
కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దర్గా దర్శనానికి వెళ్లిన నలుగురు మంజీరా నదిలో గల్లంతయ్యారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్గా దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వారిలో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి నదిలో గల్లందయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా.. అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment