భద్రాద్రి: ఈ చిత్రంలో కానిస్టేబుల్ డ్రెస్లో ఉన్న యువకుడి పేరు ఆనంద్. ఊరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కోయ రంగాపురం గ్రామపంచా యతీ పరిధి గుంటిమడుగు. ఈ గిరిజన గ్రామంలో గత 67 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరూ లేరు. తాజాగా బంధం బైరాగి – దుర్గమ్మ దంపతుల కుమారుడు ఆనంద్.. కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకుని మంగళవారం స్వగ్రామానికి వచ్చాడు. అతడిని స్థానికులు, యువకులు ఘనంగా స్వాగతించి సత్కరించారు.
– అశ్వారావుపేట రూరల్
నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం
Published Wed, Jul 28 2021 9:58 AM | Last Updated on Wed, Jul 28 2021 7:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment