BJYM Leaders Protest At TSPSC Office In Hyderabad - Sakshi
Sakshi News home page

తీవ్ర ఉద్రిక్తత: టీఎస్‌పీఎస్సీలోకి చొచ్చుకెళ్లిన బీజేవైఎం కార్యకర్తలు

Mar 14 2023 1:21 PM | Updated on Mar 14 2023 4:48 PM

Bjym Workers Protest At Tspsc Office Hyderabad - Sakshi

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయాన్ని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు.

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయాన్ని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను సస్సెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిన్‌ బోర్డును ధ్వంసం చేసిన బీజేవైఎం కార్యకర్తలు.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పేపర్‌ లీక్ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌​ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


చదవండి: TSPSC: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్‌ ఫోన్‌లో మహిళల అసభ్య ఫోటోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement