![new bride commits suicide in tamilnadu - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/13/5658.jpg.webp?itok=6CeKF2wc)
తమిళనాడు: ఏం జరిగిందో ఏమో తెలియదు కాని నూరేళ్ల బంధం పది రోజులకే ముగిసింది. నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. పళ్లిపట్టు యూనియన్ రామసముద్రం పంచాయతీ వీజీఆర్ కండ్రిగ దళితవాడకు చెందిన రవి కుమారుడు ముత్తు(25) జేసీబీ డ్రైవర్. ఇతనికి అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాజేంద్రన్ కుమార్తె అను(22)తో జూన్ 29న గ్రామంలోని వరుడు ఇంట్లో వివాహం జరిగింది.
పది రోజుల వ్యవధిలో ఏం జరిగిందో కానీ మంగళవారం రాత్రి భర్త నిద్రిస్తున్న గదిలో అను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేకువజామున లేచిన ముత్తు భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబీకులకు తెలిపాడు. పొదటూరుపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహమైన పది రోజులకే నవవధువు ఆత్మహత్యకు సంబందించి తిరుత్తణి ఆర్డీఓ విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment