BIG Clash Between MRPS VS BJP Leaders in Mahabubnagar - Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్ వర్సెస్‌ బీజేపీ.. మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత.. బండిని కలిసిన మరునాడే..

Published Tue, Jan 24 2023 2:38 PM | Last Updated on Tue, Jan 24 2023 3:47 PM

Mahabubnagar  MRPS BJP Leaders Fight SC classification Agitation - Sakshi

బీజేపీ వర్సెస్‌ ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు కర్రలతో పరస్సరం దాడికి.. మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సాక్షి, మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, బీజేపీ కార్యకర్తల నడుమ ఘర్షణ జరిగింది. కర్రలతో ఇరు వర్గాలు దాడికి దిగగా.. అడ్డుకునే యత్నం చేసిన ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. మరోవైపు పోలీస్‌ వాహనం సైతం ధ్వంసం కావడంతో..  నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఎస్సీ వర్గకరణ సమస్య పరిష్కారం డిమాండ్‌తో ర్యాలీ చేపట్టిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు.. అన్నపూర్ణ గార్డెన్‌ వద్దకు చేరుకుని భారీ ఎత్తున​ నినాదాలు చేశారు. అదే సమయంలో లోపల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. బయటకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై బాహాబాహీకి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో.. ఓ కానిస్టేబుల్‌కు గాయాలు కాగా, ఓ పోలీస్‌ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కార డిమాండ్‌తో ఎమ్మార్సీఎస్‌ ఆందోళన చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇక గత రాత్రి ఎమ్మార్పీఎస్‌ ప్రతినిధుల బృందం ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించాయి కూడా. అయినప్పటికీ మరుసటి నాడే  ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో.. దీని వెనుక ఎవరైనా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది బీజేపీ. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement