పురాతన పుష్కరిణి బావిని ప్రారంభించిన కేటీఆర్‌ | KTR Inaugurates Historic Bapu Ghat Step Well In Hyderabad | Sakshi
Sakshi News home page

పురాతన పుష్కరిణి బావిని ప్రారంభించిన కేటీఆర్‌

Published Tue, Nov 30 2021 5:05 AM | Last Updated on Tue, Nov 30 2021 5:05 AM

KTR Inaugurates Historic Bapu Ghat Step Well In Hyderabad - Sakshi

లంగర్‌హౌస్‌: బాపూఘాట్‌లో పురాతన పుష్కరిణి బావిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లంగర్‌హౌస్‌ త్రివేణి సంగంలో బాపూజీ అస్థికలు నిమజ్జనం చేసి బాపూ సమాధి, ధ్యానమందిరం నిర్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న పురాతన బావిని జీఎంఎస్‌ స్వచ్ఛంద సంస్థ పునరుద్ధరించింది.

గోడలకు మొలిచిన చెట్లను తొలగించి బావికి మరమ్మతులు చేయించి రంగులు వేశారు. కేటీఆర్‌ సోమవారం ఈ బావిని ప్రారంభించి, ఇందులో గంగా జలాన్ని, తాబేళ్లను వదిలారు. కార్యక్రమంలో ఆయన వెంట మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌లు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement