CM KCR Inaugurated New Collectorate Building in Mahbubnagar - Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తీసుకువచ్చిందే’

Published Sun, Dec 4 2022 3:03 PM | Last Updated on Sun, Dec 4 2022 3:55 PM

CM KCR Inaugurated Mahbubnagar Collectorate Building - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో​ ఉన్నారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పాలమూరులో కొత్త కలెక్టరేట్‌ భవనం ప్రారంభించుకోవడం సంతోషం. వేదనలు, రోదనలతో బాధపడిన పాలమూరు జిల్లా నేడు సంతోషంగా ఉంది. ఏ తెలంగాణ కోసమైతే పోరాటం చేశామో ఆ దిశగా ముందుకు వెళ్తున్నాము. సంక్షేమ పథకాల్లో తెలంగాణ టాప్‌ ప్లేస్‌లో ఉంది. గురుకులాలను ఇంకా పెంచుతాము. చాలా కష్టపడి కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చాము. కంటివెలుగు ఓట్ల కోసం తెచ్చింది కాదు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తీసుకువచ్చిందే. తెలంగాణలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు మేలు జరగాలనే చేస్తున్నాము. సంస్కరణ అనేది అంతం కాదు.  ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్‌ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు పెడుతున్నాము. గతంతో భయంకరమైన కరెంట్‌ బాధలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement