ఎంఎంటీఎస్‌ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ | MMTS Train Victim Discharged From Hospital | Sakshi

ఎంఎంటీఎస్‌ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ

Apr 3 2025 9:22 AM | Updated on Apr 3 2025 9:22 AM

MMTS Train Victim Discharged From Hospital

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌–మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌ రైలులో లైంగిక దాడి యత్నం ఘటన నుంచి బైటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో ఆమెను ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జి చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

 మార్చి 22న రాత్రి ఎంఎంటీఎస్‌ రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు దాడిచేయటంతో, తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి కిందకుదూకిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

రెండు రోజుల తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ, దంతాలకు శస్త్ర చికిత్సలు చేయించారు. పది రోజులపాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకున్నట్టు డాక్టర్లు ధృవీకరించటంతో సొంత ఊరికి పంపించినట్టు పోలీసులు తెలిపారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement