కాలర్‌ ట్యూన్‌తో సైబర్‌ నేరాలు అరికట్టలేం | KTR warns of technology dark side: Bengaluru summit | Sakshi
Sakshi News home page

కాలర్‌ ట్యూన్‌తో సైబర్‌ నేరాలు అరికట్టలేం

Published Fri, Feb 28 2025 6:16 AM | Last Updated on Fri, Feb 28 2025 6:16 AM

KTR warns of technology dark side: Bengaluru summit

టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడకుంటే భారీ విధ్వంసం: కేటీఆర్‌

బెంగళూరులో ఆంట్రప్రెన్యూర్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సదస్సు 

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక ప్రగతితోపాటు సైబర్‌ నేరాలు కూడా పెరుగుతున్నాయని, కేవలం ఫోన్‌ కాలర్‌ ట్యూ­న్లతో వాటిని నియం­త్రించలేమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటివల్ల చోటుచేసుకుంటున్న దుష్పరిణా­మాలు ఆపడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారిందన్నారు. టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్‌ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నదో ఆలోచించాలన్నారు. బెంగళూరులో గురు­వారం ప్రారంభమైన ‘2025 ఆంట్రప్రెన్యూర్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. 

డిజిటల్‌ అక్షరాస్యతతో సమాన అవకాశాలు..: ‘సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నా ప్రతీ సాంకేతిక ఆవిష్కరణ వెనుక మానవ అవసరాలు, నైతిక విలువలు నిలకడగా ఉండాలి. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచాన్ని సమూ­లంగా మార్చబోతున్నాయి. సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించకపోతే అది ప్రమాద­కరంగా తయారవుతుంది. సామాజిక ప్రయో­జ­నాన్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ అభివృద్ధి జరగాలి.

టెక్నాలజీతో పర్యావరణంపై కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకెళ్తే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. ప్రజలు తమ మాతృభాషల పట్ల జరుగుతున్న వివక్షపైనే కాకుండా సమా­జంలో ఏర్పడుతున్న సరికొత్త విభ­జనపైనా దృష్టి సారించాలి. డిజిటల్‌ అంతరం పెరుగు­తున్నకొద్దీ సమాజంలో మరింత విభజన వస్తుంది. డిజిటల్‌ అక్షరాస్యత ద్వారానే అందరికీ సమాన అవకాశాలు లభి­స్తాయి’ అని కేటీఆర్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement