లారీ, ఓమ్నీ బస్సు యజమానుల నిరసన | - | Sakshi
Sakshi News home page

లారీ, ఓమ్నీ బస్సు యజమానుల నిరసన

Apr 2 2025 1:48 AM | Updated on Apr 2 2025 1:48 AM

లారీ, ఓమ్నీ బస్సు యజమానుల నిరసన

లారీ, ఓమ్నీ బస్సు యజమానుల నిరసన

కొరుక్కుపేట: టోల్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మధురవాయల్‌ మేట్టుకుప్పం రోడ్డులో ఇసుక లారీల యజమానుల సంఘం, ఓమ్నీ బస్సు యజమానుల సంఘం, వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. వివరాలు.. తమిళనాడులోని 78 టోల్‌ బూత్‌లలో 40 టోల్‌ బూత్‌లకు సోమవారం అర్ధరాత్రి నుంచి మొదటి దశలో టోల్‌ ఫీజులను పెంచారు. చైన్నెలో పరనూర్‌, వానగరం, సురపాట్టు అనే 3 టోల్‌ బూత్‌లలో టోల్‌ పెంచారు. ఇలా రూ.5 నుంచి రూ.75 వరకు అదనంగా వసూలు చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యులు అవస్థలు పడుతున్నారు. పేదలు, , మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు, రవాణా పరిశ్రమలో నిమగ్నమైన వారందరూ తీవ్రంగా నష్టపోతారు. ఈ ఛార్జీల పెంపుపై వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు నిరసనలు తెలుపుతున్నాయి. కస్టమ్స్‌ డ్యూటీ పెంపును వెనక్కి తీసుకోవాలని, కాలం చెల్లిన టోల్‌ గేట్‌లను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మధురవాయల్‌ మేటుక్కుప్పం రోడ్డులో ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు యువరాజ్‌ నేతృత్వంలో టోల్‌ పెంపును తీవ్రంగా ఖండించారు. ఇందులో ఓమ్నీ బస్సు యజమాని సంఘం అన్బళగన్‌, వివిధ సంస్థలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. నిరసనకారులు కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ, అధిక ఎకై ్సజ్‌ సుంకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. గడువు ముగిసిన టోల్‌లను తొలగించడంతోపాటూ తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement