుకున్నాడు. మోహిత్ వేసిన 15వ ఓవర్లో 29 పరుగులు, రషీద్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు. జాక్స్ దెబ్బకు గుజరాత్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. డుప్లెసిస్ వికెట్ సాయికిషోర్కు దక్కింది.అంతకుముందు టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో వృద్దిమాన్ సాహా (5), శుభ్మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్, షారుక్ ఖాన్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 28) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో వృద్దిమాన్ సాహా (5), శుభ్మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.గుజరాత్ ఇన్నింగ్స్ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్లో సాయి సుదర్శన్ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్ ఖాన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. -
గ్రీన్ సూపర్ క్యాచ్.. గిల్ను బుట్టలో వేసుకున్న మ్యాక్సీ
ఆర్సీబీ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్తో మ్యాచ్లో తాను వేసిన తొలి ఓవర్లోనే ఆ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ను (19 బంతుల్లో 16; ఫోర్) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్ నాలుగో బంతికి కెమరూన్ గ్రీన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్కు చేరాడు. ఫలితంగా గుజరాత్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. WHAT A CATCH BY CAMERON GREEN. 🤯- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024 ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్వప్నిల్ సింగ్ గుజరాత్ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి స్వప్నిల్ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్ శర్మ క్యాచ్ పట్టడంతో సాహా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్ (31), షారుఖ్ ఖాన్ (15) క్రీజ్లో ఉన్నారు. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
IPL 2024: గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్.. విధ్వంసకర బ్యాటర్ రీఎంట్రీ
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 28 మధ్యాహ్నం) జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ రీఎంట్రీ ఇచ్చాడు. మ్యాక్సీ కొన్ని మ్యాచ్లకు ముందు ఫామ్ లేమి కారణంగా స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు. మూడు మ్యాచ్ల విరామం అనంతరం మ్యాక్సీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మ్యాక్సీ జట్టులోకి రావడంతో ఫెర్గూసన్పై వేటు పడింది. ఈ ఒక్క మార్పుతో ఆర్సీబీ నేటి మ్యాచ్లో బరిలోకి దిగుతుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్కు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్లో గెలుపొందాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
ఐపీఎల్లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్లు.. రెండూ భారీ సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 28) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్లో గుజరాత్, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్రైజర్స్, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్ ఇవాళ రెండూ భారీ మ్యాచ్లనే షెడ్యూల్ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే..పేపర్పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్కీపర్), శుభ్మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్లో పటిష్టమైన సన్రైజర్స్ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లోనే ఇది బిగ్ ఫైట్గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ మూడో స్థానంలో.. సీఎస్కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే 14, సన్రైజర్స్ 6 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్]సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ సబ్: శార్దూల్ ఠాకూర్] -
T20 WC: దాదాపు 900 రన్స్ చేశా.. నాకు చోటివ్వకపోతే..: శుబ్మన్ గిల్
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియాలో తన స్థానం గురించి యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఐపీఎల్ మీదనే ఉందని.. గుజరాత్ టైటాన్స్ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పాడు.ఒకవేళ ఐసీసీ టోర్నీ ఆడే భారత జట్టులో తనకు చోటు దక్కకున్నా.. సహచర ఆటగాళ్లను చీర్ చేస్తూ వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్తానని గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024కు ముందే.. టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా జట్టును వీడాడు.టైటాన్స్ కెప్టెన్గా కొత్త బాధ్యతలుముంబై ఇండియన్స్ గూటికి చేరి కెప్టెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం శుబ్మన్ గిల్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అతడి సారథ్యంలో టైటాన్స్ ఇప్పటి వరకు ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లు ఆడి కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇక వ్యక్తిగతంగానూ శుబ్మన్ గిల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. గత సీజన్లో 17 ఇన్నింగ్స్ ఆడి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఈసారి 9 ఇన్నింగ్స్లో కలిపి 304 పరుగులు చేశాడు.రోహిత్కు జోడీగా విరాట్ కోహ్లిఇదిలా ఉంటే.. మే 26న ఐపీఎల్-2024కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మే 1 నాటికి జట్లను ఖరారు చేయాలని ఐసీసీ ఈ ఈవెంట్లో పాల్గొనే 20 దేశాల బోర్డులను ఆదేశించింది.ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడుతూ శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.గత సీజన్లో దాదాపు 900 రన్స్ చేసినా.. చోటివ్వకపోతే‘‘టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక అవుతానా లేదా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు. ఐపీఎల్లో నా ఫ్రాంఛైజీ నన్ను నమ్మి కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పుడు నా మొదటి ప్రాధాన్యం గుజరాత్ టైటాన్స్.. ఈ జట్టుతో ముడిపడిన ఆటగాళ్లు మాత్రమే. అదే విధంగా నా జట్టు కోసం ఓ బ్యాటర్గా వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని భావిస్తున్నా. ఇక ఆటగాడిగా నేను సొంతగడ్డపై టీమిండియా ఆడిన వన్డే వరల్డ్కప్ నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రపంచకప్ టోర్నీలో భారత్కు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం ఎంతటి అదృష్టమో తెలుసుకోగలిగాను.ఫామ్లో ఉన్న కోహ్లిఅయితే, గత ఐపీఎల్ సీజన్లో దాదాపుగా 900 పరుగులు చేసిన నాకు జట్టులో చోటు దక్కకపోతే నేనేమీ చేయలేను. సహచర ఆటగాళ్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం తప్ప’’ అని శుబ్మన్ గిల్ వ్యాఖ్యానించాడు. కాగా విరాట్ కోహ్లి ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగుతూ ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్లో కలిపి 430 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్గా ఉన్నాడు.చదవండి: Virat Kohli: చిన్న పిల్లాడిలా కోహ్లి సంబరాలు.. వాళ్లకు థాంక్స్! వీడియో వైరల్ -
DC Vs GT: ఓడినా సంతృప్తిగానే ఉంది.. కానీ: శుబ్మన్ గిల్
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడినా ఆఖరి వరకు తాము పట్టుదలగా పోరాడిన తీరు సంతృప్తినిచ్చిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. చివరి వరకు తాము గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నామని అయితే.. దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాలేదని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ బుధవారం ఢిల్లీతో తలపడింది. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఢిల్లీ కెప్టెన్ పంత్ 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో ఏకంగా 88 పరుగులతో అజేయంగా నిలిచాడు.No Rishabh Pant fan will scroll without liking this tweet. ❤️ pic.twitter.com/AwcmRcnD1u— 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐌𝐀𝐗𝐖𝐄𝐋𝐋 (@ProfKohli18) April 24, 2024వన్డౌన్ బ్యాటర్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్(43 బంతుల్లో 66) సైతం బ్యాట్ ఝులిపించాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (7 బంతుల్లో 26*) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు సాధించింది.కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్రిచ్ నోర్జే బౌలింగ్లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.అయితే, మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(39), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(39 బంతుల్లో 65) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. డేవిడ్ మిల్లర్(23 బంతుల్లో 55) ధనాధన్ దంచికొట్టి టైటాన్స్ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో దిగిన రషీద్ ఖాన్(11 బంతుల్లో 21*) పట్టుదలగా నిలబడ్డాడు. ఆఖరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో 4,4,(0), (0), 6 రాబట్టాడు.ఈ క్రమంలో ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. రషీద్ పరుగు తీయలేకపోయాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ గుజరాత్పై జయభేరి మోగించింది.So which side do you relate to after that fascinating finish- 😁 or 😕?What a game THAT in Delhi! 👏👏Scorecard ▶️ https://t.co/48M4ajbLuk#TATAIPL | #DCvGT pic.twitter.com/SuO21S3DWF— IndianPremierLeague (@IPL) April 24, 2024ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్లో మేము చాలా బాగా ఆడాం. అయితే, ఓడిపోవడం మాత్రం బాధగానే ఉంది. అయినా.. పట్టుదలగా ఆఖరి వరకు పోరాడినందుకు సంతృప్తిగా ఉంది.అసలు మాకు ఓటమి ఎదురవుతుందని ఏ దశలోనూ అనుకోలేదు. 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే వెళ్లి హిట్టింగ్ ఆడటం ఒక్కటే మార్గం. అంతకు మించి ప్రణాళికలు ఏముంటాయి?కారణం అదేనిజానికి వాళ్లను 200- 210 పరుగులకే కట్టడి చేస్తామనుకున్నాం. అయితే, 2-3 ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడం ప్రభావం చూపింది. ఇది చిన్న గ్రౌండ్. ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది. బెస్ట్ ఫినిషర్ క్రీజులో ఉన్నపుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నాడు.చదవండి: #SRHvRCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్! మామ మనోడే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
DC Vs GT: ఇదేమి అంపైరింగ్.. పృథ్వీ షాది ఔటా? నాటౌటా? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో మరోసారి థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. ప్రస్తుతం పృథ్వీ షా ఔట్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.అసలేం జరిగిందంటే?ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన సందీప్ వారియర్ ఐదో బంతిని పృథ్వీ షాకు షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు. ఆ బంతిని పృథ్వీ షా పుల్ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి నూర్ అహ్మద్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు.దీంతో గుజరాత్ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ ఫీల్డ్ అంపైర్లు క్లీన్ క్యాచ్ అవునా కాదా అనే సందేహంతో థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించి బంతి కింద చేతి వేళ్లు ఉన్నయాని తన నిర్ణయాన్ని ఔట్గా ప్రకటించాడు. అయితే రిప్లేలో బంతి గ్రౌండ్కు టచ్ అయినట్లు కన్పించినప్పటికి అంపైర్ మాత్రం క్లీన్ క్యాచ్గా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.కామెంటెటర్లు ఆకాష్ చోప్రా, పార్థివ్ పటేల్ సైతం క్యాచ్ను అందుకునే సమయంలో బంతి నేలను తాకిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు చెత్త అంపైరింగ్.. అది క్లియర్గా నాటౌట్ అని కామెంట్లు చేస్తున్నారు. Woah 🔥🔥Noor Ahmad holds on to a sharp catch in the deep as #DC lose both their openers!Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvGT pic.twitter.com/8zmIDwCdf2— IndianPremierLeague (@IPL) April 24, 2024 -
DC Vs GT: మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక స్పెల్(నాలుగు ఓవర్లు)లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా మోహిత్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో మోహిత్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు.తద్వారా మోహిత్ శర్మ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత బౌలర్ బసిల్ థంపి పేరిట ఉండేది. ఐపీఎల్-2018 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన బసిల్ థంపి.. ఆర్సీబీతో మ్యాచ్లో తన 4 ఓవర్ల కోటాలో 70 పరుగులిచ్చాడు. తాజా మ్యాచ్తో థంపిని మోహిత్ అధిగమించాడు.కాగా ఈ మ్యాచ్లో 20 ఓవర్ వేసిన మోహిత్ బౌలింగ్లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 4 సిక్స్లు, ఒక ఫోరుతో 31 పరుగులు రాబట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో పంత్(88)తో పాటు అక్షర్ పటేల్(66), స్టబ్స్(26) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. -
DC Vs GT: రిషబ్ పంత్ విధ్వంసం.. ఏకంగా 8 సిక్స్లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పంత్ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. అక్షర్ పటేల్తో కలిసి స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టించాడు. ఆఖరి ఓవర్ వేసిన మొహిత్ శర్మకు అయితే పంత్ చుక్కలు చూపించాడు.ఢిల్లీ ఇన్నింగ్స్ 20 ఓవర్లో పంత్ 4 సిక్స్లు, ఒక ఫోరుతో 31 పరుగులు రాబట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేవలం 43 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 5 ఫోర్లు, 8 సిక్స్లతో 88 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు వరల్డ్కప్న్కు పంత్ రెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో పంత్తో పాటు అక్షర్ పటేల్(66), స్టబ్స్(26) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. No Rishabh Pant fan will scroll without liking this tweet. ❤️ pic.twitter.com/AwcmRcnD1u— 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐌𝐀𝐗𝐖𝐄𝐋𝐋 (@ProfKohli18) April 24, 2024 -
DC Vs GT: ఐపీఎల్లో ఇవాల్టి (APR 24) సమరం.. గుజరాత్తో తలపడనున్న ఢిల్లీ
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 24) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఢిల్లీ తమ సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ను ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఢిల్లీతో పోలిస్తే గుజరాత్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి 8 పాయింట్లు కూడగట్టుకుంది. ఢిల్లీ ఎనిమిదిలో మూడు మ్యాచ్లు మత్రమే గెలిచి ఆరు పాయింట్లతో గుజరాత్ కంటే వెనుకపడింది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంది. గుజరాత్కు ఓ మ్యాచ్ అటో ఇటో అయినా పర్లేదు కానీ, ఢిల్లీ మాత్రం అన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. చెరి రెండు మ్యాచ్లు గెలిచాయి. ఢిల్లీ గెలుపొందిన రెండు మ్యాచ్లు గుజరాత్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోనే కావడం విశేషం.బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఢిల్లీతో పోలిస్తే గుజరాత్ ఒకింత మెరుగ్గా కనిపిస్తుంది. తెవాతియా, రషీద్ ఖాన్ కీలక సమయాల్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడి గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సాయి కిషోర్ బంతితో పర్వాలేదనిపిస్తున్నారు. గిల్, మిల్లర్ సామర్థ్యం మేరకు రాణించాల్సి ఉంది.ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు పేపర్పై చాలా బలంగా కనిపిస్తుంది. రియాల్టీలోకి వచ్చేసరికి మాత్రం పూర్తిగా తేలిపోతుంది. వార్నర్ లాంటి సీనియర్ ఫామ్లో లేకపోవడం ఢిల్లీకి పెద్ద మైనస్గా మారింది. పృథ్వీ షాకు మంచి ఆరంభాలు లభిస్తున్నా అతను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకుంటున్నాడు. కొత్త ఆటగాడు జేక్ ఫ్రేసర్, రిషబ్ పంత్ బ్యాటింగ్ మెరుపులు ఢిల్లీకి ఊరట కలిగిస్తున్నాయి.ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే వీరిద్దరి కాంట్రిబ్యూషన్ చాలా కీలకం. బౌలింగ్ విషయానికొస్తే.. కుల్దీప్, అక్షర్ మినహా ఎవరూ రాణించలేకపోతున్నారు. నోర్జే అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ ఢిల్లీ ఓటముల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ పర్వాలేదనిపిస్తున్నా వీరి నుంచి పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. మొత్తంగా చూస్తే.. ఢిల్లీపై గుజరాత్కే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తుది జట్లు (అంచనా)..ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్కీపర్), శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ -
IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టనున్న శుభ్మన్ గిల్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 24) జరుగబోయే మ్యాచ్తో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయిని తాకనున్నాడు. ఈ మ్యాచ్ గిల్కు ఐపీఎల్లో 100వ మ్యాచ్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 64 మంది 100 మ్యాచ్లు ఆడగా.. గిల్ 65వ ఆటగాడు కానున్నాడు.2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్న గిల్.. 2021 వరకు కేకేఆర్ తరఫున, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్నాడు. గిల్ తన 99 మ్యాచ్ల కెరీర్లో 135.2 స్ట్రయిక్రేట్తో 38.1 సగటున 3088 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.2022 సీజన్ టైటిల్ విన్నింగ్ జట్టులో (గుజరాత్) భాగమైన గిల్.. 2023 సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన నాకౌట్లో గిల్ మెరుపు సెంచరీతో మెరిశాడు.కాగా, నేటి మ్యాచ్లో గుజరాత్ ఢిల్లీని వారి సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఢిల్లీతో పోలిస్తే గుజరాత్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి 8 పాయింట్లు కూడగట్టుకుంది. ఢిల్లీ ఎనిమిదిలో మూడు మ్యాచ్లు మత్రమే గెలిచి ఆరు పాయింట్లతో గుజరాత్ కంటే వెనుకపడింది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. గుజరాత్కు ఓ మ్యాచ్ అటో ఇటో అయినా ఢిల్లీ మాత్రం అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో తలపడగా.. చెరి రెండు మ్యాచ్లు గెలిచాయి. ఢిల్లీ గెలుపొందిన రెండు మ్యాచ్లు గుజరాత్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోనే కావడం విశేషం. -
IPL 2024 DC Vs GT: ప్రచండ పంత్...
ఐపీఎల్లో మరో మ్యాచ్లో పరుగుల వరద పారింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని కూడా గుజరాత్ టైటాన్స్ ఛేదించేలా కనిపించింది. అయితే చివరకు క్యాపిటల్స్దే పైచేయి కాగా... టోర్నీలో మ్యాచ్ మ్యాచ్కూ పదునెక్కుతున్న బ్యాటింగ్తో రిషభ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం ఈ పోరులో హైలైట్గా నిలిచింది. న్యూఢిల్లీ: చివరి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకొని ఊపిరి పీల్చుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ 4 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిషభ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు), అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 68 బంతుల్లో 113 పరుగులు జోడించడం విశేషం. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసి ఓడిపోయింది. సాయి సుదర్శన్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్లు), డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... జేక్ ఫ్రేజర్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మరోసారి దూకుడైన ఆటతో ఢిల్లీకి శుభారంభం అందించాడు. అయితే 9 పరుగుల వ్యవధిలో ఫ్రేజర్తో పాటు పృథ్వీ షా (11), షై హోప్ (5) వెనుదిరిగారు. మూడో స్థానానికి ప్రమోట్ అయిన అక్షర్ దూకుడైన షాట్లతో ఆకట్టుకోగా, ఆ తర్వాత పంత్ తన జోరు ప్రదర్శించాడు. 37 బంతుల్లో అక్షర్ అర్ధసెంచరీ పూర్తయింది.నూర్ అహ్మద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అక్షర్ తర్వాతి బంతిని అదే తరహాలో ఆడే ప్రయత్నంలో వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం మోహిత్ శర్మ బౌలింగ్లో సిక్స్తో 34 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. సాయికిశోర్ వేసిన 19వ ఓవర్లో స్టబ్స్ వరుసగా 4, 6, 4, 6 బాదడంతో చెలరేగడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. సుదర్శన్ అర్ధసెంచరీ... భారీ ఛేదనలో ఆరంభంలోనే గుజరాత్ కెపె్టన్ శుబ్మన్ గిల్ (6) వెనుదిరిగినా... సాహా, సాయి సుదర్శన్ కలిసి దూకుడుగా ఆడారు. వీరిద్దరు 49 బంతుల్లోనే 82 పరుగులు జత చేశారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ విడదీసిన తర్వాత టైటాన్స్ తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిల్లర్ కొన్ని మెరుపు షాట్లు ఆడటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.నోర్జే ఓవర్లో అతను 3 సిక్స్లు, 1 ఫోర్తో 24 పరుగులు రాబట్టాడు. అయితే అతను వెనుదిరిగాక గుజరాత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరంకాగా... ముకేశ్ వేసిన ఈ ఓవర్లో రషీద్ ఖాన్ 16 పరుగులే సాధించడంతో టైటాన్స్ ఓటమి ఖరారైంది. ఒకే ఓవర్లో 31 పరుగులు ఢిల్లీ ఇన్నింగ్స్లో 19 ఓవర్లు ముగిసేసరికే దూకుడు పెంచిన పంత్ చివరి ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. మోహిత్ శర్మ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి 2 పరుగులు రాగా, తర్వాతి బంతి వైడ్ అయింది.అయితే ఆ తర్వాత పంత్ వరుసగా 6, 4, 6, 6, 6తో తన సత్తా చూపాడు. దాంతో ఈ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. ఈ దెబ్బకు మోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు (4 ఓవర్లలో 73) ఇచ్చిన బౌలర్గా నిలిచాడు. గతంలో బాసిల్ థంపి (70) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. మోహిత్ 7 సిక్స్లు ఇవ్వగా అన్నీ పంత్ కొట్టినవే! స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) నూర్ (బి) సందీప్ 11; జేక్ ఫ్రేజర్ (సి) నూర్ (బి) సందీప్ 23; అక్షర్ (సి) సాయికిశోర్ (బి) నూర్ 66; హోప్ (సి) రషీద్ (బి) సందీప్ 5; పంత్ (నాటౌట్) 88; స్టబ్స్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–35, 2–36, 3–44, 4–157. బౌలింగ్: అజ్మతుల్లా 4–0–33–0, సందీప్ వారియర్ 3–0–15–3, రషీద్ ఖాన్ 4–0–35–0, నూర్ అహ్మద్ 3–0–36–1, మోహిత్ శర్మ 4–0–73–0, షారుఖ్ ఖాన్ 1–0–8–0, సాయికిశోర్ 1–0–22–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) అక్షర్ (బి) కుల్దీప్ 39; గిల్ (సి) అక్షర్ (బి) నోర్జే 6; సుదర్శన్ (సి) అక్షర్ (బి) సలామ్ 65; అజ్మతుల్లా (సి) ఫ్రేజర్ (బి) అక్షర్ 1; మిల్లర్ (సి) సలామ్ (బి) ముకేశ్ 55; షారుఖ్ (సి) పంత్ (బి) సలామ్ 8; తెవాటియా (సి) పంత్ (బి) కుల్దీప్ 4; రషీద్ (నాటౌట్) 21; సాయికిశోర్ (బి) సలామ్ 13; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–13, 2–95, 3–98, 4–121, 5–139, 6–152, 7–181, 8–206. బౌలింగ్: ఖలీల్ 2–0–26–0, నోర్జే 3–0–48–1, సలామ్ 4–0–44–3, ముకేశ్ 4–0–41–1, అక్షర్ 3–0–28–1, కుల్దీప్ 4–0–29–2. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X బెంగళూరు వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్కు బీసీసీఐ మందలింపు
ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ రసీఖ్ సలాం దర్ను బీసీసీఐ మందలించింది. ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అతి చేసినందుకు వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం చేయకూడదని హెచ్చరించింది.కాగా ఢిల్లీ వేదికగా టైటాన్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో రసీఖ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్ పేసర్ 44 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. సాయి సుదర్శన్(39 బంతుల్లో 65), షారుఖ్ ఖాన్(8), రవిశ్రీనివాసన్ సాయి కిషోర్(13)లను అవుట్ చేశాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ప్రమాదకారిగా మారుతున్న సాయి సుదర్శన్ను పెవిలియన్కు పంపడం ద్వారా రసీఖ్ మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పాడు. అలా ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు 24 ఏళ్ల ఈ కశ్మీరీ ఎక్స్ప్రెస్.అయితే, వికెట్ తీసిన ప్రతిసారీ రసీఖ్ కాస్త వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో బీసీసీఐ అతడిని మందలించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈమేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.కాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ గుజరాత్పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.అయితే, లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఎనిమిది వికెట్లు నష్టపోయి 220 పరుగుల వద్ద నిలిచి ఓటమి పాలైంది. -
IPL 2024 DC vs GT: ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓటమి..
IPL 2024 DC vs GT Live Updates:ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓటమి..అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోరి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. రషీద్ ఖాన్ 14 పరుగులు మాత్రమే రాబట్టాడు. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(65) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(55), వృద్దిమాన్ సాహా(39) తమ వంతు ప్రయత్నం చేశారు. ఢిల్లీ బౌలర్లలో రాసిఖ్ ధార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్, నోర్జే తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్లతో 88 పరుగులు చేశాడు. పంత్తో పాటు అక్షర్ పటేల్(66) పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్..డేవిడ్ మిల్లర్ రూపంలో గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన మిల్లర్.. ముఖేష్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 37 పరుగులు కావాలి.17 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 176/617 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్(51), రషీద్ ఖాన్(0) ఉన్నారు.ఐదో వికెట్ డౌన్..షారూఖ్ ఖాన్ రూపంలో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన షారూఖ్..రాసిఖ్ సలామ్ బౌలింగ్లో ఔటయ్యాడు.క్రీజులోకి షారూఖ్ ఖాన్ వచ్చాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 147/5నాలుగో వికెట్ డౌన్..121 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 65 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. రాసిఖ్ సలామ్ బౌలింగ్లో ఔటయ్యాడు.క్రీజులోకి షారూఖ్ ఖాన్ వచ్చాడు. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 139/4మూడో వికెట్ డౌన్..ఒమర్జాయ్ రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఒమర్జాయ్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(59), మిల్లర్(2) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్..95 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు వృద్దిమాన్ సహా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ఒమర్జాయ్ వచ్చాడు.3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 41/13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజులో వృద్దిమాన్ సహా(26), సాయిసుదర్శన్(8) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్..225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. నోర్జే బౌలింగ్లో ఔటయ్యాడు.రిషబ్ పంత్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ 225 పరుగులుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్లతో 88 పరుగులు చేశాడు. పంత్తో పాటు అక్షర్ పటేల్(66) పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు.19 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 193/419 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(58), స్టబ్స్(26) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్..157 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 157/4. క్రీజులో రిషబ్ పంత్(48), స్టబ్స్ పరుగులతో ఉన్నారు.అక్షర్ పటేల్ ఫిప్టీ..15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బ్యాటింగ్లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు. అక్షర్ కేవలం 37 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. క్రీజులో అక్షర్ పటేల్(50), రిషబ్ పంత్(34) పరుగులతో ఉన్నారు.ఢిల్లీ మూడో వికెట్ డౌన్.. హోప్ ఔట్హోప్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హోప్.. సందీప్ వారియన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఢిల్లీ మూడు వికెట్లు నష్టపోయి 68 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(19), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా ఔట్పృథ్వీ షా రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన పృథ్వీషా.. సందీప్ వారియర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఢిల్లీ రెండు వికెట్లు నష్టపోయి 43 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. మెక్ గర్క్ ఔట్34 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఫ్రేజర్ మెక్గర్క్.. సందీప్ వారియర్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు.ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ -
IPL 2024: ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత విన్యాసం.. ఇదే ఢిల్లీని గెలిపించింది..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో నిన్న (ఏప్రిల్ 24) జరిగిన రసవత్తర సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయానికి రిషబ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు, 2 క్యాచ్లు), అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3 క్యాచ్లు, 3-0-28-1) ప్రత్యక్షంగా దోహదపడితే.. ట్రిస్టన్ స్టబ్స్ పరోక్షంగా ఢిల్లీ గెలుపుకు కారణమయ్యాడు. This blinder from Tristan Stubbs saved 5 runs for Delhi Capitals🔥They won the match in 4 runs!Stubbs hero for capitals..David Miller & Rashid khan, you can love to watch them any day❤️Rishabh Pant#GTvsDC #IPL2024 pic.twitter.com/UwJKCIS0Wn— Rakesh_sundarRay (@RSundarRay) April 24, 2024 ఛేదనలో గుజరాత్ లక్ష్యం దిశగా పయనిస్తుండగా (11 బంతుల్లో 32 పరుగులు).. స్టబ్స్ అద్భుత విన్యాసం చేసి సిక్సర్ వెళ్లాల్సిన బంతిని (18.2వ ఓవర్: రసిక్ సలాం బౌలింగ్లో రషీద్ ఖాన్ కొట్టిన షాట్) ఆపాడు. ఫలితంగా ఢిల్లీకి ఐదు పరుగులు సేవ్ అయ్యాయి. ఇంచుమించు ఇదే తేడాతో (4 పరుగులు) ఢిల్లీ గుజరాత్పై విజయం సాధించింది. స్టబ్స్ తన అద్భుత ప్రయత్నంతో ఢిల్లీని గెలిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.స్టబ్స్ సూపర్ మ్యాన్ ఎఫర్ట్ను అంతా మెచ్చుకుంటున్నారు. భారీ స్కోర్లు చేసినా చేయకపోయినా ఇలాంటి ప్రయత్నాలే మ్యాచ్లు గెలిపిస్తాయని నెటిజన్లు అంటున్నారు. ఈ మ్యాచ్లో స్టబ్స్ బ్యాట్తోనూ రాణించాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి (7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు నాటౌట్) రిషబ్ పంత్తో కలిసి వీరబాదుడు బాదాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ (3-0-15-3) ఒక్కడే రాణించాడు. మోహిత్ శర్మ (4-0-73-0) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ సైతం అద్భుతంగా పోరాడింది. సాహా (39), సాయి సుదర్శన్ (65), మిల్లర్ (55), రషీద్ ఖాన్ (21 నాటౌట్), సాయికిషోర్ (13 నాటౌట్) గుజరాత్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో స్టబ్స్ అద్భుత ప్రయత్నం గుజరాత్కు మ్యాచ్ను దూరం చేసింది. రషీద్ కొట్టిన ఆ షాట్ సిక్సర్ అయ్యుంటే గుజరాత్ ఈ మ్యాచ్ తప్పక గెలిచుండేది.అంతిమంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలాం (4-0-44-3), కుల్దీప్ యాదవ్ (4-0-29-2), అక్షర్ పటేల్ (3-0-28-1), నోర్జే (3-0-48-1), ముకేశ్ కుమార్ (4-0-41-1) వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఢిల్లీ ఆరో స్థానానికి జంప్ కొట్టింది. గుజరాత్ ఏడో ప్లేస్లో నిలిచింది. -
PBKS vs GT: గెలుపు ఎవరిది?
-
అహ్మదాబాద్లో టైటాన్స్ను చిత్తు చేసిన ఢిల్లీ
-
ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్.. కెప్టెన్గానూ..
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్పై ఆ జట్టు అసిస్టెంట్ జేమ్స్ హోప్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్ అంటూ కొనియాడాడు. కెప్టెన్గానూ రోజురోజుకూ మరింత రాటుదేలుతున్నాడని సంతోషం వ్యక్తం చేశాడు. కారు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్కు దూరమైన పంత్.. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతున్న పంత్ ఫిట్నెస్పై ఆదిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ వికెట్ కీపర్గా.. బ్యాటర్గా అద్భుత ఆటతీరుతో అలరిస్తున్నాడు పంత్. తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకున్న పంత్.. ఢిల్లీకి అద్బుత విజయం అందించాడు. అహ్మదాబాద్లో టాస్ గెలిచిన పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఢిల్లీ బౌలర్లు సంచలన ప్రదర్శనతో చెలరేగారు. సమిష్టి కృషితో గుజరాత్ను కేవలం 89 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు. ఇక 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే ఛేదించిన ఢిల్లీ ఈ సీజన్లో ఎట్టకేలకు మూడో విజయం అందుకుంది. ఈ గెలుపులో కెప్టెన్గా.. వికెట్ కీపర్గా.. బ్యాటర్గా రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. Ek haath hi kaafi hai 🧤 From one-handed sixes to one-handed catches, Rishabh Pant can do it all 🤩#GTvDC #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/1JZEuLiL5T — JioCinema (@JioCinema) April 17, 2024 అద్బుత రీతిలో రెండు క్యాచ్లు అందుకోవడంతో పాటు రెండు స్టంపింగ్లతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా.. 11 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో జేమ్స్ హోప్స్ మాట్లాడుతూ.. ‘‘పంత్ కీపింగ్ చేస్తున్నాడు. అది కూడా అద్బుతంగా! గతేడాది అతడు లేని లోటు మాకు బాగా తెలిసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్.. వరల్డ్క్లాస్ ప్లేయర్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయగలం. అయితే, ఇప్పుడు అతడు తిరిగి వచ్చాడు. కీపింగ్తో ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్సీ పరంగానూ రాటుదేలుతున్నాడు. బ్యాటర్గానూ మంచి ఫామ్లో ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా పంత్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కలిపి 210 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే టైటాన్స్పై విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో మూడింట గెలిచి ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉంది. తదుపరి ఏప్రిల్ 20న సన్రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీలో తలపడనుంది. Pant doing what he does the best 💥🚀#GTvDC #TATAIPL #IPLonJioCinema #IPLinHaryanvi pic.twitter.com/JdB3AndtPB — JioCinema (@JioCinema) April 17, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్కరైనా డబుల్ హ్యాట్రిక్ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే!
IPL 2024 GT vs DC: రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో చెత్త ప్రదర్శన కనబరిచింది. ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయి.. క్యాష్ రిచ్ లీగ్లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఇక 90 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 8.5 ఓవర్లలోనే పని పూర్తి చేయడంతో గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. మా ఓటమికి కారణం అదే ‘‘పిచ్ బాగానే ఉంది. కానీ మా బ్యాటింగే అత్యంత సాధారణంగా ఉంది. షాట్ సెలక్షన్ లోపాల వల్లే వరుసగా వికెట్లు కోల్పోయాం. ప్రత్యర్థి జట్టు 89 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో మాలో ఎవరో ఒక బౌలర్ డబుల్ హ్యాట్రిక్ తీస్తేనే గానీ ఫలితం ఉండదు. లేదంటే కచ్చితంగా ప్రత్యర్థి జట్టునే విజయం వరిస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది’’ అని పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు గిల్. ఈ ఘోర పరాభవం నుంచి వీలైనంత తొందరగా కోలుకుని తదుపరి మ్యాచ్పై దృష్టి పెడతామని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘ఇప్పటి వరకు సగం మ్యాచ్లు పూర్తి చేసుకున్నాం. ఇంకో ఏడు మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పటికి మూడు గెలిచాం. గత రెండేళ్లుగా గెలిచినట్లే సెకండాఫ్లో 5-6 మ్యాచ్లు గెలవగలమనే అనుకుంటున్నా’’ అని శుబ్మన్ గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గుజరాత్ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు: ►వేదిక: అహ్మదాబాద్... గుజరాత్ ►టాస్: ఢిల్లీ- బౌలింగ్ ►గుజరాత్ స్కోరు: 89 (17.3) ►ఢిల్లీ స్కోరు: 92/4 (8.5) ►ఫలితం: గుజరాత్పై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రిషభ్ పంత్(రెండు క్యాచ్లు.. రెండు స్టంపింగ్స్.. 11 బంతుల్లో 16 రన్స్- నాటౌట్). Ensuring a quick finish, ft Rishabh Pant & Sumit Kumar 🙌 A comprehensive all-round performance from Delhi Capitals helps them register their 3️⃣rd win of the season 😎 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvDC pic.twitter.com/c2pyHArwE7 — IndianPremierLeague (@IPL) April 17, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 GT vs DC: ఢిల్లీ అదరహో...
వరుస మ్యాచ్లలో పరుగుల వరదతో ముంచెత్తుతున్న ఐపీఎల్లో ఎట్టకేలకు ఒక స్వల్ప స్కోర్ల పోరు... బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ బ్యాటర్ల పని పట్టిన సమయం... మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ సొంతగడ్డపై 100 పరుగులు కూడా చేయలేక కుప్పకూలిన చోట... కేవలం 53 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆనందం... రన్రేట్ను మెరుగుపర్చుకునేందుకు వేగంగా ఆడే ప్రయత్నంలో నాలుగు వికెట్లు కోల్పోయినా... చివరకు ఢిల్లీ సునాయాసంగా గెలుపు గీత దాటింది. అహ్మదాబాద్: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో మూడు స్థానాలు ఎగబాకింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ టోర్నీలో టైటాన్స్కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. రషీద్ ఖాన్ (24 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఇచ్చిన శుభారంభంతో గెలుపునకు పునాది పడింది. చక్కటి కెపె్టన్సీతో పాటు 2 క్యాచ్లు, 2 స్టంపింగ్లు చేసిన రిషభ్ పంత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రాణించిన ఇషాంత్... ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రషీద్ కొద్దిసేపు పోరాడటం మినహా గుజరాత్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. ఆసాంతం పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన జట్టు... వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ తన తొలి ఓవర్లోనే కెపె్టన్ శుబ్మన్ గిల్ (8)ను వెనక్కి పంపి శుభారంభం అందించగా, ఒకే స్కోరు వద్ద సాహా (2), సాయి సుదర్శన్ (12) వెనుదిరిగారు. ఇషాంత్ బౌలింగ్లోనే పంత్ చక్కటి క్యాచ్తో డేవిడ్ మిల్లర్ (2) అవుట్ కావడంతో పవర్ప్లేను టైటాన్స్ 30/4 వద్ద ముగించింది. పార్ట్టైమ్ స్పిన్నర్ స్టబ్స్ కూడా తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీయడంతో గుజరాత్ పరిస్థితి మరింత దిగజారింది. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన రషీద్ కొన్ని పరుగులు జోడించడంలో సఫలమయ్యాడు. ఆశలు పెట్టుకున్న రాహుల్ తెవాటియా (10)ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా మిగతా బ్యాటర్ల ఆట లాంఛనమే అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో కొంత తడబడినా చివరకు ఢిల్లీ ఎలాంటి ప్రమాదం లేకుండా మ్యాచ్ను ముగించింది. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) ముకేశ్ 2; గిల్ (సి) షా (బి) ఇషాంత్ 8; సుదర్శన్ (రనౌట్) 12; మిల్లర్ (సి) పంత్ (బి) ఇషాంత్ 2; మనోహర్ (స్టంప్డ్) పంత్ (బి) స్టబ్స్ 8; తెవాటియా (ఎల్బీ) (బి) అక్షర్ 10; షారుఖ్ (స్టంప్డ్) పంత్ (బి) స్టబ్స్ 0; రషీద్ (సి) పంత్ (బి) ముకేశ్ 31; మోహిత్ (సి) సుమీత్ (బి) ఖలీల్ 2; నూర్ (బి) ముకేశ్ 1; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్) 89. వికెట్ల పతనం: 1–11, 2–28, 3–28, 4–30, 5–47, 6–48, 7–66, 8–78, 9–88, 10–89. బౌలింగ్: ఖలీల్ 4–1– 18–1, ఇషాంత్ 2–0–8–2, ముకేశ్ కుమార్ 2.3–0–14–3, కుల్దీప్ 4–0–16–0, స్టబ్స్ 1–0– 11–2, అక్షర్ పటేల్ 4–0–17–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) జాన్సన్ (బి) సందీప్ 7; జేక్ ఫ్రేజర్ (సి) మనోహర్ (బి) జాన్సన్ 20; పొరేల్ (బి) సందీప్ 15; హోప్ (సి) మోహిత్ (బి) రషీద్ 19; పంత్ (నాటౌట్) 16; సుమీత్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 6; మొత్తం (8.5 ఓవర్లలో 4 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1–25, 2–31, 3–65, 4–67. బౌలింగ్: సందీప్ వారియర్ 3–0–40–2; స్పెన్సర్ జాన్సన్ 2–0–22–1, రషీద్ ఖాన్ 2–0–12–1, నూర్ అహ్మద్ 1.5–0–14–0. ఐపీఎల్లో నేడు పంజాబ్ X ముంబై వేదిక: ముల్లాన్పూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: నిప్పులు చెరిగిన ఢిల్లీ బౌలర్లు.. గుజరాత్కు ఘోర పరాభవం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1), కుల్దీప్ యాదవ్ (4-0-16-0) ధాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. జేక్ ఫ్రేసర్ 20, పృథ్వీ షా 7, అభిషేక్ పోరెల్ 15, షాయ హోప్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. రిషబ్ పంత్ (16), సుమిత్ కుమార్ (9) ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. Rishabh Pant's SIX against Rashid Khan. - THE VINTAGE, PANT. 🔥 pic.twitter.com/27dPB38fi9 — CricketMAN2 (@ImTanujSingh) April 17, 2024 రెండు క్యాచ్లు, రెండు స్టంపౌట్లతో పాటు 16 పరుగులు చేసిన పంత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బంతుల పరంగా ఢిల్లీకి ఇది అతి భారీ విజయం. ఈ మ్యాచ్లో ఢిల్లీ మరో 67 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. Rishabh Pant won the player of the match award. - CAPTAIN PANT LEADS BY EXAMPLE. pic.twitter.com/Wz5Bc5wDeY — CricketMAN2 (@ImTanujSingh) April 17, 2024 గుజరాత్ చెత్త రికార్డులు.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ 100లోపు ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. 2024 సీజన్లో ఓ జట్టు 100లోపు ఆలౌట్ కావడం కూడా ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో గుజరాత్ చేసిన 89 పరుగుల స్కోర్.. ఇపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ ఇదే అత్యల్ప టీమ్ స్కోర్ -
ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. ఐపీఎల్లో అత్యల్ప స్కోర్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్పై ఎదురుదాడికి దిగి, ఆ జట్టును కకావిలకలం చేసింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1), కుల్దీప్ యాదవ్ (4-0-16-0) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. గుజరాత్ చెత్త రికార్డు.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ 100లోపు ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. 2024 సీజన్లో ఓ జట్టు 100లోపు ఆలౌట్ కావడం కూడా ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో గుజరాత్ చేసిన 89 పరుగుల స్కోర్.. ఇపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ ఇదే అత్యల్ప టీమ్ స్కోర్ Delhi Capitals bowling unit wrapping up GT for just 89. 💥 - Captain Rishabh Pant and his army are dominating in Ahmedabad. pic.twitter.com/jS31TQyI1b — Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2024 -
IPL 2024: గుజరాత్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ
గుజరాత్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 89 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 65 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. సందీప్ వారియర్ బౌలింగ్లో అభిషేక్ పోరెల్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఢిల్లీ 90 బంతుల్లో 25 పరుగులు చేస్తే గెలుస్తుంది రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 6 బంతుల్లో 7 పరుగులు చేసి పృథ్వీ షా ఔటయ్యాడు. సందీప్ వారియర్ బౌలింగ్లో స్పెన్సర్ జాన్సన్కు క్యాచ్ ఇచ్చి షా పెవిలియన్ బాట పట్టాడు. టార్గెట్ 90.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 10 బంతుల్లో 20 పరుగులు చేసి ఫ్రేసర్ ఔటయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో అభినవ్ మనోహర్కు క్యాచ్ ఇచ్చి ఫ్రేసర్ పెవిలియన్కు చేరాడు. టార్గెట్ 90.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 90 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్ ఫ్రేసర్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 2 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. 1.5 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 25/0గా ఉంది. ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. 89 పరుగులకే కుప్పకూలిన గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్పై ఎదురుదాడికి దిగింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్ 66 పరుగుల వద్ద గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో రాహుల్ తెవాటియా (10) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ 48 పరుగుల వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 9వ ఓవర్లో అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్లను (0) రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 61/6గా ఉంది. రషీద్ ఖాన్ (12), రాహుల్ తెవాటియా (8) క్రీజ్లో ఉన్నారు. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్ గుజరాత్ టైటాన్స్ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్ పంత్కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (2) ఔటయ్యాడు. మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ 4.1వ ఓవర్: మూడు బంతుల వ్యవధిలో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ ఐదో బంతికి ముకేశ్ కుమార్ సాహాను (2) క్లీన్ బౌల్డ్ చేయగా.. ఐదో ఓవర్ తొలి బంతికి సాయి సుదర్శన్ (12) రనౌటయ్యాడు. 4.5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 30/3గా ఉంది. డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 1.5వ ఓవర్: 11 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (8) ఔటయ్యాడు. సాహా, సాయి సుదర్శన్ క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. తుది జట్లు.. గుజరాత్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, స్పెన్సర్ జాన్సన్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ -
ఐపీఎల్లో ఇప్పటివరకు ఎన్ని సూపర్ ఓవర్లు జరిగాయో తెలుసా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మ్యాచ్లు తుది బంతి వరకు వచ్చినప్పటికీ సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఈ సీజన్లో దాదాపు సగం మ్యాచ్లు ముగుస్తున్నా ఒక్కటంటే ఒక్క సూపర్ ఓవర్ కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన సూపర్ ఓవర్లపై ఓ లుక్కేద్దాం. క్యాష్ రిచ్ లీగ్లో నేటి వరకు (ఏప్రిల్ 17) మొత్తం 15 సూపర్ ఓవర్లు జరిగాయి. 2020 సీజన్లో అత్యధికంగా 5 సూపర్ ఓవర్లు జరుగగా.. అదే సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు (ఒక దాంట్లో ఫలితం రాకపోయగా మరొకటి జరిగింది) జరిగాయి. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఐపీఎల్ తొలి సీజన్లోనూ (2008) ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు. 2009లో ఒకటి, 2010లో ఒకటి, 2013లో రెండు, 2014లో ఒకటి, 2015లో ఒకటి, 2017లో ఒకటి, 2019లో రెండు, 2020లో ఐదు, 2021 సీజన్లో ఓ సూపర్ ఓవర్ మ్యాచ్ జరుగగా... 2008, 2011, 2012, 2016, 2018, 2022, 2023 సీజన్లలో ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు. మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళితే అభిమానులకు అసలుసిసలు క్రికెట్ మజా అందుతుంది. అందుకే ఫ్యాన్స్ సూపర్ ఓవర్లో ఫలితం తేలడాన్ని ఇష్టపడతారు. ఫలితం ఒక్క సూపర్ ఓవర్ వరకు వెళితేనే అభిమానులు నరాలు బిగబట్టుకుని మ్యాచ్లు చూస్తారు. అదే రెండో సూపర్ దాకా వెళితే ఫ్యాన్స్తో ఆటగాళ్లు పడే ఉత్కంఠ అంతాఇంత కాదు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. -
ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర సమరం
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 17) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. గుజరాత్ టైటాన్స్ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా ఈ మ్యాచ్లో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్ల్లో 2 విజయాలు) కొనసాగుతున్నాయి. హెడ్ టు హెడ్ రికార్డ్స్ను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో తలపడగా.. గుజరాత్ 2, ఢిల్లీ ఓ మ్యాచ్లో విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య చివరి సారిగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీని విజయం వరించింది. బలాబలాల విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్లో రెండు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఢిల్లీతో పోలిస్తే గుజరాత్ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఇరు జట్లలో ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు వేర్వేరు కారణాల చేత గత కొన్ని మ్యాచ్లు దూరంగా ఉన్నారు. గుజరాత్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా.. ఢిల్లీ ప్లేయర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల చేత అందుబాటులో లేరు. నేటి మ్యాచ్కు కూడా వీరిద్దరూ అందుబాటులో ఉండే విషయంపై క్లారిటీ లేదు. తుది జట్లు (అంచనా).. గుజరాత్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్ (వికెట్కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ -
IPL 2024 GT vs DC: ఢిల్లీ రాత మారేనా?
-
సచిన్ షాట్ను కాపీ కొట్టిన శుబ్మన్ గిల్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 44 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 2 సిక్స్లతో 72 పరుగులు చేశాడు. అయితే గిల్ తన ఇన్నింగ్స్లో కొట్టిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచాడు. గిల్ తన షాట్తో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను గుర్తు చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్లో నాలుగో బంతిని శుబ్మన్ అద్భుతమైన ఆన్-డ్రైవ్ షాట్ ఆడి సిక్స్గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్ వాట్ఏ షాట్ అంటూ కామెట్లు చేస్తున్నారు. కాగా 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సచిన్ ఈ తరహా షాట్లతో అభిమానులతో అలరించాడు. అనాటి మ్యాచ్లో సచిన్ విధ్వంసం సృష్టించాడు. సచిన్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో ఏకంగా 143 పరుగులు చేశాడు. pic.twitter.com/a5MwVJaChL — Sitaraman (@Sitaraman112971) April 10, 2024 -
టీ20కా 'డాన్' రషీద్ ఖాన్.. రోహిత్, రుతురాజ్, గిల్ కంటే ఎక్కువగా..!
ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ పొట్టి క్రికెట్ను శాసిస్తున్నాడని అనడం కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్లో టోర్నీలు ఎక్కడ జరిగినా వాలిపోయే రషీద్.. ప్రతి మ్యాచ్లో తనదైన మార్కు వేస్తుంటాడు. ఐపీఎల్లో అయితే రషీద్ ఆటతీరు వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఆడే ప్రతి మ్యాచ్లోనూ రషీద్ సత్తా చాటుతుంటాడు. బంతితో కాకపోతే బ్యాట్తో అయినా చెలరేగుతుంటాడు. ప్రతి మ్యాచ్లో తన జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటాడు. The winning celebration from Rashid Khan. 🥶pic.twitter.com/TqtvV2R1d6 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 రషీద్ ఆటతీరుకు అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లు సైతం ముగ్దులవుతుంటారు. ఇండియాలో రషీద్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానులు టీమిండియా స్టార్లతో సమానంగా రషీద్ను అభిమానిస్తారు. క్రికెట్ అభిమానులు రషీద్ను ముద్దుగా టీ20కా 'డాన్' అని పిలుచుకుంటారు. Most Player of the Match awards in IPL at the age of 25: Rashid Khan - 12*. Shubman Gill - 9. Ruturaj Gaikwad - 8. Rohit Sharma - 7. pic.twitter.com/UFE6tn4tJ5 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో రషీద్ తాను టీ20 డాన్ను అని మరోసారి రుజువు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో రషీద్ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన రషీద్.. తన జట్టు కష్ట సమయంలో (చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సిన దశలో) ఉన్నప్పుడు బ్యాట్ పట్టి మెరుపు ఇన్నింగ్స్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు) ఆడాడు. The winning celebrations from the captain and the vice captain. 💥 pic.twitter.com/HKYINLqTdF — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 ఫలితంగా తన జట్టు గుజరాత్.. రాజస్థాన్కు వారి సొంతగడ్డపై ఊహించని షాకిచ్చింది. బంతితో పాటు బ్యాట్తో చెలరేగి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించినందుకు గాను రషీద్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఐపీఎల్లో రషీద్కు ఇది 12వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. 25 ఏళ్ల వయసులో ఇన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఐపీఎల్ చరిత్రలో ఎవరూ గెలవలేదు. టీమిండియా స్టార్లు శుభ్మన్ గిల్ 9, రుతురాజ్ 8, రోహిత్ శర్మ 7 అవార్డులు మాత్రమే గెలిచారు. RASHID KHAN, THE GOAT OF T20 CRICKET. 🐐 - Gill led Gujarat beats Rajasthan for the first time in IPL 2024. An IPL epic in Jaipur! 👏pic.twitter.com/OWVZCyvtmB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్లో రాజస్థాన్పై గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రషీద్ ఖాన్ చివరి బంతికి బౌండరీ బాది గుజరాత్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. సంజూ శాంసన్ (68 నాటౌట్), రియాన్ పరాగ్ (76) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. శుభ్మన్ గిల్ (72), రషీద్, తెవాతియా (22) రాణించడంతో గుజరాత్ చివరి బంతికి విజయతీరాలకు చేరింది. RASHID KARAMATI KHAN, YOU ARE WORLD CLASS 🔥🔥🔥He traps the dangerous Jos Buttler, what a bowler ❤️#IPL2024 #tapmad #HojaoADFree pic.twitter.com/56J7XcOnkR— Farid Khan (@_FaridKhan) April 10, 2024 -
సంజూ శాంసన్కు భారీ షాక్
IPL 2024 GT vs RR: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల మేర జరిమానా విధించారు. కాగా సొంత మైదానం జైపూర్లో రాజస్తాన్ బుధవారం గుజరాత్ టైటాన్స్తో తలపడిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి గుజరాత్ టైటాన్స్ స్టార్ రషీద్ ఖాన్ ఫోర్ బాది తమ జట్టును గెలిపించాడు. ఫలితంగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రాయల్స్ విజయపరంపరకు బ్రేక్ పడింది. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో రాజస్తాన్ చేజేతులా మ్యాచ్ను చేజార్చుకుంది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఓవర్ రేటు విషయంలో నిర్దిష్ట సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఫలితంగా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగిన గుజరాత్ బ్యాటర్లు విజయానికి బాటలు వేసి.. పని పూర్తి చేశారు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 ఇక స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు పనిష్మెంట్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. ‘‘ఐపీఎల్-2024లో జైపూర్లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు జరినామా విధిస్తున్నాం’’ అంటూ రూ. 12 లక్షలు ఫైన్ వేసింది. ఇది మొదటి తప్పిదం కావున ఈ మొత్తంతో సరిపెడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ఒకసారి(రూ. 12 లక్షలు), ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రెండుసార్లు(24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం/ఆరు లక్షలు) జరిమానా బారిన పడ్డారు. చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: రాజస్తాన్కు తొలి ఓటమిని రుచి చూపిన గుజరాత్
-
అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్ కౌంటర్
ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్ భాయ్ వల్లే తమకు రాజస్తాన్ రాయల్స్పై గెలుపు దక్కిందని వైస్ కెప్టెన్పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జైపూర్లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో చివరి బంతికి టైటాన్స్ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 24*)తో గుజరాత్ శిబిరంలో ఆశలు నింపిన రషీద్ ఖాన్.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్ బాది గెలుపును ఖరారు చేశాడు. రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్కు కలిసి వచ్చింది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు. మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్మన్ గిల్. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో బ్యాటర్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్ ఫినిష్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను. అయితే, రాహల్- రషీద్ భాయ్ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 IPL 2024: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం ► ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్(ఒక వికెట్, 24 పరుగులు- నాటౌట్). చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అప్పటికప్పుడు ఫలితం తారుమారు.. అంపైర్తో గొడవపడ్డ గిల్
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. తమ విషయంలో ఎందుకిలా జరిగిందంటూ ఫీల్డ్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్- గుజరాత్ జట్లు బుధవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8)లను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(68- నాటౌట్), రియాన్ పరాగ్(76)తో కలిసి రాజస్తాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. గుజరాత్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 నిర్ణయం మార్చుకున్న థర్డ్ అంపైర్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ ఇన్నింగ్స్లో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ పదిహేడో ఓవర్ వేశాడు. ఐదో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించగా సంజూ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. ఈ క్రమంలో అంపైర్ ఆ బంతిని వైడ్గా ప్రకటించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గుజరాత్ సారథి శుబ్మన్ గిల్ రివ్యూకు వెళ్లాడు. అయితే, తొలుత అది ఫెయిర్ డెలివరీ అని చెప్పిన థర్డ్ అంపైర్.. తర్వాత వైడ్గా ప్రకటించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో అదనపు పరుగు చేరింది. అప్పటికే బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఆగ్రహంగా ఉన్న గిల్.. ఈ వైడ్ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అంపైర్ వినోద్ శేషన్తో గొడవకు దిగాడు. వైడ్ గురించి చాలా సేపు అతడితో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. Shubman Gill has grown well as leader ⭐ Loving this version 🩷pic.twitter.com/kaDnJTGX8N — Cricspace (@cricspace69) April 10, 2024 గుజరాత్దే పైచేయి.. రాజస్తాన్ జైత్రయాత్రకు బ్రేక్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(72), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్(11 బంతుల్లో 24 నాటౌట్) కారణంగా గుజరాత్.. రాజస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాదడంతో.. మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపు నమోదు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: #Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! RASHID KHAN PUTS A HALT ON RR'S WINNING STREAK 🔥🔥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EdbdG9dG8o — JioCinema (@JioCinema) April 10, 2024 -
#Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్కు తొలిసారి ఓటమి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్లలో గెలుపొంది జోరు మీదున్న సంజూ సేనకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. రాయల్స్ను వారి తమ సొంత మైదానంలోనే ఓడించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక తమ జైత్రయాత్రకు బ్రేక్ పడటంపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు. ఆఖరి బంతికి ఫలితం తారుమారైందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి మ్యాచ్ను తమ నుంచి లాగేసుకుందని పేర్కొన్నాడు. మాట్లాడలేకపోతున్నా.. అక్కడే ఓడిపోయాం ఈ మేరకు ఓటమి అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ చివరి బంతికి మ్యాచ్ మా చేజారింది. మ్యాచ్ ఓడిన కెప్టెన్గా ఇలాంటి సమయంలో మాట్లాడటం కష్టంగా ఉంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తే గానీ నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేను. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడటమనేది ఈ టోర్నీకి ఉన్న ప్రత్యేకత. ఇది మా బౌలర్ల తప్పే మేము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం. నిజానికి నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 180 మంచి స్కోరే అనుకున్నా. అయితే, మేము లక్కీగా 196 పరుగులు చేశాం. కచ్చితంగా అది విన్నింగ్ స్కోరే. పిచ్పై తేమ లేదు కాబట్టి మా బౌలింగ్ విభాగం పనిపూర్తి చేయాల్సింది. జైపూర్లో 197.. తేమ లేని వికెట్పై డిఫెండ్ చేయడం అంత కష్టమేమీ కాదు’’ అంటూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. రాణించిన సంజూ, రియాన్ పరాగ్ కాగా జైపూర్లో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8) నామమాత్రపు స్కోర్లకు పరిమితం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్(48 బంతుల్లో 76)తో అదరగొట్టాడు. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 అంతా రషీద్ ఖాన్ వల్లే ఆఖర్లో హెట్మెయిర్ మెరుపులు(5 బంతుల్లో 13- నాటౌట్) మెరిపించగా.. రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డప్పటికీ గుజరాత్ ఆఖరి బంతి వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. శుబ్మన్ గిల్(72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రషీద్ ఖాన్(11 బంతుల్లో 24- నాటౌట్) రాజస్తాన్ను గెలుపునకు దూరం చేశాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఫోర్ బాది గుజరాత్ను విజయతీరాలకు చేర్చాడు. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 రాజస్తాన్ వర్సెస్ గుజరాత్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: IPL 2024: కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. గుజరాత్ సంచలన విజయం -
రాయల్స్కు టైటాన్స్ షాక్
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది... చివర్లో 4 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన దశలో గెలుపు అసాధ్యంగా అనిపించింది. కానీ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 17, 7, 20, 17 పరుగులు సాధించిన టైటాన్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు నియంత్రణతో బౌలింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ పేలవ బౌలింగ్, వ్యూహ వైఫల్యంతో చేజేతులా మ్యాచ్ను కోల్పోయి ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కొంది. జైపూర్: వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్తాన్ రాయల్స్కు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్స్లు), సామ్సన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్ (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శతక భాగస్వామ్యం... గత మూడు మ్యాచ్లలో వైఫల్యాల తర్వాత ఈసారి యశస్వి (19 బంతుల్లో 24; 5 ఫోర్లు) కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా, గత మ్యాచ్లో సెంచరీ చేసిన బట్లర్ (8) విఫలమయ్యాడు. పవర్ప్లేలో రాజస్తాన్ 43 పరుగులే చేయగా... ఈ దశ నుంచి సామ్సన్, పరాగ్ భారీ భాగస్వామ్యం రాయల్స్ను పటిష్ట స్థితికి చేర్చింది. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించారు. పరాగ్ 34 బంతుల్లో, సామ్సన్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నారు. ఎట్టకేలకు 19వ ఓవర్లో పరాగ్ను అవుట్ చేసి మోహిత్ ఈ జోడీని విడదీశాడు. అయితే ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో సామ్సన్, హెట్మైర్ (13 నాటౌట్) చెరో సిక్స్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. గిల్ కెప్టెన్ఇన్నింగ్స్... భారీ ఛేదనలో టైటాన్స్కు సుదర్శన్, శుబ్మన్ గిల్ దూకుడైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వీరిద్దరు తొలి వికెట్కు 64 పరుగులు జోడించినా... అందుకు 50 బంతులు తీసుకున్నారు. రాయల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో వీరి పరుగుల వేగాన్ని నిరోధించింది. బౌల్ట్ తొలి 2 ఓవర్లలో 8 పరుగులే ఇవ్వగా... అవేశ్ బౌలింగ్లో 14 పరుగులు రాబట్టడంతో టైటాన్స్ స్కోరు పవర్ప్లే ముగిసే సరికి 44 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ సేన్ ఒక్కసారిగా గుజరాత్ను దెబ్బ తీశాడు. తన బౌలింగ్లో 6 పరుగుల వ్యవధిలో అతను సుదర్శన్, వేడ్ (4), మనోహర్ (1)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో కెపె్టన్ గిల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 35 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయ్ శంకర్ (16) ప్రభావం చూపలేకపోగా... 28 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో గిల్ వెనుదిరగడంతో టైటాన్స్ ఆశలు సన్నగిల్లాయి. అయితే కీలక సమయంలో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ తెవాటియా (11 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఆట జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వేడ్ (బి) ఉమేశ్ 24; బట్లర్ (సి) తెవాటియా (బి) రషీద్ 8; సామ్సన్ (నాటౌట్) 68; పరాగ్ (సి) శంకర్ (బి) మోహిత్ 76; హెట్మైర్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–32, 2–42, 3–172. బౌలింగ్: ఉమేశ్ 4–0–47–1, జాన్సన్ 4–0–37–0, రషీద్ 4–0–18–1, నూర్ 4–0–43–0, మోహిత్ 4–0–51–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 35; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 72; వేడ్ (బి) కుల్దీప్ 4; మనోహర్ (బి) కుల్దీప్ 1; విజయ్ శంకర్ (బి) చహల్ 16; తెవాటియా (రనౌట్) 22; షారుఖ్ (ఎల్బీ) (బి) అవేశ్ 14; రషీద్ ఖాన్ (నాటౌట్) 24; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–64, 2–77, 3–79, 4–111, 5–133, 6–157, 7–195. బౌలింగ్: బౌల్ట్ 2–0–8–0, అవేశ్ 4–0–48–1, మహరాజ్ 2–0–16–0, అశి్వన్ 4–0–40–0, చహల్ 4–0–43–2, కుల్దీప్ సేన్ 4–0–41–3. ఐపీఎల్లో నేడు ముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. రాజస్థాన్పై గుజరాత్ సంచలన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (ఓవర్ రేట్లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. 6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సందర్భంలో.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్ను గెలిపించాడు. దీనికి ముందు కుల్దీప్ సేన్ 19వ ఓవర్లో 20 పరుగులిచ్చి గుజరాత్ను గెలుపు లైన్లో నిలబెట్టాడు. మ్యాచ్ ఆరంభంలో ఇదే కుల్దీప్ 10 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి రాజస్థాన్ను మ్యాచ్లోకి తెచ్చాడు. మొత్తంగా చూస్తే స్లో ఓవర్ రేటే రాజస్థాన్ పాలిట శాపంగా మారింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. గుజరాత్ ఇన్నింగ్స్లో మాథ్యూ వేడ్ 4, అభినవ్ మనోహర్ 1, విజయ్ శంకర్ 16, షారుక్ ఖాన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. -
కుల్దీప్ సేన్ విజృంభణ.. గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ కుల్దీప్ సేన్ చెలరేగిపోయాడు. 10 బంతుల వ్యవధిలో 3 కీలక వికెట్లు తీసి 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న గుజరాత్ను కష్టాల్లోకి నెట్టాడు. 9వ ఓవర్ రెండో బంతికి సాయి సుదర్శన్ను (35) ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్కు పంపిన సేన్.. ఆతర్వాత 11వ ఓవర్ తొలి బంతికి, నాలుగో బంతికి మాథ్యూ వేడ్ (4), అభినవ్ మనోహర్ను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు. 147.3kmph.145kmph.Kuldeep Sen has rattled the Gujarat Titans top order. 🔥 pic.twitter.com/DdtR6KxALO— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 సేన్ ధాటికి గుజరాత్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. సేన్ అనంతరం చహల్ గుజరాత్ బ్యాటర్లను పరేషాన్ చేశాడు. చహల్ 14వ ఓవర్లో విజయ్ శంకర్ (16), 16వ ఓవర్లో శుభ్మన్ గిల్ను (72) చాకచక్యంగా బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా చహల్ గిల్ను ఔట్ చేసే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు. Kuldeep Sen with 145kmph beauty. 🤯🔥 pic.twitter.com/TLxbWMwjjU— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 గిల్ క్రీజ్ దాటి వస్తాడని ముందుగానే పసిగట్టిన చహల్.. తెలివిగా వైడ్ వేయగా.. ఇది తెలియని గిల్ ముందుకు వచ్చి ఆడే క్రమంలో స్టంప్ ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 138/5గా ఉంది. తెవాతియా, షారుక్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే 24 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. -
IPL 2024 RR VS GT: శుభ్మన్ గిల్ ఖాతాలో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఐపీఎల్లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో ఐపీఎల్లో 3000 పరుగుల మార్కును తాకగా.. దీనికి ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 26 ఏళ్ల 186 రోజుల వయసులో 3000 పరుగుల మార్కును తాకాడు. ఈ జాబితాలో గిల్, విరాట్ తర్వాత సంజూ శాంసన్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ ఉన్నారు. సంజూ 26 ఏళ్ల 320 రోజుల వయసులో, రైనా 27 ఏళ్ల 161 రోజుల వయసులో, రోహిత్ 27 ఏళ్ల 343 రోజుల వయసులో ఐపీఎల్లో 3000 పరుగుల మైలురాయిని తాకారు. The class of Shubman Gill. 💥pic.twitter.com/e1tVCEzuds— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 ఐపీఎల్లో ఇన్నింగ్స్ల పరంగా అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ (టాప్ 5) గిల్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో గిల్ నాలుగో స్థానంలో నిలిచాడు. గిల్కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 94 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. క్రిస్ గేల్ కేవలం 75 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించి ఈ విభాగంలో టాప్లో నిలిచాడు. గేల్ తర్వాత కేఎల్ రాహుల్ (80 ఇన్నింగ్స్లు), జోస్ బట్లర్ (85) ఉన్నారు. గిల్తో పాటు డేవిడ్ వార్నర్, డుప్లెసిస్ కూడా 94 ఇన్నింగ్స్ల్లోనే 3000 పరుగుల మార్కును తాకారు. కాగా, గుజరాత్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ను కుల్దీప్ సేన్ (2-0-11-3) ఇరకాటంలో పడేశాడు. సేన్ ధాటికి గుజరాత్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. సాయి సుదర్శన్ (35), మాథ్యూ వేడ్ (4), అభినవ్ మనోహర్ (1) ఔట్ కాగా.. శుభ్మన్ గిల్ (37), విజయ్ శంకర్ (4) క్రీజ్లో ఉన్నారు. -
IPL 2024 RR VS GT: శివాలెత్తిన సంజూ శాంసన్
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో శాంసన్ శివాలెత్తిపోయి మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.. ప్రస్తుత సీజన్లో మూడో అర్దశతకాన్ని నమోదు చేశాడు. తొలుత లక్నోతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో అజేయమైన 82 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత ఆర్సీబీపై 42 బంతుల్లో 69.. తాజాగా గుజరాత్పై 38 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో భీకరఫామ్లో ఉన్న సంజూ.. 5 మ్యాచ్ల్లో 157.69 స్టయిక్రేట్తో 82 సగటున 246 పరుగులు చేసి, విరాట్ (316), రియాన్ల (261) తర్వాత సీజన్ మూడో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. గుజరాత్తో మ్యాచ్లో సంజూతో పాటు రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. టార్గెట్ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ రాజస్థాన్ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 30/0గా ఉంది. సాయి సుదర్శన్ (19), శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. -
రాజస్థాన్పై గుజరాత్ సంచలన విజయం
రాజస్థాన్పై గుజరాత్ సంచలన విజయం రాజస్థాన్పై గుజరాత్ సంచలన విజయం సాధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓటమిపాలైంది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (వర్ రేట్లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. చివరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. చహల్ ఉచ్చులో ఇరుక్కున్న గిల్ చహల్ తెలివిగా వైడ్ వేసిన బంతిని ముందుకు వచ్చి ఆడే క్రమంలో శుభ్మన్ గిల్ (720 స్టంప్ ఔటయ్యాడు. చహల్ తెలివిగా ప్లాన్ వేసి గిల్ను పెవిలియన్కు పంపాడు. 15.2 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 133/5గా ఉంది. తెవాతియా, షారుక్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్ 111 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో విజయ్ శంకర్ (16) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 111/4గా ఉంది. గిల్ (52), తెవాతియా క్రీజ్లో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న కుల్దీప్ సేన్ ఈ మ్యాచ్లో కుల్దీప్ సేన్ నిప్పులు చెరుగుతున్నాడు. 9వ ఓవర్లో తొలి వికెట్ తీసన సేన్.. 11వ ఓవర్లో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. 11వ ఓవర్లో తొలుత వేడ్ను బౌల్డ్ చేసిన సేన్.. నాలుగో బంతికి అభినవ్ మనోహర్కు కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ 10.1 ఓవర్: వర్షం ఆగిపోయాక తొలి బంతికే మాథ్యూ వేడ్ (4) ఔటయ్యాడు. కుల్దీప్ సేన్ బౌలింగ్లో వేడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వర్షం అంతరాయం 10 ఓవర్ల అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను పాక్షికంగా నిలిపివేశారు. ఈ సమయంలో జట్టు స్కోర్ 77/1గా ఉంది. మాథ్యూ వేడ్ (4), గిల్ (36) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే 60 బంతుల్లో 120 పరుగులు చేయాల్సి ఉంది. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 8.2 ఓవర్: 64 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ బౌలింగ్లో సాయి సుదర్శన్ (35) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మాథ్యూ వేడ్ గిల్తో (28) జత కట్టాడు. గేర్ మార్చిన గిల్ 5 ఓవర్ల వరకు ఆచితూచి ఆడిన గిల్.. ఆతర్వాత గేర్ మార్చి ఆడుతున్నాడు. 8 ఓవర్ల అనంతరం గుజరాత్ స్కోర్ 63/0గా ఉంది. గిల్ 35, సాయి సుదర్శన్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 30/0గా ఉంది. సాయి సుదర్శన్ (19), శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. రియాన్, సంజూ మెరుపులు.. రాజస్థాన్ భారీ స్కోర్ రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. రియాన్ పరాగ్ ఔట్ 18.4 ఓవర్: 172 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్లో విజయ్ శంకర్కు క్యాచ్ ఇచ్చి రియాన పరాగ్ (76) ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్ సంజూ శాంసన్ 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 162/2గా ఉంది. రియాన్ (68), శాంసన్ (58) క్రీజ్లో ఉన్నారు. రియాన్ పరాగ్ విధ్వంసం.. మరో మెరుపు హాఫ్ సెంచరీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రియాన్ పరాగ్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గుజరాత్తో మ్యాచ్లో రియాన్ మరో మెరుపు అర్దశతకం బాదాడు. 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్దశతకాన్ని పూర్తి చేశాడు. రియాన హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్తో అందుకున్నాడు. 15 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 134/2. రియాన్ పరాగ్ (36 బంతుల్లో 56; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శాంసన్ (25 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. బట్లర్ను బోల్తా కొట్టించిన రషీద్ ఖాన్ 5.5 ఓవర్: 42 పరుగుల వద్ద రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో తెవాతియాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (8) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్..యశస్వి ఔట్ 4.2 ఓవర్: 32 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో మాథ్యూ వేడ్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (24) ఔటయ్యాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ దాదాపు అర్ద గంట తర్వాత టాస్ పడింది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ రెండు మార్పులు, రాజస్థాన్ ఓ మార్పు చేసింది. కేన్ విలియమ్సన్, బీఆర్ శరత్ స్థానాల్లో మథ్యూ వేడ్, అభినవ్ మనోహర్ గుజరాత్ తుది జట్టులోకి వచ్చారు. రాజస్థాన్ జట్టులో నండ్రే బర్గర్ స్థానంలో నవ్దీప్ సైనీ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నవ్దీప్ సైనీ గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, మాథ్యూ వేడ్ (వికెట్కీపర్), అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ ► టాస్ 7:25.. మ్యాచ్ 7:40కి ప్రారంభమయ్యే అవకాశం Toss at 7.25 pm IST and start of the play at 7.40 pm IST. pic.twitter.com/e7Syu4jUKS — Johns. (@CricCrazyJohns) April 10, 2024 ► వర్షం కారణంగా టాస్ ఆలస్యం Toss has been delayed due to rain at Jaipur. pic.twitter.com/AWssSQxxHX — Johns. (@CricCrazyJohns) April 10, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా అపజయం ఎరుగని రాజస్థాన్ రాయల్స్ను అరకొర విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. రాయల్స్ సొంత మైదానమైన సువాయ్ మాన్సింగ్ స్టేడయంలో (జైపూర్) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్లో రాయల్స్ నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ 5 మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతుంది. -
IPL 2024: రాయల్స్ రాజసం ముందు గుజరాత్ నిలబడేనా..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా అపజయం ఎరుగని రాజస్థాన్ రాయల్స్ను అరకొర విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. రాయల్స్ సొంత మైదానమైన సువాయ్ మాన్సింగ్ స్టేడయంలో (జైపూర్) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్లో రాయల్స్ నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ 5 మ్యాచ్ల్లో రెండు విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులు.. ఐపీఎల్లో రాజస్థాన్, గుజరాత్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ అత్యధికంగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించగా.. రాయల్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలుపొందింది. తుది జట్లు (అంచనా).. నేటి మ్యాచ్ కోసం రాజస్థాన్ మార్పులేమీ చేయకపోవచ్చు. ఆర్సీబీతో గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు సైతం గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నండ్రే బర్గర్ గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, బీఆర్ శరత్ (వికెట్కీపర్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ బలాబలాలు.. ప్రస్తుత సీజన్లో గుజరాత్తో పోలిస్తే రాజస్థాన్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా రాయల్స్ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్దులకు వణుకు పుట్టించేలా ఉంది. యశస్వి ఒక్కడు ఫామ్లోకి వస్తే నేటి మ్యాచ్లో రాయల్స్ను ఆపడం కష్టం. గత మ్యాచ్లోనే బట్లర్ మెరుపు శతకం బాది పూర్వపు టచ్ను అందుకున్నాడు. సంజూ, రియాన్ భీకర ఫామ్లో ఉన్నారు. హెట్మైర్, ద్రువ్ జురెల్ నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ బాకీ ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ రాయల్స్ తిరుగులేని శాక్తిగా ఉంది. బౌల్ట్, బర్గర్, ఆవేశ్ ఖాన్, అశ్విన్, చహల్, రియాన పరాగ్లతో ఆ జట్టు పేస్, స్పిన్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు బౌలింగ్ విభాగం ఓ మోస్తరుగా ఉన్నా, బ్యాటింగ్లో మాత్రం చాలా వీక్గా కనిపిస్తుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడారు. మిల్లర్ గాయపడటంతో గుజరాత్ కష్టాలు ఎక్కువయ్యాయి. అతని స్థానంలో తుది జట్టులో వచ్చిన కేన్ మామ గత మ్యాచ్లో చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు. ఆఖర్లో తెవాటియా పర్వాలేదనిపిస్తుండగా.. విజయ్ శంకర్, బీఆర్ శరత్, దర్శన్ నల్కండే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. బౌలింగ్లో స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నల్కండేలతో గుజరాత్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బ్యాటర్లు చెలరేగితే నేటి మ్యాచ్లో గుజరాత్ విజయం సాధించగలుగుతుంది. రాయల్స్ రాజసం కొనసాగుతుందో.. గుజరాత్ గర్జిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి ఉండాల్సిందే. -
హార్దిక్, రాహుల్, బుమ్రా కాదు.. భారత ఫ్యూచర్ కెప్టెన్ అతడే
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్కు మంచి మార్కులు పడుతున్నాయి. ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా నుంచి గుజరాత్ జట్టు పగ్గాలు చేపట్టిన గిల్.. తన వ్యూహాత్మక నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడింట గుజరాత్ ఓటమి పాలైనప్పటికి.. గిల్ మాత్రం తన కెప్టెన్సీతో అందరని అకట్టుకున్నాడు. అతడు బౌలర్లను మార్చే విధానం గానీ ఫీల్డ్ సెట్ కానీ అద్బుతంగా ఉన్నాయి. ఆటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా గిల్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన గిల్ 45.75 సగటుతో 183 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని వాన్ కొనియాడాడు. కాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో గుజరాత్ ఓటమి పాలైనప్పటికి గిల్ మాత్రం కెప్టెన్గా విజయవంతమయ్యాడు. తొలుత బౌలింగ్లో తన కెప్టెన్సీ మార్క్తో లక్నోను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేశాడు. కానీ ఆ తర్వాత బ్యాటర్లు విఫలమవకావడంతో గుజరాత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో గిల్ కెప్టెన్సీకి వాన్ ఫిదా అయిపోయాడు. "శుబ్మన్ గిల్ సారథిగా రోజుకు రోజుకు మరింత పరిణితి చెందుతున్నాడు. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదని" గుజరాత్-లక్నో మ్యాచ్ అనంతరం వాన్ ట్విట్ చేశాడు. హార్దిక్ పాండ్యా,రాహుల్, బుమ్రా వంటి వారు రోహిత్ శర్మ తర్వాత భారత కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికి వాన్ మాత్రం గిల్ను ఫ్యూచర్ కెప్టెన్గా ఎంచుకోవడం గమనార్హం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా బౌలర్లు అద్భుతం.. ఓటమికి వాళ్లే కారణం: మండిపడ్డ గిల్
ఐపీఎల్-2024ను ఘనంగా ఆరంభించిన గుజరాత్ టైటాన్స్ అదే జోరును కొనసాగించలేకపోతోంది. వరుస పరాజయాలతో చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటోంది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైన టైటాన్స్.. మూడో పరాజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై కూడా తాము పరుగులు రాబట్టలేకపోయామన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైందంటూ విచారం వ్యక్తం చేశాడు. కాగా లక్నో వేదికగా సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్(31), శుబ్మన్ గిల్(19) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(1) సహా వికెట్ కీపర్ శరత్ బీఆర్(2), విజయ్ శంకర్(17) చేతులెత్తేశారు. ఏడో నంబర్ బ్యాటర్ రాహుల్ తెవాటియా(30) కాసేపు పోరాడినా... మిగతా వారి నుంచి సహకారం అందకపోవడంతో 130 పరుగులకే గుజరాత్ టైటాన్స్ ఆలౌట్ అయింది. అలా 18.5 ఓవర్లలోనే కథ ముగిసిపోయింది. ఫలితంగా లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయం అందుకుంది. 2️⃣nd win at home 👌 3️⃣rd win on the trot 👌 A superb performance from Lucknow Super Giants takes them to No. 3 in the points table 👏👏 Scorecard ▶ https://t.co/P0VeELamEt#TATAIPL | #LSGvGT pic.twitter.com/w2nCs5XrwT — IndianPremierLeague (@IPL) April 7, 2024 ఈ నేపథ్యంలో టైటాన్స్ సారథి శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. కానీ మా బ్యాటర్ల ప్రదర్శన అస్సలు బాగాలేదు. మెరుగ్గానే ఆరంభించినా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయాం. నిజానికి మా బౌలర్లు అద్భుతంగా ఆడారు. ప్రత్యర్థిని 160 పరుగులకు పరిమితం చేశౠరు. కానీ బ్యాటర్లే ఓటమికి కారణమయ్యారు. డేవిడ్ మిల్లర్ను మిస్సయ్యాం. తను ఉండి ఉంటే ఒక్క ఓవర్లోనే మ్యాచ్ ను మలుపు తిప్పగలడు. పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు రాబట్టాలనే ఉద్దేశంతోనే నేను దూకుడుగా ఆడాను. ఆ క్రమంలోనే అవుటయ్యాను’’ అని పేర్కొన్నాడు. తమ ఓటమికి బ్యాటర్లే ప్రధాన కారణమని గిల్ ఈ సందర్బంగా వెల్లడించాడు. కాగా గుజరాత్ టైటాన్స్ తదుపరి ఏప్రిల్ 10న రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. కాగా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో రెండు మాత్రమే గెలిచిన గుజరాత్.. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. చదవండి: లక్షల కోట్లు ఉంటేనేం!.. 2 పాయింట్లు.. చిన్నపిల్లల్లా అంబానీల సంబరాలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 LSG VS GT: రాహుల్ సూపర్ కెప్టెన్సీ.. తిరుగులేని ట్రాక్ రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా కేఎల్ రాహుల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జట్టు తరఫున స్కోర్లను కాపాడుకోవడంలో రాహుల్కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. రాహుల్ ఎల్ఎస్జీ కెప్టెన్గా స్కోర్లను డిఫెండ్ చేసుకుంటూ గత 17 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒకసారి ఓటమి చవిచూశాడు. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో రాహుల్ దిట్ట. ఈ సీజన్లో లక్నో గెలిచిన మ్యాచ్లే ఇందుకు ఉదాహరణ. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ 199 పరుగులకు విజయవంతంగా కాపాడుకున్నాడు. ఆ మ్యాచ్లో ప్రత్యర్దిని 178 పరుగులకే పరిమితం చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రాహుల్ 181 పరుగులను డిఫెండ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో రాహుల్ సూపర్ కెప్టెన్సీ స్కిల్స్ ప్రదర్శించి ఆర్సీబీని 153 పరుగులకే పరిమితం చేశాడు. Lucknow Super Giants while defending total in last 17 games: Won, Won, Won, Won, Won, Won, Won, Won, Lost, Won, Won, Won, NR, Won, Won, Won, Won. - Captain KL Rahul for you. ⭐ pic.twitter.com/ZfgnlECWeE — Johns. (@CricCrazyJohns) April 7, 2024 తాజాగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ ఇంకాస్త పరిణితి చెంది 163 పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు. ఈ మ్యాచ్లో రాహుల్ తన సారధ్య నైపుణ్యాలను రంగరించి గుజరాత్ను 130 పరుగులకే పరిమితం చేశాడు. కెప్టెన్గా వరుసగా మూడు మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లను డిఫెండ్ చేసుకోవడంతో రాహుల్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భావి భారత కెప్టెన్ ఇతడే అంటూ అభిమానులు రాహుల్ను ఆకాశానికెత్తుతున్నారు. KL Rahul has been one of the best captains in the IPL while defending the total. 🫡pic.twitter.com/9WhKztX4A9 — Johns. (@CricCrazyJohns) April 7, 2024 ధోని తర్వాత ధోని అంతటి వాడంటూ కితాబునిస్తున్నారు. ధోనిలాగే రాహుల్ కూడా వికెట్ల వెనుక ఊహలకందని వ్యూహరచన చేస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. యువ బౌలింగ్ లైనప్ను రాహుల్ అద్భుతంగా వినియోగించుకుంటున్నాడంటూ ప్రశంసిస్తున్నారు. మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్ లాంటి అన్క్యాప్డ్ బౌలర్లు మ్యాచ్ విన్నర్లుగా మారడానికి రాహుల్ కెప్టెన్సీనే కారణమంటూ ఆకాశానికెత్తుతున్నారు. పంజాబ్, ఆర్సీబీపై మయాంక్.. తాజాగా గుజరాత్పై యశ్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. - Defended 199 runs vs PBKS. - Defended 181 runs vs RCB. - Defended 163 runs vs GT. Captain KL Rahul & his boys have been phenomenal - Lucknow Defending Giants. 🫡 pic.twitter.com/7LDcgflcBM — Johns. (@CricCrazyJohns) April 7, 2024 కాగా, గుజరాత్తో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే చాపచుట్టేసింది. రాహుల్ సారథ్య నైపుణ్యం, యశ్ ఠాకూర్ సంచలన ప్రదర్శన (3.5-1-30-5) కారణంగా ఈ మ్యాచ్లో లక్నో తిరుగులేని విజయాన్ని అందుకుంది. -
IPL 2024 LSG Vs GT: లక్నో ‘హ్యాట్రిక్’ విక్టరీ
లక్నో: ఆల్రౌండ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 17వ సీజన్లో ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలిచింది. మొదట లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 18 పరుగులకే 2 కీలక వికెట్టు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), స్టొయినిస్ (43 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మూడో వికెట్కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఆఖర్లో నికోలస్ పూరన్ (22 బంతుల్లో 32; 3 సిక్స్లు), ఆయూశ్ బదోని (11 బంతుల్లో 20; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం సులువైన లక్ష్యమే ఎదురైనా... గుజరాత్ బ్యాటర్ల నిర్లక్ష్యం జట్టును ముంచింది. చివరకు గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. మీడియం పేసర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశ్ ఠాకూర్ (5/30), స్పిన్నర్ కృనాల్ పాండ్యా (3/11) గుజరాత్ను దెబ్బ తీశారు. 54 పరుగుల వరకు వికెట్ కోల్పోని గుజరాత్ అనూహ్యంగా మరో 76 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు చేజార్చుకోవడం గమనార్హం. కెప్టెన్ శుబ్మన్ గిల్ (19; 2 ఫోర్లు)ను యశ్ ఠాకూర్ బౌల్డ్ చేయగా, రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్తో కేన్ విలియమ్సన్ (1) ని్రష్కమించాడు. కృనాల్ పాండ్యా కూడా స్పిన్తో తిప్పేయడంతో గుజరాత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) నూర్ (బి) ఉమేశ్ 6; కేఎల్ రాహుల్ (సి) తెవాటియా (బి) దర్శన్ 33; పడిక్కల్ (సి) శంకర్ (బి) ఉమేశ్ 7; స్టొయినిస్ (సి) శరత్ (బి) దర్శన్ 58; పూరన్ (నాటౌట్) 32; బదోని (సి) ఉమేశ్ (బి) రషీద్ ఖాన్ 20; కృనాల్ పాండ్యా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–91, 4–112, 5–143. బౌలింగ్: ఉమేశ్ 3–0–22–2, జాన్సన్ 4–0–32–0, రషీద్ 4–0–28–1, మోహిత్ 3–0 –34–0, నూర్ 4–0–22–0, దర్శన్ 2–0–21–2. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రవి బిష్ణోయ్ (బి) కృనాల్ 31; గిల్ (బి) యశ్ ఠాకూర్ 19; విలియమ్సన్ (సి అండ్ బి) రవి బిష్ణోయ్ 1; శరత్ (సి) బదోని (బి) కృనాల్ 2; విజయ్ శంకర్ (సి) రాహుల్ (బి) యశ్ 17; దర్శన్ (సి) యశ్ ఠాకూర్ (బి) కృనాల్ 12; తెవాటియా (సి) పూరన్ (బి) యశ్ 30; రషీద్ ఖాన్ (సి) సబ్–హుడా (బి) యశ్ ఠాకూర్ 0; ఉమేశ్ (సి) డికాక్ (బి) నవీనుల్ 2; జాన్సన్ (నాటౌట్) 0; నూర్ అహ్మద్ (సి) డికాక్ (బి) యశ్ ఠాకూర్ 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 130. వికెట్ల పతనం: 1–54, 2–56, 3–58, 4–61, 5–80, 6–93, 7–93, 8–102, 9–126, 10–130. బౌలింగ్: సిద్ధార్థ్ 4–0–29–0, నవీనుల్ 4–0–37–1, మయాంక్ 1–0–13–0, యశ్ ఠాకూర్ 3.5–1– 30–5, కృనాల్ 4–0–11–3, రవి బిష్ణోయ్ 2–0–8–1. -
LSG Vs GT: వావ్ వాట్ ఏ క్యాచ్.. సూపర్ మ్యాన్లా డైవ్ చేస్తూ! మైండ్బ్లోయింగ్
ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్తో గుజరాత్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ను బిష్ణోయ్ పెవిలియన్కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్.. రెండో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపుల సంధించాడు. ఆ బంతిని విలియమ్సన్ స్టైట్గా సింగిల్ కోసం చిప్ చేశాడు. అయితే బంతి కాస్త గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బిష్ణోయ్ తన కుడివైపున్కి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన కేన్ మామతో పాటు గ్రౌండ్లో ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీంతో కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసిన విలియమ్సన్.. నిరాశతో మైదానాన్ని వీడాడు. బిష్ణోయ్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటంటూ కామెంట్లు చేస్తున్నారు. 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 😲 Flying Bishoni ✈️ Ravi Bishnoi pulls off a stunning one-handed screamer to dismiss Kane Williamson 👏👏 Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvGT pic.twitter.com/Le5qvauKbf — IndianPremierLeague (@IPL) April 7, 2024 -
LSG Vs GT: కేఎల్ రాహుల్ టెస్టు ఇన్నింగ్స్.. ఎంత బాగా ఆడాడో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పరంగా తడబడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్తో మ్యాచ్లో రాహుల్ నిరాశపరిచాడు. ఓపెనర్గా వచ్చిన రాహుల్ టెస్టు మ్యాచ్ కంటే దారుణంగా ఆడాడు. ఓ వైపు స్టోయినిష్ బౌండరీలు బాదుతుంటే.. రాహుల్ మాత్రం తన జిడ్డు బ్యాటింగ్తో అభిమానులకు విసుగుతెప్పించాడు. ఈ మ్యాచ్లో 31 బంతులు ఎదుర్కొన్న 106.45 స్ట్రైక్ రేటుతో 33 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో కేవలం మూడు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. ఆఖరికి దర్శన్ నల్కండే బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రాహుల్ ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. టెస్టు ఇన్నింగ్స్ బాగా ఆడావు.. ఓడినా నీదే ప్లేయర్ మ్యాచ్ అవార్డు అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(58) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(32 నాటౌట్), కేఎల్ రాహుల్(33) పరుగులతో పర్వాలేదన్పించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలా రెండు వికెట్లు సాధించగా.. రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. What a day for academy.. Hardik Pandya- 39 off 33 KL Rahul- 33 off 31 Prince Gill- 19 off 21😳🔥🔥 pic.twitter.com/CW44o7hZHt — TukTuk Academy (@TukTuk_Academy) April 7, 2024 pic.twitter.com/yX2arIKeiX — Cricket Videos (@cricketvid123) April 7, 2024 -
5 వికెట్లతో చెలరేగిన యష్.. గుజరాత్పై లక్నో ఘన విజయం
IPL 2024 GT vs LSG Live Updates: గుజరాత్పై లక్నో ఘన విజయం ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎక్నా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 33 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 18.5 ఓవర్లలో కేవలం 130 పరుగులకే కుప్పకూలింది. లక్నో పేసర్ యష్ ఠాకూర్ 5 వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(58) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(32 నాటౌట్), కేఎల్ రాహుల్(33) పరుగులతో పర్వాలేదన్పించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలా రెండు వికెట్లు సాధించగా.. రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్ : 93/7 15 ఓవర్లు ముగిసే సరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 15 ఓవర్ వేసిన యశ్ ఠాకూర్ బౌలింగ్లో గజరాత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ వరుస క్రమంలో ఔటయ్యారు. ఐదో వికెట్ డౌన్ 81 పరుగుల వద్ద గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన దర్శన్ నల్కండే.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 42 బంతుల్లో 82 పరుగులు కావాలి. క్రీజులో విజయ్ శంకర్(9), రాహుల్ తెవాటియా(1) పరుగులతో ఉన్నారు. 61 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో గుజరాత్ 9వ ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్లో గుజరాత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత సాయిసుదర్శన్ ఔట్ కాగా.. అనంతరం శరత్ ఔటయ్యాడు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 61/4 గుజరాత్ రెండో వికెట్ డౌన్.. కేన్ విలియమ్సన్ ఔట్ 58 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కేన్ విలియమ్సన్.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 58/2 తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. గిల్ ఔట్ 54 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. యశ్ ఠాకూర్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 54/1 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 22/0 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్(12), శుబ్మన్ గిల్(8) పరుగులతో ఉన్నారు. రాణించిన లక్నో బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ 164 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(58) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(32 నాటౌట్), కేఎల్ రాహుల్(33) పరుగులతో పర్వాలేదన్పించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలా రెండు వికెట్లు సాధించగా.. రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. లక్నో నాలుగో వికెట్ డౌన్.. స్టోయినిష్ ఔట్ మార్కస్ స్టోయినిష్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన స్టోయినిష్.. దర్శన్ నల్కండే బౌలింగ్లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు లక్నో స్కోర్: 114/4 లక్నో మూడో వికెట్.. కేఎల్ రాహుల్ ఔట్ 91 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. దర్శన్ నల్కండే బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి పూరన్ వచ్చాడు. 13 ఓవర్లకు లక్నో స్కోర్: 93/3 10 ఓవర్లకు లక్నో స్కోర్: 74/2 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో స్టోయినిష్(29), కేఎల్ రాహుల్(28) పరుగులతో ఉన్నారు 6 ఓవర్లకు లక్నో స్కోర్: 47/2 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో స్టోయినిష్(16), కేఎల్ రాహుల్(13) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. పడిక్కల్ ఔట్ 18 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన దేవ్దత్త్ పడిక్కల్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు లక్నో స్కోర్: 18/2 తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్ ఔట్ టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన డికాక్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఐపీఎల్-2024లో భాగంగా లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. గుజరాత్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. గుజరాత్ జట్టుకు వృద్దిమాన్ సహా, ఒమర్జాయ్ దూరం కాగా.. శరత్, స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్ గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), శరత్ బిఆర్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ -
ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ .. స్టార్ క్రికెటర్ దూరం?
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ అనుహ్యంగా ఓటమి పాలైంది. సునయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు చెతిలేత్తిశారు. అయితే ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, ఫినిషర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు కూడా మిల్లర్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో తుది జట్టులోకి న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ వచ్చాడు. జట్టులోకి వచ్చిన విలియమ్సన్.. మిల్లర్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. "జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ డేవిడ్ మిల్లర్ సేవలు కోల్పోవడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. డేవిడ్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడని" విలియమ్సన్ పేర్కొన్నాడు. కాగా రెండు వారాల అంటే దాదాపు గుజరాత్ ఆడే నాలుగు మ్యాచ్లకు మిల్లర్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా మిల్లర్ ప్రస్తుతం గుజరాత్ జట్టులో ఫినిషర్గా కొనసాగుతున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక గుజరాత్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. చదవండి: #Shashank Singh: పంజాబ్ హీరో.. ఓడిపోయే మ్యాచ్ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్? -
IPL 2024: శశాంక్ సింగ్ గతంలోనూ గుజరాత్ బౌలర్లను వదల్లేదు.. చీల్చిచెండాడు..!
గుజరాత్ టైటాన్స్తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్పై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చ జోరుగా సాగుతుంది. క్రికెట్ అభిమానులు శశాంక్ గురించి ఆరా తీసే క్రమంలో అతని పాత వీడియో ఒకటి బయటపడింది. ఇందులో శశాంక్ విధ్వంసం వీర లెవెల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. 2022 ఐపీఎల్ సీజన్కు సంబందించిన ఆ వీడియోలో శశాంక్ సన్రైజర్స్కు ఆడుతూ గుజరాత్ బౌలర్లు చీల్చిచెండాడాడు. నిన్నటి మ్యాచ్తో పోలిస్తే ఆ విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. శశాంక్ ఊచకోతకు గతంలోనూ గుజరాత్ బౌలర్లు బలయ్యారు. When Shashank Singh used to play for SRH, he smashed Lockie Ferguson like a club bowler 😨#GTvPBKS #ShashankSingh #GTvPBKS #PBKSvsGT pic.twitter.com/MxN4jH5k9f — Richard Kettleborough (@RichKettle07) April 5, 2024 నాడు గుజరాత్తో జరిగిన మ్యాచ్లో శశాంక్ ఏడో స్థానంలో బరిలోకి దిగి 6 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్లో శశాంక్ స్ట్రయిక్రేట్ 416.67గా ఉంది. అదే సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన శశాంక్ ఫెర్గూసన్ లాంటి బౌలర్పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు శశాంక్కు గుజరాత్ అంటే కసిలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, శాశంక్ సింగ్, అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) చిరస్మరణీయ ఇన్నింగ్స్లతో చెలరేగడంతో నిన్నటి మ్యాచ్లో పంజాబ్ గుజరాత్ టైటాన్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ (89 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ (35) రెచ్చిపోవడంతో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
మోదీ స్టేడియం అంటే చాలు శుభ్మన్కు పూనకం వస్తుంది.. ఇరగదీస్తాడు..!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తమ సొంత మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) అంటే చాలు చెలరేగిపోతాడు. ఈ గ్రౌండ్లో శుభ్మన్కు ఎవరికీ లేని అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. గిల్ ఇక్కడ మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఇరగదీస్తాడు. ఇక్కడ అతనికి పట్టపగ్గాలు ఉండవు. తాజాగా మరోసారి ఇది నిరూపితమైంది. నిన్న (ఏప్రిల్ 4) పంజాబ్ కింగ్స్తో ఇక్కడ జరిగిన మ్యాచ్లో గిల్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మోదీ స్టేడియంలో గిల్ ఆడిన క్లాసీ ఇన్నింగ్స్ల్లో ఇదీ ఒకటి. ఈ మ్యాచ్లో గుజరాత్ ఓటమిపాలైనప్పటికీ.. గిల్ ఇన్నింగ్స్ ఆందరినీ ఆకట్టుకుంది. Shubman Gill at Narendra Modi stadium in IPL: 9(8), 43(38), 45*(43), 63(36), 39(31), 39(31), 45(34), 56(34), 6(7), 94*(51), 101(58), 129(60), 39(20), 31(22), 36(28), 89*(48). 15 innings, 825 runs, 68.75 average, 159.26 strike Rate - This is Incridible from Gill. ⭐ pic.twitter.com/mbUmoe9GJb — CricketMAN2 (@ImTanujSingh) April 4, 2024 నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ చేసిన స్కోర్లపై లుక్కేస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఇక్కడ అతను 15 ఇన్నింగ్స్ల్లో 159.26 స్ట్రయిక్రేట్తో 68.75 సగటున 825 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్దసెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో బహుశా ఏ క్రికెటర్ తన హోం గ్రౌండ్లో ఈ స్థాయి చెలరేగి ఉండడు. మోదీ స్టేడియంలో గిల్ చేసిన స్కోర్లు.. 9(8), 43(38), 45*(43), 63(36), 39(31), 39(31), 45(34), 56(34), 6(7), 94*(51), 101(58), 129(60), 39(20), 31(22), 36(28), 89*(48) కాగా, పంజాబ్తో మ్యాచ్లో గిల్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి పంజాబ్ను గెలిపించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
IPL 2024 GT VS PBKS: శుభ్మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్.. సీజన్ టాప్ స్కోర్
పంజాబ్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ అయ్యాక తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో గిల్ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్లో 48 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. SHUBMAN GILL HAS THE HIGHEST INDIVIDUAL SCORE IN IPL 2024. ⭐🔥 pic.twitter.com/Rl8Yv0gHlo — Johns. (@CricCrazyJohns) April 4, 2024 ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై సునీల్ నరైన్ చేసిన 85 పరుగులు గిల్ ఇన్నింగ్స్కు ముందు సీజన్ టాప్ స్కోర్గా ఉండింది. గంటల వ్యవధిలోనే గిల్..నరైన్ స్కోర్ను అధిగమించి సీజన్ టాప్ స్కోరర్గా అవతరించాడు. MAGIC HANDS OF CAPTAIN GILL. 👌🔥pic.twitter.com/ZvJrDpRhVR — Johns. (@CricCrazyJohns) April 4, 2024 పంజాబ్తో మ్యాచ్లో గుజరాత్ ఓటమిపాలైనప్పటికీ గిల్ ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్లో గిల్ చూడచక్కటి షాట్లు ఆడాడు. గిల్ కొట్టిన సిక్సర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గిల్ సునాయాసంగా బంతులను బౌండరీ లైన్ పైకి తరలించాడు. ఐపీఎల్లో గిల్ బ్యాట్ నుంచి జాలువారిన క్లాసీ ఇన్నింగ్స్లో ఇది ఒకటి. A Shubman Gill fan doing his trademark move at the yesterday's match.👌 pic.twitter.com/3iFcZ2uA0r— CricketMAN2 (@ImTanujSingh) April 5, 2024 కాగా, పంజాబ్తో మ్యాచ్లో గిల్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగినప్పటికీ.. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అంతకంటే మెరుగైన ఇన్నింగ్స్లు ఆడి పంజాబ్ను గెలిపించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ (35) రెచ్చిపోవడంతో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
IPL 2024 GT VS PBKS: ఫిఫ్టి కొట్టిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ తరఫున 50 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. నిన్నటి మ్యాచ్లో జితేశ్ శర్మ వికెట్ సాధించడం ద్వారా రషీద్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు మ్యాచ్లోనే (సన్రైజర్స్తో) షమీని అధిగమించి గుజరాత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించిన రషీద్.. తాజాగా మరో మైలురాయిని తాకాడు. పంజాబ్తో మ్యాచ్లో రషీద్ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్లో గుజరాత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లు.. రషీద్ ఖాన్-50 మొహమ్మద్ షమీ-48 మోహిత్ శర్మ-34 నూర్ అహ్మద్-17 అల్జరీ జోసఫ్-14 మ్యాచ్ విషయానికొస్తే.. శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అనూహ్య రీతిలో విరుచుకుపడటంతో గుజరాత్పై పంజాబ్ సంచలన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో ఈ ఇద్దరు ఆటగాళ్లు చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి పంజాబ్ను గెలిపించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ (89 నాటౌట్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ (35) రాణించడంతో 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
IPL 2024 GT VS PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 200 అంతకు పైగా లక్ష్యాలను ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. నిన్న గుజరాత్పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో పంజాబ్ కింగ్స్ ఈ రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్లో పంజాబ్ ఇప్పటివరకు ఆరుసార్లు 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించింది. పంజాబ్ తర్వాత ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు (5) 200 ఆపైచిలుకు లక్ష్యాలను ఛేదించింది. PUNJAB KINGS NOW HAVE MOST 200 OR MORE TOTALS CHASED DOWN IN IPL HISTORY. 🤯💥pic.twitter.com/Jz56stB8kB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్లో గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మరో బంతి మిగిలుండగానే విజయవంతంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ (89 నాటౌట్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో సాహా (11), విజయ్ శంకర్ (8) నిరాశపర్చగా.. కేన్ విలియమ్సన్ (26), సాయి సుదర్శన్ (33) పర్వాదేనిపించారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా (8 బంతుల్లో 23 నాటౌట్) గిల్తో కలిసి మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. Most successful 200 or more run chases in IPL history: Punjab Kings - 6*. Mumbai Indians - 5. pic.twitter.com/ego8rhdFWq — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. ఆ సమయంలో క్రీజ్లోకి వచ్చిన శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. శశాంక్తో పాటు అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) కూడా అద్భుతమై ఇన్నింగ్స్ ఆడాడు. అశుతోష్.. శశాంక్తో కలిసి ఏడో వికెట్కు మెరుపు వేగంతో 43 పరుగులు సమకూర్చి పంజాబ్కు ఊహించని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి పంజాబ్ పాలిట గెలుపు గుర్రంగా మారాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో శశాంక్, అశుతోష్తో పాటు ప్రభ్సిమ్రన్ (35), బెయిర్స్టో (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే తలో వికెట్ దక్కించుకున్నారు. -
IPL 2024: గుజరాత్కు గెలుపు దూరం చేసిన ఈ అశుతోష్ రాంబాబు ఎవరు..?
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గెలుపుపై ఆశలు లేని పంజాబ్ను శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అద్భుత ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. వీరిద్దరూ ఏడో వికెట్కు మెరుపు వేగంతో 43 పరుగులు సమకూర్చి పంజాబ్కు ఊహించని విజయాన్ని అందించారు. PUNJAB KINGS NOW HAVE MOST 200 OR MORE TOTALS CHASED DOWN IN IPL HISTORY. 🤯💥pic.twitter.com/Jz56stB8kB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో శశాంక్.. 27 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన దశలో అశుతోష్ అంచనాలు లేకుండా బరిలోకి దిగి పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఓటమి తప్పతనుకున్న వేళ వీరిద్దరూ తమ బ్యాటింగ్ విన్యాసాలతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. శశాంక్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగి విధ్వంసం సృష్టిస్తే.. అశుతోష్ బాధ్యతమైన షాట్లు ఆడి స్ట్రయిక్ను రొటేట్ చేశాడు. Ashutosh Sharma said "I should thank Dhawan Paji, Sanjay Bangar & Punjab Kings for trusting me a lot". pic.twitter.com/EhOvU3m298 — Johns. (@CricCrazyJohns) April 4, 2024 ఎవరీ అశుతోష్..? పంజాబ్ గెలుపులో శశాంక్ పాత్ర ఎంత కీలకమైందో అశుతోష్ పాత్ర కూడా అంతే వెల కట్టలేనిది. అరంగేట్రం మ్యాచ్లోనే అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మరీ ఇరగదీశాడు. 25 ఏళ్ల అశుతోష్ రాంబాబు శర్మ.. తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే ఈ రేంజ్లో చెలరేగుతాడని ఎవరూ ఊహించ లేదు. - IPL Debut. - Impact player. - Came when PBKS needed 50 from 27 balls. Ashutosh Sharma smashed 31 runs from just 17 balls, A clean ball striker. 🔥 pic.twitter.com/wWW4osw3BR — Johns. (@CricCrazyJohns) April 4, 2024 దేశవాలీ క్రికెట్లోనూ పెద్దగా ట్రాక్ రికార్డు లేని అశుతోష్ను పంజాబ్ కింగ్స్ తన బేస్ ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన అశుతోష్.. 4 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 7 లిస్ట్-ఏ, 16 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అశుతోష్.. టీ20ల్లో 4 అర్దసెంచరీలు నమోదు చేశాడు. పొరపాటున ఎంపిక చేసుకున్నవాడే గెలుపు గుర్రమయ్యాడు.. శశాంక్ విషయానికొస్తే.. ఐపీఎల్ 2024 వేలంలో పంజాబ్ కింగ్స్ ఇతగాడిని పొరపాటున ఎంపిక చేసుకుందని వార్తలు వచ్చాయి. వేలంలో ఇద్దరు శశాంక్ సింగ్లు ఉండటంతో పొరపాటున ఈ శశాంక్ సింగ్ను తీసుకున్నట్లు పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా అప్పట్లో తెగ బాధపడిపోయింది. SHASHANK SINGH MASTERCLASS! A fifty in just 23 balls against GT in Ahmedabad. He's keeping Punjab Kings in the chase, a knock to remember. 💥 pic.twitter.com/nYuWif1luJ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 పొరపాటున తీసుకున్నాయని భావించిన ఆ శశాంక్ సింగే ఇప్పుడు పంజాబ్ పాలిట గెలుపు గుర్రంగా అవతరించడం విశేషం. చత్తీస్ఘడ్కు చెందిన ఈ శశాంక్ సింగ్ను పంజాబ్ కింగ్స్ 2024 వేలంలో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా, గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ (89 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ (35) రాణించడంతో 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
మెరుపు ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించిన శశాంక్ (ఫొటోలు)
-
శశాంక్ కిర్రాక్...
అహ్మదాబాద్: సొంతగడ్డపై మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్లను ఓడించిన గుజరాత్ టైటాన్స్కు పంజాబ్ కింగ్స్ చెక్ పెట్టింది. గురువారం ఆఖరి ఓవర్లో ఉత్కంఠ రేపిన ఐపీఎల్ పోరులో నిరుటి రన్నరప్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో ఓడింది. మొదట గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ , ఓపెనర్ శుబ్మన్ గిల్ (48 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగాడు. సాయి సుదర్శన్ (19 బంతుల్లో 33; 6 ఫోర్లు) ధాటిగా ఆడాడు. రబడకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు), ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు బ్యాటింగ్తో పంజాబ్ను గెలిపించారు. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఓపెనర్ గిల్ ఆఖరిదాకా... వృద్ధిమాన్ సాహా (11)తో ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన శుబ్మన్ ఆఖరిదాకా టైటాన్స్ స్కోరు పెంచే పనిలో పడ్డాడు. కేన్ విలియమ్సన్ (22 బంతుల్లో 26; 4 ఫోర్లు) నింపాదిగా ఆడగా, జట్టు పవర్ప్లేలో 52/1 స్కోరు చేసింది. కెప్టెన్ గిల్ ధాటికి సాయి సుదర్శన్ జోరు తోడయ్యాకే గుజరాత్ పుంజుకుంది. 12వ ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. శుబ్మన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. చకచకా పరుగులు జతచేస్తున్న సుదర్శన్కు హర్షల్ చెక్పెట్టగా, విజయ్ శంకర్ (8) నిరాశపరిచాడు. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా డెత్ ఓవర్లలో బ్యాట్ ఝుళిపించాడు. 19వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ 3 వైడ్లు సహా 9 బంతులేయగా తెవాటియా 6, 4 బాదడంతో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్ వేసిన అర్ష్దీప్ తొలి నాలుగు బంతుల్లో 5 పరుగులే ఇచ్చాడు. అయితే చివరి రెండు బంతుల్ని తెవాటియా బౌండరీలకు తరలించడంతో టైటాన్స్ 199/4 స్కోరు చేసి సరిగ్గా 200 లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. మ్యాచ్ విన్నర్గా... భారీ లక్ష్యఛేదనలో శిఖర్ ధావన్ (1) విఫలమైనా... బెయిర్స్టో (13 బంతుల్లో 22; 4 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు సాధించారు. 13వ ఓవర్లో సికందర్ రజా (15) అవుటైనప్పడు పంజాబ్ స్కోరు 111/5. గెలుపుపై ఆశల్లేని స్థితిలో జితేశ్ శర్మ అండతో శశాంక్ సింగ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇద్దరు 3.1 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. రెండు వరుస సిక్సర్లు కొట్టిన జితేశ్ను రషీద్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో కింగ్స్ విజయానికి 27 బంతుల్లో 50 పరుగులు కావాలి. ఇంపాక్ట్ ప్లేయర్గా క్రీజులోకి వచ్చిన అశుతో‹Ù... నిలదొక్కుకున్న శశాంక్తో కలిసి ధనాధన్ ఆటతో 19వ ఓవర్లోనే విజయసమీకరణాన్ని సులువు చేశాడు. ఆఖరి ఓవర్కు వచ్చేసరికి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సివుండగా, తొలి బంతికే అశుతోష్ అవుటైనా... శశాంక్ మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించాడు. గత డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం శశాంక్ సింగ్ను కొనుగోలు చేసింది. అయితే వేలం జాబితాలో ఇద్దరు శశాంక్ సింగ్లు ఉండగా... తాము కోరుకున్న శశాంక్ సింగ్ను కాకుండా అదే పేరుతో ఉన్న మరో శశాంక్ సింగ్ను పొరపాటుగా తీసుకున్నామని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. ఇది కాస్తా వివాదం కావడంతో ఇద్దరు శశాంక్లు తమ దృష్టిలో ఉన్నారని, తాము పొరపాటు చేయలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆనాడు శశాంక్ సింగ్ను పొరపాటుగా తీసుకున్నామని భావించిన పంజాబ్ కింగ్స్ జట్టుకు నేడు మ్యాచ్ విన్నర్గా అవతరించడం విశేషం. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) ధావన్ (బి) రబడ 11; గిల్ (నాటౌట్) 89; విలియమ్సన్ (సి) బెయిర్స్టో (బి) హర్ప్రీత్ 26; సుదర్శన్ (సి) జితేశ్ (బి) హర్షల్ 33; విజయ్ శంకర్ (సి) హర్ప్రీత్ (బి) రబడ 8; తెవాటియా (నాటౌట్) 23; ఎక్స్ట్రాలు 9; మొత్తం ( 20 ఓవర్లలో 4 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–29, 2–69, 3–122, 4–164. బౌలింగ్: హర్ప్రీత్ బ్రార్ 4–0–33–1, అర్ష్దీప్ 4–0–33–0, రబడ 4–0–44–2, స్యామ్ కరన్ 2–0–18–0, హర్షల్ పటేల్ 4–0–44–1, సికందర్ రజా 2–0–22–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (బి) ఉమేశ్ 1; బెయిర్స్టో (బి) నూర్ అహ్మద్ 22; ప్రభ్సిమ్రన్ (సి) మోహిత్ (బి) నూర్ అహ్మద్ 35; స్యామ్ కరన్ (సి) విలియమ్సన్ (బి) అజ్మతుల్లా 5; సికందర్ (సి) సాహా (బి) మోహిత్ 15; శశాంక్ (నాటౌట్) 61; జితేశ్ (సి) దర్శన్ (బి) రషీద్ ఖాన్ 16; అశుతోష్ (సి) రషీద్ ఖాన్ (బి) దర్శన్; హర్ప్రీత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–13, 2–48, 3–64, 4–70, 5–111, 6–150, 7–193. బౌలింగ్: అజ్మతుల్లా 4–0–41–1, ఉమేశ్ 3–0–35–1, రషీద్ ఖాన్ 4–0–40–1, నూర్ అహ్మద్ 4–0–32–2, మోహిత్ శర్మ 4–0–38–1, దర్శన్ 0.5–0–6–1. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X చెన్నై వేదిక: హైదరాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
పంజాబ్ హీరో.. ఓడిపోయే మ్యాచ్ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి మరో టాలెంటడ్ బ్యాటర్ వరల్డ్ క్రికెట్కు పరిచయమయ్యాడు. తన బ్యాటింగ్తో ప్రత్యర్ధి బౌలర్లకు వణకుపుట్టించాడు. అతడే పంజాబ్ కింగ్స్ యువ కెరటం శశాంక్ సింగ్. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో శశాంక్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్, బెయిర్ స్టో, సికిందర్ రజా వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విఫలమైన చోట.. శశాంక్ సింగ్ సత్తాచాటాడు. పంజాబ్కు ఓటమి తప్పదు అనుకున్న వేళ శశాంక్ తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్ను కొనసాగించి పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా పంజాబ్ 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ క్రమంలో ఎవరీ శశాంక్ సింగ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ శశాంక్ సింగ్? 32 ఏళ్ల శశాంక్ సింగ్ 1991 నవంబర్ 21న ముంబైలో జన్మించాడు. ప్రస్తుతం శశాంక్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఛత్తీస్గఢ్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 21 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన శశాంక్ 1072 పరుగులు చేశాడు. అంతకుముందు 2015-16 విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా లిస్ట్-ఏ క్రికెట్లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. తన లిస్ట్-ఏ కెరీర్లో ఇప్పటివరకు 30 మ్యాచ్లు ఆడిన అతడు.. 275 పరుగులు చేశాడు. అదే ఏడాదిలో సయ్యద్ ముస్తాక్ అలీతో ముంబై తరపున శశాంక్ సిం టీ20 డెబ్యూ కూడా చేశాడు. ఈ రెండో ఫార్మాట్లలో పోల్చుకుంటే టీ20ల్లో శశాంక్ మంచి రికార్డు ఉంది. ఆఖరిలో వచ్చి మెరుపులు మెరిపించడమే శశాంక్ స్పెషల్. ఇప్పటివరకు 58 టీ20 మ్యాచ్లు ఆడిన శశాంక్.. 137.34 స్ట్రైక్ రేట్తో 754 పరుగులు చేశాడు. శశాంక్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. మూడు ఫార్మాల్లో కలిపి తన పేరిట 60 వికెట్లు ఉన్నాయి. ఇక 2017లో ఐపీఎల్ కోసం అప్పటి ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) జట్టు అతన్ని 10లక్షలకు సొంతం చేసుకుంది. కానీ అతడికి అరంగేట్రం చేసే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత 2019, 2020 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అతడిని సొంతం చేసుకుంది. అక్కడ కూడా అతడికి డెబ్యూ ఛాన్స్ రాలేదు. అనంతరం ఐపీఎల్-2022 మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ అతన్ని బేస్ ప్రైస్ 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 సీజన్లో సీఎస్కేపై ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి శశాంక్ అడుగుపెట్టాడు. అయితే ఐపీఎల్-2023 మినీ వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. ఆ ఏడాది వేలంలోకి వచ్చిన శశాంక్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మళ్లీ ఐపీఎల్-2024 వేలంలో తన పేరును శశాంక్ రిజిస్టర్ చేసుకున్నాడు. కనీస ధర 20 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది అయితే వేలంలో ఇద్దరూ శశాంక్ సింగ్లు ఉండడంతో పంజాబ్ కింగ్స్ కాస్త కన్ఫ్యూజ్ అయింది. పంజాబ్ పొరపాటున వేరే శశాంక్ సింగ్ అనుకోని ఈ ఛత్తీస్ఘడ్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్ని కొనుగోలు చేసిందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత పంజాబ్ సరైన శశాంక్ సింగ్ని కొనుగోలు చేశామని క్లారిటీ ఇచ్చింది. ఇలా కన్ఫ్యూజిన్లో పంజాబ్ జట్టులోకి వచ్చిన శశాంక్ ఇప్పుడు సంచలన విజయాన్ని అందించాడు. Shashank singh, You Savior ❤️ pic.twitter.com/VyE7Z49hrO — Prayag (@theprayagtiwari) April 4, 2024 -
హర్ప్రీత్ సూపర్ క్యాచ్.. గుజరాత్ ఫ్యాన్ గార్ల్ షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్ప్రీత్ బ్రార్ సంచలన క్యాచ్తో మెరిశాడు. హర్ప్రీత్ అద్బుతమైన క్యాచ్తో గుజరాత్ ఆటగాడు విజయ్ శంకర్ను పెవిలియన్కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 18 ఓవర్లో కగిసో రబాడ నాలుగో బంతిని విజయ్ శంకర్కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో శంకర్ లాంగాఫ్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగాఫ్లో ఉన్న హర్ప్రీత్ బ్రార్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో స్టాండ్స్లో ఉన్న గుజరాత్ ఫ్యాన్ ఒక అమ్మాయి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/oG5TZzIGJ0 — Sitaraman (@Sitaraman112971) April 4, 2024 -
శుబ్మన్ గిల్ ఊచకోత.. 6 ఫోర్లు, 4 సిక్స్లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా వచ్చిన శుబ్మన్ ఆఖరి క్రీజులోకి జట్టుకు భారీ స్కోర్ సాధించాడు. గిల్ తన ట్రెడ్ మార్క్లతో అభిమానులను అలరించాడు. 48 బంతులు ఎదుర్కొన్న గిల్.. 6 ఫోర్లు, 4 సిక్స్లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో గిల్కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అదే విధంగా ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడు కూడా శుబ్మనే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో జట్టు 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్తో పాటు రాహుల్ తెవాటియా(23) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. Cricket fan might say Shubman Gill is not big match because of his World Cup final failure. But just a reminder, he was under extreme pressure in test series almost in every inning & he delivered almost every fuking time. Next generation belongs to Gillpic.twitter.com/FVBa2H6wVm — Sujeet Suman (@sujeetsuman1991) April 4, 2024 -
IPL 2024: గుజరాత్, పంజాబ్ మ్యాచ్.. విధ్వంసకర ఆటగాళ్లు దూరం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇవాళ (ఏప్రిల్ 4) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఇరు జట్ల నుంచి ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు మిస్ అయ్యారు. గాయాల కారణంగా గుజరాత్ హిట్టర్ డేవిడ్ మిల్లర్, పంజాబ్ చిచ్చరపిడుగు లియామ్ లివింగ్స్టోన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంట్రీ ఇవ్వగా.. లివింగ్స్టోన్ స్థానంలో సికందర్ రజా తుది జట్లలోకి ఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, జితేష్ శర్మ (వికెట్కీపర్), ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ సబ్స్: తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అసుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవేరప్ప గుజరాత్ టైటాన్స్ సబ్స్: బీఆర్ శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్ -
IPL 2024 GT vs PBKS : గుజరాత్పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..
IPL 2024 GT vs PBKS Live Updates: గుజరాత్పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. పంజాబ్ విజయంలో శశాంక్ సింగ్(61) కీలక పాత్ర పోషించాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్ను కొనసాగించి పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఆశుతోష్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 31 పరుగులు చేసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ ఛేదించింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, మొహిత్ శర్మ, నల్కండే తలా వికెట్ సాధించారు. 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6. క్రీజులో శశాంక్ సింగ్(57), అశుతోష్ శర్మ(31) పరుగులతో ఉన్నారు. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాలి. ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ ఔట్ 150 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన జితేష్ శర్మ.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15. 3 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 150/6. క్రీజులో శశాంక్ సింగ్(33) పరుగులతో ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. 111 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సికిందర్ రజా.. మొహిత్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 119/5. క్రీజులో శశాంక్ సింగ్(33), జితేష్ శర్మ(1) ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ ఔట్ 71 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. ఒమర్జాయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. మూడో వికెట్ డౌన్.. ప్రభు సిమ్రాన్ ఔట్ ప్రభు సిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 35 పరులు చేసిన ప్రభు సిమ్రాన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 7.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 65/3. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. బెయిర్ స్టో ఔట్ పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. నూర ఆహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. సామ్ కుర్రాన్ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 54/2. క్రీజులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(29), సామ్ కుర్రాన్(1) పరుగులతో ఉన్నారు. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ 200 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రాహుల్ తెవాటియా ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 23 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ డౌన్.. 164 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన విజయ్ శంకర్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 166/4 శుబ్మన్ గిల్ ఫిప్టీ.. శుబ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 31 బంతుల్లో గిల్ 5 ఫోర్లు, 2 సిక్స్లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 134/3 మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాయి సుదర్శన్ ఔట్ 123 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్మన్ గిల్(46) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. కేన్ మామ ఔట్ 69 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్.. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్ల్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్ : 52/1 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(16), శుబ్మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వృద్దిమాన్ సాహా.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/0 2 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 18/0 టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ రెండు ఓవర్లు ముగిసే వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(8), వృద్దిమాన్ సాహా(6) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్ జట్టులోకి కేన్ విలియమ్సన్ రాగా.. పంజాబ్ జట్టులోకి సికిందర్ రజా వచ్చాడు. తుది జట్లు పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్) జానీ బెయిర్స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్ గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే -
IPL 2024: గుజరాత్ను ఢీకొట్టనున్న పంజాబ్.. పైచేయి ఎవరిదో..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుత సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. పంజాబ్ మూడింట ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది. హెడ్ టు హెడ్ రికార్డులు.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచ్లు జరుగగా గుజరాత్ 2, పంజాబ్ ఒక మ్యాచ్లో గెలిచాయి. చివరిసారిగా (2023, మొహాలీ) ఇరు జట్లు తలపడిన మ్యాచ్లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బలాబలాలు.. ప్రస్తుత సీజన్లో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. పంజాబ్ కింగ్స్ ప్రదర్శన పేపర్పై కనిపించినంత పటిష్టంగా ఆన్ ద ఫీల్డ్ ఉండటం లేదు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్ మినహాయించి ఈ జట్టు ఆటగాళ్లు మూకుమ్మడిగా రాణించింది లేదు. శిఖర్ ధవన్, బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్, జితేశ్ శర్మ, సామ్ కర్రన్, లివింగ్స్టోన్ లాంటి ఆటగాళ్లతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నప్పటికీ వీరంతా కలిసికట్టుగా రాణించలేకపోతున్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ఈ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఆన్ ఫీల్డ్ వచ్చే సరికి తేలిపోతుంది. రబాడ, సామ్ కర్రన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ లాంటి ఇండియన్ స్టార్స్ ఉన్నప్పటికీ.. పంజాబ్ బౌలింగ్ను ప్రత్యర్దులు అవలీలగా ఎదుర్కొంటున్నారు. ఓవరాల్గా చూస్తే.. పంజాబ్ చూడటానికి బలంగా కనిపిస్తున్నా సత్ఫలితాలు మాత్రం రాబట్టలేకపోతుంది. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు అన్ని విభాగాల్లో సాధారణ జట్టులా కనిపిస్తున్నా ఆటగాళ్లంతా కలిసికట్టుగా రాణిస్తుండటంతో సత్ఫలితాలు సాధించగలుగుతుంది. గుజరాత్ బ్యాటింగ్ లైనప్లో శుభ్మన్ గిల్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్ తప్పిస్తే మిగతా వాళ్లంతా ఓ మోస్తరు బ్యాటర్లే. అయినప్పటికీ ఈ జట్టు మూడింట రెండు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, తెవాటియా చెప్పుకోదగ్గ స్టార్లు కానప్పటికీ వీరిని మ్యాచ్ విన్నర్లుగా పరిగణించవచ్చు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ జట్టు బౌలింగ్ లైనప్ పేపర్ పులి పంజాబ్ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, జాషువ లిటిల్ లాంటి విదేశీ బౌలర్లు.. ఉమేశ్ యాదవ్, మోహిత శర్మ లాంటి దేశీ పేసర్లతో గుజరాత్ బౌలింగ్ విభాగం కళకళలాడుతుంది. ఇన్ని వనరుల నేపథ్యంలో నేటి మ్యాచ్లో గుజరాత్కే విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పైగా గుజరాత్కు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పైచేయి ఎవరిదో వేచి చూడాలి. తుది జట్లు (అంచనా).. గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్కీపర్), శుభ్మన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
ఐపీఎల్ టోర్నీకి శివమ్ మావి దూరం
పక్కటెముకల గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో భారత క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేస్ బౌలర్ శివమ్ మావి ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలిగాడు. గత ఏడాది ఐపీఎల్లో రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో శివమ్ మావి సభ్యుడిగా ఉన్నాడు. అయితే అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. గత డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో లక్నో ఫ్రాంచైజీ ఏకంగా రూ. 6 కోట్ల 40 లక్షలకు శివమ్ మావిని కొనుగోలు చేసింది. -
IPL 2024 షెడ్యూల్లో మార్పులు.. బీసీసీఐ ప్రకటన
ఐపీఎల్-2024 షెడ్యూల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి రెండు కీలక మార్పులు చేసింది. ఏప్రిల్ 16, ఏప్రిల్ 17 నాటి మ్యాచ్లను రీషెడ్యూల్ చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా కోల్కతా నైట్ రైడర్స్- రాజస్తాన్ రాయల్స్ మధ్య ఏప్రిల్ 17న ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ను ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్ 16న నిర్వహించనున్నారు. మరోవైపు.. ఏప్రిల్ 16న అహ్మదాబాద్లో జరగాల్సిన గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను ఒకరోజు వాయిదా వేశారు. ఏప్రిల్ 17న ఈ మ్యాచ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే, ఈ రెండు రోజుల షెడ్యూల్ను ఈ మేరకు మార్చడానికి గల కారణాన్ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. పీటీఐ కథనం ప్రకారం.. రామ నవమి కారణంగానే కేకేఆర్- రాజస్తాన్ మ్యాచ్ను రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. కారణం ఇదేనా? పండుగ, వరుస మ్యాచ్లు, ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ పోలీసులు తగినంత భద్రత కల్పించే విషయంలో భరోసా ఇవ్వకపోవడంతోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఈ మ్యాచ్ను ఒకరోజు ముందు నిర్వహించడం లేదంటే ఒకరోజు వాయిదా వేయమని కోరగా బీసీసీఐ ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వరుస విజయాల జోష్లో కాగా కేకేఆర్ ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్లలో గెలుపొంది జోరు మీద ఉంది. తొలుత సన్రైజర్స్ హైదరాబాద్ను.. తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరును శ్రేయస్ సేన ఓడించింది. తదుపరి బుధవారం నాటి ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ కోసం విశాఖపట్నం చేరుకుంది. ఆ మ్యాచ్ తర్వాత ఏప్రిల్ 14న సొంతమైదానంలో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. రెండు మ్యాచ్లకు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ 1. ఏప్రిల్ 16- మంగళవారం- కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్- ఈడెన్ గార్డెన్స్, కోల్కతా. 2. ఏప్రిల్ 17- బుధవారం- గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్. చదవండి: బ్యాడ్న్యూస్.. మళ్లీ ధోని బ్యాటింగ్ చూడలేమా?! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మెరుపుల్లేని సన్రైజర్స్!
అహ్మదాబాద్: గత బుధవారం ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోతతో... బౌండరీల జాతరతో అదరగొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఈసారి అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయారు. ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్కు రెండో ఓటమి ఎదురైంది. గత ఏడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అలరించి సన్రైజర్స్పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మోహిత్ శర్మ 25 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి సన్రైజర్స్ను కట్టడి చేశాడు. అనంతరం గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఈ టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో ఏకంగా 277 పరుగులు సాధించిన సన్రైజర్స్ ఈసారి మెరిపించలేకపోయింది. ముంబైపై చెలరేగిపోయిన ట్రావిస్ హెడ్ (14 బంతుల్లో 19; 3 ఫోర్లు), అభిషేక్ శర్మ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు), క్లాసెన్ (13 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు) ఈసారీ దూకుడుగా ఆడినా క్రీజులో ఎక్కువసేపు నిలువలేకపోవడం సన్రైజర్స్ను దెబ్బ తీసింది. మోహిత్ శర్మ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ అవుటవ్వడంతో... 10 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ 3 వికెట్లు కోల్పోయి 74 ఇబ్బందుల్లో పడింది. చివర్లో అబ్దుల్ సమద్ (14 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు. మెహిత్ శర్మ వేసిన చివరి ఓవర్లో హైదరాబాద్ 3 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఓపెనర్లు సాహా (13 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్లు), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) 10 ఓవర్లలోపే పెవిలియన్ చేరాయి. అయితే సాయి సుదర్శన్ (36 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు కొనసాగిస్తూ మూడో వికెట్కు 64 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ అవుటైనా... విజయ్ శంకర్ (11 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు), మిల్లర్ సంయమనంతో ఆడి ఐదు బంతులు మిగిలి ఉండగానే టైటాన్స్ను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) నూర్ 19; మయాంక్ (సి) నల్కండే (బి) అజ్మతుల్లా 16; అభిõÙక్ శర్మ (సి) గిల్ (బి) మోహిత్ 29; మార్క్రమ్ (సి) రషీద్ (బి) ఉమేశ్ 17; క్లాసెన్ (బి) రషీద్ 24; షహబాజ్ (సి) తెవాటియా (బి) మోహిత్ 22; సమద్ (రనౌట్) 29; సుందర్ (సి) రషీద్ (బి) మోహిత్ 0; కమిన్స్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–34, 2–58, 3–74, 4–108, 5–114, 6–159, 7–159, 8–162. బౌలింగ్: అజ్మతుల్లా ఒమర్జాయ్ 3–0–24–1, ఉమేశ్ యాదవ్ 3–0–28–1, రషీద్ ఖాన్ 4–0–33–1, నూర్ అహ్మద్ 4–0–32–1, మోహిత్ శర్మ 4–0–25–3, దర్శన్ నల్కండే 2–0–18–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కమిన్స్ (బి) షహబాజ్ 25; గిల్ (సి) సమద్ (బి) మార్కండే 36; సాయి సుదర్శన్ (సి) అభిషేక్ శర్మ (బి) కమిన్స్ 45; మిల్లర్ (నాటౌట్) 44; విజయ్ శంకర్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–36, 2–74, 3–138. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–0, షహబాజ్ అహ్మద్ 2–0–20–1, జైదేవ్ ఉనాద్కట్ 3.1–0–33–0, వాషింగ్టన్ సుందర్ 3–0–27–0, మయాంక్ మార్కండే 3–0–33–1, కమిన్స్ 4–0–28–1. ఐపీఎల్లో నేడు ముంబై X రాజస్తాన్ వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
అదే మా కొంపముంచింది.. లేదంటేనా మాదే విజయం: కమ్మిన్స్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవి చూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్,బౌలింగ్ రెండింటిలోనూ సన్రైజర్స్ విఫలమైంది. 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. ఇది ఎస్ఆర్హెచ్కు రెండో ఓటమి కావడం గమనార్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ పరంగా తాము విఫలమయ్యామని కమ్మిన్స్ తెలిపాడు. "ఆటలో గెలుపుటములు సహజం. ఈ మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడాం. మేము తొలుత బ్యాటింగ్లో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్ధితి మరో విధంగా ఉండేది. కానీ గుజరాత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మేము వరుస క్రమంలో వికెట్ల కోల్పోయాం. కనీసంలో మాలో ఎవరో ఒకరైనా ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధించింటే బాగుండేది. తొలి రెండు మ్యాచ్ల్లో మేము బాగా బ్యాటింగ్ చేశాము. కానీ ఈ మ్యాచ్లో మా ప్రణాళిలకను అమలు చేయడంలో విఫలమయ్యాం. ఈ రోజు పిచ్ కూడా బాగానే ఉంది. తొలుత వికెట్ కొంచెం స్లోగా ఉంటుందని భావించాము. కానీ రెండు ఇన్నింగ్స్ల్లోనూ వికెట్ ఒకేలా ఉంది. మా తర్వాతి మ్యాచ్ల్లో తిరిగి పుంజుకుంటామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఎస్ఆర్హెచ్ తమ తర్వాతి మ్యాచ్లో ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. -
IPL 2024: సమిష్టిగా రాణించిన టైటాన్స్..సన్రైజర్స్కు శృంగభంగం
అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. ఫలితంగా భీకర ఫామ్లో ఉండిన సన్రైజర్స్కు శృంగభంగం ఎదురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ సిక్సర్ బాది మ్యాచ్ ముగించాడు. సన్రైజర్స్ దూకుడుకు ఆడ్డుకట్ట వేసిన గుజరాత్ బౌలర్లు.. సూపర్ ఫామ్లో ఉన్న సన్రైజర్స్ బ్యాటర్లకు ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి సన్రైజర్స్ను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. తొలి రెండు మ్యాచ్ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కే పరిమితమైంది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. ఆడుతూపాడుతూ.. 163 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆది నుంచి నిలకడగా ఆడిన గుజరాత్ బ్యాటర్లు ఒక్కో పరుగు పేర్చుకుంటూ విజయం దిశగా సాగారు. సాహా (25), గిల్ (36), సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ (44 నాటౌట్), విజయ్ శంకర్ (14 నాటౌట్) తలో చేయి వేసి గుజరాత్ను గెలిపించారు. సన్రైజర్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మార్కండే, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2024 GT Vs SRH: లేటు వయసులో ఇరగదీస్తున్న మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ వెటరన్ పేసర్ మోహిత్ శర్మ 35 ఏళ్ల లేటు వయసులో ఇరగదీస్తున్నాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సొంత మైదానంలో సన్రైజర్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో మోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మరింత చెలరేగిన మోహిత్.. ఆ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లలో మోహిత్ అద్భుత ప్రదర్శన ఈ మ్యాచ్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లన్నింటిలో మోహిత్ సూపర్ బౌలింగ్తో (చివరి ఓవర్లలో) ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చిన మోహిత్.. ఆతర్వాత సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 19 పరుగులిచ్చాడు. 16th over vs MI: 4 runs. 18th over vs MI: 9 runs. 18th over vs CSK: 11 runs. 20th over vs CSK: 8 runs. 18th over vs SRH: 10 runs. 20th over vs SRH: 2 runs. End overs masterclass from Mohit Sharma in IPL 2024 - What a performance by the 35-year-old. 👌 pic.twitter.com/ss8Greq04Y — Johns. (@CricCrazyJohns) March 31, 2024 ప్రస్తుతం సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ మోహిత్ అదే తరహాలో బౌలింగ్ చేసి తన కోటా చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుత సీజన్లో మోహిత్ ప్రదర్శన చూసి గుజరాత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోహిత్ మాస్టర్ క్లాస్ బౌలర్ అంటూ కితాబునిస్తున్నారు. కాగా, సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేసి జోరు మీదుండిన సన్రైజర్స్కు అడ్డుకట్ట వేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. తొలి రెండు మ్యాచ్ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో నామమాత్రపు స్కోర్కు పరిమితం కావడంతో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. 163 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇచ్చి వృద్దిమాన్ సాహా (25) ఔటయ్యాడు. గిల్కు (11) జతగా సాయి సుదర్శన్ క్రీజ్లోకి వచ్చాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 45/1గా ఉంది. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే 90 బంతుల్లో 118 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. -
IPL 2024: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. షమీ రికార్డు బద్దలు
గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ ఖాన్ రికార్డులెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ను ఔట్ చేసిన రషీద్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. రషీద్ ఇప్పటివరకు ఐపీఎల్లో గుజరాత్ తరపున 49 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ(48) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో షమీని రషీద్ అధిగమించాడు. కాగా ఈ ఏడాది సీజన్కు గాయం కారణంగా మహ్మద్ షమీ దూరమైన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
IPL 2024: సన్రైజర్స్ జోరుకు అడ్డుకట్ట వేసిన గుజరాత్ బౌలర్లు
ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సూపర్ ఫామ్లో ఉన్న సన్రైజర్స్ బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేశారు. ఫలితంగా సన్రైజర్స్ 162 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. After two consecutive powerhouse performances, the Sunrisers Hyderabad have failed to replicate their high-scoring form against Gujarat Titans. pic.twitter.com/9zBSWI9sXK — CricTracker (@Cricketracker) March 31, 2024 గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేసి జోరు మీదుండిన సన్రైజర్స్కు అడ్డుకట్ట వేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. తొలి రెండు మ్యాచ్ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో నామమాత్రపు స్కోర్కు పరిమితం కావడంతో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. అహ్మదాబాద్ పిచ్ చాలా స్లోగా కనిపిస్తుంది. సన్రైజర్స్ బౌలర్లకు కూడా ఇది కలిసొస్తుంది. -
IPL 2024: సన్రైజర్స్తో మ్యాచ్.. ఆడుతూపాడుతూ విజయం సాధించిన గుజరాత్
సన్రైజర్స్తో మ్యాచ్.. ఆడుతూపాడుతూ విజయం సాధించిన గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. డేవిడ్ మిల్లర్ (44 నాటౌట్) సిక్సర్ బాది మ్యాచ్ ముగించాడు. గుజరాత్ ఇన్నింగ్స్లో సాహా 25, గిల్ 36, సాయి సుదర్శన్ 45, విజయ్ శంకర్ 14 (నాటౌట్) పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మార్కండే, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేసి సన్రైజర్స్ను నామమాత్రపు స్కోర్కే పరిమతం చేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్ 163 పరుగుల ఛేదనలో గుజరాత్ ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 14 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి విజయానికి మరో 36 పరుగుల దూరంలో ఉంది. సాయి సుదర్శన్ (36), మిల్లర్ (10) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ 9.1వ ఓవర్: 74 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. మయాంక్ మార్కండే బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (36) ఔటయ్యాడు. లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్ 163 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనలో గుజరాత్ నిదానంగా అడుగులు వేస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 36, సాయి సుదర్శన్ 13 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. 66 బంతుల్లో 89 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 163.. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 4.1వ ఓవర్: 36 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇచ్చి వృద్దిమాన్ సాహా (25) ఔటయ్యాడు. గిల్కు (11) జతగా సాయి సుదర్శన్ క్రీజ్లోకి వచ్చాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 45/1గా ఉంది. 162 పరుగులకే పరిమితమైన సన్రైజర్స్ గుజరాత్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్.. మార్క్రమ్ ఔట్ 14.4వ ఓవర్: రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్ పట్టి మార్క్రమ్ను పెవిలియన్కు సాగనంపాడు. ఉమేశ్ బౌలింగ్లో మార్క్రమ్ (17) ఔటయ్యాడు. సన్రైజర్స్ స్కోర్ 114/5గా ఉంది. షాబాజ్ అహ్మద్కు (6) జతగా అబ్దుల్ సమద్ క్రీజ్లోకి వచ్చాడు. క్లాసెన్ను బోల్తా కొట్టించిన రషీద్ ఖాన్ 13.4వ ఓవర్: భీకరఫామ్లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ను (24) రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 109/4గా ఉంది. మార్క్రమ్ (17), షాబాజ్ అహ్మద్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈజీ క్యాచ్ ఇచ్చి ఔటైన అభిషేక్ 10వ ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ (29) ఔటయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్లో గిల్కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 74/3గా ఉంది. మార్క్రమ్ (7), క్లాసెన్ (0) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన సన్రైజర్స్.. హెడ్ ఔట్ 6.4 ఓవర్: 58 పరుగుల వద్ద సన్రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్లో ట్రవిస్ హెడ్ (19) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 60/2గా ఉంది. అభిషేక్ శర్మ (20), మార్క్రమ్ (2) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సన్రైజర్స్ 34 పరుగుల వద్ద (4.2 ఓవర్) సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఒమర్జాయ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (16) ఔటయ్యాడు. హెడ్కు (16) జతగా అభిషేక్ శర్మ క్రీజ్లోకి వచ్చాడు. ధాటిగా ప్రారంభించిన సన్రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ తొలి ఓవర్ నుంచి గుజరాత్పై ఎదురుదాడిని ప్రారంభించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్.. ఒమర్జాయ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు బౌండరీలతో ఊచకోతను స్టార్ట్ చేశాడు. ఆతర్వాత రెండు, మూడు, నాలుగు ఓవర్లలో కూడా ఓ మోస్తరుగా పరుగులు వచ్చాయి. 4 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 34/0గా ఉంది. మయాంక్ అగర్వాల్ (16), ట్రవిస్ హెడ్ (16) క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 31) సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో సన్రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో సన్రైజర్స్, గుజరాత్ చెరో మ్యాచ్ (రెండు మ్యాచ్ల్లో) గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను మట్టికరిపించిన గుజరాత్.. రెండో మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓటమిని ఎదుర్కొన్న సన్రైజర్స్.. ముంబైపై బంపర్ విక్టరీని నమోదు చేసింది. ఇక నేటి మ్యాచ్లో సన్రైజర్స్ పాత జట్టునే యధాతథంగా కొనసాగించగా.. గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్పెన్సర్ జాన్సన్, సాయి కిషోర్ స్థానాల్లో నూర్ అహ్మద్, నల్కండే తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), శుభ్మన్ గిల్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే సన్రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ -
విధ్వంసకర బ్యాటింగ్..మరోసారి మోత మోగేనా ?
-
గుజరాత్ కి సన్ స్ట్రోక్ తగిలేనా ?
-
GT vs SRH: విధ్వంసకర బ్యాటింగ్.. మరోసారి మోత మోగేనా?
IPL 2024 GT vs SRH: సొంత గడ్డపై రికార్డుల మోత మోగించిన సన్రైజర్స్ హైదరాబాద్ సరికొత్త ఉత్సాహంతో అహ్మదాబాద్లో అడుగుపెట్టింది. ఐపీఎల్-2024లో తమ మూడో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో పోరుకు సిద్ధమైంది. కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఇప్పటిదాకా సన్రైజర్స్- టైటాన్స్ చెరో విజయం నమోదు చేశాయి. తమ ఆరంభ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిన సన్రైజర్స్.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277) నమోదు చేసి.. లక్ష్యాన్ని కాపాడుకుంది. ముంబైని 31 పరుగుల తేడాతో ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలిచి.. తదుపరి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. ఇప్పుడు సొంతమైదానంలో సన్రైజర్స్తో మరుసటి మ్యాచ్లో తలపడనుంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్ల ముఖాముఖి రికార్డు గమనిస్తే.. ఎదురుపడిన మూడు సందర్భాల్లో సన్రైజర్స్ టైటాన్స్ చేతిలో రెండుసార్లు ఓటమిని చవిచూసి.. ఒక్కసారి గెలిచింది. అయితే, ఇప్పుడు ఇరుజట్ల కెప్టెన్లు మారారు. సన్రైజర్స్కు ప్యాట్ కమిన్స్.. టైటాన్స్కు శుబ్మన్ గిల్ సారథులుగా వచ్చారు. ఇదిలా ఉంటే.. ముంబైతో మ్యాచ్లో దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అదిరే ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. గత రెండు మ్యాచ్లలోనూ వీరిద్దరు మెరుపు ఇన్నింగ్స్తో ప్రత్యర్థి బౌలర్లను తిప్పలు పెట్టారు. కోల్కతాతో మ్యాచ్లో అభిషేక్ 19 బంతుల్లో 32, క్లాసెన్ 29 బంతుల్లోనే ఏకంగా 63 పరుగులు సాధించారు. ఇక ముంబై ఆటగాళ్ల బౌలింగ్ను ఎలా ఊచకోత కోశారో తెలిసిందే. అభిషేక్ 23 బంతుల్లోనే 63, క్లాసెన్ 34 బంతుల్లోనే 80(నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరికి తోడు టాపార్డర్లో ట్రవిస్ హెడ్, ఐడెన్ మార్క్రమ్ కూడా రాణిస్తుండటం సన్రైజర్స్కు సానుకూలాంశం. ఇక బౌలింగ్ విభాగంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు మరో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా తప్పకుండా ప్రభావం చూపగలడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, ఓపెనర్ శుబ్మన్ గిల్ ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. గత సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన గిల్.. తాజా ఎడిషన్ తొలి మ్యాచ్లో 22 బంతుల్లో 31 పరుగులతో పర్వాలేదనిపించినా.. రెండో మ్యాచ్లో 8 పరుగులకే పరిమితమై నిరాశపరిచాడు. టాపార్డర్లో సాయి సుదర్శన్ తప్ప ఇంకెవరూ ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేకపోయారు. ఇక మహ్మద్ షమీ గాయం కారణంగా దూరం కావడం, హార్దిక్ పాండ్యా జట్టును వీడటంతో బౌలింగ్ విభాగం బలహీనమైంది. ఉమేశ్ యాదవ్ రాణిస్తున్నా నిలకడగా ఆడాల్సి ఉంది. రషీద్ ఖాన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ రాణించడం సానుకూలాంశం. తుదిజట్లు అంచనా గుజరాత్ టైటాన్స్ శుబ్మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, ఆర్. సాయికిషోర్. ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, షారుఖ్ ఖాన్. సన్రైజర్స్ హైదరాబాద్ ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్. ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్: టి. నటరాజన్, ట్రవిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హక్ ఫారూకీ. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్గన్’ -
#GT: ఓటమి బాధలో ఉన్న శుబ్మన్ గిల్కు భారీ షాక్
ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు రూ. 12 లక్షల మేర అతడికి భారీ జరిమానా విధించారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్పై గెలిచి శుభారంభం చేసిన టైటాన్స్.. మంగళవారం నాటి మ్యాచ్లో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ఏకంగా 63 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సమిష్ట వైఫల్యంతో పరాభవం చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా కెప్టెన్ శుబ్మన్కు ఫైన్ పడింది. ఈ మేరకు.. ‘‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో.. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్లో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు జరిమానా విధిస్తున్నాం. ఈ సీజన్లో ఇది గుజరాత్ టైటాన్స్ తొలి తప్పిదం కాబట్టి.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనల ప్రకారం గిల్కు రూ. 12 లక్షల ఫైన్ వేస్తున్నాం’’ అని ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా చెన్నైతో మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ చేసింది. అయితే, ఓపెనర్లు రచిన్ రవీంద్ర(46), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(46), ఆల్రౌండర్ శివం దూబే(23 బంతుల్లో 51) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్, ఓపెనర్ శుబ్మన్ గిల్ ఈ మ్యాచ్లో 5 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో కేవలం ఎనిమిది పరుగులు చేయగలిగాడు. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(37) గుజరాత్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 Shubman with the license to Gill 😎 Rate that six on a scale of 10 using #IPLonJioCinema!#CSKvGT #TATAIPL pic.twitter.com/OjOlRrXmN3 — JioCinema (@JioCinema) March 26, 2024 ఇక ఈ సీజన్లో తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. కాగా ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టినగుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే చాంపియన్గా నిలిచింది. గతేడాది రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ రెండు సందర్భాల్లో గుజరాత్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్కాగా.. ఐపీఎల్-2024కు ముందు ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో శుబ్మన్ గిల్ టైటాన్స్ పగ్గాలు చేపట్టాడు. ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గుజరాత్ను గెలిపించాడు. చదవండి: #MSDhoni: ఆదేశాల కోసం ఎవరిని చూడాలో అర్థం కావడం లేదు: CSK స్టార్ -
ధోనితో వాదించిన రుతురాజ్.. ఎవరి ఆదేశాలు పాటించాలి?
'I've to look at both Dhoni and Ruturaj for instructions: గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చహర్. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(21), కెప్టెన్ శుబ్మన్ గిల్(8) రూపంలో రెండు కీలక వికెట్లు తీసి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెపాక్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 28 పరుగులే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్తో మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సీఎస్కే అదరగొట్టిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ను 143 పరుగులకే కట్టడి చేసి.. 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం దీపక్ చహర్ జియో సినిమాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ నుంచి చహర్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘బౌలింగ్ చేసేటపుడు నువ్వు ధోనితో చర్చిస్తావా? లేదంటే గైక్వాడ్తోనా? ఆదేశాల కోసం ఎవరివైపు చూస్తావు?’ అని గావస్కర్ అడిగాడు. ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదు ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఇప్పుడు మహీ భాయ్, రుతురాజ్.. ఇద్దరి వైపూ చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి మహీ భాయ్ను చూడాలా లేదంటే రుతురాజ్ను చూడాలా అన్నది అర్థం కావడం లేదు. ఆ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఏదేమైనా రుతురాజ్ తనదైన శైలిలో సమర్థవంతంగానే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు’’ అని దీపక్ చహర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్కరోజు ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న ధోని.. పగ్గాలను రుతురాజ్కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో మాత్రం ధోని జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. కొత్త నిబంధనలు మాకే ఉపయోగకరం ఈ క్రమంలో గుజరాత్తో మ్యాచ్లో రుతురాజ్ ధోనితో వాదించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల గురించి మాట్లాడుతూ.. ‘‘సీఎస్కేకు ఆడుతున్న తొలినాళ్ల నుంచే పవర్ ప్లేలో నేను మూడు ఓవర్లు బౌల్ చేస్తున్నా. కొత్త నిబంధనలకు అనుగుణంగానే నా ఆట తీరులో మార్పు చేసుకుంటున్నా. గతంలో ఆరంభ ఓవర్లోనే 2-3 బౌన్సర్లు వేస్తే.. ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉండేవారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఒక ఓవర్లో కేవలం రెండు బౌన్సర్లకే అనుమతినిచ్చారు. పేసర్లకు ఈ రూల్ అనుకూలంగా ఉంది. పెద్దగా తేమ లేని వికెట్పై బంతిపై గ్రిప్ సాధించేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని చహర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మెరుపు అర్ధ శతకం(23 బంతుల్లో 51)తో చెలరేగిన సీఎస్కే ఆల్రౌండర్ శివం దూబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: #Rohit Sharma: రోహిత్ శర్మ ఫ్లైయింగ్ కిస్.. ఫొటోలు డిలీట్ చేసిన సన్రైజర్స్ -
గుజరాత్పై చెన్నై సూపర్కింగ్స్ ఘన విజయం (ఫొటోలు)
-
CSK Vs GT: చెన్నై ధనాధన్ గెలుపు
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ ఆల్రౌండ్ షోకు నిరుటి రన్నరప్ గుజరాత్ టైటాన్స్ పోరాటం వదిలి చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్పై ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (23 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్లు), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. సాయి సుదర్శన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. పరుగుల తేడా పరంగా ఐపీఎల్లో గుజరాత్కిదే అతిపెద్ద ఓటమి. చెన్నై బౌలర్లు దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, ముస్తఫిజుర్ తలా 2 వికెట్లు తీశారు. ముందు రచిన్... తర్వాత దూబే... చెన్నై ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లు, తర్వాత 10 ఓవర్లు అన్నట్లుగా రెండు దశలూ ధనాధన్గా సాగింది. తొలి దశను ఓపెనర్ రచిన్ దూకుడుగా మొదలుపెట్టాడు. అతను క్రీజులో ఉన్నది కాసేపే అయినా... భారీ షాట్లతో విరుచుకుపడటంతో మెరుపు వేగంతో చెన్నై స్కోరు దూసుకెళ్లింది. ఆరో ఓవర్ రెండో బంతికి రషీద్ అతని జోరుకు కళ్లెం వేశాడు. ఓపెనింగ్ జోడీ 32 బంతుల్లో 62 పరుగులు జతచేయగా, ఇందులో 46 పరుగులు ఒక్క రచిన్వే కావడం విశేషం. తర్వాత రహానే (12), కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైను నడిపించారు. 10 ఓవర్లలో చెన్నై 104/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే రహానే అవుట్కాగా... శివమ్ దూబే రావడంతో రెండో దూకుడు కొత్తగా మొదలైంది. స్పిన్, పేస్ ఏ బౌలర్కు తలొగ్గకుండా దూబే బ్యాట్ దంచేసింది. మిచెల్ (20 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అండతో శివమెత్తడంతో... ఈ జోడీ కూడా 35 బంతుల్లో 57 పరుగులు జోడించింది. 22 బంతుల్లో దూబే అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. సమీర్ రిజ్వీ (6 బంతుల్లో 14; 2 సిక్స్లు) మెరుపులతో చెన్నై స్కోరు 200 పైచిలుకు చేరింది. టైటాన్స్ వల్ల కాలేదు! కొండంత లక్ష్యం చూసే గుజరాత్ భీతిల్లినట్లుంది. ఓపెనర్లు మొదలు ఆఖరి వరుసదాకా అందరి బ్యాటర్లదీ అదే తీరు! ఛేదించాల్సిన లక్ష్యం కోసం ఆడాల్సిన తీరు ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. పవర్ప్లేలోనే కెపె్టన్ శుబ్మన్ గిల్ (8), సాహా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) పెవిలియన్కు వెళ్లిపోయారు. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ టాప్స్కోరర్గా నిలిచాడు. కానీ మెరిపించలేదు... కాసేపైనా మురిపించ లేదు. హిట్టర్లు విజయ్ శంకర్ (12), మిల్లర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ తెవాటియా (6) అంతా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్కు వికెట్లు అప్పగించేశారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) సాహా (బి) జాన్సన్ 46; రచిన్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ ఖాన్ 46; రహానే (స్టంప్డ్) సాహా (బి) సాయికిషోర్ 12; దూబే (సి) శంకర్ (బి) రషీద్ ఖాన్ 51; మిచెల్ (నాటౌట్) 24; సమీర్ రిజ్వీ (సి) మిల్లర్ (బి) మోహిత్ 14; జడేజా (రనౌట్) 7; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–62, 2–104, 3–127, 4–184, 5–199, 6–206. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–30–0, ఉమేశ్ 2–0–27–0, రషీద్ ఖాన్ 4–0–49–2, సాయికిషోర్ 3–0–28–1, జాన్సన్ 4–0–35–1, మోహిత్ శర్మ 4–0–36–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) తుషార్ (బి) దీపక్ 21; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్ 8; సాయి సుదర్శన్ (సి) సమీర్ (బి) పతిరణ 37; విజయ్ శంకర్ (సి) ధోని (బి) మిచెల్ 12; మిల్లర్ (సి) రహానే (బి) తుషార్ 21; అజ్మతుల్లా (సి) రచిన్ (బి) తుషార్ 11; తెవాటియా (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 6; రషీద్ ఖాన్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 1; ఉమేశ్ (నాటౌట్) 10; జాన్సన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–28, 2–34, 3–55, 4–96, 5–114, 6–118, 7–121, 8–129. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–28–2, ముస్తఫిజుర్ 4–0–30–2, తుషార్ దేశ్పాండే 4–0–21–2, జడేజా 2–0–15–0, మిచెల్ 2–0–18–1, పతిరణ 4–0–29–1. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X ముంబై వేదిక: హైదరాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs GT: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 63 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే మాత్రమే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్ 37 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్పాండే, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతమకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ధోని సూపర్ క్యాచ్.. ఈ మ్యాచ్లో సీఎస్కే వికెట్ కీపర్ ఎంఎస్ ధోని సంచలన క్యాచ్తో మెరిశాడు. 42 ఏళ్ల వయస్సులోనూ ధోని తన వికెట్ కీపింగ్తో ఔరా అన్పించాడు. అద్బుతమైన క్యాచ్తో గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్ను ధోని పెవిలియన్కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో డారిల్ మిచెల్ మూడో బంతిని విజయ్ శంకర్కు ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. ఈ క్రమంలో విజయ్ శంకర్ వర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు వెళ్లింది. దీంతో వికెట్ల వెనక ఉన్న ధోని చిరుత పులిలా డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 -
CSK Vs GT: రషీద్ ఖాన్కే చుక్కలు చూపించాడు.. ఎవరీ సమీర్ రిజ్వీ?
చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు సమీర్ రిజ్వీ తన ఐపీఎల్ కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. ఐపీఎల్లో తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్గా మలిచాడు సమీర్ రిజ్వీ. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రిజ్వీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్కే ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో రెండో బంతికి శివమ్ దూబే ఔటయ్యాడు. అయితే రవీంద్ర జడేజా బ్యాటింగ్కు వస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా యువ ఆటగాడు రిజ్వీకి సీఎస్కే మెనెజ్మెంట్ ప్రమోషన్ ఇచ్చింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిజ్వీ.. తన ఎదుర్కొన్న తొలి బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. స్వ్కెర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. దీంతో రషీద్ ఖాన్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన..మళ్లీ ఆఖరి బంతికి లాంగాఫ్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి రిజ్వీ ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రిజ్వీ.. 2 సిక్స్ల సాయంతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో ఎవరీ సమీర్ రిజ్వీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ సమీర్ రిజ్వీ? 20 ఏళ్ల సమీర్ రిజ్వీ ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్లో జన్మించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఉత్తర్ ప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2020లో మధ్యప్రదేశ్తో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్తో రిజ్వీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే రిజ్వీకు టీ20 క్రికెట్లో మంచి రికార్డు ఉంది. కేవలం 9 ఇన్నింగ్స్లలో రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు చేశాడు. గతేడాది జరిగిన యూపీ టీ20 లీగ్లో రిజ్వీ దుమ్మురేపాడు. ఈ లీగ్లో కన్పూర్ సూపర్ స్టార్స్ తరపున ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ.. 455 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రిజ్వీ అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఓవరాల్గా 18 సిక్స్లు రిజ్వీ కొట్టాడు. ఈ క్రమంలో తన పేరును ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఐపీఎల్-2024 మినీవేలంతో అతడి దశ తిరిగిపోయింది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే తుది జట్టులో రిజ్వీ ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు. గుజరాత్తో మ్యాచ్లో తనకు వచ్చిన అవకాశాన్ని రిజ్వీ సద్వినియోగపరుచుకున్నాడు. SAMEER RIZVI SMASHED RASHID KHAN FOR A SIX IN HIS FIRST BALL. 🔥pic.twitter.com/voISGlBpO5 — Johns. (@CricCrazyJohns) March 26, 2024 -
కెప్టెన్సీ కొత్త కదా బ్రో.. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందిలే! వీడియో వైరల్
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2024 సీజన్తో గుజరాత్ సారధిగా గైక్వాడ్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే విజయాన్ని అందుకున్నాడు ఇండియన్ క్రికెట్ ప్రిన్స్. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్ తమ రెండో మ్యాచ్లో చెపాక్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ త నిర్ణయాన్ని వెల్లడించడంలో కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. అతడు పొరపాటున 'ఫస్ట్ బ్యాటింగ్' చేస్తానని చెప్పాడు. వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుంటూ 'సారీ సారీ, బౌల్ ఫస్ట్' అంటూ మ్యాచ్ రిఫరీకి గిల్ తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Shubman Gill won the toss, but got confused and said we're batting first and later said 'sorry, bowl, bowl first'. #CSKvsGT #IPLUpdate #IPL2024 #Dhoni #CSK #Thala #chepauk#gujrat #IPLonJioCinema pic.twitter.com/0xBDdsOAtE — Pritish Bali (@skull_88888) March 26, 2024 -
గుజరాత్ను చిత్తు చేసిన సీఎస్కే.. వరుసగా రెండో విజయం
Gujarat Titans And Chennai super kings Live Updates: గుజరాత్ను చిత్తు చేసిన సీఎస్కే ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 63 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే మాత్రమే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్పాండే, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్ పడగొట్టాడు. నాలుగో వికెట్ డౌన్ 96 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్.. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 42 బంతుల్లో 103 పరుగులు కావాలి. క్రీజులో సాయిసుదర్శన్(31), ఒమర్జాయ్(3) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. శంకర్ ఔట్ 55 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన విజయ్ శంకర్.. మిచిల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 57/3 రెండో వికెట్ డౌన్.. షా ఔట్ గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన వృద్దిమాన్ షా.. దీపక్ చాహర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 34/2 తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్.. గిల్ ఔట్ 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. దీపక్ చాహర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 28/1 గుజరాత్ టార్గెట్ 207 పరుగులు గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటర్లు విధ్వంసం సష్టించారు. రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్లు), శివమ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, జాన్సన్, మొహిత్ శర్మ తలా వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. దూబే ఔట్ 184 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన శివమ్ దూబే.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 165/3 16 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(41), డార్లీ మిచెల్(14) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. గైక్వాడ్ ఔట్ 127 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 13 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 128/3 రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే. . రహానే ఔట్ 105 పరుగుల వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అజింక్యా రహానే.. సాయికిషోర్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు. తొలి వికెట్ డౌన్.. రవీంద్ర ఔట్ 69 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. రషీద్ ఖాన్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. దంచికొడుతున్న రవీంద్ర.. 5 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 58/0 గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే ఓపెనర్ రచిన్ రవీంద్ర దంచి కొడుతున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. రవీంద్ర ప్రస్తుతం 42 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 5 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 58/0 2 ఓవర్లకు సీఎస్కే స్కోర్:13/0 టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(11), గైక్వాడ్(1) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సీఎస్కే మాత్రం ఒక మార్పు చేసింది. థీక్షణ స్ధానంలో పతిరానా తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు గుజరాత్ టైటాన్స్: శుబ్మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్ -
IPL 2024: గుజరాత్ అంటే చాలు రుతురాజ్కు పూనకం వస్తుంది..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 26) రసవత్తర సమరం జరుగనుంది. గత సీజన్ విజేత సీఎస్కే.. ఫైనలిస్ట్ గుజరాత్ టైటాన్స్ ఇవాళ తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ల్లో విజయాలు సాధించి జోష్లో ఉన్నాయి. సీఎస్కే తమ తొలి మ్యాచ్లో ఆర్సీబీపై.. గుజరాత్ తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలుపొందాయి. గుజరాత్ అంటే చాలు రుతురాజ్కు పూనకం వస్తుంది.. ఈ సీజన్లో సీఎస్కే పగ్గాలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. గుజరాత్ టైటాన్స్పై ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. రుతు గుజరాత్తో తలపడిన ఐదు మ్యాచ్ల్లో ఏకంగా నాలుగు అర్ద శతకాలు బాదాడు. 2022 సీజన్లో గుజరాత్తో ఆడిన రెండు మ్యాచ్ల్లో (73, 53) హాఫ్ సెంచరీలు బాదిన రుతు.. గత సీజన్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో మరో రెండు హాఫ్ సెంచరీలు (92, 60) చేశాడు. రుతు గుజరాత్తో చివరిసారిగా గత సీజన్ ఫైనల్లో తలపడ్డాడు. ఆ మ్యాచ్లో అతను 16 బంతుల్లో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. గుజరాత్పై రుతురాజ్ 5 మ్యాచ్ల్లో 60.80 సగటున 146.86 స్ట్రయిక్రేట్తో 304 పరుగులు చేశాడు. గుజరాత్పై రుతురాజ్కు వ్యక్తిగతంగా మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ.. జట్టుగా గుజరాత్దే సీఎస్కేపై పైచేయిగా ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో ఎదురెదురుపడిన ఐదు సందర్భాల్లో మూడింట గుజరాత్.. రెండు మ్యాచ్ల్లో చెన్నై విజయాలు సాధించాయి. చివరిసారిగా ఈ ఇరు జట్లు గత సీజన్ ఫైనల్లో తలపడగా.. ఆ మ్యాచ్లో సీఎస్కే విజయం సాధించి, ఐదోసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. -
IPL 2024: సీఎస్కేపై గుజరాత్దే పైచేయి..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 26) రసవత్తర సమరం జరుగనుంది. గత సీజన్ విజేత సీఎస్కే.. ఫైనలిస్ట్ గుజరాత్ టైటాన్స్ ఇవాళ తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ల్లో విజయాలు సాధించి జోష్లో ఉన్నాయి. సీఎస్కే తమ తొలి మ్యాచ్లో ఆర్సీబీపై.. గుజరాత్ తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలుపొందాయి. ఈ మ్యాచ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సీజన్లో ఇరు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. గతేడాది గుజరాత్కు హార్దిక్.. సీఎస్కేకు ధోని సారధ్యం వహించగా.. ఈ ఏడాది గుజరాత్ను గిల్, సీఎస్కేను రుతురాజ్ ముందుండి నడిపిస్తున్నారు. ఈ ఇద్దరు యువ కెప్టెన్లు నేటి మ్యాచ్లో ఎలాంటి వ్యూహరచనలు చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. సీఎస్కేపై గుజరాత్ స్వల్ప పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 3, సీఎస్కే 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు గత సీజన్ ఫైనల్లో చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్లో సీఎస్కే.. గుజరాత్ను ఓడించి, ఐదో సారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. వాతావరణం ఎలా ఉందంటే.. చెపాక్లో ఇవాల్టి వాతావరణం ఆటకు ఆనువుగా ఉంటుంది. వాతావరణం నుంచి మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. మ్యాచ్ జరిగే సమయంలో (7:30-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేళల్లో ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. పిచ్ ఎవరికి అనుకూలం.. ఈ సీజన్లో చెపాక్లో ఇది రెండో మ్యాచ్. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించినప్పటికీ.. సీఎస్కే పేసర్ ముస్తాఫిజుర్ అనూహ్య స్వింగ్ను పొందాడు. సహజంగా ఛేదనకు అనుకూలించని ఈ పిచ్పై సీఎస్కే 174 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. దీన్ని బట్టి చూస్తే ఈ పిచ్పై తొలుత బౌలింగ్ చేసే జట్టుకు ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. సొంత మైదానంలో ఆడనుండటంతో ఈ మ్యాచ్లో సీఎస్కేకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. -
#MIvsGT: సూపర్ టాలెంట్.. బుమ్రాకు మాత్రమే సాధ్యం! వీడియో
#MIvGT- JASPRIT BUMRAH Super Spell Video: గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఈ పేస్ గుర్రం నైపుణ్యాలకు అభిమానులతో పాటు దిగ్గజ బౌలర్లు సైతం ఫిదా అయ్యారు. 0,0,0,4,0,వికెట్,1,0,1,0,0,0,వికెట్,1,వికెట్,0,0,1,1లెగ్బై,1,2,1,1,1 - నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు(3/14). గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో బుమ్రా అద్భుత స్పెల్ను చాటిచెప్పే గణాంకాలు. Just Bumrah Things 🤷♂️@Jaspritbumrah93 on target in his first over 👏#GT reach 47/1 after 6 overs Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/Zt6vIEa0me — IndianPremierLeague (@IPL) March 24, 2024 ఈ నేపథ్యంలో బుమ్రా ఆట తీరును ప్రశంసిస్తూ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా సాహాను బౌల్డ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘తన ట్రేడ్మార్క్ స్కిల్ ఇది. పేస్తో బ్యాటర్ను ముప్పుతిప్పలు పెట్టగల సత్తా అతడి సొంతం. అత్యద్భుతమైన నైపుణ్యాలు, ప్రతిభ అతడికి ఉన్నాయి. అందుకే వ్యూహాలను పక్కాగా అమలు చేసి ప్రతిసారి విజయవంతమవుతాడు’’ అని బ్రాడ్.. బుమ్రాను కొనియాడాడు. 1️⃣ brings 2️⃣ Three wickets in the match for @Jaspritbumrah93 👏 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT#TATIPL | #GTvMI | @mipaltan pic.twitter.com/XXH33C7Yq6 — IndianPremierLeague (@IPL) March 24, 2024 కాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(19) అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన బుమ్రా.. అనంతరం సాయి సుదర్శన్(45), డేవిడ్ మిల్లర్(12) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై.. గుజరాత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఆఖరి వరకు పోరాడి ఆరు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తొలిసారి బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు.. గుజరాత్ సారథిగా శుబ్మన్ గిల్ మాత్రం తొలి మ్యాచ్లోనే విజయం అందుకున్నాడు. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. -
Hardik Pandya: కెప్టెన్ నేనే కాబట్టి తొలి ఓవర్ నేనే బౌలింగ్ చేస్తా..!
ఇటీవలికాలంలో హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ ఎక్కువైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐపీఎల్ కెప్టెన్ అయ్యాక హార్దిక్కు పొగరు తలకెక్కిందని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్తో నిన్న జరిగిన మ్యాచ్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల వ్యవహరించిన తీరును ఉదహరిస్తూ హార్దిక్పై దుమ్మెత్తిపోస్తున్నారు. తనకంటే సీనియరైన రోహిత్ పట్ల కనీస గౌరవం కూడా లేకుండా బౌండరీ లైన్ వద్ద అటుఇటు తిప్పడాన్ని సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా హార్దిక్ వెలగబెట్టిన ఓ ఘన కార్యాన్ని ప్రస్తావిస్తూ ఇట్లుంటది ఈ కెప్టెన్తోని అంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్ టైటాన్స్తో నిన్నటి మ్యాచ్లో బుమ్రా, లూక్ వుడ్, గెరాల్డ్ కొయెట్జీ లాంటి స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్యా తనే తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఇదే ముంబై అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నప్పుడు ఈ ఓవరాక్షన్ ఎందుకు అని వారు మండిపడుతున్నారు. వేస్తే వేశాడు. ఏమైనా పొడిచాడా అంటే అదీ లేదు. 3 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 30 పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్ అయ్యాక ఇలా చేయడం హార్దిక్కు కొత్తేమీ కాదు. Just Pandya brothers things🔥 pic.twitter.com/1KGsblX1lc — CricTracker (@Cricketracker) March 25, 2024 టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్నప్పుడు, గుజరాత్ కెప్టెన్గా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇలా చేశాడు. అసలు పిచ్ ఆరంభ ఓవర్లలో తన బౌలింగ్ శైలికి సహకరిస్తుందా లేదా అని కూడా ఆలోచించకుండా తొలి ఓవరే బంతినందుకున్నాడు. కెప్టెన్ నేనే కాబట్టి, తొలి ఓవర్ నేనే వేస్తాను అన్నట్లుంది అతని ధోరణి. ఈ అతి చేష్టలే ముంబై అభిమానులకు అసలు రుచించడం లేదు. దీనికి తోడు సీనియర్ అని కూడా చూడకుండా రోహిత్ అగౌరవపరచడం ముంబై అభిమానులకు అస్సలు సహంచడం లేదు. ఎక్కడో గుజరాత్ వాడు వచ్చి మాపై (రోహిత్) పెత్తనం చెలాయించడమేంటని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. హార్దిక్ ఒక్కడే ఇలా (కెప్టెన్గా తొలి ఓవర్ బౌలింగ్ చేయడం) అనుకుంటే పొరబడ్డట్టే. అతని అన్న కృనాల్ పాండ్యా కూడా గతంలో ఇలాగే చేశాడు. గత సీజన్లో కేఎల్ రాహుల్ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్లకు లక్నో కెప్టెన్గా వ్యవహరించిన కృనాల్.. ముంబై ఇండియన్స్తో జరిగిన రెండు మ్యాచ్ల్లో పిచ్ గురించి పట్టించుకోకుండా కెప్టెన్ నేనే కాబట్టి నేనే తొలి ఓవర్ వేస్తా అన్నట్లు వ్యవహరించాడు. పిచ్ పేసర్లకు సహకరిస్తుందని తెలిసినప్పటికీ కృనాల్ తొలి ఓవర్ వేయడంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. మొత్తంగా ఇలా చేయడం పాండ్యా బ్రదర్స్కు మాత్రమే సాధ్యమైంది. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (45) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టగా.. గెరాల్డ్ కొయెట్జీ 2, పియుశ్ చావ్లా ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ (43), డెవాల్డ్ బ్రెవిస్ (46) రాణించినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గుజరాత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్,స్పెన్సర్ జాన్సన్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ తలో 2 వికెట్లు, సాయికిషోర్ ఓ వికెట్ పడగొట్టారు. -
గ్రౌండ్లోకి కుక్క ఎంట్రీ.. హార్దిక్, హార్దిక్ అంటూ గుజరాత్ అభిమానుల కేకలు
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ను వీడి ముంబై ఇండియన్స్ పంచన చేరిన హార్దిక్ పాండ్యాపై అతని మాజీ ఫ్రాంచైజీ అభిమానులు పీకల దాకా కోపాన్ని పెంచుకున్నారు. ఈ విషయాన్ని వారు నిన్నటి మ్యాచ్ సందర్భంగా బహిర్గతం చేశారు. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో నిన్నటి మ్యాచ్ జరుగుతండగా గుజరాత్ అభిమానులు హార్దిక్ను ఓ రేంజ్లో ఆడుకున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచే వ్యంగ్యమైన కామెంట్లతో హార్దిక్కు చుక్కలు చూపించిన గుజరాత్ ఫ్యాన్స్.. ఓ దశలో దుర్భాషల దాకా వెళ్లారు. కొందరేమో హార్దిక్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ఖాళీ బాటిల్స్ విసిరారు. This dog came on the field and Ahmedabad crowd started chanting Hardik Hardik...😂 I don't understand what's wrong with the Ahmedabad crowd.... Why compare #HardikPandya to a dog? Dogs are loyal, Hardik is not. 😭😭 #MIvsGT pic.twitter.com/bJTI48HAdz — Incognito (@Incognito_qfs) March 24, 2024 నిన్నటి మ్యాచ్ సందర్భంగా హార్దిక్ టైమ్ ఎంత బ్యాడ్గా ఉండిందంటే.. అప్పటికే కోపంతో రగిలిపోతున్న ఫ్యాన్స్కు హార్దిక్పై అక్కసును వెల్లగక్కేందుకు మరో అస్త్రం దొరికింది. మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలో సడెన్గా ఓ కుక్క ఎంట్రీ ఇచ్చింది. కుక్క ఎంటర్ అవగానే అభిమానులు ఒక్కసారిగా హార్దిక్, హార్దిక్ అంటూ కేకలు పెట్టడం మొదలుపెట్టారు. మాజీ అభిమానులు తనను టార్గెట్ చేయడంతో హార్దిక్ ఒకింత కలత చెందినట్లు కనిపించాడు. కుక్క మైదానంలో చక్కర్లు కొడుతూ కొడుతూ హార్దిక్ వద్దకు వచ్చినప్పుడు అభిమానుల అరుపులు శ్రుతి మించాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. గుజరాత్ అభిమానులు తమ ఫ్రాంచైజీని వీడినందుకు హార్దిక్పై కోపాన్ని వెల్లగక్కుతున్నారు. కొందరేమో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక హార్దిక్ను బూతులు తిడుతున్నారు. కొందరు హార్దిక్ను కుక్కతో పోలుస్తున్నారు. ఇంకొందరేమో కుక్కతో ఎందుకు పోలుస్తున్నారు. అది చాలా విశ్వాసంగా ఉంటుంది. హార్దిక్ను కుక్కతో పోల్చి దాన్ని తక్కువ చేయకండని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (45) మాత్రమే ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టగా.. గెరాల్డ్ కొయెట్జీ 2, పియుశ్ చావ్లా ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ (43), డెవాల్డ్ బ్రెవిస్ (46) రాణించినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గుజరాత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్,స్పెన్సర్ జాన్సన్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ తలో 2 వికెట్లు, సాయికిషోర్ ఓ వికెట్ పడగొట్టారు. -
#MIvsGT: ఊహించని షాక్.. హార్దిక్ రియాక్షన్ వైరల్!
#Hardik Pandya Reaction After Loss Battle To Umesh Yadav: ఐపీఎల్-2024.. గుజరాత్ టైటాన్స్తో తమ తొలి మ్యాచ్.. టాస్ గెలిచి.. ప్రత్యర్థిని 168 పరుగులకు కట్టడిచేసిన ముంబై ఇండియన్స్.. లక్ష్య ఛేదనకు దిగిన పాండ్యా సేన.. ఆఖరి ఐదు ఓవర్లలో 43 పరుగులు కావాలి.. అప్పటికి ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. తిలక్ వర్మ నిలకడగా ఆడుతుండగా.. డెవాల్డ్ బ్రెవిస్ అప్పటికే జోరు మీదున్నాడు.. అతడి తర్వాత టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు కూడా ఉన్నారు. ఈ సమీకరణాలన్నీ చూసి ముంబై గెలుపు లాంఛనమే అనే అంచనాలు.. అయితే, పదహారో ఓవర్ ఐదో బంతి నుంచి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలుపెట్టారు గుజరాత్ బౌలర్లు. మోహిత్ శర్మ బ్రెవిస్(46)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు. అనంతరం.. పద్దెనిమిదవ ఓవర్ ఆఖరి బాల్కు టిమ్ డేవిడ్(11)ను కూడా అవుట్ చేశాడు. ఆ తర్వాతి రెండో బంతికే స్పెన్సర్ జాన్సన్ తిలక్ వర్మ(25)కు సెండాఫ్ ఇచ్చాడు. అనంతరం పందొమ్మిదో ఓవర్ చివరి బంతికి గెరాల్డ్ కొయెట్జీ(1)ని కూడా పెవిలియన్కు పంపాడు. అప్పటికి స్కోరు 150-7. ముంబై విజయానికి ఆరు బంతుల్లో 19 పరుగులు కావాలి. టిమ్ డేవిడ్ స్థానంలో క్రీజులోకి వచ్చి సింగిల్తో మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యాపైనే ఆశలన్నీ! అందుకు తగ్గట్లుగానే ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చిన ఉమేశ్ యాదవ్కు సిక్సర్తో ఆహ్వానం పలికాడు హార్దిక్. మరుసటి బంతికే ఫోర్ బాదాడు. 6️⃣ • 4️⃣ • 𝗪 Skipper Hardik leads the fightback, but Umesh won the battle ⚔️🔥#IPLonJioCinema #TATAIPL #IPL2024 #GTvMI pic.twitter.com/R3K3ArF7OM — JioCinema (@JioCinema) March 24, 2024 అప్పుడు సమీకరణం.. నాలుగు బంతుల్లో 9 పరుగులు.. కానీ హార్దిక్కు.. ముంబై ఇండియన్స్కు ఊహించని షాకిచ్చాడు ఉమేశ్. పేసీ షార్ట్ బాల్తో పాండ్యాను బురిడీ కొట్టించి క్యాచ్ అవుట్గా వెనుదిరిగేలా చేశాడు. దీంతో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం ఉమేశ్ యాదవ్ వికెట్ను సెలబ్రేట్ చేసుకుంటూ హోరెత్తింది. Now that's a 𝘾𝙤𝙢𝙚𝙗𝙖𝙘𝙠 😍 Umesh Yadav with the all important wicket of Hardik Pandya when it mattered the most 👏 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI | @gujarat_titans pic.twitter.com/1ijg3ISCCt — IndianPremierLeague (@IPL) March 24, 2024 దెబ్బకు హార్దిక్ పాండ్యా ముఖం మాడిపోయింది. ఆ తర్వాతి బంతికి పీయూష్ చావ్లాను అవుట్ చేసిన ఉమేశ్ యాదవ్ ముంబై గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. ఆఖరి బంతికి షమ్స్ ములానీ సింగిల్ తీసి ఇన్నింగ్స్ ముగించగా.. గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో గెలిచి గెలుపుతో సీజన్ను ఆరంభించింది. కాగా గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా ఈసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందుకే అహ్మదాబాద్ ప్రేక్షకులు ఆది నుంచే అతడిని ట్రోల్ చేస్తూ అరచి గోలగోల చేశారు. ఇలా హార్దిక్(4 బంతుల్లో 11 రన్స్) అవుట్ కావడం, ముంబై ఓడిపోవడంతో వారి సంబరాలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. -
అతడొక అద్భుతం.. మా విజయానికి కారణం అదే: గిల్
Gujarat Titans won by 6 runs- Shubman Gill Comments: టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఐపీఎల్లో కెప్టెన్గా కొత్త అధ్యాయం మొదలుపెట్టాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అత్యధిక పరుగుల వీరుడి(890 రన్స్)గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఇక తాజా సీజన్లో కెప్టెన్గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే గుజరాత్ను గెలిపించి సత్తా చాటాడు. కాగా ఆదివారం సొంతమైదానం అహ్మదాబాద్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి లక్ష్యాన్ని కాపాడుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ను 162 పరుగులకే కట్టడి చేసి ఆరు పరుగుల తేడాతో విజయం అందుకుంది. సమిష్టి కృషితో ఐపీఎల్-2024లో శుభారంభం చేసింది. A game of ᴇʙʙꜱ & ꜰʟᴏᴡꜱ 🫡@gujarat_titans display quality death bowling to secure a remarkable 6️⃣ run win over #MI 👏@ShubmanGill's captaincy starts off with with a W Scorecard ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/jTBxANlAtk — IndianPremierLeague (@IPL) March 24, 2024 ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సాయి సుదర్శన్(39 బంతుల్లో 45 రన్స్)పై ప్రశంసలు కురిపించాడు. జట్టు మెరుగైన స్కోరు చేయడంలో అతడిదే ముఖ్య భూమిక అని పేర్కొన్నాడు. ‘‘వికెట్ మీద మంచు ప్రభావం ఉన్నా మా వాళ్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మా స్పిన్నర్లు సరైన సమయంలో వికెట్లు తీశారు. ఇక సాయి సుదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీలేదు. అతడు అద్భుతంగా ఆడాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ వాళ్లు పొరపాట్లు చేసేలా మా వ్యూహాలు అమలు చేశాం. ఇక అహ్మదాబాద్ గ్రౌండ్లో ప్రేక్షకుల నుంచి మాకు లభించే మద్దతు గురించి ఏమని చెప్పగలం. ప్రతి నిమిషం మాకు అండగా నిలుస్తూ.. స్టేడియాన్ని హోరెత్తిస్తూ ఉత్సాహపరిచారు. ఈ మ్యాచ్లో మేము మెరుగైన స్కోరే చేశాం. అయితే, ఆఖర్లో ఇంకో 15 పరుగులు జోడించి ఉంటే ఇంకాస్త బాగుండేది. కానీ.. చివర్లో వికెట్ స్లో అయింది. షార్ట్ బాల్స్ను ఎదుర్కోవడం కాస్త కష్టంగానే అనిపించింది’’ అని శుబ్మన్ గిల్ మ్యాచ్ ఫలితం గురించి విశ్లేషించాడు. కాగా ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ 22 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సాయి కిషోర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సమిష్టిగా రాణించి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ను పతనం చేశారు. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. Bowled & caught in a ⚡. What a return catch from Mohit Sharma👏#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPL2024 #JioCinemaSports pic.twitter.com/89z47SYZEV — JioCinema (@JioCinema) March 24, 2024 -
#MI: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్!
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే పరాజయం చవిచూశాడు హార్దిక్ పాండ్యా. తాను గతంలో చాంపియన్గా నిలిపిన గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఓడిపోవడంతో చేదు అనుభవాన్ని మూటగట్టుకున్నాడు. అంతేకాకుండా ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల వ్యవహరించిన తీరుతో విమర్శల పాలయ్యాడు. పదే పదే రోహిత్ ఫీల్డింగ్ పొజిషన్ మార్చిన హార్దిక్.. ఆఖరికి తన నిర్ణయాల కారణంగా మ్యాచ్ను చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం.. తనను హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్కు షాకిచ్చాడు రోహిత్ శర్మ. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు కనిపించింది. ఆఖరి వరకు పోరాడిన మ్యాచ్లో పరాజయం ఎదురుకావడంతో రోహిత్ శర్మ.. మైదానంలోనే హార్దిక్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ సమయంలో ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ సైతం అక్కడే ఉండటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో ఓడిపోవడం ఇది పన్నెండవసారి కావడం గమనార్హం. అంబానీల యాజమాన్యంలోని ఈ జట్టు 2012 తర్వాత మళ్లీ ఇంత వరకు ఒక్కసారి కూడా ఓపెనింగ్ మ్యాచ్లో గెలిచిన సందర్భాలు లేవు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో శుబ్మన్ గిల్ సేన ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన పాండ్యా బృందం తొమ్మిది వికెట్లు నష్టపోయి 162 పరుగుల వద్దే నిలిచిపోయింది. A game of ᴇʙʙꜱ & ꜰʟᴏᴡꜱ 🫡@gujarat_titans display quality death bowling to secure a remarkable 6️⃣ run win over #MI 👏@ShubmanGill's captaincy starts off with with a W Scorecard ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/jTBxANlAtk — IndianPremierLeague (@IPL) March 24, 2024 ఫలితంగా ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన గుజరాత్ టైటాన్స్ పదిహేడో ఎడిషన్లో శుభారంభం చేసింది. గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్(39 బంతుల్లో 45) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ 29 బంతుల్లోనే 43 పరుగులు చేయగా.. హార్దిక్ పాండ్యా 4 బంతుల్లోనే 11 పరుగులు చేశాడు. కానీ వికెట్లేమీ తీయలేకపోయాడు. చదవండి: IPL 2024 RR Vs LSG: అన్న ఇది నీవేనా.. మేము అస్సలు ఊహించలేదు! వీడియో వైరల్ #HardikPandya #MIvsGT Mumbai Indians is now a broken side 💀 Well captained Ashish Nehra 🤌 Well bowled Umesh yadav 🔥 pic.twitter.com/Pksxy85HOI — DINU X (@Unlucky_Hu) March 25, 2024 -
IPL MI Vs GT Highlights Photos: ముంబయిపై గుజరాత్ గెలుపు (ఫొటోలు)
-
MI Vs GT: అదే మా కొంపముంచింది.. తిలక్ ఆలోచన సరైనదే: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ -2024 సీజన్ను ముంబై ఇండియన్స్తో ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై పరాజయం చవిచూసింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై విజయానికి 48 పరుగులు అవసరమవ్వగా.. వరుసక్రమంలో వికెట్లు కోల్పోయి ఓటమి కొనితెచ్చుకుంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో బ్రెవిస్(46), రోహిత్ శర్మ(43) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఆఖరి ఓవర్లలో వరుసగా వికెట్ల కోల్పోవడంతో ఓటమి పాలైమని హార్దిక్ తెలిపాడు. "ఆఖరి వరకు మేము గేమ్లోనే ఉన్నాం. చివరి 5 ఓవర్లలో మా విజయానికి 42 పరుగులు అవసరమయ్యాయి. మా చేతిలో 6 వికెట్ల ఉండడంతో ఈజీగా గెలుస్తామని భావించాము. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అదే మా కొంపముంచింది. చివరి ఐదు ఓవర్లలో ముంబై ఇంత తక్కువ స్కోర్ ఛేదించకపోయిన మ్యాచ్ల్లో కచ్చితంగా ఇదొకటి. అహ్మదాబాద్లో మళ్లి తిరిగి వచ్చి ఆడినందుకు సంతోషంగా ఉంది. అహ్మదాబాద్ స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజు మొత్తం అభిమానులతో నిండిపోయింది. గుజరాత్ కూడా అద్భుతంగా ఆడింది. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్లో తిలక్ వర్మ సింగిల్ను తిరష్కరించడం సరైన నిర్ణయమే. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ స్ట్రైక్లో ఉంటే బెటర్ అని తిలక్ భావించాడు. నేను కూడా అతడికి ఫుల్ సపోర్ట్గా నిలిచాను. ఇంకా మాకు 13 మ్యాచ్లు ఉన్నాయి. తర్వాతి మ్యాచ్లో కచ్చితంగా మేము తిరిగి కమ్బ్యాక్ ఇస్తామని" హార్దిక్ పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో పేర్కొన్నాడు. కాగా హార్దిక్ ముంబై కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ఓటమిని ఎదుర్కోవడం గమనార్హం. -
MI Vs GT: ముంబై మరో‘సారీ’
అహ్మదాబాద్: కొత్త కెప్టెన్ వచ్చినా... వరుసగా 12వ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ తొలి మ్యాచ్ కలిసి రాలేదు. వరుసగా 12వ సారి ముంబై ఐపీఎల్ సీజన్ను ఓటమితో ప్రారంభించింది. 2012 ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు తొలి మ్యాచ్లో గెలుపు బోణీ కొట్టలేకపోయింది. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ సారథ్యంలో ఈ మ్యాచ్లో ఆడిన గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్ల సమష్టి రాణింపుతో ఆఖరిదాకా పోరాడి 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు సాహా (19), శుబ్మన్ గిల్ (22 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలువలేదు. వన్డౌన్ బ్యాటర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (39 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) పటిష్టమైన ముంబై బౌలింగ్కు ఎదురునిలిచి జట్టును నడిపించాడు. అయితే బుమ్రా ఒకే ఓవర్లో మిల్లర్ (17), సుదర్శన్లను అవుట్ చేయగా... ఆఖర్లో రాహుల్ తెవాటియా (15 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించాడు. తర్వాత ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేయగలిగింది. ఇషాన్ కిషన్ (0), నమన్ ధీర్ (20)లను అవుట్ చేసిన ఒమర్జాయ్ ముంబై ఆరంభాన్ని దెబ్బకొట్టగా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాల్డ్ బ్రెవిస్ (38 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) జట్టును నడిపించారు. స్వల్పవ్యవధిలో వాళ్లిద్దరు అవుటయ్యాక ఒక్క తిలక్ వర్మే (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన స్కోరు చేశాడు. టిమ్ డేవిడ్ (11), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (11)లాంటి హిట్టర్లు కూడా తేలిపోవడంతో ముంబై ఓడింది. ఒమర్జాయ్, ఉమేశ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ తలా 2 వికెట్లు తీశారు. గుజరాత్ మాజీ సారథి పాండ్యా తాజాగా ముంబై కెప్టెన్గా టాస్కు రాగానే స్టేడియంలోని ప్రేక్షకులు అరచి గోల చేశారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) బుమ్రా 19; శుబ్మన్ (సి) రోహిత్ (బి) చావ్లా 31; సాయి సుదర్శన్ (సి) తిలక్వర్మ (బి) బుమ్రా 45; అజ్మతుల్లా (సి) తిలక్వర్మ (బి) కొయెట్జీ 17; మిల్లర్ (సి) పాండ్యా (బి) బుమ్రా 12; విజయ్ శంకర్ (నాటౌట్) 6; తెవాటియా (సి) నమన్ ధీర్ (బి) కొయెట్జీ 22; రషీద్ ఖాన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–31, 2–64, 3–104, 4–133, 5–134, 6–161. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 3–0–30–0, ల్యుక్ వుడ్ 2–0–25–0, బుమ్రా 4–0–14–3, ములానీ 3–0–24–0, పియూశ్ చావ్లా 3–0–31–1, నమన్ ధీర్ 1–0–13–0, కొయెట్జీ 4–0–27–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) సాహా (బి) అజ్మతుల్లా 0; రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సాయి కిషోర్ 43; నమన్ ధీర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అజ్మతుల్లా 20; బ్రెవిస్ (సి) అండ్ (బి) మోహిత్ 46; తిలక్ వర్మ (సి) సబ్–మనోహర్ (బి) జాన్సన్ 25; డేవిడ్ (సి) మిల్లర్ (బి) మోహిత్ 11; హార్దిక్ (సి) తెవాటియా (బి) ఉమేశ్ 11; కొయెట్జీ (సి అండ్ బి) జాన్సన్ 1; ములానీ (నాటౌట్) 1; చావ్లా (సి) రషీద్ ఖాన్ (బి) ఉమేశ్ 0; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–0, 2–30, 3–107, 4–129, 5–142, 6–148, 7–150, 8–160, 9–160. బౌలింగ్: ఒమర్జాయ్ 3–0–27–2, ఉమేశ్ 3–0–31–2, రషీద్ 4–0–23–0; సాయి కిషోర్ 4–0–24–1, జాన్సన్ 2–0–25–2, మోహిత్ శర్మ 4–0–32–2. ఐపీఎల్లో నేడు బెంగళూరు X పంజాబ్ వేదిక: బెంగళూరు రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
MI Vs GT: ముంబై ఇండియన్స్పై గుజరాత్ ఘన విజయం
ముంబై ఇండియన్స్పై గుజరాత్ ఘన విజయం ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో బ్రెవిస్(46), రోహిత్ శర్మ(43) టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(45) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. శుబ్మన్ గిల్(41) రాహుల్ తెవాటియా(22) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ రెండు, చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు. 18 ఓవర్లకు ముంబై స్కోర్: 142/5 18 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ముంబై విజయానికి 12 బంతుల్లో 27 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. రోహిత్ ఔట్ 107 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సాయి కిషోర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ముంబై విజయానికి 42 బంతుల్లో 57 పరుగులు కావాలి. 10 ఓవర్లకు ముంబై స్కోర్: 88/2 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(40), బ్రెవిస్(26) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ముంబై.. నమాన్ ధీర్ ఔట్ 30 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన నమాన్ ధీర్.. ఒమర్జాయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 40/2. క్రీజులో రోహిత్ శర్మ(18), బ్రెవిస్(0) ఉన్నారు. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఒమర్జాయ్ బౌలింగ్లో కిషన్ ఔటయ్యాడు. రాణించిన గుజరాత్ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 169 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(45) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. శుబ్మన్ గిల్(41) రాహుల్ తెవాటియా(22) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ రెండు, చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్.. గుజరాత్ టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ తెవాటియా(17), విజయ్ శంకర్(1) ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్.. మిల్లర్ ఔట్ 133 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మిల్లర్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి విజయ్ శంకర్ వచ్చాడు. మూడో వికెట్ డౌన్.. ఒమర్జాయ్ ఔట్ 104 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అజ్మతుల్లా ఓమర్జాయ్.. గెరాల్డ్ కోయిట్జీ బౌలింగ్లో ఔటయ్యాడు. రెండో వికెట్ డౌన్.. 66 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. చావ్లా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి అజ్ముతుల్లా ఒమర్జాయ్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. 31 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన వృద్దిమన్ షా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి సాయి సుదర్శన్ వచ్చాడు. 3 ఓవర్లకు ముంబై స్కోర్ 27/0 టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్(11) , వృద్దిమన్ షా(15) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు యువ ఆటగాడు శుబ్మన్ గిల్ సారథ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్ ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్ -
IPL 2024: కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసిన గుజరాత్, రాజస్థాన్
ఐపీఎల్ 2024 సీజన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు వివిధ కారణాల చేత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో గుజరాత్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు తమను మిస్ అయిన కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేశాయి. వేలంలో జాక్పాట్ (3.6 కోట్లు) కొట్టి, బైక్ యాక్సిడెంట్ కారణంగా సీజన్ మొత్తానికే దూరమైన యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ స్థానాన్ని గుజరాత్ యాజమాన్యం మరో వికెట్కీపర్ బ్యాటర్ బీఆర్ శరత్తో (కర్ణాటక) భర్తీ చేయగా.. వ్యక్తిగత కారణాల చేత సీజన్ నుంచి తప్పుకున్న ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా (1.5 కోట్లు) స్థానాన్ని రాజస్థాన్ రాయల్స్ ముంబై స్పిన్నర్ బ్యాటర్ తనుశ్ కోటియన్తో భర్తీ చేసింది. (తనుశ్ కోటియన్) కొత్తగా భర్తీ చేయబడ్డ శరత్, తనుశ్లను ఆయా ఫ్రాంచైజీలు బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకున్నాయి. వీరిద్దరూ అతి త్వరలో ఆయా జట్లతో చేరతారని తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల రవి శరత్ కర్ణాటక తరఫున 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 42 లిస్ట్-ఏ మ్యాచ్లు, 28 టీ20లు ఆడి 1600 పైచిలుకు పరుగులు సాధించాడు. వికెట్కీపింగ్లో అతను మొత్తంగా 162 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. (బీఆర్ శరత్) ముంబై రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన 25 ఏళ్ల తనుశ్ కోటియన్ సొంత జట్టు తరఫున 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 19 లిస్ట్-ఏ మ్యాచ్లు, 23 టీ20లు ఆడాడు. ఇందులో అతను 119 వికెట్లు 1300లకు పైగా పరుగులు చేశాడు. తనుశ్ ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ కీలక మ్యాచ్లో 10వ స్థానంలో బ్యాటింగ్కు దిగి సెంచరీ చేశాడు. ఇతని ఖాతాలో 11 ఫస్ట్క్లాస్ హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 24న (ముంబైతో) ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ మార్చి 24ననే జరిగే మరో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను ఢీకొట్టనుంది. ఇవాళ జరిగే సీజన్ ఓపెనర్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. -
టీమిండియా క్రికెటర్కు లక్కీ ఛాన్స్.. ఏకంగా షమీ స్ధానంలోనే?
ఐపీఎల్-2024 సీజన్కు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. షమీ ఇటీవలే తన చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. షమీ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో షమీ స్ధానాన్ని తమిళనాడు పేసర్ సందీప్ వారియర్తో గుజరాత్ టైటాన్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. సందీప్ను కనీస ధర రూ.50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. సందీప్ వారియర్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున 2019 - 2021 మధ్య 5 మ్యాచ్లు ఆడాడు. ఈ ఐదు మ్యాచ్ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా వారియర్ టీమిండియా తరపున కేవలం ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్తో వారియర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో వారియర్ విఫలమకావడంతో తర్వాత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. -
IPL 2024: షెడ్యూల్, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరుతో 2024 సీజన్కు తెరలేవనుంది. ఇక దేశంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 21 మ్యాచ్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ రోజు ఏ మ్యాచ్?.. వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు తదితర వివరాలు తెలుసుకుందాం! ఐపీఎల్-2024 తొలి దఫా షెడ్యూల్లో 21 మ్యాచ్లు.. ఏయే వేదికల్లో అంటే! ►మార్చి 22- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే- CSK) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ- RCB)- చెన్నై ►మార్చి 23- పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్- PBKS)వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ- DC)- మొహాలీ(మధ్యాహ్నం) ►మార్చి 23- కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)- కోల్కతా(రాత్రి) ►మార్చి 24- రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)- జైపూర్(మధ్యాహ్నం) ►మార్చి 24- గుజరాత్ టైటాన్స్(జీటీ-GT) వర్సెస్ ముంబై ఇండియన్స్(ఎంఐ- MI)- అహ్మదాబాద్(రాత్రి) ►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్- బెంగళూరు ►మార్చి 26- సీఎస్కే- గుజరాత్ టైటాన్స్- చెన్నై ►మార్చి 27- సన్రైజర్స్- ముంబై- హైదరాబాద్ ►మార్చి 28- రాజస్తాన్- ఢిల్లీ- జైపూర్ ►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్- బెంగళూరు ►మార్చి 30- లక్నో- పంజాబ్- లక్నోలో ►మార్చి 31- గుజరాత్- సన్రైజర్స్- అహ్మదాబాద్(మధ్యాహ్నం) ►మార్చి 31- ఢిల్లీ- సీఎస్కే- వైజాగ్ ►ఏప్రిల్ 1- ముంబై- రాజస్తాన్- ముంబై ►ఏప్రిల్ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు ►ఏప్రిల్ 3- ఢిల్లీ- కేకేఆర్- వైజాగ్ ►ఏప్రిల్ 4- గుజరాత్- పంజాబ్- అహ్మదాబాద్ ►ఏప్రిల్ 5- సన్రైజర్స్- సీఎస్కే- హైదరాబాద్ ►ఏప్రిల్ 6- రాజస్తాన్- ఆర్సీబీ- జైపూర్ ►ఏప్రిల్ 7- ముంబై- ఢిల్లీ- ముంబై ►ఏప్రిల్ 7- లక్నో- గుజరాత్- లక్నో. నోట్: మార్చి 23, 24, 31, ఏప్రిల్7న డబుల్ హెడర్ మ్యాచ్లు.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్లు 3.30కి, రాత్రి జరిగే మ్యాచ్లు 7.30కి ఆరంభమవుతాయి. స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), జియో సినిమా(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారం. ఐపీఎల్-2024 తొలి దఫా మ్యాచ్లు జరిగే వేదికలు చెన్నై, మొహాలి, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి దఫా షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వైజాగ్ హోం గ్రౌండ్గా ఉంటుంది. IPL 2024లో పాల్గొనే పది జట్ల వివరాలు చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. ►గాయపడిన ఆటగాళ్ళు: డెవాన్ కాన్వే, మతీష పతిరణ. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నంబూరి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్ , ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: జాసన్ బెహ్రెన్డార్ఫ్, దిల్షాన్ మధుశాంక. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయి, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్కుమార్ వైశాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: మహ్మద్ షమీ, రాబిన్ మింజ్. లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొమ్మద్. అర్షద్ ఖాన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: మార్క్ వుడ్. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చహల్, ఆడం జంపా, ఆవేష్ ఖాన్, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, అబిద్ ముస్తాక్, నండ్రే బర్గర్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: ప్రసిద్ధ్ కృష్ణ. ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యష్ ధుల్, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, లుంగి ఎన్గిడి. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడే, అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరాన్, కగిసో రబడ, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, హర్ప్రీత్ భట్యా , విద్వత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్. సన్రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్. చదవండి: SRH: రెండుసార్లు చాంపియన్గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా -
IPL 2024: సర్ఫరాజ్ ఖాన్కు లక్కీ ఛాన్స్.. ఐపీఎల్లో రీ ఎంట్రీ!?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్కు సర్ఫరాజ్ ప్రాతినిథ్యం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలసిందే. దీంతో అతడు ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో మింజ్ స్ధానాన్ని సర్ఫరాజ్తో భర్తీ చేయాలని గుజరాత్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా గత ఐపీఎల్సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన సర్ఫరాజ్ను 2024 వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ విడుదల చేసింది. దీంతో రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సర్ఫరాజ్ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఇటీవల ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో సర్ఫరాజ్ అదరగొట్టడంతో గుజరాత్ ఫ్రాంచైజీ తమ జట్టులో చేర్చుకునేందుకు సిద్దమైంది. సర్ఫరాజ్ గతం ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు, ఆర్సీబీకి కూడా ప్రాతనిథ్యం వహించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 50 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్.. 585 పరుగులు చేశాడు. ఇక ఈ ఏడాది సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. -
పాండ్యాను ఒప్పించే ప్రయత్నం చేయలేదు!
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఎంతో అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైన లోటు కనిపిస్తుందని, అయితే అతను వెళ్లకుండా తాము ఒప్పించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని గుజరాట్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. గత రెండు సీజన్లలో టైటాన్స్కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ ఈ సీజన్నుంచి ముంబై ఇండియన్స్ సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఏ క్రీడలోనైనా కొన్ని అంశాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాల్సిందేనని నెహ్రా అభిప్రాయ పడ్డాడు. ‘మా జట్టుతో ఉండిపొమ్మని పాండ్యాను ఒప్పించే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయలేదు. మరో ఇతర ఫ్రాంచైజీకి వెళితే అలా చేసేవాడినేమో కానీ గుజరాత్కు ముందు 5–6 సీజన్లు ఆడిన ముంబైకి అతను వెళ్లిపోయాడు. అతను అక్కడ మళ్లీ కొత్తగా ఏదైనా నేర్చుకుంటాడేమో. కెపె్టన్గా రాటుదేలేందుకు గిల్కు ఇది మంచి అవకాశం’ అని నెహ్రా వ్యాఖ్యానించాడు.