manjeera river
-
మంజీర నదిపై భారీ వంతెన నిర్మాణం.. కానీ..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్యన దూరభారాన్ని తగ్గించేందుకు రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టిన మంజీర నదిపై భారీ వంతెన, కామారెడ్డి జిల్లాలో రెండు వరుసల రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ మెదక్ జిల్లా పరిధిలో (వంతెన అవతల) రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ రోడ్డు అందుబాటులోకి కానీ 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. ఇరు జిల్లాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. 2015లో వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని తాండూర్ గేట్ నుంచి తాండూరు, వెంకంపల్లి మీదుగా వంతెన వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.21 కోట్లు మంజూరు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు కోర్టుకు వెళ్లడంతో కొంత కాలం పనులు జరగలేదు. పరిహారం ఇచ్చిన తరువాత పనులు చేపట్టారు. అటవీ వివాదంతో కొద్దిమేర పనులు ఆగిపోయినా మిగతా పనులు దాదాపు పూర్తయ్యాయి. మంజీర మీద భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. కానీ వంతెన అవతల రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి నిత్యం ఎంతో మంది వెళుతుంటారు. రోడ్డు అందుబాటులోకి వస్తే రాకపోకలు సులువవుతాయి. తగ్గే దూరం 40 కిలోమీటర్లు.. కామారెడ్డి జిల్లా వాసులు ముఖ్యంగా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట తదితర మండలాల ప్రజలు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలానికి వెళ్లాలంటే మెదక్ మీదుగా దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అయితే తాండూర్ గేట్ నుంచి తాండూర్, వెంకంపల్లి మీదుగా మంజీరపై నిర్మించిన వంతెన ద్వారా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేటకు వెళ్లడానికి కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. అంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. మంజీర మీద వంతెన లేక ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడు వంతెన పూర్తయ్యింది. కానీ మెదక్ జిల్లాలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. (క్లిక్: హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!) నిధులు మంజూరైతేనే... మంజీర వంతెన నుంచి మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేట వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఫార్మేషన్ రోడ్డు కూడా లేదు. పొలాల మధ్య నుంచి బండ్లబాట ఉంది. రోడ్డు నిర్మాణానికి ముందుగా రైతుల నుంచి భూసేకరణ జరపాలి. ఆ తర్వాత రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం కోసం మెదక్ జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. (క్లిక్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?) రూ.33 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం.... కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్య దూరం మధ్య దూరం తగ్గించే రహదారిని పూర్తి చేయాలని జెడ్పీ మీటింగుల్లో ప్రతిసారీ అడుగుతున్నాం. ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించాం. అయినా ప్రయోజనం లేదు. రూ.33 కోట్లతో వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తయినా, మెదక్ జిల్లాలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యానికి పర్యాటకులు పెరుగుతారు. – యు.మనోహర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, నాగిరెడ్డిపేట -
ఉప్పొంగిన గోదారి.. ఉధృతంగా మంజీర
బోధన్: భారీ వర్షాలతో గోదావరి, మంజీర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వానలతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం కందకుర్తి వద్ద వంతెన పైనుం చి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతాల మధ్య రాకపోకలు, నిలిచిపోయాయి. గోదావరి నది ఒడ్డున ఉన్న సీతారామ ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది. కందకుర్తి గోదావరి నదికి దిగువ ప్రాంతంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల రెంజల్ మండలంలోని కందకుర్తి, నీలా, బోర్గాం, తాడ్బిలోలి గ్రామాల శివారులోని సుమారు 4 వేల ఎకరాలకుపైగా సోయా, ఇతర పంటలు నీటి మునిగాయని స్థానిక రైతులు అంటున్నారు. పోటెత్తిన మంజీర..: మంజీర నదిలో వరదనీరు పోటెత్తి ప్రవహిస్తోంది. కౌలాస్నాలా, నిజాంసాగర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద నీరు, వాగుల నుంచి చేరిన నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గావ్ గ్రామాల శివారులోని వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. హంగర్గ చుట్టూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చేరింది. సుమారు వెయ్యి ఎకరాల పంట వరద నీటిలో మునిగి ఉందని రైతులు తెలిపారు. ఆర్డీవో రాజేశ్వర్ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రమాద హెచ్చరిక జారీ ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం గోదావరి నీటి మట్టం 8.54 మీటర్లకు చేరడంతో కేంద్ర జలవనరుల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో నీరు గంటకు పది పాయింట్లు పెరుగుతూ వస్తోంది. రెండో ప్రమాద హెచ్చరిక 9.54 మీటర్ల వద్ద జారీ చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక డేంజర్ లెవల్ 11.04కు చేరితే లోతట్టు గ్రామాలను ఖాళీ చేయిస్తారు. -
కామారెడ్డి జిల్లా: మంజీరాలో ముగ్గురు గల్లంతు
-
కామారెడ్డిలో విషాదం: మంజీరాలో ముగ్గురు గల్లంతు
కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దర్గా దర్శనానికి వెళ్లిన నలుగురు మంజీరా నదిలో గల్లంతయ్యారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్గా దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వారిలో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి నదిలో గల్లందయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా.. అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: ఈ ఐదక్షరాల శాసనం వయసు 2,200 ఏళ్లు -
అరుణ మృతదేహం లభ్యం; రైతుల ఆవేదన
సాక్షి, మనూరు(నారాయణఖేడ్): నాలుగు రోజుల క్రితం తాను మంజీరా నదిలో దూకి చనిపోతున్నాని సంగారెడ్డి రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్న అరుణ(34) తన కుటుంబీకులకు తెలిపిన సంగతి తెలిసిందే. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసు యంత్రాంగం నదిలో ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని శనివారం సాయంత్రం రప్పించి నదిలో వెతకడం ప్రారంభించగా ఆదివారం ఉదయం రెండు బృందాలతో నదిలో దిగువ, ఎగువ ప్రాంతంలో ప్రత్యేక బోటుల ద్వారా గాలించారు. దీంతో రాయిపల్లి వంతెన వద్ద ఎగువన సిరూర్, పాంపడ్ శివారులో తేలిన మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురావడంతో నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి శవాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అంత్యక్రియలు వారి స్వస్థలమైన నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. మృతురాలి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, ఖేడ్ సీఐ రవీందర్రెడ్డి, ఎస్ఐ నరేందర్లు పేర్కొన్నారు. గాలింపు చర్యల్లో రాయికోడ్, నాగల్గిద్ద ఎస్ఐలు ఏడుకొండలు, శేఖర్లు మూడురోజులగా పాల్గొని పర్యవేక్షించారు. చదవండి: మంజీరలో ఏఓ గల్లంతు? కుటుంబ సభ్యుల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులే కారణం మృతికి గల కారణం ఆమె కుటుంసభ్యుల వేధింపులేనని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చే శారు. గత కొన్నాళ్లుగా అరుణ భర్త హోటల్ బిజినెస్లు నిర్వహించి నష్టపోవడంతో అరుణ బ్యాంకు నుంచి హౌసింగ్ లోన్ సైతం తీసుకోవడం జరిగిందన్నారు. అయినా కూడా భర్త శివశంకర్తోపాటు కుటుంబీకుల వేధింపులు భరించకపోవడంతో ఇలాంటి సంఘటనకు ఒడికట్టిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఆవేదన వ్యక్తం చేసిన ఖేడ్ ప్రాంత రైతులు.. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో అరుణ గతంలో వ్యవసాయ అధికారిగా పనిచెయ్యడంతో ఇక్కడి రైతులతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎళ్లవేళలా రైతలుకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం ఖేడ్లోని ప్రగతి విద్యానిలయం పాఠశాలల్లో జరిగింది. ఎంసెట్ రాసి అగ్రికల్చర్ బీఎస్సీ హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో చేసిన అనంతరం 2009లో జోగిపేట్లో ఏఈఓగా 2010లో ఏఓగా కల్హేర్ పోస్టింగ్ రాగా కంగ్టి, మనూరు మండలాల ఇన్చార్జిలుగా వ్యవహరించడం జరిగింది. 2018లో సంగారెడ్డికి వెళ్లి అక్కడ రైతు శిక్షణ కేంద్రంలో విధులను నిర్వహించారు. ఏఓ కుటుంబ సభ్యులకు పరామర్శ నారాయణఖేడ్: మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న రైతు శిక్షణా కేంద్రం ఏఓ అరుణ కుటుంబ సభ్యులను జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ నర్సింహారావు, వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు వైద్యనాథ్, వ్యవసాయ సిబ్బంది, ఆమ్ఆద్మీ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బోర్గి సంజీవులు పరామర్శించి ఓదార్చారు. అభినందించిన డీఎస్పీ రాయికోడ్(అందోల్): మండల శివారులోని మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఓ అరుణ మృతదేహాన్ని ఆదివారం మండలంలోని పాంపాడ్ శివారులో గుర్తించి ఒడ్డుకు తెచ్చారు. మృతదేహం కోసం గత నాలుగు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో సాహసంగా కృషి చేసిన స్థానిక మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్, తెలంగాణ టూరిజం శాఖ, అగ్నిమాపక తదితర శాఖల సిబ్బందిని జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజ్ శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రయ్య, బాసిత్ పటేల్, ఆయా శాఖల సిబ్బంది, మత్స్యకారులు ఉన్నారు. -
మంజీరలో ఏఓ గల్లంతు?
మనూరు(నారాయణఖేడ్): సంగారెడ్డిలోని రైతు శిక్షణకేంద్రంలో అరుణ(34) ఏఓగా పనిచేస్తోంది. గురువారం సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్కు వస్తున్న క్రమంలో మనూరు మండలం రాయిపల్లి వద్ద మంజీరలోకి దూకి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు నారాయణఖేడ్ మండలం పైడిపల్లిలోని వరుసకు తమ్ముడైన పవన్కు ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు వంతెన వద్దకు చేరుకున్నారు. వంతెనవద్ద ఉన్న టీఎస్15 ఈడీ0403 కారులో యువతి హ్యండ్బ్యాగు, చెప్పులు ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున ఎస్ఐ నరేందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో చుట్టుపక్కలవారితో విచారించారు. ఆమె కోసం నదిలో గాలింపు చేపట్టారు. యువతి ఆచూకీ లభించకపోవడంతో తమ్ముడు శేరి శివకుమార్ ఫిర్యాదుమేరకు గల్లంతు కేసుగా నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు. కాగా సంఘటన స్థలానికి ఖేడ్ సీఐ రవీందర్రెడ్డి, రాయికోడ్ ఎస్ఐ ఏడుకొండలు చేరుకుని వివరాలు అడిగితెలుసుకున్నారు. అలుముకున్న విషాదఛాయలు అరుణ గల్లంతుతో ఖేడ్లో విశాద ఛాయలు అలుముకున్నాయి. ఈమె గతంలో మనూరు, నారాయణఖేడ్, కల్హేర్ ఏఓగా పనిచేసింది. 2016లో మోర్గికి చెందిన శివశంకర్తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు రుద్రవీర్, 11 నెలల విరాట్ ఉన్నారు. -
మంజీరలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు
సాక్షి, మెదక్: జిల్లాలోని కొల్చారం మండలం పోతాంశెట్టిపల్లి శివారులో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం మంజీరా ప్రవాహంలో నలుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. చేపలు పట్టడానికి మంజీరా నదిలోకి వెళ్లిన వారంతా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఎగువ నుంచి నీళ్లు వదలడంతో ఈ నలుగురు ఉన్న గడ్డ ప్రాంతం చుట్టు పక్కల ఒక్కసారిగా భారీ స్థాయిలో నీరు చేరింది. భారీగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్నవారు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందిచారు. దీంతో మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు మెదక్, కిష్టాపూర్ నుంచి గజ ఈతగాళ్లను పిలిపించారు. సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మంజీర నదిలో చిక్కుకున్న వారిని కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుంపలు ఎల్లం, సాదుల యాదగిరి, మెదక్ పట్టణానికి చెందిన ఆర్నె కైలాఫ్, రాజబోయిన నాగయ్యగా పోలీసులు గుర్తించారు. -
ఈ ఐదక్షరాల శాసనం వయసు 2,200 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్ : ఇదో శాసనం.. శాసనమంటే వాక్యాల సమాహారం కాదు, కేవలం ఐదక్షరాల పదం. ఆ పదానికి స్పష్టమైన అర్థం వెతకాల్సి ఉంది. అది చెక్కింది నిన్న మొన్న కాదు, దాదాపు 2,200 ఏళ్ల క్రితం. అంటే.. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దమన్నమాట. ఇది ఇంతకాలం ఓ గుండుపై అనామకంగా ఎదురుచూస్తూ ఉంది. మరి ఆ మాటకు స్పష్టమైన అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. అసలు అది మన తెలుగు భాష, లిపి కాదు. అచ్చమైన ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపిలో లిఖించి ఉంది. అది కూడా అప్పుడప్పుడే శాతవాహన యుగం మొదలవుతున్న తరంనాటిది. అంటే.. అశోకుడి హయాంలో వాడిన లిపిలో ఉండటమే దీనికి తార్కాణం. వెరసి తెలంగాణ లో ఇప్పటివరకు వెలుగు చూసిన శాసనాల్లో ఇదే అతిపురాతనమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం కృష్ణా, గోదావరి నదుల తీరాల్లో శాసనాలు ఎన్నో వెలుగుచూడగా, ఇది మంజీరా పరీవాహక ప్రాంతంలో బయటపడటం గమనార్హం. మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో... కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులో ఈ అపురూప లఘు శాసనం తాజాగా వెలుగుచూసింది. ఆదిమానవుల జాడ మొదలు ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా ఉన్న ఈ గ్రామంలో ఇంత పురాతన చెక్కడం బయటపడటం విశేషం. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలతోపాటు బౌద్ధ ఆధారాలున్న ధూళికట్ట, కొండాపూర్, బోధన్ తదితర ప్రాంతాల్లో క్రీ.శ. ఒకటో శతాబ్దానికి చెం దిన శాసనాలు గతంలో వెలుగు చూసిన విష యం తెలిసిందే. కానీ, అంతకు కనీసం 200 ఏళ్ల పూర్వం నాటి శాసనం ఇప్పుడు ఇక్కడ బయటపడింది. మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో పెద్ద బండరాయిపై ఈ అక్షరాలు చెక్కి ఉన్నాయి. ‘మాధవచంద’ అంటే.. ‘‘తెలుగులో ఈ శాసనం అర్థం ‘మాధవచంద’. ఇది వ్యక్తి పేరో, ప్రాంతం పేరో, వీటికి సంబం ధంలేని మరే అర్థమో అయి ఉండవచ్చు. దాని పై ఇంకా స్పష్టత లేదు. ఆ ఒక్క పదమే ఇక్కడ ఎందుకు చెక్కి ఉందో కనుగొనాల్సి ఉంది. ఎన్నో చారిత్రక ఆధారాలకు నెలవుగా ఉన్న ఆ గ్రామంలో దీనిపై మరింత పరిశోధన జరిపితే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కానీ, తొలి శాతవాహన కాలం నాటి గుర్తులు ఇక్కడ ఉన్నాయనేది ఈ శాసనంతో స్పష్టమైంది’’అని ఆ శాసనాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు ఎం.ఎ.శ్రీనివాసన్ పేర్కొ న్నారు. సర్వేయర్గా ఉంటూ చరిత్ర పరిశోధనలో ఆసక్తి చూపుతున్న శంకర్రెడ్డి దీన్ని తొలుత గుర్తించారు. హెరిటేజ్ తెలంగాణ విశ్రాంత అధికారి వై.భానుమూర్తితో కలసి తాను పరిశీలించినట్టు వెల్లడించారు. ఆ అక్ష రాల నిగ్గు తేల్చేందుకు తాను సంప్రదించగా, అవి తొలి శాతవాహన కాలం నాటి లిపితో ఉన్నాయని ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం సంచాలకులు పేర్కొన్నట్టు శ్రీనివాసన్ వెల్లడించారు. -
మంజీరకు జలకళ
సాక్షి, బోధన్ (నిజామాబాద్): బోధన్ మండలంలోని సాలూర శివారులో గల మంజీర నదిలో జలకళ సంతరించుకుంది. రెండు, మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో మంగళవారం సాలూర శివారులోని పాత బ్రిడ్జ్ ఎత్తు వరకు నదిలో నీరు ప్రవహించింది. వరద నీటితో మంజీరకు జలకళ సంతరించుకోవడంతో మంజీర బ్రిడ్జ్ పై నుంచి బోధన్, మహారాష్ట్ర కు ప్రయాణాలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు కొద్దిసేపు ఆగి జల ప్రవాహాన్ని వీక్షిస్తున్నారు. యువత సెల్ఫీలు తీసుకుంటు సందడి చేస్తున్నారు. ఈ జల ప్రవాహంతో దిగువ ప్రాంతం రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తేలిన శివాలయం, గోదావరికి తగ్గుతున్న వరద ఉధృతి రెంజల్ : రెండు రోజులు నిలకడగా సాగిన గోదావరి నదిలో వరద ఉధృతి మంగళవారం తగ్గింది. రెండు రోజుల కిందట కందకుర్తి పుష్కరక్షేత్రంలోని నదిలో గల పురాతన శివాలయం ముందు గల నంది విగ్రహం పూర్తిగా వరద నీటితో మునగగా మంగళవారం పూర్తిగా వరద నీరు తగ్గింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది వరద నీటితో పరవళ్లు తొక్కింది. వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టడంతో నదిలో నీటి ప్రవాహం తగ్గింది. ఎగువన గల మహారాష్ట్రతో పాటు మంజీర, హరిద్ర నదుల నుంచి నీరు కిందికి చేరుతుంది. -
ధార లేని మంజీర
సాక్షి, నారాయణఖేడ్: జిల్లా జీవ నది మంజీర ఇంకా వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా నదిలో నీటి జాడలే లేవు. ఇప్పటికే నీటితో కళకళలాడాల్సిన నదిలోకి నీరు రాకపోవడంతో జిల్లావాసులు కలవర పడుతున్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా మంజీరా నదిలో ఆ జాడలు మాత్రం కానరావడం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నా దానికి ఉప నదిగా ఉన్న మంజీరలో మాత్రం నీరే లేదు. గత ఏడాది ఈ సమయం వరకే మంజీరా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఎండిపోయే కన్పిస్తోంది. కర్ణాటకలో నెల క్రితం కురిసిన భారీ వర్షంతో మంజీరా నదిలోకి వరద వచ్చింది. అప్పటికే వేసవి కాలంలో నది పూర్తిగా ఎండిపోయి ఉండడంతో వచ్చిన వరద నీరు కాస్త భూమిలోకి ఇంకిపోయింది. నది తిరిగి యథా పరిస్థితికి వచ్చి చేరింది. కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ప్రవహించే మంజీరా నది జిల్లాలోని నాగల్గిద్ద మండలం గౌడ్గాంజన్వాడ వద్ద ప్రవేశిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నది ప్రవేశ ప్రాంతం నుండి ఎక్కడా నీరు రాలేదు. కర్ణాటక రాష్ట్రంలో కురిసే భారీ వర్షాలు, వరదలతో నదిలోకి నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతంలో కూడా వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కర్ణాటకలో కురిసిన వర్షం వల్ల మంజీరాకు ఎగువన బీదర్ జిల్లా హుమ్నాబాద్ ప్రాంతంలో ఉన్న కరంజా ప్రాజెక్టులోకి కొంత నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నుండి నీటిని కిందకు వదలడం లేదు. కరంజా ప్రాజెక్టులోకి భారీగా వరదలు వచ్చి చేరినప్పుడే ఈ ప్రాజెక్టు నుండి దిగువకు వరద నీరు వదిలే అవకాశం ఉంది. అప్పుడే నదిలోకి నీరు వస్తుంది. మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.91టీఎంసీలు కాగా ఇప్పటివరకు ప్రాజెక్టులో ఉన్న నీరు 0.44 టీఎంసీలు మాత్రమే. తాగునీటికి కష్టకాలమే.. మంజీరాపై ఆధారపడి నారాయణఖేడ్తోపాటు జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల నీటి పథకాలు పని చేస్తున్నాయి. నదిలో నీరు లేని కారణంగా మూడు నెలలుగా నీటి పథకాలు వట్టిపోయాయి. రెండు నెలల క్రితం వరకు సింగూరు సమీపంలోని పెద్దారెడ్డిపేట్ నుండి నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, మెదక్ నియోజకవర్గాలకు కలిపి మిషన్ భగీరథ అధికారులు 953 గ్రామాలకు తాగునీటిని అందించారు. రెండు నెలలుగా ప్రాజెక్టులో చుక్కనీరు లేని కారణంగా నీటి పథకాలన్నీ వృథాగానే మారాయి. ఫలితంగా వందల గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. చాలా గ్రామాల్లో బోర్లను కిరాయికి తీసుకోవడం, ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు. ఈ నీరు కూడా గ్రామీణులకు అవసరమైన మేర సరిపోవడం లేదు. వృథాగా నీటి పథకాలు.. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీర నది నుండే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్ఏపీ పథకం ఫేజ్ 1 కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 40 గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లోని 66 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్టెక్ వెల్లు అన్నీ మంజీర నదిపైనే ఉన్నాయి. నది ఎండిపోవడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్ ఇస్తున్నాయి. జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్టెక్ వెల్లు కూడా మంజీర నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీరు ఎండిపోయింది. నది ఎండడంతో బోర్లు కూడా ఎండిపోయి గ్యాప్ ఇస్తున్నాయి. -
‘హరీశ్ పాపం.. కేసీఆర్కు శాపం’
సాక్షి, సంగారెడ్డి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేటాయింపులు లేకున్నా మంజీర నీటిని శ్రీరాంసాగర్కు అక్రమంగా తరలించారని ఆరోపించారు. హరీశ్ చేసిన పాపానికి ప్రస్తుతం మంజీర నది ఎండిపోయిందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు అర్థరాత్రి మంజీరా నీళ్లను దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులు ఎండబెట్టారని విమర్శించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్.. సీఎం కేసీఆర్కు తెలియకుండానే నీళ్లను తరలించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడనే కారణంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేదన్నారు. నీటి తరలింపు విషయం కేసీఆర్కు తెలిస్తే ఆయన ఒప్పుకునే వారు కాదన్నారు. మంజీరను ఎండబెట్టి.. మిషన్ భగీరథ ద్వారా నీళ్లివ్వాలన్న కేసీఆర్ కోరికకు హరీశ్రావు తూట్లు పొడిచారని విమర్శించారు. హరీశ్రావు చేసిన పాపం మెదక్ జిల్లా ప్రజలకు, సీఎం కేసీఆర్కు శాపంగా మారిందన్నారు. గెలిస్తే ప్రశ్నిస్తాననే భయంతో నాడు తనను హరీశ్ జైల్లో పెట్టించారని ఆరోపించారు. హరీశ్రావు చేసిన తప్పుకు సంగారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి అవసరం కోసం సంగారెడ్డికి రూ.10 కోట్లు తక్షణమే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
సింగూరుకు ఇక సెలవు..!
సాక్షి, హైదరాబాద్: గోదావరి రింగ్మెయిన్–3 పనుల పూర్తితో గ్రేటర్ హైదరాబాద్కు సింగూరు, మంజీరా జలాశయాల నీటితరలింపునకు శాశ్వతంగా సెలవు ప్రకటించాల్సిందేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర శివార్లలోని ఘన్పూర్ నుంచి పటాన్చెరు వరకు 43 కి.మీ. మార్గంలో రింగ్మెయిన్ పనులు పూర్తికావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెదక్, నర్సాపూర్ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి కావడంతో అక్కడి తాగునీటి అవసరాలకు నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరమవుతుందని, గ్రేటర్ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలు మినహా ఇతర ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అధికారులు, రాజకీయ నేతల నుంచి ఒత్తిడులు తీవ్రం కావడంతో జలమండలి అప్రమత్తమైంది. ఇప్పటికే రూ.398 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన గోదావరి రింగ్మెయిన్–3 పనుల్లో గౌడవెల్లి ప్రాంతంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ పైప్లైన్పై వాల్వ్ల ఏర్పాటు వంటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ఈ వారంలో ట్రయల్రన్ నిర్వహించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. గ్రేటర్ దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా జలాలు భాగ్యనగరానికి జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల తరవాత 70వ దశకం నుంచి సింగూరు, మంజీరా జలాల తరలింపు ప్రక్రియ మొదలైంది. నాటి నుంచి నేటి వరకు పటాన్చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలకు ఈ జలాలే దాహార్తిని తీర్చేవి. అయితే, గోదావరి మొదటిదశ పథకం పూర్తితో సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని నగరానికి తరలించినప్పటికీ ఇందులో సింహభాగం పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాలతోపాటు ఇక్కడున్న పలు ప్రతిష్టాత్మక సంస్థలు, కంపెనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. ఏడాదిగా నగర తాగునీటి అవసరాలకు నిత్యం సుమారు 10 మిలియన్ గ్యాలన్ల సింగూరు, మంజీరా జలాలను మాత్రమే సరఫరా చేసినట్లు జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి. రింగ్మెయిన్ పైప్లైన్–3 పూర్తితో ఇక నుంచి సింగూరు జలాలు నిలిచిపోయినప్పటికీ కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని జలమండలి స్పష్టం చేసింది. ఈ వారంలో ట్రయల్రన్ పూర్తి చేసి ఫిబ్రవరి మొదటివారం నుంచి గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని తెలిపింది. కృష్ణా, గోదావరి జలాలే ఆధారం... జంట జలాశయాల నీటిని నగర తాగునీటి అవసరాలకు సేకరించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించడం, త్వరలో సింగూ రు, మంజీరా జలాల సరఫరా నిలిచిపోనుండటంతో భాగ్యనగరానికి కృష్ణా, గోదావరి జలాలే ఆధారం కానున్నా యి. ప్రస్తుతానికి కృష్ణా మూడు దశల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాల న్లు, గోదావరి మొదటిదశ ద్వారా మరో 130 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. రింగ్మెయిన్–3 పనుల పూర్తితో అదనంగా మరో 60 ఎంజీడీల గోదావరి జలాలను సిటీకి తరలించనున్నారు. దీంతో నిత్యం నగరానికి 460 మిలియ న్ గ్యాలన్ల జలాలను సరఫరా చేయనున్నారు. ఈ నీటిని నగరంలోని 9.60 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫ రా చేయనున్నట్లు జలమండలి అధికా రులు చెబుతున్నారు. -
‘ఉత్తి’పోతల పథకాలు
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం సాగునీటి కోసం కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఎత్తిపోతల పథకాలు, కాలువల మరమ్మత్తులు చేపడుతోంది. అయితే, క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో సాగునీటి పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలితంగా వందలాది ఎకరాలు బీడు భూములుగా మారుతుడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రూ.50 లక్షలతో అచ్చన్నపల్లిలో.. టేక్మాల్ మండలం అచ్చన్నపల్లిలో మంజీర నదిపై 1995లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రూ.50 లక్షలతో నిర్మించిన ఈ పథకం ద్వారా అచ్చన్నపల్లి, లక్ష్మణ్, చంద్రుతండాల్లో నాలుగు చెరువులను నింపాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 180 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. రెండేళ్ల పాటు సక్రమంగా పని చేసినా.. నిర్వహణ లోపంతో ప్రస్తుతం వృథాగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.77 లక్షలతో గతేడాది పాత ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా వదిలేసి నూతనంగా నిర్మించారు. ఎత్తిపోతల పథకాన్ని ఓ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఎంత ఆయకట్టు వేయాలో ముందు నిర్ణయించి.. సాగు చేస్తున్నారు. 2017 ఖరీఫ్, 2018 రబీలో సుమారు 100 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగు చేశారు. అదే అదునుతో ఖరీఫ్లో రెట్టింపు సాగు చేయాలని రైతులు గంపెడు ఆశతో భూములన్నీ చదును చేసుకొని.. వరినారు మడులను సిద్ధం చేసుకున్నారు. మరికొందరు రైతులు ముందస్తుగా వరినాట్లు వేశారు. ఎత్తిపోతల ద్వారా రెండు పంటలు నీరు అందకముందే మంజీర ఖాళీ కావడంతో ఆ పథకం కాస్తా నిర్వీర్యం అయ్యింది. ఫలితంగా భూములు బీడులు మారాయి. మరమ్మతులకు నోచుకోని కోరంపల్లి పథకం మండలంలోని కోరంపల్లి ఎత్తిపోతల పథకం కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఫలితంగా 600 ఎకరాలకు పైగా బీడుగా మారింది. 1992లో రూ.1.50 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మంజీర తీరంలో అంతర్గత బావి నిర్మించారు. వేసవిలో ఇసుక తరలించడంతో నీరు ఎక్కువగా నిల్వ ఉండని స్థితి ఏర్పడింది. క్రమేపి నీటిమట్టం పడిపోవడంతో సాగు విస్తీర్ణం 150 ఎకరాలకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ద్వారా అసలు వ్యవసాయం చేయడం లేదని రైతులు చెబుతున్నారు. సింగూరు నీటిని మంజీర నదిలోకి వదలకపోవడంతో ఈ పథకం వెలవెలబోతుంది. ఫలితంగా బీడు భూములన్నీ సాగులోనికి వస్తాయనుకున్న రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. -
ఎండుతున్న మంజీరా
నారాయణఖేడ్ (మెదక్): మంజీరా నది ఎండుతోంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే నదిపై ఆధారపడి ఉన్న మంచినీటి పథకాల ద్వారా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే సకాలంలో వర్షాలు కురవని పక్షంలో మంజీరా నదిపై ఆధారపడి ఉన్న గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. గత ఏడాది వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో మంజీరా నది పూర్తిగా నిండి కళకళలాడింది. నది నుంచి భారీగా నీటిని వదలడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది. మంజీరా నదిపై నారాయణఖేడ్ నియోజకవర్గంతోపాటు జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు చెందిన తాగునీటి పథకాలు ఉన్నాయి. వర్షాలు ఏమాత్రం ముఖం చాటేసినా నీటి పథకాలు వట్టిపోనున్నాయి. ఇప్పటికే నీటిపథకాల నిర్వహణ కష్టతరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నాగల్గిద్ద మండలం గౌడ్గాం జనవ్వాడ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న మంజీరా నది నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అత్యధిక ప్రాంతంలో పారే నది ఖేడ్ నియోజకవర్గంలోనే. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. నదిలో సమృద్ధిగా వరద నీరు వచ్చి చేరింది. కాగా ఏడాది ప్రారంభంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు ఘన్పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు విడతల వారీగా సింగూరు నుంచి నీటిని వదిలారు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 10 టీసీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీల వరకు నీరు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ అంతకంటే తక్కువ టీఎంసీల నీరు మాత్రమే ఉందని ప్రతిపక్షాలు, నది సమీప గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో 4 టీఎంసీల నీటి నిల్వ తగ్గే స్థాయిలో పూడిక మట్టి ఉంది. నది నుంచి భారీగా నీరు వదలడంతో ఘన్పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు వేసవి చివరిలోనూ నిండుకుండలా నీటితో కళకళలాడుతున్నాయి. మంజీరా నది మాత్రం ఎండిపోతోంది. నీటి పథకాలకు గడ్డుకాలం.. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీరా నది నుంచే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్ఏపీ పథకం ఫేజ్ 1కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 40గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లోని 66గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్టెక్వెల్లు అన్నీ మంజీరా నదిపైనే ఉన్నాయి. ఇప్పటికే గూడూరు పథకం ద్వారా రోజు విడిచి రోజు, రెండు రోజులకు ఓ మారు నీటి సరఫరా జరుగుతోంది. శాపూర్, బోరంచ ఇన్టెక్ వెల్ వద్ద కూడా నీరు తగ్గింది. ముందు ముందు ఎండల పరిస్థితి ఇలాగే ఉంటే తాగునీటి పథకాలు వట్టిపోతాయి. నదిలో నీరు తగ్గడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్ ఇస్తున్నాయి. జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్టెక్ వెల్లు కూడా మంజీరా నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంజీరా నది ప్రారంభం మొదలుకొని గోదావరిలో కలిసే వరకు పూర్తి ప్రవాహంలో రాయిపల్లి వంతెన వద్ద ఉన్నంత ఉద్ధృతి ఎక్కడా కన్పించదు. ఈ వంతెన సమీపంలో కనుచూపు మేర పూర్తిగా నీటితోనే నది కన్పిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిలా తయారైంది. నదిలోంచి పశువులు, జనాలు ఇవతలి వైపు నుంచి అవతలి వైపు నడిచి వెళుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నదిలో అక్కడక్కడా గోతుల్లో ఉన్న నీటిలో పశువులు ఈదుతున్నాయి. నది ఎండడంతో రబీ సీజన్కు సంబంధించి జొన్న, శనగ తదితర పంటలను నది ముంపు భూముల్లో రైతులు సాగుచేసి పంటలను సైతం తీసుకున్నారు. నది పరిస్థితి చూసి జనాలు తల్లడిల్లుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే వరుణుడు కరుణిస్తేనే మూడు నియోజకవర్గాల్లోని ప్రజలునీటి ఎద్దడి నుండి బయట పడగలరు. -
రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడి
నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని వద్ద మంజీరా నదిలో రెవెన్యూ అధికారులపై మహారాష్ట్రకు చెందిన 50 మంది రాళ్ల దాడి చేశారు. మంజీర నదిలో తెలంగాణ భూభాగంలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్ర కాంట్రాక్టర్కు చెందిన జేసీబీలను బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి సీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ అనుచరులు తహసీల్దార్ విఠల్తో పాటు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రెవెన్యూ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడితో భయపడిపోయి వెనక్కి తగ్గటంతో డోజర్ జేసీబీలను మహారాష్ట్ర కాంట్రాక్టర్ అనుచరులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వైభవంగా కుంభమేళా
న్యాల్కల్(జహీరాబాద్): కుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మంజీర నది కోలాహలంగా మారింది. రాఘవాపూర్–హుమ్నాపూర్ గ్రామాల శివారులో కొనసాగుతున్న కుంభమేళా ఆరో రోజు కూడా భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వేకువజామున వచ్చిన భక్తులు మంజీరలో పుణ్యస్నానాలచరించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు నదిలో స్నానాలు చేసి గంగామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం గంగాదేవి ఆలయంలో పూజలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞా, హోమాలు కొనసాగుతున్నాయి. కుంభమేళాలో భక్తుల కోలాహలంతో పాటు సాధువుల సంతుల సందడి నెలకొంది. భక్తులు దిగంబర సాధువులను దర్శించుకున్నారు. సాయంత్రం సాధువుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అలాగే భక్తులు పంచవటిలో వెలసిన శారదాదేవి, సాయిబాబ, శనీశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన వెంకటస్వామి ఉదయం కుంభమేళాకు వచ్చిన రుస్తుపేట పీఠాధిపతి వెంకటస్వామికి పంవచటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్బాబా ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో కలసి మంజీర నది వద్ద గంగామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటస్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం శుభదినాలు ఉన్నందున భక్తులు మంజీరలో పుణ్యస్నానాలచరించాలన్నారు. లోక కల్యాణార్థమై ఈ ప్రాంతంలో కాశీనాథ్బాబా కుంభమేళా నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. -
నీటి గలగల.. పంట కళకళ
పాపన్నపేట(మెదక్): మెతుకు సీమకు వరప్రసాదిని మంజీరా నది. కొల్చారం.. పాపన్నపేట మండలాల మధ్య 1905 లో నిర్మించిన ఘనపురం ఆనకట్ట 30వేల ఎకరాల పంటలకు ప్రాణం పోస్తోంది. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు లెక్క ప్రకారం యేటా 4 టీఎంసీల నీరు రావాలి. అయితే గతంలో హైదరాబాద్ వాసుల దాహార్తి కోసం సింగూరు నుంచే నీరు తీసుకెళ్లేవారు. కానీ కొంత కాలంగా సింగూరు నీటిని ప్రథమంగా స్థానిక అవసరాల కోసం వాడుతున్నారు. అయినప్పటకీ నాలుగేళ్ల క్రితం వరకు రైతులు ఆందోళన చేస్తేనే సాగు నీరు వచ్చేది. ఆ నీటి విడుదల కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం గొంతు విప్పేవారు. దీంతో సాగు నీటి విడుదల కోసం ప్రతి విడతకు ఒక జీఓ విడుదల చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితులు మారాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి విజ్ఞప్తి.. మంత్రి హరీశ్రావు చిత్తశుద్ధి మేరకు ప్రతి యేటా అడకుండానే అవసరాలకు ఘనపురం ప్రాజెక్టు వాటా కనుగుణంగా సింగూరు నుంచి నీరు విడుదల అవుతోంది. ప్రభుత్వ జీఓల కోసం మీన మేషాలు లెక్కించకుండానే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రబీ సీజన్లో ఘనపురం ప్రాజెక్టుకు 11 విడతలుగా ఇప్పటి వరకు 3.35 టీఎంసీల నీరు విడుదల చేశారు. దీంతో ఘనపురం ఆయకట్టు కింద ఒక్క గుంట ఎండకుండానే రబీ గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల సింగూరు ప్రాజెక్టు 29 టీఎంసీల గరిష్ట నిల్వ నీటి సామర్థ్యాన్ని చేరుకుంది. అనంతరం కురిసిన వర్షాల వల్ల వరద పోటెత్తడంతో మునుపెన్నడు లేని విధంగా 11 టీఎంసీల నీటిని నిజాంసాగర్కు విడుదల చేశారు. అనంతరం నవంబర్ నెలలో ఈయేడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 14 టీఎంసీల నీటిని వదిలారు. దీంతో నిజాంసాగర్ ఆనకట్ట కింద సైతం రబీ పంటలు డోకా లేదు. అలాగే శ్రీరాంసాగర్కు ప్రయోజనం కలిగింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 8.731 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ ఈఈ యేసురత్నం తెలిపారు. -
హోలీలో అపశ్రుతి
పుల్కల్(అందోల్): రెండు కుటుంబాల్లో హోలీ పండగ విషాదాన్ని నింపింది. ఇద్దరు విద్యార్థులు నదిలో నీట మునిగి దుర్మరణం పాలైన సంఘటన పుల్కల్ మండలం కొర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొర్పోల్ గ్రామానికి చెందిన కిషన్, మంజుల దంపతుల కొడుకు సాయికిరణ్, యాదయ్య, వీరమణి దంపతుల కొడుకు సాయికుమార్లు మధ్యాహ్నం వరకు హోలీ ఆడారు. అనంతరం వారిద్దరూ మరో ఐదుగురితో కలిసి స్నానానికని మంజీర నదికి వెళ్లారు. ఇందులో ఈత రాని ఐదుగురు నది ఒడ్డున స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో సాయికిరణ్, సాయికుమార్లతోపాటు మరో ఇద్దరు నీట మునగడాన్ని ఇంటర్ విద్యార్థి మల్లేశం గమనించాడు. వెంటనే నీట మనుగుతున్న ఇద్దరిని కాపాడి బయటకు తీశాడు. కానీ సాయికిరణ్, సాయికుమార్లను కాపాడేంత శక్తి లేకపోవడంతో గ్రామానికి చెందిన పలువురికి సమాచారం ఇచ్చాడు. కానీ అంతలోపే సాయికుమార్, సాయికిరణ్లు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిద్దరూ 10వ తరగతి విద్యార్థులే. వీరి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు మంజీర నదికి వెళ్లి వారి మృతదేహాలను బయటకు తీశారు. వెంటనే పుల్కల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏఎస్ఐ ప్రభాకర్ సంఘటన స్థలానికి చెరేకున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులే.. మంజీర నదిలో స్నానం చేయడం కోసం వెళ్లి మృతి చెందిన సాయికుమార్, సాయికిరణ్లు ఇద్దరూ ప్రాణస్నేహితులని తోటి విద్యార్థులు తెలిపారు. ఐదవ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకుంటున్నారని, ఎప్పుడూ వారు కలిసే ఉండే వారన్నారు. ఇద్దరూ తల్లిదండ్రులకు ఒక్కగానొక్కరే.. సాయికుమార్, సాయికిరన్లు ఇద్దరు కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాయికుమార్ తండ్రి యాదయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి వీరమణి కూలీ పని చేస్తూ తన కొడుకును చదివిస్తోంది. మరో విద్యార్థి సాయికిరణ్ సైతం వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. గ్రామంలో విషాదం.. అందరూ ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకుంటుంటే ఆ గ్రామంలోని రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు విద్యార్థులు మంజీర నదిలోనే పడి మృతి చెందారని, వారికి పోస్టుమార్టం నిర్వహించవద్దని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితి దృష్ట్యా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం కోసం మృతదేహాలను జోగిపేట ఆస్పత్రికి తరలించామని ఏఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. -
మంజీరా గుల్ల
కొల్చారం(నర్సాపూర్): కొల్చారం మండలంలో ప్రవహిస్తున్న మంజీర నది ఇక్కడి రైతులకు వరప్రదాయిని. మండలంలోని ఎనగండ్ల, వైమాందాపూర్, కోణాపూర్, పైతర, రంగంపేట, తుక్కాపూర్, చిన్నఘనాపూర్ గ్రామాల గుండా నది ప్రవాహం ఘనాపురం ఆనకట్ట వరకు కొనసాగుతుంది. రైతులు ఈ మంజీర నీటిని మోటార్ పైప్లైన్ల ద్వారా ఎక్కువగా వినియోగిస్తూ వస్తున్నారు. మేటవేసిన ఇసుక వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగి బోర్లు వట్టిపోకుండా ఇక్కడి రైతులకు మంజీర జీవనాధారంగా మారింది. రైతుల బాధలు పట్టని కొందరు అక్రమ ఇసుక దందాకు తెర లేపుతున్నారు. ప్రభుత్వ పథకాలకు ఇసుక అవసరం అంటూ ఆయా గ్రామాల రైతులను మోసం చేస్తూ ‘పెద్ద’ ప్రజాప్రతినిధుల పేర్లను వాడుతూ ఇసుక దందాకు తెరలేపారు. మంజీర ఇసుక ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు వాడవచ్చా? ప్రభుత్వం చేపట్టే భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజీర ఇసుక ఏమాత్రం ఉపయోగపడదని స్వయాన సంబంధిత శాఖలకు చెందిన అధికారులే అంగీకరిస్తున్నారు. ఇక్కడి ఇసుకలో మట్టి పాళ్లు ఎక్కువగా ఉండడంతోపాటు నల్లని గుండురాయి కూడా మిళితమై ఉందని, దీన్ని నిర్మాణాలకు వాడితే తక్కువ కాలంలోనే బీటలువారే పరిస్థితి వస్తుందన్నది అధికారుల సమాధానం. గతంలో మండలంలో నిర్మించిన భవనాలు, సీసీ రోడ్లు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఈ పరిస్థితుల్లో బోధన్ నుంచి ఇసుక తెచ్చేందుకు అవసరమైన రవాణా చార్జీలను సైతం కాంట్రాక్టర్లకు అందిస్తూ వస్తున్నారు. కొల్చారం మండలానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇసుకను తీసుకువచ్చేందుకు రవాణా చార్జీని అందిస్తున్నారు. అయినా కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై ఇక్కడి ఇసుకను వాడుతున్నారు. లంచాలకు అలవాటుపడిన అధికారులు నోరు మెదపడం లేదు. ఈ క్రమంలో మంజీర ఇసుక కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్న మంజీర ఇసుక ప్రభుత్వ పనులే కదా ఉంటేనేం.. కూలితేనేం.. అన్న రీతిలో ఏ మాత్రం నిర్మాణాలకు ఉపయోగపడని ఇక్కడి ఇసుకను వాడుతున్నారు. ట్రాక్ట ర్ ఇసుక రూ.2500కే దొరుకుతుండడం, అధికారులు ఎవరూ అడ్డు చెప్పకపోవడం కాంట్రా క్టర్లకు కాసులు కురిపిస్తోంది. స్థానికంగా ఉన్న నాయకులు సైతం ఊరుకుంటుండడంతోపాటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇక్కడి ఇసుకను అక్రమంగా రవాణా చేసేందుకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. రైతుల గోసపట్టని రెవెన్యూ అధికారులు మండలంలో 80శాతానికిపైగా బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న పరిస్థితుల్లో నదిలో ఉన్న కొద్దిపాటి ఇసుకను తోడేస్తున్నా రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పని ఏదైనా విచారించకుండానే విచ్చల విడిగా అనుమతులు ఇస్తుండడంతో ఇసుకను భారీగా తరలిస్తున్నారు. ఇసుక తీస్తే బోర్లలో నీటిమట్టం తగ్గి పంటలు పండక తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలుమార్లు ఇక్కడి రైతులు అధికారులకు మొరపెట్టుకున్నా వారు అవేమీ పట్టించుకోవడం లేదు. కొందరు నాయకులు స్థానిక ఎమ్మెల్యే పేరుతో సమీప మంజీర పరివాహక ప్రాంతాల రైతులను బెదిరించి ఇక్కడి నుంచి ఇసుకను ఇతర మండలాలకు తరలించుకుపోవడం దినచర్యలా మారిపోయింది. ఇసుక అక్రమ రవాణాను ఆపాలి మా గ్రామం నుంచే గవర్నమెంట్ పనులకని ఇసుకను తరలిస్తున్నారు. దీంతో బోర్లలో నీరు చేరకుండా ఎండిపోతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలా ఎంతకాలం ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తారు. వెంటనే ఆపివేయాలి. – సంగప్ప, తుక్కాపూర్ పైనుంచి ఒత్తిడితోనే అనుమతులు పైనుంచి ఒత్తిడిలు ఎక్కువగా ఉన్నందునే మంజీర నది నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాల్సి వస్తోంది. ప్రభుత్వ పథకాలకు ఇసుక ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వాల్సి వస్తోంది. రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయమై చాలా సార్లు ఫిర్యాదులు అందాయి. అయినా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వక తప్పడం లేదు. – రమేష్, తహసీల్దార్ -
వనభోజనంలో విషాదం
మల్కాజిగిరి: వనభోజనాలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. కార్తీకమాసంలో సరదాగా వనభోజనాలకు వెళ్లిన ఇద్దరు యువతులు మంజీరానదిలోపడి గల్లంతయ్యారు. స్థానికుల కథనం మేరకు.. మల్కాజిగిరి వెంకటేశ్వరనగర్లోని రాఘవేంద్ర అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న వసంత, భ్రమరాంభిక నగర్ సాయి సుబ్రహ్మణ్యం రెసిడెన్సీలో ఉంటున్న శ్రీవిద్య(21) ఇద్దరూ ఒకేచోట పనిచేస్తుంటారు. ఆదివారం వారు పనిచేసే మహిళా ఉద్యోగులంతా కలిసి మెదక్ జిల్లా జోగిపేట సమీపంలో ఉన్న చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్దకు వనభోజనాలకు వెళ్లారు. సమీపంలోని మంజీరా నది ఒడ్డున ఫొటోలు తీసుకుంటుండగా వసంత కూతురు రోహిత(17), శ్రీ విద్య(21) ప్రమాదవశాత్తు నదిలో జారిపడ్డారు. అక్కడున్న వారు రక్షించడానికి ప్రయత్నించినా నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకొని పోయారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలించినా ఫలితం లేకపోయింది. శ్రీ విద్య తండ్రి సతీష్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా తండ్రికి చేదోడుగా తను ప్రైవేట్గా చదువుతూ ఉద్యోగం చేస్తున్నది.రోహిత స్ధానిక ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి సత్యనారాయణ ఫార్మా కంపె నీలో పనిచేస్తున్నారు. -
‘మంజీరా’లో ఇద్దరమ్మాయిల గల్లంతు
చిలప్చెడ్: మంజీరా నదిలో ఆదివారం ఇద్దరు అమ్మాయిలు గల్లంతయ్యారు. అందరూ చూస్తుండగానే నది ఉధృత ప్రవాహంలో వారు కొట్టుకుపోయారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చి ఇలా గల్లంతవడం విషాదం మిగిల్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిట్కుల్ శివారులో చోటుచేసుకుంది. హైదరాబాద్ మల్కాజ్గిరికి చెందిన సతీశ్, రంజనల కుమార్తె శ్రీవిద్య (20) ఓపెన్ డిగ్రీ చదువుతూ ప్రైవేట్ కంపెనీలో సూపర్ వైజర్గా పని చేస్తోంది. అలాగే.. సత్యనారాయణ, వసంతల కుమార్తె రోహిత (16) ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. మల్కాజ్గిరికి చెందిన 30 మంది మహిళలతో కలసి వీరు చిట్కుల్ శివారులోని చాముండేశ్వరీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. పక్కనే ప్రవహిస్తున్న మంజీరా నదిలో అందరూ స్నానాలు చేశారు. కొంత మంది అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లగా.. శ్రీవిద్య, రోహిత మళ్లీ నదిలోకి దిగారు. ఆ సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇద్దరు అమ్మాయిలు అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయా రు. అమ్మాయిలు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం లో గల్లంతైనా సాయంత్రం ఆరు గంటల వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపు చర్యలకు అవ కాశం లేదని చెబుతున్నారు. కాగా, సింగూరు జలా లు వదలడం.. పర్యాటక క్షేత్రమైన చాముండశ్వరీ ఆలయ పరిధిలోని మంజీరా నది వద్ద ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడంతో అమ్మాయిల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కుటుంబం కళ్లెదుటే.. యువతుల గల్లంతు
సాక్షి, చిలప్చేడ్ : మెదక్ జిల్లా చిలప్చేడ్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. వనభోజనాల కోసం స్థానికంగా ఉన్న శ్రీ చాముండేశ్వరి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలసి రోహిణి (18), శ్రీవిద్య(17) వెళ్లారు. అనంతరం స్నానం చేయడానికి మంజీరా నదిలోకి దిగారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు ఒక్కసారిగా విడుదలవ్వడంతో నదిలో నీటి ప్రవాహం ఉధృతమైంది. దీంతో కుటుంబసభ్యులు చూస్తుండగానే శ్రీవిద్య, రోహిణిలు నదిలో కొట్టుకుపోయారు. విహారయాత్రకు వస్తే విషాదం మిగిలిందని యువతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
మంజీరనదిలో ఇద్దరు యువతుల గల్లంతు
-
మంజీరా వరదల్లో చిక్కుకున్న ఇద్దరు యువకులు
పాపన్నపేట: మంజీరా వరదల్లో శుక్రవారం ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. హైదరాబాద్లోని పురానాపూల్కు చెందిన ఆకుల మహేశ్, వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన భీంపల్లి బాల్రాజు సరదాగా గడిపేందుకు ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు మంజీరా చెక్డ్యాం వద్ద నదిలోకి దిగారు. ఇంతలోనే వరదలు పోటెత్తడంతో ప్రవాహంలో పడి పోయారు. ఒకరు చెక్డ్యాంపై ఉన్న ఊచను పట్టుకోగా, మరొకరు బండరాయి ఎక్కి కూర్చున్నారు. క్షణక్షణం ప్రవాహం పెరుగుతుండటం చూసి వారు ప్రాణభయంతో కేకలు వేయడం మొదలు పెట్టారు. ఏడుపాయల సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ సందీప్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఏం చేయాలో వారికి అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో నదిపై వంతెన పనులు చేస్తున్న బిహార్ కూలీలు సురేష్, చరణ్సింగ్ తాము రక్షిస్తామని ముందుకు వచ్చారు. దీంతో మిగిలిన కూలీలు వారిద్దరికి తాడు కట్టి నదిలోకి పంపారు. పోటెత్తిన ప్రవాహాన్ని అధిగమిస్తూ ధైర్యసాహసాలతో గంటపాటు కష్టపడి మహేష్, బాల్రాజును ఒడ్డుకు చేర్చారు. కాగా, సురేష్, చరణ్సింగ్ సాహసానికి మెచ్చుకున్న పోలీసులు నగదు ప్రోత్సాహం అందించారు. -
మంజీర నదిలో ఇసుక దోపిడీ
► మహారాష్ట్ర అనుమతులతో జిల్లా భూభాగంలో తవ్వకాలు ► ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లోతరచూ ఉద్రిక్త పరిస్థితులు నిజామాబాద్ : మంజీర నదిలో మహారాష్ట్ర మాయగాళ్లు దోపిడీ చేస్తున్నారు. మహారాష్ట్ర క్వారీల అనుమతుల పేరిట నదిలో సరిహద్దులు దాటి జిల్లా భూభాగంలోకి చొచ్చుకు రావడం ఏటా పరిపాటిగా తయారైంది. రాత్రికి రాత్రి జిల్లా భూభాగంలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతూ మన వనరులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో భూగర్భజలాలు పడిపోయి.. జరగాల్సిన నష్టం జిల్లాకు జరిగిపోతుండగా.. ఇసుకపై ఆదాయం మాత్రం మహారాష్ట్ర సర్కారుకు వెళ్తోంది. నదిలో సరిహద్దుల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏటా మహారాష్ట్ర కాంట్రాక్టర్లు జిల్లా భూభూగంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఇటీవల శాఖాపూర్ (మహారాష్ట్ర) క్వారీ పేరిట కోటగిరి మండలం సుంకిని గ్రామ భూభాగంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరిగాయి. దీంతో గ్రామస్తులు వెళ్లి ఈ తవ్వకాలను నిలిపేయించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయా శాఖల అధికారులు వెళ్లి ఇసుక తవ్విన జేసీబీని సీజ్ చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని శాఖాపూర్ క్వారీ అనుమతి పేరిట సుంకిని గ్రామశివారులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరిగినట్లు జిల్లా రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు గుర్తించారు. ఇలా మహారాష్ట్ర క్వారీల పేరిట తవ్వుతున్న ఇసుకను తెలంగాణలోని వివిధ పట్టణాలకే తరలించి కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వట్టి పోతున్న పథకాలు తెలంగాణ–మహారాష్ట్ర మధ్య ప్రవహించే మంజీరకు కోటగిరి, బోధన్ మండలాల గ్రామాలు సుంకిని, మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్ధాపూర్, ఖండ్గాం, బిక్నెల్లి గ్రామాలున్నాయి. ఈ గ్రామాల పరిధిలో పలు ఎత్తిపోతల పథకాలున్నాయి. మహారాష్ట్ర అనుమతుల పేరిట నదిలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో నది జలాధారంగా ఉన్న ఈ ఎత్తిపోతల పథకాలు గతంలో వట్టిపోయాయి. దీంతో ఈ గ్రామాల వాసులకు ఎండా కాలంలో కనీసం తాగునీరు కూడా దొరక్క పడరాని పాట్లు పడ్డారు. నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలతో సరిహద్దు గ్రామాల్లో బోర్లు వట్టిపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. మహా మాయగాళ్ల ఆగడాల కారణంగా ఎన్నో దుష్ఫలితాలను అనుభవించామని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు వాపోతున్నారు. క్వారీలకు అనుమతులు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా మంజీర నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తోంది. సుమారు 12 ఇసుక క్వారీలకు ఈ సారి నాందేడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం టెండరు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. ఈ క్వారీలను దక్కించుకున్న కాంట్రాక్టర్లు మంజీరను సరిహద్దులు దాటి కొల్లగొడుతున్నారు. -
మంజీర నదిలో వ్యక్తి గల్లంతు
ఆంధోల్(మెదక్ జిల్లా): ఆంధోల్ మండలం రోళ్లపహాడ్ వద్ద మంజీరా నది వరద నీటిలో ప్రభాకర్(30) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రభాకర్కు నది పక్కనే రెండెకరాల పొలం ఉంది. పొలానికి కావాల్సిన నీటిని నదిలో మోటారు పెట్టి పారిస్తుంటారు. నేటి (ఆదివారం) ఉదయం నదిలో ఉన్న మోటారును ఇద్దరు కూలీల సహాయంతో బయటికి తీసేందుకు వెళ్లాడు. తాడు సహాయంతో నదిలోకి ప్రభాకర్ దిగాడు. అదే సమయంలో వరద ప్రవాహం ఎక్కువ అవడంతో ప్రవాహానికి ప్రభాకర్ కొట్టుకుపోయాడు. స్థానికులు నదిలో ఎంత వెతికినా ప్రయోజన లేకపోయింది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన ప్రభాకర్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
మంజీరా నదిలో చిక్కుకున్న కార్మికులు
- కాపాడేందుకు అధికారుల యత్నం పుల్కల్: మెదక్ జిల్లా పుల్కల్ మండలం పోచారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు మంజీరా నదిలో చిక్కుకున్నారు. సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో 6 గేట్లు ఎత్తేసి నీళ్లు వదులుతున్నారు. దాంతో మంజీరా నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. సత్యసాయి వాటర్ సప్లై పథకంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు నీటిలో చిక్కుకున్నారు. వారికి ఈత రాకపోవడంతో కాపాడమని కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. అనంతరం అధికారులకు సమాచారం అందించడంతో పుల్కల్ సబ్ఇన్స్పెక్టర్, తహశీల్దార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని నీటిలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మంజీరమ్మకు మళ్లీ వరదలు
జలదిగ్బంధంలో దుర్గమ్మతల్లి పొంగిపొర్లుతున్న ఘనపురం పాపన్నపేట: మంజీరమ్మకు మళ్లీ వరద పోటెత్తింది. సింగూర్ నుంచి దిగువకు 1.20లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో శనివారం సాయంత్రానికి పాపన్నపేట మండలం ఏడుపాయల్లోని ఘనపురం ఆనకట్ట వరదనీటితో పొంగి పొర్లింది. పరవళ్లు తొక్కుతున్న మంజీర దిగువన ఉన్న దుర్గమ్మ తల్లిని దిగ్బంధించింది. దీంతో అమ్మవారి ఆలయానికి మళ్లీ రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయానికి శుక్రవారం దారి ఏర్పడింది. వరదల ఫలితంగా సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఈఓ వెంకట కిషన్రావు తెలిపారు. ఆలయం చుట్టూ ఉన్న గ్రిల్లింగ్, హుండీలు, ఫ్యాన్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అమ్మవారి ఆలయం ముందు వంతెన కూడా కుప్ప కూలింది. శనివారం ఆలయ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా తిరిగి వరద నీరు చుట్టేసింది. ఎల్లాపూర్ వంతెనకు దాదాపు సమాంతరంగా మంజీర ప్రవాహం కొనసాగుతుంది. వంతెన మునిగే అవకాశాలు తక్కువేనని ఇరిగేషన్ ఈఈ ఏసయ్య తెలిపారు. పాపన్నపేట మండలంలో నది వైపు వెళ్లొద్దని ఆయన సూచించారు. రాజగోపురం చుట్టూ ఫెన్సింగ్ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏడుపాయలకు భక్తులు వస్తున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మెదక్ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వరదనీటి వద్దకు ఎవరు వెళ్లకుండా రాజగోపురం వద్ద భారీ ఎత్తున ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. -
ఉధృతంగా మంజీర
కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పొతంగల్ వద్ద ఎగువన కురుస్తున్న వర్షాలకు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజీర పరీవాహక ప్రాంతంలోని చిన్న చిన్న చెరువులు నిండిపోయాయి. పొతంగల్ వద్ద ఉన్న కుమ్మరివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పక్కనున్న పొలాలు నీట మునిగాయి. అక్కడ వేసిన సోయా, వరి, అరటితోటలు నీట మునిగిపోయాయి. -
వంతెన అంచుపై వేలాడుతున్న లారీ
-
వంతెన అంచుపై వేలాడుతున్న లారీ
మెదక్: మంజీరా నది పై లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బ్రిడ్జ్ అంచున ఆగిపోయింది. ఈ సంఘటన మనురు మండలం రాయిపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. బీదర్ వైపు పళ్లలోడుతో మంజీరా నది బ్రిడ్జ్ పై వెళుతుండగా లారీ టైర్ పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి బ్రిడ్జ్ సైడ్ వాల్ను ఢీకొట్టి వాగువైపు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ బ్రిడ్జ్ అంచున ఆగిపోయి వేళాడుతోంది. లారీ క్యాబిన్ వాగు వైపు ఉండటంతో లారీ డ్రైవర్, క్లినర్లు చాలా సమయం వరకు లారీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. లారీ బ్యాలెన్స్ తప్పి వాగులో పడిపోకుండా అటు వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. -
మంజీర నదిలో మొసలి కలకలం
ఆందోళనలో రైతులు కౌడిపల్లి: చండూర్ సమీపంలోని మంజీర నదిలో శనివారం మొసలి కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంజీర నదిపై చండూర్ ఎత్తిపోతల పథకం సమీపంలో మోటార్ల మరమ్మతు కోసం రైతులు ఏడెడ్ల మడుగులో దిగగా మొసలి కనిపించడంతో ఆందోళనకు గురై ఒడ్డుకు పరుగులు తీశారు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో నది పూర్తిగా ఎండిపోయింది. ఘణపూర్ ఆనకట్టకు సింగూర్ నుంచి నీటిని విడుదల చేశారు. కాలువలో నీరు రావడంతో పలువురు రైతులు నదిలో మోటార్లను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మడుగులో మొసలి కనిపించడంతో తహసీల్దార్ నిర్మల, ఆర్ఐ కిషోర్కుమార్కు సమాచారమిచ్చారు. రెవెన్యూ అధికారులు అటవీ అధికారులకు సమాచారమిచ్చి ప్రజలను అప్రమత్తం చేశారు. -
పశువుల కాపర్లను చంపేసిన మొసళ్లు
మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. పశువులను మేపేందుకు వెళ్లిన ఇద్దరు పశువుల కాపర్లను మొసళ్లు చంపేశాయి. పుల్కల్ మండలం గొగులూరు గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు మంజీరా పరివాహక ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లారు. వాళ్లలో శివకుమార్ అనే వ్యక్తి.. కాళ్లు కడుక్కోడానికి నీళ్లలోకి దిగగా, వెంటనే మొసళ్లు అతడిపై దాడిచేసి, లోపలకు లాక్కెళ్లిపోయాయి. శివకుమార్ను రక్షించేందుకు రామస్వామి అనే మరో కాపరి చిన్న తెప్పతో లోనికి వెళ్లి.. గాలించడం మొదలుపెట్టాడు. అయితే కాసేపటికి అతడిపై కూడా మొసలి దాడిచేసి లాక్కెళ్లిపోయింది. ఇప్పటివరకు మొసళ్లు ఈ ప్రాంతంలో పశువుల మీద దాడి చేసిన ఘటనలు ఉన్నాయి గానీ, మనుషులను ఏమీ చేయలేదు. తొలిసారి మనుషుల మీదే దాడిచేసి చంపేయడం ఇక్కడ కలకలం సృష్టించింది. ఇంకా ఆ మృతదేహాలను బయటకు తీసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి!
మృతదేహం కోసం మంజీరలో కొనసాగుతున్న గాలింపు న్యాల్కల్ : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ లవ్కుమార్, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. న్యాల్కల్కు చెందిన అంజన్న, సిద్దమ్మ దంపతుల రెండో కుమార్తె మౌనిక (19) జహీరాబాద్లోని వశిష్ట కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఎప్పటి మాదిరిగానే ఉదయం న్యాల్కల్ నుంచి బస్సులో జహీరాబాద్కు వెళ్లింది. మధ్యాహ్నం తిరిగి ఇంటికి నారాయణఖేడ్ వైపు వెళ్లే ఆటోలో బయలు దేరింది. ఆటోలో వెళ్తుతున్న క్రమంలో తాను చెరువులో దూకి చస్తానని ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుండగా విన్నట్లు సమాచారం. అయితే మౌనిక నారాయణఖేడ్ వైపు వెళ్తున్న విషయాన్ని గమనించిన కొందరు సమాచారాన్ని యువతి తల్లిదండ్రులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మౌనిక తమ్ముడు సంతోష్కుమార్, చెల్లి స్వరూప రాఘవాపూర్ గ్రామ శివారులో గల మంజీర నది వద్ద గల బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అప్పటికే మంజీర నదిలో దూకేందుకు బ్రిడ్జిపైన ఉన్న మౌనిక వైపు తమ్ముడు, చెల్లెలు పరుగులు తీశారు. నదిలో దూకవద్దంటూ కేకలు వేశారు. వారు దగ్గరకు చేరుకునే లోపు మౌనిక మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న హద్నూర్ ఎస్ఐ లవ్కుమార్ ఈత గాళ్లను నదిలోకి దింపి మర పడవల సాయంతో మృతదేహం కోసం గాలించే చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి అయినప్పటికీ మౌనిక ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం మృతదేహం నీటిపై తేలే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కుమార్తె మౌనిక కళాశాలకు వెళ్తానని చెప్పి.. ఇలా ఆత్మహత్యకు పాల్పడుతుందనుకోలేదని మృతురాలి తండ్రి అంజన్న బోరున విలపించాడు. విద్యార్థి మౌనిక మృతికి గల కారణాలు ఆమె మృతదేహం లభ్యమైతే తప్ప ఏమి చెప్పలేమని ఎస్ఐ లవ్కుమార్ వివరించారు. -
సరిహద్దులో అక్రమ రవాణా
బోధన్: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న మంజీర నది పరీవాహక ప్రాంత గ్రామాలు సరుకులు, ఇసుక అక్రమ రవాణ దందాకు అడ్డాలుగా మారాయి. యథేచ్ఛగా సాగుతున్న సరుకుల అక్రమ రవాణతో సర్కారు ఖజానాకు భారీగా గండిపడుతోంది. అధికారులకు సరుకుల అక్రమ రవాణాపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు గ్రామాల మీదుగా.. మహారాష్ట్రకు సరిహద్దులో గల నియోజకవర్గం లోని బోధన్ మండలం ఖండ్గాం వద్ద రెండు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న మంజీర నదిపై వంతెన, రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గల గోదావరి నదిపై వంతెనల మీదుగా సరుకుల అక్రమ రవాణా సాగుతోంది. ఈ రెండు వంతెనలు మహారాష్ట్ర ప్రాంతంలోని ముఖ్య పట్టణాలైన కొండల్వాడి, బిలోలి, ధర్మాబాద్ సమీపంలో ఉన్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రం, అటు మహారాష్ట్ర ప్రాంతంలోని సుదూర ప్రాం తాల నుంచి వివిధ సరుకుల లోడ్లతో లారీలు ఈ రెండు వంతెనల మీదుగా రవాణా సాగుతోంది. రెండు రాష్ట్రాల ప్రాంతంలోని ముఖ్య నగరాలకు లారీలు సరుకులను చేరవేస్తున్నా యి. నిబంధనలకు విరుద్ధంగా.. సరుకుల రవాణా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. నియోజక వర్గంలోని బోధన్ మండలం సాలూర వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టు ఉంది. ఈ చెక్పోస్టు మీదుగానే తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సరుకుల లారీల రవాణా ఉంటుంది. ఇక్కడ ఆర్టీవో, వాణిజ్య పన్నుల శాఖ, సివిల్ సప్లయ్, వ్యవసాయ మార్కెట్ శాఖ, ఎక్సైజ్ శాఖల చెక్పోస్టులున్నాయి. నిబంధనల ప్రకారం పర్మిట్, వే బిల్లులు, పన్నులు చెల్లించిన రశీదులు ,డ్రైవింగ్ లెసైన్స్లుంటేనే లారీల రవాణకు అనుమతి ఇస్తారు. ఒవర్ లోడ్ సరుకులుంటే జరిమానా విధిస్తారు. అనుమతి పత్రాలు లేని సరుకుల రవాణాకు అనుమతించరు. ఇదంతా నిబంధనల ప్రకారం జరుగుతోంది. కాని ఎలాంటి ధ్రువీకరణ లేకుండా, విలువైన సరుకుల లోడ్తో వచ్చే లారీలు దొడ్డిదారుల్లో రవాణ సాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రివేళ్లల్లో.. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల ముఖ్య నగరాల నుంచి విలువైన మార్బుల్ రాయి, ఎరువులు. సిమెంట్, ఇనుము, ప్లాస్టిక్ సామగ్రి, మద్యం, ఇతర సరుకులు తెలంగాణ ప్రాంతంలోకి రవ ణా అవుతుంటాయి.సరుకుల డిమాండ్, ధర ప్రభావంతో ఇక్కడి నుంచి మహారాష్ట్రకు, అక్కడి నుంచి తెలంగాణ ప్రాంతానికి రవాణా అవుతుంటాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యంగా వ్యవసాయోత్పత్తులు పత్తి, సో యా, వరి ధాన్యం ఎగుమతి అవుతాయి. సాలూర అంతర్రాష్ట్ర చెక్పోస్టు మీదుగా సరుకుల రాకపోకలు సాగాల్సి ఉండగా, కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన రవాణాకు పాల్పడుతున్నారు. ఖండ్గాం, కందకుర్తి గ్రామాల మీ దుగా మంజీర,గోదావరి నదుల వంతెనపై నుంచి రవాణకు పాల్పడుతున్నారు. సరిహద్దు గ్రామాల్లో రహదారులు అక్రమార్కులకు అడ్డా లు మారుతున్నాయి. అక్రమ రవాణా దందా ఎక్కువగా రాత్రి వేళల్లో కొనసాగిస్తున్నారు. పలు మార్లు రెంజల్ పోలీసులు కలప అక్రమ రవాణ లారీలను పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. విలువైన కలప తెలంగాణ ప్రాంతంలోకి దిగుమతి అవుతోంది. నిద్రపోతున్న నిఘా... సరిహద్దు గ్రామాల వద్ద ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ, నిఘా కరువైంది. కేవలం బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్వర్యం లో బోధన్ మండల ఖండ్గాం, రెంజల్ మండలం సాటాపూర్ గ్రామల వద్ద మాత్రమే పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుంచి ఖండ్గాం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన పరిశీలన కేంద్రం మూ తపడింది. సిబ్బంది కొరత వల్ల ఇక్కడి నుంచి కొంతమందిని సాటాపూర్కు మార్చారని సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. రోజుకు పదుల సంఖ్యలో లారీల రాకపోకలు సాగుతున్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తప్ప ఇతర శాఖల పర్యవేక్షణ లేదు. జిల్లా యంత్రాంగం మేలుకోవాలి.. జిల్లా అధికార యంత్రాంగం మేలుకొని సరి హద్దు గ్రామాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేక పోతే సరుకుల అక్రమ రవాణాల వల్ల ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోవడం ఖాయం.ఆయా శాఖలు చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు మొబైల్ స్వ్కాడ్లను నియమించాలి. -
మంజీర.. ప్రాణాధార
మెతుకుసీమలో పరవళ్లు తొక్కుతూ.. పచ్చని పంటలకు ఊపిరి పోస్తున్న మంజీర.. ఇక ఇంటి తలుపు తడుతూ.. ప్రతిఒక్కరి గొంతూ తడిపే ప్రాణాధారంగా మారనుంది. రూ.5,400 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో 447 కి.మీ. మేర పైప్లైన్ వేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు బృహత్ ప్రణాళిక ను సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ సర్వే కోసం మంగళవారం రూ.105 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. * తీరనున్న జిల్లావాసుల దాహార్తి * ఇక ఇంటింటికీ సరఫరా.. * 447 కిలోమీటర్ల మేర పైప్లైన్లు * రూ. 5,400 కోట్ల అంచనా వ్యయం * అధికారుల బృహత్ ప్రణాళిక మెదక్: జిల్లాలో సుమారు 95 కిలోమీటర్ల మేర మంజీర నది ప్రవహిస్తున్నా గొంతెండుతున్న పల్లెలెన్నో ఉన్నాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఫ్లోరైడ్ నీటినే తాగుతూ వేలాది మంది అభాగ్యులు వికలాంగులుగా మారుతున్నారు. మూడు పదుల వయస్సులోనే ముదుసలి వారిగా కనిపిస్తూ జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మంజీర నది, సింగూరు ప్రాజెక్టు జలవనరుల్లో మూడు గ్రిడ్లను ఏర్పాటు చేసి 447 కిలోమీటర్ల మేర 2,456 గ్రామాలకు తాగు నీరందించే పథకాన్ని రూపొందించారు. సింగూరు నుంచి ప్రతియేటా 8.8 టీఎంసీల నీటితో గ్రామీణులు ఒక్కొక్కరికి ఒక్కరోజుకు వంద లీటర్లు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఉండే ప్రజలకు 135 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ లెక్కన మెదక్, గజ్వేల్, సంగారెడ్డి వాటర్ గ్రిడ్లను విభజించనున్నారు. మెదక్ గ్రిడ్లో నారాయణ్ఖేడ్, అందోల్, దుబ్బాక నియోజకవర్గాలకు 201 కిలోమీటర్ల పైప్లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గానూ రాయికోడ్ మండలం రాయిపల్లి నుంచి సింగూరు బ్యాక్ వాటర్ను తీసుకుంటారు. అలాగే పుల్కల్ మండలం చక్రియాల్ శివారులోని మంజీరా ప్రాజెక్టు నుంచి గజ్వేల్ గ్రిడ్ పరిధిలోని నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాలకు తాగునీరందిస్తారు. ఇందుకోసం 96 కిలో మీటర్ల పైప్లైన్ వేస్తారు. ఇక సదాశివపేట మండలం ఎంఆర్ఎఫ్ వద్ద సింగూర్ ప్రాజెక్ట్ నుంచి సంగారెడ్డి గ్రిడ్ను ఏర్పాటు చేసి కుడి పైప్లైన్ ద్వారా జహీరాబాద్కు, ఎడమ పైప్లైన్ ద్వారా సదాశివపేట, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లోని 150 కిలో మీటర్ల మేర పైప్లైన్ వేసి నీరందిస్తారు. మెదక్ గ్రిడ్ స్వరూపం.. మెదక్ గ్రిడ్ ద్వారా ప్రతిరోజూ 280 మిలియన్ లీటర్ల తాగునీరందిస్తారు. రాయిపల్లి బ్రిడ్జి వద్ద సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఈ గ్రిడ్ నిర్మించనున్నారు. దీని పక్కనే ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి వట్పల్లి గుట్ట మీద ఓహెచ్బీఆర్ ఏర్పాటు చేసి నీటిని పంపిణీ చేస్తారు. నారాయణఖేడ్, వట్పల్లి, టేక్మాల్, పాపన్నపేట మండలం కొత్తపల్లిలో సంపులు ఏర్పాటు చేస్తారు. మెదక్ వెల్కం బోర్డు నుంచి రాజ్పల్లి, చిన్నశంకరంపేట వరకు మరో లైన్ వేస్తారు. మెదక్ పట్టణంలో ఒక సంపు ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి శమ్నాపూర్కు పైప్లైన్ వేస్తారు. అనంతరం అక్కన్నపేట గుట్టమీద ఓహెచ్బీ ఆర్ ట్యాంక్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని తిమ్మాపూర్, సిద్దిపేటలోని ఇర్కోడ్, సిద్దిపేట మున్సిపాలిటీల నుంచి చేర్యాల వరకు ఈ పైప్లైన్ కొనసాగుతుంది. ఇందుకో సం ప్లానింగ్ తయారు చేస్తున్నట్లు మెదక్ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్ తెలిపారు. -
‘మంజీరా’లో సింగూరు నీటి నిల్వలు
నిజాంసాగర్, న్యూస్లైన్: మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి విడుదల చేసిన జలాలు మంజీరా నదిలో నిల్వలున్నాయి. నిజాంసాగ ర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలను గట్టెక్కించడానికి సిం గూరు ప్రాజెక్టు నుంచి నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం అనుమతిని చ్చింది. దీంతో సింగూరు జలాశయం నుంచి గత నెల 26న టర్బయిన్ల ద్వారా 28న వరదగేట్ ద్వారా 9,000 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువనకు వదిలారు. ఐదు రోజుల పాటు సింగూరు జలాశయం ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టు కోసం నాలుగు టీఎంసీల నీటిని వదిలారు. ఈ నెల ఒకటి వరకు నీటివిడుదల పూర్తవడంతో వరదగేటు, టర్బయిన్ల ద్వారా నీటిని నిలిపివేశారు. ప్రస్తుతం సింగూరు జలాశయంలో 520.780 మీటర్లతో 17.492 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మట్టి దిబ్బలతో ప్రవాహానికి బ్రేకులు సింగూరు జలాశయం నుంచి వదిలిన జలాలు మంజీరా నదిలో నిల్వలున్నాయి. సింగూరు ప్రాజెక్టు- నిజాంసాగర్ ప్రాజెకు మధ్య సుమా రు 95 కిలోమీటర్ల దూరం ఉంది. సింగూరు జలాశయం నుంచి వదిలిన జలాలు మంజీరా నదిలో ప్రవహిస్తుంటాయి. మంజీరా నదిలో మట్టిదిబ్బ లు, తుమ్మపొదలు, గుంతలు ఎక్కువగా ఉండటంతో నీటిప్రవాహానికి బ్రే కులు పడుతున్నాయి.దీంతో మంజీరా నదిలో నీటినిల్వలు అధికంగా పేరుకుపోతున్నాయి. దానికి తోడు మంజీర నది పై భాగంలో రైతులు వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేసుకొని నదినీటి ద్వారా పంటలు పండించుకుంటున్నారు. ఇందుకు కోసం మంజీరా నదిలో నీరు నిల్వ ఉండేలా వారు గుంతలను తీసుకున్నారు. దీంతో మంజీరా నది నీటి ద్వారా వందల పంపుసెట్లు వేల ఎకరాల పంటలకు నీరందిస్తున్నాయి. ‘సాగర్’లో చేరింది 2.77 టీఎంసీల నీరు సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయగా ఇప్పటివరకు 2.77 టీఎంసీలు వచ్చి చేరింది. రెండు ప్రాజెక్టుల మధ్య ఉన్న మంజీరా నదిలో సుమారు 1.2 టీఎంసీల నీ రు నిల్వ ఉంది. సింగూరు జలాశయం నుంచి నాలుగు టీంసీలకు వదిలినా పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు ఆం దోళన చెందుతున్నారు. మంజీరా నది ప్రాం తంలో ఉన్న దిబ్బలు, ముళ్లపొదలను తొలగించాలని జిల్లా యంత్రాంగాన్ని స్థానిక రైతాంగం కోరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. వర్షాకాలంలో వరదలు వచ్చిన సమ యంలో మంజీరా నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న పంటపొలాల్లోకి నీరు వచ్చిచేరడంతో పంటలను రైతులు నష్టపోతున్నారు. అంతేకాకుండా సింగూరు జలాశయం నుంచి నీటిని వదిలిన ప్రతిసారి పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు సాగు జలాలను నష్టపోతున్నారు. -
జాగారమే..
మెదక్, న్యూస్లైన్: మంజీర నది జిల్లాలో సుమారు 160 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. సంగారెడ్డి, పుల్కల్, అందోల్, హత్నూర, టేక్మాల్, కొల్చారం, పాపన్నపేట, మెదక్, పెద్దశంకరంపేట, నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన సుమారు 20 వేల మంది రైతులు నదిలో దిగుడు బావులు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. 7 గంటల పాటు విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం కనీసం 5 గంట లు కూడా సరఫరా చేయకపోవడంతో అన్నదాతల కష్టాలు వర్ణనాతీతం. బ్రేక్డౌన్లు, లోడ్ రిలీఫ్ల పేరిట కరెంట్ గంటపాటు కూడా నిరంతరాయంగా సరఫరా చేయలేని పరిస్థితి నెల కొంది. రెండు విడతల కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొంది. దీంతో రైతన్నలు ఇంటిల్లిపాదికి దూరంగా సాగునీరే సర్వస్వంగా పొలాల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. కారుచీకట్లో.. రాత్రివేళ కరెంట్ కోసం వేలాది మంది రైతులు మంజీర ఒడిలోనే జాగారం చేస్తున్నారు. నదీగర్భంలో ఇసుక మేటలు తవ్వి, రింగులు వేసి జలసిరిని ఒడిసిపడుతున్నారు. విద్యుత్ మోటార్లతో పంట పొలాలకు ప్రాణం పోసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ మోటార్ల కనెక్షన్ కోసం నేలపైనే పరిచిన కరెంట్ తీగలు పలుచోట్ల తెగిపోయి కాలనాగులై కాటేస్తున్నాయి. కటిక చీకట్లో కనిపించక కాలు వేస్తే చాలు.. కాటికే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నదిలో సుమారు 12 ఫీట్ల లోతున వేసిన రింగు బావుల్లోకి రైతులు అర్ధరాత్రి దిగి మోటార్ ఫుట్వాల్వ్లను సరిచేస్తున్నారు. స్టార్టర్ బాక్స్ చెడిపోయిన..ఫ్యూజ్వైర్ పోయినా..చిమ్మ చీకట్లోనే మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రైతన్నలు రింగుబావుల్లో జారిపడి, కరెంట్ షాక్లకు, విషపురుగుల కాట్లకు గురై మృత్యువాత పడుతున్న సంఘటనలెన్నో ఉన్నాయి. పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి గ్రామానికి చెందిన మంగలి శేఖర్(25) అనే కౌలురైతు 2012 ఫిబ్రవరి 3న రాత్రి రింగుబావిలోకి దిగే క్రమంలో మృత్యువాత పడ్డాడు. గత ఏడాది సెప్టెంబర్లో అదే గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశం అనే రైతు విద్యుత్షాక్తో మృతి చెందాడు. కొడుపాకకు చెందిన కంకణాల ప్రతాప్(36), సందిల రాములు(35), మంగళి రాములు(25) అసువులు బాశారు. అయినప్పటికీ రైతన్నలకు ఎలాంటి ఆర్థికసాయం అందలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వేసవికాలం వస్తే ఘనపురం ప్రాజెక్ట్ దిగువన మంజీర నదిని జల్లెడ పడుతూ రైతన్నలు నీటిబొట్టుకోసం యుద్ధం చేస్తుంటారు. 7 గంటల నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తే మాకు ఈ పరిస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు. -
మంజీర తీరం.. జన సాగరం
పాపన్నపేట, న్యూస్లైన్: మంజీర తీరం భక్తజన సాగరంగా మారింది. మంజీర పరవళ్లలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. వేలాదిమంది ఏడుపాయలకు తరలిరావడంతో దట్టమైన దండకారణ్యం జనారణ్యంగా మారింది. సుమారు 60 వేల మందికిపైగా భక్తులు మాఘ స్నానాలు చేశారు. పోతరాజుల గావుకేకలు.. శివసత్తుల సిగాలు.. డప్పుచప్పుళ్ల మధ్య బోనాలు.. తలనీలాల మొక్కులు.. జాతరలో జానపద సంస్కృతికి అద్దంపట్టాయి. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల్లో గురువారం మాఘ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దుర్గమ్మతల్లి ఆలయాన్ని చుట్టుముడుతూ మంజీర నది ఏడుపాయలుగా చీలి ప్రవహించే సుందర దృశ్యం ఏడుపాయల్లోనే కనిపిస్తుంది. జనమే జయుని సర్పయాగస్థలి నుంచి ప్రవహించే మంజీరా నదిలో మాఘ స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందన్న ఉద్దేశంతో యేటా వేలాది మంది భక్తులు ఏడుపాయలకు వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామునుంచే మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు. ఘనపురం ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసిన మంజీర నీటిలో పుణ్య స్నానాలు చేశారు. చెక్డ్యాంలో, అమ్మవారి ఆలయం ముందు కూడా భక్తులు స్నానాలాచరించారు. అనంతరం క్యూలైన్లలో బారులు తీరి దుర్గమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. క్యూ లైన్లు కిటకిటలాడాయి. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఏడుపాయల్లోని గుట్టలు, చెట్లు జనాలతో నిండిపోయాయి. కొంతమంది భక్తులు బోనాలు, తలనీలాలు, ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. సంతానం కోసం మరికొంతమంది భక్తులు సంతానగుండంలో స్నానాలు అచరించారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, డీసీసీ కార్యదర్శి మల్లప్పలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సౌకర్యాల ఏర్పాటు.. ఉత్సవాలకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఈఓ వెంకట కిషన్రావు పూర్తి ఏర్పాట్లు చేశారు. స్నానాల కోసం ఘనపురం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో చెక్డ్యాం పొంగిపొర్లి అమ్మవారి ఆలయం ముందు నుంచి మంజీరానది పరవళ్లు తొక్కింది. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఆర్డ బ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. పొడ్చన్పల్లి వైద్య సిబ్బంది తమ సేవలందించారు. మెదక్ డీఎస్పీ గోద్రూ, పాపన్నపేట ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు సిబ్బంది తమ సేవలందించారు. -
మంజీర చెంత..తాగునీటి చింత
దాహంతో అలమటిస్తున్న ‘బుడ్మి’ తాగే నీరంతా ఫ్లోరైడ్మయమే అయినా పట్టించుకోని అధికారులు తెలిసినా స్పందించని నాయకులు కీళ్లనొప్పులు, నడుము నొప్పులు వేధిస్తున్నాయి ఆవేదన చెందుతున్న గ్రామస్తులు రక్షిత మంచినీటి పథకానికి నోచుకోని ఊరు ప్రతిపాదనలు పంపినాప్రయోజనం శూన్యం ఆ గ్రామానికి ఫ్లోరైడ్ నీరు ప్రమాదకరంగా మారింది. ఆ నీటిని సేవించిన వారందరూ కీళ్లనొప్పులు, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. దశాబ్దాలుగా వారు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బాన్సువాడ మండలంలో మంజీరా నదికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బుడ్మి గ్రామస్తుల కన్నీటి గాథ ఇది. వారి వేదనను అటు అధికారులుగానీ, ఇటు నేతలుగానీ పట్టించుకోవడం లేదు. దీంతో సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది. బాన్సువాడ, న్యూస్లైన్: బుడ్మి గ్రామం పక్క నుంచి మంజీరానది గలగలా పారుతున్నా ఆ ఊరి దాహం మాత్రం తీరడం లేదు. ఫలి తంగా అందుబాటులో ఉన్న ఫ్లోరైడ్ నీటినే తాగుతూ ఆ గ్రా మస్తులు ఆనారోగ్యానికి గురవుతున్నారు. ఇక్కడ సుమారు రెండు వేల జనాభా ఉంది. వీరందరికీ బోరు నీరే దిక్కు. ఆ నీటిలో మొత్తం ఫ్లోరైడే ఉం డడం గమనార్హం. దశాబ్దాల క్రితమే గ్రామంలోని చేతి పంపులు, బోరుబావులను పరీక్షించిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఆ నీళ్లను తాగవద్దని, కేవలం ఇంటి అవసరాలకే వినియోగించుకోవాలని సూచించారు. రక్షిత మంచినీటిని అందించే అందించే ఏర్పాటు మాత్రం చేయలేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యంతో బుడ్మి గ్రామం ఫ్లోరైడ్ భూతా నికి బలైపోతోంది. యువకులకు కీళ్ల నొప్పులు దశాబ్దాలుగా ఫ్లోరైడ్ నీటిని సేవించడంతో మహిళలు, పురుషులు, ముసలివారు, యువకులు నడుమునొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కూలినాలి చేసు కునేవారు ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు గ్రామస్తులు రూ. 12 నుంచి రూ. 20 వరకు వెచ్చించి బాన్సువాడ నుంచి మినరల్ వాటర్ బాటిళ్లు తెప్పించుకుంటున్నారు. నెలకు సుమారు రూ. 500 వరకు వెచ్చించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. సర్కార్ ఏం చేస్తోంది? మంజీరకు కూతవేటు దూరంలోనే ఉన్న బుడ్మి గ్రామానికి నది నుంచి నీటిని తెప్పించేందుకు ప్రభుత్వం కృషి చేయడం లేదు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదేశాల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 2002-03లో గ్రామస్తులకు డీఫ్లోరైడ్ నీటిని అందించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత ప్రభుత్వం రూ. 8.50 లక్షలు మంజూరు చేయగా, బుడ్మి చౌరస్తా నుంచి గ్రామం వరకు పైప్లైన్ వేసి రోడ్డు పక్కన మూడు బోర్లు వేయించారు. అక్కడ కూడా నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో గ్రామస్తుల ఆశలు ఆవిరయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థి తి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. విడుదలైన నిధులలో సుమారు రూ. నాలుగు లక్షలు వెనక్కివెళ్లాయి. తర్వాత రూ. 18.5 లక్షలతో కొత్త పైప్లైన్ నిర్మా ణా నికి ప్రతిపాదనలు పంపినా మంజూరీ లభించలేదు. పరిష్కారమెలా? బాన్సువాడ పట్టణానికి మంచినీటిని సరఫరా చేసేందుకు బుడ్మి గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో మంజీర ఫిల్టర్బెడ్ను ఏర్పాటు చేశారు. ఆ ఫిల్టర్బెడ్ నుంచి తాడ్కోల్ వరకు డీ ఫ్లోరైడ్నీటిని సరఫరా చేస్తున్నారు. తాడ్కోల్ నుంచి బుడ్మి చౌరస్తా వరకు సుమారు మూడు కిలోమీటర్ల పైప్లైన్ వేయిస్తే గ్రామ స్తులకు రక్షిత నీళ్లు అందుతాయి. ఇది ఎక్కువ ఖర్చుతో కూడిన పని కూడా కాదు. మాకు నల్లగొండ గుర్తుకస్తది మేం అప్పుడప్పుడు నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితుల గురించి టీవీల్లో చూస్తుంటం. వాళ్లను చూస్తే మాకు కూడా అదే సమస్య ఉందని అనిపిస్తది. కానీ మా గురించి పట్టించుకొనేటోళ్లు లేరు. ప్రభుత్వాలు మారినా మా సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఎన్నికలప్పుడే నాయకులు అస్తరు. -వెంకట్రాములు, గ్రామస్తుడు యవ్వనంలోనే కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పులున్నాయని చెబితే స్నేహితులు, డాక్టర్లు వెక్కిరిస్తున్నారు. ఈ వయసులో నొప్పులేంటని ఎగతాళి చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి నీటి బొట్టు ఫ్లోరైడ్తో కూడుకుని ఉంది. ఇప్పటికైనా అధికారులు ఆలోచించాలి. -జావీద్, గ్రామ యువకుడు ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి సమస్య పరిష్కారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే పోచారం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాను. అధికారులు రక్షిత నీటి పథకం నిర్మాణానికి రూ. 18.5 లక్షల మంజూరు కోసం సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. దానికింకా మోక్షం లేదు. - జిన్న గంగాధర్, సర్పంచ్, బుడ్మి మా గోడును పట్టించుకోరు మా ఊరి జనం తక్కువ వయస్సులోనే ముసలోళ్లు అయిపోతున్నరు. యువకులు కీళ్ల నొప్పులు, నడుమునొప్పులతో బాధ పడుతున్నరు. కానీ సర్కారు పట్టించుకుంట లేదు. పదేళ్లుగా చెబుతున్నా ఎవ్వరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు. అధికారులు వస్తరు, నాయకులు వస్తరు, వింటరు, పోతరు. మా బాధ మాత్రం తీరదు. ఇగ మా గోడు ఎవరికి చెప్పుకోవాలి సారూ? ఇప్పటికైనా మాకు ‘మంచి’నీళ్లు ఇప్పించండి. మా ఊరి బాధ తీర్చండి. -కృష్ణమయ్య, గ్రామస్తుడు -
‘ఎత్తి’ పోసేది ఎప్పుడో?
కోటగిరి, న్యూస్లైన్: తలాపున మంజీరా నది పారుతున్నా పంట పొలాలకు మాత్రం చుక్క నీరందడం లేదు. నై బారిన భూములకు నీరు పారించి సాగులోకి తెచ్చేందుకుగాను చేపట్టిన ఎత్తిపోతల పథకాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఫలితంగా కోటగిరి మండలంలోని సుంకిని, హెగ్డోలి, కొల్లూరు గ్రామాల రైతులు ఏటా సుమారు రూ.30 కోట్ల విలువైన పంట సాగును కోల్పోతున్నారు. సుంకిని ఎత్తిపోతలు సుంకిని ఎత్తిపోతల పథకం పూర్తయితే బీడుగా ఉన్న సుమారు 1350 ఎకరాలు సాగులోకి వస్తాయి. దీని నిర్మాణానికి మొదటి విడతలో రూ. 1.23 కోట్లు మంజూరయ్యాయి. అధికారులు పనులు ప్రారంభించగానే కొంద రు రైతులు తమ పంటపొలాల్లో నుంచి కాలువ లు తీయవద్దని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించి పైపులైన్లు వేసేందుకు రెండో విడతగా రూ.85 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో సుంకిని నుంచి కొల్లూరు వరకు 3 కి.మీటర్ల మేర రైతుల పంట పొలాల నుంచిపైపులైను వేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా ఈ పథకం నిర్మాణం కోసం గ్రామాని కి చెందిన ఓరైతు నుంచి ఎకరం భూమిని కొనుగోలు చేసిన అధికారులు అందుకు సంబంధిం చిన డబ్బులు పూర్తిగా చెల్లించలేదు.దీంతో రైతు తన భూమిపరిధిలోనికి రానివ్వడం లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతంతో ఈ భూమి ఖరీదు వేలల్లో వుండగా ప్రస్తుతం లక్షల రూపాయలు పలుకుతోంది. ఇప్పటి మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లిస్తేగానీ స్థలం అప్పగిం చేది లేదని రైతు భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో పనులు నిలిచిపోయి ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ముళ్లపొదలు పెరిగిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్ చెడిపోవడంతో దానికి మరమ్మతులు చేయిద్దామన్నా రైతు అధికారుల ను లోనికి రానివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అసంపూర్తిగా హెగ్డోలి హెగ్డోలి ఎత్తిపోతల పథకం పూర్తయితే సుమా రు 850 ఎకరాలు సాగులోనికి వస్తాయి. పథక నిర్మాణానికి మొదటి విడతలో రూ. 90 లక్షలు, రెండవ విడతలో రూ. కోటి 60 లక్షలు మం జూరయ్యాయి. ఈ నిధులతో ఇన్టెక్వాల్, పం ప్హౌజ్ ని ర్మించగా పైపులైనులు సగం వరకే పూర్తయ్యా యి. కొల్లూరు ఎత్తిపోతల పథకం కొల్లూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే సుమా రు 850 ఎకరాలు సాగులోకి వస్తాయి. దీని నిర్మాణానికి మొదటి విడతలో రూ. 90 లక్షలు, రెండవ విడతలో రూ. 60 లక్షలు మంజూరుకాగా పనులు ప్రారంభించారు. సుమారు 300 మీటర్ల మేర పైపులైనులు పూర్తిచేయాల్సివుంది. పంప్హౌజ్ నిర్మించాల్సివుంది. రైతులతో ధర్నా చేస్తా : పోచారం ఇంకెన్నాళ్లకు ఎత్తిపోతలు పథకాలను పూర్తిచేస్తారు, మీ నిర్లక్ష్యం ఫలితంగా కొంత కాలంగా రైతులు ఏటా రూ. 30 కోట్ల మేర పంటపై వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నారని హెగ్డోలిలో అధికారులు, రైతులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మండిపడ్డా రు. మీరేం చేస్తారో నాకు తెలీయదు, నెలలోగా మిగిలిన పనులను పూర్తిచేసి రబీసీజన్లో వేసే పంటలకు నీరందించాలని అన్నారు. లేకపోతే కార్యాలయం వద్ద రైతులతో ధర్నా చేస్తానని పోచారం హెచ్చరించారు. 75 శాతం పనులు పూర్తి -మాధవరావు, ఎత్తిపోతల పథకం కార్యదర్శి అనివార్య కారణాల వల్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. అధికారులు వర్షాకాలం మొదలయ్యే సమయంలో నిర్మాణ పనులు ప్రారంభించడంతో జాప్యం జరుగుతోంది. 75 శాతం మేర పనులు పూర్తయ్యాయి. సుంకిని-కొల్లూరు వరకు వేయాల్సిన 1300 మీటర్ల పైపులైనుకు 1250 మీటర్లు పూర్తిఅయింది. కేవలం 50 మీటర్లు వేయాల్సివుంది. హెగ్డోలి ఎత్తిపోతల పథకం దాదాపు పూర్తిగావచ్చింది. కొంత మేర పైపులైను పను లు ఆగాయి. కొల్లూరు ఎత్తిపోతల పథకం పూర్తికాగా పంప్హౌజ్ కట్టాల్సివుంది. నిధుల కొరతతో కొంత మేర పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు పూర్తిచేస్తాం. -
‘మంజీర’ గర్భంలో గుంతలు
బాన్సువాడ, న్యూస్లైన్ : ఇసుక మాఫియాతో మంజీరా నది ప్రమాదకరంగా మారుతోంది. కాంట్రాక్టర్లు పొందిన అనుమతి కంటే అధికంగా ఇసుకను తోడేస్తున్నారు. నిబంధనల కు విరుద్ధంగా 30 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వుతున్నారు. దీంతో నదిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం పట్టాభూముల్లో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చింది. బీర్కూర్ మండలంలోని బీర్కూ ర్, బరంగేడ్గి, బిచ్కుంద మండలంలోని పుల్కల్, వాజీద్నగర్, గుండెనెమ్లిల్లో పట్టాభూములనుంచి ఇసుక తరలించడానికి అనుమతి పొందిన కాంట్రాక్టర్లు.. దీనిని ఆసరా చేసుకుంటూ నది లోకి కూడా చొచ్చుకెళుతున్నారు. కూలీల ద్వా రానే ఇసుకను తవ్వాల్సి ఉంది. కాంట్రాక్టర్లు మాత్రం పొక్లెయిన్లతో 25నుంచి 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వుతున్నారు. దీంతో నది లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని, వర్షపు నీటితో ఈ గుంతలు నిండిపోయి ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బిచ్కుంద మండలంలోని బండరెం జల్, గుండెనెమ్లి, వాజీద్నగర్, పుల్కల్, హస్గు ల్, ఖద్గాం, శెట్లూర్, బిచ్కుంద, పిట్లం మండలంలోని మద్దెల్ చెరువు, బాన్సువాడ మండ లం లోని చింతల్నాగారం, బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బరంగే డ్గి, కోటగిరి మండలంలోని హంగర్గ, పొతంగ ల్ గ్రామాల్లోన్ని మంజీర తీర ప్రాంతవాసులు ఈ గుంతల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మంజీర నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక త వ్వకాలు జరుపుతుండడంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈసారి వర్షాలు స మృద్ధిగా కురిసినా బాన్సువాడ ప్రాంతంలో 200 మీటర్ల లోతులో కూడా నీరు లభించడం లేదు. తొమ్మిది గ్రామాలకు తాగునీటిని సరఫ రా చేయడానికి పుల్కల్ గ్రామ సమీపంలోని న దీ తీరంలో బావిని తవ్వారు. బాన్సువాడ పట్టణానికి సైతం మంజీరా నది నుంచే నీరు సరఫరా అవుతోంది. ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు పడిపోయి తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. రెండేళ్ల క్రితం ఇద్దరి మృత్యువాత రెండేళ్ల క్రితం మంజీర నదిలోని గుంతల్లో చి క్కుకుని ఇద్దరు యువకులు మృత్యువాత ప డ్డారు. వాజిద్నగర్ గ్రామానికి చెందిన లింగురాం, అశోక్ హోలీ జరుపుకున్న అనంతరం స్నా నానికి నదిలోకి వెళ్లి ఈ గుంతల్లో చిక్కుకొని మ రణించారు. పలువురు ప్రమాదాల నుంచి తృ టిలో తప్పించుకున్నారు. సుమారు రూ. 30 వేల విలువ చేసే ఎద్దు గుంతలో పడి మృతి చెందిం ది. నిబంధనలకు విరద్ధంగా ఇసుక తవ్వుతున్నందునే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నదీతీర ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్ర మ తవ్వకాలకు చెక్ పెట్టాలని, మంజీరను రక్షిం చాలని కోరుతున్నారు.