![Hyderabad Traffic Challan Discount Offer to End on April 15 - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/13/Traffic_Challan.jpg.webp?itok=OH6KYK8e)
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– లోక్ అదాలత్ గడువుకు మిగిలింది మూడ్రోజులేనని మంగళవారం ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారంతో ఇది ముగుస్తుందని, మళ్లీ పొడిగింపునకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. గత నెల 1న మొదలై ఈ– లోక్ అదాలత్ 31తో ముగియాల్సి ఉంది. వాహన చోదకుల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో పదిహేను రోజులు పొడిగించారు. శుక్రవారం తర్వాత దీని పొడిగింపు ఉండదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగనాథ్ కోరారు.
తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు భారీ తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీని గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. (క్లిక్: కింగ్కోఠి ప్యాలెస్పై రగడ)
Comments
Please login to add a commentAdd a comment