భర్త విదేశాలకు... ఇంటి పక్కన వ్యక్తితో మోనీషా వివాహేతర సంబంధం | - | Sakshi
Sakshi News home page

భర్త విదేశాలకు... ఇంటి పక్కన వ్యక్తితో మోనీషా వివాహేతర సంబంధం

Jun 21 2023 10:22 AM | Updated on Jun 21 2023 10:52 AM

- - Sakshi

తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లాలో భర్త, ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లిన వివాహిత ప్రియుడితో కలిసి మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపం మెత్తనం ప్రాంతానికి చెందిన సునీల్‌ (29). ఇతను తాపీమేస్త్రి. కరుంగల్‌కు చెందిన తొలైవావట్టం ప్రాంతానికి చెందిన మోనీషా (25)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈక్రమంలో సునీల్‌ ఆరు నెలల క్రితం పని కోసం విదేశాలకు వెళ్లాడు.

ఈ క్రమంలో ఇంటికి సమీపంలో ఉన్న సునీల్‌ బంధువు అర్జున్‌ (27)తో మోనీషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. సంఘటన జరిగిన రోజు మోనీషా ఇద్దరు పిల్లలు తొలైవావట్టంలో ఉన్న తల్లిదండ్రుల ఇంట్లో వదిలిపెట్టి బ్యాంకుకు వెళుతున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. మోనీషా తల్లిదండ్రులు మార్తాండం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు విచారణలో మోనిషా, అర్జున్‌ ఇద్దరూ కేరళలో ఉన్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులు మోనీషాను సెల్‌ఫోన్‌లో సంప్రదించగా ఇద్దరు మార్తాండం వస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలో మోనీషా, అర్జున్‌ సోమవా రం మార్తాండం పోలీస్‌స్టేషన్లో ఆశ్రయం కోరారు. ఇద్దరి తరఫున తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వివాహేతర సంబంధాన్ని వదిలిపెట్టాలని ఆమెకు పోలీసులు, బంధువులు హితవు పలికారు. కానీ మోనిషా అర్జున్‌తో వెళ్తున్నట్లు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement