bhadradri
-
భద్రాచలంలో విషాదం.. బిల్డింగ్ కూలి పలువురి మృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలి ఆరుగురు మృతిచెందారు. ఆరంతస్తుల భవనం కూప్పకూలింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. క్రేన్లు, పొక్లెయిన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి.. భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది.పట్టణంలోని రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఈ భవనాన్ని నాసిరకమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఐటీడీపీవో రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని పలువురు చెబుతున్నారు.సామాజిక కార్యకర్తలపై ఇంటి యజమాని బెదిరింపులకు దిగారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని పలు భవన నిర్మాణాలు ఇలాగే నిబంధన విరుద్ధంగా జరుగుతున్నాయని ఎవరు ఫిర్యాదు చేసిన సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని పలువురు అంటున్నారు. -
నేటి నుంచి ఆన్లైన్లో ‘నవమి’ టికెట్లు
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రి ల్ 6, 7 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభి షేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కల్యాణానికి ఉభయదాతల టికెట్లు రూ.7,500, సెక్టార్ల టికెట్లు రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150, పట్టాభిషేక మహోత్సవానికి రూ.1,500, రూ.500, రూ.100 టికెట్లను ఆన్లైన్లో ఉంచామని వివరించారు.ఉత్సవాలకు రాలేని భక్తుల గోత్రనామాలతో కల్యాణం జరిపించే సేవల కోసం రూ.5,000, రూ.1,116 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వారు ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు దేవస్థానం సమీపంలోని తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి టికెట్లు పొందాలని సూచించారు. నేరుగా విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు.. ఈనెల 20వ తేదీ నుంచి భద్రాచలంలో నేరుగా సెక్టార్ టికెట్లు విక్రయించనున్నారు. రామాలయం వద్ద మెయిన్ కౌంటర్, తానీషా కల్యాణ మండపం, సీఆర్వో కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసు వద్ద వచ్చే నెల 1 నుంచి కౌంటర్ అందుబాటులో ఉంటుంది. -
గొంగడి త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా
భారత యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha)కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్-19 టీ20 ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ఈ ఆల్రౌండర్కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.వారికి పది లక్షల చొప్పునత్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు భారత జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా.. జట్టు హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలినికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.కాగా ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల అండర్–19 వరల్డ్ కప్(ICC U19 Women's World Cup)లో త్రిష అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. తన ఆల్రౌండ్ ప్రతిభతో భారత్ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది ఈ యువ తార. ఈ మెగా ఈవెంట్లో ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగిన త్రిష.. టోర్నమెంట్ చరిత్రలోనే తొలి శతకంతో సత్తా చాటి ప్రపంచ రికార్డుతో మెరిసింది.లీగ్ దశలో భాగంగా స్కాట్లాండ్తో మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 53 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. త్రిష ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లతో పాటు.. నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన త్రిష మొత్తంగా 309 పరుగులు చేసింది. అంతేకాదు.. ఈ లెగ్స్పిన్నర్ ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక సౌతాఫ్రికాతో ఫైనల్లో 33 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచిన గొంగడి త్రిష.. మూడు వికెట్లతో మెరిసి భారత్ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవడంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా త్రిష సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో నూ ఈ తెలుగుతేజానికి చోటు దక్కడం మరో విశేషం. భద్రాద్రి అమ్మాయికాగా తెలంగాణలోని భద్రాద్రికి చెందిన త్రిషకు చిన్ననాటి నుంచే క్రికెట్ మీద మక్కువ. త్రిష ఈ స్థాయికి చేరడంలో ఆమె తండ్రి రామిరెడ్డిది ప్రధాన పాత్ర. కుమార్తె కోసం ఆయన ఎన్నో కష్టనష్టాలకోర్చి.. తన గారాలపట్టిని క్రికెటర్గా తీర్చిదిద్దారు. అందుకే తాను సాధించిన ప్రతి గొప్ప విజయానికి తండ్రికే అంకితం చేస్తుంది ఈ బంగారుతల్లి.ఘన స్వాగతంమలేషియాలో ఐసీసీ టోర్నీ గించుకున్న త్రిష మంగళవారమే హైదరాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అరశనపల్లి జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు భారత జట్టులో సభ్యురాలైన కేసరి ధృతి, టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్, ట్రెయినర్ షాలిని కూడా నగరానికి చేరుకున్నారు. ఈ నలుగురినీ జగన్మోహన్ రావు సన్మానించారు. 19 ఏళ్ల త్రిష తన అద్భుత ఆటతీరుతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిందని ఆయన ప్రశంసించారు. త్రిష, ధృతిలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు అంతర్జాతీయస్థాయికి ఎదగాలని జగన్మోహన్ రావు ఆకాంక్షించారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి వీరికి నగదు బహుమతిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. హెడ్ కోచ్గా నూషీన్ అల్ ఖదీర్కు, ప్లేయర్గా త్రిషకు ఇది వరుసగా రెండో వరల్డ్కప్ టైటిల్ కావడం విశేషం. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు భారత మాజీ స్పిన్నర్ నూషీన్ హెడ్ కోచ్గా వ్యవహరించగా... త్రిష సభ్యురాలిగా ఉంది. 2025లోనూ నూషీన్ హెడ్ కోచ్గా కొనసాగగా... నిలకడగా రాణించిన త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును సాధించింది. కేసరి ధృతి కూడా విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్నా ఆమెకు ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష గారికి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన… pic.twitter.com/0lXZyJpMMg— Telangana CMO (@TelanganaCMO) February 5, 2025 -
త్రిష వరల్డ్ రికార్డు.. అభినందనల వెల్లువ.. భద్రాద్రిలో సంబరాలు
భారత మహిళల క్రికెట్కు భవిష్యత్ తార దొరికింది. అటు బ్యాట్తో అదరగొడుతూ... ఇటు బంతితో మెరిపిస్తూ... తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మహిళల అండర్–19 ప్రపంచకప్ టోర్నీ(U19 Womens T20 World Cup) చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్గా 19 ఏళ్ల త్రిష గుర్తింపు పొందింది.వరల్డ్ రికార్డు.. భద్రాద్రిలో సంబరాలుకాగా 2023లో తొలిసారి జరిగిన అండర్–19 ప్రపంచ కప్లో భారత జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన త్రిష 2025 ఈవెంట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఈ నేపథ్యంలో గొంగడి త్రిషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచకప్ టోర్నీలో శతకంతో బాది వరల్డ్ రికార్డు సాధించిన నేపథ్యంలో ఆమె స్వస్థలం భద్రాచలంలో సంబరాలు జరిగాయి. క్రికెట్లో అసాధారణ ప్రతిభతో సెంచరీ చేయడంతో భద్రాద్రి(Bhadradri) పేరు ఒక్కసారిగా ప్రపంచస్థాయిలో మార్మోగిపోయిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ కప్ క్రికెట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిపి త్రిషకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, సీనియర్ క్రికెటర్ బుడగం శ్రీనివాస్, కొండరెడ్ల సంఘం వ్యవస్థాపకులు ముర్ల రమేశ్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ఎస్కే సలీం, సదానందం, పూనెం ప్రదీప్కుమార్, రేపాక రామారావు, నరేశ్, కోటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, బలుసు సతీశ్, రమేశ్, ఆనంద్ పాల్, ప్రవీణ్, ప్రసాద్, శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు.150 పరుగుల తేడాతో ఘనవిజయంఇదిలా ఉంటే.. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత మహిళల జట్టు తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా... స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్లోనూ చెలరేగిపోయింది. స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 మ్యాచ్లో నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు 150 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది.‘టీనేజ్ స్టార్’ గొంగడి త్రిష ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. స్కాట్లాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష స్కాట్లాండ్ బౌలర్ల భరతం పట్టింది. ఈ క్రమంలో ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసిన ప్లేయర్గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.త్రిష ఆల్రౌండ్ ప్రదర్శనతెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో సెంచరీ మైలురాయిని అందుకుంది. మరో ఓపెనర్ కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) తో కలిసి త్రిష తొలి వికెట్కు 13.3 ఓవర్లలో 147 పరుగులు జోడించింది. కమలిని అవుటయ్యాక సనిక చాల్కె (20 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు)తో కలిసి త్రిష రెండో వికెట్కు అజేయంగా 61 పరుగులు జత చేసింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. 14 ఓవర్లు ఆడి కేవలం 58 పరుగులకే స్కాట్లాండ్ ఆలౌటైంది. 10 వికెట్లను భారత స్పిన్నర్లే తీయడం విశేషం.ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆయుషి శుక్లా 8 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... మరో ఎడంచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మ 5 పరుగులిచ్చి 3 వికెట్లు... లెగ్ స్పిన్నర్ గొంగడి త్రిష 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఈనెల 31న జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలపడుతుంది. అదే రోజున జరిగే మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆ్రస్టేలియా ఆడుతుంది. ఫిబ్రవరి 2న ఫైనల్ జరుగుతుంది. చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా? -
అశ్వాపురం మండలం మొండికుంటలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
-
వెళ్లినంత తేలిక కాదు.. వెనక్కి రావడం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సైన్యంగా పేర్కొనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 24వ వారోత్సవాలు ఈనెల 8తో ముగియనున్నాయి. ఒకప్పుడు పీఎల్జీఏ వారోత్సవాలంటే ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఉద్రిక్తత నెలకొనేది. ఒకవైపు పటిష్ట పోలీసు నిఘా, మరోవైపు ఆ నిఘా నేత్రాల కళ్లుగప్పి మావోయిస్టులకు మద్దతు పలికేవారు కనిపించేవారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. పదేళ్లుగా తెలంగాణపై పట్టు కోసం మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణ నుంచి బస్తర్ వెళ్లిన మావోయిస్టులు.. తిరిగి తెలంగాణలో ప్రభావం చూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కష్టతరమవుతున్నాయి.బస్తర్ వైపు అడుగులుశ్రీకాకుళం జిల్లాలో మొదలైన నక్సల్బరీ ఉద్యమం 80వ దశకంలో ఉత్తర తెలంగాణ జిల్లాలను ఊపు ఊపింది. అప్పటి ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్న జనాలు అన్నలకు అండగా నిలిచారు. యువకులు అడవుల బాట పట్టేందుకు ఉత్సాహం చూపారు. వందలు, వేలుగా వస్తున్న యువతరానికి దళాలుగా శిక్షణ ఇస్తూ భవిష్యత్ లక్ష్యాల దృష్ట్యా తెలంగాణ సరిహద్దులో ఉన్న బస్తర్ అడవులకు పీపుల్స్వార్ గ్రూపు పంపింది. జనతన సర్కార్ పేరుతో బస్తర్లో అన్నలు సమాంతర పాలన స్థాపించారు. దీంతో మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ గ్రీన్హంట్ను 2009లో కేంద్రం చేపట్టింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, కోబ్రా దళాలు నలువైపులా బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టులకు కొత్త స్థావరం అవసరమైంది.తెలంగాణ వైపు..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వస్తే మావోయిస్టులు పాగా వేస్తారంటూ ఆం«ధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది. అందుకు తగినట్టుగానే తెలంగాణ వచ్చాక మావోయిస్టులు ఇటువైపు దృష్టి సారించారు. ఈ క్రమాన తొలి ఎన్కౌంటర్ భద్రాచలం సమీపాన ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలో 2015 జూన్ 15న జరిగింది. ఆ తర్వాత అప్పటి వరంగల్ జిల్లా ములుగులో మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, బ్యానర్లు రావడం మొదలైంది. అనంతరం నిర్మాణ పనుల్లో ఉన్న భారీ యంత్రాలను మావోయిస్టులు తగలబెట్టారు. ముందుగా తమ ఉనికి చాటుకుని.. ఆ తర్వాత దాన్ని సుస్థిరం చేసుకునే యత్నంలో ఉండగా 2015 సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం రంగాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. దీంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలు నెమ్మదించాయి.పదేళ్లలో 98 మంది..తెలంగాణ వచ్చాక 2015లో జరిగిన రంగాపూర్ ఎన్కౌంటర్ మొదలు నిన్నమొన్నటి కరకగూడెం, ఏటూరునాగారం ఎన్కౌంటర్ల వరకు మొత్తం 98 మంది మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 44 సార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పట్టుమని ఆరు నెలలు కూడా దళాలు ఇక్కడ ఆయుధాలతో సంచరించే పరిస్థితి లేదు. పోలీసుల నిఘా పటిష్టంగా ఉండడం ఒక కారణమైతే.. ఏజెన్సీలు, అడవి సమీప గ్రామాల ప్రజల నుంచి గతంలో లభించిన స్థాయిలో మావోయిస్టులకు ఇప్పుడు మద్దతు దొరకడం లేదు. ఫలితంగా తెలంగాణలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతీసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీనికి తోడు వారు కోవర్టుల పేరుతో సృష్టిస్తున్న రక్తపాతం మరింత చేటు తెచ్చింది. చివరకు మావోయిస్టులు తమ గ్రామాల వైపు రావొద్దంటూ ప్రజలు ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది.కాళేశ్వరం మీదుగా..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 2016లో మొదలైన తర్వాత రెండు రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. ఈ నేపథ్యాన ముందుగా మావోయిస్టు సానుభూతిపరులు, ఆ తర్వాత దళాలు మహదేవపూర్ అడవుల్లోకి రాకపోకలు సాగించడం మొదలైంది. అయితే, మహదేవపూర్ – ఏటూరునాగారం ఏరియా పరిధిలో పెద్దగా హింసాత్మక ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. కానీ, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో తరచూ కరపత్రాలు పంచడం, మందుపాతరలను అమర్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఈ క్రమాన 2017 డిసెంబర్ 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఆ తర్వాత 2020 సెప్టెంబర్లో చర్లలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మృతి చెందారు. -
చిత్తశుద్ధి, దూరదృష్టితోనే అభివృద్ధి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిధులు ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదని.. దూరదృష్టి, చిత్తశుద్ధితోనే అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు దక్కుతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శుక్రవా రం ఉదయం ఆయన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల య పండితులు ఆయనకు పరివట్టం కట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ రమా దేవి స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు.తర్వాత రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాచలంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్సెల్ ప్రత్యేక వార్డులను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనులకు రెడ్క్రాస్ సంస్థ ద్వారా అమూల్యమైన సేవలు అందటం అభినందనీయమని అన్నారు. భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిని కేంద్రం నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించారు. కలెక్టరేట్లలో భేటీలు: ఈ పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొత్తగూడెం కలెక్టరేట్, ఖమ్మం కలెక్టరేట్ల లో అధికారులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులతో భేటీ అయ్యారు. అలాగే, శాఖల వారీగా ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సమావేశాల్లో గవర్నర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద, గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించి వారు మెరుగైన జీవితం గడి పేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించా రు. భద్రాద్రి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు బాగుందని అభినందించారు. ఖమ్మంలో గవర్నర్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మాదిరిగా తాను సైతం పర్యావరణ వేత్తగా కెరీర్ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన అందరిలో ఉండా లని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే లు వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, రెండు జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, ముజమ్మిల్ ఖాన్, ఎస్పీ రోహిత్రాజ్, సీపీ సునీల్దత్, ఐటీడీఏ పీఓ రాహుల్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు. -
భద్రాద్రిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, రాష్ట్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శివరాజ్సింగ్ చౌహాన్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ పర్యటనలో భాగంగా తుమ్మల కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు అంశాలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రా లు అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్నగర్లో ఎయిర్పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు. తెలంగాణలో నూతన కోకోనట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరానన్నారు. ఆయిల్పామ్ మీద 28% దిగుమతి సుంకం విధించి, దేశీయంగా ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నందుకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్పామ్కు కేంద్రం కనీస మద్దతు ధర కలి్పంచాలని కోరారు. అలాగే ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని కూడా విన్నవించారు. ఇటీవలి వరదల్లో నష్టపోయిన ఖమ్మం జిల్లాకు తగిన మొత్తంలో సహాయం అందజేయాలని కోరారు. నష్టంపై నివేదిక రాగానే సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ను కలిసి, తెలంగాణలో ఎక్కువగా పండే పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అలాగే.. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొని.. తెలంగాణలోని అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని ఆహా్వనించానన్నారు. సాగు చేసేవారికే రైతుబంధువ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కౌలు రైతు, భూమి యజమాని చర్చించుకొని రైతుబంధు ఎవరు తీసుకోవాలన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు. ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో కౌలు రైతు ఒప్పందాలు లేవని గుర్తుచేశారు. ఐదేళ్లలో కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, ఒకేసారి రూ.18,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అవసరమైతే ఇంకా నిధులు సమకూరుస్తామని తెలిపారు. ప్రతి పంట, ప్రతి రైతుకు వర్తించేలా రూ.3,000 కోట్లతో బీమా చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. -
Vamsi Modem: బస్తాలు మోసిన భుజం.. పతకాలు తెస్తోంది!
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువు ఆపేసిన భద్రాద్రి ఏజెన్సీకి చెందిన మోడెం వంశీ ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నాడు. కూలీగా మొదలైన ప్రస్థానం ఇపుడు కామన్ వెల్త్ దిశగా సాగుతోంది...మోడెం వంశీ స్వస్థలం ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని వాజేడు మండలం ఇప్పగూyð ం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువును అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో బతుకుదెరువు కోసం పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపట్నంలో ఓ నర్సరీలో పని చేస్తున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు. అక్కడ నర్సీరీలో 50 కేజీల బరువు ఉన్న యూరియా బస్తాలను అలవోకగా ఎత్తుకుని తిరగడాన్ని ఆ నర్సరీ యజమాని, మాజీ వెయిట్ లిఫ్టరైన అబ్దుల్ ఫరూక్ గమనించాడు.దీంతో నర్సరీ ప్రాంగణంలోనే వంశీలో ఉన్న ప్రతిభకు సాన పట్టాడు. ఎంతటి బరువులైనా అవలీలగా ఎత్తేస్తుండటంతో తక్కువ సమయంలోనే ఇబ్రహీంపట్నం నర్సరీ నుంచి భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ మీదుగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని పవర్ లిప్టింగ్ హాల్కు వంశీ అడ్రస్ మారింది హైదరాబాద్లో పార్ట్టైం జాబ్ చేస్తూనే ఎల్బీ స్టేడియంలో వంశీ కోచింగ్ తీసుకునేవాడు. అక్కడ పవర్ లిఫ్టింగ్లో ఇండియా తరఫున ఏషియా లెవల్ వరకు ఆడిన సాయిరాం వంశీ ఎదుగుదలకు అండగా నిలిచాడు.గోవాలో 2021లో జరిగిన పోటీల్లో మొదటిసారి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు వంశీ. ఆ తర్వాత 2022లో కేరళ, హైదరాబాద్లో 2023లో ఇండోర్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ఈ ఏడాది రాజస్థాన్, పటియాల (పంజాబ్)లో జరిగిన పోటీల్లోనూ వంశీ పతకాలు గెల్చుకున్నాడు. దీంతో యూరప్లోని మాల్టా దేశంలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు వంశీని ఎంపిక చేస్తూ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2024 జూన్ లో నిర్ణయం తీసుకుంది."ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్ 280 కేజీలు, బెంచ్ప్రెస్ 140 కేజీలు, డెడ్లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం స్థానం దక్కింది."తొలిసారిగా విదేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం దక్కిందనే ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. పాస్పోర్టు, వీసా, ప్రయాణం తదితర ఖర్చులకు రూ. 2.10 లక్షల అవసరం పడింది. హైదరాబాద్లో స్పాన్సర్లు దొరకడం కష్టం కావడంతో తన వెయిట్ లిఫ్టింగ్ ప్రస్థానం మొదలైన భద్రాచలంలోని సిటీ స్టైల్ జిమ్లో కోచింగ్ ఇచ్చిన రామిరెడ్డిని సంప్రదించాడు. క్రౌడ్ ఫండింగ్ కోసం లోకల్ గ్రూప్లలో రూ.100 వంతున సాయం చేయండి అంటూ మెసేజ్లు పెట్టాడు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు పట్టణానికి చెందిన వైద్యులు సోమయ్య, శ్రీకర్, కృష్ణప్రసాద్, రోశయ్య, స్పందనలు తమ వంతు సాయం అందించారు.యూరప్ వెళ్లేందుకు వీసా కోసం కాన్సులేట్లో జరిగిన ఇంటర్వ్యూలో వంశీకి ఊహించని ఇబ్బంది ఎదురైంది. ‘యూరప్ ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నావ్?’ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంగ్లీష్లో ప్రశ్నిస్తే ‘ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నావు?’ అని అడిగినట్లు భావించి ‘పార్ట్టైం జాబ్’ అని బదులు ఇచ్చాడు వంశీ. వీసా క్యాన్సల్ అయ్యింది. దీంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన రూ.20వేలు వృథా కాగా మళ్లీ స్లాట్ బుకింగ్కు రూ.15 వేల వరకు అవసరం పడ్డాయి. ఈసారి ఆర్థిక సాయం అందించేందుకు భద్రాచలం ఐటీడీఏ – పీవో రాహుల్ ముందుకు వచ్చాడు.ఇంగ్లీష్ గండం దాటేందుకు స్నేహితులు, కోచ్ల ద్వారా ప్రశ్నా – జవాబులు రాయించుకుని వాటిని ్రపాక్టీస్ చేశాడు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఫోన్ చేసి నేర్చుకున్న దాన్ని వల్లెవేయడం, అద్దం ముందు మాట్లాడటం చేస్తూ చివరకు వీసా గండం గట్టెక్కాడు. ఈ పోటీలో పాల్గొనే బృందం ముందుగానే మాల్టా వెళ్లిపోయింది. దీంతో ఆగస్టు 25న హైదరాబాద్ నుంచి ముంబైకి వంశీ ఒక్కడే బస్సులో వెళ్లాడు. అక్కడి నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ మీదుగా మాల్టా వరకు ఎయిర్బస్లో చేరుకున్నాడు.ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్æ 280 కేజీలు, బెంచ్ప్రెస్ 140 కేజీలు, డెడ్లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం దక్కింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో వచ్చే అక్టోబరులో జరిగే కామన్ వెల్త్ గేమ్స్లో సత్తా చాటేందుకు వంశీ సిద్ధం అవుతున్నాడు. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం. -
కలెక్టర్, పీవో అడవిబాట
దుమ్ముగూడెం: ఇద్దరు ఐఏఎస్లు.. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్, మరొకరు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్. పోడు సాగు అంశంపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనలతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడవిబాట పట్టారు. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో రానుపోను 10కి.మీ. నడిచారు. సమస్య ఏంటంటే...భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్ పరిధిలో పలువురు రైతులకు కొన్నాళ్ల క్రితం పోడు పట్టాలు అందాయి. అయితే, ఈ భూమిలో అటవీ అధికారులు తమను సాగు చేసుకోనివ్వడం లేదని, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ 23మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న కోర్టు సూచనలతో కలెక్టర్ పాటిల్, పీవో రాహుల్ మంగళవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం మండలంలోని ములకనాపల్లి ప్రధానరహదారి వరకు మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల్లో వెళ్లారు.అక్కడినుంచి దట్టమైన అడవిలో రెవెన్యూ, అటవీ అధికారులతో కలిసి కాలిబాటన వాగులు, వంకలు దాటుతూ గౌరారం వరకు 5 కి.మీ. వెళ్లి సమస్యపై రైతులు, అటవీ అధికారులతో మాట్లాడారు. అడవిని నరికారని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమించినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పాటిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హక్కు పత్రాల్లో ఉన్నంత మేరకు భూమి సాగు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సమయాన అటవీ ప్రాంతంలో ఇద్దరు ఐఏఎస్లు పర్యటించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం అమలు..
-
దెయ్యం చేపలు!
భద్రాచలం: తిరుమలాయపాలెం మండలంలోని బీసురాజుపల్లి ఆకేరు చెక్డ్యామ్ నీటిలో గిరిజనులకు సముద్ర జలాల్లో మాత్రం కనిపించే వింత రకం చేపలు లభించాయి. సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంల్లోనూ పెంచుతారని తెలుస్తోంది. స్థానికంగా వీటిని దయ్యం చేపలుగా పిలుస్తుండగా, వరదల సమయాన ఆకేరు చెక్డ్యామ్లోకి చేరినట్లు భావిస్తున్నారు. కాగా, ఇవి చెరువుల్లోకి చేరితే ఇతర చేపల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి ‘భద్రాద్రి’ గుదిబండే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం గుదిబండగా మారిందని విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్రావు, తిమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్కి వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన బీహెచ్ఈఎల్కు పనులు అప్పగించడం, కాలం చెల్లిన సబ్క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడమే దీనికి కారణమన్నారు. రూ.7,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించగా, వాస్తవ వ్యయం రూ.10 వేల కోట్లు దాటిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ముందు బుధవారం హాజరై తమ పిటిషన్లకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తికాక ముందే రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభమైందని, విద్యుత్ కొరత తీర్చడంలో ఈ విద్యుత్ కేంద్రం పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. విద్యుత్ కొరతను అధిగమించే సాకుతో టెండర్లు లేకుండా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని తెలిపారు. 2017లో ఛత్తీస్గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చేనాటికే భూపాలపల్లిలో 800 మెగావాట్ల కేటీపీపీ, జైపూర్ (మంచిర్యాల జిల్లా)లో 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్తోపాటు జూరా లలో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అందుబాటులోకి వచ్చిందని తిమ్మారెడ్డి కమిషన్కు వివరించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ రాకున్నా విద్యుత్ లైన్ల కోసం రూ.630 కోట్లను చెల్లించారని తప్పుబట్టారు. యూనిట్కు రూ.3.90 ధరతో ఛత్తీస్గఢ్ విద్యుత్ వస్తుందని ఒప్పందం చేసుకోగా, వాస్తవ ధర రూ.5.40కు పెరిగిందన్నారు. ఆ సమయంలో దేశంలో రూ.4.20కే కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా విద్యుత్ లభించిందని ఆధారాలను కమిషన్కు అందజేశారు. మూడేళ్ల తర్వాతే ఛత్తీస్గఢ్ విద్యుత్ వచ్చింది.. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం 2014లో జరిగితే మూడేళ్ల తర్వాత 2017–18 నుంచి సరఫరా ప్రారంభమైందని, 1000 మెగావాట్లకు గాను 75 శాతమే వచ్చిందని వేణుగోపాల్రావు అన్నారు. విద్యుత్ బిల్లుల వివాదంతో 2022 ఏప్రిల్ నుంచి ఛత్తీస్గఢ్ విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్కు రూ.10–20 వరకు అధిక ధరతో రాష్ట్రం విద్యుత్ కొనాల్సి వచ్చిందన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా అయ్యేందుకు 1000 మెగావాట్ల పవర్ గ్రిడ్ లైన్లను బుక్ చేసుకోగా, పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోయినా రూ.650 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మరో 1000 మెగావాట్ల కారిడార్ను బుక్ చేసుకొని రద్దు చేసుకోవడంతో రూ.261 కోట్లను పరిహారంగా చెల్లించాలని ఎలక్రి్టసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్లో పవర్గ్రిడ్ దావా వేసిందని పేర్కొన్నారు. ఒప్పందం మేరకు రావాల్సిన విద్యుత్ రాకున్నా ఛత్తీస్గఢ్కు రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. -
కేసీఆర్ కు నోటీసులు
-
సీతమ్మకు త్రీడీ చీర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్. ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్ బ్లడ్ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా విజయ్కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్కుమార్ నేసి అభినందనలు అందుకున్నారు. -
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. -
ప్రమాద స్థాయిలో.. భద్రాద్రి గోదావరి!
భద్రాచలం: తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నమే నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ ఎ.ప్రియాంక వరద తీవ్రత, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పొంగి పొర్లుతున్న ఉపనదులు.. ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి బుధవారం 5.20 లక్షల క్యూసెక్కులు, గురువారం మధ్యాహ్నం 6.20 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరదను దిగువకు వదిలారు. దీనికి ఇంద్రావతి నుంచి వస్తున్న సుమారు నాలుగు లక్షల క్యూసెక్కుల జల ప్రవాహం జతవుతోంది. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజాము వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగులకు చేరుకోవచ్చని అధికారుల అంచనా. ప్రవాహం ఇలాగే కొనసాగితే నేటి సాయంత్రానికి 53 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉంటేనే నష్ట నివారణ గోదావరి నీటిమట్టం గతేడాది అత్యధికంగా 71.3 అడుగులకు చేరి బీభత్సం సృష్టించడంతో.. అధికారులు ఈ ఏడాది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జూలై ప్రారంభంలోనే జిల్లా, డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి మండల, డివిజన్ స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక దాటితే ఏజెన్సీలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి. భద్రాచలం నుంచి ఇతర మండలాలకు రాకపోకలు స్తంభిస్తాయి. ప్రధానంగా దుమ్ముగూడెం మండలం తూరుబాక, రేగుపల్లి, నడికుడి, గంగోలు, బైరాగులపాడు గ్రామాల వద్ద, చర్ల మండలం కుదునూరు, సుబ్బంపేట గ్రామాల వద్ద ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, నెల్లిపాక, కూనవరం మండలాలకు సైతం పూర్తిగా రవాణా స్తంభిస్తుంది. పునరావాస శిబిరాలు సిద్ధం వరద తీవ్రత పెరిగితే బాధితులను తరలించేందుకు ముందుగానే పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. మండలానికో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా బఫర్ స్టాక్ ఉంచారు. ప్రజలను తరలించేందుకు ట్రాక్టర్లు, జేసీబీలు, లైఫ్ జాకెట్లు, పడవలను సిద్ధంగా ఉంచారు. నేడు మంత్రి పువ్వాడ రాక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. శుక్రవారం ఆ స్థాయికి వరద వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలంలో మకాం వేయనున్నారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఆయన ఇక్కడే ఉంటారు. మంత్రితో పాటు ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ అనుదీప్ సైతం ప్రత్యేక సేవలు అందించేందుకు ఇక్కడికి వస్తున్నారు. గతేడాది 71 అడుగుల స్థాయికి వరద వచ్చినా, ప్రాణ నష్టం జరగకుండా వీరిద్దరూ పక్కా ప్రణాళికతో పని చేశారు. దీంతో ఈసారి వరద సహాయ కార్యక్రమాల కోసం మరోసారి భద్రాచలం వస్తున్నారు. -
ఆకాశయానం అందని ద్రాక్షేనా?
భద్రాద్రి: రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్డుల నిర్మాణంపై గతేడాది ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇందులో వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్, నిజామాబాద్ (జక్రాన్పల్లి) ఎయిర్పోర్టుల ప్రస్తావనే వచ్చింది తప్పితే కొత్తగూడెం ఊసే లేదు. అప్పటి వరకు తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ప్రస్తావన ఎప్పుడొచ్చినా కొత్తగూడెం పేరు తప్పకుండా ఉండేది. మరోవైపు విమాన ప్రయాణ, రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఆకాశయానం అవకాశం కల్పించేందుకు కేంద్రం ఉడాన్ (ఉడే దేశ్కి ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా కొత్తగూడెం పేరు లేకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొత్తగా ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన రేణుకాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆమె చూపిన చొరవతో కొత్త ఎయిర్పోర్టుల ప్రతిపాదనల్లో కొత్తగూడెం పేరు కూడా చేరింది. అయితే గత 15 ఏళ్లుగా ఎయిర్పోర్టు అంశం విక్రమ్ బేతాళ్ కథలా మారిపోయింది. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తాయి. ఆ తర్వాత విడతల వారీగా నిపుణుల బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తాయి. వారి సూచనలకు అనుగుణంగా, జిల్లా యంత్రాంగం ఎయిర్పోర్టు నిర్మాణం కోసం సర్వేలు చేపడతాయి. పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాయి. అంతే ఇక ఆ తర్వాత ఉలుకూపలుకూ ఉండదు. మూడుసార్లు ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. విమానాశ్రయం ముచ్చట సాగిందిలా.. ► కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి 2008లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. నాటి నుంచి 2014 వరకు కాగితాల్లో ప్రతిపాదనలే తప్ప క్షేత్ర స్థాయిలో అంగుళం పని కూడా జరగలేదు. ► తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు ఎయిర్పోర్టు పనుల్లో దూకుడు పెంచారు. ► ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కోసం 2015 జనవరి నుంచి 2017 మార్చి వరకు అన్వేషణ సాగింది. ► పాల్వంచ మండలం పునుకుడుచెలక దగ్గర 1600 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు. ► ఈ స్థలాన్ని తమకు అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని 2017 మార్చిలో కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. ► పునుకుడుచెలక దగ్గరున్న స్థల సేకరణకు పర్యావరణ, అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ, సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డొచ్చాయి. దీంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ► 2019లో పాల్వంచ మండలంలో సర్వే నంబర్ 441లో ఉన్న 700 ఎకరాల స్థలాన్ని పరిశీలనలోకి తీసుకున్నారు. శ్రీనివాసకాలనీ నుంచి బంగారుజాల వరకు ఉన్న భూములను ఎంపిక చేసి 2020లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిశీలనకు పంపారు. ► విమానాలు ల్యాండ్, టేకాఫ్ అయ్యేందుకు బంగారుజాల దగ్గరున్న స్థలం అనువైనదా, కాదే అనే అంశాలను ఏఏఐ బృందం 2021లో పరిశీలించింది. ఆ తర్వాత ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన శాఖాపరమైన అనుమతుల కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అప్పటి నుంచి ఎయిర్పోర్టు పనులు ముందుకు సాగలేదు. దృష్టిపెట్టండి.. పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా భద్రాద్రి జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే దేశ నలుమూల నుంచి పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆకాశయాన సౌకర్యం లేక సింగరేణి, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, హెవీ వాటర్ ప్లాంట్, పేపర్బోర్డు తదితర పరిశ్రమల్లో పనిచేసే ఉన్నతాధికారులు, నిపుణులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే ఎయిర్పోర్టు నిర్మాణంపై అవసరమైన దృష్టిపెట్టడం లేదనే అపవాదు ను జిల్లా ప్రజాప్రతినిధులు మూటగట్టుకున్నారు. ఇప్పటికై నా ఎయిర్పోర్టు నిర్మాణంలో కదలిక వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆకాశయానం జిల్లా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. పదిహేనేళ్లుగా ఇదుగో అదుగో అంటూ ప్రకనటలు చేయడం, ఆపై సర్వేలు అంటూ హడావుడి చేయడం మినహా ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. -
టికెట్ ప్లీజ్..! ఎమ్మెల్యే స్థానం కోసం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్గా పనిచేసిన గడల శ్రీనివాసరావు కొత్తగూడెంలో ఈ సారి టికెట్టు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఆ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ట్రస్టు ద్వారా సేవలు చేస్తూ అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. నా జీవితం.. ప్రాణం కొత్తగూడెం ప్రజల కోసమేనని చెబుతూ అందరి మనసులను గెలుచుకునే పనిలో పడ్డారు. కన్న తల్లిని.. పుట్టిన భూమిని మర్చిపోకూడదనే ఇక్కడ సేవ చేయడానికి వచ్చానని చెప్పారు. రావణాసురుడి పాలన.. రాష్ట్రమంతా రామరాజ్యం నడుస్తుంటే కొత్తగూడెంలో మాత్రం ఓ రావణాసురుడు పాలిస్తున్నాడని తెలంగాణా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడి ప్రజలను, అధికారులను ఇబ్బంది పెడుతూ రాజ్యాన్ని నడిపిస్తున్నాడని దుయ్యబట్టారు. కొత్తగూడెం ప్రాంత ప్రజలకు ఇకపై తాను కాపలా కాస్తానని చెప్పారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న తనను కావాలని ఇబ్బంది పెడితే తానేంటో కూడా చూపిస్తానని హెచ్చరించారు. ఎన్నో సేవలు చేశా.. కొత్తగూడెం ప్రాంతంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించాలనే ధ్యేయంతో జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాని శ్రీనివాసరావు చెప్పారు. మెగా హెల్త్ క్యామ్ప్ లు పెట్టి సుమారు 200 మందికి నాలుగు కోట్ల రూపాయల విలువైన వైద్యాన్ని అందించామని అన్నారు. 8వేల మంది నిరుద్యోగులకు జాబ్ మేళా లు నిర్వహించి 4 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు శ్రామిక శక్తి అవార్డులు బహుకరించి గౌరవించుకున్నామని స్పష్టం చేశారు. వందలాదిమంది నిరుద్యోగ యువతకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉచిత కోచింగ్ ఇప్పించి భోజనాలు పెట్టించామని అన్నారు. మహిళలకు కుట్టు మిషన్ లు పంపిణీ చేశామని చెప్పారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫర, ఆరో ఓ ప్లాంట్ లను ఏర్పాటు చేసి మంచినీటిని అందించామని చెప్పారు. అభిమానాన్ని తొలగించగలరా? పుట్టిన రోజు సందర్భంగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి పర్యటన సందర్భంగా మా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు కావాలని తొలగించారని ఆరోపించారు. తమ ట్రస్ట్ ద్వారా లబ్ది పొందిన వ్యక్తి చేతే ఫ్లెక్సీ తొలగించారు కానీ అతని గుండెల్లో తనపై ఉన్న అభిమానాన్ని తొలగించగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను రిక్వెస్ట్ చేసి మొదటి మెడికల్ కాలేజ్ ను సాంక్షన్ చేయించానని చెప్పారు. ఏసీ కారు, బంగ్లా, మంచి పొజీషన్ వదిలి ఇక్కడకు వచ్చి సేవ చేస్తున్నానని అన్నారు. ఇదీ చదవండి: క్షమాణలు చెప్పాకే మోదీ వరంగల్లో అడుగు పెట్టాలి: కేటీఆర్ -
భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. సీతారాముల కళ్యాణం
-
పోలీసుల అదుపులో ఒడిశా యువతులు
భద్రాద్రి: పొట్టకూటి కూసం ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతులు తమిళనాడు రాష్ట్రానికి వెళ్తూ మార్గమధ్యలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఒడివా రాష్ట్రం కోరాపుట్కు చెందిన 13 మంది యువతులు తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూట్లోని ఓ దుస్తుల కంపెనీలో పనిచేసేందుకు వెళ్తున్నారు. యువతులు రెండు కార్లు (వాహనాల్లో) బయలు దేరారు. మార్గమధ్యలో ఓ కారు చెడిపోయింది. దీంతో ఒకేకారులో సర్దుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చండ్రుగొండలోని ఓ పెట్రోల్బంకులో కారు ఆపి సేదతీరుతున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ విజయలక్ష్మి సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. యువతుల వద్ద ఉన్న కంపెనీ గుర్తింపు కార్డులను పోలీసులు తనిఖీ చేయగా అవి ఓ ప్రముఖ దుస్తుల కంపెనీకి చెందినవిగా ఉన్నాయి. కాగా, ఈ అంశంపై డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ను వివరణ కోరగా పోలీసులకు పట్టుపడిన యువతులను ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం యువతులను పంపిస్తామన్నారు. -
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
-
వివాహిత ఆత్మహత్య
భద్రాద్రి: మండల కేంద్రంలోని అంబేడ్కర్నగర్కు చెందిన వివాహిత కుక్కముడి శ్రావణి (25) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఆమెను తన భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. అంబేడ్కర్నగర్కు చెందిన శ్రావణి, దివ్యతేజ్కుమార్ నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రావణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని దివ్యతేజ్కుమార్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ, భర్తే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు శ్రావణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి తల్లి రాధ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూలూరుపాడు సీఐ వసంత్కుమార్, ఎస్ఐ విజయలక్ష్మి ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్!
భద్రాచలంఅర్బన్: పట్టణంలో ఆదివారం ఓ లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన రావూరి అరుణ (35)ను ఆమెకు అల్లుడు వరసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అరుణ హైదరబాద్లో ఆమె భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 14వ తేదీన అరుణ.. తనకు కడుపులో నొప్పి వస్తోందని, ఆమె సొంత గ్రామం అయిన తిరువూరులో వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులు (అరుణ భర్త కృష్ణార్జున్రావు మేనల్లుడు)తో కలిసి భద్రాచలం పట్టణానికి చేరుకొని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఒక రోజు అదే గదిలో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఇది తెలిస్తే పరువుపోతుందని గ్రహించిన అరుణ గదిలో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని అరుణ కుటుంబ సభ్యులకు తెలిపామని పోలీసులు చెప్పారు. సోమవారం అరుణ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు పరిశీలించి ఆమె మెడ చుట్టూ కమి లి ఉన్న గాయాన్ని బట్టి ఆంజనేయులే చీర ను అరుణ గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేసి నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠి నంగా శిక్షించాలని వారు కన్నీటిపర్యంతమ య్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు. -
భద్రాద్రిలో వైభవంగా మహా పట్టాభిషేక మహోత్సవం (ఫొటోలు)
-
రామయ్య తలంబ్రాలు గంటకు 1,500 ప్యాకెట్లు
భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. భద్రాచలంలో కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు పంచడంతోపాటు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేవారికి సరఫరా చేసేందుకు దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు తలంబ్రాలు అందించేందుకు వీలుగా ప్రత్యే క యంత్రాల ద్వారా వాటిని ప్యాకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తలంబ్రాల తయారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. రామయ్య కల్యాణ తలంబ్రాలు కావాల నుకునేవారు మీసేవ కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇన్నాళ్ల ఇబ్బందికి చెక్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏటా శ్రీసీతా రాముల కల్యాణ మహోత్స వాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతారాములకు సమర్పించే ముత్యా ల తలంబ్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ముత్యాల తలంబ్రాలను ఇంటికి తీసుకెళితే మంచి జరు గుతుందన్న భావనతో చాలా మంది భక్తులు తీసుకుంటుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగానే ముత్యాల తలంబ్రాలను అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండి కల్యాణోత్సవానికి హాజరు కాలేని వారితోపాటు బంధువులు, స్నేహితులకు అందజేసేందుకు కావాలను కునే భక్తుల కోసం దేవస్థానం రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాలను విక్రయిస్తోంది. గతంలో ఈ తలంబ్రాలను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో ప్యాకింగ్ చేయించేవారు. దీనితో చాలా సమయం పట్టడంతోపాటు ఆ ప్యాకెట్లు రవాణాలో చిరిగిపోయేవి. ఈ క్రమంలోనే వేగంగా ప్యాకింగ్ చేయడం, రవాణాలో దెబ్బతినకుండా ఉండేలా దేవస్థానం అధికారులు ప్యాకింగ్ యంత్రాలపై దృష్టిపెట్టారు. దాతల చేయూతతో యంత్రాలు.. ముత్యాల తలంబ్రాలు, పులిహోర ప్రసా దం ప్యాకింగ్ యంత్రాల కోసం దేవస్థానం అధికారులు దాతలను సంప్రదించారు. తిరుపతి ఖాదీబండార్కు చెందిన కుమార్ కిట్టు యాజమాన్యం రూ.1.40 లక్షలతో తలంబ్రాల ప్యాకింగ్ యంత్రాన్ని, శశి విద్యాసంస్థల యాజమాన్యం రూ.1.50 లక్షల విలువైన ప్యాకింగ్ కవర్లను సమకూ ర్చాయి. ఇక రూ.1.45 లక్షల విలువైన పులిహోర ప్రసాదం ప్యాకింగ్ యంత్రాన్ని తులసి ఆస్పత్రి యజమాన్యం ఏజేఆర్ సేవా సంస్థ పేరుతో సమకూర్చింది. గంటకు 1,500 ప్యాకెట్లు యంత్రంలో తలంబ్రాల నడుమ ముత్యాలు ఉంచి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ప్యాకెట్లు తయారై బయటికి వస్తాయి. ఈ యంత్రం ద్వారా నిమిషానికి 25 చొప్పున గంటకు 1,500 ప్యాకెట్లు సిద్ధమవుతున్నాయి. రోజూ సుమారు 20 వేల వరకు ప్యాకెట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. పులిహోర ప్యాకింగ్ యంత్రం ద్వారా గంటకు 1,400 వరకు ప్యాకెట్లు సిద్ధ మవుతున్నాయి. ఇటీవలి వరకు రోజువారీగా విక్ర యించే ప్రసాదాన్ని ప్యాక్ చేయాలంటే కార్మికులకు ఒకపూటంతా పట్టేదని.. ఇప్పుడు 2 గంటల్లోనే పని పూ ర్తవుతోందని అధికారులు చెప్పారు. పోస్టల్ శాఖ, ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను భక్తులకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు. -
భద్రాద్రి రాములోరి కల్యాణానికి చీరాల గోటి తలంబ్రాలు
చీరాల: భద్రాద్రి సీతారాముల కల్యాణం అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు ఎనలేని భక్తిభావం. అవకాశం ఉన్నవాళ్లు భద్రాద్రి వెళ్లి ఆ కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోతారు. వెళ్లలేని వాళ్లు టీవీల్లో వీక్షిస్తూనే భక్తిభావంతో ఉప్పొంగిపోతారు. సీతారాముల కల్యాణ క్రతువులో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తలంబ్రాలలో వినియోగించే బియ్యాన్ని గోటితో ఒలిచి స్వామివారికి సమర్పించే అవకాశం క్షీరపురిగా పిలిచే చీరాల వాసులకు వరుసగా తొమ్మిదోసారి దక్కింది. సీతారాముల కల్యాణానికి వడ్లను గోటితో ఒలిచి ఇక్కడి నుంచి పంపించడం ఈ ప్రాంత ప్రజలు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఈ మహాసంకల్పానికి చీరాలకు చెందిన సిద్ధాంతి పి.బాలకేశవులు, మరికొందరు పూనుకుని నియమనిష్టలతో నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చీరాలలో శ్రీ రఘురామ భక్తసేవా సమితి 2011లో 11మందితో ఏర్పాటైంది. వీరికి భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తలంబ్రాలు అందించే అవకాశం పూర్వజన్మ సుకృతంలా వచ్చింది. తలంబ్రాల కొరకు వడ్లను ఎంతో శ్రమంచి ఒలిచి, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి.. నియమనిష్టలతో, శాస్త్రోక్తంగా తలంబ్రాలు చేస్తారు. విజయదశమి నుంచి ప్రారంభించి ఉగాది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2015 అక్టోబర్ 23న చేపట్టిన ఈ మహా కార్యక్రమంలో.. ఏటా వందలాది భక్తులు పాల్గొంటున్నారు. విదేశాల్లోని వారికీ భాగస్వామ్యం రాములోరి కల్యాణానికి అవసరమైన తలంబ్రాలను తయారు చేసే క్రతువులో స్థానికంగానే గాక దేశ, విదేశాల్లోని తెలుగు వారిని కూడా భాగస్వాములు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లోని 10 వేల మంది భక్తులు ఇందులో భాగస్వాములయ్యారు. కమిటీ ప్రతినిధులు సీతారామ కల్యాణ వైభోగం, భద్రాద్రి సీతారామ కల్యాణం పేర్లుతో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించారు. ఆసక్తి ఉన్న భక్తులను గ్రూపుల్లో చేర్చుకుని ఆయా ప్రాంతాలలో పర్యవేక్షకులుగా ఉన్న వారి ద్వారా భక్తులకు వడ్లు ఇచ్చారు. మరికొందరికి కొరియర్ ద్వారా పంపారు. అమెరికా నుంచి నాలుగేళ్లుగా వక్కలగడ్డ వెంకటేశ్వరరావు, పద్మజ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలానే దక్షిణాఫ్రికాలో 400 మంది భక్తులు మూడు సంవత్సరాలుగా వడ్లు ఒలిచి పంపిస్తున్నారు. ఇక్కడ ఆత్మకూరి శ్రీనివాసరావు, అప్పాజోస్యుల వీరవెంకటశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 25న భద్రాద్రికి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, భద్రాద్రికి తీసుకెళ్తారు. పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాం భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను అందించే అవకాశం మాకు కలగడం పూర్వజన్మ సుకృతమే. ప్రతి సంవత్సరం మేమంతా కలిసి తలంబ్రాలు తయారు చేస్తున్న విధానంపై దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు సంతృప్తి చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే. – పొత్తూరి బాలకేశవులు, చీరాల -
నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం
ట్రాక్టర్ నడుపుతున్న బడియా సావిత్రిది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం. మత్స్యకార కుటుంబానికి చెందిన సావిత్రి పెద్దగా చదువుకోలేదు. కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ కూలీగా పనిచేసేది. ఆడవాళ్లు కార్లు, బైక్లు, బస్సులు, రైళ్లు, విమానాలు నడుపుతున్నారు, ట్రాక్టర్ కూడా నడపవచ్చు అనుకుంది. డ్రైవింగ్ నేర్చుకుంది. తనకు సొంతంగా ట్రాక్టర్ ఉంటే బావుణ్నని కలగన్నది. స్వయంసహాయక బృందంలో సభ్యురాలు కావడంతో గత ఏడాది ఆమెకు ‘స్త్రీ నిధి’ నుంచి 80వేలు, గ్రామ సంఘం నుంచి లక్ష రూపాయల లోన్ వచ్చింది. ఆ డబ్బు డౌన్ పేమెంట్గా కట్టి వాయిదాల పద్ధతిౖపై ట్రాక్టర్ కొన్నది. ప్రస్తుతం తన ట్రాక్టర్ను తానే నడుపుతూ వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులు చేసుకుంటోంది సావిత్రి. ►విజయవాడ నగరం, రామలింగేశ్వర నగర్ నివాసి రమాదేవి. . భర్త వ్యసనపరుడై మరణించాడు. ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ఇంత కష్టమైన పనిని చేయడానికి ముందుకు వచ్చింది. ఎయిర్ బ్రేక్ సిస్టమ్ మెకానిక్గా పని చేస్తోంది. ►ఆటో నడుపుతున్న సరస్వతి సుమతిది నెల్లూరు నగరం. ఇంటర్ వరకు చదువుకున్న సుమతి పిల్లల పోషణ కోసం ఆటో నడుపుతూ, పిల్లలతో పాటు చదువును మళ్లీ మొదలు పెట్టి బీఎల్ పూర్తి చేసింది. ►స్వరూపరాణిది పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం, గంగన్నగూడెం. ఆడవాళ్లు వేదాలను ఎందుకు చదవకూడదనే ప్రశ్నకు తానే జవాబుగా నిలవాలనుకుంది. వేదాలు ఔపోశన పట్టి, బ్యాంకు మేనేజర్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పౌరోహిత్యం చేస్తున్నారు. ►నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు సర్పంచ్ గొడ్డేటి వెంకటసుబ్బమ్మ... పొలం దుక్కి దున్నడంతోపాటు నిమ్మచెట్లకు తెగుళ్లు సోకితే స్ప్రేయర్తో క్రిమిసంహారక మందులను స్వయంగా పిచికారి చేస్తుంది. ►కాచరమైన కళమ్మ ఉండేది కుషాయిగూడ హైదరాబాద్లో.మొదట భవన నిర్మాణ కార్మికురాలిగా ఉన్న కళమ్మ 30 ఏళ్లుగా ఇండ్లకు, దేవాలయాలకు పెయింటింగ్ వేస్తోంది. ►మదనపల్లె పట్టణంలో రేణుక... డ్రైవింగ్ స్కూల్లో స్వయంగా తానే మహిళలకు డ్రైవింగ్ నేర్పిస్తోంది. ►యదళ్ళపల్లి ఆదిలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్లో ఉంటుంది. గత 5 ఏళ్లుగా మెకానిక్గా పనిచేస్తోంది. ►కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పెట్రోలు బంకులో పెట్రోలు పడుతున్న పగిడేల ఉమా మహేశ్వరి. చదవండి: Lalitha Manisha: తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో.. -
ఆయనకు ఇద్దరితో పెళ్లి.. ఒకే ముహూర్తానికి.. వైరల్గా శుభలేఖ
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి ఒకే ముహూర్తానికి ఇద్దరు వధువుల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. కుర్నపల్లి గ్రామపంచాయతీకి చెందిన కోయ గిరిజనుడు, వ్యవసాయ కూలీ మడివి సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. ఈ క్రమంలో స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించగా.. విషయం తెలుసుకున్న సునీత నిలదీసింది. ఇరువురికీ సర్దిచెప్పేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సత్తిబాబు ఇద్దరితోనూ ఎర్రబోరులో ఏడాది క్రితం కాపురాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సునీత, స్వప్నకు ఒక్కో సంతానం ఉన్నారు. కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వివాహ విషయాన్ని నలుగురికి తెలిసేలా విందు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు సూచించారు. దీంతో సత్తిబాబు గురువారం ఉదయం 7.04 గంటలకు ఇద్దరితో కల్యాణ ముహూర్తమని శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకు పంచాడు. దీంతో ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
జూమ్ మీటింగ్లో పాల్గొన్న డీఎంహెచ్ఓ
కొత్తగూడెంఅర్బన్: కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శేతామహంతి రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్ఓలతో శనివారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఎంహెచ్ఓ శిరీష పాల్గొని మాట్లాడారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు, పల్లె, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్ బిల్డింగ్లు, చైల్డ్ హెల్త్.. తదితర అంశాలపై వివరాలను కమిషనర్కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టీబీకి సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ను అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్సీ, ఎస్ఎన్సీయూ, ఎన్బీఎస్యూ డేటా, ఇమ్యూనైజేషన్కు సంబంధించి మీజిల్స్ కోసం ఇంటింటి సర్వే నిర్వహించి 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారికి ఎంఆర్, ఎంఆర్–2 ఇప్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో డాక్టర్ నందిత, సుధీర, రాజేశ్, ప్రోగ్రాం అధికారులు మణికంఠారెడ్డి, చైతన్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఉండేందుకే క్యాంపు కార్యాలయాలు
అన్నపురెడ్డిపల్లి: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలు పంచుకునేందుకే క్యాంపు కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆయన అనుచరుడు పర్సా వెంకటేశ్వరరావు కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 2019లో టికెట్ ఇవ్వకపోయినా ప్రజల మధ్యే ఉంటున్నానని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అని మండలాల్లో, మున్సిపాటీల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పదవులు ఉన్నా లేకున్నా.. అధికారం ఉన్నా, లేకపోయినా.. తనకు ప్రజలే ముఖ్యమని, ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్సా వెంకటేశ్వర్లు, బోడా పద్మ, భీంరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుబ్బాకుల రాము, మారకాల లక్ష్మారెడ్డి, వీరబాయిన నాగేశ్వరరావు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన కందుల ప్రతాప్రెడ్డి ఈ నెల 12వ తేదీన ఆర్థిక ఇబ్బందులతో పురుగుమందు తాగాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఏఎస్ఐ సత్యనారయణ వివరాలు వెల్లడించారు. ప్రతాప్రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మిర్చి, పత్తి పంటల్లో తీవ్ర నష్టం వాటిల్లడంతో మనోవేదనకు గురై ఈ నెల 12వ తేదీన ఇంట్లో పరుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు వినోద్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గాయపడిన వ్యక్తి జూలూరుపాడు: మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఈసం పాపయ్య (64) పాలు పితుకుతుండగా ఆవు కాలితో తన్నడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ తిరుపతిరావు కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఈసం పాపయ్య పాలు పితుకుతుండగా ఆవు కాలితో ఎగిరి తన్నడంతో అతను తీవ్రంగా గామపడ్డాడు. కుటుంబసభ్యులు పాపయ్యను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాపయ్య శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఈసం రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తిరుపతిరావు పేర్కొన్నారు. -
సింగరేణి ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ గార్డుపై దాడి
కొత్తగూడెంటౌన్: సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని ఇంటిలిజెన్స్ విభాగంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కుక్కల నర్సింగరావుపై నాజర్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకోగా వన్టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కార్పొరేట్ ఏరియాలో సెకండ్ షిఫ్ట్లో మెయిన్ హాస్పిటల్ ఏరియాలో విధులు ముగించుకుని రాత్రి 10.30 గంటలకు క్యాజువాలిటీలో కేసుల విషయమై డాక్టర్, స్టాఫ్ నర్సును ఆరాతీశారు. తిరిగి ఇంటి వెళ్దామని తన ద్విచక్రవాహనం వద్దకు వెళ్లగా అదే సమయంలో రామాంజేయ కాలనీకి చెందిన బలగం వివేక్ బండిపై కూర్చుని ఉన్నాడు. తాను ఇంటికి వెళ్లాలని.. బైక్ మీద నుంచి దిగాలని సూచించాడు. పక్కనే ఉన్న నాజర్ అనే వ్యక్తి 10 నిమిషాలు అగలేవా.. అంటూ బూతులు తిడుతూ చెంపపై కొట్టాడని, చంపుతానని బెదిరించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వివాదంపై ఇంటలిజెన్స్ ఆరా కొత్తగూడెంఅర్బన్: వివాహితుడైన ఓ ఎస్ఐ ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడనే ఆరోపణలపై ఇంటలిజెన్స్ విభాగం శనివారం ఆరా తీయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం పట్టణ పరిధిలోని ఓ ఎస్ఐ పాల్వంచకు చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన విషయం ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే. ఈ తతంగంలో ఎస్ఐ తనకు వివాహం అయినా కూడా యువతిని ప్రేమ పేరుతో మోసం చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. కాగా, ఇదే ఎస్ఐపై వ్యక్తిగత ఆరోపణలతో పాటుగా విధి నిర్వహణపై కూడా కొన్ని ఆరోపణలు తెరపైకి రావడం మరోకోణం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి గుర్తింపు కారేపల్లి: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు వెల్లడయ్యాయి. కారేపల్లిలోని పేరుపల్లి రైల్వే గేట్ సమీపాన శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. కాగా, మృతుడు ఏన్కూర్ మండలం రేపల్లేవాడకు చెందిన మార్కపూడి నరసింహారావు(40)గా స్థానికులు గుర్తించారు. కారేపల్లికి చెందిన నాగవెల్లి ప్రభాకర్ బావమరిది అయిన నరసింహారావు కొంతకాలంగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతుండగా, కారేపల్లి వచ్చిన ఆయన రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఘటనపై శనివారం కేసు నమోదు చేసిన డోర్నకల్ రైల్వే పోలీసులు పంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఉపాధి, శిక్షణపై దృష్టి సారించాలి
పాల్వంచ: మహిళలు ఉపాధి శిక్షణపై దృష్టి సారించాలని యాదాద్రి భువనగిరి శ్రీరామనంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి అన్నారు. శనివారం స్థానిక నవ లిమిటెడ్ మహిళా సాధికార కేంద్రంలో టైలరింగ్ ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆమె సర్టిఫికెట్లు అందించి ప్రసంగించారు. వృత్తి విద్యా కేంద్రం అందుబాటులో ఉండటం సువర్ణ అవకాశమని, అధునాతన పరికరాలు ఇతర శిక్షణ కేంద్రాల్లో ఎక్కడా లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో నవ లిమిటెడ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ డి.శ్యాంసుందర్, డాక్టర్ విహారికృష్ణ, కిశోర్, లలిత, అరుణ, వాసవి రాణి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు అశ్వారావుపేటరూరల్: ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి చర్యలకు పాల్పడి తమ విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దని పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో శనివారం సీనియర్ విద్యార్థులకు ర్యాగింగ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులను ప్రేమించాలని, గురువులను గౌరవిస్తూ ఆశయాలను సాధించుకోవాలన్నారు. విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, చెడు వ్యసనాలకు లోను కాకుండా కచ్చితమైన ప్రణాళికతో లక్ష్యాలను అందుకోవాలని సూచించారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులను వేధిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలుంటాయని, పలు కేస్ స్టడీలను విద్యార్థుకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల డీన్ వెంకన్న, ఎస్ఐ రాజేశ్కుమార్, ప్రొఫెసర్లు మధుసూదన్రెడ్డి, గోపాలకృష్ణమూర్తి, శిరీష, జమయ్మ, రమేశ్, రెడ్డిప్రియ, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య అన్నపురెడ్డిపల్లి: పురుగులమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబు సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన కాలసాని రత్నకుమారి (28) మతిస్థిమితం లేకపోవడంతో కొంతకాలంగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొలానికి కొట్టే పురుగులమందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు 108 వాహనంలో కొత్తగూడెం తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందిందని వారు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి సోదరుడు వీరరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షాహిన తెలిపారు. అప్పులబాధతో రైతు.. జూలూరుపాడు: అప్పులబాధ తాళలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై స్థానిక పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. హెడ్కానిస్టేబుల్ బుచ్చయ్య కథనం ప్రకారం.. మండలంలోని సాయిరాంతండాకు చెందిన తేజావత్ రాంబాబు (25) తనకు ఉన్న 3 ఎకరాల భూమితోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి పంటలను సాగు చేశాడు. మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో తీవ్రంగా నష్టపోయాడు. పంటల పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఈ నెల 24న రాంబాబు పొలానికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లి పురుగులమందు సేవించాడు. అదే గ్రామానికి చెందిన గుగులోత్ నరసింహ పొలం పనుల నిమిత్తం అటుగా వెళ్తుండగా రాంబాబు అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించి, కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వచ్చి రాంబాబును ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ బుచ్చయ్య తెలిపారు. వృద్ధురాలి ప్రాణం తీసిన సొరకాయ కొత్తగూడెంరూరల్: బిల్డింగ్పైన కాసిన సొరకాయను కోసేందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి వృద్ధురాలు మరణించిన ఘటన హేమచంద్రాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని హేమచంద్రాపురం గ్రామానికి చెందిన మేకల భారతమ్మ (65) (తన కుమారుడి ఇంట్లో ఉంటోంది) ఇంటి డాబాపైన సొరకాయ కాసింది. దానిని కోసేందుకు డాబాపైకి ఎక్కుతుండగా మెట్ల పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. -
కుక్కకాట్లపై అప్రమత్తంగా ఉండండి
●రక్షణ చర్యలు చేపట్టండి.. ●కలెక్టర్ అనుదీప్ సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజలు కుక్కకాటుకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కుక్కలవృద్ధి రేటును నియంత్రించే ఆపరేషన్లు, అత్యవసర వైద్యసేవలు.. తదితర అంశాలపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుక్కల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తక్షణ చర్యలు చేపట్టి ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. సోమవారం నుంచి ఆపరేషన్లు ప్రారంభించాలని, పర్యవేక్షణకు కుటుంబ నియంత్రణ కేంద్రంలో ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. రోజుకు వంద కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో మాంసపు దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించి వ్యర్థాలను బయట వేయకుండా అవగాహన చర్యలు చేపట్టాలని సూచించారు. ఫంక్షన్హాళ్లు, కోళ్ల వ్యర్థాలు మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బదికి అప్పగించాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క, కోతి కాటు మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఓ రమాకాంత్, వైద్యాధికారులు ముక్కంటేశ్వరరావు, రామకృష్ణ, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపల్ కమిషనర్లు రఘు, శ్రీకాంత్, అంకుషావలి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 28న జాబ్మేళా జిల్లా ఉపాధి, శిక్షణశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న కొత్తగూడెం క్లబ్లో నిర్వహిస్తున్న జాబ్మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జాబ్మేళాకు సంబంధించి ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్మేళా 28న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 8వ తరగతి నుంచి పీజీ వరకు, ఇంజనీరింగ్ ఎంబీఏ, ఎంసీఏ, ఐటీఐల్లోని వివిధ ట్రేడ్లు, డిప్లొమా తదితర అర్హతలు ఉన్నవారు తమ బయోడేటాతో పాటు విద్యార్హత జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని చెప్పారు. కార్యక్రమంలో వేల్పుల విజేత పాల్గొన్నారు. -
హామీల అమలుపై..ఆత్మపరిశీలన చేసుకోవాలి
●రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు.. ●పోడు పట్టాల పంపిణీలో చిత్తశుద్ధి చూపండి ●మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చండ్రుగొండ: ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రం చండ్రుగొండలో ఆయన క్యాంప్ కార్యాలయాన్ని శనివారం రాత్రి ప్రారంభించి మాట్లాడారు. వందలమంది ఆత్మబలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ను, సహకరించిన బీజేపీని కాదని టీఆర్ఎస్కు ప్రజలు రెండు పర్యాయాలు పట్టం కడితే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. ప్రజల మాదిరిగానే సీఎం కేసీఆర్, కేటీఆర్లను నమ్మానన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సక్రమంగా ఇస్తున్నారా? రైతులు పడుతున్న గోస కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టినవెన్ని, పేదలకు ఇచ్చింది ఎన్ని? లెక్కలు చూసుకోవాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నామమాత్రంగా పోడు పట్టాలు ఇచ్చే ఎన్నికల స్టంట్ వద్దని, సీఎం కేసీఆర్ హామీ మేరకు పోడుపట్టాలు చిత్తశుద్ధితో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మువ్వా విజయ్బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, జారే ఆదినారాయణ, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, బాణోత్ పార్వతి, భోజ్యానాయక్, నరకుళ్ల సత్యనారాయణ, చెవుల చందర్రావు, సారేపల్లి శేఖర్, కిరణ్రెడ్డి పాల్గొన్నారు. -
టీచర్గా మారిన డీఈఓ
అశ్వారావుపేటరూరల్: ఆయన జిల్లా విద్యాశాఖాధికారి.. అయినప్పటికీ కొద్ది సేపు విద్యార్థులకు పాఠాలు బోధించి టీచర్గా మారిపోయారు. అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం డీఈఓ సోమశేఖరశర్మ ఆకస్మికంగా సందర్శించారు. పదోవ తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి పలు పాఠ్యాంశాలపై ప్రశ్నించారు. ఆ తర్వాత తానే టీచర్గా మారిపోయి బ్లాక్ బోర్డుపై విద్యార్థులకు గణిత బోధన చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. కష్టపడి, ఇష్టంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. అనంతరం మన ఊరు – మన బడి పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంటకాలను రుచి చూశారు. ఆయనతోపాటు ఎంఈఓ పి.కృష్ణయ్య, పరీక్షల విభాగం ఏసీజీఈ మాధవరావు, సెక్టోరియల్ అధికారులు నాగరాజశేఖర్, సతీశ్ ఉన్నారు. -
రెండో రోజుకు చేరిన నిరసన
మణుగూరురూరల్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బీటీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకుంది. శనివారం ఉద్యోగులు డీఈ జనరల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. జెన్కో యాజమాన్య నిర్లక్ష్యం వల్లే పీఆర్సీ ప్రకటనలో జాప్యం జరుగుతోందని చెప్పారు. యాజమన్యం తక్షణమే స్పందించి పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్పీఈ జేఏసీ బీటీపీఎస్ రీజియన్ కన్వీనర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, నాయకులు వి.ప్రసాద్, రవిప్రసాద్, సత్యనారాయణ, ప్రేమ్కుమార్, వీరస్వామి, రాజబాబు, దయాకర్, కె.నర్సింహారావు, అల్తాఫా తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ ఫుల్లు..తనిఖీలు నిల్లు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిఘా నిద్ర పోతుంటే దగా దండుకుంటోంది అన్నట్టుగా మారింది జిల్లాలో మద్యం అమ్మకాల పరిస్థితి. ముఖ్యంగా పాల్వంచ కేంద్రంగా మద్యం సిండికేట్ పేరుతో యథేచ్ఛగా మద్యాన్ని కల్తీ చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెట్టడంతో పాటు ఆరోగ్యానికీ హాని కలిగిస్తున్నారు. కల్తీకి తెరలేపారు.. బెల్ట్షాపుల్లో మద్యం అమ్మడం ఎక్సైజ్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఒకసారి బెల్ట్షాపులకు మద్యం తరలిందంటే దాని క్వాలిటీ, ధర గురించి అడిగేవారే ఉండరు. అందినకాడికి దోచుకోవడమే ‘బెల్ట్’ నిర్వాహకుల లక్ష్యం. దీంతో మద్యం సిండికేట్ తమ గల్లాపెట్టెను మరింత వేగంగా నింపుకునేందుకు అధిక ధరలకు తోడుగా మద్యం కల్తీకి పాల్పడుతోంది. బెల్ట్షాపులకు తరలించే మద్యం బాటిళ్లలో నాసిరకం స్పిరిట్ను కలపడం, ఎక్కువ ధర కలిగిన లిక్కర్ బ్రాండ్ సీసాలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని కొంత మేర కలిపేస్తూ ప్రత్యేక కౌంటర్లు, ఆటోల ద్వారా బెల్ట్షాపులకు ఎలాంటి బెరుకు లేకుండా తరలించేస్తున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటుండటంతో ఇక్కడి సిండికేట్ మాఫియా పక్క రాష్ట్రాలకు సైతం కల్తీ మద్యాన్ని తరలించేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు ఏవి.. ఎకై ్సజ్ శాఖ పనితీరులో పారదర్శకతపై నలువైపులా విమర్శలు, ఆరోపణలు వస్తున్నా, పనితీరులో మార్పు రావడం లేదు. తమ ఫోకస్ను పూర్తిగా గంజాయి అక్రమ రవాణాపై పెట్టి.. బెల్ట్షాపుల దందాను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. దీనికి ప్రతిఫలం సైతం మద్యం సిండికేట్ నుంచి భారీగా అందుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక వైన్స్, బార్లలో అమ్మే మద్యం నాణ్యతను తరచుగా ఎక్సైజ్ అధికారులు పరీక్షించాల్సి ఉంటంది. వైన్స్, బార్ల నుంచి శాంపిళ్లు సేకరించి ల్యాబుల్లో పరీక్ష చేయించాల్సి ఉంటుంది. పట్టపగలే ఆటోల్లో అక్రమంగా బెల్ట్ దుకాణాలకు మద్యం తరలిపోతుంటే పట్టించుకోని అధికారులు ఇక క్వాలిటీ, కల్తీ గురించి పట్టించుకునేది ఎప్పుడనే విమర్శలు వస్తున్నాయి. టాస్క్ఫోర్స్ రావాలి.. గతంలో పాల్వంచ కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్ వెలుగు చూసింది. ఆ తర్వాత ఇక్కడ బెల్ట్షాపుల్లో అధిక ధరలతో తమ జేబులకు చిల్లులు పెట్టడంపై మద్యం ప్రియుల నుంచి విమర్శలు వచ్చాయి. ఆఖరికి స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది స్పెషల్ టాస్క్ఫోర్స్ ఇక్కడ ప్రత్యేకంగా దాడులు నిర్వహించి కొందరు ఎక్సైజ్ అధికారులపై వేటు వేసింది. ఫలితంగా కొంతకాలం పాటు సిండికేట్ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. కానీ టాస్క్ఫోర్స్ దాడులు తగ్గిపోవడంతో మరోసారి లిక్కర్ సిండికేట్ పడగ విప్పడం ప్రారంభించింది. దీంతో సిండికేట్ ఆట కట్టించాలంటే మరోసారి స్టేట్ టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సర్వం..బెల్ట్ మయం పాల్వంచ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా 5 బార్లు, 8 వైన్స్ షాపులు ఉన్నాయి. ఇటీవల మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఇష్టారీతిన మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. గరిష్ట అమ్మకం ధరపై వచ్చే లాభం సరిపోవడం లేదంటూ దొడ్డి దారిన భారీ ఎత్తున మద్యాన్ని బెల్ట్షాపులకు తరలిస్తున్నారు. అక్కడ క్వార్టర్ బాటిల్పై అదనంగా రూ.20, బీరు బాటిల్పై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. పట్టణంలోని గల్లీలతో పాటు మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీల్లో బెల్ట్షాప్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ప్రతీరోజు వైన్షాపుల్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా మద్యాన్ని బెల్ట్ షాపులకు యఽథేచ్ఛగా తరలిస్తున్నారు. పట్టణంలోని వైన్ షాపుల నుంచి కిన్నెరసాని వైపు ఉన్న గ్రామాల సిండికేట్ షాపులకు మద్యం సరఫరా అవుతోంది. పెద్దమ్మగుడి వద్ద గల షాపుల నుంచి జగన్నాధపురం, కేశావాపురం, సోములగూడెం, సంగెం, దంతెలబోర, రంగాపురం, తోగ్గూడెం తదితర ప్రాంతాల్లోని షాపులకు తరలిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం నేను జిల్లాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించాను. గతేడాది పాల్వంచ మండలం నుంచి కల్తీ మద్యంపై ఒక ఫిర్యాదు రాగా శాంపిళ్లు సేకరించాం. అందులో కల్తీ ఏమీ తేలలేదు. కల్తీ మద్యంపై ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జానయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
అర్ధాకలి చదువులు
బూర్గంపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇళ్ల దగ్గరి నుంచి కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తెచ్చుకుంటుంటే, మరికొందరు లంచ్ బాక్స్లు లేకుండానే కాలేజీలకు వస్తున్నారు. భోజనం తెచ్చుకోని వారిలో కొందరు కడుపు మాడ్చుకుంటుండగా, మరికొందరు తోటి విద్యార్థులు తెచ్చుకున్న దాంట్లో భాగం పంచుకుంటున్నారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఈ పథకం అమలుకు రెండేళ్లుగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారే తప్ప అమలు కావడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలల్లో ఉండే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేకపోవటంతో నీరసించిపోతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమస్యగా మారింది. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందినవారే. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరాలి. కూలీ పనులకు వెళ్లే తల్లిదండ్రులు వీరికి లంచ్బాక్స్ కట్టి ఇవ్వటం కొంత ఇబ్బందికరంగానే మారింది. ఒకరోజు లంచ్ బాక్స్ ఇస్తే, రెండురోజులు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. లంచ్బాక్స్ సిద్ధం చేసేందుకు సమయం లేకపోవటం, కొందరికి ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో చాలామంది విద్యార్థులు ఉదయాన్నే ఇంటి వద్ద భోజనం చేసి లంచ్ బాక్స్లు లేకుండానే కళాశాలలకు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్ధాకలితో చదువులను కొనసాగిస్తున్నారు. కొందరు మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు. కొంతమంది మిత్రులు తెచ్చిన భోజనాన్ని పంచుకుంటుండగా, అది ఇద్దరికీ సరిపోవడం లేదు. కౌమార దశలో ఉన్న విద్యార్థులు కడుపునిండా తినకపోవటంతో అనారోగ్యం పాలవుతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగింది. విద్యార్థులు పగలంతా కళాశాలలో ఉండాలంటే ఒంట్లో సత్తువ ఉండాలి. అందుకు సరిపడా ఆహారం తీసుకోవాలి. ప్రాక్టికల్స్, ప్రీ ఫైనల్ పరీక్షలపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. ఈ తరుణంలో అయినా విద్యార్థులకు కనీసం స్నాక్స్ అందిస్తే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు : 14 ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు : 2,991 ద్వితీయ సంవత్సర విద్యార్థుల సంఖ్య : 2,622 ఇబ్బందులున్న మాట నిజమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు కాక ఇబ్బందులున్న మాట నిజమే. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి లంచ్బాక్స్లు తెచ్చుకోవటం లేదు. మధ్యాహ్న భోజనం లేకపోవటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా రెసిడెన్షియల్ కాలేజీల వెపే మొగ్గుచూపుతున్నారు. – సులోచనరాణి, డీఐఈఓ లంచ్ బాక్స్ కోసం ఉంటే ఆలస్యమవుతుంది కళాశాలకు సకాలంలో వెళ్లాలంటే ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాలి. ఆ సమయానికి రోజూ లంచ్బాక్స్ తయారు కాదు. అప్పటికే ఇంట్లో ఏది ఉంటే అది తిని హడావుడిగా బయలుదేరుతున్నాం. లంచ్ బాక్స్ తెచ్చుకోని రోజు మధ్యాహ్నం బాగా ఆకలేస్తుంది. నీళ్లు తాగి సాయంత్రం వరకు ఆలాగే ఉంటాం. – అక్షయ్కుమార్, సారపాక ఆర్థిక ఇబ్బందులతో బాక్స్ తేవడం లేదు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో లంచ్ బాక్స్ తెచ్చుకోవటం లేదు. ఉదయాన్నే ఇంటి దగ్గర తినివస్తా. మళ్లీ సాయంత్రం ఇంటికి వెళితేనే తినేది. ఫ్రెండ్స్ తినమంటారు. కానీ నాకు ఆకలిగా లేదని చెబుతా. కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే బాగుంటుంది. – శెనగ లహరి, వెలేరు -
ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని తపన!
ఖమ్మంక్రైం: ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనేది ఆ యువకుడి తపన. కానీ శిక్షణ పొందేందుకు ఆర్థిక స్థోమత లేదు. దీంతో చోరీల బాట ఎంచుకున్న ఆయన చివరకు పోలీసులకు పట్టుబడగా భారీ మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు వివరాలను ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ శుక్రవారం వెల్లడించారు. ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురానికి చెందిన సంపటి ఉమాప్రసాద్కు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనేది కల కాగా, జిమ్కు వెళ్తూ దేహదారుఢ్యంపై శ్రద్ధ వహించేవాడు. అయితే, పర్వతాలు అధిరోహించడానికి ప్రత్యేక శిక్షణ అవసరమని, అందుకోసం డబ్బు చాలా ఖర్చవుతుందని తెలుసుకున్నాడు. దీంతో ఆయన డబ్బు సంపాదనకు దొంగతనాలే మార్గమని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల నుంచి ఉదయమంతా డాబుసరిగా తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళ చోరీలకు పాల్పడేవాడు. ఖానాపురం హవేలీ పోలీసుస్టేషన్ పరిధిలో ఆరు, ఖమ్మం టూటౌన్ పరిధిలో రెండిళ్లలో దొంగతనాలు చేశాడు. దొంగిలించిన సొత్తులో నగదు, బంగారు ఆభరణాలు ఉండటంతో వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నాక ఎవరెస్ట్ అధిరోహణకు శిక్షణ తీసుకోవాలని భావించాడు. ఈక్రమంలోనే జిల్లా కేంద్రంలో చోరీలు పెరుగుతుండడంతో పోలీసులు నిఘా ఏర్పాటుచేయగా, శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో సీసీఎస్, ఖమ్మం టూ టౌన్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఉమాప్రసాద్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల వ్యవహారం బయటపడింది. ఈ సందర్భంగా నిందితుడి నుంచి రూ.42లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వారియర్ వెల్లడించారు. దారి దోపిడీ ముఠా అరెస్టు ఖమ్మం రూరల్ సబ్ డివిజన్లోని రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ల్లో జల్సాల కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్లపై వెళ్తున్న వారిని బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురి ముఠాను కూడా పోలీ సులు అరెస్టు చేశారు. పొన్నెకల్ క్రాస్ రోడ్డు వద్ద చేపట్టిన తనిఖీల్లో పగడాల విజయ్ అలియాస్ చంటి, ధంసలాపురానికి చెందిన సాదెం లక్ష్మీనారాయణ, దానవాయిగూడెంకు చెందిన షేక్ సైదులు, ఖమ్మంకు చెందిన షేక్ షబాజ్ అలియాస్ సిద్ధిఖీ అలియాస్ షాబు, బోనకల్ మండలం చినబీరవెల్లికి చెందిన పాకాలపాటి ధర్మతేజ, ఖమ్మం ప్రకాష్ నగర్కు చెందిన షేక్ పర్వేజ్, రామన్నపేటకు చెందిన పసుపులేటి సాయిగా వృత్తిరీత్యా ఆటో, కారు డ్రైవర్లుగా పనిచేస్తుండగా, కొందరు పంక్చర్ షాపులు నడుపుతున్నారు. అయితే, జల్సాలకు పడిన వీరు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతాలలో ఒంటరిగా వెళ్లే జంటలను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఈక్రమంలో 16 కేసుల్లో నిందితులైన వీరిని అరెస్టు చేసి రూ.7.50లక్షల విలువైన ఆభరణాలు, రూ.14.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.67లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్న సీసీఎస్, ఖమ్మం నగర, రూరల్ పోలీసులను సీపీ వారియర్ అభినందించి క్యాష్ అవార్డులు అందజేశారు. ఈసమావేశంలో అడిసనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు రవి, గణేష్, బస్వారెడ్డి, సీఐలు శ్రీధర్, రామకృష్ణ, జితేందర్రెడ్డి, ఎస్సైలు వెంకటకృష్ణ, వరాల శ్రీనివాస్, సురేష్, గిరిధర్రెడ్డి, సిబ్బంది గజేంద్ర, చట్టు శ్రీనివాస్, లింగయ్య, కోలా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దివ్యాంగులు స్వశక్తితో ఎదగాలి
కొత్తగూడెంటౌన్: దివ్యాంగులు స్వశక్తితో ఎదగాలని కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు అన్నారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎస్సార్ నిధులతో దివ్యాంగుల కోసం కొనుగోలు చేసిన సహాయ ఉపకరణాలను కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి ఎదుగుదలకు వైకల్యం అడ్డుకాదని, అంగవైకల్యాన్ని అధిగమించి అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. దివ్యాంగులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో సహాయ పరికరాలు కావాలని దివ్యాంగులు వినతులు ఇస్తున్నారని, వాటి ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో 405 మందికి వివిధ రకాల పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈసీఐఎల్ కంపెనీ దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ఇచ్చేందుకు ముందుకురావడం హర్షణీయమని అన్నారు. రూ.40 లక్షల సీఎస్సార్ నిధులతో 741 సహాయ పరికరాలను అందజేసినట్లు వివరించారు. జిల్లాలో 30,173 మంది దివ్యాంగులు ఉండగా, వారిలో 18,051 మంది శారీరక దివ్యాంగులు, 3,715 మంది మూగ, చెవిటి వారు, 4,314 మంది మానసిక దివ్యాంగులు, 4,093 మంది అంధులు ఉన్నారని తెలిపారు. వారిలో 407 మందిని ప్రస్తుతానికి ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా, ఈసీఐఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ మునికృష్ణ, ఈసీఐఎల్ సీనియర్ వైద్యాధికారి విఽశ్వనాథరెడ్డి, పర్సనల్ అథికారి సునీల్కుమార్, సీనియర్ మేనేజర్లు రాజేష్, కె.శ్రీనివాసరావు, యూనిట్ మేనేజర్ బాలకృష్ణ, స్థానిక కౌన్సిలర్ లక్ష్మణ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండపనేని సతీష్ పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేస్తాం సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని మార్చి 15 వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాలు లేకుండా నిర్మించిన ఇళ్ల సమాచారం సేకరణ, కంటి వెలుగు, రెండు పడక గదుల ఇళ్లు, ఆయిల్పామ్ సాగు తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ.. జిల్లాలో 16,860 ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటికి 13,575 ఎకరాల్లో పూర్తి చేశామని, మిగిలిన 3,285 ఎకరాల్లో వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని వివరించారు. మొక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణలో రీడింగ్ అద్దాలను తక్షణమే పంపిణీ చేస్తున్నామని, ప్రిస్కిప్షన్ కంటి అద్దాలు పంపిణీ చేసిన వివరాలను పోర్టల్లో నమోదు చేస్తామని చెప్పారు. లబ్ధిదారులకు మార్చిలో క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. చెప్పారు. పోడు పట్టాల జారీకి జిల్లా స్థాయిలో కమిటీ వేసి, పట్టాల ముద్రణ ప్రక్రియ చేపట్టామని చెప్పారు. జిల్లాలో పోడు పట్టాల జారీ ప్రక్రియ, కంటి వెలుగు కార్యక్రమాల నిర్వహణ తీరును సీఎస్ అభినందించారు. సమావేశంలో డీఎఫ్ఓ రంజిత్ నాయక్, అదనపు కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయాధికారి అభిమన్యుడు, డీఆర్ఓ అశోకచక్రవర్తి, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు స్వర్ణలత, రత్నకళ్యాణి, ఆర్ఔఫ్ఆర్ డీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: మండల పరిధిలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి(కనకదుర్గమ్మ) అమ్మవారికి శుక్రవారం పంచామృతాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో అమ్మవారి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం మూలవిరాట్ అమ్మవారికి అభిషేకం గావించిన అర్చకులు నివేదన, పంచహారతులు, నీరాజన మంత్రపుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ, దుర్గాప్రసాద్ శర్మ పాల్గొన్నారు. స్వర్ణకవచధారుడైన భద్రాద్రి రామయ్య భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు శుక్రవారంస్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు. 28న కొత్తగూడెం క్లబ్లో జాబ్మేళా సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం క్లబ్లో ఈనెల 28న మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజేత తెలిపారు. విప్రో, అపోలో ఫార్మసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ముత్తూట్ గ్రూప్, గూగుల్ పే, ఎయిర్టెల్, వరుణ్ మోటార్స్, కియో మోటార్స్, ఎల్ఐసీ, ప్లిఫ్కార్డ్ తదితర సంస్థల్లో సుమారు 3 వేలకు పైగా ఖాళీల భర్తీకి ఈ జాబ్మేళా ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఆసక్తి గల నిరుద్యోగులు అన్ని సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని సూచించారు. -
వైద్య పరీక్షలు సక్రమంగా చేయాలి
టేకులపల్లి: పీహెచ్సీకి వచ్చేవారికి వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని సులానగర్ పీహెచ్సీని శుక్రవారం ఆమె తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఆశ కార్యకర్తలకు జరుగుతున్న సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ శిక్షణ శిబిరానికి వెళ్లి వారికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం కంటివెలుగు కార్యక్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారందరికీ కళ్లజోళ్లు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. సర్పంచ్లు, కార్యదర్శుల సహకారంతో 18 ఏళ్లు నిండిన వారందరినీ కంటివెలుగు శిబిరానికి తరలించి, పరీక్షలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి కందుల దినేష్, అధికారులు అన్నా మేరీ, సీతమ్మ, పీహెచ్ఎన్ సత్యవతి, ట్రైనింగ్ సూపర్వైజర్లు కె.చిట్టెమ్మ, ఎస్.విజయలక్ష్మి, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, వీసం శకుంతల, అక్బర్, లలిత, నాగలక్ష్మి, అరుణకుమారి, రమేష్బాబు పాల్గొన్నారు. -
మున్సిపల్ సమస్యలపై నేడు ‘సాక్షి’ ఫోన్ ఇన్
పాల్వంచ: పట్టణ వాసులను కుక్కలు, కోతుల బెడద వేధిస్తోంది. దీనికి తోడు తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల సమస్య ఎదుర్కొంటున్న వారు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ‘సాక్షి’ సమన్వయం చేయాలని సంకల్పించింది. ఈమేరకు శనివారం ఫోన్ ఇన్ ఏర్పాటుచేయగా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కారానికి పాటుపడతారు. సీహెచ్.శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ తేది : 25 – 02 – 2023, శనివారం, సమయం : ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 98499 05884 -
మృత్యుఘంటికలు..
ఈ నెల 8న బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ వద్ద ఓవర్ లోడ్తో వెళ్తున్న ఓ ఇసుక లారీ ఢీకొట్టి పాల్వంచ మండలం బండ్రిగొండ గ్రామానికి చెందిన నెల్లెల రంజిత్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ నెల 20న ఒడిశాలో జామాయిల్ లోడింగ్కు వెళ్లిన ట్రాక్టర్ తిరగబడి సారపాకకు చెందిన సున్నం నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే నెలలో బూర్గంపాడు మండలం సోంపెల్లి గ్రామం వద్ద జామాయిల్ లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ తిరగబడి దమ్మపేట మండలానికి చెందిన చిక్కినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పై ఘటనలను పరిశీలిస్తే వాహనాల యజమానుల అత్యాశ, రవాణా శాఖ, మైనింగ్ ఇతర ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం.. వెరసి నిరుపేద కూలీలు, డ్రైవర్ల ప్రాణాలను హరిస్తున్నాయి. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భద్రాచలం: వాహనాల్లో జామాయిల్ కర్ర, ఇసుక తరలిస్తున్న యజమానులు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలు బోల్తా పడటం, రోడ్డు ప్రమాదాలకు కారణమవడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. రాత్రి వేళల్లో బైక్లను ఢీకొడుతుండటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. జామాయిల్ ఓవర్ లోడింగ్తో.. జిల్లాలో సారపాక వద్ద ఉన్న ఐటీసీ పీఎస్పీడీ పేపర్ మిల్లుకు ముడి సరుకుగా అవసరమైన జామాయిల్ పెంపకానికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. దీంతో జామాయిల్ తోటల పెంపకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. పెంపకం అనంతరం కొట్టిన జామాయిల్ కలపను ట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్లు, రైతులు ఐటీసీకు తరలిస్తారు. రాజమండ్రి, ఇతర జిల్లాల నుంచి సుమారు రోజుకు 120 నుంచి 150 ట్రాక్టర్లు జామాయిల్ను తీసుకొస్తుంటాయి. ఈ తరలించే క్రమంలో నిర్దిష్ట ప్రమాణాల కంటే ఎక్కువ టన్నులు లోడింగ్ చేయటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ట్రాక్టర్ వెనుక భాగంలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించాల్సి ఉండగా 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. దీంతో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది. అధికారుల చేతివాటం.. వాహనాల రాకపోకలపై, ఓవర్లోడింగ్పై నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన రవాణా శాఖ, మైనింగ్, ఇతర సంబంధిత శాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రమాదాలు జరిగాక, బాధితులు ప్రాణాలు కోల్పోయాక నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ, జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వరుస సంఘటనల్లో పలువురు మృత్యువాత పడ్డాక నెమ్మదిగా తేరుకున్న రవాణా శాఖ అధికారులు.. గత రెండు రోజుల నుంచి జామాయిల్ ఓవర్ లోడింగ్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయితే భద్రాచలంలోని రవాణా శాఖ కార్యాలయం ముందు నుంచే నిరంతరం ఓవర్ లోడ్తో వెళ్తున్న జామాయిల్ ట్రాక్టర్లను పట్టుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మామూళ్ల మత్తులో జోగే మైనింగ్ శాఖ అధికారులు ఓవర్ లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలను పట్టుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ నుంచి వచ్చే స్పెషల్ టాస్క్ అధికారులు పట్టుకోవడం తప్ప స్థానిక అధికారులు పట్టుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇసుకాసురులకు కాసులు.. ప్రయాణికులకు యమపాశాలు.. ఇసుకాసురులు లారీల్లో ఇసుక ఓవర్ లోడ్తో తరలిస్తున్నారు. వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరులతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక వాహనాలు నిత్యం హైదరాబాద్తో సహా ఇతర జిల్లాలకు వెళ్తుంటాయి. వీటిలో ఏ ఒక్క లారీ కూడా రవాణా, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించవు. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 25 నుంచి 26 టన్నులు, 12 టైర్ల లారీ 26 టన్నులతో వెళ్లాల్సి ఉండగా సుమారు 32 టన్నులకు పైగానే ఓవర్ లోడ్తో తిప్పుతున్నారు. ఇసుక ర్యాంప్, వాహన యజమానులు డబ్బులను పోగు చేసుకుంటుండగా ప్రమాదాలతో రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నవారు మృత్యువాత పడుతున్నారు. ఓవర్ లోడింగ్తో వెళ్తున్న లారీ ఇటీవల ఓ వాహనాన్ని క్రాస్ చేస్తూ పినపాక వద్ద ఓ నిరుపేద కూలీ మృతికి కారణమయింది. జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ చిధ్రం అవుతున్నాయి. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా
దమ్మపేట : మండల పరిధిలోని ముష్టిబండ గ్రామశివారులో డీజిల్ ట్యాంకర్ బోల్తాపడిన సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి డీజిల్ కారిపోతుండగా స్థానికులు, వాహనదారులు బిందెలు, బకెట్లలో నింపుకుని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మామకన్ను డీఆర్ఓ సస్పెన్షన్ గుండాల: కాచనపల్లి రేంజ్ పరిధిలోని మామకన్ను సెక్షన్లో వివిధ గ్రామాల నుంచి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో డీఆర్ఓ జాహెదా బేగంను జిల్లా అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. సంవత్సర కాలంగా మామకన్ను సెక్షన్ పరిధిలో టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు, కార్పెంటర్ల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఎద్దులు అపహరణ దుమ్ముగూడెం: మండలంలోని వర్క్షాపు, కమలాపురం గ్రామాల్లో ఇద్దరు రైతులకు చెందిన మూడు ఎద్దులను దొంగలు అపహరించిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వర్క్షాపు గ్రామానికి చెందిన సునీల్ ఎద్దును బయటకట్టేసి ఉంచగా, అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. కమలాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రెండు ఎద్దులను కూడా అపహరించినట్లు తెలిసింది. కాగా ఎద్దుల అపహరణపై బాధితులు పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి జూలూరుపాడు: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్కానిస్టేబుల్ కొమరం వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండలంలోని మాచినేనిపేటతండాకు చెందిన వాంకుడోత్ సేవియా(35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలుమార్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా నయంకాలేదు. భరించలేని కడుపునొప్పి వస్తుండటంతో చనిపోతానంటూ తరచూ కుటుంబ సభ్యులకు చెబుతుండేవాడు. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తామంటూ కుటుంబ సభ్యులు మనోధైర్యం కల్పిస్తున్నారు. కాగా గురువారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికే సేవియా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. దీంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య వాంకుడోత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నం పాల్వంచరూరల్: యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ధర్మసోత్ విజయ్ గురువారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కుటుంబసభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం ఖమ్మం తరలించారు. కాగా విజయ్ తండ్రిని సేవాలాల్ ఆలయంలో పూజారిగా నియమిస్తానని అదే గ్రామానికి చెందిన బాబూరావు అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు. కానీ పూజారిగా మరో వ్యక్తిని నియమించారు. దీంతో విజయ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగగా బాబూరావు గొడవపడి తిట్టాడు. దీంతో మనస్తాపం చెందిన విజయ్ పురుగులమందు తాగాడు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో.. వైరా: అప్పు కోసం తాకట్టు పెట్టిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరానికి చెందిన ఇండ్ల గోపాలరావు 1205 సర్వే నంబర్లోని 242 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి సాదా అగ్రిమెంట్ రాయించుకున్నాడు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గోపాలరావు నగదు అవసరాల కోసం ప్లాట్ కాగితాన్ని ఓ నాయకుడి వద్ద తాకట్టు పెట్టాడు. అయితే, ఎన్నికల్లో గోపాలరావు ఓడిపోగా, నగదు చెల్లించకపోవడంతో శుక్రవారం సదరు నాయకుడు ప్లాట్ అమ్మిన వ్యక్తి నుంచి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాలరావు వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి పురుగుల మందు తాగాడు. దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. కాగా, ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు రాలేదని తెలిపారు. -
నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
కొత్తగూడెంటౌన్: నకిలీ కరెన్సీ నోట్లు చెలామణీ చేసేందుకు వచ్చిన ఓ ముఠా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో టీ తాగేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. శుక్రవారం వన్టౌన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గురువారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఎస్ఐ టి.లచ్చయ్య తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కారులో ఆ ప్రాంతానికి వచ్చిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు జూలూరుపాడు మండలం కొమ్ముగూడేనికి చెందిన బానోతు భోజ్యానాయక్, ఖమ్మం జిల్లా వేంసూరు మండలానికి చెందిన తనమల్ల రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమలంక గ్రామానికి చెందిన బీరెపల్లి రాంబాబు, కొత్తగూడెం బాబుక్యాంప్నకు చెందిన జలమని భాస్కర్గా తేలింది. ఈ నలుగురు కారు ఓనర్ చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన పున్నం ప్రసాద్తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు నకిలీ కరెన్సీ నోట్లు చెలామణీ చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం మార్కెట్ ఏరియాలో నకిలీనోట్లు చెలామణీ చేసేందుకు బయల్దేరిన నలుగురు టీ తాగేందుకు బస్టాండ్ సెంటర్కు వచ్చారు. అనుమానాస్పదంగా వ్యవహరించి పోలీసులకు పట్టుబడ్డారు. కారులో తనిఖీ చేయగా రూ.3 లక్షల నగదు, దొంగనోట్లు తయారు చేయడానికి ఉపయోగించే యాసిడ్ బాటిళ్లు, నల్లపేపర్ బండిళ్ల కట్టలు 5, చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగించే 500 నకిలీ నోట్ల కట్టలు 33 లభ్యమయ్యాయి. కారుతోపాటు నగదు, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా కారు ఓనరు పున్నం ప్రసాద్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో వన్టౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై టి.లచ్చయ్య, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, ఘని, సురేష్, వీరన్న, కామేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదుగురికి ఏడాది జైలుశిక్ష
కొత్తగూడెంటౌన్: చేతబడి చేశారనే నెపంతో ములకలపల్లికి చెందిన కేసరి రామచంద్రంపై దాడి చేసి కొట్టిన ఐదుగురు వ్యక్తులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ బత్తుల రామారావు శుక్రవారం తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా.. ములకలపల్లి మండలం ముగురాళ్లగొప్ప గ్రామానికి చెందిన గుండె రమేష్ కూతురు అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తిప్పాడు. 2017, జూలై 5న చికిత్స కోసం సత్తుపల్లికి వెళ్లొస్తుండగా మృతి చెందింది. దీంతో అదే గ్రామానికి చెందిన కేసరి రామచంద్రం చేతబడి చేయడంతోనే తన కూతురు మృతి చెందిదంటూ అదే రోజు రాత్రి రమేష్ దాడికి దిగాడు. రమేష్తోపాటు గుండె నాగరాజు, గుండె వెంకటేష్, గుండె రాజేష్, గుండు శ్రీను, గుండి భద్రయ్య మూకుమ్మడిగా వచ్చి కర్రలు, గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో రామచంద్రం దంతాలు ఊడిపోయాయి. ఈ ఘటనపై గ్రామానికి చెందిన కేసరి శ్రీను 2017, జూలై 6న ములకలపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. విచారణ సమయంలో గుండి భద్రయ్య మృతి చెందాడు. ఆరుగురు సాక్షుల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో మిగిలిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 143,147,148 సెక్షన్ల కింద నెల చొప్పున, 324 సెక్షన్ కింద సంవత్సరం, 342, ఆర్/డబ్ల్యూ, 149/ఐపీసీ సెక్షన్ కింద ఆరు నెలల చొప్పున శిక్షతోపాటు రూ.1300 జరిమానా విధించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఏ.రాజారాం వాదించగా, నిర్వహించగా వీరబాబు, హరిగోపాల్, కోర్టు పీసీ బిక్కులాల్ సహకరించారు. -
వీధి కుక్కల స్వైరవిహారం
పాల్వంచరూరల్/ఇల్లెందు : జిల్లాలో శుక్రవారం వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. పాల్వంచ మండల పరిధిలో ఏడుగురిని కాటేయగా, ఇల్లెందు పట్టణంలో ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న మేకలపై దాడి చేసి 9 పిల్ల లను చంపేశాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్కకాటు బాధితులకు పాల్వంచ ఏరియా ఆస్పత్రి, జగన్నాథపురం పీహెచ్సీలో చికిత్స అందించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన జర్పుల దుర్గాప్రసాద్ – లలిత దంపతుల 16 నెలల చిన్నారి భానుశ్రీ ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కుక్క కాటు వేసింది. అదే గ్రామంలోని జామాయిల్ తోటలో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన సాద్విక్, ప్రతిభ, రంగాపురం గ్రామానికి చెందిన సురేష్, పూసుగూడేనికి చెందిన తులసీరాం, ఉప్పుసాకకు చెందిన నాలుగేళ్ల సుచిత, పాల్వంచకు చెందిన హేమంత్ కుక్కల దాడిలో గాయపడ్డారు. మేక పిల్లలను హతమార్చిన కుక్కలు ఇల్లెందు పట్టణంలోని 15 నంబర్ బస్తీకి చెందిన శంకర్పాసి 50 మేకలను అడవికి తీసుకెళ్లగా, 9 పిల్లలను కొట్టంలో కట్టేసి ఉంచాడు. వాటికి కాపలా ఉన్న కుటుంబ సభ్యులు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇంట్లోకి వెళ్లగా, కుక్కలు దాడి చేసి 9 పిల్లలను చంపేశాయి. చనిపోయిన మేక పిల్లల విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని శంకర్ పాసీ చెప్పాడు. -
అదనపు కట్నం కోసం వేధింపులు
పాల్వంచ: కోడలు అదనపు కట్నం తేవడం లేదని అత్త చేయి చేసుకుంటున్న వీడియో వైరల్గా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిఽధిలోని పిచ్చయ్య బంజరకు చెందిన రాజేశ్ మొదటి భార్య మృతి చెందడంతో శ్రీలతను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్లు ఉండగా, శ్రీలతకు కుమారుడు ఉన్నాడు. ముగ్గురీ ఆలనాపాలన శ్రీలతనే చూసుకుంటోంది. కాగా కొన్ని రోజులుగా అత్త లక్ష్మీబాయి పది లక్షల కట్నం ేతేవాలంటూ వేధిస్తోందని శ్రీలత ఆవేదన వ్యక్తం చేసింది. అనేక మార్లు తనను హింసించి, చేయి చేసుకుంటోందని కన్నీళ్ల పర్యంతయింది. ఈ విషయమై ఎస్ఐ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి కరకగూడెం: పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ ఏసీఎంఓ రమణయ్య , స్పెషల్ ఆఫీసర్ ఎస్.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని చిరుమళ్ల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల హెచ్ఎం జగన్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/కాళేశ్వరం/వాజేడు: తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయానికి 50 అడుగులకు చేరువైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. చదవండి: మీ వాహనం సేఫ్గా ఉండాలా.. వానాకాలంలో ఈ టిప్స్ పాటించాల్సిందే ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరదలతో గోదావరి 55 అడుగులు దాటే అవకాశమున్నందని, ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని, ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి–బైరాగులపాడు ప్రధాన రహదారిపైకి వరద భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం ముంపునకు గురైంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో మంగళవారం 9 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. -
ఒక్కటైన ప్రేమజంట.. దీని వెనక పెద్ద కథే నడిచింది!
సాక్షి,బూర్గంపాడు(భద్రాద్రి): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని సారపాకలోని రాజీవ్నగర్లో ఓ యువతి ఆందోళన చేపట్టిన విషయం విదితమే. శనివారం రాత్రి పోలీసుల కౌన్సిలింగ్, ఐద్వా ప్రతినిధుల ఆందోళనలతో ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. సారపాక రాజీవ్నగర్కు చెందిన ఇర్పా నర్మద, అదే కాలనీకి చెందిన బి.కిరణ్కుమార్ గత ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే కిరణ్కుమార్ పెళ్లికి నిరాకరించటంతో నర్మద ప్రియుడి ఇంటి ఎదుట శనివారం ఆందోళన చేపట్టింది. ఆమె ఆందోళనకు ఐద్వా ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. శనివారం రాత్రి పోలీసుల కౌన్సిలింగ్తో కిరణ్కుమార్ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఐద్వా ఆధ్వర్యంలో బూర్గంపాడులోని రామాలయంలో ప్రేమజంటకు పెళ్లి జరిపించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు సీతాలక్ష్మి, లీలావతి, సున్నం గంగ, జీవనజ్యోతి, పాపినేని సరోజని, జి.రాధ, రమణ, చుక్కమ్మ, సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు పొడియం నరేందర్, కొనకంచి శ్రీని వాస్, గుర్రం సుదర్శన్ పాల్గొన్నారు. చదవండి: గురుకులంలోకి అగంతకుడు.. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లోకి -
‘బలిదానాలతోనే తెలంగాణ’
సాక్షి,బూర్గంపాడు(భద్రాద్రి): వందల మంది ప్రాణత్యాగం..వేల మంది ఆస్తుల త్యాగంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది ప్రాణత్యాగం చేశారో చెప్పాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కొనసాగింది. జిన్నెగట్టు గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వివిధ గ్రామాల్లో సాగింది. ఉప్పుసాక గ్రామంలో జరిగిన రైతుగోస సభలో షర్మిల మాట్లాడుతూ..ఉద్యమ సమయం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటూ అధికారాన్ని అనుభవిస్తోందని, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ పాదాల కింద నలిగిపోతోందని ఆరోపించారు. రాజన్న బిడ్డగా ఆశీర్వదిస్తే తిరిగి రాష్ట్రంలో వైఎస్సార్ పాలన తీసుకొస్తామన్నారు. దీక్షలో వైఎస్సార్ టీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ గడిపల్లి కవిత, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రామయ్య పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం: భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మిథిలా స్టేడియం లోని కల్యాణ మండపంలో సీతమ్మవారితో సింహాసనంపై ఆసీనులైన రామయ్యను చూసి భక్తులు తరించారు. ఈ వేడుకకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆ మె రామాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టాభిషేకం పూర్తయ్యాక భద్రాచలంలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన గర్భిణుల సీమంతం కార్యక్రమంలో తమిళిసై పాల్గొన్నారు. నేడు కొండరెడ్లతో ముఖాముఖి సోమవారం సాయంత్రం దమ్మపేట మండలం నా చారం గ్రామంలో గుట్టపై ఉన్న స్వయంభూ శ్రీ జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామి ఆలయా న్ని దర్శించుకున్న తమిళిసై... మంగళవారం దమ్మ పేట మండలం పూసుకుంట, అశ్వారావుపేట మం డలం గోగులపూడి, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వెనుకబడిన వందకుపైగా కొండరెడ్ల కుటుంబాల తో పూసుకుంటలో ముఖాముఖి నిర్వహించనున్నారు. 10 నెలల క్రితమే గవర్నర్ ఈ 3 గ్రామాలను దత్తత తీసుకొని గిరి వికాస్, గిరి పోషణ్ పథకాలతో వారికి పౌష్టికాహారం అందించడంతోపాటు కోళ్లు పంపిణీ చేస్తున్నారు. సోమవారం ఉదయం స్థానిక బీజేపీ నాయకులు గవర్నర్ను కలి సేందుకు సింగరేణి గెస్ట్హౌస్కు రాగా బిజీ షెడ్యూల్ ఉందం టూ తమిళిసై సున్నితంగా తిరస్కరించారు. -
సీఎం కేసీఆర్ ఈసారైనా వస్తారా..?
భద్రాచలం: శ్రీరామనవమికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారైనా వస్తారా? ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు పట్టుకొస్తారా? యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఇక భద్రాద్రిపై దృష్టి పెడతారా? రూ.100 కోట్ల అభివృద్ధి ప్రకటనను అమలు చేస్తారా.. అనే ప్రశ్నలు భక్తుల మెదళ్లను తొలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక 2016లో తొలిసారిగా సీఎం దంపతులు శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యారు. శ్రీసీతారామచంద్రస్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మళ్లీ వేడుకలకు హాజరు కాలేదు. 2017లో స్వామి వారికి సీఎం మనుమడితో పట్టువస్త్రాలు పంపించడమూ, విమర్శలకు దారితీయడమూ తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్లపాటు అంతరాలయంలోనే సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిపారు. భక్తులను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాది వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కల్యాణ ముహూర్తం ప్రకటించినప్పటి నుంచి సీఎం కేసీఆర్ రాకపై చర్చ సాగుతోంది. నిజాం నవాబు తానీషా కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్న పట్టు వస్త్రాలు, తలంబ్రాల సమర్పణను ముఖ్యమంత్రి హోదాలో బ్రేక్ చేసిన కేసీఆర్.. ఈ సారైనా వస్తారా? రారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. యాదాద్రి పూర్తైంది.. మరి భద్రాద్రి..? 2016న భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్సాయితో మాస్టర్ప్లాన్ రూపొందించారు. అంతటితో ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అదే క్రమంలో యాదాద్రి ఆలయాన్ని మాత్రం శరవేగంగా పూర్తి చేశారు. వందల కోట్ల రూపాయలతో తీర్చిదిద్దారు. యాదాద్రితో పాటే భద్రాద్రి అని అధికారం పక్షం వారు చెబుతున్నా.. అభివృద్ధి అమలుకు నోచుకోవడంలేదు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తైన నేపథ్యంలో భద్రాచలం రామాలయంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని భక్తులు, జిల్లావాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు. స్థానికులు, భక్తుల్లో అసంతృప్తి భద్రాచల రాముడిపై సీఎం కేసీఆర్కు చిన్నచూపు ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శల దాడి చేస్తున్నాయి. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భద్రాచలం రామాలయం అభివృద్ధి చేయకపోవడం, ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి సాధించలేకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ పథకంలో భాగంగా భద్రాచలం, పర్ణశాల ఆలయాలకు రూ.96 కోట్లు ప్రకటించింది. కార్యాచరణ వేగవంతం చేసింది. కల్యాణానికి ముఖ్యమంత్రి, పట్టాభిషేకానికి గవర్నర్లు హాజరు కావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హాజరు కాకుండా, గవర్నర్ తమిళిసైతో పాటుగా బీజేపీ మంత్రులు హాజరయితే విమర్శల తాకిడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఉగాది రోజు సీఎం, గవర్నర్కు ఆహ్వానాలు శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరు కావాలని దేవస్థానం తరఫున సీఎం, గవర్నర్లకు ఉగాది రోజున ఆహ్వాన పత్రికలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా ఏప్రిల్ 2న సీఎం, గవర్నర్లను ఆహ్వానించేందుకు ఈవో, అర్చకులు వెళ్లనున్నారు. 1న దేవదాయ శాఖ మంత్రి చేతుల మీదుగా వాల్ పోస్టర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం సీఎం, గవర్నర్తోపాటు ఇతర మంత్రులను ఆహ్వానించనున్నారు. -
టీఆర్ఎస్ కారులో కయ్యం.. ఏందబ్బా ఇది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఇప్పటికే కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్య నేతల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 25వ తేదీ శుక్రవారం పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మల్లెలమడుగులో చోటు చేసుకున్న సంఘటన జిల్లా రాజకీయాలనే కుదిపేసింది. ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు 144 సెక్షన్ అమలుకు దారి తీసినా పరస్పర దాడులు మాత్రం తప్పలేదు. సాక్షాత్తు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో ఆయన వర్గీయులు, అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పాయం వెంకటేశ్వర్లుతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిని ‘రేగా’ అనుచరులతో పాటు పోలీసులూ అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా, పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. తనను అడ్డుకున్న పోలీసులతో పాయం వెంకటేశ్వర్లు విభేదించారు. దీంతో 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో ఏఎస్ఐ మోహన్ విధులకు ఆటంకం కలిగించినందుకు పిడమర్తి రవితో పాటు మరో ఐదుగురిపై 188, 143, 353,ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు చందాలు వసూలు చేసి ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అనుమతి లేకున్నా వచ్చి తమపై దాడి చేశారంటూ ఆ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్నా అశోక్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, తుళ్లూరి బ్రహ్మయ్య, గజ్జల లక్ష్మారెడ్డితో పాటు మరో ఎనమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై 188,143,324,109 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్.. మల్లెలమడుగులో జరిగిన ఘటన నేపథ్యంలో శనివారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో రేగా కాంతారావు.. పొంగులేటి, పిడమర్తి రవిని విమర్శిస్తూ పెట్టిన పోస్టులు హాట్టాపిక్గా మారాయి. పిడమర్తి రవిని దళిత ద్రోహిగా అభివర్ణించిన ‘రేగా’ పినపాక నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. కాగా గత ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ పొంగులేటికి సన్నిహితుడు కావడం, వచ్చే ఎన్నికల్లోనూ పాయం ఇదే పార్టీ నుంచి పోటీకి సన్నద్ధమవుతుండడంతో ఇరువర్గాల మధ్య అంతర్గత పోరు మొదలైంది. ఆది నుంచి పాయం వెంకటేశ్వర్లుకు అండగా ఉంటున్న పొంగులేటిపై ‘రేగా’ విమర్శలకు కారణమిదే అనే ప్రచారం గులాబీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, నియోజకవర్గ స్థాయి యువతతో ఆదివారం రేగా కాంతారావు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏ అంశాలు చర్చిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా.. ఈ వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు, మార్పులు ఎలా ఉంటాయోననే చర్చ మొదలైంది. నేనో సీనియర్ ఉద్యమకారుడిని. తెలంగాణ ఉద్యమంలో నేను పోషించిన పాత్ర మీ అందరికీ తెలుసు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా సేవలందించా. పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అశ్వాపురంలో మాదిగ జేఏసీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆవిష్కరణకు నన్ను పిలిచింది. అదే కులానికి చెందిన బిడ్డగా ఈనెల 25న నేను ఆ విగ్రహావిష్కరణకు వెళ్తే పది మంది నాపై దాడి చేశారు. నాతో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును అడ్డుకున్న పోలీసులు మాపై కేసులు నమోదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రోద్బ లంతోనే ఇదంతా జరిగింది. మాకు జరిగిన అవమానంపై సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేస్తా. – పిడమర్తి రవి -
భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
-
ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య
-
తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య
అశ్వారావుపేట రూరల్/చండ్రుగొండ: పాఠశాలకని వెళ్లిన బాలిక అదృశ్యమై రెండురోజుల తర్వాత విగతజీవిగా కనిపించింది. ఆమెతోపాటు ఆటోడ్రైవర్ కూడా బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్న ఆటోడ్రైవర్, ఆ బాలికను ప్రేమపేరిట మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంకి చెందిన మాయర సర్వేష్ – కృష్ణవేణి దంపతుల పెద్ద కుమార్తె అనూష(14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పోరల్ల జగ్గారావు(28) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. గ్రామానికి చెందిన పలువురితో కలసి అనూష కూడా జగ్గారావు ఆటోలో పాఠశాలకు వెళ్లివచ్చేది. ఈ క్రమంలోనే అతడు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి ఆమెను వశపర్చుకున్నట్లు సమాచారం. సోమవారం రోజులాగే పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్న భోజన సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అయితే, అప్పటికే పాఠశాల బయట వేచి ఉన్న జగ్గారావు ఆమెను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో వారు అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి కొత్తగూడెం డిపో బస్సు ఎక్కి కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటూ కనిపించడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ వెంటనే పోలీసులు, అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో బస్సులోనే వారిద్దరిని అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం
భద్రాచలం అర్బన్: ప్రభుత్వాస్పత్రిలో వైద్యమంటే సాధారణ ప్రజలే ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్.. తన భార్య మాధవికి ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవం చేయించారు. మంగళవారం రాత్రి పురిటినొప్పులు రాగా, మాధవిని భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి శస్త్రచికిత్స ద్వారా బుధవారం తెల్లవారుజామున 1:19 నిమిషాలకు ప్రసవం చేశారు. మాధవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి శిశువుకు వ్యాక్సిన్ వేశారు. కాగా, మాధవి గర్భం దాల్చినప్పటి నుంచే ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కలెక్టర్ అనుదీప్ ఆస్పత్రిలో కుమారుడిని ఎత్తుకుని మురిసిపోయారు. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. హరీశ్రావు అభినందనలు: కలెక్టర్ అనుదీప్ నిర్ణయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్లో ప్రçశంసించారు. ‘తల్లీశిశువు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సమర్థుడైన కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. దీంతో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులే మొదటి ఛాయిస్గా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్ కూడా ట్విట్టర్ ద్వారా కలెక్టర్ దంపతులను అభినందించారు. (చదవండి: ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరిన కలెక్టర్ భార్య) చదవండి: అరుదైన బాలుడు.. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ఇలా.. Warmest Congratulations to @Collector_BDD & his wife. I hope both the mother & the child are doing well. It gives us immense pride to see how under the able leadership of CM KCR Garu, state medical infrastructure has proven to be the first choice of people. https://t.co/H7jN2ldMZi— Harish Rao Thanneeru (@trsharish) November 10, 2021 -
నిండా ముంచిన మిర్చి
-
Telangana: ఆ ఊరికి ఏమైంది..?
ఆ ఊరును కిడ్నీవ్యాధి పీడిస్తోంది. అంతుచిక్కకుండా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆ వ్యాధి సోకి పలువురు మృత్యుకోరల్లో చిక్కుకున్నారు. చాలామంది డయాలసిస్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యానికి డబ్బుల్లేక మరికొందరు దీనంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామపంచాయతీ పరిస్థితి. ఆ గ్రామపంచాయతీ పరిధిలోని పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా, చీపురుగూడెం, రాచబండ్ల కోయగూడెం, రేగళ్లతండా గ్రామాల ప్రజలు కూడా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు కిడ్నీ సంబంధితవ్యాధితో 28 మంది మృతి చెందారు. గత పదిరోజుల వ్యవధిలోనే పంతులుతండాలో గుగులోత్ దేవిజ్యా(58), ధరావత్ వీరు(38) మృత్యువాతపడ్డారు. ఈ పంచాయతీ పరిధిలో 18 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా పడకలు, వసతుల్లేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని బాధితులు అంటున్నారు. – జూలూరుపాడు భద్రాద్రి జిల్లా భేతాళపాడులో అంతుచిక్కని కిడ్నీవ్యాధి ఏడేళ్లుగా ఇదే తంతు... : ఈ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఏడేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నా, పలువురు పిట్టల్లా రాలిపోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో అంతుపట్టడం లేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నామమాత్రంగా స్పందించి, అక్కడి ప్రజల తాగునీటి శాంపిళ్లను పరీక్షించి ఫ్లోరైడ్ సమస్య లేదని తేల్చారు. ఆ తర్వాత కూడా కిడ్నీవ్యాధి నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలు ఎందుకు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారనే విషయాలను తేల్చడంలో ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. భేతాళపాడు, పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య వల్లే కీళ్లు, ఒంటినొప్పులు, కాళ్లవాపులు రావడంతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు దయచూపాలె గత నాలుగేళ్లుగా భార్యాభర్తలిద్దరం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాం. డయాలసిస్ చేస్తే చనిపోతావని, బలహీనంగా ఉన్నావని, మందులు వాడమని నాకు డాక్టర్లు చెప్పారు. నా భార్య లక్ష్మి కీళ్లనొప్పులు, ఒళ్లు, నడుము నొప్పుల బాధ భరించలేకపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లే మాపై దయ చూపాలి. –బానోత్ పరశ్యా, పంతులుతండా వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నా రెండేళ్లుగా మూత్రపిండాలవ్యాధితో బాధపడుతున్నా. వారానికి రెండుసార్లు ఖమ్మం ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నా. నెలకు రూ.20 వేలు ఖర్చవుతున్నాయి. డయాలసిస్ కోసం కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే పడకలు ఖాళీగా లేవని డాక్టర్లు అంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్దామంటే డబ్బుల్లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలి. – బానోత్ మంగ్యా, టాక్యాతండా రక్త నమూనాలు సేకరిస్తాం భేతాళపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. బాధితుల రక్త నమూనాలు సేకరించాలని పీహెచ్సీ డాక్టర్ను ఆదేశించాం. బ్లడ్ శాంపిల్స్ను టీ హబ్కు పంపిస్తాం. భేతాళపాడుతోపాటు తండాల్లో నీటి నమూనాలు కూడా సేకరించాలని చెప్పాం. అన్ని శాఖల సమన్వయంతో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. – శిరీష, డీఎంహెచ్వో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు తప్పిన ప్రమాదం
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు పెను ప్రమాదం తప్పింది. కొత్తగూడెంలో మంగళవారం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నర్సయ్య, కారులో ఇల్లెందు బయలుదేరారు. ఆయనతో పాటు సోదరుడి కుమారుడు వర్మ ఉన్నారు. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా దాటాక రోళ్లపాడు క్రాస్ రోడ్డు సమీపంలో.. ఇల్లెందు నుంచి ఎదురుగా దూసుకొచ్చిన లారీ డ్రైవర్ ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో లారీని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు నాలుగు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నర్సయ్య కాలు, చేతికి స్వల్ప గాయాలు కాగా, కొత్తగూడెం వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుడు చీమల వెంకటేశ్వర్లు తన వాహనంలో గుమ్మడి నర్సయ్యను తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
చిట్టీ డబ్బులివ్వలేదు.. స్థలం రిజిస్ట్రేషన్ చేయలేదు..
పాల్వంచ: కష్టపడి చిట్టీ కట్టగా, డబ్బు ఇవ్వకుండా మోసం చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచలోని జయమ్మ కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు (40) దగ్గరి బంధువైన నందిగం భానుకుమార్ వద్ద రూ.25 లక్షల చిట్టీలు రెండు కట్టాడు. చివరి వరకు చెల్లించాక రూ.50 లక్షలు ఇవ్వాలని కోరితే తిప్పుతుండటంతో కేసు పెడుతామని చెప్పాడు. దీంతో బొల్లేరుగూడెం ఏరియాలోని 747 గజాల స్థలాన్ని వెంకటేశ్వరరావుకు రాసిచ్చాడు. కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేయసాగాడు. ఇదిలా ఉండగా, వెంకటేశ్వరరావుకు తెలియకుండా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెకు చెందిన మరో వ్యక్తికి కూడా ఇదే స్థలాన్ని భానుకుమార్ అగ్రిమెంట్ చేశాడు. చివరికి వీరిద్దరికి కాకుండా మల్లెల దినేష్కు రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ స్థలంలో దినేష్ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయని సమాచారం. అయినా తనకు న్యాయం జరగడం లేదని భావించిన వెంకటేశ్వరరావు గురువారం రాత్రి ఇంటి వద్దే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మరణించాడు. కాగా, ఓ ఎమ్మెల్యే కుమారుడు, అధికార పార్టీ నేతలు, పోలీసులు కూడా తనకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని, ఈ కారణంగానే మనస్తాపానికి గురైనట్లు వెంకటేశ్వరరావు పురుగు మందు తాగే ముందు ఎస్పీ పేరిట 43 మంది పేర్లతో రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ విషయమై పాల్వంచ ఎస్ఐ రితీశ్ను వివరణ కోరగా.. చిటీ డబ్బు విషయంలో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య శ్రావణి ఫిర్యాదు చేసిందని తెలిపారు. -
నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం
భద్రాద్రి: ఈ చిత్రంలో కానిస్టేబుల్ డ్రెస్లో ఉన్న యువకుడి పేరు ఆనంద్. ఊరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కోయ రంగాపురం గ్రామపంచా యతీ పరిధి గుంటిమడుగు. ఈ గిరిజన గ్రామంలో గత 67 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరూ లేరు. తాజాగా బంధం బైరాగి – దుర్గమ్మ దంపతుల కుమారుడు ఆనంద్.. కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకుని మంగళవారం స్వగ్రామానికి వచ్చాడు. అతడిని స్థానికులు, యువకులు ఘనంగా స్వాగతించి సత్కరించారు. – అశ్వారావుపేట రూరల్ -
జోరువానను లెక్కచేయక.. టీకా కోసం తోపులాట..
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్ వద్ద గురువారం తోపులాట జరిగింది. రెండు రోజుల తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం, దానికి తోడు సిబ్బంది సమయానికి రాకపోవడంతో వ్యాక్సిన్ కోసం ఒక్కసారిగా ప్రజలు దూసుకువచ్చారు. తోపులాటలో పలువురు వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. 800 మంది టీకా కోసం రాగా, సాయంత్రానికి 450 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు.– రామన్నపేట కరోనా థర్డ్వేవ్ ప్రచారంతో టీకా తీసుకునేందుకు వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి గురువారం వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోరువానను కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని మరీ బారులు తీరారు. – బూర్గంపాడు -
Post Cord Day: ఆ పాత ‘ఉత్తరం’ ఎక్కడోపోయింది..
సాక్షి, సుజాతనగర్(భద్రాద్రి కొత్తగూడెం): బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా.. స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలన్నా.. ప్రియుడు/ప్రియురాలితో మనసులోని భావాలను పంచుకోవాలన్నా.. సైనికులు తమ కుటుంబాలకు వివరాలు తెలపాలన్నా.. పాత రోజుల్లో పోస్ట్కార్డు (ఉత్తరం) ఉండేది. ఆ ఉత్తరాల ద్వారానే అన్ని రకాల సమాచారం చేరవేసుకునేవారు. ఇంటి ముందటికి పోస్ట్మ్యాన్ వచ్చి పోస్ట్ అనగానే ఇంటిల్లిపాది అతడి దగ్గరవాలిపోయేవారు. ఉత్తరాలు చదివి.. తిరిగి జవాబు రాసి పంపించి ఎంతో ఆనందించేవారు. నేడు పోస్ట్ కార్డు డే సందర్భంగా ఆ పాత ఉత్తరాన్ని గుర్తుచేశాం. చదవండి: తలకు గన్నుపెట్టి భూమి పత్రాలను రాయించుకున్న ఎస్సై.. -
భద్రాద్రి : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
-
వీళ్లను కన్న బిడ్డల్లా చూసుకుంటా : మహిళా ఎమ్మెల్యే
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఇద్దరు అనాథ పిల్లలకు ఎమ్మెల్యే హరిప్రియ అండగా నిలిచారు. భట్టు గణేశ్, స్రవంతి దంపతులు. మూడేళ్ల క్రితం గొంతు కేన్సర్తో గణేశ్, మూడు నెలల క్రితం కిడ్నీ సమస్యలతో స్రవంతి మృతి చెందారు. దీంతో వారి పిల్లలు ఏడేళ్ల కృషన్, ఐదేళ్ల హరిప్రియ భారం అమ్మమ్మ నాగమణిపై పడింది. వారి ఇబ్బందులను గణేశ్ మిత్రుడు ఫణి మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో వివరించాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ డి.అనుదీప్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మికి ఈ సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ చిన్నారుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకుంటానని, ఇద్దరికీ విద్య, ఇతర అవసరాలకు సాయం అందిస్తానని, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వారిని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. చదవండి: చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం -
గుడ్లగూబ టవర్ ఎక్కడుందో తెలుసా..
గుబ్బల మంగమ్మ గుహ నాగరక సమాజానికి పెద్దగా పరిచయం లేని ప్రదేశం. దట్టమైన అడవి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ వాగు, ఆ వాగు మధ్యలో ఓ గుహ, ఆ గుహలో ఉన్న దేవత పేరు మంగమ్మ. ఆదివాసీల దేవత. ఈ గుహాలయానికి వెళ్లే దారిలో ప్రయాణించడం సరదాగా మాత్రమే కాదు, విచిత్రంగా కూడా ఉంటుంది. రోడ్డుకు ఒకవైపు తెలంగాణ, మరో వైపు ఏపీ భూభాగం. ఈ ఆలయానికి తెలంగాణ రాష్ట్రం– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే తేడా లేకుండా తెలుగువాళ్లందరూ వస్తారు. ఒకప్పుడు ఆదివాసీలు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు నాగరకులు కూడా వస్తున్నారు. మంగమ్మ దేవతకు ఆదివాసీలు ఆది, గురువారాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. ఆ రెండు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో ప్రశాంతమైన పర్యాటకానికి వేదిక ఈ ప్రదేశం. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ సెల్ఫోన్ నెట్వర్క్లు పనిచేయవు. దీంతో పర్యాటకులు ఫోన్లను బ్యాగ్లో పెట్టేసి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. పిక్నిక్కి వచ్చిన వాళ్లు ఇక్కడే వంట చేసుకుని తింటూ ప్రకృతి ఒడిలో రోజంతా హాయిగా గడుపుతారు. ఇది చక్కటి ఎకోటూరిజం పాయింట్ కూడా. జీవ జలపాతం ఈ గుహాలయం పైన ఓ జలపాతం ఏడాదంతా జాలువారుతుంటుంది. వాగులో నీరు ఎప్పుడూ మోకాళ్ల లోతు ఉంటాయి. స్వచ్ఛమైన నీటి ధార కింద తడవకుండా వెనక్కి వస్తే పిక్నిక్ అసంపూర్తిగా ముగించినట్లే. గుడ్లగూబ టవర్ సెల్ఫోన్ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి పక్షుల కిలకిలరవాలను ఆస్వాదించడానికి ఏ అడ్డంకీ ఉండదు.ఆలయానికి సమీపంలో తెలంగాణ అటవీశాఖ బేస్ క్యాంప్ ఉంది. గుహాలయాన్ని దాటి మరింతగా అడవి లోపలికి వెళ్తే ఓ గుట్టపై 33 అడుగుల ఎత్తులో వాచ్టవర్ ఉంది. పేరు గుడ్లగూబ టవర్. ఈ వాచ్టవర్ పైకి ఎక్కితే కనుచూపు మేరలో పెద్ద పెద్ద గుట్టలు, చిక్కటి అడవి కంటికి ఇంపుగా కనిపిస్తాయి. – తూమాటి భద్రారెడ్డి, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం, గిరివనపర్యాటకం ఆ రాష్టం– ఈ రాష్ట్రం నడిమధ్య నీటి వాగు మంగమ్మ గుహ ఉన్న వాగు రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు అన్నమాట. ఒకవైపు తెలంగాణ, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా – మరోవైపు ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా. ఆలయం ఉన్న గుహ తెలంగాణ, ఆలయానికి మెట్ల దారి ఉన్న ఆర్చి ఆంధ్రప్రదేశ్. -
ఫారెస్ట్ ఆఫీసర్లను చితకబాది చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
-
భద్రాద్రి : ఫారెస్ట్ ఆఫీసర్లను కొట్టి.. చెట్టుకు కట్టేసి
సాక్షి, భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు చితకబాదడమే కాక చెట్టుకు కట్టేశారు. ఆ వివరాలు.. దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింత గుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ భూమిని స్వాదినం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మా పోడు భూమిలోకి మీరు ఎలా వస్తారని అధికారులను అడ్డుకొవడమే కాక వారిని కొట్టి.. చెట్టుకు కట్టేశారు. చదవండి: నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో -
హై టెన్షన్.. 26 మంది కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టుల ప్రయత్నాలు.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ముమ్మరంగా కూంబింగ్.. వెరసి మన్యం అట్టుడికిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవళ్లగూడెంలో ఇటీవలి ఎన్కౌంటర్, సరిహద్దున ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నలుగురు జవాన్లను శనివారం మావోలు హతమార్చిన తాజా ఘటనలతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు ఈ నెల 6వ తేదీన ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునివ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం నెలకొంది. మావోలు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్షన్ టీమ్లను ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి పంపారు. జూలై 20న మావోయిస్టు పార్టీ కొత్తగా రాష్ట్ర కమిటీని, మరో 12 డివిజన్, ఏరియా కమిటీలను, రాష్ట్రస్థాయి యాక్షన్ టీమ్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసు యంత్రాంగం మావోలను నిరోధించేందుకు నిరంతరం సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నెల 3న గుండాల ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత హరిభూషణ్ గన్మన్, యాక్షన్ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ హతమయ్యాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ లేఖలను విడుదల చేసిన మావోయిస్టు ఏరియా, డివిజన్ కమిటీ కార్యదర్శులు ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండటంతో అవాంఛనీయ, విధ్వంసక ఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. యాక్షన్ టీమ్లు సంచరిస్తున్న గోదావరి పరీవాహక జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కీలకమైన ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. డీజీపీ పర్యవేక్షణ డీజీపీ మహేందర్రెడ్డి నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసి సెర్చ్ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి పరీవాహక జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్లు జిల్లా ఎస్పీలు చూసుకుంటున్నారు. సబ్ డివిజినల్ పోలీసు అధికారులు ఏకంగా స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. కొన్ని నెలల కిందట ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని సబ్ డివిజన్లలో ఎస్డీపీఓలుగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారులనే నియమించింది. భద్రాచలంతోపాటు మణుగూరు, ఏటూరునాగారం సబ్ డివిజన్లకు ఐపీఎస్లను కేటాయించారు. మరోవైపు మూడు రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసులతో సంబంధం లేకుండా పోలీస్బాస్ మార్క్తో ఓఎస్డీ, సీఐల బదిలీలు చేశారు. మావోయిస్టు ఆపరేషన్లు చేయడంలో అనుభవం ఉన్న వారిని కీలకమైన ఠాణాలకు కేటాయించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్), సీతారామ ఎత్తిపోతల పథకాలకు పోలీసులు భద్రత మరింత పెంచారు. ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తుండటంతో మావోలు వారిలో కలసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 26 మంది కిడ్నాప్ నలుగురి హత్య మావోయిస్టులు భద్రాద్రి ఏజెన్సీకి సరిహద్దుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన నలుగురు గిరిజనులను శనివారం పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చారు. ముందుగా ఈ రెండు గ్రామాలకు చెందిన 26 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు ఏర్పాటు చేసి ఈ నలుగురిని గొంతుకోసి దారుణంగా చంపారు. ఆరుగురిని విడిచిపెట్టి, మరో 16 మందిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. బలగాలు కూంబింగ్ ఆపరేషన్లను నిలిపేయకపోతే తమ అధీనంలో ఉన్న 16 మందిని హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. -
నరకయాతన.. పురిటి నొప్పులతోనే..
గుండాల: పురిటి నొప్పులతో ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. మార్గమధ్యలో మల్లన్నవాగులో నీటి ఉధృతి పెరగడంతో ఆమెను అతికష్టం మీద వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈసం సంధ్యారాణి శుక్రవారం తెల్లవారుజాము నుంచి పురిటి నొప్పులతో బాధ పడుతుండగా కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అయితే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మార్గమధ్యలోని మల్లన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నొప్పులతో బాధపడుతున్న ఆమెను వాగు దాటించి అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్లో ఎక్కించి గుండాల ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేయడంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. -
అమ్మను గెంటేశాడు
బూర్గంపాడు: మాతృ దినోత్సవం నాడే ఓ తల్లి కంటతడి పెట్టింది. ఇంటి నుంచి కొడుకు గెంటేయడంతో మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. భద్రాద్రి జిల్లా పరిధిలోని సారపాకు చెందిన అయిలూరి రంగారెడ్డి, వెంకట కోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసేశారు. వృద్ధాప్యంలోనూ ఆ దంపతులు కలిసే ఉండేవారు. రంగారెడ్డి అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. దీంతో కోటమ్మ ఒంటరిగానే ఉంటోంది. కోటమ్మ నివాసం ఉండే ఇల్లు విషయంలో కొడుకు శ్రీనివాసరెడ్డికి, తల్లికి మధ్య విభేదాలు రావడంతో శనివారం తల్లితో శ్రీనివాసరెడ్డి గొడవ పెట్టుకుని ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ఇంటి వద్దే మౌనదీక్షకు దిగింది. -
మర్కటాలకు మహాకష్టం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాక్డౌన్ కారణంగా జనసంచారం తగ్గి వివిధ రకాల వన్యప్రాణుల పరిస్థితి మెరుగుపడగా, కోతులు మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, అడవి దున్నలు, అడవి పందులు, కుందేళ్లు ప్రధాన రహదారుల సమీపంలో సైతం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వీటి పరిస్థితి ఇలా ఉంటే.. కోతు లు ఆహారం దొరక్క విలవిల్లాడుతున్నాయి. జిల్లాలో కోతులు అత్యధికంగా కొత్తగూడెం–మణుగూరు ప్రధాన రహదారి పక్కన మొండికుంట అటవీ ప్రాంతంలో, కొత్తగూడెం–ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన, సారపాక అటవీ ప్రాంతంలో, పాల్వంచ–దమ్మపేట రహదారి పక్కన ములకలపల్లి అటవీ ప్రాంతంలో, కిన్నెరసాని డ్యామ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించేవారిలో అధికశాతం మంది కోతులకు నిత్యం ఆహార పదార్థాలను పెట్టేవారు. ఇలా జిల్లాలో సుమారు 20 వేల వరకు కోతులు వాహనదారులు అందించే పండ్లు, ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడేవి. లాక్డౌన్తో జన సంచారం లేక కోతులు ఆహారం కోసం అలమటిస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో అడవి మామిడి, ఇతర ఫలాలు ఆశించిన రీతిలో కాయలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో రైతుల మామిడి తోటల్లోనూ కాయలు అనుకున్నంతగా కాయలేదు. తునికి కాయలు కూడా అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. దీంతో ఆహారం కోసం కోతులు వివిధ రహదారులపై రోజూ ఎదురుచూస్తున్నాయి. కొన్ని చోట్ల జనావాసాల్లోకి వచ్చి అందిన తిండి ఎత్తుకెళుతున్నాయి. అడపాదడపా కొందరు జంతుప్రేమికులు ఆహారం అందిస్తున్నప్పటికీ అది పరిమితమే కావడంతో రోడ్లవెంబడి మర్కటాలు దీనంగా తిరుగుతున్నాయి. ఎవరైనా వస్తారేమో.. ఏదైనా ఇస్తారేమో అని ఆశగా చూస్తున్నాయి. వేసవి వల్ల అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు సైతం ఎండిపోవడంతో దాహార్తి తీర్చుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది. ఆదుకుంటున్న జంతు ప్రేమికులు ఆహారం దొరక్క అవస్థలు పడుతున్న వానరాలను అడపాదడపా జంతు ప్రేమికులు ఆదుకుంటున్నారు. జంతువులను ఆదుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా పలువురు పిలుపునిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉండే కొందరు అప్పుడప్పుడు కోతులకు కూరగాయలు, తినుబండారాలు, పండ్ల వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. కాగా.. కోతులు వేల సంఖ్యలో ఉండడం వల్ల జంతు ప్రేమికులు అందించే ఆహారం వాటికి ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో అర్ధాకలితోనే వానరాలు అలమటిస్తున్నాయి. అడవుల్లో తిండి దొరక్క కోతుల గుంపులు సమీపంలోని జనావాసాల్లోకి వచ్చి తినే పదార్థాలు ఎత్తుకుపోవడం, స్థానికులపై దాడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వానరాలకు ఆహారాన్ని అందించి ఆదుకోవాలని పలువురు జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో 15 రోజులుగా కొనసాగుతున్న వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు బధవారం పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణిమ సందర్భంగా ఆలయంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రోలు, రోకలికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచారు. స్వామివారికి ముందుగా చూర్ణోత్సవం, జలద్రాణి ఉత్సవం, నవకలశ స్నపనం జరిపించారు. అనంతరం ఆచార్యులు సుదర్శన చక్రాన్ని శిరస్సుపై ధరించి వైదిక పెద్దలతో కలసి ఆలయంలో ఏర్పాటు చేసిన గంగాళంలో అభిషేకం నిర్వహించారు. చక్రతీర్థంగా అభివర్ణించే ఈ కార్యక్రమం పవిత్ర గోదావరిలో నిర్వహించాల్సి ఉండగా.. కరోనా వైరస్ ప్రభావంతో ఆలయంలోనే అర్చకుల మధ్య నిరాడంబరంగా పూర్తి చేశారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ 12 రకాలుగా ప్రదక్షిణ నిర్వహించి, 12 రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెట్టారు. రాత్రికి ఆలయంలోని ఉత్సవ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ‘ఫృథవీశాంత’ అనే మంత్రంతో మహా కుంభ ప్రోక్షణ నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి నిత్య కైంకర్యాలు.. బ్రహ్మోత్సవాలు ముగియడంతో గురువారం నుంచి స్వామివారికి యథావిధిగా నిత్య కైంకర్యాలు, దర్బార్ సేవ, దశవిధ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. పవళింపు సేవ మాత్రమే నిలిపివేస్తామని చెప్పారు. 16 రోజుల పండుగ రోజున మాత్రమే స్వామివారికి ఏకాంత సేవలు చేస్తామని, ఈనెల 16న నూతన పర్యంకోత్సవం, ఎడబాటు ఉత్సవం ఉంటాయని వివరించారు. -
రాజాధి'రాజ'..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో శుక్రవారం ఈ వేడుక నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, దేవస్థానం ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ క్రతువు జరిపారు. ప్రతియేటా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి కల్యాణం జరిగిన మరుసటి రోజే, అదే వేదికపై పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా ఈసారి కల్యాణ మహోత్సవం మిథిలా స్టేడియంలో నిర్వహించకుండా.. బేడా మండపంలోనే నిర్వహించారు. పట్టాభిషేకం కూడా అక్కడే జరిపారు. భక్తులు లేకుండానే ఈ వేడుక సాగింది. ఉదయం యాగశాలలో చతుస్థానార్చన హోమం నిర్వహించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన ప్రత్యేక పల్లకీపై వేంచేయింపజేసి బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను శిరస్సుపై «పెట్టుకుని మండపంలోని స్వామివారికి సమర్పించారు. ఆ తదుపరి అర్చకులు జగదభిరాముడికి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామ సంకీర్తనలతో మార్మోగింది. పట్టాభిషేకం భద్రాద్రి రామయ్యకే ప్రత్యేకం ముక్కోటి దేవుళ్లలో ఎవరికీ లేని పట్టాభిషేక యోగం ఒక్క శ్రీరాముడికే సొంతమని పట్టాభిషేక క్రతువు నిర్వహించిన అర్చకులు, వేద పండితులు తెలిపారు. మొదటగా విశ్వక్సేనుడి పూజతో మహా పట్టాభిషేకం ప్రారంభించారు. వేడుకకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేశారు. పట్టాభిషేకానికి హాజరైన ప్రముఖుల హృదయాలు పవిత్రంగా ఉండాలని పుండరీకాక్ష నామస్మరణ చేసి భక్తులకు సంప్రోక్షణ జరిపారు. శ్రీరామ నవమి మరుసటి రోజైన దశమిని ధర్మరాజు దశమి అంటారని, ఈ రోజున పట్టాభిషేకం జరిగితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేదపండితులు పేర్కొన్నారు. పవిత్ర నదీజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చనలతో స్వామివారికి పూజలు జరిపారు. మండపంలో పంచకుండాత్మక–పంచేష్టిసహిత చతుర్వేద హవన పురస్కృతంగా వేదపండితులు క్రతువు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12గంటలకు రజిత సింహాసనంపై శ్రీసీతారాముల వారిని పట్టాభిషిక్తుడిని చేశారు. సకల రాజలాంఛనాలతో.. పట్టాభిషేకం సమయాన భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను శ్రీసీతారామచంద్రస్వామి వారికి అలంకరించారు. ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను వివరిస్తూ స్వామివారికి ధరింపజేశారు. స్వర్ణఛత్రం, స్వర్ణపాదుక, రాజదండం, రాజముద్రిక, కత్తి, డాలు, మహా సామ్రాట్ కిరీటాన్ని స్వామివారికి అలంకరింపజేశారు. నాటి మహర్షులు, అష్టదిక్పాలకులు, శ్రీరాముని సేనను గురించి వివరించారు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన చైత్ర పుష్యమి ముహూర్తంలోనే భద్రాచలం దివ్యక్షేత్రంలో కూడా పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీ అని వేద పండితులు తెలిపారు. 60ఏళ్లకు ఒకసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 ఏళ్లకు ఒకసారి పుష్కర ప్రయుక్త పట్టాభిషేకం, ప్రతి ఏటా కల్యాణం మరుసటి రోజు మహా పట్టాభిషేకం నిర్వహించే సంప్రదాయం భక్త రామదాసు కాలం నుంచి కొనసాగుతోందని వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు వివరించారు. పట్టాభిషేకం వీక్షించినవారికి విజయాలు సిద్ధిస్తాయని, అందరికీ మంచి జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రామాలయ ప్రాంగణం జై శ్రీరామ్, జైజై శ్రీరామ్ అనే నినాదాలతో మార్మోగింది.పట్టాభిషేకం పూర్తైన తర్వాత స్వామివారి అభిషేకంలో ఉపయోగించిన పుణ్యజలాలను భక్తులపై చల్లారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, అర్చకులు పాల్గొన్నారు. -
శ్రీ సీతారాముల కల్యాణం..టీవీలో చూతము రారండి!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్: ఊరూరా.. వాడవాడలా కన్నుల పండువగా జరిగే శ్రీరామ నవమి వేడుకలు గురువారం అత్యంత నిరాడంబరంగా జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక సూచనలు చేసింది. భక్తులు రాకుండా కేవలం అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు, ఒకరిద్దరు ఆలయ ధర్మకర్తల సమక్షంలోనే ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాద్రి విచ్చేసి రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించేవారు. కానీ ఈసారి టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి సరిపెట్టుకోవాల్సిందే. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవా రు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణం జరగనుంది. ప్రభుత్వం ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్లు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. వేదపండితులు, అర్చకులు, పోలీసు, సాధారణ అధికారులు, ఆలయ ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. నేడు కల్యాణం.. రేపు పట్టాభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణానికి సంబంధించి గురువారం తెల్లవారు జామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాతం నిర్వహించనున్నారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం జరిపి అంతరాలయంలోని ధ్రువమూర్తులకు అభిషేకం జరుపుతారు. తర్వాత «మూలమూర్తులకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రజిత సింహాసనంపై ఆశీనులను చేస్తారు. భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను అలంకరిస్తారు. వేదికపై ఆశీనులైన శ్రీ సీతారాములకు సంకల్పం చెప్పి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జీలకర్ర, బెల్లం స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలపై ఉంచుతారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని చేస్తారు. అనంతరం ఎర్రని తలంబ్రాలతో వేడుక నిర్వహిస్తారు. శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. అన్ని దేవాలయాల్లోనూ ఇలాగే.. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయం మొ దలు మారుమూల పల్లెల్లోని దేవాలయాల వర కు కేవలం అన్నిచోట్లా ఆలయ కార్యక్రమంగానే స్వామి కల్యాణాన్ని పరిమితం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయా న్ని ఇప్పటికే దేవాదాయశాఖ అన్ని దేవాలయాలకు సూచించగా, తెలంగాణ విద్వత్సభ కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. స్వయంగా కల్యాణం లో పాల్గొనాలనుకునే భక్తులు కార్యక్రమాన్ని ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని, ఇతరులను ఆహ్వానించవద్దని అధికారులు సూచించారు. ఈసారి పానకం, వడపప్పు అందించటం, అన్నసంతర్పణ చేయటాన్ని నిషేధించారు. -
బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన
లాక్డౌన్తో వలస కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది కూలీలు కర్ణాట క రాష్ట్రం బల్లారిలో రోడ్డు నిర్మాణానికి ఉప యోగించే కంకరను కొట్టే పనులకు వెళ్లారు. లాక్డౌన్ ప్రకటించడంతో పను లు లేక, రవాణా సదుపాయం లేక 637 కిలోమీటర్లు కాలి నడకన పాల్వంచకు బయలుదేరారు. ఆరు రోజుల పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లను దాటుకుని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. రామవరం చెక్పోస్టు వద్ద వీరిని ఏఎస్సై రామకృష్ణ అడ్డుకుని వివరాలు సేకరించారు. ఏపీలో కరోనా టెస్టులు చేసిన రిపోర్టులను పోలీసులకు చూపించి తమ గోడు విన్నవించుకున్నారు. ఏఎస్సై.. వెంటనే ఆహార పదా ర్థాలు అందించి పాల్వంచకు పంపించే ఏర్పాట్లు చేశారు. లాక్డౌన్ కూలీల బతుకులను ఛిద్రం చేస్తుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. – దశరథ్ రజువా, సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
ఏ ఉద్యోగం రాదనే మనస్తాపంతో..
సాక్షి, పాల్వంచ: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని సీతారాంపట్నంకు చెందిన ఎన్ఎండీసీ ఉద్యోగి భాగం మధుసూదన్రావు కుమారుడు భరత్కుమార్(26) శనివారం ఉదయం పొలం దగ్గర నీళ్లు పెట్టి వస్తానని చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం భోజ నానికి కూడా రాకపోవడంతో తండ్రి మధుసూదన్రావు పొలం వద్దకు వెళ్లి చూడగా షెడ్డులో ఇనుపపైపుకు తాడుతో ఉరివేసుకుని ఉన్నాడు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. కొడుకు ప్రభుత్వం ఉద్యోగం కోసం అనేక పరీక్షలు రాసినా ఏ ఉద్యోగం రాదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి చేసిన ఫిర్యాదుతో ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
అశ్వాపురం, నెల్లిపాకల్లో ఏకగ్రీవాల హవా..
సాక్షి, అశ్వాపురం: ఏళ్లు కాదు..దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ సంఘాల్లో ప్రతిసారీ తీవ్ర పోటీనే. కానీ..ఈసారి ఏకగ్రీవమై ప్రత్యేకత సంతరించుకున్నాయి. అవే..అశ్వాపురం, నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. 1957లో ఏర్పాటైన ఈ రెండు సహకార సంఘాల్లో గత ఎన్నికల వరకు హోరాహోరీ పోరు ఉండేది. ఈ సారి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏకగ్రీవమయ్యేట్లు చూశారు. జిల్లాలోని 20 సహకార సంఘాల్లో 13కు 13 వార్డులు ఏకగ్రీవమైన సంఘాలుగా అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు నిలిచాయి. ఈ రెండు సంఘాల అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కానున్నారు. అశ్వాపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా తుళ్లూరి బ్రహ్మయ్య మూడో సారి ఎన్నిక కానున్నారు. నెల్లిపాక పీఏసీఎస్ అధ్యక్షుడిగా తుక్కని మధుసూదన్ రెడ్డి ఎన్నిక కానున్నారు. గతంలో బ్రహ్మయ్య డీసీసీబీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. గత ఎన్నికల్లో అశ్వాపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలోనే అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు ఏకగగ్రీవమయ్యేలా రాజకీయ పార్టీలను ఒప్పించి మండల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జిల్లాలోని సహకార సంఘాల్లో అశ్వాపురం, నెల్లిపాక సొసైటీలకు ప్రత్యేక స్థానం ఉంది. 3,232 మంది సభ్యులతో ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్తో అశ్వాపురం పీఏసీఎస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నెల్లిపాక పీఏసీఎస్కి జిల్లాలోని మొదటి మూడు సహకార సంఘాల్లో ఒకటిగా ఉంటు పలుమార్లు ఉత్తమ సంఘంగా అవార్డు పొందింది. -
మున్సిపల్ ఎన్నికల పోరు..లిక్కరు జోరు
సాక్షి, వైరా: ఈ మున్సిపల్ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని కొందరు అభ్యర్థులు మద్యాన్ని ఎరగా వేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా భారీగా కొనుగోలు చేసి నిల్వ ఉంచేశారు. నామినేషన్ల ఉపహసంహరణ సందర్భంగా ఈ నెల 13, 14వ తేదీల్లో అమ్మకాలు అమాంతం పెరిగాయి. ఆ తర్వాత 16తేదీతో కలుపుకుని ఏకంగా రూ.26.10కోట్ల విలువైన బీరు, లిక్కర్ అమ్మకాలు జరగడం దాని తీవ్రతను తెలియజేస్తోంది. సహజంగానే సంక్రాంతి పండుగప్పుడు లిక్కర్ అమ్మకాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఈ తరుణంలో మున్సిపల్ ఎన్నికలు కూడా ఉండడంతో మరింత ఊపందుకున్నాయి. గత నెలతో పోల్చితే రెట్టింపునకు మించి బేరాలు సాగాయి. పండుగ 15వ తేదీ రాగా..అంతకుముందు రెండు రోజులు, 16వ తేదీన విక్రయాలు తారాస్థాయికి చేరాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా పెట్టుకొని చకచకా పావులు కదుపుతున్నారు. ఓటర్లకు డబ్బులు పంచడం పక్కన బెడితే, మద్యం ఏరులై పారేలా పక్కా కిక్ ప్రణాళిక వేశారు. మందు ప్రియులను తమవైపు తిప్పుకొనుందుకు ఈపాటికే వారు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. ఆ తేదీల్లోనే ఎక్కువ.. 14వ తేదీన నామినేషన్ల గడువు ముగిసింది. పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు, కార్యకర్తలు, మద్యం ప్రియులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఎక్కువగా మద్యం కొనుగోళ్లు చేశారు. ఉపసంహరణకు ముందు రోజున 13వ తేదీన కూడా కొని రహస్య ప్రదేశాలకు తరలించారు. పోటీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే తరుణం కావడంతో తమ బలం మరింత చాటుకునేలా..కొందరు కిక్కే..కిక్కు అంటూ పంపిణీ చేసినట్లు సమాచారం రహస్య ప్రదేశాలకు తరలింపు.. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వైరా, మధిర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికలు ఈ నెల 22న జరగనున్నాయి. పోలింగ్కు ఒకట్రెంటు రోజుల ముందు పంపిణీ చేసేలా కొందరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పెద్ద ఎత్తున బీర్లు, మద్యాన్ని కొనుగోలు చేసి రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. వైరా ఐఎంఎల్ మద్యం డిపోలో సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో కీలక ఘట్టానికి చేరుకుంటుండడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. మున్సిపాలిటీలోని వైన్స్ దుకాణాల నుంచి ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇంకా అదనంగా బార్లు, సమీప మండలాల నుంచి సరుకు పట్టుకెళ్లినట్లు సమాచారం. నిఘా అధికారులు నిద్రపోతే.. ఎన్నికల పోరుకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో మద్యం జోరు మరింత పెరిగే అవకాశముంది. ఒకవేళ నిఘా అధికారులు పట్టించుకోకపోతే మాత్రం బీరు, లిక్కరు ఏరులై ప్రవహించే ప్రమాదముంది. కొంత మంది అభ్యర్థులు ఇప్పటి నుంచే మద్యాన్ని నిల్వ చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే అయినా..దాడులు కనిపించట్లేదు. నేరుగా ఓటర్ల ఇంటికెళ్లి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నా..స్పందించట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మహిళలు, ఇండిపెండెంట్లదే హవా..
సాక్షి, కొత్తగూడెం: మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 228 మంది అభ్యర్థులు 246 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలు చేసిన వారిలో మహిళలు, ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉంది. దాఖలైన మొత్తం నామినేషన్లలో 136 మంది మహిళలు, ఇండిపెండెంట్లు 49 మంది అభ్యర్థులు ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో వివిధ పార్టీల నాయకులు ఎక్కువ సంఖ్యలో వారి సతీమణులతో నామినేషన్లు దాఖలు చేయించారు. కొన్ని వార్డుల్లో దంపతులు ఇరువురు నామినేషన్లు దాఖలు చేసి బరిలో ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 24వ వార్డు నుంచి బాలిశెట్టి సత్యభామ నామినేషన్ వేయగా, ఆమె భర్త బాలిశెట్టి సుందర్రావు 35వ వార్డులో నామినేషన్ వేశారు. 16 వార్డు నుంచి మాచర్ల రాజకుమారి, 19వ వార్డు నుంచి మాచర్ల శ్రీనివాస్ (వీరిద్దరు దంపతులు) నామినేషన్లు దాఖలు చేశారు. వారితో పాటుగా 15వ వార్డు నుంచి సోదరులు పల్లపు రాజు, పల్లపు లక్ష్మణ్ నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. బుజ్జగింపులు మొదలు.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. స్క్రూటినీ మొదలైన క్రమంలో వార్డుల్లో బలంగా ఉన్న అభ్యర్థులు, బలహీనంగా ఉన్న వారిని ఎంచుకొని పోటీలో నుంచి తప్పించేందుకు బేరసారాలు మొదలు పెట్టినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. పోటీదారుల సంఖ్య తక్కువగా ఉన్న వార్డులను ఏకగ్రీవం చేసేందుకు సైతం మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. స్క్రూటిని, నామినేషన్ల ఉపసంహరణ తరువాత లిస్ట్ ఫైనల్కు చేరుకున్నాక అందరూ ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశముంది. ఇప్పటి నుంచే బలంగా ఉన్న అభ్యర్థులు, వారి వార్డుల్లో పోటీగా నామినేషన్ వేసిన వారిని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులతో మంతనాలు సరిగ్గా జరిగితే నామినేషన్ల ఉపసంహరణలోపు చాలామంది విత్ డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో 190 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ప్రస్తుతం 246 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
‘పెళ్లి’.. ప్రోత్సాహమేదీ?
సాక్షి, ఖమ్మం: దివ్యాంగులను వివిధ రంగాల్లో ప్రోత్సహించేందుకు.. వారు స్వయం శక్తితో ఎదిగేందుకు.. ఆర్థిక సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా.. అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. ఎవరైనా సకలాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే.. వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. జిల్లాలో సుమారు 30వేలకు పైగా వికలాంగులు ఉన్నారు. వీరిని ఆర్థికంగా ప్రోత్సహించడంతోపాటు వికలాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే కొన్నేళ్లుగా వికలాంగులకు సబ్సిడీ రుణాలతోపాటు వివాహ ప్రోత్సాహకాలు సక్రమంగా అందడం లేదు. దీంతో ప్రభుత్వ సహాయం కోసం దివ్యాంగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ ఏడాది రూ.61లక్షలు విడుదలయ్యాయని, వాటిని త్వరలోనే అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఎదురుచూపులు.. శారీరకంగా అంగవైకల్యం ఉన్నా ప్రతిభ కనబరుస్తూ పలు రంగాల్లో దూసుకుపోతున్న దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి అందే సాయం కోసం మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. అంగవైకల్యం ఉన్నా.. వారితో జీవితం పంచుకునేందుకు సకలాంగులు ముందుకొచ్చి వారిని వివాహం చేసుకుంటున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాల పేరుతో ఆర్థికంగా ఆదుకుంటూ వస్తోంది. అయితే మూడేళ్లుగా దివ్యాంగులను వివాహం చేసుకున్న సకలాంగులను ప్రోత్సహించేందుకు అందించే ప్రోత్సాహక నిధులను మాత్రం సక్రమంగా అందించడం లేదు. ఈ నిధులను రెట్టింపు చేసిన ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో జిల్లాలో 156 మంది అర్హులు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. బకాయిలు ఇలా.. వికలాంగులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. సబ్సిడీ రుణాలతోపాటు వికలాంగులను ఎవరైనా సకలాంగులు పెళ్లి చేసుకుంటే వారికి ప్రోత్సాహకాలను అందిస్తూ వచ్చింది. దీంతో వికలాంగులకు కూడా ఒక అండ దొరికినట్లయ్యేది. 2018 మార్చి నెలకు ముందు వరకు ప్రభుత్వం వికలాంగులను వివాహం చేసుకున్న సకలాంగులకు రూ.50వేల వరకు ప్రోత్సాహకాన్ని అందించేది. అయితే 2018 మార్చి 28వ తేదీ నుంచి వికలాంగులను పెళ్లి చేసుకున్న సకలాంగులకు ప్రోత్సాహకం కింద రూ.లక్ష చొప్పున అందించాలని నిర్ణయించింది. అయితే ప్రోత్సాహకాలను పెంచినప్పటికీ వాటిని అందించకపోవడంతో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2018–19లో బడ్జెట్ ప్రీజింగ్లో పెట్టారనే కారణంతో ఒక్కరికి కూడా ప్రోత్సాహకం అందించలేదు. 2018 మార్చి నెలకు ముందు దరఖాస్తు చేసుకున్న వారిలో 122 మందికి ప్రోత్సాహకాలు అందించాల్సి ఉండగా.. 2018 మార్చి తర్వాత ఇప్పటివరకు 34 మంది ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్ల నుంచి ప్రోత్సాహకాలు ఇలా.. జిల్లాలో దివ్యాంగులను వివాహం చేసుకున్న సకలాంగులను ప్రోత్సహిస్తూ.. అర్హులను గుర్తించి అధికారులు నిధులు అందిస్తున్నారు. 2015–16లో 59 మందికి రూ.29.50లక్షలను అధికారులు ప్రోత్సాహకాల కింద అందించారు. 2016–17లో 63 మందికి రూ.31.50లక్షలు, 2017–18లో 36 మందికి రూ.18లక్షలు అందించారు. 2018–19లో బడ్జెట్ ప్రీజింగ్లో ఉందని అర్హులైన లబ్ధిదారులకు నిధులు అందించలేదు. 2019–20లో 8 మందికి రూ.4 లక్షలు అందించారు. ఇంకా రూ.50వేల ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకున్నవారు 122 మంది అర్హులుగా ఉండగా.. రూ.లక్ష ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 34 మంది ఉన్నారు. సకాలంలో అందిస్తాం.. సకలాంగులను వివాహం చేసుకున్న దివ్యాంగులకు అందించే ప్రోత్సాహకాలు కొంత కాలంగా పెండింగ్లో ఉన్నాయి. సకాలంలో నిధులు విడుదల కాక ప్రోత్సాహకాలు అందించలేకపోయాం. ఇటీవల రూ.61లక్షల నిధులు విడుదలయ్యాయి. త్వరలోనే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. – సబిత, జిల్లా సంక్షేమాధికారి -
‘నాణ్యత..నై’పై కొనసాగుతున్న విచారణ
సాక్షి, చుంచుపల్లి(ఖమ్మం) : అటవీశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం రేంజ్ పరిధిలోని చాతకొండ నుంచి లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు క్రాస్ రోడ్ మీదుగా కేసీఎం కళాశాల వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ప్రహరీ నాణ్యత విషయంలో విచారణ కొనసాగుతోంది. రూ.6.32 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రహరీ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని గత నెల 25న ‘నాణ్యత నై’ అనే శీర్షికతో సాక్షి కథనాన్ని వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డిసెంబర్ 31న ఈ నిర్మాణాలపై విచారణ జరిపారు. ప్రహరీ నిర్మాణంలో ఉపయోగించిన ఇసుక, సిమెంట్ నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి నివేదికలను పంపాలని జిల్లా అటవీ అధికారులను విజిలెన్స్ అధికారి రాజా రమణారెడ్డి ఆదేశించారు. దీంతో సోమవారం సీసీఎఫ్ రాజారావు, డీఎఫ్ఓ రాంబాబు ప్రహరీ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గోడల నిర్మాణంలో వాడిన పిల్లర్ల నాణ్యతలను, ఇసుక, సిమెంట్ పరిమాణాల శాంపిళ్లను సేకరించారు. ఈ పనులను కెమెరాలో రికార్డు చేశారు. కాగా, ఈ ప్రహరీ గోడల నిర్మాణ పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై బదిలీ వేటు పడినట్లు తెలిసింది. కొత్తగూడెం రేంజ్ అధికారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి స్థానిక ఎఫ్ఎస్ఓకు ఇంచార్జ్ బాధ్యత అప్పగించారని సమాచారం. నిర్మాణ పనులను పర్యవేక్షించిన డీఆర్వోపైనా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. ఈ విషయమై జిల్లా అటవీ శాఖాధికారి రాంబాబును వివరణ కోసం పలుమార్లు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
జాడలేని నిందితుడి ఆచూకీ..!
సాక్షి, పాల్వంచ: భార్యను రోకలితో కొట్టి చంపి పరారైన నిందితుడి జాడ గత నాలుగు నెలలుగా అంతుచిక్కడం లేదు. క్షణికావేశంలో భార్యను హత్య చేసిన క్రమంలో భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక పరారీలోనే ఉన్నాడా అనే సందేహాలకు జవాబు లభించడం లేదు. పట్టణంలోని ఇందిరా కాలనీలో ఒకే వీధికి చెందిన అంబాల రవి, కీర్తి(24)లు ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదు సంవత్సరాల కొడుకు లోకేష్, మూడు సంవత్సరాల కూతురు కాజల్ ఉన్నారు. అంబాల రవి కొన్ని రోజులుగా ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో వీరి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. రవి పని చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతో కుటుంబంలో కలతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గత సెప్టెంబర్ 14వ తేది రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన రవి ఇంట్లో ఉన్న రోకలితో కీర్తి తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందింది. వెంటనే రవి మోటర్ సైకిల్పై పరారయ్యాడు. తెల్లారి అతడి మోటర్ సైకిల్ భధ్రాచలం బ్రిడ్జిపై ప్రత్యక్షమైంది. దీంతో హత్య చేసిన భయంతో రవి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేక పోలీసులకు దొరకకుండా పక్కదోవ పట్టించి పరారీలో ఉన్నాడా అనే సందేహాలకు జవాబు లభించడం లేదు. గత నాలుగు నెలలుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లభించడం లేదు. ఈ విషయమై సీఐ నవీన్ను వివరణ కోరగా.. అతని కాల్ డాటపై నిఘా ఉంచామని, బంధువులకు కాల్ చేస్తున్నాడా అనే కోణంలో కూడా తెలుసుకుంటున్నామని, గోదావరిలో చనిపోయి ఉంటే చెప్పలేమని తెలిపారు. -
నియంతృత్వ వైఖరి వీడాలి
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర ముఖ్యమంత్రి నియంతృత్వ వైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శనివారంలోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం(రామనర్సయ్య విజ్ఞానకేంద్రం)లో అఖిలపక్ష నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఎండీ.జావీద్, తెలంగాణ జన సమితి నాయకులు బత్తుల సోమయ్య, జెఏసీ నాయకులు కేవీ.కృష్ణారావు తదితరులు మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఏర్పడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి మొండి వైఖరి అవలంబిస్తున్నారన్నారు. హైకోర్టు గడువు ఇచ్చి ఆ లోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ నేటి వరకు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే వారికి ప్రజలు, అఖిలపక్ష పార్టీలు పూర్తి మద్దతునిస్తే వారిపై పోలీసులచే దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు హైదరాబాద్లో ఆందోళనలో పాల్గొంటే పోలీసులు దౌర్జన్యంగా వ్యాన్లో ఎక్కించి డోర్ వేస్తే రంగారావు బోటన వేలు తెగిపోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో జిల్లాకు కేసీఆర్ వస్తే నాడు అండగా ఉండి ఆదుకున్నది పోటు రంగారావు, న్యూడెమోక్రసీ పార్టీ కీలకపాత్ర పోషించగా మిగిలిన పార్టీలు, ప్రజలు, ఇతర సంఘాలు సహకరించాయన్నారు. ఆ విషయాన్ని మరిచి కేసీఆర్ వ్యవహరిస్తున్నారా..? నాడు ఉద్యమ సమయంలో నాటి కాంగ్రెస్ పార్టీ అలాగే అడ్డుకుంటే నేడు రాష్ట్రం ఏర్పడేదా...? అని ప్రశ్నించారు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని గుర్తించాలన్నారు. పోటు రంగారావు బొటన వేలు తెగిపోయిన సంఘటననను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 20(నేటి)నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్, టీడీపీ నాయకులు తోటకూరి శివయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుమలరావు, టిజెఏసి నాయకులు చిర్రా రవి తదితర నాయకులు పాల్గొన్నారు. -
మద్యం ‘డ్రా’ ముగిసెన్..
సాక్షి, ఖమ్మం: మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. దరఖాస్తుదారుల్లో కొందరికి అదృష్టం తలుపు తట్టగా.. మరికొందరిని దురదృష్టం వెక్కిరించింది. నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లాలోని 89 మద్యం దుకాణాలకు డ్రా ప్రక్రియను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రారంభించారు. ఈసారి డ్రా ప్రక్రియ సాయంత్రం 3.30 గంటలకే ముగిసే విధంగా ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేయడంతో సజావుగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 89 మద్యం దుకాణాలకు 4,303 దరఖాస్తులు రాగా.. వాటిలో సుమారు వెయ్యి మంది వరకు మహిళలు దరఖాస్తు చేయడం విశేషం. పాత సిండికేట్లకు భంగపాటు.. కొందరు సిండికేట్ వ్యాపారులు గత ఎక్సైజ్ పాలసీలో దాదాపు 10 నుంచి 12 షాపులు దక్కించుకోవడంతో ఈసారి కూడా వారు తమకు అదృష్టం తలుపు తడుతుందనే ఆశతో ఎదురుచేశారు. అయితే సిండికేట్లో 70 దరఖాస్తులు వేయగా.. ఒక్క షాపు కూడా దక్కలేదు. మరికొందరు సిండికేట్ వ్యాపారులు గత ఎక్సైజ్ పాలసీలో జిల్లావ్యాప్తంగా చక్రం తిప్పారు. ఈసారి కూడా అలాగే భావించి 104 దరఖాస్తులు వేయగా.. వారికి కేవలం 3 షాపులు మాత్రమే దక్కాయి. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొత్తోళ్లకు కలిసొచ్చిన అదృష్టం.. గత ఏడాది మద్యం షాపులలో ఒక్క షాపు కూడా దక్కని సిండికేట్లు ఈసారి మద్యం షాపుల డ్రాలో మంచి షాపులను దక్కించుకున్నారు. దీనికితోడు కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చేందుకు సిండికేట్లు గా ఏర్పడి వచ్చిన వారికి సైతం ఆశ్చర్యకరంగా వైన్ షాపులు దక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అలాగే మరికొందరు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తే వైన్ షాపు దక్కుతుంది.. లేదంటే రూ.2లక్షలు పోతాయని రంగంలోకి దిగిన సుమారు 20 మందిలో ఐదుగురికి వ్యాపారం బాగా నడిచే ఎ–1 దుకాణాలు దక్కడం విశేషం. డ్రాలో మహిళలు ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళలు డ్రా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికితోడు చాలా మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డ్రా జరిగే సీక్వెల్ ప్రాంతానికి జిల్లావ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచే చేరుకున్నారు. వీరిలో చంటిపిల్లలతో సైతం డ్రాలో పాల్గొనేందుకు వచ్చారు. ఇతర ప్రాంత వ్యాపారుల హవా.. జిల్లాలో మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న 27 మద్యం దుకాణాల్లో 20కిపైగా ఇతర ప్రాంతాల వారే దక్కించుకున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది చెబుతున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–1, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–2 ప్రాంతాల్లో సైతం ఇక్కడి వారితో సిండికేట్ అయి మొత్తం 30కిపైగా మద్యం షాపులను దక్కించుకున్నట్లు తెలిసింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా ప్రాంతాలకు చెందిన వారికి షాపులు అధికంగా దక్కాయి. ఎక్సైజ్ శాఖకు రూ.6,43,75,000 ఆదాయం జిల్లాలో 89 షాపుల డ్రా ప్రక్రియ ద్వారా ఎక్సైజ్ శాఖకు లైసెన్స్ ఫీజు కింద రూ.6,43,75,000 ఆదాయం లభించింది. 41 షాపులకు రూ.55లక్షలు సంవత్సరానికి ఫీజు ఉండగా.. ఇందులో మొదటి విడతగా 8వ వంతు లైసెన్స్ ఫీజు కింద రూ.2,81,87,500 ఆదాయం రాగా.. 33 షాపుల కు రూ.65లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఉండగా.. 8వ వంతుగా రూ.2,68,12,500 వచ్చాయి. మరో 15 షాపులకు రూ.50లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఉండగా.. 8వ వంతుగా రూ.93,75,000 వచ్చాయి. ఈసారి ఈఎండీని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన మధిర ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎర్రుపాలెం షాపును కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన శ్రీరాములు దక్కించుకున్నాడు. దీనికి 132 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మొదట ఎక్సైజ్ స్టేషన్–1కు డ్రా తీయగా.. పాశంగులపాటి కృష్ణారావు అనే వ్యక్తి ఈ షాపును దక్కించుకున్నాడు. మహిళల్లో మొదటి షాపుగా షాపు నం–4ను మౌనిక దక్కించుకుంది. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కూడా మద్యం షాపుల టెండర్లలో పాల్గొనడం గమనార్హం. అయితే ఆయనకు షాపు దక్కలేదు. అలాగే ఒకటి, రెండు దరఖాస్తులు వేసి.. ఎటువంటి అనుభవం లేకుండా మొదటిసారిగా షాపులు దక్కించుకున్న వారికి గుడ్విల్ కింద రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు ఇస్తామని.. తమకు ఆ షాపులు ఇవ్వాలని కొందరు తలపండిన మద్యం వ్యాపారులు బేరసారాలు కొనసాగించినట్లు తెలిసింది. డ్రా జరిగే హాలుతోపాటు బయట కూడా ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేసి డ్రా ప్రక్రియను అందరూ చూసేలా ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. హాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. డ్రా ప్రక్రియలో కలెక్టర్ కర్ణన్తోపాటు సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు, ఏసీపీ వెంకట్రావు, ఎక్సైజ్ ఏఈఎస్ సైదులు, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–1 సీఐ రాజు, ఎౖMð్సజ్ సీఐలు సర్వేశ్వరరావు, రమ్య, జుల్ఫీకర్, పోశెట్టి తదితర సిబ్బంది పాల్గొనగా.. ఖమ్మం వన్టౌన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. -
మంగళగూడెం చిన్నారి.. దక్షిణాఫ్రికాలో మృతి
సాక్షి, ఖమ్మం: మండల పరిధిలోని మంగళగూడేనికి చెందిన చిన్నారి దక్షిణాఫ్రికాలో స్విమ్మింగ్పూల్లో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కన్నేటి శంకర్, మమతలకు ఇద్దరు కుమారులు. మూడేళ్ల క్రితం శంకర్ భార్యా పిల్లలతో కలిసి ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికా వెళ్లారు. శంకర్ అక్కడ హార్డ్వేర్ ఉద్యోం చేస్తున్నాడు. వీరు అక్కడే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. వారి చిన్న కుమారుడు జూవిత్(4) అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి, వారు నివాసం పక్కనే ఉన్న స్విమ్మింగ్పూల్లో పడి మృతి చెందాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న జూవిత్ కనిపించకపోవడంతో తల్లి కంగారు పడి వెతకగా స్విమ్మింగ్ పూల్లో తేలియాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామమైన మంగళగూడేనికి శనివారం తీసుకురానున్నారు. కాగా జూవిత్ బీజేపీ జిల్లా కార్యదర్శి కన్నేటి కోటయ్యకు మనవడు. -
మద్యం రాబడి ఫుల్లు..
సాక్షి, కొత్తగూడెం: ఆబ్కారీ శాఖ ఆదాయం మద్యం కిక్కుతో తడిసి ముద్దయింది. మద్యం దుకాణాల దరఖాస్తుల రూపంలో జిల్లాలో దండిగా ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ శాఖ మరింత ఉత్సాహంగా ఉంది. 2017 సెప్టెంబర్లో మద్యం దుకాణాలకు దరఖాస్తుల రూపంలో రూ.22 కోట్ల ఆదాయం రాగా.. ప్రస్తుతం సరికొత్త మద్యం పాలసీ ద్వారా మరింత రాబడి వచ్చింది. గత సీజన్తో పోలిస్తే జిల్లాలో దాదాపు మూడు రెట్ల ఆదాయం అధికంగా రావడం విశేషం. దరఖాస్తు ఫీజు గత సీజన్లో రూ.లక్ష ఉన్నప్పుడు మొత్తం 2,204 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం 3402 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది రూ.68.04 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలకు పెంచినా, ఊహించని రీతిలో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ ఏడాది దరఖాస్తులు తగ్గినా పెంచిన దరఖాస్తు ఫీజుల ద్వారా ఆదాయం బాగానే వస్తుందని అధికారులు భావించారు. అయితే అందరి అంచనాలను తారు మారు చేస్తూ మద్యం వ్యాపార ఆశావహులు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు దాఖలు చేశారు. దీంతో ఆదాయం గ్రాఫ్లో మరింతగా పైకి దూసుకుపోయింది. ఇక దరఖాస్తుదారులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు వేచి చూస్తున్నారు. కాగా, కొత్తగూడెంలోని కమ్మవారి కల్యాణ మండపంలో శుక్రవారం (18వ తేదీ) కలెక్టర్ రజత్కుమార్ శైనీ లాటరీ తీయనున్నారు. ఇందుకోసం ఆశావహులైన వ్యాపారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మొత్తం 76 మద్యం దుకాణాలు ఉండగా, 35 ఏజెన్సీ పరిధిలో, 41 మైదాన, మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. లైసెన్స్ ఫీజు పెంచినా దరఖాస్తులు తగ్గలే... ఈసారి ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం దరఖాస్తు ఫీజు రెట్టింపు చేయడంతో పాటు లైసెన్సు ఫీజులు జనాభా ప్రాతిపదికన మరింతగా పెంచారు. దీంతో పాటు ప్రతి దుకాణానికి ప్రత్యేక రిటైల్ ట్యాక్స్ పేరుతో అదనంగా రూ.5 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ వ్యాపారులు, ఆశావహులు వెనుకడుగు వేయలేదు. ఇప్పటివరకు మద్యం వ్యాపారం చేస్తున్న వారు గతం కంటే ఎక్కువగా దరఖాస్తులు దాఖలు చేయడం గమనార్హం. ఎప్పటిలాగే ఒకటి, రెండు దరఖాస్తులు వేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు సైతం దాఖలు చేశారు. ఇక కొత్తగా ఎన్ఆర్ఐలు సైతం మద్యం వ్యాపారంలోకి దిగారు. ఇక్కడ ఉన్న తమ కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు దాఖలు చేయించారు. కొందరు ఎన్ఆర్ఐలు చుట్టుపక్కల ఐదారు జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేశారు. ఇక సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారులు సైతం జిల్లాలో భారీగానే దరఖాస్తులు దాఖలు చేశారు. జిల్లాలో 3402 దరఖాస్తులు దాఖలు కాగా, అందులో సుమారు 1000 అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు దాఖలు చేసినవేనని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ టెండర్ వేయడం గమనార్హం. ఏజెన్సీలో బినామీ పేర్లతో... జిల్లాలోని మున్సిపాలిటీ, మైదాన ప్రాంత దుకాణాలతో పాటు ఏజెన్సీ పరిధిలో ఉన్న దుకాణాలకు సైతం వ్యాపారులు బినామీల ద్వారా దరఖాస్తులు దాఖలు చేశారు. ప్రస్తు తం ఇతర వ్యాపారాల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో పాటు, పలు విభాగాల కాంట్రాక్ట్ పనుల్లో బిల్లులు సక్రమంగా అందకపోవడంతో పలువురు కొత్తవారు సైతం మద్యం వ్యాపారం వైపు దృష్టి సారించారు. అదేవిధంగా మద్యం వ్యాపారం పూర్తిగా లిక్విడ్ క్యాష్ వ్యాపారం కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారు సైతం మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. ఇన్ని రకాల విశేషాల నేపథ్యంలో ఆబ్కారీ శాఖకు కాసుల వర్షం కురిసింది. -
పండిద్దాం.. తినేద్దాం..
సాక్షి, ఖమ్మం: జిల్లాలోనే కూరగాయలు పండించి.. అమ్ముకునే విధంగా ప్రభుత్వం కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. బయటి మార్కెట్లో ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతుండడం.. సామాన్యుడు కొని.. తినలేని పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల కాలనీల ఏర్పాటుకు పూనుకుంది. అన్ని రకాల కూరగాయలు పండించేలా చర్యలు చేపట్టింది. వీటితోపాటు పండ్ల తోటల పెంపకం కోసం రైతులకు రాయితీలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇవన్నీ అమలులోకి వస్తే బహిరంగ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉండడంతోపాటు చౌక ధరలకు లభ్యమవుతాయి. క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయడంలో భాగంగా ఉద్యానవన శాఖ ద్వారా ప్రతిపాదనలు రూపొందించి.. అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఆ శాఖ జిల్లాలోని 8 మండలాలను క్రాప్ కాలనీల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఖమ్మం నగరానికి రోజుకు 15 నుంచి 20 టన్నుల కూరగాయలు అవసరం కాగా.. ఇందులో అత్యధిక భాగం ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. జిల్లాలో పండించే కూరగాయలు.. నగర ప్రజల అవసరాలతోపాటు జిల్లా ప్రజల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి. దీంతో ఖమ్మం నగరానికి కూరగాయలను తాజాగా.. తెల్లవారుజాము వరకు తెచ్చే రవాణా సౌకర్యం ఉండే ప్రాంతాలను, నగరానికి అత్యంత సమీపంలో ఉండే ప్రాంతాల్లో కూరగాయల కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని రకాల కూరగాయలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 1,700 ఎకరాల్లో సాగు.. జిల్లాలోని 1,700 ఎకరాల్లో కూరగాయల కాలనీలు ఏర్పాటు చేసి.. అందులో సాగు చేపట్టేందుకు ఉద్యానవన శాఖ సమాయత్తమవుతోంది. కూరగాయల కాలనీలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 8 మండలాలను ఎంపిక చేశారు. ఇక్కడ పండించిన పంటలను ఖమ్మం కార్పొరేషన్తోపాటు రైతుబజార్లో.. ఇతర ప్రాంతాల్లో విక్రయించుకునే వీలుంటుంది. అయితే క్రాప్ కాలనీల ఏర్పాటు కోసం రూ.4కోట్ల నిధులు అవసరం ఉంటాయని ప్రతిపాదనలు పంపించింది. పంట సాగు, విత్తనాలు, ఎరువులు, సూక్ష్మసేద్యం, మల్చింగ్, పందిళ్లు, పండించిన కూరగాయలను నిల్వ చేసుకునేందుకు గదుల నిర్మాణం తదితర వాటి కోసం ఈ నిధులు అవసరం ఉంటాయని ఉద్యానవన శాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇక కూరగాయల కాలనీల్లో 1,705 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్ల తోటల సాగుకు రాయితీ.. కూరగాయల కాలనీతోపాటు తాజా పండ్లను తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర ఉద్యాన మిషన్ పేరుతో పండ్ల తోటలను సాగు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో పండ్ల తోటలను సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులకు రాయితీ అందించాలని నిర్ణయించారు. మూడేళ్ల కాలంలో మొక్కలకు, ఎరువులకు, సాగుకు సంబంధించి రాయితీలు ఉంటాయి. ఇందులో భాగంగా మామిడిని 47 ఎకరాల్లో, నిమ్మ 16, జామ 43, దానిమ్మను 14 ఎకరాల్లో పండించాలని ఉద్యానవన శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అధిక ధరలతో.. కూరగాయలు బహిరంగ మార్కెట్లో అధిక ధర పలుకుతున్నాయి. సీజన్లో కొన్ని కూరగాయలు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండడంతో వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. వర్షాకాలంలో కొంత తక్కువగా ఉండే ధరలు.. వేసవిలో మాత్రం చుక్కలను అంటుతున్నాయి. వేసవిలో సామాన్యులు కూరగాయలు కొనుగోలు చేయలేని పరిస్థితి. కిలో రూ.80 నుంచి రూ.100 కూడా పలికిన సందర్భాలు ఉంటున్నాయి. కొంతకాలంగా జిల్లాలో కూరగాయ పంటల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజల అవసరాలను తీర్చేందుకు పెద్ద ఎత్తున కూరగాయల సాగు చేపట్టాలని ఉద్యానవన శాఖ నిర్ణయించింది. కూరగాయల కాలనీలు అందుబాటులోకి వస్తే వేసవి కాలంలోనూ కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రయోజనకరం.. క్రాప్ కాలనీల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తాం. తక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంట సాగు చేసుకుని విక్రయించుకోవడం ద్వారా రైతులకు ప్రయోజనం ఉంటుంది. నగర పరిసరాల్లోని మండలాల్లో కూరగాయల పంటలు సాగు చేసుకోవడం ద్వారా ఆయా రైతులు నగరంలో పంటను విక్రయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రాప్ కాలనీలకు తగిన చర్యలు తీసుకుంటాం. – జి.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాభివృద్ధి శాఖ అధికారి -
పాల్వంచలో సినీతారల సందడి
సాక్షి, పాల్వంచ: పట్టణంలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు నిర్మాతగా తీసిన ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా కళాశాలలో సినిమా పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌతంరాజు కుమారుడు కృష్ణంరాజు హీరోగా, కోల్కతాకు చెందిన హీరోయిన్ హెల్సాగోష్, దర్మకుడు శ్రీనాథ్లు మాట్లాడారు. సస్పెన్స్ థ్రిల్లర్తోపాటు ప్రేమకథా చిత్రంగా దీనిని తెరకెక్కించామని, సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేస్తామని తెలిపారు. తెలుగు ప్రజలు దీనిని విజయవంతం చేసి ఆదరించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి హీరోహీరోయిన్లు కృష్ణంరాజు, హెల్సాగోష్ నృత్యం చేసి ఉర్రూతలూగించారు. అనంతరం కళాశాల చైర్మన్ టి.భరత్ చిత్ర బృందానికి జ్ఞాపికలు అందించారు. కొత్త తరహా చిత్రం ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ చిన్న సినిమా అయినా కొత్త తరహా చిత్రం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ అని నిర్మాత, ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు, హీరో కృష్ణంరా జు అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. తొలుత గౌతంరాజు మాట్లాడు తూ సస్పెన్స్ థ్రిల్లర్ కథ బాగుండటంతో తానే సొంతంగా సినిమా తీసేందుకు ముందుకొచ్చానన్నారు. సినిమా తీయడం ఒక ఎత్తయితే దానిని రిలీజ్ చేయడం ఎంతో కష్టంతో కూడుకుందని, తాను సుమారు 300 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమని, తనలానే తన కొడుకు హీరోగా వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇందులో కీలక పాత్రదారులుగా తనికెళ్ల భరణి, బెనర్జీ, సన, రవి ప్రకాష్ నటించగా, ఎడిటర్ వెంకటేశ్వరరావు, ఫైట్స్ సింధూరం సతీశ్ సమకూర్చారని చెప్పారు. అనంతరం కృష్ణంరాజు మాట్లాడారు. సినిమాలో అర్జున్ పాత్ర బాక్సర్ కావడంతో 6 ఫైట్స్ ఎలాంటి డూప్ లేకుండా చేశానని తెలిపారు. హీరోయిన్ హెల్సాగోష్ మాట్లాడుతూ కన్నడంలో మొత్తం 11 సినిమాల్లో నటించానని, తెలుగులో ఇది తన మొదటి సినిమా అని పేర్కొన్నారు. -
బతుకమ్మ చీరల వేళాయె
సాక్షి, ఖమ్మం: దసరా పండుగను పురస్కరించుకొని మహిళా మణులకు ప్రభుత్వం చీరలను కానుకగా అందజేయబోతోంది. రేషన్కార్డుల లబ్ధిదారులను అర్హులుగా ఇప్పటికే ఎంపిక చేయగా..జిల్లాలోని 21 మండలాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పౌర సరఫరాల శాఖ వారు ఇచ్చిన వివరాల ప్రకారం కలెక్టరేట్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ మేరకు జిల్లాకు చీరలు అందాయి. మొత్తం 4,74,116మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 3.50లక్షల చీరలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మిగతావి కూడా రానున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ఇన్చార్జ్ అధికారులను సైతం నియమించారు. వారంతా ప్రతిరోజూ ఎన్ని చీరలను పంపిణీ చేశారనే వివరాలను కలెక్టరేట్కు సమాచారం అందించనున్నారు. జిల్లాలో గుర్తించిన లబ్ధిదారుల వివరాల ఆధారంగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 21మండలాల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాలకు, అక్కడి నుంచి గ్రామాలకు సరఫరా చేశారు. జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం (నేడు) ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రారంభించనున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రి ప్రారంభించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేయనున్నారు. వీఆర్వోలు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో చీరలను అందుబాటులో ఉంచగా రేషన్డీలర్, అంగన్వాడీ టీచర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు వారి వెంట ఆధార్కార్డు లేదంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. -
పత్తికి దెబ్బే..!
సాక్షి, కొత్తగూడెం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి వర్షాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఒకింత ఎక్కువగా కురవడంతో జిల్లాలో అన్ని పంటలను సాధారణ విస్తీర్ణం కన్నా అధికంగానే రైతులు సాగు చేస్తున్నారు. వరి, మొక్కజొన్న, పెసర, నూనెపంటలు, ఇతర ఆహార, వాణిజ్య పంటలు వందశాతం కంటే మించి పండిస్తున్నారు. వీటన్నింటికీ ప్రస్తుత వర్షాలతో ఇబ్బంది లేకున్నా.. పత్తి పంటకు మాత్రం కొంతమేరకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 46,475 హెక్టార్లు కాగా, ఈ సీజన్లో 46,524 హెక్టార్లలో సాగుచేశారు. అయితే పత్తి రైతులకు ఈ సీజన్లో వరుసగా దెబ్బలు తగిలాయి. సీజన్ ప్రారంభంలో అరకొర వర్షాలు కురవడంతో వెంటవెంటనే రెండు సార్లు పత్తి గింజలు నాటారు. కొందరు రైతులు మూడోసారి కూడా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో అవి మొలవలేదు. కొద్ది రోజులకు వర్షం కురవడంతో మళ్లీ విత్తనాలు వేశారు. ఈ క్రమంలో కొన్ని మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోయారు. తరువాత వర్షాలు సమృద్ధిగా కురవడంతో చివరలో నాటిన గింజలు మొలిచాయి. అయితే ఆలస్యంగా ప్రారంభమైన వర్షాలు జిల్లాలో సాధారణం కన్నా ఎక్కువగా కురవడంతో పత్తిపంటపై కొంతమేరకు ప్రభావం చూపుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో చాలాచోట్ల మోకాళ్ల ఎత్తులోనే పత్తిపంట ఎర్రబారింది. ఆకు ముడత వస్తోంది. వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో పత్తి చేలల్లో భారీగా కలుపు పెరిగి మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. మరోవైపు కొమ్మతొలుచు పురుగు, గులాబీరంగు పురుగు, పిండినల్లి తెగులు ఆశిస్తున్నాయి. దీంతో మొక్క పెరుగుదలపై ఆశలు లేకుండా పోతోందని రైతులు అంటున్నారు. ఇక రైతులు నాటిన విత్తనాలకు సంబంధించి బీటీ ప్రభావం 100 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ వ్యవధి కూడా దాటిపోతుండడంతో పెరుగుదల అంతగా ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో ముఖం చాటేసిన వర్షాలు తరువాత ఎక్కువగా కురుస్తుండడంతో పత్తి దిగుబడిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇక జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి గత నెలరోజుల కాలంలో నాలుగుసార్లు ఉధృతంగా ప్రవహించింది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంత మండలాల్లో పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనుకున్నంత స్థాయిలో పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు అంటున్నారు. మిగితా పంటలకు ఢోకా లేదు.. ఈ ఖరీఫ్లో వర్షాలు బాగా కురవడంతో పత్తి మినహా మిగిలిన పంటలకు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం సాధారణ విస్తీర్ణంలో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పెసర, పత్తి, చెరకు, ఇతర ఆహార పంటలు 100 శాతం సాగులో ఉన్నాయి. జిల్లాలో వరి, పత్తి పంటల వైపు రైతులు మొగ్గు చూపారు. వరి సాధారణ విస్తీర్ణం 43,334 హెక్టార్లు కాగా 43,577 హెక్టార్లలో (109 శాతం), పత్తి 46, 475 హెక్టార్లకు 46,524 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఈ రెండింటి తరువాత మొక్కజొన్న వైపు రైతులు మక్కువ చూపారు. ఈ పంట సాధారణ విస్తీర్ణం 6,304 హెక్టార్లు కాగా, 8,398 హెక్టార్లలో (133 శాతం) సాగు చేస్తున్నారు. పెసర 227 హెక్టార్లకు 233 హెక్టార్లతో 103 శాతం, ఇతర నూనె పంటలు 6,531 హెక్టార్లకు 6,644 హెక్టార్లు (102 శాతం), ఇతర ఆహార పంటలు 7,986 హెక్టార్లకు 7,999 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇతర ఆహారేతర పంటలు 7,490 హెక్టార్లకు గాను 7,580 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఎర్రబడి పూత రాలుతోంది నెలరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పత్తి ఎర్రబడి పూత రాలిపోతోంది. కలుపు పెరిగి చెట్లు ఎదగటం లేదు. వర్షాల కు తెగుళ్లు ఎక్కువయ్యా యి. పూత, కాత సమయంలో అధిక వర్షాలతో పంటకు నష్టం జరుగుతోంది. – యారం వెంకటరెడ్డి, రెడ్డిపాలెం దిగుబడి సక్రమంగా రాదు వర్షాలతో పత్తి ఎదుగుదల లేకుండా పోయింది. మొక్కలు ఎర్రబడి పూత రాలిపోతోంది. ఇప్పటికే ఎరువులు, పురుగు మందులకు పెట్టుబడి ఎక్కువగా పెట్టాం. వర్షాలకు పత్తి దెబ్బతింది. దిగుబడులు బాగా తగ్గుతాయని భయంగా ఉంది. – యడమకంటి నర్సింహారెడ్డి, నాగినేనిప్రోలు -
గుండాల ఎన్కౌంటర్ : విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : గుండాల ఎన్కౌంటర్లో మృతి చెందిన న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి చెందిన నాయకుడు లింగన్న రీపోస్టుమార్టం పూర్తయిందని, అయితే నివేదిక వెల్లడించడానికి కొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. దీనిపై స్పందించిన ధర్మాసనం పోస్టుమార్టం నివేదికను ఈ నెల 7న సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాగా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో లింగన్న మృతిచెందడం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో లింగన్నను హతమార్చారంటూ ఆదివాసీ గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణ చేపట్టింది. -
అభయారణ్యంలో ఎన్కౌంటర్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో కీలక నక్సల్ నేత ఎన్కౌంటర్తో ఏజెన్సీ ఉలిక్కిపడింది. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ (రాయల వర్గం) ఖమ్మం, వరంగల్ రీజినల్ కార్యదర్శి, ఆపార్టీ అజ్ఞాత దళాల కమాండర్ పూనెం లింగన్న అలియాస్ శ్రీధర్ హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున గుండాల మండలంలోని రోళ్లగడ్డ–దేవళ్లగూ డెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పందిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో లింగన్న మృతి చెందగా, మరో ఆరుగురు తప్పించుకున్నారు. లింగన్నతోపాటు ఏరియా కమాండర్ గోపి, మరో ఐదుగురు దళ సభ్యులు 3 రోజులుగా అక్కడ మకాం వేశారు. పోలీసు బలగాలు కొన్ని రోజులుగా అదేప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. లింగన్న దళం అక్కడ ఉన్న ట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున ఆ ప్రాం తానికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు, లింగన్న దళానికి మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. లింగన్న మృతిచెందాడు. ఏరియా కమాండర్ గోపి, మరో ముగ్గురు దళసభ్యులు పారిపోయారు. మరో ఇద్దరు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై రాళ్లదాడి ఉదయం 7 గంటల సమయంలో లింగన్న ఎన్కౌంటర్ జరగ్గా..మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో సమాచారం బయటకు రాకపోగా.. సంఘటన స్థలానికి ప్రజలను, మీడియాను పోలీసులు వెళ్లనివ్వలేదు. లింగన్న సొంతూరు రోళ్లగడ్డ కావడంతో ఆ ప్రాం తంలో తీవ్ర అలజడి నెలకొంది. గుండాల మండలంలోని రోళ్లగడ్డ, లింగగూడెం, దేవళ్లగూడెం, పోలిరెడ్డిగూడెం తదితర గ్రామాలకు చెందినవారు అటవీ ప్రాంతం వద్దకు చేరుకున్నారు. సంఘటనాస్థలంలో వంట సామగ్రి తప్ప ఏమీ కనిపించలేదు. తమ అదుపులో ఉన్న మరో ఇద్దరు దళసభ్యులతో లింగన్న మృతదేహాన్ని మోయిస్తూ.. మరో మార్గం గుండా పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు ఆగ్రహంతో రాళ్ల దాడి చేయగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు తప్పించుకునేక్రమంలో లింగన్న మృతదేహాన్ని, అదుపులోకి తీసుకున్న ఇద్దరు దళ సభ్యులను వదిలి వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు దళసభ్యులు గ్రామస్తుల్లో కలిసిపోయి తప్పించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన పోలీసులు ఆరు, ఏడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గ్రామస్తులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు మీడియా ప్రతినిధులపై సైతం పోలీసులు చేయిచేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గుండాలకు రాకుండా వేరే మార్గంలో లింగన్న మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు పందిగుట్ట పక్కన గుట్టపై న్యూడెమోక్రసీ లింగన్న దళాలకు సంబంధించి మరో రెండు మృతదేహాలు ఉన్న ట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక పోలీసులు న్యూడెమోక్రసీ నాయకులకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 20 నెలల తర్వాత ఇల్లెందు ఏజెన్సీలో.. ఇల్లెందు డివిజన్ పరిధిలోని ఏజెన్సీలో 20 నెలల తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. 2017, డిసెంబర్ 14న టేకులపల్లి మండలంలోని చింతోనిచెలక–మేళ్లమడుగు అటవీప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 9 మంది సీపీబాట (చండ్ర పుల్లారెడ్డి బాట) దళసభ్యులు మృతిచెం దారు. కాగా, ఉద్యమంలో 20ఏళ్లకు పైగా ప్రస్థా నం కలిగిన, అజ్ఞాతదళాలకు కమాండర్గా ఉన్న లింగన్న మృతితో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలో ఆందో ళన నెలకొంది. ఆపార్టీ కీలకనేత ఆవునూరి మధు బుధవారం వరంగల్ జైలు నుంచి విడుదల కాగా.. కొన్ని గంటల ముందే లింగన్న ఎన్కౌంటర్ కావడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలం జైలులో ఉండి వచ్చారు. తిరిగి గత ఏప్రిల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే అజ్ఞాతంలోకి వెళ్లారు. లింగన్నను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఏకపక్షంగా చంపేశారని ఎన్డీ నేత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, రీజియన్ కార్యదర్శి ఆవునూరి మధు ఆరోపించారు. ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టారు. ఎన్కౌంటర్లతో ఉద్యమాలను ఆపలేరు లింగన్న ఎన్కౌంటర్ను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా గిరిజన హక్కుల కోసం పోరాడుతూ వారికి అండగా నిలబడుతున్న కమాండర్ లింగన్నను ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరిపి హత్య చేశారని ఆరోపించారు. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారించాలి సాక్షి, హైదరాబాద్: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు లింగన్నను పోలీసులు కాల్చి చంపడంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వివిధ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇది ఎన్కౌంటర్ కాదని, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సీపీఎం నేత తమ్మినేని వీర భద్రం అన్నారు. బూటకపు ఎన్కౌంటర్ తర్వాత ఆరు పోలీస్స్టేషన్లలో ప్రజలను నిర్బంధించారని న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తెలిపారు. పోడు భూముల కోసం ఉద్యమించిన నేతను చంపడ మంటే ప్రజలపై యుద్ధం చేయడమే అని అన్నారు. -
బాలికలదే హవా..
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలలో బాలికల హవా కొనసాగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,398 మంది విద్యార్థులు హాజరు కాగా.. 6127 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం గా 65.19 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో బాలురు 2995 మంది పరీక్షలు రాయగా 1740 మంది, బాలికలు 4370 మంది పరీక్షలకు హాజరు కాగా 2849 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 873 మంది బాలురకు గాను 575 మంది, బాలికలు 1160 మందికి 963 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక మొదటి సంవత్సరంలో మొత్తం 9489 మంది విద్యార్థులు హాజరు కాగా 5859 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 61.74 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్లో జనరల్ విభా గంలో బాలురు 2959 మందికి 1643 మంది ఉత్తీ ర్ణులయ్యారు. బాలికలలో 4462 మందికి 2923 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో 919 బాలురకు 490 మంది, బాలికలలో 1149 మం దికి 803 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో గత సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 70.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసంవత్సరం 65.19 శాతానికి తగ్గడం గమనార్హం. జిల్లాలో మొత్తం 73 కళాశాలలు ఉండగా, వీటిలో 14 ప్రభుత్వ, 9 గిరిజన సంక్షేమ, 5 సాంఘిక సంక్షేమ, 3 కస్తూర్బా, ఒక టీఎస్ఆర్జేసీ, 41 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. అయితే కళాశాలల వారీగా ఫలితాలు ఇంకా తెలియలేదని ఇంటర్ నోడల్ అధికారి ఎస్డి జహీర్అహ్మద్ తెలిపారు. -
భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం
-
గెలిస్తే..రాజభోగమే..
సాక్షి, అశ్వాపురం: పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు పొందిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎలాగైనా గెలిచి పార్లమెంట్ మెట్లు ఎక్కేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం పలు రకాల వసతులు కల్పిస్తుంది. పదవిలో ఉన్న కాలంలో ఒక ఎంపీకి సెంట్రల్ సర్కారు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది.. వార్షిక నిధులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వేతనం.. ఎంపీలకు నెలకు రూ.1 లక్ష వేతనం ఇస్తారు. పదవీ కాలం అయిపోయాక నెలకు రూ.25వేలు పింఛన్ వస్తుంది. వేతనంతో పాటు అలవెన్స్ల కింద నెలకు రూ.45వేలు అదనంగా ఇస్తారు. వసతి.. ఎంపీలకు ఢిల్లీలో నివాస వసతి కల్పిస్తారు. మొదటిసారి గెలిచిన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాలు కేటాయిస్తారు. సీనియర్ ఎంపీలకు వ్యక్తిగత బంగ్లాను కేటాయిస్తారు. వైద్యం.. కేంద్ర పౌరసేవల కింద ప్రభుత్వం ఆరోగ్య పథకం ద్వారా వైద్య, ఆరోగ్య సేవలు కల్పిస్తుంది. ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ, పాథలాజికల్ లాబోరేటరీ సౌకర్యం, హృద్రోగ, దంత, కంటి, ఈఎన్టీ, చర్మ, తదితర ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు. ప్రయాణం.. ఎంపీలు ఏడాదికి 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం చేయవచ్చు. ఎంపీతో పాటు జీవిత భాగస్వామికి లేదా మరొకరికి కూడా అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం ఉచితం. ఫస్ట్క్లాస్ ఏసీ కోచ్లో ప్రయాణించవచ్చు. జీవిత భాగస్వామికి కూడా అవకాశం ఉంటుంది. రహదారి మీదుగా ప్రయాణిస్తే కిలోమీటరుకు రూ.16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. బస్సులో ఎంపీలకు ప్రత్యేక సీటు ఉంటుంది. నిధులు.. పార్లమెంట్ సభ్యులకు ఎంపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.5 కోట్లు నిధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులు జిల్లా కలెక్టర్కు వస్తాయి. ఎంపీ తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గుర్తించిన పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి పనులకు ఈ నిధులు కేటాయిస్తారు. జిల్లా అధికారులు ఎంపీ సిఫార్సు మేరకు ఆ నిధులు మంజూరు చేస్తారు. పార్లమెంట్ కార్యాలయ అలవెన్స్లు.. పార్లమెంట్ కార్యాలయ అలవెన్స్ల కింద ఎంపీలకు నెలకు రూ45వేలను కేంద్రం ఇస్తుంది. వీటిలో రూ.15వేలు స్టేషనరీ, రూ.30 వేలు సహాయ సిబ్బంది, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ.2వేలు అదనంగా ఇస్తారు. -
కొత్త రైలొచ్చె.. కష్టాలు కొనితెచ్చె!
సాక్షి, కొత్తగూడెంఅర్బన్: ఈ ‘కొత్త’ రైలులో అనేక ‘వింతలు’, ‘విశేషాలు’ ఉన్నాయి. వాటిని తర్వాత చెప్పుకుందాం. కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లి, పాత ముచ్చట్లు కొన్ని చదువుదాం. సింగరేణి విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ, ‘సింగరేణి’ కుటుంబాల రాకపోకలకు అనువుగా దాదాపు 80 సంవత్సరాల క్రితం సింగరేణి ప్యాసింజర్ సర్వీస్ మొదలైంది. కారేపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్నగర్ ప్రాంతాలను కలుపుతూ ఈ రైలు అప్పటి నుంచి రాకపోకలు సాగిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రైలులో ఎక్కువగా ప్రయాణిస్తున్నది ‘సింగరేణి’ కుటుంబాలే. సరే, ఇప్పుడు ఈ ‘కొత్త’ రైలు గురించి మాట్లాడుకుందాం. ఆహా...! ‘సొగసు’ చూడతరమా...!! మొన్నీమధ్య ఓ సింగరేణి కుటుంబం.. కారేపల్లి నుంచి కాగజ్నగర్ వరకు ఇందులో ప్రయాణించింది. ఆ కుటుంబంలో ఇద్దరు ఆడవాళ్లు, ఓ బుడ్డది, మరో బుడ్డోడు ఉన్నారు. ఆ రోజెందుకోగానీ, రైలు కిక్కిరిసి ఉంది. కాలు పెట్టేందుక్కూడా చోటు లేదు. రైలు కదిలిన కొద్దిసేపటికే... ‘‘అమ్మా... చిచ్చొస్తంది (మూత్రం)’’ అన్నాడు బుడ్డోడు. టాయ్లెట్ వద్దకు తీసుకెళ్లేందుకని వాడిని ఆ తల్లి ఎత్తుకుని డోర్ వద్దకు వెళ్లింది. ఆమెకు నవ్వాలో, ఏడ్వాలో అర్థమవలేదు. అక్కడ టాయ్లెట్ లేదు...! బిత్తర చూపులు చూస్తోంది. అక్కడే నిలుచున్న ఓ సింగరేణి కార్మికుడు గమనించి– ‘‘మొత్తం 12 బోగీలున్న ఈ రైలులో రెండంటే రెండే టాయ్లెట్లు ఉన్నయ్. ముందొకటి.. వెనకొకటి. అంతే. ఇలా మనకు ‘అర్జంట్’ అయితే... పడుతూ లేస్తూ ఈ చివరికిగానీ, ఆ చివరికిగానీ పరుగెత్తాల్సిందేనమ్మా...!!!’’ అని చెప్పాడు. తలుపు వద్ద నిలుచున్న ప్రయాణికులు పక్కకు తప్పుకోవడంతో, ఆ బుడ్డోడు మెట్ల మీదనే ‘వన్’ వదిలేశాడు. ‘‘బుడ్డోడు కాబట్టి ఇలా ‘వన్’ వదిలేశాడు. అదే ‘టూ’ అయితే..? పెద్దవాళ్లు, అందులోనూ ఆడవాళ్లు అర్జంట్గా టాయ్లెట్కు వెళ్లాలంటే ఎలా...? ఈ రూట్లో ఈ రైలును పెట్టినోడిని కారేపల్లి నుంచి కాగజ్నగర్ వరకు, కాగజ్నగర్ నుంచి కారేపల్లి వరకు ఒక్కసారి బలవంతంగానైనా తిప్పాలి. అప్పుడు తెలుస్తుంది... టాయ్లెట్ కష్టాలేమిటో...’’ అంటూ, కొందరు ప్రయాణికులు చర్చ మొదలుపెట్టారు. ఆ ఇద్దరు బుడ్డోళ్ల తల్లికి, ఆమె వెంటనున్న మరొకామెకు భయం పట్టుకుంది. ‘‘ఇది (ఫుష్ పుల్) తెల్లవారుజామున 5.30 గంటలకు భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరింది. చివరి స్టేషన్ సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లేసరికి సాయంత్రం 5.00 గంటలవుతుంది. మన ఆడోళ్లం, పిల్లలం... ఎంత ఇబ్బంది పడతామన్న సోయి కూడా రైల్వే అధికారులకు ఉండొద్దా...? నేనీ జన్మలో ఈ రైలెక్కను’’ అంది, ఆ బుడ్డోడి తల్లి. ‘‘కాగజ్నగర్ వెళ్లేంత వరకు ఈ ఇద్దరు బుడ్డోళ్లకు, మా ఇద్దరికీ ‘వన్’, ‘టూ’ రాకుండా చూడు స్వామీ’’ అని, ఆమె తన మనసులోనే తన ఇష్ట దైవాన్ని వేడుకుంది. అప్పుడే, ఒకాయన పడుతూ–లేస్తూ వస్తున్నాడు. ‘‘ఛీఛీ... ఇదేం రైలురా బాబూ...! 12 బోగీలకు రెండే టాయ్లెట్సట. అందులో ఒకదానిలో నీళ్లు లేవు. ఇంకొకదానిలోకి వెళితే... భయంకరమైన కంపు. ఛీఛీఛీ... ఇంకోసారి ఈ రైలెక్కకూడదు’’ అంటూ, చిరాగ్గా మొహం పెట్టాడు. ఆ రైలుపై, అందులోని వసతులపై మళ్లీ చర్చ మొదలైంది. ‘‘ఈ రైలులో లగేజ్ బెర్తులు కూడా లేవు. సీట్లు కూడా తక్కువే ఉన్నాయి. అంతకు ముందున్న ప్యాసింజరే బాగుండేది. ఇది మరీ అధ్వానంగా ఉంది. ఆ ప్యాసింజర్లో లగేజ్ బెర్తులుండేవి. సెల్ చార్జింగ్ సాకెట్స్ ఉండేవి. ఇందులో అవేవీ లేవు. ఇందులో ప్రయాణించడమంటే... నరకాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఇంకొన్ని రోజులు గడిస్తే... ప్రయాణికుల సంఖ్య కచ్చితంగా తగ్గుతుంది. రైల్వేకు ఆదాయం పడిపోతుంది’’– ఆ బోగీలోని ప్రయాణికుల మధ్య ఇలా చర్చ సాగింది. తగ్గుతున్న ప్రయాణికులు... పడిపోతున్న ఆదాయం ఈ రైలు ప్రారంభమై ఐదు రోజులవుతోంది. ఈ రైల్వే మార్గంలో తరచూ ప్రయాణించే వారికి ఈ ‘పుష్–పుల్’ కష్టాలు అనుభవంలోకి వచ్చినట్టున్నాయి. అవి అలా... అలా... అందరికీ చేరాయేమో...! ఈ ఐదు రోజుల్లోనే ఫుష్–ఫుల్ రైలు ఆదాయం పడిపోయింది. ఈ మార్గంలో రోజుకు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలి వరకు (ప్యాసింజర్ ఉన్నప్పుడు) రోజు ఆదాయం 20,000 నుంచి 40,000 వరకు ఉండేది. పుష్–పుల్ వచ్చిన ఈ ఐదు రోజుల్లోనే ఆదాయం ఒక్కసారిగా గణనీయంగా 20,000 నుంచి 25,000 వరకు పడిపోయింది. ఈ రైలు కష్టాలు ఇలాగే కొనసాగితే... బోగీలన్నీ వెలవెలబోతాయేమో...! ప్రయాణికుల్లో అత్యధికమంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే, రైల్వే ఉన్నతాధికారులు సత్వరమే స్పందించకపోతే... నిజంగానే ఈ పుష్–పుల్ వెలవెలబోయినా పోతుంది. ‘కొత్తొక రోత... పాతొక వింత...!’ ఈ ‘కొత్త’ రైలు రోత రోత. ఆ పాత రైలు బాగు బాగు– ఈ రైలు ప్రయాణికులు ముక్త కంఠంతో ఏకోన్ముఖంగా వినిపిస్తున్న అభిప్రాయమిది. ఈ ఫుష్–పుల్ రైలును రద్దు చేయాలని, ఆ పాత సింగరేణి ప్యాసింజర్ రైలునే నడిపించాలని రైల్వే ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. వారు స్పందించకపోతే, ఆందోళనకు దిగుతామని సోషల్ మీడియా వేదికగా అనేకమంది ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు. ‘‘ఈ సమస్యపై ఏ ఒక్క పార్టీగానీ, ప్రజాప్రతినిధిగానీ స్పందించడం లేదు. వాళ్లు జనంలో ఉంటేగా... జనం సమస్యలు తెలియడానికి...! ఏ నాయకుడూ వద్దు, ఏ పార్టీ వద్దు. మనంతట మనమే ఆందోళనకు దిగుదాం..!! మన సమస్యపై మనమే పోరాడదాం...!!!’’ అని, సోషల్ మీడియా వేదికగా ఈ రైలు ప్రయాణికులు చర్చలు, సన్నాహాలు సాగిస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించకపోతే... ఈ ‘పుష్–పుల్ బాధిత’ ప్రయాణికులు రేపోమాపో ప్రత్యక్ష కార్యాచరణకు దిగినా దిగుతారేమో...! -
దమ్మపేట పోలీసులు.. ప్రకృతి ప్రేమికులు..!
సాక్షి, దమ్మపేట: మనుషుల రక్షణే కాకుండా ప్రకృతి రక్షణకు ఇక్కడి పోలీసులు నడుం బిగించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుతున్నారు. నిత్యం చెట్ల రక్షణ కోసం సమయాన్ని కేటాయిస్తూ దమ్మపేట పోలీస్స్టేషన్ను పచ్చదనంతో నింపారు. దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి పక్కనే పోలీస్స్టేషన్ పచ్చదనంతో చూపరులను ఆకట్టుకుంటున్నది. హరితహారంలో భాగంగా అప్పటి ఎస్ఐ ఎం.నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విడతలవారీగా మొక్కలు నాటుతూ వాటి పరిరక్షణ చేపట్టారు. ఇక్కడి మొక్కలపై ఎస్ఐ జలకం ప్రవీణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మొక్కలను పోలీసులు దత్తత తీసుకున్నారు. ఇక్కడ గానుగ, దానిమ్మ, వేప, కొబ్బరి మొక్కలను నాటారు. క్రోటన్తో పాటు ప్రత్యేక పూల మొక్కలను నర్సరీల నుంచి కొనుగోలు చేసి స్టేషన్ ముందు అందమైన గార్డెన్ రూపొందించారు. ఎదిగిన ప్రతి చెట్టుకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేశారు. పచ్చదనంతో ప్రశాంత వాతావరణం పచ్చదనంతో ప్రశాంత వాతావరణం ఉంటుందని అంటున్నారు ఎస్సై జలకం ప్రవీణ్. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘చెట్ల నీడన చేరితే మన అలసట తీరుతుంది. పచ్చని చెట్లు ఆహ్లాదాన్నిస్తాయి. ఆలోచనలపై సానుకూల ప్రభావం చూపుతాయి. బాధ, కోపం, ఆవేశంతో ఎన్నో గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఆహ్లాద వాతావరణంలో మంచి ఆలోచనలు, మనుషుల్లో మార్పు రావడానికి ఇక్కడి పచ్చదనం కొంత దోహదపడుతోంది’’ అన్నారు. -
స్వామివారి పెళ్లి పనులు షురూ..
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం హోలీ సందర్భంగా నిర్వహించే డోలోత్సవం, వసంతోత్సవానికి బుధవారం అంకురార్పణ చేశారు. ముందుగా పవిత్ర గోదావరి నది నుంచి మేళతాళాల నడుమ రామాలయానికి తీర్థపు బిందెను తీసుకొచ్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14న రామయ్యకు కల్యాణం జరిపిస్తారు. కాగా, హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామికి నేడు సహస్ర ధారతో ప్రత్యేక స్నపన కార్యక్రమం ఉంటుంది. అనంతరం అందంగా అలంకరించిన స్వామి వారిని ఊయలలో ఆశీనులను చేసి డోలోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలను ఆలపిస్తుండగా నక్షత్ర, కుం¿భ హారతులను స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించనున్నారు. ముందుగా అంతరాలయంలోని మూలవరులకు, ప్రాంగణంలో ఉన్న లక్ష్మీతాయారమ్మ వారికి, అభయాంజనేయ స్వా మివారికి వసంతాన్ని చల్లి భక్తులపై పసుపునీళ్లను చల్లుతారు.సాయంత్రం మేళతాళాల నడుమ తాత గుడి సెంటర్ వరకు తిరవీధి సేవ నిర్వహిస్తారు. తలంబ్రాల తయారీ... శ్రీరామనవమి రోజున స్వామివారి కల్యాణోత్స వానికి వినియోగించేందుకు 150 క్వింటాళ్ల తలం బ్రాల తయారీకి గురువారం శ్రీకారం చుట్టనున్నా రు. ప్రతియేటా 100క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తుండగా అవి సరిపోవడం లేదు. దీంతో ఈఏడాది 150 క్వింటాళ్లు తయారు చేయా లని నిర్ణయించారు. 100 క్వింటాళ్ల బియ్యం చీరాలకు చెందిన భక్తులు సమర్పిస్తుండగా, మరి కొందరు దాతల ఇంకొన్ని బియ్యం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. మిగిలిన బియ్యాన్ని దేవస్థానం వారు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా గురువారం నిర్వహించనున్నారు. చిత్రకూట మండపంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, స్వామివారి కల్యాణంలో పాల్గొనే ఆచార్య బ్రహ్మ ఋత్విక్ల సతీమణులు పసుపు దంచుతారు. తలంబ్రాలను సైతం వారితోనే మొదట కలిపిస్తారు. అనంతరం పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్క, గులాల్, అత్తరు, పన్నీరు, నూనె, సుగంధ ద్రవ్యాలను కలిపి 508 మంది భక్తురాళ్లచే తలంబ్రాలను తయారు చేయిస్తారు. రేపు సామూహిక శ్రీలక్ష్మీ పూజలు.. ఆలయప్రాంగణంలోనిశ్రీలక్ష్మీతాయారమ్మవారి సన్నిధిలో శుక్ర వారం ఫాల్గుణోత్తర బహుళ విదియను పురస్కరించుకొని శ్రీ స్వర్ణ లక్ష్మీ అమ్మ వారికి సామూహిక పూజలు నిర్వహించనున్నా రు. రూ.500 రుసుం చెల్లించిన భక్తులకు దేవస్థానం వారు లక్ష్మీ అమ్మవారివెండిప్రతిమ, ప్రసా దం, అమ్మ వారి పూజా కుంకుమను అందజేస్తారు. -
‘ఉపాధి’ పనుల్లో అవకతవకలు
సాక్షి, పాల్వంచరూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నిర్వహించిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడ్డాయి. అవకతవకలపై ఈజీఎస్ ప్రిసైడింగ్ అధికారి కరుణాకర్రెడ్డి విచారణకు ఆదేశించారు. అవకతకలు జరిగిన పంచాయతీల్లో లక్షా నాలుగువేల రూపా యలు రికవరీ చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఓపెన్ఫోరం జరిగింది. ఈజీఎస్ కింద 2017 డిసెంబర్ 1నుంచి 2018 జనవరి 31 వరకు మండలంలోని 11 పంచాయతీలలో జరిగిన రూ.6 కోట్ల 5 లక్షల19వేల 516 విలువగల పనులు నిర్వహించారు. ఈ పనుల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో అవకతవకలు వెలుగుచూశాయి. పనులకు రాకున్నా కూలీలకు మస్టర్లు వేసినట్లు, తీర్మానాలు లేకున్నా అనుమతులు ఇవ్వకున్నా అధికంగా భూమి చదును పనులు నిర్వహించారు. మృతి చెంది మూడు సంవత్సరాలైన కూలీకి వేతనం చెల్లించినట్లు, తక్కువ పనులు చేసి ఎక్కువ పని చేసినట్లుగా ఎంబీలో రికార్డులు నమోదు చేసి నట్లు, రైతులకు ఇచ్చిన మొక్కలు సగం కూడా బతకకపోవడం, చేసిన పనుల వద్ద ఉపాధి నేమ్ బోర్డులను ఏర్పాటు చేయక పోవడం వంటి పలు అక్రమాలు బయటపడ్డాయి. యానంబైల్ పంచా యతీలో పట్టా పాస్పుస్తకాలు, ఇతర ఆధారులు లేకుండానే భూమి లెవల్ పనులు నిర్వహించారని, ఎక్కడ ఎంత పని చేశారో కూడా రికార్డులో రాయకపోవడం, ప్లే స్లిప్లు పంపిణీ చేయలేదు. వంద రోజులు దాటిన తర్వాత కూడా కొంతమంది కూలీలకు పనులు కల్పించి వేతనాలు చెల్లించారు. ఎడ్ల ఉమ అనే కూలి 18 రోజులు కూలీ పనులు చేసిన వేతనం చెల్లించలేదు. మరి కొంతమంది జాబ్కార్డులు అడిగినా ఇవ్వలేదు. ఏపీఓ, ఎంపీడీఓ సంతకాలు లేకుండానే మస్టర్ల పేమెంట్ చేశారని, పనిచేయని కూలీకి రూ.421 వేతనం చెల్లించారని, గొగ్గిల శంకర్ అనే కూలీ మూడు సంవత్సరాల క్రితం మృతి చెందినా 6 రోజుల వేతనం చెల్లించినట్లు వెలుగు చూశాయి. దీనిపై విచారణ జరపాలని ప్రిసైడింగ్ అధికారి ఆదేశించారు. 37 మంది కూలీలకు రూ.7,450 అడ్వాన్స్ పేమెంట్ చేసిన విషయం బయటపడింది. సోములగూడెం పంచాయతీలో రూ.1 కోటి 73 లక్షల మంజూరు కాగా ఇందులో కేవలం రూ.77 లక్షల75 వేల పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకుడు గుంత నిర్మాణం చేయని పద్మ అనే మహిళకు పేమెంట్ చేశారు. ఒకేరోజు ఒక కూలీకి రెండు మస్టర్లు వేశారు. రెండు రోజులు పనిచేసిన ఒక కూలీకి ఒక రోజు వేతనం చెల్లించారు. లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో, సోములగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో కూలీలతో చేయాల్సిన గంతులు తీసే పనులను యంత్రాల సహాయంతో నిర్వహించినట్లు బయటపడింది. దీనిపై విచారణ జరపాలని ప్రిసైడింగ్ అధికారి ఆదేశాలు జారీచేశారు. నీటికుంట నిర్మాణంలో 5.25 క్యూబిక్ మీటర్లు నిర్మాణం జరుగగా ఎంబీ రికార్డులో మాత్రం 6.04 క్యూబిక్ మీటర్లు నమోదు చేసినట్లు బయటపడటంతో విచారణకు ఆదేశించారు. పాండు రంగాపురంలో కూడా మస్టర్లలో అవకతవకలు జరిగినట్లు వెలుగుచూశాయి. ఇలా మిగిలిన పం చాయతీలో కూడా పలు అవకతవకులు జరి గాయి. కార్యక్రమంలో ఈజీఎస్ ఏడీలు రాం మోహన్, మధుసూదన్రాజు, డీవీఓ. సీహెచ్.వెంకటేశ్వర్లు, ఎన్.భాస్కర్రావు, అనిల్కుమార్, ఎంపీడీఓలు అల్బర్ట్, ధన్సింగ్, సీఆర్పీ సీహెచ్. గంగరాజు, ఏపీఓ.రంగా పాల్గొన్నారు. -
నిబద్ధత.. నా నడత
సీపీఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో కమ్యూనిస్టుగా మారిన డాక్టర్ మిడియం బాబూరావు ఇప్పటికీ అదే నిబద్ధతతో ప్రజా పోరాట పంథాలో పయనం సాగిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు దేశంలోనే అతిపెద్ద విస్తీర్ణం కలిగిన లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటైన భద్రాచలం స్థానం నుంచి 2004–2009 మధ్య ఎంపీగా సేవలందించిన మిడియం.. తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు.- తూమాటి భద్రారెడ్డి సాక్షి– కొత్తగూడెం: భద్రాచలం శాసనసభ నియోజకవర్గం పరిధిలోని వాజేడు నుంచి విశాఖపట్టణం జిల్లా అరకు వరకు విస్తరించి ఉన్న అప్పటి భద్రాచలం లోక్సభ నియోజకవర్గం 450 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉండేది. ఈ నియోజకవర్గం పరిధిలో అప్పటి ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు, భద్రాచలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, గోపాలపురం, తూర్పుగోదావరి జిల్లాలోని ఎల్లవరం (రంపచోడవరం), విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి, పాడేరు శాసనసభ సెగ్మెంట్లు ఉండేవి. ఈ ఏడు సెగ్మెంట్ల పరిధిలో తిరిగేందుకు మిడియం బాబూరావు ఒకే ఒక్క అద్దె వాహనాన్ని ఉపయోగించారు. మొత్తం ఎన్నికల ఖర్చు రూ.10 లక్షలు కూడా కాలేదని మిడియం ‘సాక్షి’కి తెలిపారు. 2004 ఎన్నికల్లో సీపీఎం తరపున సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మిడియం పోటీచేసి టీడీపీ అభ్యర్థి కొమరం ఫణీశ్వరమ్మపై 53 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రూ.2కే వైద్యం.. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రామానికి చెందిన మిడియం బాబూరావు 1951లో జన్మించారు. 1980లో కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. అప్పట్లో భద్రాచలం ప్రాంతం నాన్ ముల్కీ పరిధిలో ఉండడంతో కర్నూలుకు వెళ్లవలసి వచ్చింది. అక్కడ మెడిసిన్ చదువుతున్న సమయంలో సీపీఎం అనుబంధ ఎస్ఎఫ్ఐ ఉద్యమాల్లో పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో అందులో చేరారు. ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా కార్యదర్శిగానూ పనిచేశారు. సుందరయ్య కోరిక మేరకు అప్పటి సీపీఎం రాష్ట్ర నాయకుడు బాలాజీదాస్ కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం రాజమండ్రిలో ప్రజా వైద్యశాల స్థాపించి కేవలం రెండు రూపాయలకే వైద్యసేవలు అందించడం ప్రారంభించారు. అంతకన్నా ముందు పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు రామచంద్రారెడ్డి నెల్లూరులో నడిపే పీపుల్స్ పాలీ క్లినిక్లో మిడియం పని చేశారు. ఈ క్లినిక్ ఇప్పటికీ నెల్లూరులో నడుస్తుండడం గమనార్హం. ఈ ఆసుపత్రి స్ఫూర్తితోనే బాబూరావు రాజమండ్రిలో 1982లో ప్రజావైద్యశాల నెలకొల్పారు. 2006 వరకు దీనిని నడిపారు. వైద్యసేవలు అందజేస్తూనే సీపీఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. విధానాల ప్రాతిపదికన ప్రచారం.. అప్పట్లో ఎన్నికల్లో విధానాల ప్రాతిపదికన ప్రచారం సాగేదని, ప్రస్తుతం విచ్చలవిడి డబ్బు ప్రవాహం ప్రాతిపదికన ప్రచారం సాగుతోందని బాబూరావు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న మిడియం వైద్యసేవలు నిలిపేసి పూర్తి ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా అప్పుడూ, ఇప్పుడూ ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా పని చేయడం ఆనందంగా ఉందని మిడియం చెబుతున్నారు. ఇప్పుడన్నీ ‘కార్పొరేటీకరణ’రాజకీయాలు దేశంలో ఆర్థిక రంగంలో 1991లో ప్రారంభమైన నయా ఉదారవాద విధానాలు ప్రస్తుతం రాజకీయ రంగంలోకీ వచ్చాయని మిడియం చెబుతున్నారు. రాజకీయం పూర్తి కార్పొరేటీకరణ అయిందంటున్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అవలంబిస్తున్న పాలకవర్గాలు అర్హత లేకున్నా తమకు సన్నిహితంగా ఉండేవారికే అవకాశాలిస్తూ, మిగిలిన వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. పార్లమెంటులో ప్రైవేటుగాపలు బిల్లులు పార్లమెంటులో ప్రతి సభ్యునికి ప్రైవేటుగా బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్వోఎఫ్ఆర్ (రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్), పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో ప్రవేశపెట్టానన్నారు. తరువాత వీటిని ప్రభుత్వం చట్టం చేసింది. వన సంరక్షణ సమితి ద్వారా కేంద్రం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ పేరుతో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో ప్రపంచ బ్యాంకు పథకం ద్వారా ప్లాంటేషన్ చేపట్టింది. దీంతో గిరిజనులకు అన్యాయం జరిగింది. దీంతో ఆర్వోఎఫ్ఆర్ బిల్లు పెట్టడం జరిగిందన్నారు. ప్రయోజకులైన వారు కన్నవారిని సాకేలా పెట్టిన బిల్లు సైతం చట్టం అయిందన్నారు. చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో కాఫీ తోటలు వేసే రైతులకు గిట్టుబాటు ధర, రాయితీలు ఇచ్చేలా చేయడం సంతప్తిని ఇచ్చిందన్నారు. భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన నిర్మాణం తన హయాంలోనే జరిగిందన్నారు. -
కాంగ్‘రేసు’లో పోటాపోటీ
సాక్షి, కొత్తగూడెం : మహబూబాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ రానంతగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రధానంగా నలుగురు మాత్రమే టికెట్ కోసం పోరాడుతున్నారు. ఈ స్థానం నుంచి బరిలో దిగడానికి పీసీసీకి 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ మరికొందరు నేరుగా ఢిల్లీ వెళ్లి దరఖాస్తు చేసుకుంటుండడం గమనార్హం. ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి అప్లికేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 380 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, రాష్ట్ర నాయకుడు తేజావత్ బెల్లయ్యనాయక్, టీపీసీసీ సభ్యుడు చీమల వెంకటేశ్వర్లు రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, స్థానికేతరులకు, గతంలో ఓడిపోయిన వారికి టికెట్లు ఇవ్వవద్దని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే జరిగితే మానుకోటకు స్థానికేతరుడైన రాములునాయక్, గత లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన బలరాంనాయక్కు టికెట్లు రావడం అనుమానమేననే చర్చ సాగుతోంది. 42 మంది బంజారా నాయకులే.. మానుకోట ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఇచ్చిన గడువులోగా 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 42 మంది బంజారా సామాజిక వర్గానికి చెందినవారు కాగా, కోయ సామాజిక వర్గం నుంచి చీమల వెంకటేశ్వర్లు, మోకాళ్ల శ్రీనివాసరావు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. చీమల పీసీసీకి దరఖాస్తు చేయడానికి ముందే ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్కు దరఖాస్తు అందజేశారు. ఢిల్లీలోనే మకాం వేసిన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇల్లెందు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే చీమలకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) మద్దతు ప్రకటిస్తున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ సైతం చీమలకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా చీమలకు గతంలోనే మద్దతు ప్రకటించారు. అత్యధిక ఎమ్మెల్యేలు గెలవడం వల్లే.. మహబూబాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో (పినపాక, ఇల్లెందు, భద్రాచలం, ములుగు) కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వీటిలో పినపాక, భద్రాచలం, ములుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మెజారిటీ బాగానే వచ్చింది. ములుగు నియోజకవర్గంలో 22,650 ఓట్లు, పినపాకలో 19,565, భద్రాచలంలో 11,785, ఇల్లెందు నియోజకవర్గంలో 2,907 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట సెగ్మెంట్లలో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ టికెట్కు డిమాండ్ మరింతగా పెరి గింది. మొత్తం ఏడు సెగ్మెంట్లలో నాలుగు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ గట్టిగా కష్టపడితే మహబూబాబాద్ లోక్సభ సీటును ‘హస్త’గతం చేసుకోవచ్చని అంచనాలు వేసుకుంటోంది. కాగా రాష్ట్రంలోని మరో ఎస్టీ రిజర్వుడు లోక్సభ స్థానం ఆదిలాబాద్తో మహబూబాబాద్ టికెట్ అంశం ముడిపడి ఉంది. ఈ రెండు స్థానాల్లో ఒకటి ఆదివాసీలకు కేటాయిస్తే, మరొకటి బంజారాలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ సీటు కోసం భారీగా దరఖాస్తులు రావడం గమనార్హం. గత శాసనసభ ఎన్నికల సమయంలో నామినేషన్ల దాఖలు గడువు ముగిసే చివరి రోజు వరకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడతలవారీగా ప్రకటిస్తూ వచ్చింది. దీంతో గెలవగలిగిన అనేక సీట్లను కోల్పోయామని ఆ పార్టీ భావిస్తోంది. ఈ అనుభవం దృష్ట్యా లోక్సభ ఎన్నికలకు సాధ్యమైనంత ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఈ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మిక కుటుంబాలు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, ఆదివాసీల పోడు భూముల అంశం గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడంతో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తాకింది. పైగా ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దీంతో తమకు ఇదే మద్దతు ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. -
హెల్మెట్ లేకుంటే బైక్ నడవదు !
బూర్గంపాడు : హెల్మెట్ లేకుంటే బైక్ నడవకుండా ఓ వినూత్న ప్రయోగం చేసి సఫలీకృతుడయ్యాడు భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు. హెల్మెట్ ఉంటేనే మోటార్సైకిల్ నడిచేలా ఓ టెక్నిక్ కనిపెట్టాడు. గ్రామానికి చెందిన కొట్టె ప్రవీణ్ కొత్తగూడెంలోని రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఈఈఈ పూర్తిచేశాడు. ఇటీవల జరుగుతున్న రోడ్డుప్రమాదాల నివారణకు, మోటార్సైకిళ్ల చోరీకి అడ్డుకట్ట వేయాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, గతంలో రిమోట్ టాయ్స్ తయారుచేసిన అనుభవంతో మోటార్సైకిల్ నడవాలంటే హెల్మెట్ ఉండేలా ఓ టెక్నిక్ను తయారుచేశాడు. మోటార్సైకిల్ ఇగ్నిషన్ను రిలే సర్క్యూట్తో అనుసంధానం చేశాడు. రిలే సరూŠయ్య్ట్ను ఆన్, అఫ్ చేసేందుకు ఓ ట్రాన్స్మీటర్ను హెల్మెట్లో అమర్చాడు. ట్రాన్స్మీటర్ సిగ్నల్ కమ్యూనికేషన్ ఉంటేనే మోటార్సైకిల్ ఇగ్నిషన్కు అనుసంధానం చేసిన రిలే సర్క్యూట్ పనిచేస్తుంది. హెల్మెట్ దగ్గరుంటేనే ట్రాన్స్మీటర్ నుంచి సిగ్నల్స్ అంది.. మోటార్సైకిల్ స్టార్ట్ అవుతుంది. లేకుంటే కాదు. హెల్మెట్ మరిచిపోయినా మోటార్సైకిల్ నడవదు. హెల్మెట్కు అమర్చిన ట్రాన్స్మీటర్ పనిచేసేందుకు వారానికి ఒకసారి చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుందని ప్రవీణ్ తెలిపాడు. గోవాలో జిందాల్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో సెల్ఫోన్ ఆధారంగా విద్యుత్ మోటార్లు ఆన్, ఆఫ్ చేసి సక్సెస్ అయ్యానని, ఇళ్లలోని గదులకు రక్షణ కల్పించేందుకు సెక్యూరిటీ సిస్టం డెవలప్ చేశానని ప్రవీణ్ తెలిపారు. హెల్మెట్ పెట్టుకోవాలని ఎంత ప్రచారం చేసినా వాహనదారులు పట్టించుకోవటం లేదని, తాను తయారుచేసిన హెల్మెట్ ట్రాన్స్మీటర్ సిస్టం పూర్తిస్థాయిలో డెవలప్ చేస్తే మోటార్సైకిల్ నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకుంటారని, దీంతో రోడ్డుప్రమాదాలలో మరణాల శాతం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. హెల్మెట్ లేకుంటే మోటార్సైకిల్ స్టార్ట్ కానందున బైక్ చోరీలు కూడా తగ్గిపోతాయన్నారు. భవిష్యత్లో మరిన్ని ప్రయోగాలు చేస్తానని ప్రవీణ్ ‘సాక్షి’కి తెలిపారు. -
చండ్రుగొండ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సాక్షి, చండ్రుగొండ: చండ్రుగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా పీహెచ్సీలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. తొలుత ఎంపీపీ బాలునాయక్, జెట్పీటీసీ సభ్యులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కేక్కట్ చేసి వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రికార్డుల నిర్వహణ, డెలివరీలు, వ్యాక్సిన్స్, పారిశుద్ధ్యం, గర్భిణుల పట్ల సిబ్బంది తీసుకున్న చొరవ ఇలా అనేక కోణాల్లో జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ పరిశీలించన సర్వేలో చండ్రుగొండ పీహెచ్సీకి జాతీయస్థాయిలో 86 మార్కులు రావడం విశేషం. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సీతారాంప్రసాద్, హోమియో డాక్టర్ ప్రవీణకుమార్, డాక్టర్ భవ్య, ఎస్ఐ కడారి ప్రసాద్, ఎంఈఓ ఝంకీలాల్, ఉపసర్పంచ్ బాబురావు, నాయకులు సారేపల్లి శేఖర్, పులి సత్యం, తుమ్మలపల్లి సురేష్, డి.మల్లేష్, పకీర్కుమార్, కిరణ్రెడ్డి, బాబ పాల్గొన్నారు. -
జూన్లోగా ‘సీతారామ’ మొదటి దశ పనులు
సాక్షి, కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ బృందం తెలిపింది. గురువారం ఐదుగురు ఇంజనీర్ల బృందం భద్రాద్రి జిల్లాలో పర్యటించింది. సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద జరుగుతున్న మొదటి దశ పంప్హౌజ్, పాల్వంచ మండ లం నాగారం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్, ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద జరుగుతున్న రెండోదశ పంప్హౌజ్, కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్హౌజ్ పనులను పరిశీలించింది. అనంతరం ఒడ్డురామవరం వద్ద విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంఎస్పీ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గోదావరి నుంచి ఈ పథకాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మిం చాలనుకున్న రాజీవ్సాగర్, ఇందిరాసాగర్లను కలిపి రీ ఇంజినీరింగ్ చేసి సీతారామ రూపొందించినట్లు తెలిపారు. చురుకుగా పనులు సీతారామ మొదటి దశ పంప్హౌస్ వరకు మెయిన్ కెనాల్ పనులు చురుకుగా జరుగుతున్నాయని ఎంఎస్పీ రెడ్డి తెలిపారు. ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద నిర్మిస్తున్న రెండోదశ పంప్హౌజ్ పను లు వచ్చే అక్టోబరులోగా పూర్తవుతాయని తెలిపారు. ములకలపల్లి మండలంలోని కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్హౌజ్ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.110 కిలోమీటర్ల కెనాల్లో 50 కిలోమీటర్ల కెనాల్ 3,800 ఎకరాల అటవీ ప్రాంతం లో ఉందన్నారు. ఇందుకు సంబంధించి అటవీ అనుమతులు తీసుకున్నారన్నారు. దీంతో ఆటంకా లు లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు.వచ్చేనెలలో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ బృందంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.చంద్రమౌళి, వ ర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్, ఉపాధ్యక్షులు డాక్టర్ రమణనాయక్, మహాత్మరెడ్డి ఉన్నారు. వీరి వెంట సీతా రామ సీఈ సుధాకర్, ఎస్ఈ నాగేశ్వరరావు ఉన్నారు. -
ఇద్దరు యువతులను బలిగొన్న ప్రేమ వ్యవహారం
సాక్షి, భద్రాద్రి : ప్రేమ విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు యువతుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చర్ల మండలంలోని లక్ష్మీ కాలనీకి చెందిన మడివి జానకి, విజయ కాలనీకి చెందిన శ్యామల సంగీత అనే ఇద్దరు యువతుల మధ్య ప్రేమ వ్యవహారంలో వివాదం నెలకొంది. దీంతో బుధవారం వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషమ పరిస్థితిలో ఉన్న వారిని చర్ల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన అనంతరం చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు. ఆత్మహత్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. -
ఇదేం దారి ద్య్రం!
పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో మంజూరైన ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్లైఫ్ శాఖ ద్వారా అనుమతులు రాక ఏడాది కాలంగా స్తంభించాయి. మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు, చండ్రాలగూడెం మీదుగా కొత్తగూడెం మండలం మైలారం నుంచి కొత్తగూడెం క్రాస్ రోడ్డు వరకు రహదారి నిర్మాణానికి రూ.62 కోట్లు గత ఏడాది మంజూరయ్యాయి. అయితే ఇందులో 51 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్లైఫ్ అనుమతి తప్పనిసరి. కాగా, అభయారణ్యంలో రోడ్డు విస్తరణకు ఆ శాఖ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్.. రాజాపురం నుంచి రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా గత మే నెలలో వైల్డ్లైఫ్ శాఖఅధికారులు నిలిపివేశారు. రోడ్డు పొడవునా కల్వర్టులు కూడా నిర్మించారు. అయితే అవి రోడ్డుకు ఎత్తుగా ఉండటంతో వర్షాకాలంలో రాకపోకలకు ప్రమాదకరంగా మారిందని వాహనచోదకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉల్వనూరు గ్రామ సమీపంలో, మల్లారం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపై కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. ప్రతిపాదనలు పంపినా పర్మిషన్ రాలే.. రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోవడంతో అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్అండ్బీ శాఖ ఈఈ ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి ప్రతిపాదనలు పంపించారు. స్వయంగా పలుమార్లు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో చర్చించారు. అయినా రోడ్డు విస్తరణకు అనుమతి ఇచ్చేందుకు వైల్డ్లైఫ్ అధికారులు నిరాకరించారు. దీంతో చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు వైల్డ్లైఫ్ పరిధిలో లేని 8 కిలోమీటర్ల మేర మాత్రమే రోడ్డు నిర్మించారు. అయితే పాత రోడ్డుపైనే కొత్తగా నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని వైల్డ్లైఫ్ అధికారులు అంటున్నారు. అంతకుమించి విస్తరిస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేగాక.. గతంలో నిర్మించిన రోడ్డుకు సైతం వైల్డ్లైఫ్ అనుమతులు లేవని చెపుతున్నారు. అయితే ఆ శాఖ పర్మిషన్ లేకుండా పాత రోడ్డు కూడా ఎలా నిర్మించారనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. వైల్డ్లైఫ్ అనుమతి ఇవ్వడం లేదు మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు వైల్డ్లైఫ్ శాఖ పరిధిలో నిర్మించాల్సిన తారు రోడ్డు పనులకు ఆ శాఖ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఏడాది కాలంగా పనులు నిలిచిన మాట వాస్తవమే. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి వైల్డ్లైఫ్ శాఖ అధికారులతో మాట్లాడినా, ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపినా అనుమతికి నిరాకరించారు. ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం. చివరికి పాత రోడ్డునే పునరుద్ధరించాలనే ఆలోచన కూడా ఉంది. మరోసారి వైల్డ్లైఫ్ ఉన్నతాధికారులతో చర్చిస్తాం. – రాజేశ్వరరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ -
కొత్తగూడెం ఎన్నికల్లో కార్మికులే కీలకం
సాక్షి, కొత్తగూడెం: ఏజెన్సీలో ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాలో ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల ఓట్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాలు ఉండగా, ఇందులో పినపాక, కొత్తగూడెం, ఇల్లెందులో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో మొత్తం 35, 647 ఉద్యోగ, కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో సింగరేణి, అశ్వాపురం మండలంలో భారజల కర్మాగారం, బూర్గంపాడు మండలంలో ఐటీసీ పేపర్ బోర్డ్ ఉన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ, కొత్తగూడెంలో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీలు తమ అనుబంధ కార్మిక సంఘాల సహకారంతో కార్మిక వాడల్లో విస్తృతంగా చారం చేస్తున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1.20 లక్షలకు పైగా కార్మిక కుటుంబాల ఓట్లు ఉండడంతో వాటిని రాబట్టేందుకు యూనియన్ల అగ్ర నాయకులను సైతం ప్రచార పర్వంలోకి దింపుతున్నారు. కార్మిక హక్కులు, సౌకర్యాలు, భద్రత, కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలు, సింగరేణిలో హైపవర్ వేతనాలు తదితర అంశాలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. మణుగూరు మండలంలో ఉన్న సింగరేణి కార్మిక వాడల్లో 2, 819 కార్మిక, అధికారుల కుటుంబాలు ఉంటున్నాయి. మరో 2 వేల మంది సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. అశ్వాపురం మండలంలోని హెవీవాటర్ ప్లాంట్లో 1,500 మంది ఉద్యోగులు, మరో 300 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్బోర్డు కర్మాగారంలో 1,600 మంది ఉద్యోగులు, 800 మంది అధికారులు, మరో 8 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. నియోజకవర్గంలో అన్నీ కలిపి 17,019 కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ కార్మికు కుటుంబాల ఓట్లు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. ఇక్కడ 1,023 సింగరేణి కార్మిక, అధికారుల కుటుంబాలు ఉంటున్నాయి. మరో వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల ఓట్లు స్వల్ప ప్రభావం చూపించనున్నాయి. త్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్, ఎన్ఎండీసీ, సింగరేణి కార్మిక కాలనీలు ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా సింగరేణిలో 3, 667 కార్మిక కుటుంబాలు ఉండగా, కొత్తగూడెం కార్పొరేట్లో 2,418 ఉద్యోగుల కుటుంబాలు ఉన్నా యి. మరో 3,500 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. పాల్వంచ మండలంలోని నవభారత్లో 1,550 మంది కార్మికులు, ఎన్ఎండీసీలో 270 మంది ఉన్నారు. ఇక కేటీపీఎస్లో అన్ని యూనిట్లలో కలిపి 5,700 మంది కార్మికులు ఉన్నారు. మొత్తం కలిపి కొత్తగూడెం నియోజకవర్గంలో 16,605 మంది కార్మికులు ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కార్మిక కుటుంబాల ఓట్లు గెలుపోటములను బాగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల ఓట్ల కోసం కార్మిక ఆవాసాల్లో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. -
పేదలందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి,సత్తుపల్లిరూరల్: కారు గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి, సంక్షేమం అందుతుంది మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. మండలంలోని రామానగరం, గంగారం, పాకలగూడెం, బేతుపల్లి గ్రామాలలో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, మట్టా దయానంద్తో కలిసి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనలో పేదలందరికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. పిడమర్తి రవిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. పిడమర్తి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే గంగారంలో వెయ్యి ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పలు కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరాయి. కార్యక్రమంలో ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు, గాదె సత్యనారాయణ, సోమరాజు సీతారామరాజు, రాచమళ్ల కృష్ణమూర్తి, మాదిరాజు వాసు, మోరంపూడి ప్రభాకర్, వినుకొండ కృష్ణ, మందపాటి రాజేంద్ర ప్రసాద్రెడ్డి, ఎస్కె ఖాసీం, దేవళ్ల దాసు, కొత్తూరు ప్రభాకర్రావు పాల్గొన్నారు. -
ఖాతాల్లోకే ‘రైతుబంధు’
బూర్గంపాడు : రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందజేతకు ఎన్నికల సంఘం షరతులు విధించింది. పెట్టుబడి సాయాన్ని నేరుగా చెక్కుల రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. రెండో విడత రైతుబంధు చెక్కుల పంపిణీకి శాఖాపరంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న వ్యవసాయశాఖ ఎన్నికల సంఘం ఆదేశాలతో డైలమాలో పడింది. ఎన్నికల సంఘం ఆదేశానుసారం రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు ప్రారంభించింది. రైతుల బ్యాంకు ఖాతాల వివరాల సేకరణకు ముమ్మర చర్యలు ప్రారంభించింది. గ్రామాల్లో ఏఈఓలు రైతుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి రైతుబంధు చెక్కులను ఈ నెల 7వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో చెక్కుల పంపిణీకి స్వస్తి చెప్పి బ్యాంకు ఖాతాలలో జమచేసే చర్యలు ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయం అందేందుకు మరో ఇరవైరోజులకు పైగా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల సేకరణలో అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించేందుకు బుధవారం నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్మును జమచేయాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. బ్యాంకు ఖాతాలు లేనటువంటి రైతులకు వెంటనే ఖాతాలు తెరిపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూశాఖ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలను కూడా సేకరించారు. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పుడు రెవెన్యూశాఖ వద్ద ఉన్నటువంటి రైతుల బ్యాంకుఖాతాల సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారు. దీంతో ఖాతాల సేకరణ సులువవుతుందని భావిస్తున్నారు. తొలివిడతలో సాయం పొందినవారికే.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రైతుబం«ధు పథకంలో తొలివిడతలో చెక్కులు తీసుకున్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. కొత్తగా పట్టాహక్కులు కలిగిన రైతులకు పెట్టుబడిసాయానికి గండిపడింది. ఏఈఓలు రైతుల బ్యాంకు ఖాతాల సేకరణకు సంబంధించి ఓ ఫార్మట్ను వ్యవసాయశాఖ తయారుచేసింది. ఇందులో రైతుపేరు, గ్రామం, మండలం, జిల్లా, ఆధార్ నంబర్, పట్టాదారు పాసుపుస్తకం నంబర్, సెల్నెంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఖాతా నంబర్ వివరాలు నమోద చేసి రైతుసంతకం, ఏఈఓలు సంతకాలు చేయాల్సివుంది. ఈ నివేదికలను వ్యవసాయశాఖ కమిషనర్కు కార్యాలయానికి అన్లైన్లో పంపాలి. ఆ తరువాత ఈ– కుబేర్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు జమచేయనున్నారు. జిల్లా ఖరీఫ్లో 1.21 లక్షల మంది రైతులకు 1. 31 లక్షల చెక్కులను పెట్టుబడి సాయంగా అందించారు. ఖరీఫ్లో జిల్లాలో రైతులకు రూ. 120 కోట్ల పెట్టుబడి సాయం అందింది. రబీలో కూడా అంతే మొత్తంలో అందనుంది. గతంలో లబ్ధిపొందిన వారికే.. ఖరీఫ్లో రైతుబంధు పథకంలో లబ్ధిపొందిన రైతులకే రబీలో పెట్టుబడి సాయం అందుతుంది. గతంలో మాదిరి చెక్కులు కాకుండా ఈ సారి రైతుల బ్యాంకు ఖాతాలలో పెట్టుబడి సాయం జమవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాల సేకరణ ప్రక్రియ అన్ని మండలాల్లో చేపట్టాం. రైతులు వ్యవసాయశాఖ అధికారులకు సహకరించి బ్యాంకు ఖాతాల వివరాలను అందజేయాలి. –కే అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
సర్వే గుబులు!
సాక్షి, కొత్తగూడెం : టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్లో కూడా సర్వే.. గుబులు రేపుతోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు సర్వే చేపట్టారు. ఇప్పుడు మరోసారి సర్వే చేయిస్తుండగా.. కాంగ్రెస్ కూడా కూటమిలో సీట్ల సర్దుబాటు, ఆశావహుల శక్తియుక్తులపై సర్వే నిర్వహిస్తోంది. ఎన్నికల వాతావరణం ప్రారంభానికి ముందునుంచే వివిధ పార్టీలు క్షేత్రస్థాయిలో సర్వేలు చేపడుతూ వస్తున్నాయి. సర్వేలో తెలుసుకున్న వివరాలతో పాటు స్థానిక పరిస్థితుల ఆధారంగా ముందుకెళ్లేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. 9 నెలల ముందే శాసనసభ రద్దు చేసిన టీఆర్ఎస్ పార్టీ, మరుక్షణమే అభ్యర్థులను సైతం ప్రకటించింది. అప్పటికే అనేక విడతలుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పలుమార్లు సర్వేలు చేయించుకున్నారు. అన్ని అంశాలను బేరీజు వేసుకుని సిట్టింగులకే టికెట్లు కేటాయించారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో ఇతర జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లాలోని పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో అసమ్మతి రాగాలు పెద్దఎత్తున ఎగిశాయి. టికెట్లు ఆశించిన ఇతర నాయకులతో పాటు, పార్టీ కేడర్ నుంచి తీవ్ర అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సిట్టింగ్లను కాదని వేరేవాళ్లకు టికెట్లు ఇస్తే ఈ అసమ్మతి మరింత భారీగా ఉండేదని టీఆర్ఎస్ అధినాయకత్వం భావించినట్లు పలువురు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మరోవైపు ఓటర్ల ఆలోచనాసరళి సైతం మారిపోతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసిన టీఆర్ఎస్ సైతం మారుతున్న పరిస్థితులు, ప్రజల నాడి పట్టుకునేందుకు సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క కొత్తగూడెం మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది. అశ్వారావుపేట, పినపాక నుంచి వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ తరఫున ఇల్లెందు నుంచి గెలిచిన కోరం కనకయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సహజంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, సిట్టింగ్లు కావడంతో ప్రజల్లో వీళ్లపైనా వ్యతిరేకత బాగానే ఉంది. అసమ్మతులు ఇప్పటికీ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ మళ్లీ సర్వేలు చేయిస్తుండడంతో అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. జిల్లా టీఆర్ఎస్లో భద్రాచలం మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో రగులుతున్న అసమ్మతులతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థులు ఎలాంటివారు బరిలోకి రానున్నారో అనే టెన్షన్ సైతం టీఆర్ఎస్ అభ్యర్థులను వెంటాడుతోంది. సీట్ల సర్దుబాటు, ఆశావహుల వివరాలపై కాంగ్రెస్ సర్వే.. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకకటించడంతో సీపీఐ, టీడీపీ, టీజేఎస్తో కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క స్థానంపై పట్టుదలగా ముందుకు కదులుతోంది. భద్రాద్రి జిల్లాలో సీపీఐ, టీడీపీలకు తప్పనిసరిగా సీట్లు సర్దుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఉండడంతో అందుకు సంబంధించి ఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో, కాంగ్రెస్కు వచ్చే సీట్లలో పోటీపడుతున్న ఆశావహుల గుణగణాలు, బలాబలాలు తదితర వివరాలను క్షుణ్ణంగా సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం భద్రాచలం మినహా ఇతర స్థానాల్లో గట్టి పోటీ ఉంది. మరోవైపు భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల కేటాయింపు తరువాత తలెత్తే అసమ్మతుల అంశాలపై సైతం సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్లో అభ్యర్ధుల ప్రకటన తరువాత ఊహించని స్థాయిలో అసమ్మతి భగ్గుమంటోంది. ఇక అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఈ అసమ్మతి గ్రూపుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండడంతో అన్ని అంశాలను క్రోడీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇల్లెందు కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. కొత్తగూడెంలోనూ వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఉంది. ఇక అశ్వారావుపేట టికెట్ను ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీకి కేటాయించొద్దని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. టీడీపీకి కేటాయిస్తే వ్యతిరేకిస్తామని కేడర్ పేర్కొంటోంది. కొత్తగూడెం స్థానం కోసం సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. ఈ సీటు విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని చెబుతోంది. ఇలాంటి అంశాలపైనా కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తోంది. మండలాలు, గ్రామాలవారీగా క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థల ప్రకటన తరువాత చెలరేగిన అసమ్మతుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత జాగ్రత్తగా వ్యవహరించే ఉద్దేశంతో పక్కాగా సర్వే చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక కాంగ్రెస్ కూటమిలో ఉన్న టీడీపీ తాము గట్టిగా కోరుతున్న స్థానాలకు సంబంధించి ప్రత్యేకంగా సర్వేలు చేసుకుంటోంది. జిల్లాలో అశ్వారావుపేట, భద్రాచలం స్థానాలను టీడీపీ గట్టిగా కోరుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ల కోసం రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అన్ని చోట్లా గట్టి అభ్యర్థుల కోసం చూస్తున్న బీజేపీ జరగబోయే ఎన్నికల్లో కింగ్మేకర్ కావాలని చూస్తున్న బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై గట్టిగానే దృష్టి పెట్టింది. గతంలో జిల్లాలోని పలు ఏజెన్సీ మండలాల్లో బీజేపీ పరిచయం కూడా తక్కువగా ఉండేది. రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెంచుకోవడంతో పాటు ఓట్ల శాతాన్ని మరింతగా పెంచుకునేందుకు బీజేపీ పట్టుదలతో ఉంది. దీంతో అన్ని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. జిల్లా ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ ఇన్చార్జిగా జాతీయ నాయకత్వంతో అనుబంధం ఎక్కువగా సారంగుల అమరనాథ్ను నియమించింది. పినపాక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపీ భారీగానే ఓట్లు సాధించింది. దీంతో బీజేపీ సైతం ప్రజల నోళ్లలో నానుతోంది. ఈ క్రమంలో జాతీయ నాయకత్వం ప్రణాళికల మేరకు వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను వెతికే పనిలో భాగంగా సర్వేలు చేయిస్తోంది. ఈసారి బీజేపీ టికెట్ల కోసం సైతం పోటీ పెరుగుతుండడంతో ఈ సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. -
అటెన్షన్..!
సాక్షి, కొత్తగూడెం : ఇప్పటికే జిల్లాలో ఎన్నికల వేడి రగిలింది. గత కొన్ని నెలలుగా ముందస్తు ఎన్నికలు రానున్నాయనే వార్తల నేపథ్యంలో అన్ని పార్టీలూ తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయి. ప్రజాసమస్యలపై పలు దశల్లో పోరాటాలు చేస్తున్నాయి. గతంలో వామపక్షాలకే పరిమితమైన పోడుభూముల పోరాటాన్ని కాంగ్రెస్ తదితర పార్టీలు సైతం చేపట్టాయి. దీంతో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇక అందరూ ఊహించినట్లుగానే 9 నెలల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభను రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లో హైటెన్షన్ నెలకొంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అయితే అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు పోటీచేసే వారి పేర్లు వెలువడ్డాయి. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అప్పుడే హడావిడి మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు సిట్టింగ్లకు టికెట్లు రాగా, భద్రాచలం స్థానంలో తెల్లం వెంకట్రావుకు టికెట్ దక్కింది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. అనేక చోట్ల ర్యాలీలు నిర్వహిస్తూ, బాణసంచా కాలుస్తూ జోష్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేసిన టీఆర్ఎస్.. శుక్రవారం కేసీఆర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ సభ ద్వారా సమరశంఖం పూరించనుంది. దీంతో జిల్లాలోనూ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయికి దూసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ల్లో మకాం వేసిన విపక్ష నేతలు.. శాసనసభ రద్దు చేసిన మరుక్షణమే కేసీఆర్ ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లకూ అభ్యర్థుల పేర్లు వెల్లడించడంతో విపక్షాల్లో మరింత హడావిడి మొదలైంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఆ కూటమిలో సీపీఐ, టీడీపీ, టీజేఎస్ పార్టీలు చేరే విషయం ఖాయం కావడంతో పాటు సీపీఎంను సైతం కలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో సీట్ల సర్దుబాటు విషయం కొంత క్లిష్టతరం కానుంది. దీంతో ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించే ఆశావహులు ఢిల్లీ, హైదరాబాద్ల్లో మకాం వేసి తమ తమ స్థాయిల్లో తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏ పార్టీకి ఏ స్థానాలు ఇస్తారు.. తమకు టికెట్లు వస్తాయా, రావా అనే గందరగోళంలో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఉన్న కాంగ్రెస్ సీపీఎంను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఆ పార్టీ మాత్రం బీఎల్ఎఫ్(బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్) పేరుతో ఎన్నికలకు వెళతామని గట్టిగా చెబుతోంది. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సీపీఎం గుర్తుపై, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో బీఎల్ఎఫ్ గుర్తుతో పోటీ చేసేందుకు సీపీఎం సిద్ధమవుతోంది. ఇక దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణులు బూత్స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కొందరు తమకు టికెట్లు దక్కకపోతే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎంపీతో పాటు వైరా, పినపాక, అశ్వారావుపేట శాసనసభ స్థా«నాల్లో గెలుపొందిన వైఎస్సార్సీపీ ఈసారి భద్రాద్రి జిల్లాలోని ఐదు శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. భద్రాద్రి జిల్లాలో అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలంగా ఉండగా, కాంగ్రెస్ కూటమిలో చేరనున్న టీడీపీ, సీపీఐ సైతం గణనీయమైన బలం కలిగి ఉన్నాయి. టీజేఎస్ సైతం కొంతమేరకు ప్రభావం పెంచుకుంటోంది. ఇక బీఎల్ఎఫ్ పేరుతో సీపీఎం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండగా, బీజేపీ, వైఎస్సార్సీపీ విడివిడిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో జిల్లాలో బహుముఖ పోటీ జరుగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రగతి టెన్షన్
సాక్షి, కొత్తగూడెం : ఇప్పటికే ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇది అధికార టీఆర్ఎస్ పార్టీలో మరింత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో పార్టీ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఈ సభకు జనసమీకరణ అత్యంత ప్రధానం కావడంతో నాయకులు, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరోవైపు టికెట్ల ప్రకటన అని చెప్పడంతో ఉత్కంఠ మరింతగా పెరిగింది. అయితే జనసమీకరణ అంశాన్ని పార్టీ నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇందుకోసం కసరత్తు ముమ్మరం చేశారు. ప్రతి నియోజకవర్గంలో విడతలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతున్నారు. జనసమీకరణకు పార్టీ నాయకత్వం నియోజకవర్గాల వారీగా టార్గెట్ పెట్టడంతో అందుకు తగినట్లుగా జనసమీకరణ, వారిని హైదరాబాద్ తరలించేందుకు వాహనాలు సమకూర్చడంలో హడావిడి నెలకొంది. జనసమీకరణ విషయంలో ప్రత్యేక పరిశీలన ఉంటుందని తెలుస్తుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ల ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. జిల్లాలోని భద్రాచలం మినహా మిగిలిన ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలంతా సిట్టింగ్లే. ప్రతి నియోజకవర్గంలోటికెట్ల కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వివిధ సర్వేలు, పనితీరుకు మార్కులు ఇచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో దడ మొదలైంది. రాజుకున్న ఎన్నికల వేడి.. ముందస్తు ఎన్నికలకు వెళతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించడంతో పాటు అసెంబ్లీ రద్దు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంగరకలాన్ ప్రగతి నివేదన సభ ఎన్నికల శంఖారావ సభ కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ఈ సభలో కొన్ని స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి పొత్తులు ఉండవని, ఒంటరిగానే బరిలోకి దిగుతామనే ప్రకటనతో పార్టీలో అంతర్గత టికెట్ల పోరు మరింతగా పెరుగుతోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనూ దడ మొదలైంది. ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలలో ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ పలు సర్వేలు నిర్వహించారు. వివిధ రకాల నివేదికలు తెప్పించుకున్నారు. వారి పనితీరుకు మార్కులు, గ్రేడింగ్ ఇచ్చారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని పలువురు ఎమ్మెల్యేలకు సూచించారు. ఇందులో భద్రాద్రి జిల్లా శాసనసభ్యులు సైతం ఉన్నారు. పనితీరుతో పాటు ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివేదికలు సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతో సిట్టింగ్లతో పాటు పలువురు ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు జనసమీకరణ అంశం సైతం ప్రధానమంటూ వార్తలు వినపడుతుండడంతో అందుకోసం గట్టిగానే కృషి చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి చెక్కులు, రైతుబీమా ఇవ్వడంతో సభకు రైతులను భారీగా సమీకరించే లక్ష్యంతో సమన్వయ సమితుల సమావేశాలు ఇప్పటికే నిర్వహించారు. తరువాత మండల పార్టీ, స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వార్తలతో గందరగోళం.. ప్రగతి నివేదిక సభ నేపథ్యంలో ప్రకటించనున్న అభ్యర్ధులు వీరేనంటూ సోషల్ మీడియాలో వివిధ రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికివారు తమకు తోచినట్లుగా పంపుతున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ శ్రేణులతో పాటు సాధారణ ప్రజల్లోనూ గందరగోళం నెలకొంది. ఎక్కడ చూసినా టికెట్లకు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి. -
పుట్టిన రోజునే పరలోకానికి..
కొత్తగూడెంఅర్బన్ : నిన్నటి గురువారం.. ఆ బాలుడి పుట్టిన రోజు. స్నేహితుడితో, అన్నయ్యతో కలిసి సరదాగా వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఇసుక కోప్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సీఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాలు... రామవరం సాయిబాబా టెంపుల్, సీఆర్పీ క్యాంపునకు చెందిన భూతరాజు జగదీశ్వర్ అలియాస్ చంటి(15), రామవరం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. నిన్నటి గురువారం అతడి పుట్టిన రోజు. అన్నయ్య సత్యసాయి, స్నేహితుడు గోపితో కలిసి రామవరం స్వర్ణభారతి స్కూల్ వెనుక భాగంలోగల గోధుమ వాగు వద్దకు మధ్యాహ్నం 3.30 సమయంలో వెళ్లాడు. ముగ్గురూ ఒక్కసారిగా వాగులోకి దూకారు. రెండుసార్లు దూకి బయటికొచ్చారు. మూడోసారి మళ్లీ దూకారు. కొద్దిసేపు ఈదిన తరువాత సత్యసాయి, గోపి వెనక్కు వచ్చారు. జగదీశ్వర్ రాలేదు. వాగులో కనిపించ లేదు. ఎంతసేపటికీ రాకపోవడంతో వారిద్దరూ తీవ్ర భయాందోళనతో స్థానికులకు, కుటుంబీకులకు సమాచారమిచ్చారు. పోలీసులకు తెలిసింది. అందరూ వచ్చారు. ఈతగాళ్లతో ఐదు గంటలపాటు పోలీసులు వెతికించారు. రాత్రి 8.30 గంటల సమయంలో, జగదీశ్వర్ ఎక్కడైతే ఈత కోసం వాగులోకి దూకాడో అక్కడే మృతదేహం దొరికింది. అతడి తల్లిదండ్రులు శ్రీను, రమ గుండెలు పగిలేలా పెద్దపెట్టున రోదించారు. వీరికి ఇద్దరే సంతానం. జగదీశ్వర్.. చిన్నోడు. అప్పటివరకు తమతో సరదాగా, సంతోషంగా గడిపిన జగదీశ్వర్.. అంతలోనే విగతుడిగా మారడాన్ని అతడి అన్న, స్నేహితుడు జీర్ణించుకోలేకపోయారు. ‘పుట్టిన రోజే.. చివరి రోజు అయిందారా..., అప్పడే నీకు నూరేళ్లు నిండాయా..?’ అంటూ తల్లిదండ్రులు రోదించారు. వారిని ఏదార్చడం ఎవరి తరం కాలేదు. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మృతికి ఇదే కారణమా...? ‘‘రామవరం గోధుమ వాగు నుంచి కొందరు గత ఆరు నెలలుగా ఇసుకను తోడుతున్నారు. ఇటీవలి వర్షాలతో... ఇసుక తీసిన గుంతలు నీటితో నిండాయి. ఆ ఇసుక కోప్లోనే జగదీశ్వర్ దూకాడు. లోపల చిక్కుకుపోయి, బయటకు రాలేక మృతిచెందాడు’’ అని, పోలీసులు.. స్థానికులు భావిస్తున్నారు. -
బాలికలకు భరోసా హెల్త్ అండ్ హైజిన్ కి ట్లు
కొత్తగూడెం/జూలూరుపాడు/కొణిజర్ల/భద్రాచలం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఆరోగ్య రక్ష (హెల్త్ అండ్ హైజిన్) కిట్లు అందజేయాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు చదివే బాలికలకు వీటిని పంపిణీ చేయనుంది. గతంలోనే మోడల్ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలలో బాలికలకు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల బాలికలకు కూడా అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 13 రకాల వస్తువులతో కూడిన కిట్లు బాలికలకు అందజేయనున్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న బాలికలకు ఈ కిట్లు అందజేయనున్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత , ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఈ కిట్లు అందజేస్తుంది. బాలికల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంతోపాటు, పలు కారణాలతో పెరుగుతున్న డ్రాపవుట్స్ల నివారణే లక్ష్యంగా గత ఏడాది కస్తూర్బా పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆశించిన మేర సత్ఫలితాలనివ్వడంతోపాటు బాలికల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవడంతో ఈ ఏడాది రాష్ట్రంలోని జిల్లా ప్రజాపరిషత్, ప్రభుత్వ మోడల్ స్కూల్స్, గురుకుల, కేజీబీవీలు, పంచాయతీరాజ్ పాఠశాలలన్నింటిలోనూ ఈ కిట్ల పంపిణీకి నిర్ణయించింది. 13 రకాల వస్తువులతో.. బాలికల అవసరాల మేరకు హెల్త్ అండ్ హైజిన్ కిట్లో 13 రకాల వస్తువులను అందజేయనున్నారు. వీటిని ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి చొప్పున జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో నాలుగు సార్లు విద్యార్థినులకు అందచేయనున్నారు. వేసవి సెలవుల్లో సైతం అందేవిధంగా ముందస్తు క్యాలెండర్ను రూపొందించారు. భద్రాద్రిలో కలెక్టర్ చేతుల మీదుగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, జాయింట్ కలెక్టర్ రాంకిషన్లు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, కళాశాలలు, పంచాయతీరాజ్ పాఠశాలల్లోని విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు కిట్లను డీఈఓ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులు ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలను జారీ చేశారు. జూలూరుపాడుకేజీబీవీని సందర్శించిన జేడీ రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం(హైదారాబాద్) జాయింట్ డైరెక్టర్(జేడీ), ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జి.రమేష్ గురువారం జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలిక ఆరోగ్య రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమం, హరిత పాఠశాల, హరితహారం వంటి కార్యక్రమాలతోపాటు, విద్యాలయంలోని సౌకర్యాలు, బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఎంఈఓ జి.వెంకట్, కేజీబీవీ ఇన్చార్జి ఎస్ఓ రజితలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను, వంట గది, స్టాక్ రూమ్ను పరిశీలించారు. బాలికలతో ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, సొసైటీ రెసిడెన్షియల్స్ మొత్తం 734 పాఠశాలల్లోని 35,296 మంది బాలికలకు బాలికా ఆరోగ్య రక్ష(కేసీఆర్) కిట్లు అందజేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 434 పాఠశాలలకు చెందిన 19,859 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 300 పాఠశాలలకు చెందిన 15,437 మంది బాలికలకు కేసీఆర్ కిట్స్ ఇస్తామని తెలిపారు. కేజీబీవీల్లో విద్య అభ్యసించే 6 నుంచి 10వ తరగతి బాలికలకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సొసైటీ రెసిడెన్షియల్స్లో చదివే 7 నుంచి 10వ తరగతి బాలికలకు కేసీఆర్ కిట్స్ అందజేస్తామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హరిత పాఠశాల, హరిత కళాశాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతీ విద్యార్థికి 6 మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎంఈఓ గుగులోతు వెంకట్, కేజీబీవీ ఇన్చార్జి ఎస్ఓ రజిత, టీచర్లు, సిబ్బంది ఉన్నారు. గతంలో హాస్టళ్లకు వస్తువులు, స్కూళ్లకు నగదు.. ఇప్పటివరకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమాలు, గురుకులాల్లో చదివే విద్యార్థినులకు ఆయా సంస్థల ఆధ్వర్యంలో న్యాప్కిన్లు, కాస్మొటిక్స్ను అందజేస్తున్నారు. సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినులకు మూడు నెలలకోసారి కాస్మొటిక్స్ వస్తువుల కోసం వచ్చే డబ్బును ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో టెండర్లు నిర్వహించి సరఫరా చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ఇవి అందేవి కావు. 8 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు సర్వ శిక్ష అభియాన్ నిధుల నుంచి కాస్మొటిక్స్ కోసం డబ్బులు మంజూరు చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అవి సక్రమంగా పంపిణీ కాకపోవటం, బాలికలు ఆ డబ్బును ఇంటికి తీసుకెళ్లి ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో ఫలితం కనిపించడం లేదు. దీనిని అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ నుంచే నేరుగా హెల్త్ అండ్ హైజిన్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించారు. మండలాలకు చేరిన కిట్లు.. హెల్త్ అండ్ హైజిన్ కిట్లను సరఫరా చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒప్పందం చేసుకున్న సంస్థ వాటిని మండల కేంద్రాలకు ఇప్పటికే సరఫరా చేసింది. వీటిని ఆయా మండల విద్యాశాఖాధికారులు విద్యార్థినుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు చేరవేయాలి. ఇవి ప్రతీ విద్యార్థినికి అందేలా పాఠశాలల హెచ్ఎంలు బాధ్యత వహించాలి. సరఫరా అయిన కిట్లు, పంపిణీ లెక్క కచ్చితంగా ఉండేలా రిజష్టర్లో నమోదు చేయాలి. ఈనెల 24న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 30లోపు ప్రతీ విద్యార్థినికీ అందేలా చర్యలు తీసుకోవాలి. మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు సకాలంలో హెల్త్ అండ్ హైజిన్ కిట్లు సరఫరా చేసేందుకు వాహన సదుపాయం కోసం కూడా నిధులు కేటాయించారు. 8 కిలోమీటర్ల లోపు ఉంటే రూ.300, ఆపైన దూరం ఉంటే రూ. 600 వాహనాలకు చెల్లించవచ్చు. వీటిని పాఠశాల గ్రాంట్ నుంచి వినియోగించుకునేలా ఉన్నతాధికారులు ఆదేశించారు. భద్రాద్రిలో 15,437 కిట్లు సిద్ధం బాలికల వ్యక్తిగత, ఆరోగ్య సంరక్షణతో పాటు బాలికలలో డ్రాపవుట్స్ను తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బాలికా రక్షలో భాగంగా జిల్లాల పంపిణీ చేసేందుకు 15,437 కిట్లను సిద్ధం చేశాం. ఏడాదిలో నాలుగు సార్లు అందించే విధంగా ప్రణాళికలను రూపొందించాం. బాలికావిద్యను అభివృద్ధి చేసేందుకు ఈ హెల్త్ అండ్ హైజిన్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –డి వాసంతి, డీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం కిట్లో ఉండే వస్తువులు బాత్ సోప్స్ (పతంజలి)–3 డిటెర్జంట్ సోప్స్(పతంజలి)–3 కొబ్బరి నూనె(డాబర్)–1 షాంంపూ బాటిల్(డాబర్)–1 ఫేస్ పౌడర్( ఐటెక్స్)–1 టూత్ పేస్ట్(డాబర్)–1 టూత్ బ్రష్(పతంజలి)–1 టంగ్ క్లీనర్–1 దువ్వెన–1 బొట్టు బిళ్లలు (ఐటెక్స్) 77నుంచి 90 వరకు ఉండే ప్యాకెట్–1 నెయిలాన్ రిబ్బన్స్–2 హెయిర్ బాండ్స్–2 శానిటరీ న్యాప్కిన్స్ (జాన్సన్ అండ్ జాన్సన్)–3 హ్యాండ్ వాష్ కోసం స్కూల్లోని పిల్లలందరికీ కలిపి 5 లీటర్ల బాటిల్ –1 -
‘ఫైబర్’ మ్యూజియం
పాల్వంచరూరల్ : కిన్నెరసాని లో జంతువుల బొమ్మలతో ఏర్పాటు చేసిన మ్యూజియం ఆకట్టుకుంటోంది. అహ్మదాబాద్కు చెందిన కళాకారులను రప్పించి వివిధ రకాల వన్యప్రాణుల బొమ్మలను తయారు చేయించారు. ఆరు నెలల క్రితం ప్రారంభించిన ఈ మ్యూజియం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కేంద్రప్రభుత్వం మంజూరు చేసి న నిధులతో కిన్నెరసానిలోని పర్యావరణ విద్యాకేంద్రాన్ని వన్య మృగాల సంరక్షణ విభాగం పర్యవేక్షణలో ఆధునికీకరించారు. కిన్నెరసాని అభయారణ్యంలో సంచరించే 24 రకాల అరుదైన జంతువుల బొమ్మలను అహ్మదాబాద్కు చెందిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్కు చెందిన కళాకారులు ఫైబర్ వస్తువులతో రూపొందించా రు. వీటిని రెండు ఏసీ గదుల్లో ఉంచారు. విద్యాకేంద్రంలోకి ప్రవేశించగానే ఎదురుగా మొసలి బొమ్మ కన్పిస్తుంది. పక్కనే ఉన్న గదిలో ఒక చెట్టుపై నెమలి, గుడ్లగూబ, చెట్టు కింద కొండ చిలువ పాము, కొంగ తదితర బొమ్మలు దర్శనమిస్తాయి. మరోగదిలో ప్రధానంగా అడవి దున్న, మొసలి, చిరుత,పులి, కొంగ, ఉడు ము, ఎలుగుబంటి, చుక్కల దుప్పి తదితర జంతువుల బొమ్మలను ఉంచారు. వృక్షాలు, జలాశయానికి సంబంధించిన షార్ట్ ఫిలిం థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 50మంది ఒకేసారి కుర్చోని వీక్షించ వచ్చు. వివిధ పక్షుల కిలకిలరావాలు, జంతువుల అరుపులకు సంబంధించిన ఆడియో రికార్డులను, వాటి చిత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. రూ.20లక్షల వ్యయంతో.. రూ.20లక్షలతో వివిధ రకాల జంతువుల బొమ్మ లను తయారు చేసి పర్యావరణ విద్యాకేంద్రంలో ఏర్పాటు చేశాం. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కల్గించేవిధంగా ఉంటా యి. షార్ట్ ఫిలిం థియేటర్ కూడా ఏర్పాటు చేశాం. మ్యూజియం ప్రారంభించిన తర్వాత నుంచి పర్యాటకుల స్పందన పెరిగింది. కిన్నెరసానిలో ఆహ్లాదంతోపాటు విజ్ఞానం కూడా అందిస్తున్నాం. -నాగభూషణం, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ -
భద్రాచలంలో ఉధృతంగా గోదావరి
భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రెండో ప్రమాద హెచ్చరిక దాటి 50 అడుగులకు చేరుకోవటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతాల్లోని ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, చర్ల, పినపాక మండలాల్లో నాలుగు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. గోదావరి వరద ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులు దాటే అవకాశం ఉందని అందిన సమాచారంతో.. జిల్లాలో వరద ప్రభావానికి గురయ్యే 8 మండలాల్లో లాంచీలను సిద్ధం చేశారు. భధ్రాచలంలో 30 మంది సభ్యులుగల ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అందుబాటులో ఉంచారు. అయితే బుధవారం సాయంత్రానికి ఒక అడుగు నీటిమట్టం తగ్గింది. ఎగువ ప్రాంతమైన ఏటూరు నాగారం, కాళేశ్వరం లో వరద ఉధృతి నెమ్మదించిందని, దీంతో గురువారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద ప్రవా హం మరికొద్దిగా తగ్గనుందని సబ్ కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. వరద ఉధృతితో గోదావరి పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. రహదారులు చాలా చోట్ల ఛిద్రమయ్యాయి. ఇదిలా ఉంటే భద్రాచలంలోని డ్రెయినేజీ నీటిని సకాలంలో గోదావరిలోకి పంపించే విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో రామాలయం పడమర మెట్లవైపు మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. అన్నదాన సత్రంలోకి కూడా డ్రైనేజీ నీళ్లు చేరాయి. గోదావరికి దిగువన ఉన్న ఏపీలోని శబరి నది కూడా పోటెత్తటంతో పోలవరం విలీన మండలాలకు రాకపోకలు స్తంభించాయి. -
తమ్ముడి మృతదేహాన్ని చూడటానికి వచ్చిన అక్కకు..
గుండాల భద్రాద్రి జిల్లా : పాలగూడెం.. గుండాల మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామం. అయితే అభివృద్ధిలో మాత్రం చాలా దూరంలో ఉంది. ఆ ఊరికి కనీస రోడ్డు సౌకర్యం లేదు. మామూలు రోజుల్లో అయితే ఉన్న డొంక రోడ్డు నుంచే ఆటోలు, మోటార్ సైకిళ్లు వెళ్తుంటాయి. కానీ ఇటీవలి వర్షాలు ఆ సౌకర్యాన్ని కూడా గంగలో ముంచాయి. అత్యవసర సమయాల్లో మండల కేంద్రానికి లేదా ఏ ఆస్పత్రికి వెళ్లాలన్నా అక్కడి గిరిజనులకు నరకయాతనే. నిండు గర్భిణులు, జ్వర పీడితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు మృతదేహాలకు కూడా తిప్పలు తప్పడం లేదు. మంగళవారం జరిగిన ఓ ఘటన ఈ గ్రామ దుస్థితికి అద్దం పడుతోంది. గ్రామానికి చెందిన కొడెం నరేష్(20) కుటుంబ కలహాలతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని కొడవటంచ వరకు వాహనంలో, అక్కడి నుంచి ఎడ్లబండి ద్వారా ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత కేసు నమోదు కావడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఇల్లెందుకు తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎడ్లబండి కూడా అందుబాటులో లేకపోవడం, ఇటీవల వర్షాలకు రోడ్డు ఛిద్రమై కనీసం ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కావడి ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలోని కొడవటంచ వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనం ద్వారా ఇల్లెందుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎడ్లబండ్లే శరణ్యం.. పాలగూడెం గ్రామంలో 46 కుటుంబాల ఉండగా 164 మంది జనాభా ఉన్నారు. మండల కేంద్రం నుంచి 7 కి.మీ. (కొడవటంచ వరకు) మట్టి రోడ్డు ఉండగా ఆటోలు, దిచక్రవాహనాలు మాత్రమే తిరుగుతుంటాయి. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలగూడెం వెళ్లాలంటే నరకయాతనే. పురుగుమందు తాగినా, విష పురుగులు కాటేసినా, నిండు గర్భిణులైనా అత్యవసర వైద్యం పొందాలంటే ఎండ్లబండ్లే శరణ్యం. ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచాక మొహం చాటేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఉన్న మట్టి రోడ్డు కూడా ఇటీవలి వర్షాలకు దెబ్బతినడంతో మరీ ఇబ్బందిగా మారిందని, కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని చెపుతున్నారు. ఇక పక్కనే ఉన్న నాగారం గ్రామానిదీ అదే పరిస్థితి. అక్కడ 50 కుటుంబాలుండగా 190 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు బాలింతలు, ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు. ఆ గ్రామానికి వెళ్లాలన్నా 4 కి.మీ.కాలినడకనే. ఇటీవల వర్షాలకు కొడవటంచ వద్ద ఉన్న కిన్నెరసాని బ్రిడ్జి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇటీవల పర్శిక శిరీష అనే మహిళ పురిటి నొప్పులతో బాదపడుతుండగా అతి కష్టం మీద కిన్నెరసాని పైనుంచే తరలించారు. ఇంకా నడిమిగూడెం, సజ్జలబోడు తదితర గ్రామాల్లోనూ ఇలాంటి సమస్యలే విలయతాండవం చేస్తున్నాయి. ఏ అధికారీ అటువైపు వెళ్లిన పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కష్టాలను తీర్చాలని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. మృతుడి సోదరికి పురిటినొప్పులు.. గుండాల: తమ్ముడు చనిపోయాడనే విషయం తెలిసి పుట్టింటికి వచ్చిన అక్కకు అదే సమయంలో పురిటినొప్పులు మొదలయ్యాయి. 108 ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ద్విచక్రవాహనం, ఆటోల ద్వారా అష్టకష్టాలు పడుతూ గుండాల ఆస్పత్రికి చేరింది. సోదరుడు నరేష్ ఆత్మహత్య చేసుకోవడంతో కరకగూడెం మండలం కొత్తూరు నుంచి అక్క ఈసం స్వప్న పాలగూడెం వచ్చింది. తమ్ముడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు గ్రామ పొలిమెరల్లోకి కుటుంబ సభ్యులంతా వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. తన ఫోన్ అప్పటికే స్విచ్ఆఫ్ అయింది. అక్కడున్న పిల్లల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వెంటనే ఆశావర్కర్ వచ్చి 108కు సమాచారం అందించగా అందుబాటులో లేదని సమాచారం వచ్చింది. అద్వానంగా ఉన్న బురదరోడ్డుపై ద్విచక్రవాహనంపై కొడవటంచ వరకు తీసుకొచ్చి, అక్కడి నుంచి ఆటోలో గుండాల ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మార్గం మద్యలో ఆమె పడిన అవస్థలు వర్ణణాతీతం. -
తాలిపేరుకు పోటెత్తిన వరద నీరు
చర్ల భద్రాద్రి జిల్లా : సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు ప్రాజెక్ట్లోకి వరద నీరు చేరుతోంది. సోమవారం 25 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేసి 1,72,700 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో పదిహేను రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి నుంచి వరద నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. అధిక మొత్తం క్యూసెక్కులలో మాత్రం ఆదివారమే విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గతంలో 1.42,000 క్యూసెక్కుల వరకు మాత్రమే వదిలారు. ఆదివారం మాత్రం ప్రాజెక్టుకున్న మొత్తం 25 గేట్లను పూర్తిగా పైకి (16 అడుగులు) ఎత్తి వరద నీటిని వదిలారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74.00 మీటర్లు. ప్రస్తుతం 73.00 మీటర్లు నీటి మట్టం ఉంది. పరిస్థితిని ప్రాజెక్ట్ డీఈ జె.తిరుపతి, ఏఈ వెంకటేశ్వరావు పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారమిస్తున్నారు. తాలిపేరు నుంచి విడుదలవుతున్న వరద నీటికి తోడు దిగువనున్న గోదావరికి సైతం వరద నీరు వస్తోంది. తాలిపేరు, గోదావరి నదుల వరద ఉధృతి నేపథ్యంలో ఈ రెండు నదులు కలిసే ప్రాంతంలోని తేగడ, మేడివాయి, కొత్తపల్లి, దండుపేట తదితర గ్రామాల్లోని వరి, పత్తి పంటలు నీట మునిగాయి. -
తెలంగాణ: ఉప్పొంగిన ముసలమ్మ వాగు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరగడంతో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 43.4 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరి నది ఉధృతి నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు సబ్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ (08743-232444) ఏర్పాటు చేశారు. ఉప్పొంగిన ముసలమ్మ వాగు భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలంలో వాగుకు గండి పడి సర్వాయి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అత్యవసర సేవల కోసం పోలీస్ శాఖ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. మంగపేట మండలం కమలాపురం రమణక్కపేట వద్ద ముసలమ్మ వాగు ఉప్పొంగి ప్రధాన రహదారి ధ్వంసమైంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు పెట్టారు. ఏటూరునాగారం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్ళల్లోకి చేరిన వర్షపు నీరు. డ్రైనేజీ లోపమేనని అంటున్న గ్రామస్థులు. రహదారులు పూర్తిగా ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోనూ.. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద కల్లూరు వాగు ప్రదాన రహారి బ్రిడ్జిని ఆనుకుని నీరు ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఓపెన్ కాస్ట్లపై ప్రభావం చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని ఓపెన్ కాస్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నాలుగు ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రోజుకి 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై భారీ యంత్రాలను పైకి తీసుకువచ్చారు. ఇక, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, చెరువులు, కుంటలు నిండిపోయాయి.వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరడంతో ఒక్క కోదాడ పట్టణంలోనే 100 ఇళ్లు నీటమునిగాయి. ఎర్రకుంట చెరువు నిండటంతో ఆ నీరు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరడంతో ఇంట్లోని సామాన్లన్ని నీళ్లలో తడిసిపోయాయి. ప్రాజెక్టులవారీగా వరద ఉధృతి వివరాలు.. భద్రాద్రి: తాలిపేరు ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేత ఇన్ఫ్లో 44 వేలు, ఔట్ఫ్లో 72వేల క్యూసెక్కులు తాలిపేరు ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 72.30 మీటర్లు శ్రీపాదకు కొనసాగుతున్న వరద పెద్దపల్లి: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద ఇన్ఫ్లో 16924 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 32,340 క్యూసెక్కులు పూర్తిస్థాయి 20.175 టీఎంసీలు, ప్రస్తుతం 18.925 టీఎంసీలు మంచిర్యాల: పొంగిపొర్లుతున్న సుద్దాల, గొర్లపల్లి వాగులు చెన్నూర్, వేమనపల్లి మండలాల్లో 35 గ్రామాలకు రాకపోకలు బంద్ సాగర్ ప్రాజెక్ట్ ఔట్ఫ్లో 7వేల క్యూసెక్కులు నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు పెరిగిన వరద ప్రాజెక్ట్ సామర్ధ్యం 590, ప్రస్తుత నీటిమట్టం 542.70 అడుగులు ఇన్ఫ్లో 2 లక్షల 8వేల క్యూసెక్కులు, ఔట్ఫ్లో 7వేల క్యూసెక్కులు నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం ఇన్ఫ్లో 950 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 60 క్యూసెక్కులు భూపాలపల్లి జిల్లాల్లో భూపాలపల్లి: మహదేవ్పూర్, పలిమెల, మల్హర్ మండలాల్లో భారీ వర్షం ఉధృతంగా ప్రవహిస్తున్న దౌత్పల్లి, పంకేన, సర్వాయిపేట, తీగల వాగులు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీరు, నిలిచిన బొగ్గు ఉత్పత్తి -
భద్రాద్రి,కొత్తగూడెంలలో స్వల్ప భూకంపం
-
భూ ప్రకంపనలతో బెంబేలు
సాక్షి, కొత్తగూడెం/మహబూబాబాద్: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. భారీ శబ్ధాలు రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో 5 సెకన్లు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, సుజాతనగర్, చండ్రుగొండ, జూలూరుపాడు తదితర మండలాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే ఎక్కడా ఆస్తి నష్టం జరగలేదు. మహబూబాబాద్లోని కంకరబోడ్లో ఉన్న సమైక్య డిగ్రీ కళాశాల సమీపంలో స్వల్ప భూకంపం వచ్చిందని స్థానికులు తెలిపారు. -
పోడు భూములపై అటవీ సిబ్బంది దౌర్జన్యం
టేకులపల్లి : మండలంలోని చింతోనిచెలక పంచాయతీ చింతోనిచెలక తండాలో అటవీ శాఖాధికారులు ఓ గిరిజనుడి పంట చేనుపై గురువారం దాడికి పాల్పడ్డారు. ఆదివాసీ దినోత్సవం రోజే గిరిజనుడి పంటను ధ్వంసం చేసి ఆ కుటుంబాన్ని శోకంలో ముంచెత్తడం గమనార్హం. బాధిత రైతు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. చింతోనిచెలక తండాకు చెందిన సుమారు 26 మంది రైతులు కొన్నేళ్ళ క్రితం పోడు కొట్టుకుని సాగు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో రైతులందరూ పత్తి పంట వేశారు. మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇదే గ్రామానికి చెందిన మాలోత్ బాలాజీ గురువారం భార్య, తల్లితో కలిసి చేలో కలుపు తీస్తున్నారు. అటవీ అధికారులు, సిబ్బంది పది మంది బృందం మూకుమ్మడిగా బాలాజీ చేనులో దాడికి పాల్పడ్డారు. అధికారులను వేడుకున్నా.. హరితహారం మొక్కలు నాటాలని చెబుతూ చేను లో ఉన్న పత్తి మొక్కలన్నింటినీ పీకేశారు. బాధిత రైతు బాలాజీ, ఆయన భార్య, తల్లి అధికారుల కాళ్లపై పడి బతిమిలాడినా వినలేదు. వారిని పక్కకు నెట్టేసి మొక్కలను పీకేశారు. పంటను నాశనం చేయొద్దని , తమ కుటుంబానికి అదే జీవనాధారమని ఎంత వేడుకున్నా వినకుండా పత్తి పంటను ధ్వంసం చేశారు. ఇదే గ్రామానికి చెందిన రైతులందరి పోడు భూములు అక్కడే ఉన్నాయి. కేవలం బాలాజీ భూమిలోనే హరితహారం మొక్కలు నాటేందుకు పూనుకోవడం విశేషం. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతు బోడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీడియో తీయొద్దంటూ హుకుం.. ఫారెస్టు అధికారులు పత్తి పంటను నాశనం చేస్తున్న దృశ్యాన్ని బాధిత రైతు కుటుంబ సభ్యులు ఒకరు వీడియో తీస్తుండటంతో అక్కడే ఉన్న ఫారెస్టు అధికారి ఒకరు ఆవేశానికి గురయ్యారు. వెంటనే వీడియోను నిలిపివేయాలని సదరు యువకుడి వద్దకు వచ్చి హెచ్చరించాడు. మొబైల్ ఫోన్ గుంజుకోవడానికి ప్రయత్నించినట్లు బాధిత రైతు వాపోయాడు. -
మోదీ ప్రభుత్వం విఫలం
ఖమ్మంమయూరిసెంటర్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కార్మికులకు, కర్షకులకు కనీసవేతనం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు ఆరోపించారు. గురువారం ఖమ్మంలో సీఐటియూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జైల్భరో జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రదర్శనగా ధర్నాచౌక్కు బయల్దేరగా, మయూరిసెంటర్లో పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రదర్శకులకు మధ్య తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. నాయకులను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. అంతకుముందు జరిగిన సభలో నున్నా నాగేశ్వరరావు, బి.మధు మాట్లాడుతూ.. నాలుగేళ్ల పాలన లో ప్రధాని మోదీ హామీలు ఒక్కటీ అమలు కాలేదన్నారు. రైతు ఆత్మహత్యలు కొనసాగుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వరావు, జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వేదగిరి శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి భారతి, టీమాస్ జిల్లా కన్వీనర్ యర్రా శ్రీకాంత్ పాల్గొన్నారు. కొత్తగూడెంలో ఉద్రిక్తం చుంచుపల్లి: కొత్తగూడెంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ముందుగా పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్కు చేరుకున్న ప్రదర్శన కలెక్టరేట్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. కొం త సేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసుల అరెస్ట్ చేసి వన్టౌన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, కున్సోతు ధర్మా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో రైతులు, కార్మికుల బతుకులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని, కార్పొరేట్ సంస్థల ఆస్తులేమో పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు కూడా కార్మికులను పట్టించుకోవడంలేద న్నారు. 17 రోజులు గా సమ్మె చేస్తున్నా పంచాయతీ కార్మికుల సమస్య లు పట్టడంలేదన్నారు. ఈ ప్రభుత్వాలకు కార్మికులు,కర్షకులు సరైన సమయంలో బుద్ధిచెపుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోత్ ధర్మా, వెంకన్న, కోబాల్, లక్ష్మి, జ్యోతి, జాటోత్ కృష్ణ, వినోద, కొక్కెరపాటి పుల్లయ్య, భూక్యా రమేష్, కొండపల్లి శ్రీధర్, నబీ, బాలరాజు, పిట్టల రవి, అర్జున్, వీర్ల రమేష్ పాల్గొన్నారు. -
ఆదివాసీ జోష్..
భద్రాచలం : ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గిరిజనుల కొమ్ము, డప్పు నృత్యాలు, ఆట పాటలు అలరించాయి. పలువురు అధికారులు కూడా వారితో కలిసి వేసిన డ్యాన్స్లు ఆకట్టుకున్నాయి. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంబేడ్కర్ సెంటర్లో గల అమరవీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఓ పమెల సత్పథి మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఐటీడీఏ ద్వారా తగిన కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గిరిజనులు మాతృభాషపై మమకారం పెంచుకోవాలని, దాని అభివృద్ధి కోసం ఆ భాషలోనే మాట్లాడాలని సూచించారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, వారికి విద్య, వైద్యం, అన్ని రకాల మౌలిక సౌకర్యాల కల్పనకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు అంతా ఏకమై ఉద్యమించాలన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం అనేక చట్టాలు వచ్చినా, పాలకులు వాటిని చిత్తశుద్ధితో అమలు చేయకపోవటం శోచనీయమన్నారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారని, స్పెషల్ డీఎస్సీ లేదని, జీవో నంబర్ 3 అమలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ కుంజా వాణి కోయభాషలో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు. అలరించిన అధికారుల నృత్యాలు.. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ సెంటర్లో జెండా ఆవిష్కరించారు. అమరుల విగ్రహాలతో పాటు, ఆదివాసీ జాతి అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచిన ఆదివాసీ పెద్దల చిత్రపటాలను వేదిక వద్ద ఏర్పాటు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాల వారు కలసి నృత్యాలు చేశారు. కొమ్ము నృత్యాలు, రేల పాటలతో అంబేడ్కర్ సెంటర్ కోలాహలంగా మారింది. ఐటీడీఏ పీఓ పమెల సత్పథి, ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా వారితో జత కలసి ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు సీహెచ్ రామ్మూర్తి, ఏటీడీఓ జహీరుద్ధీన్, ఐటీడీఏ ఏపీఓ భీం, భద్రాచలం తహసీల్దార్ పీవీ రామకృష్ణ, ఏటీఓ రమణయ్య, కొండరెడ్ల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్, ఆదివాసీ సంఘాల సమన్వయ కర్త మడివి నెహ్రూ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మానె రామకృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా నాయకురాలు దామెర్ల రేవతి తదితరులు పాల్గొన్నారు. -
ఆ‘‘దీన’’వాసులు
పాల్వంచరూరల్ : ఉమ్మడి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. 4, 14,400 మంది గిరిజనులున్నారు. వీరిలో కోయ గిరిజనులు 2 లక్షల28 వేల 400 మంది, కొండరెడ్లు 1000మంది, నాయక్పోడు 2,500 మంది, యానాది 800మంది, ఎరుకల 4,100 మంది, లంబాడీలు1,48,900మంది, సంచార తెగలు 2,500మంది, గొత్తికోయలు సుమారు 35,000మంది నివసిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 5,06,400 మంది ఉండేవారు. మొత్తం ఆదివాసీ తెగలు 70కిపైగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 13 తెగలవారు ఉన్నారు. వీరిలో కోయ, కొండరెడ్లు, గొత్తికోయలు, నాయక్పోడ్, సంచార తెగలవారు నివసిస్తున్నారు. భద్రాద్రిజిల్లాలో సుమారు 35000 మంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గొత్తి కోయలు ఉన్నారు. కానీ వీరికి మన రాష్ట్రంలో అధికారిక గుర్తింపు లేదు. దీంతో ప్రభుత్వం చేపట్టే అరకొర సంక్షేమ పథకాలు కూడా అందవు. భిన్నమైన ఆచార వ్యవహారాలు కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు, తినే ఆహారం ఇలా.. ఆదివాసీలవన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఏళ్ల తరబడి అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 1960 జనవరి 26 నుంచి రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అటవీప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. వీరినే గిరిపుత్రులు, గిరిజనులు, అడవి బిడ్డలు, వనవాసీలు, ఆదివాసీలుగా పిలుస్తారు. ఎక్కువమంది అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొందరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. చీపుర్లు, తునికిపండ్లు, ఇప్పపువ్వు, తబ్తిబంక, తేనె, పరికిపండ్లు, నేరేడుపండ్లు, ముష్టిగింజలు, చిల్లిగింజలు, చింతగింజలు, తునికాకు సేకరించి అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 1974లోనే ఐటీడీఏ ఏర్పాటు ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం 1974లో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులోకి పలు శాఖలను చేర్చి పాలన నిర్వహిస్తున్నారు. పాలకుల పట్టింపులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఆదివాసీ కుటుంబాలు ఇంకా అభివృద్ధికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారని బతుకులు 5వ షెడ్యూల్కు వచ్చే అటవీ హక్కుల చట్టాలు పీసా, 1/70 ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. ఆదివాసీల బతుకుల్లో మాత్రం మార్పు కన్పించడంలేదు. వారి గూడేల్లో, పల్లెల్లో కనీస మౌలిక సౌకర్యాలైన రహదారులు, తాగునీరు, విద్యుత్ ఉండదు. దీంతో అక్కడ నివాసం ఉండే ఆదివాసీ గిరిజనులు చెలిమ నీళ్లు, వాగుల్లో, కుంటల్లో లభించే నీటినే తాగుతున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. పాల్వంచ మండలంలోని రాళ్లచెలక, చిరుతానిపాడు, సీతారాంపురం, ఎర్రబోరు, ఒడ్డుగూడెం తదితర గ్రామాల్లో గిరిజనులపాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆర్చరీలో ఆరితేరి.. ఆదివాసీలు విలువిద్యలో రాణిస్తుంటారు. జిల్లాలో నుంచి అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చూపినవారూ ఉన్నారు. కిన్నెరసానిలో ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ క్రీడా పాఠశాలలో విలువిద్య లో ప్రత్యేక శిక్షణనిస్తారు. సుమారు 30మంది జాతీయ స్థాయిలో, 100మంది రాష్ట్రస్థాయిలో, మరో 150 మంది జిల్లాస్థాయిలో ఇక్కడి విద్యార్థులు ప్రతిభ చాటారు. పలువురు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారు. స్పోర్ట్స్ ప్రతిభతో శివశంకర్ ఆర్మీలో, దుర్గ, ప్రసాద్లు ఫిజికల్ డైరెక్టర్లుగా, వెంకయ్య రైల్వేలో, శేఖర్ పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించారు. ఆదివాసీల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి ఆదివాసీల దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం అధికారికంగా నిర్వహించడంతోపాటు సెలవుదినంగా ప్రకటించాలి. ఆదివాసీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, చట్టాలను అమలుచేసి, వారిని రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. –వాసం రామకృష్ణ దొర, రాజకీయ జేఏసీ చైర్మన్ ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి ఏజెన్సీలో అభివృద్ధికి ఆమడదూరంగా జీవనం సాగిస్తున్న గిరిజనుల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను పటిష్టంగా అమలు చేయాలి. అటవీ హక్కుల చట్టం, పీసా, 1/70 చట్టం సక్రమంగా అమ లు జరగడంలేదు. పేద గిరిజనులకు సాగుభూమి ఇవ్వాలి. –కన్నెబోయిన నర్సయ్య, మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొత్తి కోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రా ష్ట్రంలోనికి వలస వచ్చి 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గొత్తికోయలను ఎస్టీజాబితాలో చేర్చాలి. ఆదివాసీ తెగలకు ప్రభుత్వం న్యా యం చేయాలి. ఏజెన్సీలో ఆర్ ఓఎఫ్ ఆర్ చట్టానికి అనుబంధంగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలి. –పొడుగు శ్రీనాథ్,తుడుందెబ్బ రాష్ట్ర న్యాయసలహాదారు తెలంగాణలోనూ తొలగని కష్టాలు దుర్భరంగా వలస ఆదివాసీల బతుకులు = పోడు భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు భద్రాచలం: ఏజెన్సీలో ఆదివాసీలు ఎంతో కాలం గా అభివృద్ధికి దూరంగానే బతుకుతున్నారు. కొత్త రాష్ట్రంలోనూ వారి దుస్థితి మారలేదు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం ఏజెన్సీని రెండు ముక్కలు చేసి పాలకులు ఆదివాసీల అస్థిత్వానికి ప్రమాదం తెచ్చిపెట్టారు. గతంలో ఐటీడీఏకు వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుతం ఐటీడీఏలో దర ఖాస్తులు ఇచ్చినా ప్రయోజనం చేకూరడంలేదు. అరకొరగా అందిన సంక్షేమ పథకాలు రానురాను అందకుండాపోతున్నాయి. ట్రైకార్ ద్వారా రుణాలు వస్తున్నా.. సబ్సిడీ బినామీల పాలవతుందనే విమర్శ లు ఉన్నాయి. ఆదివాసీలు ఉపాధి, ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. అందుకే స్వయం పాలన కోసం ఆదివాసీలు పోరుబాట పట్టారు. పోడు సాగుదారులపై వేధింపులు తరతరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఇటీవల కాలంలో అటవీశాఖాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 31,961 మంది గిరిజనులకు 114082.23 లక్షల ఎకరాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి హక్కు పత్రాలు అందజేశారు. 2009లో ఆదివాసీ దినోత్సవం రోజున భద్రాచలంలో వీటిని పంపిణీ చేశారు. మహానేత మరణానంతరం పాలకులు పోడు సమస్యను పట్టించుకోకపోగా ఆదివాసీల చేతుల్లో ఉన్న భూములను లాక్కునేందుకు యత్నిస్తున్నారు. హరితహారం పేరుతో తమను భూముల నుంచి వెళ్లగొడుతున్నారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కా గృహాలకు నోచుకోని ఆదివాసీలు ఎన్నో ఏళ్లుగా మారుమూల అటవీప్రాంతాల్లో నివసించే చాలా మంది ఆదివాసీలకు సరైన ఇళ్లు లేవు. గతంలో ఇందిరమ్మ పథకం పేరుతో మం జూరైన ఇళ్లు చాలా చోట్ల అసంపూర్తిగానే ఉన్నా యి. గిరిజనులకు 2,69,610 ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 2,15,109 పూర్తయినట్లు అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు చెల్లించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హౌసింగ్ బోర్డును పూర్తి గా ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కూడా మండల స్థాయిలో అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ నిర్మించే డబుల్బెడ్రూం ఇళ్లు ఆదివాసీలకు ఏమాత్రం సరిపోయేటట్లుగా లేవు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి..బతుకులు దుర్భరం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలస వస్తున్న ఆదివాసీలు మళ్లీ వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడక జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొంత మంది హైదరాబాద్, విజయవాడ, పొరుగు రాష్ట్రాలకు కూడా వలస వెళుతున్నారు. ఏజెంట్ల చేతిలో మోసానికి గురవుతునే ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 220కి పైగా వల స ఆదివాసీ(గొత్తికోయ)గ్రామాలు ఉన్నాయి. కానీ ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. భద్రాద్రి జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో, గుండాల, ఆళ్లపల్లి, పినసాక, కరకగూడెం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో నేటికి సరైన మౌలిక వసతులు లేవు. అటవీ ప్రాంతం నుండి మండల కేంద్రానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నేటికి కొనసాగుతూనే ఉంది. వాహనాలు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. ఎవరైన జబ్బు పడినా, గర్భీణీలకు నొప్పులు వచ్చినా ఇబ్బందులు పడాల్సిందే. పీహెచ్సీలకు తీసుకువస్తున్న గర్భిణులు మార్గమధ్యంలోనే ప్రసవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అధికారుల, రాజకీయ నాయకుల ప్రకటనలే తప్ప ఆచరణలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తున్నప్పటకీ, అటవీశాఖ చర్యలతో వారి అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులు లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యలపై దృష్టి సారించటం లేదు. తొలకరి వేళ.. భూమి పండగ ములకలపల్లి : ఆదివాసీలు సంప్రదాయ వేడుకల్లో భూమి పండగ అతిముఖ్యమైనది. భూముల్లో బంగారు పంటలు పండాలని కోరుకుంటూ ప్రతియేటా తొలకరిలో ఈ వేడుక నిర్వహిస్తారు. మూడు రోజులపాటు ఉత్సవం జరుపుతారు. చివరి రోజు సామూహిక భోజనాలు చేస్తారు. భూమి పండగకు సుమారు వారం రోజుల ముందు గ్రామంలో నవధాన్యాలు సేకరించి గ్రామదేవతకు(సుంకు పండగ) సమర్పిస్తారు. అనంతరం ఏరువాక సాగుతారు. తొలిరోజు గ్రామం లో నిత్యావసర సేకరించి పురుషులు గ్రామశివారులోకి వెళ్ళి వంటలు చేసి, అక్కడే భోజనం చేస్తారు. ఆసమయంలో గ్రామంలోని మహిళలు గ్రామదేవత గద్దెను ముగ్గులతో అలంకరించి, ముగ్గు మధ్యలో ‘కోడిగుడ్డు’ను ఉంచుతారు. మగవారు గ్రామంలో ప్రవేశించగా, మహిళలతో కలిసి బాణాలు, అంబులు ధరిస్తారు. పాటలు, ‘రేలా’ నృత్యాలు చేస్తూ, గ్రామపెద్దమహిళతో దేవత వద్ద వుంచిన కోటిగుడ్డును బాణంతో పగులగొట్టిస్తారు. అనంతరం పూజలు చేసి, రేలా నృత్యాలు చేస్తారు. రెండో రోజు గ్రామ దేవతకు బోనా లు సమర్పిస్తారు. మూడో రోజు బలిచ్చిన జీవాలను దేవుళ్లకు సమర్పిస్తారు. గ్రామస్తులందరూ సామూహిక భోజనా లు చేస్తారు. ఆఖరులో గద్దెవద్ద ఉంచిన నవధాన్యాల(ధాన్యం) ను ఇళ్లకు తీసుకెళ్ళి తమ విత్తనాల్లో కలిపి తమ సేద్యపు భూముల్లో చల్లుతారు. పంచాయతీగా కొండరెడ్ల గ్రామందమ్మపేట: మండల కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పూసుకుంట కొండరెడ్ల గిరిజన గ్రామం ఉంది. మొన్నటి వరకు అంకంపాలెం పంచాయతీ పరిధిలో ఉండేది. ఇక్కడికి రావాలంటే పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో ఉన్న రోడ్డు మార్గం ద్వారా నడిచిరావాలి. పంచాయతీల పునర్విభజనలో భాగంగా పూసుకుంట గ్రామాన్ని పంచాయతీగా చేశారు. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఆ గ్రామంలో ఇరవై ఏళ్ల క్రితం వరకు ఎక్కువ మందికి పెళ్లి కాలేదు. గ్రామంలో అందరూ బంధువులే కావడం, వరుసలు కలవకకపోవడం ఇందుకు కారణం. తర్వాత అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం, ఆంధ్రాలో విలీనమైన వేలేరుపాడు మండలం కొయిదా, కాచారం, పశ్చిమగోదావరి జిల్లాలోని పందిరిమామిడిగూడెం గ్రామాల కొండరెడ్లతో బంధుత్వాలు కలిసాక పూసుకుంటలో యువతీ, యువకులకు వివాహాలు జరుగుతున్నాయి. గ్రామానికి ఉమ్మడి ట్రాక్టర్, మ్యాజిక్ ఆటో పూసుకుంట కొండరెడ్లకు వ్యవసాయం చేసుకునేందుకు భద్రాచలం ఐటీడీఏ ఒక ట్రాక్టర్ ఇచ్చింది. ఎవరి పొలంలో నాటు అయితే వారే ఆ రోజు ట్రాక్టర్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. మరో టాటా మ్యాజిక్ ఆటోను ఇచ్చింది. వారం వారం దమ్మపేట సంతకు వెళ్లేందుకు, ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లటానికి దీన్ని వినియోగిస్తున్నారు. తీరనున్న రోడ్డు నిర్మాణ సమస్య ప్రధాన రహదారి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పూసుకుంట గ్రామం ఉంది. మధ్యలో మూడు పెద్ద వాగులను దాటాలి. వర్షాకాలంలో వర్షం వచ్చి వాగులు పొంగితే బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలే ఉండవు. ఆ రోడ్డు నిర్మాణానికి రెండు పర్యాయాలు ఐటీడీఏ నిధులు మంజూరు చేసింది. వాగుల్లో పెద్దపెద్ద పైపులు వేసి కల్వర్టు నిర్మాణాలు ప్రారంభించారు. తమ అనుమతులు లేవని అటవీశాఖ రోడ్డు కల్వర్టు పనులను అడ్డుకుంది. దీంతో రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. గతేడాది మార్చిలో మళ్లీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సర్వే చేయించింది. తాజాగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మధ్యలో వాగులపై వంతెనలు సైతం నిర్మాణం కానున్నా యి. ఈ పనులకు సంబంధించి టెండర్లు సైతం పూర్తి అయ్యాయి. అక్కడ కొండరెడ్ల గిరిజన యువత ఉపాధికి ఐటీడీఏ నిధులు వెచ్చిస్తోంది. తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అక్కడ యువకులకు ఐదు తేనెటీగల పెంపకం యూనిట్లను మంజూరు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. తేనెటీగల పెంపకంతో ఉపాధి తేనెటీగల పెంపకంతో మాకు కొంత ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీడీఏ చర్యలు తీసుకుంది. తేనె విక్రయాలు ద్వారా కొంత ఆదాయం పొందుతున్నాం. కొండరెడ్ల యువతీ, యువకుల అభివృద్ధికి ఐటీడీఏ ఇంకా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. –కొమ్మిరెడ్డి, పూసుకుంట -
రెండు టిప్పర్లు, పొక్లెయినర్ సీజ్
జూలూరుపాడు : మట్టి అక్రమ తవ్వకాలపై జూలూరుపాడు తహసీల్దార్ వి.సురేష్కుమార్ కొరడా ఝుళిపించారు. కాకర్ల రెవిన్యూ గ్రామంలోని పాలగుట్ట సమీపంలో శనివారం అర్థరాత్రి పొక్లెయినర్తో అక్రమంగా తవ్వకాలు జరుపుతూ టిప్పర్లతో మట్టిని తరలిస్తుండగా తహసీల్దార్ వి.సురేష్కుమార్, రెవిన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి అడ్డుకున్నారు. కాకర్ల రెవిన్యూ గ్రామంలో 82 సర్వే నంబర్లోగల ప్రభుత్వ సీలింగ్ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు పొక్లెయినర్తో మట్టి తవ్వి, చండ్రుగొండ మండలంలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి తరలిస్తున్నారు. ప్రభుత్వ సీలింగ్ భూమిలో సాగుతున్న ఈ అక్రమ తవ్వకాల విషయం తెలుసుకున్న తహసీల్దార్ అక్కడకు వెళ్లారు. తవ్వకాలను అడ్డుకున్నారు. పొక్లెయినర్, రెండు టిప్పర్లు స్వాధీనపర్చుకుని సీజ్ చేశారు. పొక్లెయినర్ను తరలించే అవకాశం లేకపోవడంతో దానిని కాకర్ల గ్రామంలో నిలిపేశారు. టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేయాలని ఎస్సై ఇళ్ల రాజేష్తో చెప్పారు. -
సరిహద్దుల్లో టెన్షన్ !
సాక్షి, కొత్తగూడెం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా గత 5నెలల కాలం లో మరింతగా కోలుకోలేని దెబ్బ తగిలింది. గత మార్చి 2న సరిహద్దులోని బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్ మొదలు ఇప్పటివరకు సరిహద్దు జిల్లాల్లో జరిగిన వరుస ఘటనల్లో సుమారు 70 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. వారి దాడుల్లో 30 మందికి పైగా హతమయ్యారు. ఇందులో భద్రతా సిబ్బం దితో పాటు కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇన్ఫార్మర్లు ఉన్నారు. మావోలకు, భద్రతా బలగాలకు మధ్య ఎడతెరిపి లేని పోరు నడుస్తుండడంతో ఏజెన్సీ ప్రాంతాలు తుపాకుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడు లు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తంగా మారింది. గిరిజన పల్లెల్లో ఎప్పుడేం జరుగుతుం దో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు వచ్చాయి. గత నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబాబాద్, మహా రాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, బస్తర్, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్ జిల్లాల్లో 5 రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు సరిహద్దుల్లోని చర్ల, వెంకటాపురం మండలాల్లో శబరి ఏరియా కమిటీ పేరుతో కరపత్రాలు విడుద ల చేస్తున్నారు. తాజాగా ఆదివారం ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా ఇర్మానార్ అడవుల్లో మావోయిస్టులకు డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డులు, ఎస్టీఎఫ్ బలగాలకు మధ్య సుమారు 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఉద్యమ చరిత్రలోనే భారీ నష్టం.. మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పార్టీకి ఈ సీజన్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. మార్చి 2న బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భద్రతా బలగాలు, మావోయిస్టుల దాడులు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తమైంది. గత ఏప్రిల్ నెల చివరి వారంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏకంగా 40 మంది మావోయిస్టులు మృతి చెందారు. తరువాత ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చర్ల ఏరియా కమాండర్ అరుణ్ మృతి చెందాడు. తడపలగుట్ట ఎన్కౌంటర్ తరువాత ఇప్పటివరకు మావోయిస్టులు ప్రతీకారంగా భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఇతరులను సుమారు 30 మందిని హతమార్చారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అయితే మావోయిస్టులపై పోరును కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దండకారణ్యంలో మావోయిస్టులపై పోరాడేందుకు భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను దింపింది. బెటాలియన్లలోని జవాన్లు 90శాతం పైగా 30 ఏళ్లలోపు యువకులే. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా గత ఏప్రిల్ 14న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బీజాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో పర్యటించారు. గ్రామస్వరాజ్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. మావోయిస్టులు జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపే దండకారణ్యంలో ప్రధాని పర్యటించడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. సత్యనారాయణపురం వద్ద కల్వర్టు పేల్చివేత గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా గత మే నెల 4వ తేదీన ఏజెన్సీలో బంద్ నిర్వహించిన మావోయిస్టులు చర్ల మండలం సత్యనారాయణపురం–ఆర్ కొత్తగూడెం మధ్య కల్వర్టు పేల్చివేశారు. అక్కడికి అర కిలోమీటరు దూరం లో సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంప్ ఉండగా కల్వర్టు పేల్చి మావోలు సవాల్ విసిరారు. మే 11న చర్ల బస్టాండ్ వద్ద ప్రెషర్ బాంబు విడిచి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు బాంబును గుర్తించి చెరువులో నిర్వీర్యం చేశారు. -
తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సినీనటి రేష్మా రాథోడ్
జూలూరుపాడు : మండలంలోని కొమ్ముగూడెంలో గిరిజన యువతులు, మహిళలు, ప్రజలు తీజ్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆదివారం జరుపుకున్నారు. తీజ్ వేడుకలను 9 రోజులుపాటు జరిగిన ఉత్సవాలు ఆదివారం ఆఖరి రోజు కావడంతో గిరిజన యువతులు, మహిళలు, పిల్లలు గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతర ం సింగభూపాలెం చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ పండగ సందర్భంగా 9 రోజులపాటు మహిళలు, యువతులు ఉపవాస దీక్షలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచెపై వెదురు బుట్టల్లో మట్టి, ఎరువు, గోధుములు, వేరుశనగ గింజలను వేసి నీళ్లు పోసి ప్రతి రోజు పెళ్లికాని యువతులు పూజలు నిర్వహించారు. తొమ్మిదో రోజు ఆదివారం మొలకలు వచ్చిన వెదురు బుట్టలతోపాటు ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన శివపార్వతుల ప్రతిమలను మోస్తూ యువతులు గ్రామంలో మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. యువకులు బాణా సంచా కాల్చడంతోపాటు, నృత్యాల చేస్తూ సందడి చేశారు. తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సినీనటి రేష్మా రాథోడ్ కొమ్ముగూడెం గ్రామంలో జరిగిన ఈ తీజ్ ఉత్సవాల్లో సినీనటి రేష్మా రాథోడ్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ ఆఫ్ ముంబాయి ఎల్. జీవన్లాల్ (ఐఆర్ఎస్)లు పాల్గొన్నారు. గిరిజన లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన తీజ్ ఉత్సవాలకు రేష్మా రాథోడ్, జీవన్లాల్లు రావడంతో వారికి లంబాడీ గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనస్వాగతం పలికారు. సినీనటి రేష్మా రాథోడ్తో కరచాలం చేసేందుకు, సెల్ఫీ ఫొటోలు దిగేందుకు మహిళలు, యువతీ, యువకులు, పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా జీవన్లాల్ తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ నాయక్, గిరిజన నాయకులు భూక్యా దేవిలాల్ నాయక్, భూక్యా బాలు నాయక్, శ్రీను చౌహాన్, బాలాజీ చౌహాన్, సురేష్, హాతిరామ్ పవార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీలను అవమానిస్తారా?
సాక్షి, కొత్తగూడెం : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను, ఉద్యమకారులను తీవ్రంగా అవమానిస్తోందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. గురువారం కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద పీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై మహాధర్నా నిర్వహించారు. తొలుత లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటోందని విమర్శించారు. గిరిజన రైతులను అవమానిస్తున్నారని, పోడు భూములకు పట్టాలు అడిగితే కేసీఆర్ సొంత ఆస్తిలో వాటా అడుగుతున్నట్లు భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించిన రైతులకు ఖమ్మంలో బేడీలు వేసి తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి పాలన చేస్తున్న కేసీఆర్ మగాడేనా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెబుతున్న కేసీఆర్ కుటుంం మాత్రమే బంగారంలా పదవులు అనుభవిస్తోందన్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడిన ఉద్యమకారులపై ఇప్పటికీ కేసులు ఎత్తేయకుండా హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్ తానే తెచ్చినట్లు భావించుకుంటున్నారని, కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తూ ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కుండువాలు కప్పుకున్నవారికి మాత్రమే పథకాలు వర్తింపజేస్తున్నారని అన్నారు. రెండు ట్రాక్టర్లు ఉన్నవారికే మూడో ట్రాక్టరు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్కు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసే సమయం ఉంటుంది కానీ.. ప్రజల సమస్యలు తెలుసుకునే తీరిక మాత్రం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు దిరిశాల భద్రయ్య, గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, మల్లు రమేష్, రాయల నాగేశ్వరరావు, మాలోత్ రాందాస్నాయక్, లకావత్ గిరిబాబు, హరిప్రియ, బాణోత్ పద్మావతి, లెనిన్, ధనుంజయ్నాయక్, ఏసుపాదం, దీపక్చౌదరి, సత్యనారాయణ చౌదరి, చెన్నకేశవరావు, దేవ్లానాయక్, ఓంప్రకాష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆటాడుకుందాం రా..!
భద్రాచలం : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థుల అభివృద్ధి కోసం మరో సరికొత్త కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుడుతున్నారు. గురుకుల సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఇది రూపుదిద్దుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గురుకులాల్లో 22 చోట్ల మినీ అకాడమీలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తగిన తర్ఫీదు ఇచ్చే క్రమంలో క్రీడా మినీ అకాడమీలను ఏర్పాటు చేస్తుండటం గిరిజన సంక్షేమ విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం. దీనిలో భాగంగా ఖమ్మం రీజియన్కు 3 చోట్ల మినీ క్రీడా అకాడమీలు మంజూరు కాగా, ఇవి భద్రాద్రి జిల్లాకే కేటాయించటం శుభ పరిణామం. భద్రాచలం, సుదిమళ్ల, కిన్నెరసాని గురుకులాలకు వీటిని మంజూరు చేశారు. భద్రాచలంలోని మినీ అకాడమీని సోమవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గురుకుల సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆ సంస్థ ఖమ్మం రీజియన్ కో ఆర్డినేటర్ ఎస్కే బురాన్ తెలిపారు. అకాడమీ ప్రారంభోత్సవాన్ని వేడుకగా జరిపేందుకు ఒక్కో చోట ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. భద్రాచలంలో ఆర్చరీ, సుదిమళ్లలో బాల్ బ్యాడ్మింటన్, కిన్నెరసాని గురుకులంలో వాలీబాల్ క్రీడలో తర్ఫీదు ఇచ్చేందుకు ఈ అకాడమీలు ఏర్పాటు కాబోతున్నాయి. చదువులతో పాటే క్రీడలు... గురుకులాల్లో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మినీ అకాడమీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థులకు చదువుతో పాటు, వారికి ఆసక్తి ఉన్న ఆటలో శిక్షణ ఇచ్చి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఈ అకాడమీల్లో తర్ఫీదు ఇస్తారు. ఇందకోసం ఆయా అకాడమీకి ఎంపిక చేసిన క్రీడాంశంలో నైపుణ్యం గల ఫిజికల్ డైరెక్టర్ను కేటాయిస్తారు. ఒక్కో అకాడమీలో 20 నుంచి 25 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 147 గురుకులాల నుంచి ఆయా క్రీడల్లో ఆసక్తి, రాణించే విద్యార్థులను ఎంపిక చేసి అకాడమీలకు పంపించేలా ఏర్పాట్లు చేశారు. అడ్మిషన్ పొందిన గురుకులంలోనే విద్యార్థి పేరు నమోదవుతుంది. అయితే ఆయా క్రీడకు సంబంధించిన అకాడమీ ఎక్కడ ఉంటే అక్కడికెళ్లి చదవాల్సి ఉంటుంది. గిరిజన విద్యార్థులకు ఎంతో మేలు... ఖమ్మం రీజియన్ పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు కలిపి 26 విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే భద్రాద్రి జిల్లాలోనే 21 విద్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం రీజియన్కు మంజూరైన 3 అకాడమీలను జిల్లాకు కేటాయించారు. జిల్లాలో ఇప్పటికే పాల్వంచ మండలం కిన్నెరసానిలో ఆర్చరీకి సంబంధించిన శిక్షణ అందుబాటులో ఉంది. ఇక్కడ తర్ఫీదు పొందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ప్రస్తుతం భద్రాచలం గురుకులంలో శాశ్వతంగా అకాడమీని ఏర్పాటు చేస్తుండటంతో తురుఫు ముక్కల్లాంటి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంది. గిరిజన విద్యార్థులకు దీంతో ఎంతో మేలు చేకూరనుంది. విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్కోడ్... గురుకులాల్లో మినీ అకాడమీలను ఏర్పాటు చేసు ్తన్న నేపథ్యంలో ఆయా చోట్ల ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డ్రెస్లను ఆయా గురుకులాలకు సరఫరా చేశారు. షూస్, ట్రాక్ షూ కూడా అందజేస్తారు. ఇందుకోసం ప్రతీ గురుకులానికి రూ. 50 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. భద్రాచలం వంటి పాఠశాలలకు బ్యాండ్ సెట్ అదనంగా సరఫరా చేశారు. విద్యార్థుల టూకే రన్.. గురుకులాల్లో మినీ అకాడమీలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో ఆదివారం విద్యార్థులు టూకే రన్ నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం నుంచి చర్ల రహదారి వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. -
‘పోడు’ పట్టాల పంపిణీ వైఎస్ ఘనతే
పర్ణశాల: ఏజెన్సీలో గిరిజనులు పోడుగొట్టి సాగు చేస్తున్న పదివేల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుం దని మాజీ ఎంపీ బలరామ్ నాయక్ అన్నారు. దుమ్ముగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రధాన హామీలైన దళితులకు మూడేకరాల భూమి, కేజీ టు పీజీ విద్యాతో పాటు మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ వంటివి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదాయం వచ్చే పథకాలైన మిషన్ భగీరథ, కాకతీయ వంటి వాటికే కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంతా అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం ఖాయ మని అన్నారు. తెలంగాణలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. సమావేశంలో డివిజన్ ఇన్చార్జ్ నల్లపు దుర్గాప్రసాద్, కృష్టార్టునరావు, లంక శ్రీనివాసరావు, బైరెడ్డి సీతారామారావు, ప్రసాద్, శ్రీలక్ష్మి, వేమనరెడ్డి, అప్పలరెడ్డి పాల్గొన్నారు. -
రెండోరోజు చావును తప్పించుకోలేకపోయిన లారీ డ్రైవర్
పినపాక : సారపాక నుంచి వరంగల్కు వెళ్తున్న లారీ, పినపాక మండలం ఐలాపుంర గ్రామం వద్ద బుధవారం బోల్తాపడింది. దానిని బయటకు తీసే ప్రయత్నంలో విద్యుదాఘాతంతో డ్రైవర్ కమలేష్(40) మృతి చెందాడు. ఈ లారీ, హర్యానాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఐలాపురం వద్ద మూల మలుపును గుర్తించని లారీ డ్రైవర్ నేరుగా లోయలోకి పోనివ్వడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కమలేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాద విషయం తెలుసుకున్న ఓనర్, గురువారం సాయంత్రానికి ప్రమాద స్థలానికి చేరుకున్నాడు. స్థానికుల సహాయంతో భద్రాద్రి పవర్ ప్లాంట్లో పనులు చేస్తున్న భారీ క్రేన్లను ఐలాపురం వద్దకు తీసుకొచ్చారు. వాటి సహాయంతో లోయలో బోల్తాపడిన లారీని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం రాత్రి క్రేన్కు కట్టిన రోప్(వైర్)ను లారీ డ్రైవర్ సరి చేస్తున్నాడు. ఈ క్రమంలో, ఏడూళ్లబయ్యారం 33-11 కేవీ విద్యుత్ సబ్స్ఠేషన్ నుంచి ఐలాపురంలోగల గురుకుల పాఠశాలకు వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ సరఫరా వెళ్తుంది. లారీ బోల్తాపడిన ప్రదేశంలోనే ఈ విద్యుత్ లైన్ ఉంది. ఇది గమనించని లారీ డ్రైవర్, క్రేన్ డ్రైవర్ రోప్తో బోల్తాపడిన లారీని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుకోకుండా 11 కేవీ విద్యుత్ లైన్కు విద్యుత్ సరఫరా కావడంతో క్రేన్కు కట్టిన రోప్(వైర్) విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్ సరఫరా జరిగి, రోప్ను పట్టుకున్న లారీ డ్రైవర్ కమలేష్కు షాక్ తగిలింది. మణుగూరు ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. ఇతనిది మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఏడూళ్లబయ్యారం పోలీసులు కేసు దర్యాపు చేస్తున్నారు. -
వీఆర్ఓ ఆత్మహత్యాయత్నం
పర్ణశాల భద్రాద్రి : మండలంలోని నారాయణరావుపేట వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న రేసు ఆదినారాయణ యాసిడ్ తాగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నాడనే కారణంతో తహసీల్దార్ హరిచంద్ నాలుగు రోజులు క్రితం మెమో ఇవ్వడంతో పాటు జీతం నిలిపివేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆదినారాయణ ఇంట్లో వున్న యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదినారాయణ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. తహసీల్దార్తో పాటు డీటీ, ఆర్ఐలు వేధించడం వల్లనే ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు, వీఆర్ఓల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ హరిచంద్ను వివరణ కోరగా ఆదినారాయణ ఒక్కడికే కాదు విధులు సరిగా నిర్వహించని ఏడుగురు వీఆర్ఓలకు మెమోలు ఇచ్చామన్నారు. ఎంత హెచ్చరించినా పద్ధతి మారకపోవడంతో మెమో ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు అతను మెమోను తీసుకోలేదన్నారు. వేధింపులకు గురిచేయడం అవాస్తవం అన్నారు. భద్రాచలంలో చికిత్స పొందుతున్న వీఆర్ఓ దగ్గరకు సిబ్బంది వెళ్లడంతో తహసీల్దార్ కార్యాలయం ఖాళీ అయింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
ఏడు రోజులు..ఏడు టీకాలు
అశ్వాపురం: మిషన్ ఇంద్రధనుస్సు అనే కార్యక్రమం ద్వారా చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేసే కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ అంతా సిద్ధం చేసింది. ఈరోజు (సోమవారం) నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్ల లోపు చిన్నారులకు టీకాలు వేస్తారు. అలాగే గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామస్వరాజ్ అభియాన్లో భాగంగా ఈ ఇంద్ర ధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పీహెచ్సీలు, సబ్సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి బుధవారం, శనివారం ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించి చిన్నారులు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. అవి వేయించుకోని వారికి, మధ్యలో ఆపివేసిన వారికి టీకాలు వేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మిషన్ ఇంద్రధనుస్సులో ఏడు వ్యాధులకు ఏడు రోజుల పాటు ఏడు రకాల టీకాలు వేయనున్నారు. జిల్లాలో నేటి నుంచి వారం రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ డాక్టర్ దయానందస్వామి నేతృత్వంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 23 పీహెచ్సీల పరిధిలో వ్యాక్సిన్లు సిద్ధం చేశారు. మిషన్ ఇంద్రధనుస్సు విజయవంతానికి జిల్లా స్థాయిలో శనివారమే టాస్క్ఫోర్స్ సమావేశం కూడా నిర్వహించారు. 1,498 మంది చిన్నారులు, 404 మంది గర్భిణులు.. మిషన్ ఇంద్రధనుస్సులో చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేసేందుకు జిల్లాలోని 23 మండలాల్లో 29 పీహెచ్సీల పరిధిలో 205 గ్రామపంచాయతీల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని వారిని, టీకాలు వేయించుకుంటూ మధ్యలో ఆపివేసిన చిన్నారులు 1,498 మంది ఉన్నట్లు నిర్ధారించారు. 404 మంది గర్భిణులకు టీకాలు వేయాల్సి ఉంటుందని తేల్చారు. మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో భాగంగా జిల్లా లోని అంగన్వాడీ కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. జిల్లాలో వలస గిరిజనులు అధికంగా ఉన్న మారుమూల గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ఇటుకబట్టీల వద్దకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వెళ్లి చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేస్తారు. వివిధ కారణాలతో ఈ విడతలో టీకాలు వేయించుకొని వారికి మరో రెండు విడతల్లో ఆగస్టు 16, సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం నిర్వహించనున్నారు. వేసే టీకాలు ఇవే.. గర్భిణులకు ధనుర్వాతం వ్యాధి రాకుండా టీటీ. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి రెండేళ్ల లోపు చిన్నారులకు పోలియో, కామెర్లు, తట్టు, రుబెల్లా, మెదడువాపు, క్షయ, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు బీసీజీ టీకాలు వేస్తారు. హెపటైటీస్–బీ, పోలియో, పెంటావాలెంట్, జేఈ, విటమిన్–ఏ టీకాలను వారం రోజుల పాటు వేస్తారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో నేటి నుంచి ఈ నెల 26 వరకు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని పీహెచ్సీల పరి«ధిలో వ్యాక్సిన్లు ఉంచాం. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ప్రోగ్రాం పర్యవేక్షణకు ఒక్కో రూట్కు ప్రోగ్రాం ఆఫీసర్ను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర స్థాయి కన్సల్టెంట్లు ప్రోగ్రాంను పరిశీలిస్తారు. లోతట్టు పల్లెలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు తెలిపాం. మొబైల్ వాహనం వినియోగంలోకి రానుంది. – డాక్టర్ నరేష్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి -
పోడు భూమి పోతోందని..
‘అమ్మ’ లేనిదే ఆ ‘బిడ్డ’ ఉండలేదు.. ‘తల్లి’ దూరమైతే ఏమాత్రం తట్టుకోలేదు... ఇక్కడ... ‘అమ్మ’ అంటే... భూమాత..! ‘బిడ్డ’ అంటే... రైతు..!! భూమాతను తనకు దూరం చేయడాన్ని ఆ బిడ్డ తట్టుకోలేకపోయాడు. తనకు, తన కుటుంబానికి సర్వస్వమైన ఆ భూమాతను లాక్కుంటుంటే సహించలేకపోయాడు. అడ్డుకోలేని అశక్తుడయ్యాడు. మనసు ముక్కలైంది. బతుకు లేదనుకున్నాడు. ప్రాణాలు తీసుకోబోయాడు. ఇల్లెందు: మండలంలోని రాఘబోయినగూడెం పంచాయతీ బోడియాతండా గ్రామానికి చెందిన పోడు రైతు కున్సోత్ చంద్రు, ఆత్మహత్యకు యత్నించాడు. సాగు భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండడాన్ని తట్టుకోలేకపోయాడు. భరించలేని మనోవేదనతో ఆ భూమి లోనే.. ఆ భూమాత ఒడిలోనే.. ఆ మట్టిలోనే ఐక్యమవుదామనుకున్నాడు. పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే ఇల్లెందు వైద్యశాలలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గత 20 ఏళ్ల క్రితం కున్సోతో చంద్రు, ఆయన కుమార్తె భద్రమ్మతో కలిసి బోడియాతండా సమీపంలో పది ఎకరాల పోడు నరికి సేద్యం చేపట్టాడు. 2006లో అటవీ హక్కుల చట్టం కింద ఇతడికి ప్రభుత్వం హక్కు పత్రం కూడా ఇచ్చింది. ఇటీవల రైతుబంధు పథకం కింద పది ఎకరాలకుగాను రూ.40వేలు కూడా వచ్చాయి. ఈ భూమిలో సేద్యం చేయరాదంటూ అతడిని అటవీశాఖ అధికారులు గత మూడేళ్లుగా అడ్డుకుంటున్నారు. మరో ముగ్గురు రైతులది కూడా ఇదే పరిస్థితి. ఈ నలుగురు రైతులు కలిసి కోర్టును ఆశ్రయించారు. ఉన్నతాధికారులకు సమస్యను విన్నవించారు. అటవీశాఖ అధికారులు ఆగలేదు. చంద్రు, మరో ముగ్గురు రైతులు, పదిమంది కూలీలతో తమ పోడు భూమిని సాగు చేసేందుకు శుక్రవారం వెళ్లారు. అప్పటికే రోళ్లపాడు సెక్షన్ ఆఫీసర్ భాగ్య, కుంటల, వేపలగడ్డ, కొల్లాపురం బీట్ ఆఫీసర్లు పాపయ్య, ఎల్.శ్రీను, గౌరమ్మ, సిబ్బంది కలిసి ఆ నలుగురు రైతుల భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఇటు రైతులు, అటు అధికారులు. వారి మధ్య వాగ్వివా దం జరిగింది. తన కళ్లెదుటే... తన భూమాతను (భూమిని) అధికారులు లాక్కోవడాన్ని చూస్తూ చంద్రు తట్టుకోలేకపోయాడు. పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. డాక్టర్ నాగశశికాంత్ ప్రాథమిక వైద్యం అందించి ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏమంటున్నారంటే.. చంద్రు ఆత్మహత్యాయత్నంపై ఫారెస్టు సెక్షన్ ఆఫీ సర్ భాగ్యను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘కుంటల సెక్షన్లోని బోడియాతండా సమీపంలోని భూమి లో మొక్కలు నాటేందుకు ముగ్గురు బీట్ ఆఫీసర్ల తో కలిసి శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లాము. మారణాయుధాలు చేబూనిన కొంతమంది అక్కడ? ప్లాంటేషన్ను తొలగించేందుకు యత్నించారు. మేము గట్టిగా ప్రశ్నించటంతో వారు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. అంతలోనే, తాను మందు తాగినట్టుగా చంద్రు కేకలు వేశాడు. ఆయనను అక్కడే ఉన్న కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు. -
విదేశీయుడి అనుమానాస్పద మృతి
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీలో ఫిన్లాండ్కు చెందిన స్టార్టప్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... ఐటీసీ పీఎస్పీడీలో నూతన యంత్రాలను అమర్చేందుకు వచ్చిన ఫిన్లాండ్కు చెందిన స్టార్టప్ ఇంజనీర్ విజో కలెవి కొర్హనన్(55), శుక్రవారం ఉదయం తనకు కేటాయించిన వసతి గదిలో మృతిచెందాడు. ఇతడు జూన్ 16నఆర్ఏటీఆర్ కన్సల్టెన్సీ నుంచి చెన్నైకి చెందిన వాలెట్ కంపెనీ తరఫున ఐటీసీ పీఎస్పీడీలో నూతన యంత్రాల అమర్చేందుకు వచ్చాడు. అతనికి ఐటీసీ పీఎస్పీడీలో బ్యాచిలర్ క్వార్టర్స్లో రూమ్ నెంబర్ 122ను అధికారులు కేటాయించారు. ఆయన రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం విధులు ముగించుకుని క్యాంటీన్లో డిన్నర్ చేసి రూమ్కు వెళ్లాడు. శుక్రవారం ఉదయం గది తలుపులు తీయలేదు. అక్కడి వర్కర్లు ఇచ్చిన సమాచారంతో వాలెట్ కంపెనీ ప్రతినిధులు వెళ్లారు. గది తలుపులు పగలగొట్టి చూసేసరికి మంచంపై విగతుడిగా పడున్నాడు. నోటి వెంట నురగు వస్తోంది. అతని మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ గదిని పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు, బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ పరిశీలించారు. మృతుడు విదేశీయుడవడంఓ ఎస్పీకి తెలిపారు. విదేశాంగ శాఖ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ అంబర్కిషోర్ ఝా సమాచారమిచ్చారు. మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. వాలెట్ కంపెనీ ఇంజనీర్ సంతోష్ తివారీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
తాలిపేరు.. వరద జోరు
చర్ల : సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్ట్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో గురువారం సాయంత్రం ప్రాజెక్ట్కు చెందిన 25 క్రషర్ గేట్లలో 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి ఉంచి 9234 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 74.00 మీటర్లు కాగా, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో 72.97 మీటర్ల వద్ద నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రాజెక్ట్ డీఈ తిరుపతి, జేఈ వెంకటేశ్వరావు ప్రాజెక్ట్ వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. -
అలజడి.. ఆందోళన
సాక్షి, కొత్తగూడెం: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ బహిష్కరణ అంశం తరువాత చోటుచేసుకున్న పరిణామాలు బుధవారం జిల్లాలోనూ కలకలం రేపింది. చివరకు జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం పట్టణాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. శ్రీరాముడి విషయమై ఇటీవల కత్తి మహేష్ అనే సినీ క్రిటిక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని వివాదం చెలరేగడంతో కత్తి మహేష్ను హైదరాబాద్ నగర బహిష్కరణ చేసి అతని సొంత జిల్లా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు తెలంగాణ పోలీసులు తరలించారు. ఈ క్రమంలో గత 6నెలల క్రితం పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో స్వామీజీని సైతం హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారు. ఈ క్రమంలో పరిపూర్ణానంద స్వామిని కాకినాడకు తరలించేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నించగా, స్వామి మాత్రం భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునంటానని కోరారు. ఈ క్రమంలో పోలీసులు దారి మార్చి అశ్వారావుపేట మీదుగా నేరుగా కాకనాడకు స్వామీజీని తరలిస్తుండడంతో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. భద్రాచలం వంతెనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడంతో సమస్య ఏర్పడింది. దీంతో పోలీసులు ప్రభాకర్రెడ్డితో పాటు మరో 8 మంది నాయకులను అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేవలం హైదరాబాద్ నగర బహిష్కరణ మాత్రమే చేసిన పోలీసులు, స్వామీజీని భద్రాచలం పంపుతామని చెప్పి ఇలా దారిమళ్లించడం సరికాదని అన్నారు. ఇలా ఏకపక్షంగా రాష్ట్రం దాటించడం ఏమిటని ప్రశ్నించారు. -
హైవేపై దడ..దడ
దమ్మపేట: మండల పరిధిలోని గట్టుగూడెం వద్ద హైవేపై మంగళవారం ట్యాంకర్, కంటైనర్ ఢీకొన్న ఘటనతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్లు గాయాలతో బయట పడ్డారు. దమ్మపేట ఎస్సై జలకం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్ నుంచి గ్రానైట్ రాళ్లతో కాకినాడ వెళుతున్న లారీని ఎదురుగా వస్తున్న గుజరాత్కు చెందిన ట్యాంకర్ డ్రైవర్ ఓవర్టేక్ చేయబోయాడు. అదే సమయం లో హర్యానా నుంచి వైజాగ్ వెళ్తున్న కంటైనర్ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గ్రానైట్ లారీ, కంటైనర్లు ధ్వంసం అయ్యాయి. ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో గుజరాత్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్లు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సత్తుపల్లికి తరలించారు. అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.అబ్బయ్య పరిశీలించారు. ప్రమాదం కారణంగా హైవేపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సీఐ అబ్బయ్య, దమ్మపేట, అశ్వారావుపేట ఎస్సైలు ప్రవీణ్, వెంకటేశ్వరరావులు ట్రాఫిక్ను క్లీయర్ చేశారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రక్షణ.. కంటైనర్ను ఢీ కొట్టిన ట్యాంకర్లో ప్రమాదకర మైన మిథిలిన్ ఫ్లోరైడ్ బల్క్ కెమికల్ ఉంది. ప్రమాద సమయంలో అది ఏమాత్రం లీకేజీ అయినా పెద్దఎత్తున మంటలు చెలరేగే ప్రమాదముందని గుర్తించిన సీఐ అబ్బయ్య వెంటనే అశ్వారావుపేట అగ్నిమాపక శాఖ బాధ్యులు దేవనంది శ్రీనివాస్కు సమాచారం ఇచ్చారు. ఆయన సిబ్బందితో ప్రమాదస్థలానికి చేరుకుని దాదాపు ఆరుగంటలు శ్రమించి..అక్కడ ఎలాంటి మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించారు. అగ్నిమాపక సిబ్బంది వై.వెంకటేశ్వర్లు, జీ.శ్రీను, వీరబాబు, టి.చెన్నారావులు పాల్గొన్నారు. -
వానరం.. జర భద్రం!
భద్రాద్రి కొత్తగూడెం : ఏదైనా ప్రమాదం జరిగితే నోరు విప్పి చెప్పుకోలేవు.. ఈ చిత్రాలు చూడండి.. వామ్మో.. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే.. ప్రాణాలతో ఉంటాయా..? అసలే వర్షాకాలం.. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఎవరి ప్రాణాలైనా అంతే సంగతులు.. కొన్ని వానరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్ డిపోలోని ఓ షెడ్లోకి వచ్చాయి. అక్కడ విద్యుత్ స్విచ్ బాక్స్ శిథిలమై ఉంది.. కానీ దాన్ని గమనించక కోతులు స్తంభంపైకి ఎక్కుతూ కనిపించాయి.. బయటకు వచ్చి ఉన్న తీగలు ప్రమాదకరంగా ఉండడంతో వాటి నుండి తప్పించుకోడానికి నానా తిప్పలు పడ్డాయి. ఈ దృశ్యాలను ‘సాక్షి’కెమెరా క్లిక్ మనిపించింది.. -
వాననీటిలో సీతమ్మ విగ్రహం
పర్ణశాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల రామాలయం ఆవరణలోని ఉన్న కుటీరంలో సీతమ్మ వారి విగ్రహం చుట్టూ వర్షపునీరు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆనాటి రామాయణ వనవాస దృశ్యాలతో ఏర్పాటు చేసిన విగ్రహాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అక్కడ ఉన్న డ్రెయిన్లలో కూడా మురుగు పేరుకుపోయిందని, దీని వల్లే నీరంతా ఇలా విగ్రహాల చుట్టూ వచ్చి చేరుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మృత్యువు మింగేసింది
శుక్రవారం ఉదయం.కొత్తగూడెం రుద్రంపూర్లోని క్లబ్ ఏరియా క్వార్టర్ నంబర్ డి–226. ఆరేళ్ల ఆ బుడ్డోడు అటూ ఇటూ పరుగెత్తుతున్నాడు. తనను పట్టుకునేందుకు వస్తున్న తల్లికి అందకుండా తప్పించుకుంటున్నాడు. ముందు బుడ్డోడు.. వెనుక తల్లి. ఇద్దరూ కాసేపు పరుగెత్తే ఆట ఆడుకున్నారు. చివరికి వాడిని గట్టిగా పట్టేసుకుంది. ఆ బుడ్డోడు కిలకిలా నవ్వుతున్నాడు. వాడికి ముద్దులు కురిపిస్తూ బాత్రూంలోకి తీసుకెళ్లింది ఆ తల్లి. స్నానం ముగించింది. ఆ బుడ్డోడు ఇంకా నీటితో ఆడుతున్నాడు. రోజూ ఇది వాడికొక సరదా...! ఆ అల్లరిని చూస్తున్న అమ్మకు కూడా అదొక మురిపెం...!! ‘‘స్కూల్ టైమవుతుంటే ఆటలేంట్రా...’’ అంటూ, వాడికి గబగబా స్నానం చేయించింది. వాడి లేలేత బుగ్గలపై ముద్దులు పెట్టింది. ఒళ్లు తుడిచేందుకని దండెం తీగపై ఉన్న టవల్ను ఒక్కసారిగా లాగింది. ఆ తీగ తెగింది. వారిద్దరిపై పడింది. అంతే...దండెం తీగకు విద్యుత్ ప్రసారం దానికి తగలడంతో తల్లి, చిన్నారి మృతి సింగరేణి(కొత్తగూడెం): విద్యుదాఘాతంతో తల్లి, ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు... రుద్రంపూర్ క్లబ్ ఏరియాలోని క్వార్టర్ నెంబర్ డి–226లో హుస్సేన్, ఆయన భార్య నజీమ(35), ఆరేళ్ల కుమారుడు అర్హన్ నివసిస్తున్నారు. హుస్సేన్, గురువారం రాత్రి డ్యూటీకి వెళ్లారు. శుక్రవారం ఉదయం అర్హన్ను స్కూల్కు సిద్ధం చేసే ప్రయత్నంలో తల్లి నజీమ నిమగ్నమైంది. వాడికి స్నానం చేయించింది. బాత్రూం వద్దనున్న దండెం తీగపై ఉన్న టవల్ను ఒక్కసారిగా గట్టిగా లాగింది. దండెం తీగ తెగింది. వారిద్దరిపై పడింది. అప్పటికే ఆ దండెం తీగకు విద్యుత్ ప్రసరిస్తోంది. ఈ విషయం నజీమకు తెలియదు. ఆ తీగ తెగడం, కింద పడడం. వారిద్దరూ విద్యుదాఘాతంతో ప్రాణాలొదలడం... కొన్నంటే కొన్ని క్షణాల్లోనే దారుణం జరిగింది. నైట్ డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన హుస్సేన్కు... అక్కడి దృశ్యాన్ని చూడగానే.. ‘గుండె పగిలిపోతుందేమో..’ అన్నంతగా పెద్దపెట్టున ఏడ్చారు. ఆ దృశ్యం.. ఆ చుట్టుపక్కల వారికి కన్నీరు తెప్పించింది. ఎలా జరిగింది...? హుస్సేన్ ఇంటి పక్కనే 225 క్వార్టర్ ఉంది. ఆ ఇంటి పై కప్పు ఇనుప పైపులకు సీలింగ్ ఫ్యాన్ బిగించి ఉంది. బయటకు కనిపిస్తున్న ఆ ఇనుప పైపులకు దండెం తీగను ఒక చివరను హుస్సేన్ కుటుంబీకులు కట్టారు. ఇది, క్వార్టర్ వెనుక వైపున ఉంది. 225 క్వార్టర్లోని సీలింగ్ ఫ్యాన్ విద్యుత్ వైర్లు.. పైకప్పు ఇనుప పైపులకు తగలడంతో వాటికి విద్యుత్ ప్రసారమవుతోంది. ఆ పైపులకు కట్టి ఉన్న దండెం తీగకు విద్యుత్ ప్రసరిస్తోంది. ఆ తీగపై ఉన్న టవల్ను నజీమా గట్టిగా లాగడంతో అది తెగింది. వారిద్దపై పడింది. అప్పటికే ఆ చిన్నారి స్నానం చేసి ఉన్నాడు. తల్లి నజీమా కూడా తడి బట్టలతో ఉంది. విద్యుత్ ప్రసరిస్తున్న ఆ తీగ మీద పడడంతో వారిద్దరూ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ‘‘సింగరేణి అధికారులకు పెద్ద క్వార్టర్లు ఉన్నాయి. కార్మికులకు కేటాయించిన క్వార్టర్లు మాత్రం ఇరుకుగా ఉంటున్నాయి. దీంతో మరో (రేకుల) గదిని, వర్షపు నీరు లోపలికి రాకుండా దోణిని కార్మికులే నిర్మించుకుంటున్నారు. హుస్సేన్ పక్కనున్న క్వార్టర్ కార్మికుడు కూడా ఇలాగే చేశాడు. ఈ కాలనీలో ఇటీవల కోతుల బెడద ఎక్కువైంది. వాటి కారణంగా కూడా కేబుల్ ఇన్స్లేషన్ ఊడిపోతోంది. దీనిపై ఏరియా ఎలక్ట్రికల్ అధికారులు, సిబ్బంది స్పందించడం లేదు. సింగరేణివ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది’’ అని, ఈ కాలనీలోని కార్మికులు, వారి కుటుంబీకులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారుల పరిశీలన ప్రమాద స్థలాన్ని వర్క్షాప్ డీజీఎం (ఎలక్ట్రికల్) బీడీఎస్ ప్రసాద్, ఏజీఎం (పర్సనల్) పసుపలేటి శ్రీనివాస్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి.శ్రీనివాస్రావు, కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఎండి.రజాక్, చెరిపెల్లి నాగరాజు, టూ టౌన్ సీఐ చెన్నూరు శ్రీనివాస్ పరిశీలించారు. కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. హుస్సేన్ స్వగ్రామమైన ఇల్లందులో అంత్యక్రియలు జరిగాయి. విచారణకు రానున్న మైనింగ్ ఇన్స్పెక్టర్..? ఈ ప్రమాదంపై విచారణకు శవివారం డీడీఎంస్ (ఎలక్ట్రికల్) రుద్రంపూర్ రానున్నట్టు తెలిసింది. ప్రమాదానికి కారణాలను, కారకులను ఆయన గుర్తించనున్నట్టు సమాచారం. -
ముచ్చటగా మూడోసారి..!
ఇల్లెందు: న్యూడెమోక్రసీ (రాయల) వరంగల్ రీజియన్ కార్యదర్శి ఆవునూరి మధును పోలీసులు ముచ్చటగా మూడోసారి అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని విద్యానగర్ కాలనీలోగల ఎన్డీ కార్యాలయ సమీపంలో ఆయనను బుధవారం రాత్రి పోలీసులు గట్టుచప్పుడు కాకుండా పట్టుకెళ్లారు. ఆయన నిర్ణీత సమయానికి చేరాల్సిన చోటుకు చేరకపోవటంతో నాయకులు ఆరా తీశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలియడంతో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు లోనయ్యారు. ఆవునూరి నారాయణ స్వామి అలియాస్ మధును 2005, ఆగస్టు 6వ తేదీన ఇల్లెందు మండలం ముత్తారపుకట్టలో తొలిసారిగా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ శిక్షణ తరగతులలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన ఆయనను అప్పటి ఇల్లెందు సీఐ సర్వర్ పాషా అరెస్ట్ చేశారు. 2017, జూలై 25న మహబూబాబాద్ జిల్లా గార్ల పోలీసులు చాపల మార్కెట్లో మదును అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టవడం ఇది రెండోసారి. హైదరాబాద్లోని విద్యానగర్ కాలనీలోగల ఎన్డీ కార్యాలయ సమీపంలో 4వ తేదీ (బుధవారం రాత్రి) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టవడం.. ఏడాది లోపులో ఇది మూడోసారి. ఎన్డీ కీలక నాయకుడైన మధు అరెస్టుతో సహజంగానే ఆ పార్టీ శ్రేణులు ఒకింత కలవరపాటుకు లోనయ్యాయనే చెప్పొచ్చు. ఎవరీ మధు..? చిరు ప్రాయంలోనే అజ్ఞాతం వైపు అడుగులు వేసిన మధుది, ఇల్లెందు మండలం కొమురారం గ్రామం. అప్పటి అజ్ఞాత దళ నేతలు భాస్కరన్న, దొరన్న, ఎల్లన్న దళాల్లో సభ్యుడిగా పనిచేశారు. కొత్తగూడెం డివిజన్ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఖమ్మం–వరంగల్ ఏరియా కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం, ఐదు జిల్లాలతో ఏర్పడిన రీజియన్ కమిటీకి కార్యదర్శిగా ఉన్నారు. హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను పరామర్శించేందుకుగాను హైదరాబాద్కు మధు చేరుకున్నారని సమాచారం. 20 కేసులు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మధుపై ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. 1993లో కాచనపల్లిలో పూనెం పాపయ్యపై దాడి, 1997లో కాశన్న దళంపై గుండాల మండలం దేవాళ్లగూడెం వద్ద దాడి, 2001లో కాచనపల్లిలో రంగయ్యపై దాడి, 2002లో గుండాల మండలంలో రోళ్లగడ్డ వద్ద పోలీసులపై దాడి, 2004లో తొమ్మిదోమైలు తండా వద్ద టీడీపీ కార్యకర్తపై దాడి, 2004లో టీఆర్ఎస్, మావోయిస్టు పార్టీ కార్యకర్తలపై దాడి ఘటనల్లో మధు ముద్దాయిగా ఉన్నారు. అగ్ర నేతలంతా బయటే... న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ అగ్ర నేతలంతా అరెస్టయి బయటనే తిరుగుతున్నారు. వీరిలో ఆవునూరి నారాయణస్వామి(మధు), దనసరి సమ్మయ్య(గోపి), పూనెం లింగయ్య(లింగన్న) ఉన్నారు. 2017 జులై 25న మధును గార్లలో, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి దనసరి సమ్మయ్య(గోపి)ను నవంబర్ 30న మహబూ బాబాద్లో, పూనెం లింగయ్య (లింగన్న)ను సెప్టెంబర్ 7న మండల కేంద్రమైన రఘునాథపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలింది చోటామోటా నాయకులే.. ఎన్డీ రాయల వర్గం అజ్ఞాత నాయకుల్లో అగ్ర నేతలంతా అరెస్టయ్యారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నది చోటామోటా నాయకులే. బయ్యారం ఏరియాలో నవీన్, ఇల్లెందు ఏరియాలో రమేషన్న, గుండాల ఏరియాలో యాకన్న, ఆళ్లపల్లి– బంగారుచెల్క ఏరియాలో ఆజాద్ ఉన్నారు. -
ఇంటి స్థలం కోసం మాజీ నక్సలైట్ దీక్ష
మణుగూరురూరల్ : తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని అప్పగించాలని కోరుతూ మాజీ నక్సలైట్ ఈట్ల పుష్పకుమారి స్థానిక అంబెడ్కర్ సెంటర్లో దీక్ష ప్రారంభించారు. మంగళవారం రెండో రోజు ఆమె దీక్షకు పలు రాజకీయపార్టీల నేతలు మద్దుతు తెలిపారు. మూడు సంవత్సరాలు నక్సల్స్ గ్రూప్లో దళ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త నవీన్ సైతం అదే దళంలో పనిచేసి మృతి చెందాడు. ఆరోగ్య సరిగాలేని పుష్పకుమారి ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఆమె లొంగిపోయిన సమయంలో మణుగూరు మండల కేంద్రంలోని రాజీవ్గాంధీనగర్ ప్రాంతంలోని 138 సర్వే నంబర్లో 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయించారు. ఆమె అక్కడ ఇల్లు నిర్మిచుకోకపోవడంతో స్థానికులు కొందరు అక్కడ సమ్మక్క ఆలయం ఏర్పాటు చేశారు. బాధితురాలు అనేక మార్లు కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఈ దీక్షలు కొనసాగిస్తానని బాధితురాలు తెలిపారు. పుష్పకుమారి చేపట్టిన దీక్షకు మణుగూరు మండలంలోని సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు సంఘీభావం తెలిపారు. పుష్ఫకుమారికి న్యాయం జరిగేవరకు తాము అండగా నిలుస్తామన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో సీపీఎం నాయకులు కాటిబోయిన నాగేశ్వరరావు, నెల్లూరి నాగేశ్వరరావు, బండి రాజేష్, నైనారు నాగేశ్వరరావు, వంకాల రాజు, నర్సింహారావు, ఎన్డీ నాయకుడు ఆర్ మధుసూదన్రెడ్డిలు ఉన్నారు.