15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు | Half Day Schools 2024 In Telangana From March 15th, Details Inside - Sakshi

Telangana Half Day Schools 2024: 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

Mar 7 2024 2:11 PM | Updated on Mar 7 2024 3:04 PM

Half Day Schools In Telangana From March 15 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో మార్చి15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాలల వేళలు నిర్ణయించింది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement