వారంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. నిత్యం కంప్యూటర్లతో తలమునకలవుతుంటారు.. అయితేనేం.. మోడల్స్కు మేమేం తీసిపోమంటూ.. అలవోకగా ర్యాంప్ వాక్ చేశారు.. అంతేకాదు.. ఆహూతులను ఆసాంతం అలరించారు.గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ ఈ వేడుకకు వేదికైంది.. ‘ఆంపిల్ లాజిక్’ సంస్థ 15వ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో సంస్థ ఉద్యోగులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. క్రీడల, ఇతర పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు సంస్థ ప్రోత్సాహకాలను అందజేసి, సత్కరించింది. ఉద్యోగుల సహకారంతో సంస్థ దినదినాభివృద్ధి చెందుతుందని సీఈఒ మన్నె వెంకన్న చౌదిరి
పేర్కొన్నారు.
– లక్డీకాపూల్
Breadcrumb
ఆంపిల్ ర్యాంప్
Published Sat, Jul 20 2024 11:37 AM | Last Updated on Sat, Jul 20 2024 11:37 AM
Advertisement
Related news by tags
-
Asia Cup 2024: పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. రేణుకా శర్మ (4-0-14-2), దీప్తి శర్మ (4-0-20-3), పూజా వస్త్రాకర్ (4-0-31-2), శ్రేయాంక పాటిల్ (3.2-0-14-2) ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అమీన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా (22), మునీబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. గుల్ ఫేరోజా (5), అలియా రియాజ్ (6), నిదా దార్ (8), జావిద్ (0), అరూబ్ షా (2), నశ్రా సంధు (0), సదియా ఇక్బాల్ (0) నిరాశపరిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్.. 14.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధన 45, దయాలన్ హేమలత 14 పరుగులు చేసి ఔట్ కాగా.. హర్మన్ప్రీత్ కౌర్ (5), జెమీమా రోడ్రిగెజ్ (3) భారత్ను విజయతీరాలకు చేర్చారు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది. ఈ మ్యాచ్ జులై 21న జరుగనుంది. కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో యూఏఈపై నేపాల్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయం నేపాల్ను ఆసియా కప్లో మొదటిది. -
Asia Cup 2024: భారత బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (జులై 19) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో పాక్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రేణుకా శర్మ (4-0-14-2), దీప్తి శర్మ (4-0-20-3), పూజా వస్త్రాకర్ (4-0-31-2), శ్రేయాంక పాటిల్ (3.2-0-14-2) ధాటికి పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అమీన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా (22), మునీబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. గుల్ ఫేరోజా (5), అలియా రియాజ్ (6), నిదా దార్ (8), జావిద్ (0), అరూబ్ షా (2), నశ్రా సంధు (0), సదియా ఇక్బాల్ (0) నిరాశపరిచారు. తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్పాకిస్తాన్: సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, మునీబా అలీ(వికెట్కీపర్), నిదా దార్(కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా -
నిప్పులు చెరిగిన మార్క్ వుడ్.. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఓవర్
ఇంగ్లండ్ స్పీడ్ గన్ మార్క్ వుడ్ వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్ తొలి ఓవర్లో వుడ్ బుల్లెట్ లాంటి బంతులతో నిప్పులు వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్ ఓవర్గా (సగటున గంటకు 94.40 మైళ్ల వేగం) రికార్డైంది. ఈ ఓవర్లో (93.9, 96.1, 95.2, 92.2, 96.5, 95.2) వుడ్ ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో సంధించాడు.Mark Wood is steaminnnnggg fireeeee 🔥 pic.twitter.com/DlQTEQFZ11— CricTracker (@Cricketracker) July 19, 2024వుడ్ తన మరుసటి ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో ఓ బంతిని ఏకంగా 97.1 మైళ్ల వేగంతో సంధించాడు. వుడ్ ఈ ఓవర్లోనూ (95, 93, 95, 96, 97.1, 94) ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో విసిరాడు. వుడ్ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఇంచుమించు ఇలాంటి వేగంతో ఓ ఓవర్ వేశాడు. 2023 జులై 19న ఆస్ట్రేలియాతో జరిగిన హెడింగ్లే టెస్ట్లో వుడ్ 92.8, 90.2, 92.5, 92.5, -, 91.6 మైళ్ల వేగంతో బంతులను సంధించాడు.M A R K W 🔥🔥Dpic.twitter.com/fJB1SdSpqI— CricTracker (@Cricketracker) July 19, 2024ప్రస్తుతం తరం బౌలర్లలో ఫాస్టెస్ట్ బౌలర్గా గుర్తింపు ఉన్న వుడ్.. తన కెరీర్లో ఫాస్టెస్ట్ బాల్ను 2022లో పాకిస్తాన్పై విసిరాడు. నాడు ముల్తాన్ టెస్ట్లో వుడ్ గంటకు 98 మైళ్ల వేగంతో బంతిని సంధించాడు. ఇదే అతని కెరీర్లో ఫాస్టెస్ట్ డెలివరీ. ఓవరాల్గా క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు పాక్ మాజీ స్పీడ్స్టర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2003 వరల్డ్కప్లో అక్తర్.. సౌతాఫ్రికాపై ఓ బంతిని 100.23 మైళ్ల వేగంతో సంధించాడు.19th July 2023: Mark Wood bowled one of the fastest overs at Old Trafford against Australia19th July 2024: Mark Wood bowled the fastest over ever by an England bowler at home.He's just unbelievable 🔥 pic.twitter.com/dR8Qv9m0cW— CricTracker (@Cricketracker) July 19, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. 46 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 48, కవెమ్ హాడ్జ్ 37 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 246 పరుగులు వెనుకపడి ఉంది. -
Asia Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీ శ్రీలంకలోని డంబుల్లా వేదికగా ఇవాళ (జులై 19) ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో యూఏఈపై నేపాల్ విజయం సాధించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్పాకిస్తాన్: సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, మునీబా అలీ(వికెట్కీపర్), నిదా దార్(కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా -
చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెట్ టీమ్
నేపాల్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. టోర్నీ చరిత్రలో తొలి విజయం సాధించడంతో నేపాల్ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. విన్నింగ్ రన్ కొట్టగానే నేపాల్ ఆటగాళ్లంతా మైదానంలో చేరి సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.HISTORY CREATED BY NEPAL....!!!- Nepal won their first ever match in Women's Asia Cup history. 🫡 pic.twitter.com/V8CwPaybqe— Johns. (@CricCrazyJohns) July 19, 2024కాగా, మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో యూఏఈ, నేపాల్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేయగా.. నేపాల్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.సత్తా చాటిన ఇందు బర్మాటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నేపాల్ కెప్టెన్ ఇందు బర్మా (4-0-19-3) సత్తా చాటడంతో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. నేపాల్ బౌలర్లు తలో చేయి వేయడంతో యూఏఈ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. షబ్నమ్ రాయ్, కబిత జోషి, క్రితిక తలో వికెట్ పడగొట్టారు. యూఏఈ ఇన్నింగ్స్లో ఇషా రోహిత్ ఓఝా (10), సమైరా ధర్నిధర్కా (13), కవిష ఎగోడగే (22), ఖుషి శర్మ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చెలరేగిన సంజనా116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. ఓపెనర్ సంజనా ఖడ్కా (45 బంతుల్లో 72 నాటౌటగ్; 11 ఫోర్లు) చెలరేగడంతో సునాయాసంగా విజయం సాధించింది. యూఏఈ బౌలర్లలో కవిష 3 వికెట్లతో సత్తా చాటినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment