Plastic Surgery
-
చెవి తమ్మె పూర్తిగా తెగిపోతే..!
ఫ్యాషన్లో భాగంగానో లేదా తమ దుస్తులకు మ్యాచింగ్గా ఉంటాయనో కొందరు చాలా బరువైన ఇయర్ రింగ్స్ను వాడుతుంటారు. ఇలాంటి ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ ఎక్కువగా వాడుతుండటం లేదా హ్యాంగింగ్స్ తరచూ వేసుకుంటూ ఉండటంలో వాటి బరువు కారణంగా క్రమంగా చెవి రంధ్రం సాగితూ, ఆ రంధ్రం పెద్దదైపోయి ఒకదశలో చెవి తమ్మె పూర్తిగా తెగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇది పూర్తిగా తెగిపోయాక అప్పుడు రిపేర్ చేయించుకోవడం కంటే రంధ్రం పెద్దది అవుతున్న సమయంలోనే చేయించుకోవడం మంచిది. చాలా ఎక్కువ బరువుండే ఇయర్ రింగ్స్ లేదా హ్యాంగింగ్స్ కారణంగా చెవి బాగా సాగిపోయిన లేదా తెగిపోయిన చెవి తమ్మెను ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ ద్వారా రిపేర్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో బాధితులకు ఎలాంటి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం ఆ ప్రాంతం వరకు శరీరం మొద్దుబారేలా మత్తు (లోకల్ అనస్థీషియా) ఇస్తే సరిపోతుంది. రెండుగా చీలిపోయినట్లుగా తెగిన చెవి తమ్మెను నేరుగా ప్లాస్టిక్ సర్జరీ చికిత్సలోనైనా లేదా చికిత్స తర్వాత గాయం మానిన తర్వాతనైనా... సదరు గాయం మచ్చను కనపడకుండా చేసేందుకూ చికిత్స అందించడం వచ్చు ఇందులో భాగంగా చెవి తమ్మెను వంకరటింకరగా (జిగ్జాగ్)గా అతికిస్తూ నిపుణులు రిపేర్ చేస్తారు. అయితే ఇలా చెవి తమ్మెలను అతికించే ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. అయితే ఈ అతికింపు ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. చెవి రంధ్రం చీరుకున్న తీరును బట్టి బాధితులకు ఎలాంటి ప్రక్రియ అవసరమో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ తర్వాత వాళ్లతోనే మాట్లాడుతూ (కౌన్సెలింగ్ నిర్వహిస్తూ) వాళ్లకు అవసరమైన ప్రక్రియ గురించి వివరిస్తారు. వాళ్లు అంగీకరిస్తే అప్పుడు అతికింపు చికిత్స చేస్తారు. ఈ చికిత్సలో భాగంగా రెండుగా చీరుకున్న రంధ్రానికి కుట్లు వేయడం కోసం అత్యంత నాణ్యమైన, బయటకు కనపడని సున్నితమైన దారాన్ని ఉపయోగిస్తారు. ప్రక్రియ అంతా పూర్తయ్యాక చికిత్స నిర్వహించిన చోట కొన్నాళ్ల పాటు పైపూతగా ఉపయోగించే యాంటీబయాటిక్ క్రీమ్ను కొంతకాలం పాటు రాయాల్సి ఉంటుంది. కాక΄ోతే గాయం అంతా మానాక వెంటనే బయటకు కనపడదుగానీ... బాగా పరిశీలనగా చూస్తే ఓ పెన్సిల్తో గీసినంత సన్నగా ఉండే గీత అస్పష్టంగా కనిపిస్తుంది. ఈ అతికింపు ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ చెవి కుట్టించుకోవాలంటే... చెవి రంధ్రం పూర్తిగా పూడిపోయాక కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆగి, అప్పుడు కుట్టించుకోవచ్చు. అయితే ఈసారి మళ్లీ అలాంటి చాలా బరువైన హ్యాంగింగ్స్ కాకుండా తేలికైనవి వాడుతూ మాటిమాటికీ చెవి తమ్మె తెగి΄ోకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక చెవి తమ్మెలు బాగా లేతగా ఉండే చిన్నారి బాలికలూ, చెవి తమ్మెలో తగినంత స్థలం లేనివారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. డా. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: ఛాతీలో నీరు చేరితే...?) -
నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!
అందమైన నయనాలే కాదు వాటికి పైన ఉండే కనుబొమలతోనూ ముఖ కవళికల్లో మార్పులు తీసుకురావడం సాధ్యమేనా?! అని అడిగితే సాధ్యమే అంటోంది నటి నయనతార. ముఖాకృతిలో మార్పులకు కనుబొమలు కీలకమైనవి అంటోందామె.జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నయనతార ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. దీంతో ఆమెలో వచ్చిన మార్పును సూచిస్తూ పాత, కొత్త ఫోటోలు పెట్టి, నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ పుకార్లకు స్పందించి, కనుబొమల తీరులో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్లనే ఇది సాధిస్తున్నానని, ఇందుకు ΄్లాస్టిక్ సర్జరీ అవసరమే లేదని తెలిపింది. ‘ఇది నిజమైన గేమ్ ఛేంజర్. నా కనుబొమలలో మార్పులు తీసుకురావడం నాకు చాలా ఇష్టం. కొన్నేళ్లుగా విభిన్న రకాల కనుబొమలను ట్రై చేస్తూ వచ్చాను. అది ఇప్పుడు వర్క్ ఔట్ అయిందనుకుంటా! అలాగే సన్నగా కనిపించేందుకు లైపోసక్షన్ చేయించుకున్నాననే వార్తలు కూడా వచ్చాయి. కానీ, అది నిజం కాదు. ఆహారాన్ని బట్టి బరువు హెచ్చుతగ్గుల్లో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఆ మార్పుల్లో భాగంగా ఒకసారి నా బుగ్గలు లోపలికి వెళ్లినట్టు, మరోసారి బయటికి వచ్చినట్టు కనిస్తాయి. కావాలంటే నా బుగ్గలను నొక్కి చూడవచ్చు, వీటిలో ΄్లాస్టిక్ లేదు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది నయన్. -
ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన నయనతార
దక్షిణాదిలో లేడీ సూపర్స్టార్ అనగానే అందరూ నయనతార పేరు చెబుతారు. అందుకు తగ్గట్లే ఒక్కో మెట్టు ఎదుగుతూ పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేంతవరకు వచ్చింది. యాక్టింగ్ గురించి వంక పెట్టడానికి ఏం లేదు గానీ కెరీర్ ప్రారంభంలోనే ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే విమర్శలు వచ్చాయి. తాజాగా వీటిపై వివరణ ఇచ్చింది. ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజమేంటో చెప్పేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)'నాకు కనుబొమ్మలు అంటే చాలా ఇష్టం. వాటి షేప్ ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఎంతో సమయాన్ని దానికోసం పెడతాను. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా నా ముఖం కాస్త మారినట్లు అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ప్రజలు అలా అనుకుంటున్నారు. అయితే వాళ్లు మాట్లాడుకునేది నిజం కాదు. డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావొచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి పోయినట్లు అనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు. నా బాడీలో ఎక్కడ ప్లాస్టిక్ ఉండదు' అని నయనతార చెప్పింది.గతేడాది మూడు సినిమాలు చేసిన నయనతార.. ప్రస్తుతం ఐదు మూవీస్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఇద్దరు కొడుకులకు ఎప్పటికప్పుడూ సమయాన్ని ఆస్వాదిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేస్తూనే ఉంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు) -
టెలిగ్రామ్ సీఈవో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా?
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్లైన్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్లో దురోవ్ అరెస్టయ్యారు.రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్ను మెసేజింగ్ యాప్గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్కి చెందిన ఈ బిలియనీర్ను వారం రోజుల క్రితం పారిస్లో అదుపులోకి తీసుకున్నారు.దురోవ్ 2011 నుంచి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.సోషల్ మీడియాలో వైరల్ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn— Creepy.org (@creepydotorg) September 1, 2024 -
ఆ అవసరం ఇంకా రాలేదన్న చిరంజీవి హీరోయిన్.. రూమర్స్పై స్పందించిన నటి!
బాలీవుడ్ భామ రీమీ సేన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే. టాలీవుడ్లో మెగాస్టార్ సరసన అందరివాడు చిత్రంలో నటించింది. తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది. 2003లో హంగామా సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ధూమ్, ధూమ్-2, షాజని, గోల్మాల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి.తాజాగా తనపై వస్తున్న వార్తలపై రిమీ సేన్ స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న కథనాలు అవాస్తవమని తెలిపింది. కేవలం ఫిల్లర్, బోటాక్స్(ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా థెరపీ) చికిత్స మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించింది. తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అవసరమైతే 50 ఏళ్లు దాటిన తర్వాత దాని గురించి ఆలోచిస్తానని రిమీసేన్ పేర్కొంది.ప్రస్తుతం తనకు ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తున్నారని వివరించింది. తాను అందంగా కనిపించేందుకు వారు ఎంతగానో సహకరిస్తున్నారని రిమీ తెలిపింది. ఇటీవల తన ఫోటోలు చూసి అభిమానులు ఇష్టపడుతున్నారని నటి పేర్కొంది. కాగా.. రిమీ సేన్ చివరిసారిగా 2011లో వచ్చిన షాగిర్డ్ చిత్రంలో నటించింది. ఆమె సినిమాకు దూరమై దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. బాలీవుడ్లో దీవానే హుయే పాగల్, గరం మసాలా, హ్యాట్రిక్, జానీ గద్దర్, దే తాలీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rimi Sen (@subhamitra03) -
నటుడికి ప్లాస్టిక్ సర్జరీ? ఏడేళ్ల క్రితమే..
సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఫిల్మీదునియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. హీరోయిన్లకే కాదు హీరోలకు కూడా ఈ రూమర్స్ తప్పవు. బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు కూడా తన దవడకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని ఈ మధ్య పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సదరు నటుడు స్పందిస్తూ.. తను ఎటువంటి సర్జరీ చేయించుకోలేదని ఊహాగానాలకు ముగింపు పలికాడు. మేకప్ లేకపోవడం వల్ల.. గతంలో తన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు చిన్పై ఫిల్లర్స్ మాత్రమే వేయించుకున్నానన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. 'ఆ ఫోటో అస్సలు బాలేదు. మేకప్ లేనందువల్ల మీకలా అనిపించిందంతే! నాక్కూడా ఆ లుక్ కాస్త వింతగానే అనిపించింది. దాన్ని కెమెరాల్లో బంధించి వైరల్ చేసేశారు. కాకపోతే ఎనిమిదేళ్ల క్రితం నా పర్సనల్ డాక్టర్ చెప్పినదాని ప్రకారం.. మరింత కాన్ఫిడెంట్గా కనిపించేందుకు ఫిల్లర్ ట్రై చేశాను. మేము కెమెరాముందు అందంగా కనిపించాలి. ప్లాస్టిక్ సర్జరీ చాలా కాస్ట్లీ కాబట్టి ఇది తప్పేం కాదు. మన ఆత్మస్థైరాన్ని మరింత పెంపొందిస్తుందనేవాటికి ఎందుకు నో చెప్పడం? నేను ఏదైనా ఓపెన్గా చెప్పేస్తుంటాను. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఖరీదైన వైద్యం.. ఎంతో టైం పడుతుంది కూడా! నేను దాని జోలికి వెళ్లలేదు' అని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రాజ్కుమార్ రావు అంధుడు శ్రీకాంత్ బొల్ల బయోపిక్లో నటిస్తున్నాడు. ఈ మూవీ మే 10న విడుదల కానుంది. చదవండి: 'ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..' అక్కర్లేదంటూ సందీప్ కౌంటర్ -
హీరోయిన్లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..
అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు చాలమంది. ఇలా అందం కోసం చేయించుకున్న సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇలా ఒకటో రెండో సర్జరీలు అయితే ఓకే. కానీ ఇక్కడొక అమ్మాయి తనకు నచ్చిన హీరోయిన్లా ఉండాలని ఎన్ని సర్జరీలు చేయించుకుందో వింటే కంగుతింటారు. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన ఝూ చునా జస్ట్ 13 ఏళ్ల వయసుకే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాలనుకుంది. తనకు ఇష్టమైన నటి ఎస్తేర్ యులా ఉండాలని కోరుకుంది. ఇలా ఈ ఏజ్లోనే ప్లాస్టిక్ సర్జరీలుచేయించుకోవాడానికి ప్రధాన కారణం..ఆమె స్నేహితులు, బంధువులు తన తల్లి కంటే అందంగా లేవని చెప్పడం తట్టుకోలేకపోయింది. అదీగాక తన తోటి విద్యార్థులు కూడా అందంగా ఉండటం వల్లే కాన్ఫిడెంట్గా ఉన్నారని నమ్మింది. ఇవన్నీ కలగలసి చునాని ఆత్మనూన్యత భావంలోకి నెట్టి..తన రూపాన్ని మార్చుకోవాలనే చర్యకు ప్రేరేపించాయి. అలా చునా 13 ఏళ్ల నుంచి ప్లాస్టిక్ సర్జరీల చేయించుకోవడం ప్రారంభంచింది. అయితే ఆమె తల్లి తొలి ఆపరేషన్కి సపోర్ట్ చేసి డబుల్ కనురెప్పల ప్రక్రియకు అనుమతించింది. ఆ తర్వాత నుంచి చునా ఒక్కొక్కటిగా రూపాన్ని మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమైపోయింది. అలా పాఠశాల విద్యకు కూడా దూరమయ్యింది. ఇలా ఆమె దాదాపు అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలను దాదాపు వందకు పైగా చేయించుకుంది. వాటిలో రినోప్లాస్టి, బోన్ షేవింగ్ వంటి క్రిటికల్ ప్లాస్టిక్ సర్జరీలు కూడా ఉన్నాయి. డాక్టర్లు తన కళ్లను పెద్దవి చేసే పని చేయడం కుదరదని హెచ్చరించారు. అయినా సరే లెక్కచేయక వేరే డాక్టర్ని సంప్రదించి చేయించుకుంది. ఆ సర్జరీల్లో అత్యంత పెయిన్తో కూడిన సర్జరీ బోన్ షేవింగ్. దీన్ని ఏకంగా పది గంటలపాటు చేస్తారు వైద్యులు. దీని కారణంగా 15 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఇన్ని నరకయాతనలు అనుభవించినా కూడా.. ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా అచ్చం తను ఇష్టపడే హీరోయిన్లా ఉండే సర్జరీలు చేయించుకోవడం ఆపకపోవడం కొసమెరుపు. ఇక్కడ ఏ వైద్యుడు ఆమెకు ఒక్కసారి ప్లాస్టిక్ సర్జరీ చేశాక మరో సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చేవాడు కాదు. అయినా ఆ తిరస్కరణలు కూడా పట్టించుకోకుండా ఇంకో డాక్టర్ ..ఇంకో డాక్టర్ అంటూ సంప్రదిస్తూ ఆపరేషన్ చేయించుకుంది. ఇలా ఆమె వందకు పైగా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు రూ. 4 కోట్లకు పైగా ఖర్చు చేసిందట. అయితే ఇన్ని ఆపరేషన్లకు చునా తల్లి కూడా సపోర్ట్ చేయలేదు. ఇక ఆమె తండ్రి చునా కొత్త రూపాన్ని అస్సలు అంగీకరించ లేదు. అలాగే ఆమె స్నేహితులు సైతం ఆమె కొత్త రూపాన్ని చూసి చునా అని గుర్తుపట్టులేకపోయారు. ఏదీఏమైతేనే చునా అనుకున్నది సాధించి అన్ని బాధకరమైన సర్జరీ ప్రక్రియలను చేయించుకుని మరీ తనకు ఇష్టమైన హీరోయిన్లా మారాలనే కలను నిజం చేసుకుంది. ప్రస్తుతం చునాకి 18 ఏళ్లు. ఇక తన శస్త్రచికిత్సా ప్రయత్నాలను కూడా ముగించినట్లు ప్రకటించింది. మరీ ఇంతలా అందం కోసం ప్రాణాలనే పణంగా పెట్టే వెర్రీ మనుషులు ఉంటారా? అనిపిస్తుంది కదూ!.. (చదవండి: చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
Alla Dakshayani: దిద్దుబాటు
జీవితంలో దిద్దుబాటు చాలా అవసరం. అక్షరాలను దిద్దుకుంటాం. నడవడిక దిద్దుకుంటాం. మాటను దిద్దుకుంటాం... చేతను దిద్దుకుంటాం. ఇన్నింటిని దిద్దుకోవడం వచ్చిన వాళ్లం... చెదిరిన రూపురేఖల్ని దిద్దుకోలేమా? కాంతి రేఖల కొత్త పొద్దుల్ని చూడలేమా? సూర్యుడు కర్కాటకం నుంచి మకరానికి మారినట్లే... క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలేట్తో పుట్టిన పిల్లలు కూడా మామూలు పిల్లల్లా బతికి బట్టకట్టాలి కదా! అగ్నిప్రమాదానికి గురైన వాళ్లు ముడతలు పడిన చర్మంతో బతుకు సాగించాల్సిన దుస్థితి ఎందుకు? ప్రమాదవశాత్తూ ఎముకలు విరిగి ముఖం రూపురేఖలు మారిపోతే... ఇక జీవితమంతా అద్దంలో ముఖం చూసుకోవడానికి భయపడాల్సిందేనా? వీటన్నింటికీ వైద్యరంగం పరిష్కరిస్తుంది. అయితే ఆ వైద్యం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంటుంది. ఖర్చుపరంగా ఆకాశమంత ఎత్తులో ఉన్న వైద్యప్రక్రియను అవనికి దించాలంటే పెద్ద మనసు ఉండాలి. అలాంటి సమష్టి కృషిని సమన్వయం చేస్తున్నారు ఆళ్ల దాక్షాయణి. బాధితుల జీవితాల్లో కాంతిరేఖలను ప్రసరింపచేయడానికి ఏటా జనవరి నెలలో ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహిన్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘ఒకప్పుడు గ్రహణం మొర్రి కేసుల గురించి తరచూ వినేవాళ్లం. కాలక్రమేణా సమాజంలో చైతన్యం పెరిగింది. గర్భస్థ దశలోనే గుర్తించి, పుట్టిన వెంటనే సర్జరీలు చేసి సరి చేసుకునే విధంగా వైద్యరంగం కూడా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ మారుమూల గ్రామాల్లో గ్రహణం మొర్రి బాధితులున్నారు. వాళ్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే స్థోమత లేని తల్లిదండ్రులు పిల్లల వైకల్యాన్ని సరిచేయలేకపోతున్నారు. ఒక బిడ్డ ఆర్థిక కారణాలతో వైకల్యాన్ని భరించాల్సిన దుస్థితి రావడం దారుణమైన విషయం. అలాగే ఇటీవల అగ్ని ప్రమాద బాధితులు, యాసిడ్ దాడి బాధితులు కూడా పెరుగుతున్నారు. వీటికితోడు వాహన ప్రమాదాల కారణంగా వైకల్యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్లు బయటపడగలుగుతున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని వాళ్లు బాధితులుగా మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ బాధ్యత చేపట్టాం. నిజానికి ఈ సర్వీస్ మొదలై ఇరవై ఏళ్లు దాటింది. ► ఇద్దరు వైద్యుల చొరవ రెండు వేల సంవత్సరంలో మొదలైన ఈ కార్యక్రమం కోవిడ్ రెండేళ్లు మినహా ఏటా జరుగుతోంది. డాక్టర్ భవానీ ప్రసాద్ అనస్థీషియనిస్ట్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి ప్లాస్టిక్ సర్జన్. వీళ్ల ఆలోచనతోనే ఈ సర్వీస్ మొదలైంది. మొదటి ఏడాది హైదరాబాద్లోని మహావీర్, మెడ్విన్ హాస్పిటళ్లలో సర్జరీలు నిర్వహించారు. ఆ తర్వాత కిమ్స్, కామినేని హాస్పిటళ్లు సపోర్టు చేశాయి. నార్కెట్ పల్లి, నిజామాబాద్, శ్రీకాకుళంలో క్యాంపులు నిర్వహించారు. గత ఏడాది హైదరాబాద్, సీతారామ్బాగ్లో డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్ను వేదిక చేసుకున్నాం. ఇందుకోసం హాస్పిటల్ వాళ్లు రెండు ఆపరేషన్ థియేటర్లతో హాస్పిటల్ను సిద్ధం చేశారు. యూఎస్లో స్థిరపడిన ఈ డాక్టర్లు ఏటా 45 రోజులు ఇండియాలో ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నారు. అందులో కొంత సమయం ఈ సర్వీస్కి కేటాయిస్తున్నారు. యూఎస్లోని మెర్సీ మిషన్ వేదికగా వారందిస్తున్న సర్వీస్కి హైదరాబాద్లో ‘లయన్స్ క్లబ్ – గ్రీన్ల్యాండ్స్’ సహకారం అందిస్తోంది. రెండేళ్లుగా మా రాంకీ ఫౌండేషన్ కూడా బాధ్యతలు తీసుకుంది. ఇందుకోసం ఫౌండేషన్ ట్రస్టీగా నేను బోర్డు మెంబర్స్ నుంచి అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలను చేపట్టాను. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వాళ్లలో రాయలసీమ జిల్లాలు, నల్గొండ జిల్లా వాళ్లు ఎక్కువగా ఉన్నారు. మా ఈ సర్వీస్కి ప్రాంత, భాష, ఆర్థికపరమైన ఆంక్షలు ఏమీ లేవు. పేరు నమోదు చేసుకుని వచ్చి వైద్యం చేయించుకోవడమే. ► ఇది సమష్టి దిద్దుబాటు ఈ సర్వీస్ కోసం ఇద్దరు డాక్టర్లు అమెరికా నుంచి వస్తారు. మరికొంతమంది డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది మొత్తం ముప్పైమంది స్థానికులు ఈ సర్వీస్లో పాల్గొంటారు. ఈ హెల్త్ సర్వీస్ను రెండు దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహించడంలో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుకర్ స్వామి, లయన్స్ క్లబ్ విద్యాభూషణ్ సేవలు విశేషమైనవి. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్, కాలి ముడుచుకుపోయిన చర్మం, జన్యుపరమైన వైకల్యాలను సరిచేయడం, ప్రమాదవశాత్తూ దవడ, ముక్కు, కాళ్లు, చేతులు విరిగిపోవడం వంటి సమస్యల్లో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దగలిగిన అన్ని సమస్యలకూ వైద్యం అందిస్తున్నాం. కాస్మటిక్ సర్జరీలు ఈ క్యాంప్లో చేపట్టడం లేదు. మా సర్వీస్ గురించి వాల్పోస్టర్లు, బ్యానర్లతో జిల్లాల్లో ప్రచారం కల్పించాం. వీలైనంత ఎక్కువమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు దాక్షాయణి. ముఖం మీద ఒత్తైన జుత్తు హయతి అనే ఎనిమిదేళ్ల పాపాయి సమస్య మరీ ప్రత్యేకం. హైపర్ ట్రైకోసిస్... అంటే జుత్తు తల వరకే పరిమితం కాకుండా ముఖం మీదకు పాకుతుంది. తలమీద ఉన్నంత దట్టమైన జుత్తు ఒక చెంప మొత్తం ఉంది. ఆ పాపకు నలుగురిలోకి వెళ్లాలంటే బిడియం. స్కూలుకెళ్లాలంటే భయం. ఆమె సమస్య అంటువ్యాధి కాదని టీచర్లకు తెలిసినప్పటికీ క్లాసులో మిగిలిన పిల్లలతో కలిపి కూర్చోబెడితే వాళ్ల పేరెంట్స్ నుంచి కంప్లయింట్స్ వస్తాయి కాబట్టి హయతిని విడిగా కూర్చోబెట్టేవారు. తరగతి గది, ఇంటి నాలుగ్గోడలు తప్ప మరే ప్రపంచమూ తెలియని స్థితిలో రోజులు గడుస్తున్న హయతి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మామూలైంది. ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ మెర్సీ మిషన్స్∙యూఎస్ఏ, సేవా భారతి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్– గ్రీన్ ల్యాండ్స్, రాంకీ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్లో ఈ నెల 18వ తేదీ నుంచి స్క్రీనింగ్ జరుగుతుంది. సర్జరీలు 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరుగుతాయి. ఉచితవైద్యంతోపాటు మందులు, ఆహారం, బస సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాం. పేషెంట్ పరిస్థితిని బట్టి కొందరికి సర్జరీ తర్వాత ఫాలోఅప్ కోసం మూడు నుంచి నాలుగు రోజులు బస చేయాల్సి రావచ్చు. గడిచిన డిసెంబర్ 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. వైద్యసహాయం అవసరమైన వాళ్లు 78160 79234, 98482 41640 నంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి. హైదరాబాద్, ఓల్డ్ మల్లేపల్లి, సీతారామ్బాగ్లోని డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్లో వైద్యసహాయం అందిస్తున్నాం. – ఆళ్ల దాక్షాయణి, మేనేజింగ్ ట్రస్టీ, రామ్కీ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
ఆస్పత్రులపై సైబర్ నీడ..వెలుగులోకి షాకింగ్ విషయాలు!
సైబర్ నేరగాళ్లు ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇంతవరకు ఆన్లైన్ మోసాలకు లేదా కొత్త తరహాలో వ్యక్తుల డేటాను తస్కరించి బ్లాక్మెయిల్తో డబ్బులు గుంజడం వంటి సైబర్ నేరాలు చూశాం. అక్కడితో ఆగకుండా దేవాలయాల్లాంటి ఆస్పత్రులపై కూడా సైబర్ నీడ పడింది. వాటిని కూడా టార్గెట్ చేసి రోగుల వ్యక్తిగత డేటాను ఆసరా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలో లాస్వేగస్లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..లాస్వేగస్లోని ప్లాస్టిక్సర్జరీ క్లినిక్ హాంకిన్స్ అండ్ సోహ్న్ హెల్త్కేర్ హ్యాకర్ల బారిన పడింది. ఆ క్లినిక్కి వచ్చిన రోగులు వ్యక్తిగత డేటా, ఆపరేషన్కి ముందు తర్వాత తీసిన వ్యక్తిగత న్యూడ్ ఫోటోలతో సహా హ్యాక్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చాంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రి వివాదంలో చిక్కుకుపోయింది. హెల్త్కేర్ సెక్టార్కి సంబంధించి రోగులు డేటా భద్రత విషయమై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ ఘటనలో ముఖ్యంగా బాధిత మహిళ రోగుల డేటానే ఎక్కువగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రోగులు శస్త్ర చికిత్స, వ్యక్తిగత సమాచారం తోపాటు బ్యాంకు అకౌంట్ల నంబర్లను హ్యాకింగ్ గురయ్యాయి. సదరు ఆస్పత్రి తమ ఆరోగ్య భద్రతను కాపాడటంలో విఫలమైందంటూ బాధితుల నుంచి ఆరోపణలు వెల్లవెత్తాయి. అంతేగాదు సదరు ఆస్పత్ర ప్రజల హెల్త్ కేర్ పేషెంట్ల డేటా ప్రొటెక్షన్కి చట్టాలకు కట్టుబడి లేదంటూ విమర్శలు వచ్చాయి. భాదితమహిళలు తమకు జరిగిన నష్టానికి సదరు ఆస్పత్రి తగిన సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రులు రోగుల నమ్మకాలు, భావోద్వేగాలతో ఆడుకుందంటూ మండిపడుతున్నారు. ఆస్పత్రుల డేటాను పర్యవేక్షించడంలో సైబర్ సెక్యూరిటీ విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కారణంగా రోగుల హెల్త్ డేటా భద్రత విషయమై క్లినిక్లపై చెరగని మచ్చ ఏర్పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ యుగంలో భద్రత అన్నదే కరువైందంటూ సదరు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు కేవలం కంపెనీలు, మనుషుల వ్యక్తి గత డేటానే గాదు ఆస్పత్రుల డేటాపై కూడా సైబర్ దాడి చేయడం బాధకరం. సాధ్యమైనంత వరకు అన్ని విభాగాలకి సంబంధించిన డేటాకి సైబర్ సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ మేరకు లాస్వేగాస్ పోలీసులు ఈ ఘటనపై సత్వరమే దర్యాప్తు చేపట్టారు. ఏదిఏమైనా తస్మాత్ జాగ్రత్త! డేటా అపహరణకు గురికాకుండా ఎవరికివారుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోక తప్పదని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతిశెట్టి?
ఉప్పెన సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ల మనసు దోచుకున్న కృతిశెట్టి ఓవర్నెట్లో స్టార్డమ్ దక్కించుకుంది. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఊహించని విధంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ హిట్స్తో రాకెట్లా దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వరుస ఫ్లాపులు కృతిని వెంటాడుతున్నాయి. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్కి దిమ్మతిరిగిపోయిందట చివరగా ఆమె నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ లిస్ట్లో చేరిపోవడంతో కృతి కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాల ఫ్లాప్స్తో సతమతమవుతున్న కృతికి మరోవైపు ట్రోలింగ్ పేరిట విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ మధ్య కృతి ఫేస్లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయని, ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ రూమర్స్పై స్పందిస్తూ.. 'ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో కూడా అర్థం కావడం లేదు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా..ఫీచర్స్ మారుతాయి. అందరిలా నేను కూడా. కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానా ప్లాస్టిక్ సర్జరీ అంటారా''? అంటూ బేబమ్మ ఫైర్ అయ్యింది. చదవండి: ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు: కాజల్ -
ముక్కు సర్జరీ వికటించింది.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్కు ఎక్కువ ప్రాధన్యత ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెరపై మరింత అందంగా కనిపించేందుకు హీరో,హీరోయిన్లు చాలా ప్రయోగాలు చేస్తుంటారు. జిమ్లో గంటలకొద్దీ వర్కవుట్స్, స్క్రిక్ట్ డైట్..ఇలా ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఏకంగా సర్జీరల బాట కూడా పట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు, బోలెడంత మంది హీరోయిన్లు కృత్రిమ పద్దతులను ఉపయోగించి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వారిలో కొందరు సర్జరీ తర్వాత మరింత అందంగా తయారైతే, మరికొందరికి ఆ సర్జరీలు వికటించి ఉన్న అందం పోగోట్టుకున్నారు. గ్లోబల్ స్టార్గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన ముక్కు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే ముక్కు సర్జరీ మాత్రం వికటించి డిప్రెషన్కు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే ఒప్పుకుంది. ఇటీవల ఓ షోకు హాజరైన ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ''ఇది జరిగి సుమారు 20ఏళ్లవుతుంది. ఒకానొక సమయంలో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. జలుబు కూడా చాలాకాలం వరకు తగ్గలేదు. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే నాసికా కుహరంలో పాలిప్ను తొలగించాలని సిఫార్సు చేశారు. అయితే అనుకోకుండా ముక్కు పైన ఉన్న చిన్న భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో నా ముఖం అంతా మారిపోయింది. అప్పటికే నేను కొన్ని సినిమాలు సైన్ చేశాను. కానీ నా ముఖంలో సర్జరీ తాలూకూ మార్పులు స్పష్టంగా తెలిసిపోయి కాస్త అందవిహీనంగా తయారయ్యాను. దీంతో నన్ను 3 సినిమాల్లో తీసేశారు. అంతేకాకుండా ఓ సినిమాలో హీరోయిన్ రోల్కు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాల్సి వచ్చింది. ఇలా చేతికి వచ్చిన అవకాశాలు అన్నీ పోతున్న సమయంలో చాలా డిప్రెషన్కు వెళ్లిపోయాను. కెరీర్ ముగుస్తుందని చాలా బాధపడ్డాను. అప్పుడు మా నాన్న నాకు అండగా నిలిచారు. ముక్కును కరెక్ట్ చేసుకునేందుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకోమని నన్ను ప్రోత్సహించారు. అలా మళ్లీ ఆ సర్జరీతో కాన్ఫిడెన్స్ వచ్చింది'' అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. -
ప్లాస్టిక్ సర్జరీ చేసిన కాసేపటికే మోడల్కు గుండెపోటు..
చాలామందికి సెలబ్రిటీ అవ్వాలని కోరికగా ఉంటుంది. కానీ కొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా సెలబ్రిటీలా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సర్జరీలు వికటించడంతో మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవలే పాప్ సింగర్ జిమిన్లా కనిపించేందుకు 12సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్ వాన్ మృతి చెందిన విషయం తెలిసిందే! తాజాగా అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్లా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్న ఓ మోడల్ గుండెపోటుతో కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. మోడల్ క్రిస్టినా అస్తెన్ గౌర్కానీ(34) అచ్చం కిమ్ కర్దాషియన్లా మారిపోవాలనుకుంది. ఇందుకోసం ఆమె పలు సర్జరీలు చేసుకోగా అందరూ తనను కర్దాషియన్కు జిరాక్స్ కాపీలా ఉన్నావని పొగిడేవారు. తాజాగా ఆమె మరో సర్జరీ చేయించుకోగా అది వికటించడంతో గుండె పనితీరుకు అవాంతరం ఏర్పడింది. ఫలితంగా ఆమెకు ఏప్రిల్ 20న గుండెపోటు రావడంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని క్రిస్టినా కుటుంబం ఆలస్యంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. 'ఏప్రిల్ 20.. ఉదయం 4.31 గంటలకు మాకు ఫోన్ కాల్ వచ్చింది. మా కుటుంబ సభ్యులు ఒకరు.. అస్తెన్ చనిపోయిందని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ విషాద వార్తను చేరవేశారు. ఆ ఫోన్ కాల్ మా జీవితాలనే కుదిపేసింది. దురదృష్టవశాత్తూ అస్తెన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తను తీసుకున్న చికిత్స వల్లే ఇంతటి ఘోరం జరిగి ఉండవచ్చు' అని క్రిస్టినా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చదవండి: 15 ఏళ్ల బంధానికి ముగింపు, బాలీవుడ్ జంట విడాకులు -
నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్లా సర్జరీ! కానీ..
ఇటీవలకాలంలో పలు నేరస్తులు పోలీసులకు పట్టబడకుండా ఉండేందుకు చేసే పనులు విస్మయానికి గురి చేస్తున్నాయి. అతి తెలివితో పేరు, వేషంతో సహా కొందరూ సర్జరీలతో ముఖ మార్పిడికి సిద్ధపడిపోతున్నారు. అయినప్పటికీ వారు చేసిన నేరాలే వారిని చివరికి పట్టించేస్తున్నాయి. ఎన్ని వేషాలు వేసినా.. చివరికీ కటకటాలపాలు కాక తప్పట్లేదు. వివరాల్లోకెళ్తే..థాయ్ డ్రగ్ డీలర్ పోలీసులకు చిక్కకూడదని పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఐతే అతను చేసిన ఆ ప్రయత్నాలేమి ఫలించకపోగా..అతడు పోలీసులకు పట్టుబడక తప్పలేదు. సహరత్ సవాంగ్జాంగ్ అనే వ్యక్తి కొరియన్లా సర్జరీ చేయించుకుని సియోంగ జిమిన్గా పేరు మార్చుకుని అసలు గుర్తింపు దాచే యత్నం చేశాడు. ఐతే అతను డ్రగ్స్ను ఇతరలకు కొనుగోలు చేయడం కారణంగా అతన్ని సులభంగా ట్రాక్ చేశారు పోలీసులు. దీంతో బ్యాంకాక్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సవాంగ్జాంగ్ని పోలీసులు అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు దర్యాప్తులో సాక్ష్యులు అతన్ని అందమైన కొరియన్గా అభివర్ణించారు. ఐతే అతను క్లాస్ వన్ డ్రగ్ అయిన ఎక్స్టసీ(ఎండీఎంఏ)ని దిగుమతి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతను పట్టబడటానికి ముందు గతంలో మూడుసార్లు అరెస్టు అయ్యాడు కూడా. గానీ ఏదోరకంగా నిర్బంధం నుంచి తప్పించుకునే వాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసు మేజర్-జనరల్ థీరదేజ్ తమ్మసూటీ మాట్లాడుతూ.. సవాంగ్జాంగ్ కేవలం 25 ఏళ్ల వయసులో పేరుమోసిన డ్రగ్ డీలర్గా మారాడని, ఇలాంటి వాళ్లు విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, ఇటీవల థాయ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణ తదితరాలపై కొరడా ఝళిపిస్తోంది. (చదవండి: అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదు! మరోసారి పాక్పై విరుచుకపడ్డ నిక్కీ) -
అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే..
శాన్ ఫ్రాన్సిస్కో: అందంగా కన్పించాలని ముక్కుకు సర్జరీ చేయించుకున్న ఓ యువతి 24 గంటలు కూడా తిరగకుండానే ప్రాణాలు కోల్పోయింది. ముక్కు ఆకృతి మార్చుకునేందుకు ఆరున్నర గంటల పాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఈమె.. ఇంటికెళ్లిన కాసేపటికే సృహ కోల్పోయి కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెంటనే ఆసత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి చూసిన వైద్యులు షాక్ అయ్యారు. యువతి ఊపిరితిత్తులు మొత్తం రక్తంతో నిండిపోయాయి. శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితి. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆరుసార్లు కార్డియోరెస్పిరేటరీ అరెస్టులతో(శ్వాసవ్యవస్థ దెబ్బతినడం) ఆమె కన్నుమూసింది. ముక్కుకు సర్జరీ చేయించుకుని చనిపోయిన ఈ యువతి పేరు కారెన్ జులియెత్ కార్డెనాస్ యురిబె. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తోంది. వయసు 21 ఏళ్లు. సైకాలజీ కోర్సు చివరి సెమిస్టర్ చదువుతోంది. తాను మరింత అందంగా కన్పించేందుకు ముక్కు ఆకృతి మార్చుకోవాలనుకుంది. జనవరి 29న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు క్లినిక్కు వెళ్లింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఇంటికెళ్లిన కాసేపటికే.. సర్జరీ అనంతరం ఇంటికెళ్లిన జులియెత్ కాసేపటికే సృహతప్పి పడిపోయింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాసేపయ్యాక తేరుకున్న యువతి మళ్లీ కుప్పకూలింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడుకి ఫోన్ చేశారు కుటుంబసభ్యులు. ఆమెను మళ్లీ తన ఆస్పత్రికి తీసుకురావాలని అతను సూచించాడు. అయితే యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటికి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు యువతి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఆమెను సృహలోకి తీసుకొచ్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె లేచినా మళ్లీ వెంటనే స్పృహ కోల్పోతోంది. దీంతో ఆమెను స్కానింగ్ చేసిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమె ఊపిరితిత్తుల నిండా రక్తం నిండిపోయింది. శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆమెకు పైపుల ద్వారా శ్వాస అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. ఆరు సార్లు కార్డియెక్ రెస్పిరేటరీ అరెస్టులతో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడి పొరపాటు చేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతనిపై కేసు పెడతామని చెప్పారు. అక్కడ సర్జరీలు కామన్.. కాగా.. అమెరికాలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం 2020 నుంచి బాగా పాపులర్ అయ్యింది. అందంగా కన్పించేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా సర్జరీలు చేయించుకుంటున్నారు. మొత్తం 3,52,555 మంది ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదవండి: 18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..? -
మీ సర్జరీల మాటేమిటి..? నటిపై దారుణంగా ట్రోల్స్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి. గతంలో ఆమె ప్లాస్టిక్ సర్జరీలపై మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీ అందం కోసం చేయించుకున్న సర్జరీల మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. 2006లో శ్రీలంక మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్లాస్టిక్ సర్జరీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. 'ప్లాస్టిక్ సర్జరీ మహిళల సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అలా చేయించుకోవడం వల్ల వచ్చే అందం నిజమైంది కాదు. అలాంటి వాటికి నేను పూర్తిగా వ్యతిరేకిని' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్మీడియా వేదికగా ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అందంగా కనిపించడం కోసం మీరు చేయించుకున్న శస్త్రచికిత్సల మాటేమిటి' అని ప్రశ్నించారు. తాజాగా జాక్వెలిన్ సర్కస్ ట్రైలర్ ప్రీమియర్లో కనిపించింది. అక్షయ్కుమార్ ప్రధానపాత్రలో నటించిన రామ్ సేతు చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. View this post on Instagram A post shared by Pageant 💫 Influence (@pageantandinfluence) -
Hyderabad: ఇంప్లాంట్స్ క్రేజ్.. నగరంలో సర్జరీల సంఖ్య రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: లోపం పెద్దదైనా సరే.. చిన్నదైనా సరే.. దాన్ని తొలగించుకోవాలని వీలైనంత బాగా కనపడాలనే ఆరాటం అంతకంతకూ పెరుగుతోంది. అందులో భాగంగానే అందాన్ని పెంచే రొమ్ము ఇంప్లాంటేషన్ సర్జరీలకూ సిటీ యువతులు సై అంటున్నారు. నెలకు గరిష్టంగా 25 నుంచి 30 వరకు ఈ రకమైన ఇంప్లాటేషన్ సర్జరీలు సిటీలో జరుగుతున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మన్యూనతకు కారణమయే శారీరక లోపాల్ని పంటిబిగువున భరించే కంటే వ్యయ ప్రయాసలకోర్చి అయినా తొలగించుకోవడమే మేలనే ఆలోచనా ధోరణి ఆధునికుల్లో కనపడుతోంది. ఆర్ధిక స్వాతంత్య్రం మహిళలకు కల్పించిన వెసులుబాటు కూడా దీనికి తోడవుతోంది. అందంతో పాటు ఇది ఆత్మవిశ్వాసంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మానసిక సమస్యలకు ఈ సర్జరీ ఒక పరిష్కారంగా చెబుతున్నారు. సంఖ్య రెట్టింపు... నగరంలోని ఎస్ఎల్జీ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంధ్యా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ పదేళ్ల క్రితం హైదరాబాద్లో నెలకు గరిష్ఠంగా 10–15 బ్రెస్ట్ ఇంప్లాంట్స్ శస్త్రచికిత్సలు జరుగుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 25–30కి పెరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం, ఇంటర్నెట్ ద్వారా అవగాహన పెరుగుతుండడం వల్ల రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగవచ్చునన్నారు. అవసరాన్ని బట్టే... శరీరాకృతి ఒక తీరును సంతరించుకునే టీనేజ్లో ఈ తరహా సర్జరీలకు దూరంగా ఉండడం మేలు. కనీసం 20 ఏళ్లు దాటిన తర్వాతే అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. అదే విధంగా 50ఏళ్లు దాటిన వారు కూడా దూరంగా ఉండడమే మేలు. అందం ఒకటే కాకుండా శారీరక సమస్యలకు, ఇక కేన్సర్ చికిత్సలో భాగంగా రొమ్ము కోల్పోయిన వారికి కూడా ఈ ఇంప్లాంట్స్ ప్రయోజనకరం కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ శస్త్ర చికిత్సల గురించిన పలు అంశాలను గుర్తుంచుకోవాలని వైద్యులంటున్నారు. కొన్ని సూచనలు... ► రొమ్ములకు అమర్చే ఈ ఇంప్లాంట్స్కి 10 నుంచి 15 ఏళ్ల వరకూ వారంటీ ఉంటుంది. అయితే రెండేళ్లకు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఇంప్లాంట్ స్థితిగతులను పరీక్ష చేయించుకోవాలి. ► చాలా సహజమైన రీతిలో అమరిపోయే ఈ ఇంప్లాంట్ అత్యంత అరుదుగా మాత్రం అమర్చిన కొంత కాలానికి కొందరిలో చాలా గట్టిగా మారుతుంది. దీన్ని బ్రెస్ట్ ఇంప్లాంట్ ఇల్నెస్ అంటారు. ఇలాంటి అలర్జీక్ రియాక్షన్ పరిస్థితిలో అమర్చిన ఇంప్లాంట్ను తొలగించుకోవడమే పరిష్కారం. అయితే ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. ► ఈ ఇంప్లాంట్స్ అన్నీ యూరోపియన్ దేశాల నుంచీ దిగుమతయ్యే అమెరికన్ బ్రాండ్స్. ► స్వల్ప వ్యవధిలోనే పూర్తయే ఈ శస్త్రచికిత్సకు దాదాపుగా రూ.2 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. సర్జరీ పూర్తయిన 2 గంటల్లోనే ఆసుపత్రి నుంచీ డిశ్చార్జ్ అయిపోవచ్చు. (క్లిక్: కళ్లలో ఎరుపు చార, కన్నులో బూడిద రంగు వలయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!) అందుబాటులోకి అత్యాధునిక సర్జరీలు.. నగరంలో బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీల కోసం సగటున రోజుకు ఒకరైనా సంప్రదిస్తున్నారు. దానికి తగ్గట్టే సర్జరీల్లో కూడా మరింత మెరుగైన విధానాలు వస్తున్నాయి. తాజాగా ఛాతీ పరిమాణం పెరగాలని సంప్రదించిన 27 సంవత్సరాల సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి ఎటువంటి గాయం మచ్చ లేకుండా ట్రాన్స్ యాక్సిలరీ ఎండోస్కోపిక్ విధానంలో ఇంప్లాంట్ శస్త్రచికిత్సను నిర్వహించాం. –డా.సంధ్యారాణి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ -
సమంత లాగే కాజల్ కూడా ఆ పార్టుకి సర్జరీ చేయించుకుందా?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల వర్కౌట్లు చేస్తుంటారు. వీటితో పాటు సర్జరీలు చేయించుకోవడానికి కూడా ఏమాత్రం ఎనక్కి తగ్గరు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ముక్కు, పెదాలు, చిన్ సర్జరీ చేయించుకొని ముఖంలో కొత్త మెరుపులు కొనితెచ్చుకున్నారు. ఇక మొన్నటికి మొన్న సమంత కూడా ముఖానికి సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. రీసెంట్గా విడుదలైన యాడ్షూట్లో సామ్ లుక్ కాస్త డిఫరెంట్గా కనిపించింది. దీంతో అమెరికాకు వెళ్లి సర్జరీ చేయించుకుందంటూ టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ కూడా చేరింది. చందమామ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ రీసెంట్గా కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న కాజల్ ముఖంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు కంటే ముఖం కాస్త బొద్దుగా మారడంతో పాటు లిప్స్ కూడా లావుగా కనిపిస్తున్నాయని, సర్జరీ వల్లే ఇలా అయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా : హీరోయిన్
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్కి పెద్దపీట వేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందంగా కనిపించడానికి హీరో, హీరోయిన్లు తెగ కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అందాన్ని పెంచుకోవడం కోసం కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారిలో శ్రుతిహాసన్ కూడా ఒకరు. కమల్హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్లో చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన శ్రుతిహాసన్ తన ప్లాస్టిక్ సర్జరీపై స్పందించింది. 'అవును.. నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. నా శరీరంలో ముక్కు అంటే నాకు ఎక్కువ ఇష్టం. అది కాస్త వంకరగా ఉండేది. దానివల్ల చాలా బాధపడ్డాను. అందుకే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా. దానికోసం ఎక్కువ ఖర్చుపెట్టాను. అయినా ఇది నా శరీరం. దీనిని అందంగా తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది' అంటూ చెప్పుకొచ్చింది. -
చేతన రాజ్ మరణం.. అందం కోసం ఎంత మూల్యం చెల్లించాలి?
మనం నటులం. సోషల్ మీడియాల్లో చేస్తున్న పోస్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. నిజాయితీగా, వాస్తవికంగా ఆలోచిద్దాం. మనం సన్నగా, తెల్లగా ఉండాలన్న ప్రయత్నంలో ఉండొద్దు. ఈ విషయాలపై నిర్ద్వంద్వంగా మన మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. మౌనంగా ఉండటం ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా వినోద పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి చేతన రాజ్ కానేకాదు. కొన్నేళ్ల క్రితం కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటీమణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లైపోసక్షన్ శస్త్ర చికిత్స కాస్తా వికటించడంతో ఆమె అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి దుర్విధిని ఎదుర్కొన్న చేతన రాజ్ ప్రస్తుత వినోద పరిశ్రమ వాస్తవాలను మరోసారి మన కళ్లముందు ఉంచుతోంది. ఈ వినోద ప్రపంచంలో ‘అందం’ అనేదానికి అసాధా రణమైన, వాస్తవ దూరమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇది మహిళల విషయంలో చాలా ఎక్కువ. అయితే ఇదేదో పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే అనుకునేందుకు వీల్లేదు. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లపై తల్లిదండ్రులు, సమాజం పెట్టే తీవ్రమైన ఒత్తిడి పరిణామం ఇది అని నేను నమ్ముతున్నాను. ఫ్యాషన్, రీటైల్ వస్త్ర వ్యాపారాన్నే ఉదాహరణలుగా తీసుకుందాం. అందంగా కనిపించడం మహిళల బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉండటం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎందరో నాకు తెలుసు. వీరిలో చాలామంది శరీరంపైని వెంట్రుకలను తొలగించుకునేందుకు లేజర్, రసాయన చికిత్సలు తీసుకున్నవారే. శరీరంపై వెంట్రుకలు ఉన్న మహిళలను ‘సెక్సీ’ అని పరిగణించరు మరి! ఈ సూత్రం మహిళలకు మాత్రమే. పురుషుల విషయానికి వస్తే అన్నీ నడిచిపోతాయి. లేజర్ ట్రీట్మెంట్లు, చర్మపు రంగును తేలిక చేసే ప్రయత్నాలు, రసాయ నాలతో చర్మాన్ని శుద్ధి చేయడం, పెదవులు బొద్దుగా కనిపించేందుకు కృత్రిమ రసాయనాలను నింపుకోవడం, బొటాక్స్, లైపోసక్షన్... ఇలాంటివన్నీ మహిళలు ఎందుకు చేయించుకుంటారంటే... అందం తాలూకూ ‘ప్రమాణాలు’ అందుకునే ప్రయత్నమే అని చెప్పాలి. కేన్సర్ కణితిని తొలగించిన తరువాత నాకూ బరువుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సులువైన చిట్కాలూ బోలెడన్ని ఉన్నాయి. వాటి మాయలో పడటం పెద్ద కష్టం కాదు. కానీ తగిన ఆహారం తీసుకోవడం, నిర్దిష్టమైన అలవాట్లు పెంచుకోవడం, మార్చుకోవడం అవసరం. ఒకరకంగా చూస్తే సినిమాలు ఈ సమాజానికి దర్పణమని చెప్పాలి. దురదృష్టవశాత్తూ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ సినిమా లోనైనా హీరోయిన్ మన పక్కింటి పిల్ల మాదిరిగానో లేదంటే రోడ్లో వెళు తూంటే తారసపడే అమ్మాయిలానో కనిపించిందా చెప్పండి? చాలా చాలా అరుదు. హీరోయిన్ల మాదిరిగా డ్రస్సులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మేకప్పూ అలా చేసుకోరు. కానీ నెమ్మదిగా తెరపై హీరోయిన్లా కనిపించడం అనేది అందరి ఆశయమైపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ల మాదిరిగా అన్ని విషయాల్లోనూ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మహిళల గురించే. పురుషుల విషయానికి వస్తే అంటే.. హీరో బానపొట్ట వేసుకుని 65 ఏళ్ల వయసున్నా చెల్లిపోతోంది. పొరబాటునగానీ ఓ మహిళా కళాకారిణి కొంచెం ఒళ్లు చేసిందంటే చాలు... నానారకాల ఏడుపులతో సోషల్ మీడియా నిండి పోతుంది. వినోద పరిశ్రమలో ఓ మహిళ వయసు 30లు దాటుతున్నాయంటే... అందరి దృష్టిలోంచి కూడా జారిపోతున్నట్లు లెక్క. మలయాళం పరిశ్రమ ఆదర్శం వినోద పరిశ్రమలో లింగ వివక్షను కొద్దోగొప్పో సరిచేసే ప్రయత్నం చేస్తున్నది మలయాళ సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా, శరీరాకృతి కనిపించేలా కాకుండా నటులను సాధారణ దుస్తుల్లోనే చూపిస్తున్నారు. కేశా లంకరణ విషయంలోనూ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృత్రిమ కనుబొమలు ధరించకుండా చూసుకుంటున్నారు. ఈ తేడాల ప్రభావం వారి నటనపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవికమైన, నిజాయితీతో కూడిన నటన ఆవిష్కృతమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల పారితోషికం కోట్లల్లో ఉంటుంది. మహిళలకు వచ్చే సరికి ఇది లక్షల్లో మాత్రమే. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ స్థితిని మార్చ గలిగారు. అటు మహిళలూ, ఇటు పురుషుల మధ్య ఈ అంశాలపై చర్చ జరగా ల్సిన అవసరం ఉంది. సినిమాలు తీసేవాళ్లు, నిర్మాతలు, వినోద పరిశ్రమలో మార్పు తేగల సామర్థ్యం ఉన్న వారందరూ ఇకనైనా సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మానాలి. నటులు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నామో ఆలోచించి పెట్టాలి. చేతన రాజ్ ఫొటోలు చూస్తూంటే... నాకు ఆమెలో ఎలాంటి లోపాలూ కనిపించలేదు. మీ మాదిరి, నా మాదిరి, అందరి మాదిరిగా తనూ సాధారణంగానే కనిపించింది. కానీ మదిలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి యువతులపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమలో ‘ప్రవేశానికి’ నిర్దిష్టమైన రీతిలో కనిపించా లన్న తాపత్రయం చేతనను లైపోసక్షన్ శస్త్రచికిత్స వైపు నడిపించి ఉండవచ్చు. ఎందుకలా చేసిందో నిర్ణ యించే అధికారం మనలో ఎవరికీ లేదు. వ్యక్తులు ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం కలుక్కుమంటూనే ఉంది. చేతన నిజంగా అంత మూల్యం చెల్లించాలా?.. - దివ్య స్పందన (రమ్య) కన్నడ నటి, లోక్సభ మాజీ సభ్యురాలు (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
ప్లాస్టిక్ సర్జరీ వికటించి యువ కన్నడ నటి చేతన రాజ్ మృతి
-
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఎంత ఈజీగా జైలు నుంచి తప్పించుకున్నాడో!
వాడొక కరడు గట్టిన క్రిమినల్. డ్రగ్ సప్లయ్తో యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. పోలీసులు కష్టపడి పట్టుకుంటే.. చావు నాటకం ఆడి తెలివిగా తప్పించుకున్నాడు. ఆపై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపు మార్చుకున్నా.. టైం బాగోలేక దొరికిపోయాడు. కానీ, ఇప్పుడు ఏదో చుట్టాల ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు జైలు, అదీ కఠినమైన భద్రత నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా.. కరడుగట్టిన కొలంబియన్ డ్రగ్ డీలర్. నైరుతి కొలంబియా నారినో ప్రావిన్స్లో 20 శాతం కొకైన్ మాఫియాకు కారణం ఇతనే. బోగోటాలోని లా పికోటా జైల్ నుంచి గత శుక్రవారం తప్పించుకున్నాడు. అది అలా ఇలా కాదు. సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో, ముసుగు ధరించి చాలా క్యాజువల్గా బయటకు వచ్చేశాడు. గట్టి భద్రత, ఏడు హైసెక్యూరిటీ గేట్లు ఉన్నా, అలవోకగా దాటేశాడు. 🔴 En los videos se aprecia al poderoso narcotraficante salir por una reja que le deja abierta un inspector de apellido Jiménez ► https://t.co/66DoBnmIKk 📹: cortesía. pic.twitter.com/2iTgOgZYgQ — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 సిబ్బంది తొలగింపు ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు Iván Duque Márquez సీరియస్ అయ్యారు. హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. దర్యాప్తులో.. జువాన్ క్యాస్ట్రో పారిపోయేందుకు సహకరించిన గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు అధికారి మిల్టన్ జిమెనెజ్తో పాటు 55 మంది గార్డులపైనా వేటు వేశారు. సుమారు ఐదు మిలియన్ డాలర్ల లంచం పోలీసులకు చెల్లించి.. తప్పించుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అంతేకాదు ఈమధ్యకాలంలో కొంత మంది జువాన్ను వచ్చి కలిసినట్లు పేర్కొన్నారు. 🚨 Finalmente, alias Matamba sale por la puerta haciendo un gesto con su mano derecha en señal de que todo está bien. Acá los detalles ► https://t.co/66DoBnmIKk Vía @JusticiaET pic.twitter.com/dGzH7s3q9x — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 కంత్రిగాడు జువాన్ ఇప్పటివరకు పన్నెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అయితే తప్పించుకోవడం మాత్రం రెండోసారి. 2018లో జైలు నుంచి మెడికల్ లీవ్లో వెళ్లిన అతను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు స్వేచ్ఛగా తిరిగాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని కొత్త లుక్తో స్వేచ్చగా తిరిగాడు. కిందటి ఏడాది.. పుట్టినరోజు వేడుకల్ని ఫ్లారిడాబ్లాంకాలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నిర్వహించుకున్నాడు. అయితే పేరుతో ఇన్విటేషన్ ఇవ్వడంతో.. ఎట్టకేలకు పోలీసులు పట్టేసుకునేవారు. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా మే 2021లో అరెస్ట్ అయ్యాడు. ఇంకో నెలలో అతన్ని అమెరికాకు అప్పగించాల్సి ఉంది. ఈలోపే తప్పించుకుని పోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. -
ప్లాస్టిక్ సర్జరీ.. మూడేళ్లు నరకం చూపించారు
Koena Mitra Recalls Her Struggle: బాలీవుడ్లో నెపోటిజం, గ్రూపిజం కొత్తేమీ కాదు. వీటివల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామంటూ పలువురు నటీనటులు బాహాటంగానే నోరు విప్పారు. తాజాగా బాలీవుడ్ నటి కొయినా మిత్రా కూడా దీనిపై స్పందించింది. 'ఇండస్ట్రీలో నెపోటిజం, గ్రూపు రాజకీయాలు ఉన్నాయన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే వాటివల్ల నేనూ ఇబ్బందులకు లోనయ్యాను. నేను అవుట్ సైడర్(సినీ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి) అయినప్పటికీ ఇండస్ట్రీలో నేను కూడా మంచి బ్రేక్ అందుకున్నాను. కానీ నాకవసరం అయినప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ నాకు అండగా నిలబడలేదు. నాకోసం వారు పెదవి విప్పి మాట్లాడలేదన్న ఫిర్యాదు నాకెప్పుడూ ఉంటుంది' 'ఇక నా ప్లాస్టిక్ సర్జరీ అంటారా? అది పూర్తిగా నా నిర్ణయం. నా ఫేస్, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే జనాలకేంటి సమస్య? ఇలా సర్జరీ గురించి ఓపెన్గా చెప్పొద్దన్న విషయం నాకు తెలియదు. నన్ను దాని గురించి అడిగారు కాబట్టే అవును చేయించుకున్నానని వివరాలన్నీ చెప్పాను. ఆ మాత్రందానికి నన్ను నానామాటలు అన్నారు. నామీద వ్యతిరేక వార్తలు రావౠరు. ఇండస్ట్రీలో అయితే చాలామంది నాతో దూరం పాటించారు. అది నా కెరీర్ను దెబ్బతీసింది. మూడేళ్లు నాకు నరకం అంటే ఏంటో చూపించారు. ధైర్యంగా ఉండండి అంటూ హితబోధ చేస్తున్నవారు మీడియా ముందుకు వచ్చి మాత్రం నాకు సపోర్ట్గా మాట్లాడరు అని చెప్పుకొచ్చింది కొయినా మిత్రా. -
టిక్టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..
ఇటీవల కాలంలో జనాలు సామాజకి మాధ్యమాలకు ఎలా బానిసవుతున్నారో మనం చూస్తునే ఉన్నాం. అంతేందుకు ఆ వ్యసనం కారణంగా ఎలా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారో కూడా చూస్తున్నాం. అచ్చం అలానే ఇక్కడోక ప్రముఖ డాక్టర్ సామాజకి మాధ్యమాలకు బానిసై తన చక్కటి కెరియర్ను ఎలా పాడుచేసుకున్నాడో చూడండి. (చదవండి: జపాన్లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) అసలు విషయంలోకెళ్లితే...టిక్టాక్ వ్యసనం ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ డేనియల్ అరోనోవ్ కెరియర్ను దెబ్బతీసింది. అరోనోవ్కి టిక్టాక్లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే అతనికి ఎంత టిక్టాక్ పిచ్చి ఉందో తెలుస్తోంది. అయితే అతను టిక్టాక్ పిచ్చితో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన ఆపరేషన్లు అన్నింటిని టిక్టాక్లో పోస్ట్ చేసేవాడు. అంతేకాద ఆపరేషన్లు అన్నింటిని అసంపూర్తిగా చేసేవాడు. దీంతో పలువురు రోగుల నుంచి అరోనోవ్ పై ఫిర్యాదుల రావడం ప్రారంభమైంది. పైగా అరోనోవా వికృత వ్యసనం ఎంతకు దారితీసింది అంటు రోగుల ఆరోగ్యంతో ఆడుకునేంత దారుణానికి దిగజారింది. ఈ మేరకు పలువురు రోగులు అతను శస్త్ర చికిత్సను మధ్యలోనే ఆపేస్తాడని, పైగా ఒకటి చేయబోయి మరోకటి చేస్తాడంటూ బాధితుల ఆవేదనగా ఫిర్యాదులు చేయడంతో ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రాక్టీషనర్ రెగ్యులేషన్ ఏజెన్సీ (ఏహెచ్పీఆర్ఏ) అతను ఎలాంటి శస్త్రచికిత్సా విధానాలను నిర్వహించకుండా నిషేధించింది. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) -
ఎద్దు దాడితో నుజ్జునుజ్జైన ముఖం.. 11 నెలలు.. 3 సర్జరీలు
జైపూర్: ముఖంపై చిన్న మొటిమ, మచ్చ ఏర్పడితే చాలా బాధ పడతాం. దాన్ని తొలగించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే మనిషి అందానికి మొహమే ప్రతీక. కనుక ముఖ సౌందర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. అలాంటిది అనుకోని ప్రమాదంలో ముఖం పూర్తిగా చిధ్రమైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ వ్యక్తికి. ఊహించని ప్రమాదంంలో అతడి ముఖం నుజ్జు నుజ్జయ్యింది. పూర్తిగా రూపు కోల్పోయిన ముఖానికి పూర్వపు ఆకారం తీసుకురావడం కోసం డాక్టర్లు ఎంతో శ్రమించి.. అనేక సర్జరీలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. దాడి జరగడానికి ముందు బిష్ణోష్ (ఫైల్ ఫోటో) రాజస్తాన్లోని బికనీర్కు చెందిన కర్ణీ బిష్ణోయ్ స్థానిక ఎఫ్ఎంసీజీ కంపెనీలో ఆపరేటింగ్ హెడ్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్లో బిష్ణోయ్ తన సోదరి, స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా వారి వాహనానికి ముందు కొన్ని ఎద్దులు వచ్చాయి. దాంతో బిష్ణోయ్ కారు వేగాన్ని తగ్గించి.. నెమ్మదిగా వెళుతున్నాడు. ఈ క్రమంలో కారు అద్దం సగం దించి ఉండటంతో.. అటుగా వెళ్తున్న ఎద్దు ఒక్కసారిగా బిష్ణోయ్ ముఖాన్ని కొమ్ములతో కుమ్మింది. అతడిని కారు నుంచి బయటకు లాగి పడేసింది. ఆ దాడిలో బిష్ణోయ్ కుడి కన్ను, ముక్కుతో పాటు ముఖం కుడి భాగమంతా నుజ్జునుజ్జయింది. ఈ దాడిలో బిష్ణోయ్ స్నేహితునికి స్వల్ప గాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుకుంటున్న బిష్ణోయ్ను అతని సోదరి బికనీర్లోని ఆస్పత్రికి తరలించింది. ప్రాథమిక చిక్సిత్సనందించిన వైద్యులు.. అతడికి చికిత్స ఇవ్వడం తమ వల్ల కాదని.. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో బిష్ణోయ్ని సాకేత్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక అతడి పరిస్థితి చూసి షాకయినట్లు సీనియర్ న్యూరో సర్జన్ తెలిపారు. అప్పటికే అతడి వెంటిలేషన్ ట్యూబ్ బ్లాక్ అయిటన్లు వైద్యులు గుర్తించారు. వెంటనే న్యూరో సర్జన్లు, ప్లాస్టిక్ సర్జన్లు పిలిపించారు. కరోనా నిబంధనలను అనుసరించి పీపీఈ కిట్లు ధరించిన వైద్యులు సుమారు పదిగంటల పాటు శ్రమపడి అతని ముఖానికి సర్జరీ చేశారు. అప్పటికీ ముక్కలు ముక్కలైన అతని ముఖం ఎముకలు, ముక్కులను అతికించారు. తొమ్మిది గంటలపాటు నిర్వహించిన మరో సర్జరీతో అతని ప్రాణాలు కాపాడటమే కాకుండా ముఖం తిరిగి ఒక రూపు సంతరించుకుంది అని తెలిపారు వైద్యులు. ఆ తర్వాత మరో నాలుగు నెలల అనంతరం మరో సర్జరీ నిర్వహించారు. అప్పటికే అతని ముఖం కుడి భాగమంతా పక్షవాతానికి గురైంది. భారత్లో మొదటిసారిగా నుదిటి కండరాలకు తేలికపాటి చికిత్సను అందించినట్లు వైద్యలు తెలిపారు. జులై నాటికి బిష్ణోయ్ తన కుడి కనుబొమ్మను, నుదిటిని కదపగలిగాడు. నెమ్మదిగా అతని ముఖం కూడా పూర్తిగా మానవరూపాన్ని సంతరించుకుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ కన్నుతో ఉన్న అతనికి మరికొన్ని సర్జరీలు చేయాల్సి వుందని అన్నారు. -
ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు
హానోయ్ : జాబ్ ఇంటర్వ్యూలలో విఫలమవ్వటానికి తన ముఖమే కారణమని భావించిన ఓ యువకుడు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించాడు. దాదాపు 9 సర్జరీలతో అందంగా తయారై అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇంతకీ సంగతేటంటే.. వియత్నాంకు చెందిన 26 ఏళ్ల డూ కూయెన్ అనే యువకుడు జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లిన సమయంలో ఘోర అవమానాలకు గురయ్యాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అతడి ముఖాన్ని చూసి గేలి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన డూకు తన ముఖంపై అసహ్యం వేసింది. ఎలాగైనా ముఖాన్ని మార్చుకోవాలని అనుకున్నాడు. మేకప్ ఆర్టిస్ట్గా పని చేసి సంపాదించిన దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 9 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. సర్జరీల తర్వాత అతడి రూపు రేఖలు పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా.. అందంగా తయారయ్యాయి. అతడు తన మునుపటి, తర్వాతి ఫొటోను పక్కపక్కన పెట్టి టిక్టాక్లో షేర్ చేయగా ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ రెండు ఫొటోలు డూవని తెలిసిన తర్వాత ‘‘అది నువ్వేనా?!’’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్లాస్టిక్ సర్జరీల తర్వాత మొదటి సారి ఇంటికి వచ్చినపుడు కుటుంబసభ్యులు కూడా అతడ్ని గుర్తుపట్టలేకపోయారు. దీనిపై డూ కూయెన్ మాట్లాడుతూ.. ‘‘ ఎల్లప్పుడూ ధృడ చిత్తంతో ఉండండి. మిమ్మల్ని కాన్ఫిడెంట్గా ఉంచే అందంకోసం అన్వేషించండి. నా దృష్టిలో అందం అంటే.. అద్దంలో మనల్ని మనం చూసుకున్నపుడు సంతృప్తిగా.. కాన్ఫిడెంట్గా ఉండాలి’’ అని చెప్పాడు. చదవండి : గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే.. వైరల్ : నీ టైం బాగుంది ఇంపాల -
అరకు ప్రమాదం; కోలుకుంటున్న క్షతగాత్రులు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘోర ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కోలుకుంటున్నారు. హైదరాబాద్ షేక్పేటకు చెందిన 27 మంది పర్యాటకులు విహార యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అరకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. అనంతగిరి మండలం డముకు ఘాట్రోడ్డు మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా, 23 మంది గాయాల పాలయ్యారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. వీరిలో 16 మంది శనివారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన ఏడుగురికి కేజీహెచ్లోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారు. మరో మహిళ కొట్టం చంద్రకళ (50) పరిస్థితి కొంత విషమంగానే ఉంది. మరో 24 గంటలు గడిస్తేగాని చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన కొట్టం సత్యనారాయణ (61), నల్ల లత (45), సరిత (40), కొట్టం శ్రీనిత్య (8 నెలలు) మృతదేహాలను హైదరాబాద్కు తరలించారు. 16 మంది స్వస్థలాలకు పయనం ప్రమాదంలో గాయపడి కోలుకున్న క్షతగాత్రుల్లో 16 మంది శనివారం హైదరాబాద్లోని స్వస్థలానికి బయలుదేరారు. విశాఖ జిల్లా అధికారులు తెలంగాణ ప్రభుత్వాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. గాయపడి పూర్తిగా కోలుకున్న 16 మందిని మరో రోజు వైద్యుల పరిశీలనలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. క్షతగాత్రులు మాత్రం మృతదేహాల వెంట తాము కూడా హైదరాబాద్ వెళ్లిపోతామని అధికారులను కోరారు. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చ సాగింది. ఇక్కడి వైద్యులు వెళ్లొద్దని వారించినా.. క్షతగాత్రులు మాత్రం వెళ్లేందుకు సిద్ధపడటంతో అధికారులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. పరామర్శించేందుకు వచ్చిన బంధువులతో పాటు 16 మందిని రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం క్షతగాత్రులకు నాలుగు వైద్య బృందాల (ఆర్థో, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ)తో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని చెప్పారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్చంద్తో కలిసి శనివారం ఆయన పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్ శ్రీశైలం నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రుల్లో 16 మంది పూర్తి సురక్షితంగా ఉన్నారని, ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారని, కొట్టం చంద్రకళ (50) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు. కొట్టం కల్యాణి (30)కి ప్లాస్టిక్ సర్జరీ చేయించామని చెప్పారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీ వేయనుందని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే బస్సు ప్రమాదం ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమని రవాణా శాఖ ప్రాథమికంగా తేల్చింది. అలసట కారణంగా డ్రైవర్ నిద్రమత్తుకు లోనవటంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. కోలుకుని హైదరాబాద్ పయనమైన వారి వివరాలు కొట్టం లత (45), యు.కృష్ణవేణి (50), కొట్టం అరవింద్కుమార్ (35), కొట్టం నరేష్కుమార్ (38), కొట్టం స్వప్న (32), కొట్టం శివాని (07), కొట్టం దేవాన్‡్ష(05), కొట్టం శాన్వి (05), కొట్టం విహాన్ (03), కొట్టం ఇషా (05), అనూష(26), కొట్టం హితేష్ (17), కొట్టం మౌనిక (27), కొట్టం అనిత(50), కొట్టం శ్రీజిత్(14), లోఖిశెట్టి నందకిశోర్ (25) కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారు కొట్టం కల్యాణి (30), కొట్టం జ్యోతి (55), కొట్టం శైలజ (30), కొట్టం అభిరామ్ (07), మీనా (38), కొట్టం చంద్రకళ (50), బస్సు డ్రైవర్ సర్రంపల్లి శ్రీశైలం ప్లాస్టిక్ సర్జరీతో పాతరూపు అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద బస్సు ప్రమాదంలో కొట్టం కల్యాణి (30)కి ముఖంపై తీవ్రగాయాలు కావడంతో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్లాస్టిక్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ పివీ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేసింది. కల్యాణి ముఖాన్ని ప్రమాదానికి ముందు ఎలా ఉందో అలా తీర్చిదిద్దారు. -
అవన్నీ ‘ప్లాస్టిక్’ అందాలే..
అందంగా పుట్టడం మనిషికి దేవుడిచ్చిన వరం అన్నది ఒకప్పటి మాట! నేటి కాలంలో వైద్యులే దేవుళ్లవుతున్నారు.. అందాలను చెక్కేస్తున్నారు. అందవిహీనమైన శరీరాలను సైతం అపురూప శిల్పాలుగా మలుస్తున్నారు. అందుకే చాలా మంది సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రెటీల వరకు కత్తిగాట్లకు మొగ్గుచూపుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీలతో అందాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. నేడు అగ్ర తారలుగా వెలుగొందుతున్న బాలీవుడ్ సుందరీమణుల్లో చాలా మందివి ప్లాస్టిక్ అందాలే కావటం విశేషం!! 1) శ్రీదేవి బాలీవుడ్ అగ్రతారగా వెలుగొందిన దక్షిణాది భామ శ్రీదేవీ. తొలినాళ్లలోని శ్రీదేవికి, ఆ తర్వాతి శ్రీదేవికి అందంలో చాలా తేడా ఉందన్నది అక్షర సత్యం. ఆమె తన ముక్కుకు చేయించుకున్న సర్జరీనే కారణం. 2) జాన్వీ కపూర్ శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. ధడక్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. బాలీవుడ్ ఎంట్రీకి ముందే తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందానికి మెరుగులు దిద్దుకుంది. 3) ప్రియాంక చోప్రా ఇంటర్ నేషనల్ స్టార్ ప్రియాంక చోప్రాది సైతం ప్లాస్టిక్ అందమే. సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత తన పెదవులకు సర్జరీ చేయించుకున్నారామె. ఈ సర్జరీ సంగతి అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 4) శిల్పా శెట్టి బాలీవుడ్ ఎగుమతి చేసుకున్న దక్షిణాది అందం శిల్పా శెట్టి. ‘బాజిగర్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ భామ. ఈమె కూడా తన అందానికి మెరుగులు దిద్దుకోవటానికి కత్తికి పని చెప్పారు. బాలీవుడ్ ఎంట్రీకి ముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నారు. 5) అనుష్క శర్మ ‘రబ్ నే బనాది జోడీ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దక్షిణాది ముద్దు గుమ్మ అనుష్క శర్మ. మొదటి చిత్రంతోనే షారుఖ్ వంటి అగ్ర తార సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ‘బాంబే వెల్వెట్ ’ సినిమా సమయంలో అనుష్క తన పెదవులకు సర్జరీ చేయించుకోవటం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. 6) శామా సికిందర్ బాలీవుడ్ అందాల తారల్లో ఒకరు శామా సికిందర్. ‘ప్రేమ్ అగన్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ టీవీ సిరీస్ ‘మాయ: స్లేవ్ ఆఫ్ హర్ డిసైర్స్’తో పాపులారిటీ సంపాదించింది. ఈమె తన అందానికి మెరుగులు దిద్దటానికి ఫేషియల్ ఫీచర్స్ సర్జరీ చేయించుకుంది. 7) అలియా భట్ 8) దీపికా పదుకునే 9) సోనమ్ కపూర్ 10) రేఖ 11) విద్యాబాలన్ 12) రాణీ ముఖర్జీ 13) లారా దత్ 14) కరిష్మా కపూర్ 15) బిపాసా బసు 16) ముగ్ధా గాడ్సే -
అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా!
‘‘మన కోసం మనం చేసుకునే సహాయం ఏదైనా ఉందంటే మన శరీరం, మెదడులో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను గమనించడం.. వాటిని తెలుసుకోవడం... అర్థం చేసుకోవడం’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోకి ‘శ్రుతీ చిక్కిపోయిందేంటి? ఆరోగ్య సమస్యలా? దారుణంగా ఉంది’ అంటూ నెటిజన్ల నుంచి కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్కు స్పందిస్తూ రాసిన ఓ లేఖను పంచుకున్నారు శ్రుతి. దాని సారాంశం ఈ విధంగా.. ‘‘సాధారణంగా ఇతరుల అభిప్రాయాలను నేను పెద్దగా పట్టించుకోను. కానీ అదేపనిగా తను లావుగా ఉంది, సన్నగా ఉంది అంటూ చేసే విమర్శలకు స్పందించాలనిపిస్తుంది. ఈ రెండు ఫొటోలు (ఇన్సెట్లో ఉన్న ఫొటో) కేవలం మూడు రోజుల వ్యవధిలో దిగినవి. నేను ఏం చెప్పబోతున్నానో చాలామంది స్త్రీలు అర్థం చేసుకుంటారని, రిలేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నేనెప్పుడూ నా శరీరంలోని హార్మోన్ల అధీనంలోనే నడుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. వాటిని బ్యాలెన్స్ చేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాను. వాటితో సమన్వయం కుదుర్చుకునే పనిలోనే ఉన్నాను. అది అనుకున్నంత సులువైన పనేం కాదు. ఆ బాధ తేలికైనదేం కాదు. శరీరంలో వచ్చే మార్పులు చెప్పినంత సులువేం కాదు. కానీ ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోవడం సులువు అనుకుంటున్నాను. ఏ వ్యక్తి అయినా సరే ఏ సందర్భంలోనూ మరో వ్యక్తిని జడ్జ్ చేయకూడదు. అవును.. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. దాంట్లో సిగ్గుపడటానికి ఏం లేదు. ఇది నా జీవితం, నా ముఖం. ప్లాస్టిక్ సర్జరీని నేను ప్రమోట్ చేయను. అది విరుద్ధమైనది అని కూడా అనను. నా ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయం అది. అయితే నన్ను విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నేను కొంచెం కొంచెంగా ప్రతిరోజూ నన్ను నేను మరింత ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మన జీవితంలో గొప్ప ప్రేమకథ మనతోనే అయ్యుండాలి. మీ జీవితం కూడా అలానే ఉండాలనుకుంటున్నాను. ప్రేమను పంచుదాం’’ అన్నారు శ్రుతీ హాసన్. -
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఐఎం చీఫ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్లోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్ల్లో 2007 ఆగస్ట్ 25న చోటుచేసుకున్న జంట పేలుళ్ల కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్ పాకిస్థాన్లో తలదాచుకున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖ కవళికల్నీ మార్చుకున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదులుగా పిలిచే ఉగ్ర సోదరులు, 2007 నాటి జంట పేలుళ్ల కేసు నిందితులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్లను ఉగ్రవాదం వైపు మళ్లించింది సైతం ఇతగాడే. ఫోన్ కాల్స్ను ఓ ప్రాంతం నుంచి చేస్తూ మరో ప్రాంతం నుంచి చేస్తున్నట్లు చూపించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఐరోపా ఖండంలోని దేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థల్ని తప్పుదోవపట్టిస్తున్నాడని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతడు తమ ముఖ కవళికల్ని మార్చుకున్నాడని చెప్పడానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిన నిఘా వర్గాలు గాలింపు ముమ్మరం చేశాయి. బెదిరింపుల దందాలో దొరికిన నమూనాలు.. కేంద్ర నిఘా వర్గాలు గతంలోనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా పోలీసుల వద్ద నుంచి అమీర్ రజా ఖాన్ గొంతుకు సంబంధించిన నమానాలను సేకరించాయి. అదే నగరానికి చెందిన అమీర్ రజా ఖాన్ అక్కడ నుంచే నేర ప్రస్థానం ప్రారంభించాడు. తన సోదరుడైన ఆసిఫ్ రజా ఖాన్తో కలిసి ఆఫ్తాబ్ అన్సారీ గ్యాంగ్లో చేరి కిడ్నాప్లు, బెదిరించి డబ్బు గుంజడాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. 2001లో కోల్కతాకే చెందిన చెప్పుల తయారీ కర్మాగారం యజమాని ప్రథా రాయ్ బుర్మన్ను కిడ్నాప్ చేస్తానని బెదిరించి భారీగా దండుకున్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ సందర్భంలోనే అమీర్ రజా ఖాన్ ఫోన్ ద్వారా చేస్తున్న బెదిరింపులను రాయ్ సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. వాటిని అప్పట్లోనే కోల్కతా నేర దర్యాప్తు విభాగం అధికారులకు అందించారు. అమీర్, ఆసిఫ్ల నేర సామ్రాజ్యం గుజరాత్లోని రాజ్కోట్కు విస్తరించడంతో అక్కడా అనేక నేరాలు చేశారు. 2001లోనే రాజ్కోట్లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించడంతో అమీర్ పాకిస్థాన్కు పారిపోయి ఉగ్రవాద బాటపట్టాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) పేరుతో 2002లో కోల్కతాలోని అమెరికన్ కేంద్రంపై దాడి చేయించాడు. ఆ తర్వాత దీన్నే ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మార్చి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడ్డాడు. వీటిలో నగరంలో జరిగిన జంట పేలుళ్లు కూడా ఒకటి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ... అమీర్ రజా పాకిస్థాన్లో ఉంటూనే కోల్కతాలో తన దందా కొనసాగించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2010లో అక్కడి ఫైవ్స్టార్ హోటల్ యజమానిని రూ.20 కోట్లు చెల్లించాలంటూ ఫోన్ ద్వారా బెదిరించాడు. ఈ సందర్భంలోనూ గొంతును బాధితుడు సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. భవానీపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు ఆపై జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ అయింది. దర్యాప్తులో భాగంగా రాయ్ కేసులో నేర దర్యాప్తు విభాగం వద్ద ఉన్న గొంతు నమూనాలను సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ అంతర్జాతీయ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టింది. వీటిలో ఒక దాంట్లో అమీర్ రజా ఖాన్ గొంతు చిక్కడంతో లోతుగా ఆరా తీసింది. ఆ ఫోన్ కాలు ఐరోపా ఖండంలో ఉన్న లగ్జెంబర్గ్ నుంచి వచ్చినట్లు నిర్థారించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆ దేశ పోలీసులకు కేసు దర్యాప్తు సహకార విజ్ఞప్తి రాసింది. దీనిపై స్పందించిన ఆ దేశం కూడా దర్యాప్తు చేసి రజా తమ దేశంలో లేడని స్పష్టం చేసింది. మరింత లోతుగా దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ పాకిస్థాన్లోనే ఉంటున్న అమీర్ రజా ఖాన్ ఫోను సంకేతాల్ని ప్రాంతం మార్పు ద్వారా వ్యవహారాలు సాగిస్తున్నాడని అభిప్రాయపడింది. ఈ కారణంగానే లగ్సెంబర్గ్ వెలుగులోకి వచ్చినట్లు తేల్చింది. దుబాయ్, కరాచీ, నేపాల్ల్లోనూ అతడి కదలికలు ఉన్నట్లు సాంకేతిక పరికరాల నిఘాలో గుర్తించారు. రెండేళ్లలో మారిన కవళికలు.. ఈ వివరాల ఆధారంగా ఆరా తీసిన కేంద్ర నిఘా వర్గాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో అమీర్ కోసం వేట ముమ్మరం చేశాయి. ఫలితంగా 2018లో అమీర్ కదలికల్ని పాకిస్థాన్లో ఉన్న బాలాకోట్లోని లష్కరే తొయిబా ఉగ్రవాద శిక్షణ శిబిరంలో గుర్తించాయి. అప్పట్లో అక్కడి ఉగ్రవాదులకు ఇతడు శిక్షణ ఇస్తున్నట్లు తేల్చారు. మళ్లీ దాదాపు రెండేళ్ల తర్వాత అమీర్కు చెందిన తాజా ఫొటోను కేంద్ర నిఘా వర్గాలు సేకరించగలిగాయి. దీనికి, అప్పటి ఫొటోకు చాలా తేడాలు ఉన్నట్లు తేల్చాయి. గడ్డం, మీసం లేకపోవడంతో పాటు కవళికల్లోనే ఎన్నో తేడాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖాన్ని మార్చుకున్నట్లు అనుమానిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం అమీర్ రజా ఖాన్ చనిపోయాడంటూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధికారికంగానే ప్రకటించింది. తాజాగా దొరికిన ఆధారాలు అతడు బతికే ఉన్నాడని స్పష్టం చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు దీని వెనుక కొత్త వ్యూహం ఏదైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. -
మృతుడి చర్మం సేకరించి... కాలిన రోగికి అంటించి
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో మొదటిసారి ఒక చనిపోయిన వ్యక్తి నుంచి చర్మం సేకరించి కాలిన గాయాలతో బాధ పడుతున్న రోగికి అమర్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గుంటూరుకు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జీఎస్ సతీష్కుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 18 రోజుల క్రితం తొడ, ఇతర భాగాల వద్ద చర్మం కాలి తమ వద్దకు చికిత్స కోసం వచ్చారన్నారు. సాధారణంగా చర్మం కాలిన వారికి వారి శరీరంలోని తొడ, కాలు, చేయి, పొట్ట ఇతర శరీర భాగాల నుంచి చర్మం సేకరించి కాలినచోట అతికించి ఆపరేషన్ చేస్తామన్నారు. తమ వద్దకు వచ్చిన వ్యక్తికి 30 శాతం కాలిన గాయాలు ఉండటంతో పాటుగా చర్మాన్ని సేకరించేందుకు వీలు కుదరకపోవటంతో చనిపోయిన వారి నుంచి చర్మాన్ని( కెడావర్) సేకరించి అమర్చేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ముంబై లోని నేషనల్ సెంటర్ నుంచి నిల్వ ఉంచిన చర్మాన్ని సేకరించి ఐదు రోజుల క్రితం కెడావర్ గ్రాఫ్ట్ ద్వారా ఆపరేషన్ చేసి చర్మం అతికించామన్నారు. చర్మాన్ని సేకరించి స్కిన్ బ్యాంక్లో ఐదేళ్ల వరకు నిల్వ ఉంచుకోవచ్చని తెలిపారు. స్కిన్ బ్యాంక్ ఉంటే కాలిన గాయాల వారు చాలా త్వరగా కోలుకుంటారని, చనిపోయిన వారి నుంచి కళ్లు, కిడ్నీలు, గుండె సేకరించినట్టుగానే చర్మాన్ని కూడా సేకరించి కాలిన గాయాలవారి ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్ సతీష్కుమార్ తెలిపారు. -
మౌనీరాయ్ ప్లాస్టిక్ సర్జరీలు ఫెయిలయ్యాయా?
‘నాగినీ’ సీరియల్ స్టార్, బాలీవుడ్ కథానాయిక మౌనీ రాయ్ ఇటీవల సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా ప్రీమియర్కు హాజరయ్యారు. ఈ ఈవెంట్కు సంబంధించిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ట్రోల్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఫొటోలను చూసిన పలువురు ట్రోలర్స్.. మౌనీరాయ్ ప్లాస్టిక్ సర్జరీలతో తన సహజ అందాన్ని పాడు చేసుకుందని, మరింత అందం కోసం చేయించుకున్న సర్జరీలు సక్సెస్ కాకపోవడంతో ఆమె వికారంగా తయారైందని విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే ప్లాస్టిక్ సర్జరీల కారణంగా మౌనీరాయ్.. రాఖీ సావంత్లా కనిపిస్తోందని, మైఖేల్ జాక్సన్లా మారిందని కామెంట్లు పెడుతున్నారు. నియాన్ గ్రీన్ జాకెట్, బ్లాక్ డ్రెస్ వేసుకొని ‘భారత్’ ప్రీమియర్ ఈవెంట్కు కాజువల్గా మౌనీ రాయ్ హాజరయ్యారు. లూక్పరంగా ఆమె పెదవులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఆమె ఫొటోలపై నెటిజన్లు తలోరకంగా కామెంట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీలు ఆమె అందాన్ని నాశనం చేశాయని, మీ పెదవులకు ఏమైంది.. సర్జరీ ఫెయిలైందా? సహజ అందగత్తె అయిన మౌనీరాయ్ తన అందంపై నమ్మకం లేకనే.. ఇలా సర్జరీలు చేయించుకుంటోందని ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. అయితే, తన ఫొటోలపై వ్యక్తమవుతున్న నెగటివ్ కామెంట్లపై మౌనీరాయ్ ఇంతవరకు స్పందించలేదు. -
భీమవరంలో ఓ యువకుడికి వికటించిన ప్లాస్టిక్ సర్జరీ
-
గుర్తుపట్టకుండా ప్లాస్టిక్ సర్జరీ!
లండన్/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు దాదాపు రూ.13,500కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారత్లో కేసుల దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్లు తేలింది. ఇందులోభాగంగా తొలుత ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల తూర్పున ఉన్న వనౌతు ద్వీప దేశపు పౌరసత్వం కోసం నీరవ్ దరఖాస్తు చేసుకున్నారు. సింగపూర్లో శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మూడో దేశంలో ఆశ్రయం పొందేందుకు వీలుగా బ్రిటన్లోని ప్రముఖ న్యాయసంస్థలను నీరవ్ సంప్రదించారు. అంతేకాకుండా భారత అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఆయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావించారట. అయితే మెట్రో బ్యాంకు క్లర్క్ నీరవ్ను గుర్తుపట్టడంతో ఆయన ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి. మరోవైపు హోలీ పర్వదినం రోజున నీరవ్ మోదీ లండన్ శివార్లలోని వాండ్స్వర్త్లో ఉన్న ‘హర్ మెజెస్టీ జైలు’లో గడిపారు. మార్చి 28 వరకూ నీరవ్ ఇదే జైలులో ఉండనున్నారు. ఈ జైలులో అత్యవసర సమయంలో రోగులకు చికిత్స అందించే పరికరాలు లేవనీ, మౌలిక సదుపాయాలు కూడా అధ్వానంగా ఉన్నాయని గతంలో బ్రిటన్ జైళ్ల శాఖ విడుదల చేసిన నివేదికలు స్పష్టం చేశాయి. నీరవ్ కదలికలపై దృష్టి.. నీరవ్ మోదీ 2018, జనవరిలో భారత్ను విడిచిపెట్టి పారిపోయాక ఆయన ప్రతీ కదలికపై భారత విచారణ సంస్థలు దృష్టిసారించాయి. యూరప్, యూఏఈకి నీరవ్ సాగించిన రాకపోకలు, ఆయన ఆర్థిక వ్యవహారాలు, సమావేశాలను పరిశీలించాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘నీరవ్ మోదీ తన మామయ్య మెహుల్ చోక్సీ అంత తెలివైనవాడు కాదు. ఎందుకంటే వీరిద్దరి పరారీ అనంతరం సీబీఐ, ఈడీలు రెడ్కార్నర్ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఇంటర్పోల్ను ఆశ్రయించాయి. దీంతో వెంటనే చోక్సీ స్పందిస్తూ.. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని తన ప్రతిస్పందనను దాఖలుచేశారు. కానీ భారత అధికారులు దేశం బయట తనను పట్టుకోలేరన్న ధైర్యంతో నీరవ్ ఈ విషయమై స్పందించలేదు’ అని వ్యాఖ్యానించారు. మాల్యా కేసుతో అవగాహన.. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు అంతర్జాతీయంగా ఏ న్యాయస్థానాల్లో అయినా చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘అంటిగ్వాలో తలదాచుకుంటున్న నీరవ్ మోదీ మామయ్య చోక్సీని ఆ దేశం భారత్కు అప్పగిస్తుందని భావిస్తున్నాం. నీరవ్ను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలన్న పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇది త్వరలోనే ఆమోదం పొందుతుందని అనుకుంటున్నాం. నీరవ్ మోదీని త్వరలోనే బ్రిటన్ భారత్కు అప్పగిస్తుంది. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలను అందించాం. కింగ్ ఫిషర్ అధినేత విజయ్మాల్యా కేసులో ఎదురైన అనుభవాలతో బ్రిటన్ అప్పగింత చట్టాలపై భారత విచారణ సంస్థలకు ఓ అవగాహన వచ్చింది. అందుకు అనుగుణంగానే భారత అధికారులు నీరవ్ కేసు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించారు’ అని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొనాలని భారత సంస్థలకు బ్రిటన్ నుంచి ఇంకా ఆహ్వానం రాలేదన్నారు. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న నీరవ్ సోదరుడు నిషాల్, సోదరి పూర్వీలకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్లాస్టిక్ సర్జరీలపై చైనా బ్యాన్!
బీజింగ్ : చైనాలో యువత ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటంపై అక్కడి ప్రభుత్వం నిషేదం విధించాలని చూస్తోంది. ఈ మేరకు ఓ చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. చైనాలో ప్లాస్టిక్ సర్జరీ ఇండస్ట్రీ శరావేగంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం 20 మిలియన్ల మంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించున్నారని ప్రముఖ వెబ్సైట్ ‘‘సో యంగ్’’ తెలిపింది. అందానికి మెరుగులు దిద్దాలనే ఆలోచనతో అక్కడి యువత ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. చిన్న లోపాలను సైతం సరిచేయటానికి సర్జరీలకు వెళుతున్నారు. పెద్దపెద్ద కళ్లు, కొనతేలిన గడ్డం, చిన్న ముఖం కోసం చైనా యువత ఎక్కువగా సర్జరీలు చేయించుకుంటోంది. దీంతో సర్జరీలు వికటించిన సందర్బాల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కుంటున్నారు. ఒకనొక సమయంలో మరణాలు సైతం సంభవిస్తున్నాయి. అందం కోసం కత్తిగాట్ల సంస్కృతి పెరగటం ప్రభుత్వాన్ని తీవ్రంగా వేధిస్తోన్న సమస్యగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే భావితరాలపై దీని ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయానికి వచ్చింది. -
11 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు!
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..? అయ్యో అదేం ప్రశ్న ఆ మాత్రం తెలియదా.. మైఖేల్ జాక్సన్ కదా.. ఆయనో కింగ్ ఆఫ్ పాప్.. అంటూ స్టార్ట్ చేయకండి. ఆయన మైఖేల్ జాక్సన్ అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది మైఖేల్ జాక్సన్ ఫొటో కాదు. అతడి పేరు లియో బ్లాంకో. వయసు 22 ఏళ్లు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్కు చెందిన వ్యక్తి. మరేంటి అచ్చు మైఖేల్ జాక్సన్ లాగే ఉన్నాడు అనుకుంటున్నారా..? అవును అలాగే ఉన్నాడు. కానీ అలా కనిపించేందుకు ఏడేళ్లుగా బీభత్సమైన ప్లాస్లిక్ సర్జరీలు చేయించుకున్నాడట మనోడు. అందుకోసం దాదాపు రూ.22 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడట. 11 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడట. అయితే ఇంకా పర్ఫెక్ట్గా జాక్సన్లాగా కనిపించాలని ఇంకా కొన్ని సర్జరీలు చేయించుకుంటానని చెబుతున్నాడు. బ్లాంకో తల్లి మాట్లాడుతూ.. ఒక్కోసారి తానే గుర్తుపట్టలేక ఆశ్చర్చపోతానని, తన కొడుకు చివరికి ఏమైపోతాడోనని చాలా ఆందోళనగా ఉంటుందని చెప్పారు. -
సెల్ఫీల్లో అందం కోసం తపనా ఓ రోగమే
బోస్టన్: ఫొటోను అందంగా ఎడిట్ చేసుకుని నిజ జీవితంలోనూ తమకు ఇలాంటి ముఖమే వచ్చేట్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటీవల ప్లాస్టిక్ సర్జన్లను కలిసిన వారిలో సెల్ఫీల్లో అందంగా వచ్చేలా తమ ముఖాన్ని తీర్చిదిద్దమని కోరిన వారే 55 శాతమట! ఏ లోపం లేకుండా సెలబ్రిటీల్లా సోషల్మీడియాలో కనపడాలనే తపనను ‘స్నాప్డైమోఫియా’అనే రుగ్మతగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా స్నాప్చాట్, ఫేస్ట్యూన్ యాప్ల వంటి సోషల్మీడియా ఫొటో ఎడిటింగ్ టెక్నిక్స్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. బోస్టన్ వర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు జమా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఎడిటింగ్ టెక్నిక్స్ వల్ల అందంపై దృక్పథం మారిందని, దీంతో ఆత్మగౌరవం దెబ్బ తినడంతో పాటు శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ‘అందంగా కనపడాలనే తపనతో చర్మవ్యాధులు, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులను కలవడం ఒక రుగ్మత, వీరి మనసు నిండా అందం గురించిన ఆలోచనలే ఉంటాయి’ అని పరిశోధనలో పాల్గొన్న నీలమ్ వశీ పేర్కొన్నారు. సర్జరీతో అందం రాదని, సర్జరీ దీనికి ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. సహజమైన అందాన్ని ప్రేమించగలిగేలా వీరికి మానసిక చికిత్స అవసరమని సూచించారు. -
‘ఫ్యాన్’.. బింగ్బింగ్..
ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు.. మధ్యలో ఏదో సమస్య వచ్చి.. ఒకరి ప్లేసులోకి మరొకరు వెళ్తారు.. లేదా.. హీరో వల్ల విలన్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు.. దీంతో తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా హీరో ముఖంలా కనిపించేటట్లు మార్చేసుకుని.. హీరోను ఇబ్బందులు పెడతాడు. ఇలాంటి స్టోరీలు చాలా సినిమాల్లో చూశాం. ఆ మధ్య వచ్చిన ‘ఎవడు’సినిమాలో కూడా జయసుధ అల్లు అర్జున్కు ప్లాస్టిక్ సర్జరీ చేసి.. తన కొడుకైన రామ్చరణ్ తేజలా అతడి ముఖాన్ని మార్చేస్తుంది.. సినిమాల్లో ఒకే.. కానీ నిజజీవితంలో ఇది సాధ్యమా? ఓసారి ఈ ఫొటోను చూడండి.. రెండూ ఒకరి ఫొటోలాగే కనిపిస్తున్నా.. ఇద్దరూ వేర్వేరు.. అలాగని కవలలు కాదు.. ఇందులో ఒకరు సినిమా తార(కుడివైపు). మరొకరు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తనకు ఇష్టమైన తారలాగే మారిపోయిన ఆమె అభిమాని. ఫాన్ బింగ్బింగ్. చైనాలో క్రేజీ స్టార్. ఆమె అందానికి చాలా మంది ఫిదా. హే చెంగ్జీ కూడా ఆమెలాగే కావాలనుకుంది. 8 ఏళ్లు కష్టపడింది.. రెండు, మూడు ప్లాస్టిక్ సర్జరీలు.. అంతే.. కట్ చేస్తే.. ఎవరు ఒరిజినల్.. ఎవరు డూప్లికేట్ అన్న విషయాన్ని కనిపెట్టలేనంతగా మారిపోయింది. సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. కొన్నిసార్లు పేపర్లలో ఫాన్ బింగ్బింగ్ అంటూ చెంగ్జీ ఫొటోలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఫాన్ బింగ్బింగ్, చెంగ్జీలు వేర్వేరుగా వచ్చారు. అయితే.. మరుసటి రోజు కొన్ని పేపర్లలో ఫాన్ బింగ్బింగ్ అంటూ చెంగ్జీ చిత్రాలు వచ్చాయి. ఫొటోగ్రాఫర్లు ఇద్దరి మధ్యా తేడాను కనుగొనలేక అయోమయంలో పడేవారు. తనకు ఫాన్ బింగ్బింగ్ అంటే ఇష్టమేనని.. అయితే.. తనకంటూ సొంత వ్యక్తిత్వముందని.. తనను తననుగానే గుర్తించాలని చెంగ్జీ అంటోంది. ఇంకో విషయం.. చెంగ్జీ ఆమె బాయ్ఫ్రెండ్ కలిసి ఓ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ను కూడా పెట్టారట. అది కూడా చెంగ్జీలాగే సూపర్ హిట్. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
అద్భుతం.. ఉస్మానియా వైద్యం
సుల్తాన్బజార్ : ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కోమరయ్య కుమారుడు శ్రీను(22) పుట్టుకతో అంతుచిక్కని వ్యాధి బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. అతని శరీరమంతా నల్లని మచ్చలు ఏర్పడ్డాయి.తలపై కేన్సర్ గడ్డ కూడా ఏర్పడింది. కుటుంబ సభ్యులు 2011లో నాంపల్లి రెడ్హిల్స్లోని ఎంఎన్జె కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స చేసి తొలగించారు.తరువాత (రెండు సంవత్సరాల క్రితం) ఈ వ్యాధి తిరగబడింది. గతంలో తలపై ఏర్పడిన చోటే తిరిగి గడ్డ ఏర్పడింది. మెల్ల మెల్లగా మెదడు వరకు ఏర్పడింది. 10 రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ అతనికి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి నాగప్రసాద్, అనస్టీసియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పాండునాయక్, న్యూరో సర్జరి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మస్తాన్రెడ్డిల నేతృత్వంలో వైద్య బృందం సుమారు 4 గంటలపై శ్రమించి శ్రీను తలపై నుంచి మెదడువరకు పేరుకుపోయిన కేన్సర్ గడ్డను తొలగించి తొడపై నుంచి చర్మాన్ని తీసి తలపై అతికించి చికిత్స విజయంతంగా నిర్వహించారు. దీంతో వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అభినందించి సత్కరించారు. రోగి జీవన ప్రమాణాన్ని పెంచగలిగాం తలపై కేన్సర్ గడ్డ పేరుకుపోయిన శ్రీనుకు రెండు రోజుల క్రితం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి అతని జీవన ప్రమాణాన్ని పెంచగలిగాం. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని వైద్య పరిభాషలో జీరో ధర్మ పెగ్మెంటోజో అని అంటారు. 3 లక్షల మందిలో ఒకరికి ఈ వ్యాధి అరుదుగా వస్తుంది. కొందరికి ఈ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. 20 ఏళ్లలో ఇలాంటి ప్రాణాంతక వ్యాధితో ఎవ్వరూ రాలేదు. మొదటిసారిగా ఇలాంటి కేసు రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత ఇంటికి పంపించాం. – డాక్టర్ నాగప్రసాద్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి -
సెల్ఫీల వీరుడు!
స్మార్ట్ఫోన్ ఉంటే చాలు ఈ మధ్య యువత తెగ సెల్ఫీలకు పోజులిచ్చేస్తున్నారు. కాస్త ప్రత్యేకంగా ఉండాలని ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. అయితే సెల్ఫీలంటే ప్రాణంగా భావించే వారూ ఈ మధ్య పెరిగిపోతున్నారు. అయితే వారందరినీ వెనక్కు నెట్టేసి ముందువరుసలో నిలుస్తాడు ఈ ఫొటోలోని యువకుడు. బ్రిటన్లోని పీటర్స్బర్గ్కు చెందిన జునైద్ అహ్మద్కు సెల్ఫీలంటే మహా............ పిచ్చి. ఎంత పిచ్చి అంటే సెల్ఫీలు దిగే ముందు కనీసం మూడు గంటల పాటు తయారవుతాడట. రోజుకు తక్కువలో తక్కువ 200 సెల్ఫీలు దిగుతాడట. అంతేకాదు వాటిని వెంటనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాడట. తన ఇన్స్టాగ్రామ్లో అహ్మద్కు 50 వేల మంది ఫాలోవర్లు ఉన్నారట. దీంతో వారందరికీ నచ్చేలా ఉండేట్లు గంటల తరబడి అద్దం ముందు నిల్చుని రెడీ అవుతాడట. అంతేకాదు వారానికోసారి ఫేషియల్స్, కంటిబొమ్మలను సరిచేసుకోవడం వంటివి చేస్తాడట. అలాగే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకున్నాడట. ఉదయం తన ఫోటో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే వందల కొద్దీ లైక్లు కామెంట్లు వస్తాయని, దీంతో తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెబుతున్నాడు. తనకు సెల్ఫీ కింగ్ అని కూడా బిరుదు ఇచ్చుకున్నాడు. ఇంతకు మించి సెల్ఫీ అంటే ‘పిచ్చి’ ఉన్న వ్యక్తి లోకంలో ఉండడేమో! -
అపర బ్రహ్మలు.. ‘గాంధీ’ వైద్యులు
హైదరాబాద్: పాడైపోయిన రూపాన్ని సరిచేసి అపర బ్రహ్మలుగా నిలిచారు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి గుర్తు పట్టలేనంతగా మారిన ముఖాలకు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి కోల్పోయిన రూపాలను తిరిగి తెచ్చారు గాంధీ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు. గాంధీ ఆస్పత్రిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్తో కలసి పాస్టిక్ సర్జరీ విభాగాధిపతి సుబోధ్కుమార్, అనస్థీషి యా వైద్యులు అప్పారావు ఆరోగ్య శ్రీ ద్వారా విజయవంతంగా నిర్వహించిన 4 అరుదైన శస్త్రచికిత్సల వివరాలను వెల్లడించారు. తెగి ఊగిసలాడుతున్న చేతికి.. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండ లం కల్సిపురికి చెందిన అభినవ్ (21) నగరంలో బీటెక్ చదువుతున్నాడు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఎడమచేయి తెగి ఊగిసలాడుతోంది. దీంతో గతనెల 6న గాంధీలో చేరాడు. వైద్యులు మైక్రోవాస్కులర్ సర్జరీ విజయవంతంగా నిర్వహించి తొడవద్ద కండను తీసి చేతికి అతికించి, రక్తనాళాలకు కనెక్షన్ ఇచ్చారు. విద్యుదాఘాతానికి గురైన మరో ఇద్దరికి.. విద్యుదాఘాతానికి గురై గుర్తుపట్టలేనంతగా ముఖం కాలిపోయిన మరో ఇద్దరు బాధితులకు పలుమార్లు శస్త్రచికిత్సలు నిర్వహించి కొల్పోయిన రూపాన్ని తిరిగి తెచ్చారు. నల్లగొండజిల్లా కంచనపల్లికి చెందిన శ్రీను (45), సిద్దిపేట జిల్లా కొయిడ మండలం బసవపూర్ జ్యోతిరాం తండాకు చెందిన నెహ్రూ (50) విద్యుదాఘాతంతో ముఖరూపాన్ని కోల్పోయారు. వీరికి మల్టిపుల్ ప్లాప్ సర్జరీలు చేసి పేషియల్ రీకనస్ట్రక్షన్ శస్త్రచికిత్స ద్వారా కోల్పోయిన రూపాన్ని తిరిగి తెచ్చారు. ఈ సమావేశంలో ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు వెంకటేశ్వర్లు, అప్పారావు, రమేశ్, మహేందర్, చంద్రకళ, అర్జున్, సృజనలతోపాటు పీజీ వైద్యవిద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎముకను వంచి.. దవడగా మార్చి.. రంగారెడ్డి జిల్లా కొత్తగూడకు చెందిన జనార్దన్ (32) దవడ ఎముకకు క్యాన్సర్ సోకింది. ఎముక పూర్తిగా పాడైపోవడంతో గతనెలలో గాంధీ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చేరాడు. వైద్యులు పాడైన దవడ ఎముకను తొలగించారు. ఎమలోబ్లాష్టోమా అనే అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి నిలువుగా ఉన్న కాలి ఎముకను తీసి దాన్ని యు ఆకారంలో వంచి దవడకు విజయవంతంగా అమర్చారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.15 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించారు. -
ప్లాస్టిక్ సర్జరీ ఎంత పని చేసింది..
ఇటీవల దక్షిణ కొరియా విమానాశ్రయంలో ముగ్గురు చైనీయులను ఎయిర్పోర్టు అధికారులు అడ్డుకున్నారు. వాళ్లేదో దొంగతనం, స్మగ్లింగ్ వంటి నేరాలకు ఏమీ పాల్పడలేదు.. కేవలం ట్రీట్మెంట్ కోసం దక్షిణ కొరియాకు వచ్చిన పేషెంట్లు.. మరి వారిని ఎందుకిలా అడ్డుకున్నారంటే వారి పాస్పోర్టులోని ఫొటోలతో వారి ముఖాలు మ్యాచ్ అవ్వలేదు. చైనా నుంచి దక్షిణ కొరియాకు మ్యాచ్ అయిన ఫొటోలు తిరిగి తమ దేశానికి వెళ్లేటప్పుడు మ్యాచ్ కాకపోవడం ఏంటి? ఏమీలేదు వారు దక్షిణ కొరియాకు వచ్చింది ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్ కోసం.. అందుకే విమానాశ్రయంలో వారి ఫొటోలతో ప్రస్తుత ముఖాలు సరిపోలక అధికారులు వారిని నిలిపేశారు. ప్రపంచంలో ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లకు దక్షిణ కొరియా పెట్టింది పేరు. చైనా, జపాన్, ఇతర ఆసియా దేశాల వారు తరచూ దక్షిణ కొరియాకు ట్రీట్మెంట్ నిమిత్తం వెళుతుంటారు. సాధారణంగా ఇలా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన అనంతరం సర్జరీలో మార్పులకు గురయిన, మార్పులకు నోచుకోని శరీర భాగాల పేర్లు తెలుపుతూ ఆస్పత్రులు ఒక సర్టిఫికెట్ను వారికి అందజేస్తారు. ఆ సర్టిఫికెట్ను వారు విమానాశ్రయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ఆధారంగా అధికారులు ప్రయాణికులను వారి దేశాలకు అనుమతిస్తారు. అయితే ఇక్కడ ఈ ముగ్గురి చైనీయుల విషయంలో అది జరగలేదు.. ఎందుకంటే వారు తమ ముఖాలను పూర్తిగా మార్చుకున్నారు. అందులోనూ ముఖాలకు కట్లతో రావడం వల్ల అధికారులు పాస్పోర్టులోని ఫొటోలతో వారిని సరిపోల్చలేకపోయారు. దీంతో వారి శరీరాల ఆధారంగా వారిని గుర్తించి చైనా వెళ్లేందుకు అనుమతించారు. అయినా ఇది కూడా వెంటనే జరగలేదండోయ్.. వారిని గుర్తించడానికి అధికారులు కొద్ది రోజులు సమయం తీసుకున్నారు.. -
'పాత్ర కోసం సర్జరీ చేయించుకున్నా'
సాక్షి, తమిళసినిమా: సాధారణంగా అందానికి మెరుగులు దిద్దుకోవడానికి హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు. అదే నటులైతే పాత్ర స్వభావాన్ని బట్టి బరువు పెరగడానికో, తగ్గడానికో కసరత్తులు చేస్తుంటారు. అంతేకానీ పాత్ర కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నటుడిని చూసి ఉండం. అయితే దర్శకుడు కలెంజయమ్ను చూసిన తరువాత ఇలాంటి వారు కూడా ఉంటారని నమ్మాల్సి వస్తుంది. ఇంతకు ముందు పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన కలైంజయమ్లో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఇటీవల నటనపై అధిక దృష్టిసారిస్తున్న ఈయన ఈ మధ్య విడుదలైన కనవు తొళిల్సాలై చిత్రంలో యాంటీ కిడ్నాపింగ్ అధికారిగా నటించి మెప్పించారు. అయితే అంతకు ముందు కలైంజయమ్కు, ఈ చిత్రంలోని కలైంజయమ్కు అసలు పొంతనే లేదనిపించింది. అంతగా ఆ పాత్ర కోసం మారిపోయారు. అంతగా మార్పునకు కారణం ఏమిటన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ, కనవు తొళిల్సాలై చిత్రంలో హిందువుల దేవుళ్ల విగ్రహాలను అక్రమంగా తరళింపును అరికట్టే అధికారి పాత్ర ఉంది నటిస్తారా? అయితే ఆ పాత్ర కోసం మీరు పూర్తిగా మారిపోవాలి. ముఖ్యంగా మీ శరీర రంగు మార్చుకోవాలి అని ఆ చిత్ర దర్శకుడు టి.కృష్ణసామి అడిగారన్నారు. దాన్ని తాను ఛాలెంజ్గా తీసుకుని చెన్నై ప్లాస్టిక్ సర్జరీ వైద్య నిపుణుడు కార్తీక్ను కలిసి తన రంగు మార్పు గురించి చర్చించానన్నారు. ఆయన మూడు నెలలు కష్టపడి తన శరీర రూపాన్ని పూర్తిగా మార్చేశారని అన్నారు. ఆ తరువాత దర్శకుడు కృష్ణసామి చెప్పిన యాంటీ కిడ్నాపింగ్ అధికారి ఇర్ఫాన్ గా మారి ఆయన ముందు నిలిచానన్నారు.ఆయన తనను చూసి షాక్ అయ్యారని, వృత్తిపై తన శ్రద్ధను చూసి కనవు తొళిల్సాలై చిత్రంలో నటించే అవకాశం కల్పించారన్నారు ఇందులో తన నటనకు ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. -
ప్లాస్టిక్ సర్జరీ.. నా పర్సనల్: హీరోయిన్
సాక్షి, సినిమా: హీరోయిన్లు తమ అందాలకు మెరుగుపెట్టుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించటం కొత్తేం కాదు. అందంగా కనిపిస్తే ఫర్వాలేదుగానీ అందులో తేడా కొట్టేస్తే మాత్రం అయ్యో పాపం అనుకోవాల్సిందే. కొన్నాళ్ల క్రితం నటి అయేషా టకియా విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆమె ముఖానికి శస్త్ర చికిత్స చేయించుకుందని.. అది వికటించిందని కథనాలు వెలువడ్డాయి. ఆ సమయంలో ఎటువంటి స్పందన ఇవ్వని అయేషా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్లాస్టిక్ సర్జరీ ప్రస్తావన తీసుకొచ్చారు. తాను అసలు సర్జరీ చేయించుకోలేదని.. అదంతా మీడియా కల్పేనేనని ఆమె తేల్చేశారు. ‘ఆ వార్త వెలువడ్డ సమయంలో నేను కుటుంబంతో గోవాలో ఉన్నా. సోషల్ మీడియాలో ట్రోల్స్ నుంచి తప్పించుకోవటం ఇప్పుడు ఎవరి వల్లా కావటం లేదు. నేనేం తప్పు చేయనప్పుడు.. స్పందించాల్సిన పని లేదనే ఊరుకున్నా’ అని అయేషా చెబుతున్నారు. మొత్తానికి సర్జరీ వార్తలను తోసిపుచ్చిన అయేషా.. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని, సిగ్గుపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎవరు ఎవరి జీవితాన్ని నిర్ణయించలేరు. ఎవరికి తోచింది వారు చేసేస్తున్నారు. అలాంటప్పుడు నా శరీరాన్ని మార్చుకునే హక్కు నాకు ఉంటుంది కదా అని అయేషా అంటున్నారు. తెలుగులో నాగార్జున సూపర్ చిత్రంతోపాటు బాలీవుడ్లో అరడజనుపైగా చిత్రాల్లో నటించిన అయేషా తర్వాత సమాజ్వాదీ పార్టీ నేత, వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
ప్లాస్టిక్ సర్జరీతో 25కోట్లకు టోకరా..!
వుహాన్: అప్పుల అప్పారావు సినిమా గుర్తుంది కదా. అందులో రాజేంద్ర ప్రసాద్ అప్పు ఇచ్చిన వారి నుంచి తప్పించుకు తిరగడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే మధ్య చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ఇక్కడ మహిళ. అప్పు ఇచ్చిన వారి నుంచి తప్పించు కోవడానికి ఓ మహిళ వింత ప్రయోగం చేసింది. బ్యాంకులకు సుమారు రూ.25 కోట్లు టోకరా వేసింది. చైనాలోని ముఖ్య నగరమై వుహాన్కు చెందిన 59 ఏళ్ల మహిళ 25 మిలియన్ యువాన్లు (రూ.25కోట్లు) వ్యక్తిగత రుణం తీసుకుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించమని కోరితే అడ్రస్ లేకుండా పారిపోయింది. చైనాలోని అన్ని నగరాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అయితే సదరు మహిళ మాత్రం ఎంచక్కా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అధికారుల ముందే దర్జాగా తిరిగింది. చివరకూ పోలీసులకు పట్టుపడిపోయింది. ఇలా లోన్ తీసుకుని చెల్లించని 186 మందిని పోలీసులు, బ్యాంకు అధికారులు అరెస్టు చేశారు. -
ఆ వార్తలపై అనసూయ సీరియస్..!
బుల్లితెరపై సత్తా చాటి, ప్రస్తుతం వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యాంకర్ అనసూయ, తనపై సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తలపై సీరియస్ అయ్యింది. కొద్ది రోజులుగా అనసూయ లావు తగ్గేందుకు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఓ అభిమాని అనసూయి దృష్టికి తీసుకురావటంతో ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను షార్ట్ కట్స్ నమ్మనని.. ఎలాంటి సర్జరీ చేయించుకోవటం లేదని తెలిపింది. నా నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండానే ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారని తెలిపింది. 😂😂You know..they aint getting any news from me..so might as well they create😂! But on a serious note..NO!NEVER!!I dont believe in shortcuts. https://t.co/16h9QjiZZr — Anasuya Bharadwaj (@anusuyakhasba) 20 June 2017 -
చర్మం ఒలిచేస్తున్నారు!
⇒ నేపాల్లో ఒళ్లు గగుర్పొడిచే దందా ⇒ కాస్మొటిక్ వ్యాపారానికి యువతులు, మహిళల బలి ⇒ వేశ్యావాటికలకు తరలిస్తూ అమ్మాయిల చర్మం ఒలుచుకుంటున్న వైనం ⇒ మత్తు మందు ఇచ్చి.. మంచానికి కట్టేసి.. తోలు తీసుకుంటున్న దారుణం ⇒ భారత్లో కాస్మొటిక్ ఆపరేషన్ల కోసం తెల్ల చర్మానికి పెరుగుతున్న గిరాకీ ⇒ దనవంతుల శరీర సౌష్టవం పెంపు, సౌందర్య శస్త్రచికిత్సలలో వినియోగం ⇒ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి.. మళ్లీ అక్కడ్నుంచి కాస్మొటిక్ ఉత్పత్తులుగా దిగుమతి చర్మం తీసుకునే మహిళకు చెల్లించేది... (రూ.) 5,000 - 10,000 ఏజెంటుకు చెల్లించేది... (రూ.) 30,000 - 50,000 వంద చదరపు అంగుళాలు.. లక్ష రూపాయలు..! ఇది చర్మం విలువ! మనిషి చర్మం. అందునా మహిళ చర్మం.. నేపాలీ మహిళ చర్మం విలువ!! భారత్లో ధనవంతుల సౌందర్య శస్త్రచికిత్సలకు, కాలిన గాయాల సర్జరీలకు ఈ చర్మాన్ని ఉపయోగిస్తున్నారు. భారత కాస్మొటిక్ సర్జరీ మార్కెట్లో చర్మానికి రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. ఆరోగ్యవంతమైన, తెల్లని చర్మం కావాలి. దీంతో నేపాలీ యువతులు, మహిళల చర్మాన్ని నిలువునా ఒలుస్తున్నారు. ఇప్పటికే నేపాలీ యువతులు, మహిళల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారిని వేశ్యలుగా మారుస్తూ ఇండియా తదితర దక్షిణాసియా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్న మాఫియా.. ఇప్పుడు ఈ కొత్త దందాకు వారినే బలిపశువులుగా వాడుకుంటోంది. మహిళల చర్మాన్ని దౌర్జన్యంగా ఒలుచుకుని డబ్బు చేసుకుంటున్నారు. ఒళ్లు గగుర్పొడిపించే ఈ దారుణ దందా గురించి సోమాబసు అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నేపాల్, భారత్లో పర్యటించి పరిశోధించి వెలుగులోకి తీసుకువచ్చారు. తాజాగా ఒక వెబ్సైట్లో ప్రచురించిన ఈ పరిశోధనాత్మక కథనంలోని ముఖ్యాంశాలివీ.. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ మాదకద్రవ్యాల మత్తులో ముంచేసి.. ఈ పార్లర్లు, వేశ్యావాటికల్లో విటుల విపరీత పోకడలు, పైశాచిక కోరికలకు ఈ మహిళలు సహకరించడానికి వీలుగా మాదకద్రవ్యాలు, మత్తు మందులు ఇచ్చి వారిని మంచానికి కట్టివేస్తారు. ఆ మత్తు ప్రభావం నుంచి బయటపడి మెలకువ వచ్చేసరికి ఈ మహిళల శరీరాలు గాయాలతో నెత్తురోడుతూ ఉంటాయి. వీపు, పొత్తి కడుపు, తొడలు అన్ని భాగాల్లో చర్మం లేకుండా గాయాలు తేరి ఉంటాయి. దీంతో వారు వెంటనే ప్రాణభయంతో పరుగులు పెడతారు. అవన్నీ విటులు పైశాచిక ఆనందం కోసం చేసిన గాయాలని అనుకుంటారు. తమ ఖర్మకు తమనే నిందించుకుంటూ ఆ వృత్తిలోనే కొనసాగుతారు. కాకపోతే వారికి అంతకుముందు ఉన్నంత డిమాండ్ ఉండదు. అయితే వారిలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వారి శరీరం నుంచి చర్మం వలుచుకున్నారని, నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారని, దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని! తర్వాత తెలిసినా వారు చేయగలిగిందేమీ లేదు.. మౌనంగా రోదించడం తప్ప!! తెల్ల చర్మానికి గిరాకీ ఎక్కువ మనుషుల చర్మానికి, ముఖ్యంగా తెల్లని మేనిఛాయ గల మహిళల చర్మానికి చాలా డిమాండ్ ఉంది. 100 చదరపు అంగుళాల చర్మపు ముక్కకు ఢిల్లీ, ముంబై నగరాల్లో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ ధర పలుకుతుంది. ఆ చర్మాన్ని చిన్న చిన్న పాథలాజికల్ ల్యాబ్లకు అమ్ముతారు. అక్కడ చర్మం టిష్యూను శుద్ధి చేసి.. అమెరికాకు జీవ అవయవాలను సరఫరా చేసేందుకు లైసెన్స్ ఉన్న పెద్ద ల్యాబ్లకు సరఫరా చేస్తారు. అందులో కొన్ని ప్రముఖ ల్యాబ్లు కూడా ఉన్నాయి. అమెరికాలో ఈ శుద్ధి చేసిన చర్మాన్ని.. ‘అల్లోడెర్మ్’ లేదా అటువంటి ఉత్పత్తులుగా అభివృద్ధి చేస్తారు. తిరిగి ఇతర దేశాలతో పాటు భారత్కు ఎగుమతి చేస్తారు. వీటిని పురుషాంగ పరిమాణం పెంపు, మహిళల వక్షోజాల పరిమాణం పెంపు, పెదవులు సరిచేయడం, కాలిన గాయాలను సరిచేయడం వంటి శరీరాకృతి సౌందర్య, సౌష్టవాలను పెంపొందించే కాస్మొటిక్ సర్జరీల్లో ఉపయోగిస్తారు. ఈ సర్జరీలకు ఇప్పుడు భారత్లో గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. సమ్మతితోనూ చర్మం తీసుకుంటారు ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పురుషుల్లో చాలామంది మద్యపానం, ధూమపానం చేస్తుంటారు కాబట్టి.. వారి కన్నా మహిళల చర్మం, కిడ్నీలు ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉంటాయి కాబట్టి.. మహిళలనే ఎక్కు వగా ఇందుకోసం ఎంచుకుంటారు. పైగా నేపాలీ మహిళల చర్మం తెల్లగా ఉండటంతో దాన్ని కాకాసియన్ జాతి వ్యక్తి చర్మంగా నమ్మించగలగడం వల్ల కూడా వారు ఎక్కువగా బాధితులవుతున్నారు. కొందరు మహిళల నుంచి వారి సమ్మతితోనే చర్మం తీసుకుంటున్నారు. నిజానికి నేపాల్లో చాలా మంది పేదరికం, అప్పుల వల్ల కిడ్నీలు, చర్మం అమ్ముకోవడం మామూలుగా మారింది. మానవ అవయవాల విక్రయం నేపాల్ చట్ట ప్రకారం నేరం. ఇండియాలో కూడా ఈ క్రయవిక్రయాలు నిషిద్ధం. అయితే.. రిజిస్టర్ చేసుకున్న అవయవ దాతల నుంచి మాత్రం అవయవాలను, టిష్యూలను తీసుకోవచ్చు. దీంతో చర్మం తీసుకోవడం కోసం అటు నేపాల్లో, ఇటు ఇండియాలో నకిలీ ధ్రువపత్రాలను కూడా తయారు చేస్తున్నారు. బాధితులకు మిగిలేది శూన్యం కాస్మొటిక్ సర్జరీ కోసం చర్మం కావలసిన వారు ముందుగా ఇండియాలో లేదా నేపాల్లో ఒక ఏజెంటును సంప్రదిస్తారు. అవసరమైన చర్మపు రంగు ఫొటో, సదరు వ్యక్తి రక్తపు గ్రూపు వివరాలతో పాటు.. నిజమైన కస్టమరో కాదో నిర్ధా రించుకోవడానికి చికిత్సకు సంబంధించిన పత్రాలు చూపాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ‘శాంపిల్’ చర్మం పంపిస్తారు. అడ్వాన్సుగా కొంత మొత్తం తీసుకుంటారు. ‘‘ఏ మహిళ చర్మం తీసుకుంటారో.. ఆ మహిళకు రూ.5,000 నుంచి రూ. 10,000 చెల్లిస్తారు. ఆ చర్మం శాంపిల్ను పంపించిన మొదటి ఏజెంటుకు రూ.30 వేల నుంచి రూ.50 వరకు లభిస్తాయి. ఆ మహిళను భారత్-నేపాల్ సరిహద్దుల వరకూ తీసుకెళ్తారు. అక్కడ్నుంచి మరో ఏజెంటు వారిని సరిహద్దు దాటించి భారత్కు తీసుకెళ్లి మూడో ఏజెంటుకు అప్పగిస్తారు. ఆ మూడో ఏజెంటు ఆమె నుంచి చర్మం ఒలిచే ఏర్పాట్లు చేస్తాడు. ఆ చర్మాన్ని తాము దానం చేశామని, అమ్మలేదని సదరు మహిళలు ధ్రువపత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది’’ అని 40 ఏళ్ల ట్రాఫికర్ ప్రేమ్ బాస్గాయ్ చెప్పాడు. నేపాల్లోని కాబ్రేపాలన్చౌక్ జిల్లాలో కిడ్నీలు విక్రయిస్తున్న కేసులో ఇతడిని గత ఏడాది అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. నైట్ క్లబ్బులు, మసాజ్ పార్లర్లలో వేశ్యలుగా నేపాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు చాలా మంది దుర్భర దారిద్య్రంలో మగ్గు తున్నారు. వారి పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెంట్లు.. వారిని వేశ్యలుగా మార్చి ఈ థామెల్తోపాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లోని నైట్ క్లబ్బులు, మసాజ్ పార్లర్లకు తీసుకువస్తారు. ఆ మహిళలు మూడు నెలల ‘జీతం’ ఆ ఏజెంట్లకు కమీషన్ కింద చెల్లించాలి. దక్షిణాసియా దేశాల నుంచి.. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పురుషులు ఇక్కడ విటులు. యువతి కాస్త చక్కగా ఉంటే ఒక్కో ‘సిటింగ్’కి రూ.5,000 వరకూ చెల్లిస్తారు. కానీ కొంత కాలానికే చాలా మంది యువతుల శరీరాలు గాయపడతాయి. ఇలా గాయపు మచ్చలున్న వారికి రూ.300 నుంచి రూ.500 దక్కడమే ఎక్కువ. ఇక ఆ మహిళలు కండోమ్ ఉపయోగించాలని పట్టుబడితే అదీ ఇవ్వరు. అలాగే చాలా మంది నేపాలీ మహిళలను భారత్లోని కోల్కతా, ముంబై ప్రాంతాల్లోని వేశ్యావాటికలకు తరలించడం షరా మామూలే. బాధితులే ఏజెంట్లుగా... కుసుమ్ శ్రేష్ఠ అనే మహిళ వయసు 40 ఏళ్లు. ఆమె ఖట్మాండుకు 62 కి.మీ. దూరంలోని నువాకోట్ గ్రామంలో నివసిస్తున్నారు. తన చర్మాన్ని ఒక ఏజెంటుకు అమ్మారు. ఆ ఏజెంట్లకు చాలా బలమైన నెట్వర్క్ ఉందని, ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాహసిస్తే వారి కుటుంబాన్ని హింసిస్తారని భయంభయంగా చెప్పారు. నిజానికి చాలా కుటుంబాలు జీవనాధారం కోసం చిన్న చిన్న పనులు చేయడానికి ఈ ఏజెంట్ల మీద ఆధారపడతారు. అలా కిడ్నీలు, చర్మం అమ్ముకున్న బాధితులు కూడా ఆ తర్వాత ఏజెంట్లుగా మారుతున్న ఉదంతాలూ ఉన్నాయి. ప్రేమ్ బాస్గాయ్ అలాగే ఏజెంటుగా మారాడు. తొలుత అతడు, అతడి భార్య తమ కిడ్నీలు అమ్ముకున్నారు. ఆ డబ్బులు అయిపోయాక.. ఇతరులను కిడ్నీలు అమ్మడానికి ఒప్పించి కమీషన్ తీసుకునే ఏజెంటుగా మారాడతడు. ఎదురు తిరిగితే చంపేసి కాల్వలో తొక్కేస్తారు! కాబ్రేపాలన్చౌక్ జిల్లా ‘నేపాల్ కిడ్నీ బ్యాంకు’గా పేరుపడింది. ఇక్కడి జనంలో చాలా మంది కిడ్నీలు అమ్ముకున్న వారు ఉన్నారు. ఇక్కడ్నుంచి దాదాపు 300 కిడ్నీలు అక్రమ రవాణా చేసినట్లు బయటపడినా.. కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. చర్మం విక్రయాల పరిస్థితీ ఇంతే. ఈ రాకెట్ చాలా పకడ్బందీగా అనేక అంచెల్లో ఉండటం ఒక ఎత్తయితే.. ఆ విషయం ఎక్కడైనా బయటపెడితే తమతో పాటు తమ కుటుంబ సభ్యులకూ జరిగే ప్రాణహాని గురించిన భయం మరొక ఎత్తు. దీంతో బాధితులు ఎవరూ ఎక్కడా నోరు విప్పడానికి ఇష్టపడరు. ‘‘ఎవరు ఫిర్యాదు చేస్తారు? అక్కడ ప్రాణానికి విలువ లేదు. కస్టమర్లను సుఖపెట్టడానికి నిరాకరించిన మహిళలను లేదంటే పారిపోవడానికి ప్రయత్నించిన మహిళలను చంపేసి మురుగు కాల్వల్లో తొక్కేసిన ఘటనలు నా కళ్లతో చూశాను. ఒక కస్టమర్ నా రెండేళ్ల కుమారుడి నాలుకను సిగరెట్తో కాల్చాడు. నా కుమారుడికి ఇప్పుడు ఏడేళ్లు. అయినా ఇంకా సరిగ్గా మాట్లాడలేడు. ఆ కూపాల నుంచి మమ్మల్ని రక్షించి పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చినప్పుడు.. గతం గురించి మేం మాట్లాడం. దాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటి భయానక సంఘటనలేవీ జరగలేదని మాకు మేం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని రేఖ అనే మహిళ వివరించారు. ఆమె వయసు 30 ఏళ్లు దాటింది. ఆమె కిడ్నీని విక్రయించారు. ముంబై, కోల్కతాల్లోని వేశ్యావాటికలకు ఆమెను అమ్మేశారు. నేపాల్ రాజధాని ఖట్మాండు నగరంలో థామెల్ ప్రాంతం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కళ్లు తెరుస్తుంది. అప్పుడిక అక్కడ ప్రతీదీ అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. నైట్ క్లబ్బులు వెలుగులీనుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే.. భారత విలాస పురుషులకు ఇదో చిన్న లాస్ వేగాస్ వంటిది. ఇక్కడ చాలా మంది ‘ఏజెంట్లు’ ఉంటారు. వాళ్లలో 14-15 ఏళ్ల బాలురు కూడా ఉంటారు. వీధుల్లో పురుష పర్యాటకులకు ఇక్కడి నైట్ క్లబ్బుల్లో లభించే ‘సేవల’ గురించి చెబుతూ వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ పార్లర్లలో నేపాల్ యువతులు, మహిళలు పురుషులకు కావలసిన ‘సేవలు’ అందిస్తారు. -
సాక్షి ఎఫెక్ట్ : గాంధీ ఆస్పత్రి ఘటనపై విచారణ
-
కాసుల రోగం పైసల పైత్యం
-
ఆ పేషెంట్ ఘటనపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషేంట్లపై సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బొమ్మకారుతో పేషెంట్ పడిన బాధలను మీడియా ప్రతినిధులు వీడియో తీసి సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. గాంధీ ఆస్పత్రిలో సంచలనం రేపిన ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ‘గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్తో ఈ ఘటనపై చర్చించాను. బాధితుడి వివరాలు అడిగి తెలుసుకున్నాను. బాధితుడు రాజుకు తన వంతు సాయం చేయడానికి సిద్ధం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు. నగరంలోని గాంధీ ఆస్పత్రికి వచ్చిన అతడికి చక్రాల కుర్చీ కావాలని కోరగా.. సిబ్బంది రూ.150 లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. తమ వద్ద డబ్బులు లేవని మనీ ఇచ్చుకోలేమని చెప్పడంతో సిబ్బంది నిరాకరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పేషెంట్ ను పిల్లులు ఆడుకునే బొమ్మకారుపై డాక్టర్ వార్డుకు తీసుకెళ్లారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతిసారి చక్రాల కుర్చీ కోసం డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో.. గురువారం ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ రాజు తనతో పాటుగా చిన్నారులు ఆడుకునే బొమ్మకారు తీసుకురావడంతో సమస్యను స్పెషల్ ఫోకస్ చేశారు. Spoke to the superintendent of Gandhi hospital. Can you please send me the contact details of patient? https://t.co/jdpuHDWbfw — KTR (@KTRTRS) 17 March 2017 My office contacted the family & will ensure they are helped https://t.co/9P2D6vuP1y — KTR (@KTRTRS) 17 March 2017 -
హేరాం.. ఎంతటి దైన్యం
పేదల వైద్యానికి పెద్దపీట వేసామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు మాత్రం తెలియడం లేదు. ఇక్కడకు వైద్యం కోసం వచ్చేవారంతా నిరుపేదలే. కానీ సిబ్బంది మాత్రం ప్రతి పనికీ ‘ఖరీదు’ కడుతున్నారు. బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు. గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స చేయించుకున్న తర్వాత ప్రతివారం పాస్టిక్సర్జరీ ఓపీ సేవలు పొందాలని వైద్యులు సూచించారు. ఈ విభాగం మొదటి అంతస్తులో ఉంది. ఆస్పత్రిలో లిఫ్ట్ పనిచేయడం లేదు. గతంలో వచ్చినప్పుడు వీల్చైర్ కోసం సిబ్బందిని అడిగినా చేయి తడపందే ఇవ్వనన్నారు. దీంతో అతడు గురువారం ఉదయం ఆస్పత్రికి వచ్చేటప్పుడు ఇంట్లోని పిల్లల సైకిల్ను తెచ్చుకున్నాడు. భ్యార తోడుతో దానిపై వెళుతున్న పరిస్థితిని తోటి రోగులు చూసి అవాక్కయ్యారు. – గాంధీ ఆస్పత్రి -
ఇంజక్షన్లు వికటించాయా!
గాంధీలో ఇద్దరు రోగుల మృతి ⇒ ఇంజక్షన్ వికటించడం వల్లే చనిపోయారంటున్న బంధువులు ⇒ ఆస్పత్రి ప్రాంగణంలో ఆందోళన.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు ⇒ కార్డియాక్ అరెస్ట్ వల్లే వారు చనిపోయారని వైద్యుల వివరణ ⇒ ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తా..: సూపరింటెండెంట్ హైదరాబాద్: ఇంజక్షన్ వికటించడంతో ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న తమవారు చనిపోయారంటూ బుధవారం గాంధీ ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. అయితే, కార్డి యాక్ అరెస్ట్ వల్లే వారిద్దరూ చనిపోయి నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ లో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తు న్న వనపర్తికి చెందిన కోక నరేశ్(17) జనవరి 17న ప్రమాద వశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో బాధపడుతున్న అతనిని చికిత్స కోసం గాంధీలో చేర్చారు. అతని శరీరంలో 15 శాతం కాలిపోయినట్లు గుర్తించిన వైద్యులు.. ఆ మేరకు బర్నింగ్ వార్డులో చేర్చుకుని పలు దఫాలుగా చికిత్సలు అందించారు. నరేశ్ కోలుకోవడంతో నాలుగు రోజుల్లో అతనిని డిశ్చార్జి చేయాల్సి ఉంది. బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు నరేశ్కు ఇంజక్షన్ ఇవ్వగా.. ఆ తర్వాత అర గంటకే అతను చనిపోయాడు. ఇదిలా ఉంటే 60 శాతం కాలిన గాయాలతో బాధపడుతూ మూడు రోజుల నుంచి ఇదే వార్డులో చికిత్స పొందుతున్న కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన భారతి కూడా చనిపోయింది. నర్సింగ్ సిబ్బంది వచ్చి మూడు ఇంజక్షన్లు ఇచ్చారని, ఆయా ఇంజక్షన్లు వికటిం చడం వల్లే నరేశ్, భారతి మృతిచెందారని ఆరోపిస్తూ వారి బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఇన్చార్జి సూపరిం టెండెంట్ డాక్టర్ బీవీఎస్ మంజులను కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గాంధీ ఆస్పత్రిలో పురుగు అవశే షాలు ఉన్న సెలైన్ ఎక్కించడంతో ఇటీవల ఓ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందిన విషయం తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ వల్లే..: వైద్యులు గాంధీలో ఇద్దరు రోగుల మృతి ఘటనలో వైద్యపరమైన నిర్లక్ష్యం ఏమీ లేదని ఆస్పత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ మంజుల స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ షాక్ తగిలినవారికి గుండె సంబంధ సమస్యలు ఉత్పన్నమవు తాయని, దీన్నే వైద్య పరిభాషలో ఎరిథిమియా అంటారని, నరేశ్ కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం)తోనే మృతిచెందినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలిందని వివరించారు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్సపొందుతున్న భారతి యాస్ప్రేషన్ నిమోనియాతో మృతిచెం దిందని, కాలిన గాయాలు త్వరితగతిన మానేందుకు అవసరమైన యాంటీ బయోటిక్స్ అందించేందుకు పెంటా ప్రోజోల్, రాన్ట్యాక్ వంటి ఇంజక్షన్లు ఇస్తుంటామని, ప్రతిరోజు మాదిరిగానే బుధవారం కూడా ఇవే ఇంజక్షన్లు ఇచ్చారని చెప్పారు. ఒకవేళ ఇంజక్షన్లు వికటిస్తే వార్డులో చికిత్స పొందుతున్న మిగిలిన రోగులు కూడా మృతి చెందాలి కాదా? అని ప్రశ్నించారు. ఇంజక్షన్ వికటించిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ అంశంపై సమగ్ర విచారణ చేసి, ఒకవేళ వైద్యపరమైన నిర్లక్ష్యం, ఇంజక్షన్లలో లోపం ఉన్నట్లైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె ప్రకటించారు. -
జగన్ చొరవతో అధునాతన వైద్యం
కాలి గాయపడిన వ్యవసాయ కూలీకి ప్లాస్టిక్ సర్జరీ నంద్యాల: గ్యాస్ లీకేజ్తో గాయపడ్డ వ్యవసాయ కూలీ పెద్దకాశీంకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాలలోని మెడికేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బుడ్డా శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలోని వైద్యుల బృందం గురువారం ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. బండిఆత్మకూరు మండలం బి.కోడూరు గ్రామానికి చెందిన పెద్దకాశీం వ్యవసాయ కూలీ. గత జూలై 24న ఇంట్లో గ్యాస్ లీకై చేతులు, ముఖం, వీపునకు కాలిన గాయాలయ్యాయి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా పూర్తిగా కోలుకోలేదు. ఈనెల 9న రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బి.కోడూరు గ్రామంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయనను పెద్దకాశీం కలిసి అవేదనతో తన దుస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన జగన్ అక్కడే ఉన్న పార్టీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి సోదరుడు డాక్టర్ శ్రీకాంత్రెడ్డికి తగిన వైద్యం చేయించాలని సూచించారు. ఆ మేరకు కాశీంను నంద్యాలలోని మెడికేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు హైదరాబాద్లోని ప్రైమ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అనురాగ్, డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, అనెస్తీషియా స్పెషలిస్ట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి గురువారం రెండు గంటల పాటు శ్రమించి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. దీనికి రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని, జగన్మోహన్రెడ్డి సూచన మేరకు సర్జరీని ఉచితంగా చేసి మందులను కూడా అందజేశామని డాక్టర్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. -
‘ఉస్మానియా’లో అరుదైన చికిత్సలు
గన్ఫౌండ్రీ: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఒకేరోజు రెండు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఓమహిళ కుడిచేయి కండరం తీసుకొని ముక్కుకు అతికించారు. అంతేకాక ఓ బీటెక్ విద్యార్థిని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించి నూతన రూపం ఇచ్చారు. వివరాలు.. ► కరీంనగర్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన లింగమ్మ కూతురు రజిత(26)కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాదిపాటు సజావుగా సాగిన వారి కాపురంలో భర్త శ్రీనుకు అనుమానం రావడంతో ఆమెను పలుమార్లు విచక్షణారహితంగా కొట్టాడు. ఈ నేపథ్యంలో భార్యపై మరింత అనుమానం పెంచుకున్న శ్రీను ఆమె ముక్కును కోశాడు. దీంతో మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతున్న ఆమె వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియా ఆస్పత్రికి పంపించడంతో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు శనివారం రాత్రి ఆమెకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కుడిచేయి కండరం తీసుకొని ముక్కుకు అతికించి అరుదైన చికిత్సను నిర్వహించారు. ► మహబూబ్నగర్ జిల్లా, అచ్చంపేటకు చెందిన చెన్నయ్య కుమార్తె కనకదుర్గ బీటెక్ పూర్తిచేసింది. చిన్నతనం నుంచి ఆమెకు కుడివైపు ముఖంపై చిన్నమచ్చలతో క్రమక్రమంగా ముఖంగాపై గుంతలు ఏర్పడి అందవికారంగా మారింది. చికిత్సల కోసం ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించింది. ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆపరేషన్ నిర్వహించి ఆమెకు నూతన రూపం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోని బర్న్స్ వార్డ్లో చికిత్స పొందుతోంది. ఈ రెండు చికిత్సలలో హెచ్వోడీ డాక్టర్ నాగ ప్రసాద్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మధుసూదన్నాయక్, డాక్టర్ జైపాల్ రాథోడ్, రెహ్మాన్ ఖురేషీ, కృష్ణమూర్తి, గంగాభవానీ, జ్యోతి, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. -
19 మంది మానసిక వికలాంగుల ఊచకోత
జపాన్లో ఉన్మాది ఘాతుకం సగమిహర : జపాన్లో ఓ ఉన్మాది మానసిన వికలాంగులపై పైశాచిక దాడికి పాల్పడ్డాడు. తాను గతంలో పని చేసిన మానసిక రోగుల శరణాలయంలోకి చొరబడి 19 మంది మానసిక రోగులపై కత్తులతో దాడి చేసి హతమార్చాడు. మరో 25 మందిని తీవ్రంగా గాయపరిచాడు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. టోక్యోకు 50 కి.మీ. దూరంలోని సగమిహరలోని సుకూయ్ యామయూరిఎన్ శరణాలయంలో మంగళవారం తెల్లవారజామున ఈ దారుణం జరిగింది. కత్తులను తెచ్చుకున్న దుండగుడు మూసిఉన్న కిటికీని పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. రోగులపై కత్తులతో దాడి చేసి పలువురి గొంతులను కోశాడు. తర్వాత పోలీసుల వద్దకెళ్లి లొంగిపోయాడు. నిందితుణ్ని సతోషు ఉమత్సు(26)గా గుర్తించారు. దేశంలోని వికలాంగులందరినీ చంపేయాని అతడు జపాన్ పార్లమెంట్కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్లాస్టిక్ సర్జరీ కోసం తనకు రూ. 33 కోట్లు అందజేస్తే సాధారణ జీవితం గడుపుతానని అతను పేర్కొన్నట్టు తెలిసింది. -
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదట!
హండ్రెడ్ పర్సంట్ అందంగా ఎవరూ ఉండరు. ఏదో చిన్న లోపం అయినా ఉంటుంది. అలాంటి లోపాలను సరిచేయడానికి ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది. అనుష్కా శర్మ తన పెదాలకు అదే చేయించారనే టాక్ విస్తృతంగా ప్రచారమవుతోంది. ఆ మధ్య ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఆమె తన లిప్స్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పుకుంటున్నారు. తీరా అది వికటించడంతో ఆమె పెదాలు మునుపటికన్నా అందవిహీనంగా తయారయ్యాయని మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఈ వార్తలకు స్పందించని అనుష్క సడన్గా ఓ కార్యక్రమంలో ఈ ప్రశ్న అడిగేసరికి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ‘‘నా పెదవులకు కత్తెర పడాల్సిన పని లేదు. ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఓ స్పెషల్ టూల్ సాయంతో నా పెదవులకు మేకప్ వేశారంతే. అంతకు మించి ఎటువంటి సర్జరీ జరగలేదు. ఇలాంటి విషయాలు మళ్లీ నా దగ్గర ఎత్తకండి’’ అని కాస్త ఘాటుగానే స్పందించారు అనుష్క. అందాల తార ఇలా విరుచుకుపడటంతో అడిగినవాళ్లు సెలైంట్ అయిపోయారట. -
ప్లాస్టిక్ సర్జరీపై నోరు విప్పిన అనుష్క!
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్లాస్టిక్ సర్జరీ విషయంపై మరోసారి సీరియస్ అయింది. ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం తనకు లేదని, ఇక ఈ విషయంపై వదంతులకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలని అందరికీ వార్నింగ్ ఇచ్చింది. తాను అనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా బయటకు చెప్పే హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సుల్తాన్ మూవీ షూటింగ్ తో ఆమె బిజీబిజీగా ఉంటోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క కథానాయిక. అయితే 'బాంబే వెల్వేట్' మూవీ సమయంలో తలెత్తిన వివాదం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఫ్యాన్స్ కు నిజాన్ని చెప్పాలని భావించానని అందుకే ఈ విషయంపై మాట్లాడుతున్నట్లు పేర్కొంది. 'అందరిలాగే నేను మనిషినే. నాలో కొన్ని లోపాలుంటాయి. ఎప్పుడూ ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే నా పెదవులపై కత్తికి పని పెట్టించ లేదు' అంటూ వివరణ అనుష్క అంటోంది. బాంబే వెల్వేట్ మూవీ కోసం పెదవులకు సర్జరీ చేయించుకుని మరింత అందంగా తయారైందని కథనాలు వచ్చాయి. అయితే మొదట్లో తనకు మేకప్ గురించి అంతగా అవగాహన లేదని, ఆ తర్వాత తాను ఈ విషయంలో ఎంతో మెరుగయ్యానని చెప్పింది. ఆ మూవీ సమయంలో తాను వాడే మేకప్ కిట్ తో పాటు అందంగా కనిపించడం కోసం ఎన్నో కిటుకులు నేర్చుకున్నానని అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయంపై అంతగా స్పష్టతలేని వాళ్లు, అనవసరంగా లేనిపోని వార్తలు ప్రచారం చేశారని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. -
అందంపై మోజు మహిళ ప్రాణం తీసింది
మియామీ(ఫ్లోరిడా): ఆకర్షణీయంగా కనిపించాలని కేవలం కాస్మొటిక్ సర్జరీ కోసమే పశ్చిమ వర్జీనియా నుంచి మియామీ వచ్చిన ఓ మహిళకు అదే చివరి ప్రయాణమయ్యింది. బ్రెజీలియన్ బట్ లిఫ్ట్(పిరుదులు పెద్దగా కనిపించడానికి చేసే సర్జరీ)తో ఆకర్షణీయంగా కనిపించాలనుకుంది. వర్జీనియాకు చెందిన హీతర్(29) అనే మహిళ 'బట్ లిఫ్ట్' సర్జరీ ఫెయిల్ అవ్వడంతో హిలియాలో మృతి చెందింది. గుండెకు రక్త సరఫరా చేసే నాళాల్లో కొవ్వు అడ్డుపడటంతో(ఫ్యాట్ ఎంబోలిజమ్) ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు చెబుతున్నారు. బ్రెజీలియన్ బట్ లిఫ్ట్ పద్దతిలో ముందు లైపోసెక్షన్ ద్వారా ఉదరభాగం నుంచి కొవ్వును తీసి పిరుదుల స్థానంలో ఇంజక్ట్ చేస్తారు. సర్జరీ చేస్తున్న సమయంలో కొవ్వు పదార్థల మార్పిడిలో చోటుచేసుకున్నతప్పిదంతో ఆమె అవయవాలు పనిచేయకుండా పోయాయి. దీంతో వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. హీతర్కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
బార్బీ గాళ్.. బేబీ డాల్..
ఈ ఫొటో చూడగానే ఏం అనిపిస్తుంది? ఏముంది బార్బీ బొమ్మే కదా అనుకుంటారు ఎవరైనా.. అయితే పరీక్షగా చూడండి మీకే అర్థమవుతుంది. ఫొటోలో ఉన్నది బొమ్మ కాదు.. ఓ అమ్మాయి. అవును.. అచ్చు బార్బీ బొమ్మలా ఉన్న అమ్మాయి. బ్రెజిల్లోని బ్లూమెనౌ సిటీకి చెందిన ఆండ్రెసా దామియాని అనే ఈ అమ్మాయి బార్బీ లాంటి దేహంతో అక్కడ సెలబ్రిటీ అయిపోయింది. ఈ 23 ఏళ్ల బార్బీ సుందరి అలా కనిపించేందుకు ఒక్కసారి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదట. సన్నగా కనిపించేందుకు కనీసం డైటింగ్ కూడా చేయదట. అక్కడి కుర్రకారంతా తనను డిస్నీ క్యారెక్టర్ అయిన ‘ఎమ్మా’ అని పిలుచుకుంటారట. తన చూపులతో అక్కడి కుర్రకారు మనసును దోచేస్తుందని వేరే చెప్పాలా..! -
సర్జరీ చేయించుకోమన్నారు!
దీపికా పదుకోనే ఈ పేరు చెప్పగానే కళ్ళను కట్టిపడేసే అందాల తార గుర్తుకొస్తుంది. ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘గోలియోం కీ రాస్లీలా... రామ్లీలా’, ‘పీకూ’ లాంటి చిత్రాల్లో ఆమె అందం, అభినయం ఆహా అనిపించాయి. ఇవాళ భారతీయ సినీరంగంలో ఇంతమంది ఇంతగా మెచ్చుకుంటున్న ఈ దక్షిణాది అమ్మాయికి కూడా ఒకప్పుడు విమర్శలు తప్పలేదట. ఆశ్చర్యంగా ఉంది కదూ! సినిమాల్లో కెరీర్ ప్రారంభించక ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిందిగా దీపికా పదుకొనేకు కొందరు సలహా ఇచ్చారట. ఆ సంగతి స్వయంగా దీపికే ఇప్పుడు బయటపెట్టారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దీపిక మాట్లాడుతూ, కెరీర్లో తనకు వచ్చిన అతి చెత్త సలహా అదేనంటూ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కొందరు తనకు అలా సలహా ఇచ్చినా, ఎందుకనో ఆ మాట వినలేదంది ఈ అందాల తార. సర్జరీలు ఏమీ చేయించుకోకుండా సహజమైన అందంతోనే ఇప్పుడింతగా పేరు తెచ్చుకున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది. అప్పటి శ్రీదేవి దగ్గర నుంచి ఇవాళ్టి కొత్త తరం నటీమణుల దాకా చాలా మంది ప్లాస్టిక్ సర్జరీతో తమ అవయవ సౌష్టవాన్ని మెరుగుపరుచుకున్నారు. ఆ శ్రమ ఏమీ లేకుండానే దీపిక అందరినీ ఆకట్టుకోగలగడం అందానికే కాదు... అదృష్టానికి గీటురాయి కదూ! -
ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు పుట్టాక నా పొట్ట మీది చర్మం వదులైపోయి జారినట్లుగా ఉంది. లైపోసక్షన్ చేయించుకుంటే బాగుంటుందని నా ఫ్రెండ్స్ కొందరు చెప్పారు. నాకు తగిన సలహా ఇవ్వండి. - సుజాత (పేరు మార్చాం), విశాఖపట్నం వదులైన చర్మం బిగుతుగా అయ్యేందుకు కేవలం లైపోసక్షన్ ఒక్కటే సరిపోదు. మీరు లైపో- అబ్డామిన నోప్లాస్టీ అనే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. లైపోసక్షన్ ద్వారా ఎక్కువగా ఉన్న కొవ్వును తొలగిస్తారు. ఆ తర్వాత వదులుగా అయ్యే చర్మాన్ని బిగుతుగా అయ్యేలా చేయడమే ఈ సర్జరీ ఉపయోగం. దీని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. నా వయసు 28. ఇటీవల నేను గమనించిన విషయం ఏమిటంటే... నా రొమ్ముల సైజు ముందుకంటే చాలా తగ్గింది. నా రొమ్ముల సైజును ఇంతకు ముందులాగే పెంచడం సాధ్యమవుతుందా? ఇది సురక్షితమైనదేనా? - లత (పేరు మార్చాం), హైదరాబాద్ రొమ్ముల పరిమాణం తగ్గినప్పుడు కొందరు స్త్రీలు మానసికంగా కొంత వ్యాకులతకు గురవుతుంటారు. ఇటీవల ఈ సమస్యతో ప్లాస్టిక్ సర్జన్లను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతోంది. రొమ్ముల పరిమాణాన్ని పెంచుకోవడం అన్నది ప్లాస్టిక్ సర్జరీతో సాధ్యపడుతుంది. ఇలా పెంచుకునే ప్రక్రియను బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్ అంటారు. ఈ ప్రక్రియలో మృదువుగా ఉండే సిలికాన్ జెల్ను ఉపయోగించి వాస్తవమైనవి అనిపించేలా రొమ్ములను రూపొందించడం సాధ్యమే. ఇది సాధారణ అనస్థీషియా ఇచ్చి చేసే సర్జరీ. ఇది ముగిశాక కనీసం ఆరు గంటల పాటు ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉండాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇది సురక్షితమైన సర్జరీ. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. దీనితో వచ్చే ఫలితాలు శాశ్వతం. డాక్టర్ దీపు సీహెచ్ ప్లాస్టిక్ సర్జన్, ఒలివా కాస్మటిక్ సర్జరీ సెంటర్, హైదరాబాద్ -
టీనేజ్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఉంది!
లాస్ ఏంజిల్స్: టీనేజ్.. అదొక అందమైన ప్రాయం. టీనేజ్ అనుభవంలోకి వెళ్లాలని ప్రతి ఒక్కరూ ఆశించడం సహజంగానే జరుగుతూ ఉంటోంది. ప్రస్తుతం 26 ఏళ్ల హాలీవుడ్ నటి రూమర్ విలిస్ ఆ అనుభవంలోకి వెళ్లాలని తెగ ఆరాటపడిపోతోంది. దీనికి కారణం ఉందండోయ్. బ్రూస్ విలిస్, డేమీ మూర్ ల కుమార్తె అయిన రూమర్.. నటనాపరమైన తన కెరీర్ లో దూసుకుపోతోంది. అది తనకు విపరీతమైన క్రేజ్ తేవడం కాస్తా తలనొప్పిగా మారిందట. 'మనం వెలుగులోకి వచ్చాక చుట్టూ చోటు చేసుకునే పరిస్థితులను భరించడం నిజంగా చాలా కష్టం. అదే నేను టీనేజ్ లో ఉన్నప్పుడు అటువంటి ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్న నా శరీరాకృతి నాకు అనుకూలంగా ఉందని అనిపించడం లేదు. మా నాన్న, అమ్మ కూడా విస్తు గొలిపే అందంతో ఉంటారు. నాకు కూడా నిగారింపుతో కూడిన అందం కావాలని అనుకుంటున్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ కోరిక బలంగా ఉంది. ఈ క్రమంలోనే నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఉంది. అది నా వయసును టీనేజ్ లోకి తీసుకు వెళుతుందో లేదో అనేది మాత్రం కచ్చితంగా వేచి చూడాల్సిందే అంటోంది రూమర్ విలిస్. -
‘ప్లాస్టిక్’తో అందాలు
కోటేరు లాంటి ముక్కు... నవ్వితే దానిమ్మ గింజల్లా మెరిసిపోయే పలువరుస... సిగ్గుపడితే బుగ్గనసొట్ట... ఇలాంటి అందమైన ఆకృతి వద్దనుకునే అమ్మాయిలు ఏవరైనా ఉంటారా? కచ్చితంగా ఉండరు కాగా ఉండరు. పుట్టుకతోనే ఇంతటి సౌందర్య లక్షణాలు సంక్రమించకపోతే! అయితే అందంగా కనిపించే భాగ్యం మనకు లేదా? వీటన్నింటికి సమాధానమిస్తోంది ఆధునిక వైద్య విజ్ఞానం. ఔను ప్రస్తుతం ముఖారవిందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ ఒక్కటే మార్గం కావడంతో చాలా మంది ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. కొంత కాలం క్రితం వరకు కేవలం సెలబ్రిటీలకే పరిమితమైన ఈ సర్జరీ విధానం ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. మెట్రో యువతుల్లో రోజురోజుకూ ఈ ప్లాస్టిక్ సర్జరీపై క్రేజ్ పెరుగుతోంది. అమ్మాయిలే కాదండి... అబ్బాయిలు కూడా ఇలాంటి సర్జరీలపై మక్కువ చూపుతుండడం గమనార్హం. - సాక్షి, బెంగళూరు ముక్కుపై మక్కువ... ప్రస్తుతం బెంగళూరులాంటి మహానగరాల్లో ప్లాస్టిక్ సర్జరీల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. తమ ఆకృతిని మార్చుకునేం దుకు ప్లాస్టిక్ సర్జరీల వైపు చూస్తున్న యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీరిలో ఎక్కువ శాతం మంది వివాహానికి ముందు ఇలాంటి సర్జరీలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా రినోప్లాస్టీ (ముక్కుకు సర్జరీ) చేయించుకోవడంపై చాలా మంది శ్రద్ధ కనబరుస్తున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాస్త లావుగా ఉన్న ముక్కును చెక్కేసి స న్నగా కోటేరులా తీర్చిదిద్దుతున్నారు. ఇందు కోసం సర్జరీ చే యించుకునే వారి శరీరంలో ఏదో ఒక భాగం నుంచి కణజాలా న్ని సేకరిస్తారు. ఒక వేళ ఆ కణజాలం వారికి సరిపోకపోతే రక్తసంబంధీకుల నుంచి కణజాలాన్ని సేకరించి సర్జరీ చేసిన చోట ఆ కొత్త కణజాలాన్ని పరచి ఆకృతినే మార్చేస్తున్నారు. ‘ఒక మనిషి అందాన్ని నిర్ణయించడంలో ముక్కు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ముక్కు చక్కగా, నాజుకుగా ఉంటే మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది అమ్మాయిలు రినోప్లాస్టీపై మక్కువ చూపుతున్నారు. వివాహాలు నిశ్చయమైన అమ్మాయిలను వారి తల్లిదండ్రులే పిలుచుకొచ్చి ఈ తరహా సర్జరీలు చేయిస్తున్నారు.’ అని బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ మధు పేర్కొన్నారు. అబ్బాయిల్లోనూ క్రేజ్... ప్లాస్టిక్ సర్జరీల కోసం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎ గబడుతున్నారు. అమ్మాయిలు ఎక్కువగా ముక్కు, గడ్డం, పెదవులకు సర్జరీలు చేయించుకోవడానికి ఇష్టపడుతుంటే అబ్బాయిలు మాత్రం అబ్డామినో ప్లాస్టీ(పొట్టను తగ్గించుకోవడం)పై ఆసక్తి చూపుతున్నారు. దీనినే టమ్మీ టకింగ్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ముఖంపై ఉన్న మడతలు పోగొట్టుకోవడానికి కూడా నగరంలోని యువకులు ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీనే ఆశ్రయిస్తున్నారు. సర్జరీలలోని రకాన్ని బట్టి ఒక్కొ సర్జరీకి రూ. 25వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని సర్జన్లు చెబుతున్నారు. జాగ్రత్తలు కూడా అవసరం ‘ఇంతకు ముందు శరీరం కాలిగాయాలైతేనే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారు. అయితే ఇపుడు ముఖాకృతి కోసం, ముడతలు పోగొట్టుకోవడానికి మధ్యతరగతి వారు కూడా ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏదో ఒక భాగానికి సర్జరీ చే యించుకున్నంత మాత్రాన మొత్తం రూపమే మారిపోతుందనుకుంటే పొరపాటు. ఒక్కొసారి సరైన నైపుణ్యం లేని డాక్టర్ల వద్ద సర్జరీ చేయించుకుంటే రక్తం గడ్డకట్టడం, బ్లీడింగ్ అవడం జరుగుతుంటాయి. అందుకే సర్జరీ చేయించుకోవాలనుకున్నపుడు నిపుణులైన సర్జన్లను సంప్రదించి వారి కౌన్సిలింగ్ తీసుకోవాలి. వారి సలహాలను పాటిస్తూ సర్జరీ చేయించుకుంటే అందమైన ఆకృతిని సొంతం చేసుకోవచ్చు.’ - డాక్టర్ చేతన్, ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్, బెంగళూరు సొట్టబుగ్గలు, పలువరుసలు కూడా... అమ్మాయిలకు దానిమ్మ గింజల్లా కనిపించే అందమైన పలువరుస, సొట్ట బుగ్గలు ఊహించుకుంటే ఎంత బాగుందో కదా.. అందుకే ప్రస్తుతం అమ్మాయిలు వీటిపై క్రేజీగా ఉన్నారు. అదనంగా ఉన్న కణజాలాన్ని తీసేసి చీక్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా బుగ్గలపై సొట్టలను సృష్టిస్తున్నారు సర్జన్లు. అంతేకాదు ఇంతకు ముందు పన్ను మీద పన్నుంటే ఇష్టపడేవారు కాదు. అయితే ఇప్పుడదే ప్యాషన్ అయింది. పన్నుమీద పన్నును ఇంప్లాంట్ చేయించుకోవడానికి ఆస్పత్రులకు వెళ్లే యువతుల సంఖ్య పెరుగుతోంది. అంతేకారు పెదవుల ఆకృతి సరిగా లేని అమ్మాయిలు లిప్ ఎన్హ్యాన్స్మెంట్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సర్జరీలోనూ ఎన్నో రకాలు..... ప్లాస్టిక్ సర్జరీల్లో ప్రస్తుతం ఎక్కువగా బ్లెపారో ప్లాస్టీ( కనుబొమ్మలను తీర్చిదిద్దడం), ఓటో ప్లాస్టీ( చెవులు), చిన్ ఇంప్లాంట్(గడ్డం), చీక్ ఇంప్లాంట్ (చెంపలు), టమ్మీ టకింగ్లకు డిమాండ్ ఉంది. ఈ సర్జరీల్లో సైతం ఆటోగ్రాఫ్ట్స్, అల్లో గ్రాఫ్ట్స్, క్సెనోగ్రాఫ్ట్ అనే రకాలున్నాయి. ఆటోగ్రాఫ్ట్స్: సర్జరీ చేయించుకునే వ్యక్తి లేదా రక్తసంబంధీకుల కణజాలాలు సరిపోకపోతే ఓ కొత్తకణజాలాన్ని టెస్ట్ట్యూబ్లో సృష్టించి దానితో సర్జరీ పూర్తిచేస్తారు. అల్లోగ్రాఫ్ట్స్: ఒకే జాతికి చెందిన(ఆడవారికి సర్జరీ చేయాలంటే ఆడవారి నుంచి, మగవారికి సర్జరీ చేసేటపుడు మగవారి నుంచి కణజాలాన్ని తీసుకోవడం) వారి నుంచి తీసుకొని సర్జరీ చేయడం క్సెనోగ్రాఫ్ట్స్: మానవ శరీరం నుంచి కాకుండా వేరే జంతువుల కణజాలాన్ని సేకరించి సర్జరీ చేయడం -
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..!
నీలిచిత్రాల తార, హాలీవుడ్ మోడల్ ఫర్రా అబ్రహాం తన పెదాలకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో కష్టాలు వచ్చిపడ్డాయి. ‘అనుకున్నదొకటి... అయ్యిందొక్కటి’ అన్న చందంగా మారింది. వాస్తవానికి ఫర్రా అబ్రహాం పెదాలు బాగానే ఉంటాయి. కానీ, చిన్నపాటి మార్పు చేస్తే మరింత అందంగా తయారవుతాయని భావించారామె. దానికోసం శస్త్ర చికిత్స చేయించుకున్న ఫర్రాకు చేదు అనుభవమే ఎదురైంది. ఆపరేషన్ తర్వాత పెదాలు లావుగా మారి, అందవిహీనంగా తయారయ్యారు. టీన్ మామ్, 16 అండ్ ప్రెగ్నెంట్, కపుల్స్ థెరపీ టీవీ సిరీస్లతో బుల్లితెర తారగా గుర్తింపు పొందిన ఫర్రా ప్రస్తుతం ‘బోచడ్’ అనే టీవీ సిరీస్లో నటిస్తున్నారు. సహనటుడు పాల్నాసిఫ్ ఈమె పెదాల పరిస్థితి మునుపటిలా కావడానికి సాయం అందిస్తానని భరోసా ఇచ్చారట. దాంతో ఫర్రా కాస్తంత ఊరట చెందారని సమాచారం. -
'నా పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు'
లాస్ ఏంజిల్స్ : తాను మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత అందంగా కనబడుతున్నానని రియాల్టీ స్టార్ కెల్లీ జెన్నర్ స్పష్టం చేసింది. జెన్నర్ తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వల్లే మరింత నాజూకుగా కనబడుతుందన్న రూమర్లను ఆమె ఖండించింది. వచ్చే నెలలో ఓ మ్యాగ్ జైన్ కవర్ పేజీకి ఫోజిచ్చే భాగంలో పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే రూమర్లు వ్యాపించాయి. వాటిపై స్పందిస్తూ.. 'ప్రస్తుతం నాకు ఆ కోరిక లేదు. తన పెదాలు పెద్దవిగా కనిపిస్తున్నా మేకప్ తో నే కవర్ చేస్తున్నా. ప్లాస్టిక్ సర్జరీ ఆవశ్యకత అయితే ఇంకా రాలేదు' అంటూ ఈ 17 ఏళ్ల భామ మురిపెంగా రాగాలు తీస్తోంది. తన ముఖ కవలికల్లో చోటు చేసుకున్న ఆకస్మిక మార్పులే ఆ రూమర్లకు కారణమైన ఉండవచ్చన్న జెన్నర్.. తన ఆకారాన్ని కాపాడుకోవడంతో పాటు మేకప్ అనేది ఎలా వేసుకోవాలో బాగా తెలియడం వల్లే ఇంత అందంగా కనబడుతున్నానని తెలిపింది. -
నాకు అసలే ‘ముక్కు’ మీద కోపం!
‘‘మరోసారి నా ముక్కుమీద కామెంట్లు చేశారో జాగ్రత్త. నాకసలే ముక్కు మీదే ఉంటుంది కోపం’’ అంటూ చెన్నయ్లోని ఓ కార్యక్రమంలో అక్కడి మీడియా వారిపై సమంత అంతెత్తున లేచారు. ఇంతకీ సమంతకు అంత కోపం ఎందుకొచ్చిందా అనుకుంటున్నారా? వివరాల్లోకెళ్తే - ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో సమంత బాధ పడుతోందని మీడియాలో వార్తలు రావడం పరిపాటైపోయింది. అంతకు ముందు ఆమె చర్మవ్యాధితో బాధపడుతోందని మీడియాలో పలు కథనాలొచ్చాయి. అది మరువకముందే... సమంత ముక్కుకు గాయమైందనీ, దాంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని మరికొన్ని కథనాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఇప్పుడు కొత్తగా మరో వార్త ఆమెపై హల్చల్ చేయడం మొదలైంది. అదే... ‘ముక్కుకు సర్జరీ’. గతంలో జరిగిన ప్రమాదం వల్ల ఆమె ముక్కుకు ఓ సారి సర్జరీ జరిగిందనీ, అందుకే ముక్కు ఆకారంలో మార్పు వచ్చిందనీ, మళ్లీ పూర్వాకారంలోకి ముక్కును తీసుకురావడానికి మరో సర్జరీ అవసరం అనీ, అందుకే ప్లాస్టిక్ సర్జరీ నిమిత్తం సమంత లండన్ వెళ్తున్నారనీ మరో కథనం చెన్నయ్ మీడియాలో షికారు చేస్తోంది. ఇది ఇలా ఉంటే... చెన్నయ్లోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సమంతతో అక్కడి మీడియా ఈ విషయంపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘‘నా ముక్కు బ్రహ్మాండంగా ఉంది. పైగా నాది అందమైన ముక్కు. దానిపై కత్తి పెట్టించుకోవాల్సిన అవసరం ఏంటి నాకు? ఇలాంటి వార్తల్ని ఇప్పటికైనా ఆపితే మంచిది. నాకసలే ముక్కుమీదే ఉంటుంది కోపం’’ అంటూ చిరుబుర్రులాడారు. -
మైఖేల్జాక్సన్ , శ్రీదేవి లాంటి వారు కూడా...
అప్పియరెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ .. రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా! అందుకే మైఖేల్జాక్సన్ లాంటి పాప్స్టార్ మొదలు శ్రీదేవి లాంటి సినిమాస్టార్స్ దాకా అందరూ తమ రూపాలను చెక్కుకున్నవారే.. మేకప్తో కాదు ప్లాస్టిక్ సర్జరీతో అంటారు మరి! ఆ సర్జరీలకు డిమాండ్ ఏ రేంజ్లో పెరిగిందంటే.. స్టార్స్నుంచి సామాన్యులకు అందేంత! అలా పుట్టుకతో వచ్చిన రూపాన్ని నచ్చినట్టు మార్చుకోవడానికి ఇప్పుడు నో సర్జికల్ ట్రీట్మెంట్స్.. ఓన్లీ ఈస్థటిక్ ట్రీట్మెంట్సే! సిటీలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ జోరందుకుంది. చప్పిడి ముక్కును కోటేరు ముక్కులా మార్చడానికి మొన్నటిదాకా రైనోపాస్టీ అందుబాటులో ఉండేది. అదిప్పుడు నోజ్జాబ్, నోస్ కరెక్షన్గా మారింది. ముక్కుమీద చిన్నపాటి కత్తిగాటు లేకుండా కేవలం ఒకేఒక ఇంజక్షన్తో ముక్కును కోటేరులా చేస్తారు. దీన్ని ఫిల్లర్ట్రీట్మెంట్ అని పిలుస్తున్నారు. ఒక్క ముక్కేకాదు కనుబొమ్మల షేప్ నుంచి అధరాల ఆకారం దాకా దేన్నయినా చిటికెలో మార్చేస్తారు. నుదిటి మీది ముడతల నుంచి కంటి చివర రేఖల వరకు బిగుతుచేసి వడలిన వర్చస్సుకు మునుపటి మెరుపును తెస్తారు. సత్వర సౌందర్యాన్నిచ్చే ఆ చికిత్సల వివరాలివీ... కాంప్లెక్షన్ కోషర్ మేనిఛాయలోని హెచ్చుతగ్గులను సరిచేసే చికిత్స ఇది. చర్మంలో ఒక్కోచోట మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా చేరడంతో అక్కడ రంగు కాసింత నల్లగా మారుతుంది. మిగిలిన భాగంలో సాధారణ ఛాయ ఉంటుంది. ఇలాంటి వ్యత్యాసాలనే కాదు, మొటిమలు మిగిల్చిన మచ్చలు సహా ట్యాన్నూ ఈ చికిత్సతో మటుమాయం చేసేసుకోవచ్చు. అంతేకాదు ఈ ట్రీట్మెంట్తో రెండు మూడు వారాల్లోనే మేని ఛాయను దాదాపు నాలుగు రెట్లు మెరుగుపరచుకోవచ్చు. ఒక్కో సెషన్కు అరగంట సమయం వెచ్చిస్తే చాలు కోరుకున్న మేలిమిఛాయను సొంతంచేసుకోవచ్చు. దీనికోసం ఒక్కో సెషన్కి పదినుంచి పన్నెండువేల రూపాయలు ఖర్చు మీది కాదనుకోవాలి. యాంటీ-ఏజ్ మంత్ర 35 ఏళ్లు దాటాక వచ్చే ముఖంపై ముడుతలు, కళ్ల కింద క్యారీబ్యాగ్లను చిటికెలో తరిమికొట్టే చికిత్స ఇది. పట్టుమని పదిహేను నిమిషాల్లోనే ముఖంపై ముడుతలు మటుమాయమవుతాయి. పెళ్లిళ్ల సీజన్లో ఈ ట్రీట్మెంట్కి గిరాకీ ఎక్కువ. వధూవరుల తల్లిదండ్రులు సైతం ఇప్పుడీ చికిత్సలతో తమ ఏజ్ను లెస్చేసుకుంటున్నారు. ఇలా యంగ్లుక్స్తో బంధుమిత్రులకు షాక్ ఇవ్వాలంటే సెషన్కి 15 నుంచి 20వేల రూపాయలు మనవి కావనుకోవాలి. ఐ-బ్లింక్ మిరాకిల్ జారిపోయిన బుగ్గల్లో బిగి తేవచ్చు. నాసికను సంపెంగకు దీటుగా తీర్చిదిద్దుకోవచ్చు. పెదవులను ముఖాకృతికి అనుగుణంగా రూపొందించుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే... మీ ముఖంలోని లోపాలన్నింటినీ ఈ చికిత్సతో తొలగించుకుని, నిండు చందమామలా వెలిగిపోవచ్చు. ఈ కాంతికోసం ఎలాంటి మందులు, పథ్యాలు అవసరంలేదు. 20 నుంచి 70 ఏళ్ల వయసువాళ్లందరూ ఈ ట్రీట్మెంట్కి అర్హులు. 14 నుంచి 16 నెలల వరకు ఫలితం ఉంటుంది. ‘ఈ అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్, అల్ట్రా లిపో నాన్సర్జికల్ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్, లేజర్ హెయిర్ రిమూవల్, హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్, స్కిన్ రిజువనేషన్, కెమికల్ పీల్స్, మైక్రోడెర్మాబ్రేషన్, బోటాక్స్, ఫిల్లర్స్ వంటి చికిత్సలకు ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. పైగా షార్ట్టైమ్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్స్ పట్ల ఆడవాళ్లే కాదు మగవాళ్లూ ఆసక్తిచూపిస్తున్నారు. వండర్ ఏంటంటే మొన్న ఎన్నికలసీజన్లో పొలిటికల్ లీడర్స్ ఈ ట్రీట్మెంట్కోసం రావడం. పెళ్లిళ్ల సీజన్లో అయితే యూత్ ఎక్కువ మక్కువ చూపిస్తోంది. ఎలాంటి విశ్రాంతి అవసరం లేకుండానే ట్రీట్మెంట్ చేయించుకునే వీలుండటంతో ఈ నాన్ సర్జికల్ట్రీట్మెంట్స్ వైపు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల ‘యమలీల-2’ హీరోయిన్ డయా నికోలస్ మా క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఆమెలా బిజీ షెడ్యూల్ ఉన్నవాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలా యూజ్ఫులే కాదు కాన్ఫిడెన్స్నూ ఇస్తాయ’ని చెప్తున్నారు బ్లూ స్కిన్ అండ్ కాస్మొటాలజీ క్లినిక్ అధినేత డాక్టర్ నిలయిని. నో సైడ్ ఎఫెక్ట్స్ సర్జికల్ ట్రీట్మెంట్ కంటే ఇదే బెటర్. ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ట్రీట్మెంట్ తర్వాత రెస్ట్ తీసుకునే పని కూడా లేదు. పైగా ఈ పద్ధతితో మోర్ రిజల్ట్ పొందే అవకాశం కూడా ఉంది. - ప్రీతీరాణా, నటి -
యాసిడ్ బాధితులకు ప్లాస్టిక్ సర్జరీ
చెన్నై, సాక్షి ప్రతినిధి : మధురై జిల్లా తిరుమంగళంలో యాసిడ్ దాడి కి గురై తీవ్రంగా గాయపడిన మీనా (18), అంగాళ ఈశ్వరీ (19)కి ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణియన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. చిన్నపూలాంపట్టికి చెందిన ఉదయసూర్యన్ కుమార్తె మీనా, అదే ప్రాంతానికి చెందిన శంకరపాండియన్ కుమార్తె ఈశ్వరీ ప్రతిరోజు బస్సులో తిరుమంగళం చేరుకుని అక్కడి కామరాజర్ యూనివర్సిటీలో బీఏ (ఇంగ్లీషు) చదువుతున్నారు. ఎప్పటి వలెనే శుక్రవారం సైతం మధ్యాహ్నం కాలేజీ ముగించుకుని ఇంటికి వెళుతుండగా 35 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై అక్కడికి చేరుకుని మీనాపై యాసిడ్ పోశారు. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో ఈశ్వరి సైతం గాయపడింది. విద్యార్థినులపై యాసిడ్ పోసిన దుండగులు పరారయ్యూరు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడే కళ్లు తిరిగి పడిపోగా తోటి విద్యార్థులు వారిని మదురై ఆస్పత్రిలో చేర్పించారు. యాసిడ్ ప్రభావంతో మీనాకు 30 శాతం, పరమేశ్వరీకి 15 శాతం శరీరం కాలిపోరుుంది. స్వగ్రామంలో మంచి నడవడిక కలిగిన యువతులుగా వారికి పేరుండడంతో శనివారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్పత్రికి తరలివచ్చారు. బాధిత యువతుల బంధువుల రోదనలు వర్ణనాతీతంగా మారాయి. ఆస్పత్రి వార్డుల పక్కనే కూర్చుని గుండెలవిసేలా రోదించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మదురై జిల్లా ఎస్పీ విజయేంద్ర బిదారి ఆదేశాల మేరకు నిందితులను పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. విద్యార్థినుల స్వగ్రామానికి చేరుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి వరకు విచారణ సాగించారు. సొంత ఊరిలో వారికి ఎటువంటి సమస్యలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఇటీవల మీనా వెంటపడుతున్న యువకుడు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తిరుమంగళంలో పోలీసు బృందం శనివారం నాడు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించింది. వారిలో ఇద్దరు యువకులు పోలీసు ప్రశ్నలకు సంబంధంలేని సమాధానాలు ఇస్తున్నట్లు గుర్తించారు. వీరి ఫొటోలను బాధిత యువతులకు చూపగా వారు సైతం నిర్ధారించినట్లు తెలుస్తోంది. యాసిడ్ బాధితులను ఆస్పత్రిలో పరామర్శించిన జిల్లా కలెక్టర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, బాధిత యువతులకు 24 గంటల వైద్య పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగిందన్నారు. బాధిత యువతులు పూర్తిగా కోలుకునేందుకు అవసరమైతే ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తుందని హామీ ఇచ్చారు. -
సిటీకి కొత్తందం!
►400 నగరంలో నెలకు జరిగే ప్లాస్టిక్ సర్జరీలు ►60% ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొనేవారిలో అబ్బాయిల సంఖ్య ►500 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 40 ఏళ్ల పైబడ్డవారు ►3500 ఏడాదిలో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 30 ఏళ్లలోపు యువకుల సంఖ్య అందమనేది తాత్కాలికం కాకూడదు.. అది శాశ్వతంగా మనకే సొంతం కావాలి. ఇన్నాళ్లూ ఇలా ఉండిపోవచ్చు, కానీ ఇకపై మనల్ని చూస్తే కళ్లు తిప్పుకోకూడదు.. అందరి దృష్టినీ ఆకర్షించాలి. బ్యూటీపార్లర్లలో ఫేషియల్సూ, మేకప్ ఆర్టిస్టుల క్రియేటివిటీ తాత్కాలికం.. అందం మనవద్ద లేదనేది గతం. అలా ఉండకూడదనుకుంటే ఓ ప్లాస్టిక్ సర్జన్ను సంప్రదిద్దాం.. యవ్వనం మరింతకాలం పదిలంగా ఉండాలంటే వేరే మార్గం లేదు.. ఇదీ నగర యువత ఆలోచన. కళ్లూ, ముక్కూ, పొట్ట, హెయిర్స్టైలూ ఇవన్నీ సహజత్వంలో కాస్త బాగాలేకపోవచ్చు. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు కదా అంటున్నారు కొత్తతరం యువత. అందంగా ఉన్నామంటే దాన్నుంచి వచ్చే ఆత్మవిశ్వాసం కూడా బోల్డెంత ఉంటుందనేది ఆలోచన. చప్పిడిముక్కు, బాల్డ్హెడ్, నడుముల కింద టైర్లు, బట్టతల వంటి మాటలకు కొత్త అర్థాలు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదీల్లో అందంగా ఉండాలన్న స్పృహ బాగా పెరిగిందని, ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నవారిలో 80 శాతం మంది పెళ్లికి ముందు వస్తున్నవారేనని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా.వెంకటరమణ అంటున్నారు. ముప్ఫై ఏళ్ల వయసు లోపే.. ►ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీరాకృతిని మార్చుకోవాలని కోరుకుంటున్న వారిలో 80 శాతం మంది 30 ఏళ్ల లోపువారే. వారిలోనే ఎక్కువ మంది పెళ్లికి ముందు వస్తున్న వారే. ►ఆకృతిని మార్చుకునే వారిలో ముక్కు (రినోప్లాస్టీ), నడుముల కింద ముడతలు, లాసిక్ (కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు తగిలించుకోవడం), బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ ఎక్కువ. ►ఈ మధ్య కొవ్వులు తొలగించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ►శరీరాకృతి ముఖ్యంగా నడుముకింద ముడతలు తొలగించుకోవాలని అనుకుంటున్న వారిలో అబ్బాయిలు ఎక్కువ. ►ముక్కు సరిచేసుకునే వారిలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. దీన్నే షేప్ కరక్షన్ అంటారు. ►మొటిమలు పోయాక ఏర్పడ్డ మచ్చలు తొలగించుకున్న వారి సంఖ్య పెళ్లికి ముందు వస్తున్న వారిలో ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు లేకపోతే ఎలా ► సాధారణంగా ఏదైనా జబ్బుకు శస్త్రచికిత్స జరిగితే భవిష్యత్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్లుకూడా తీసుకోవాల్సి ఉంది. ► ఉదాహరణకు నడుముకింద ముడతలు తొలగించుకునేందుకు కొవ్వులు తీస్తాం. ఆ తర్వాత మళ్లీ రాకుండా చూసుకునేందుకు జీవనశైలి మార్చుకోవాలి. లేదంటే మళ్లీ కొవ్వులు ఏర్పడితే దానికి అర్థమేముంటుంది? ► నాణ్యమైన ఉపకరణాలు, శస్త్రచికిత్సల విధానాలు వచ్చాక చాలా వరకూ ఇలాంటి ►సర్జరీలు సక్సెస్ అవుతున్నాయి. అది కూడా డాక్టర్ని బట్టి ఉంటుంది. ►చాలామందిలో ఇలాంటివి చేయించుకున్నాక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ► శరీరాకృతిని కాపాడుకోవడానికి వ్యాయామం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ప్రెజెంటేషన్ : జి.రామచంద్రారెడ్డి -
ఒంటి మీద కత్తి పడనివ్వను!
హాలీవుడ్లో మల్టీ టాలెంటెడ్ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు జెన్నిఫర్ లోపెజ్. నటిగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, గాయనిగా, నృత్యకళాకారిణిగా... ఇలా పలు శాఖల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు జెన్నిఫర్. ఆమెకు ప్లస్ పాయింట్ శరీరాకృతే. ఇప్పుడు జెన్నిఫర్ వయసు 44. వంటి మీదకు వయసొస్తుంటే.. శరీరాకృతిలో కూడా మార్పు రావడం సహజం. ఆ మార్పుని ఆహ్వానించదల్చుకోవడంలేదని జెన్నిఫర్ అంటున్నారు. కుర్రదానిలా కనిపించడానికి ఏమైనా చేయడానికి వెనుకాడనంటున్నారు. ఆమె మాటలు విన్నవాళ్లు అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంటుందేమో అని చెప్పుకుంటుంటారు. ఈ మాటలకు జెన్నిఫర్ స్పందిస్తూ -‘‘అందమైన ఫిజిక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తే, అలాంటి ఫిజిక్కే అవసరం లేదనుకుంటా. ఎందుకంటే, నాకు సర్జరీ అంటే భయం. చక్కని శరీరాకృతి కోసం వంటి మీద కత్తి పడనివ్వను. కొంతమంది విషయంలో మంచి ఫలితం ఇచ్చినా, మరి కొంతమందికి మాత్రం వికటించింది. ప్లాస్టిక్ సర్జరీ కారణంగా తమ అందాన్ని కోల్పోయినవాళ్లున్నారు. అందుకే, ఆ సర్జరీకి నేను దూరం’’ అని చెప్పారు. -
కొత్తందం కొనేద్దాం
- ముచ్చటైన ముఖాల కోసం నేతల తాపత్రయం - ఎన్నికలకు ముందు ప్లాస్టిక్ సర్జన్లకు పెరిగిన గిరాకీ ఎన్నికల బరిలోకి దిగిన నేతలు ప్రత్యర్థులపై సంధించే ఆరోపణాస్త్రాలను, విమర్శనాస్త్రాలను మాత్రమే నమ్ముకోవడం లేదు. టీవీ చానళ్ల హడావుడి పెరగడంతో బుల్లితెరపై ఆకర్షణీయంగా కనిపించే లక్ష్యంతో ముచ్చటైన ముఖ కవళికల కోసం ‘శస్త్ర’మార్గాన్ని ఆశ్రయించేందుకు సైతం వారు వెనుకాడటం లేదు. ఇదివరకు ఎక్కువగా సినీతారలు తమ అందచందాల కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించేవారు. వారికి పోటీగా రాజకీయ నేతలు సైతం ప్లాస్టిక్ సర్జన్ల వద్ద క్యూ కడుతుండటంతో శస్త్ర వైద్యులకు కాసుల పంట పండుతోంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడేందుకు కొద్దినెలల ముందే పలువురు నేతలు ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయించి, తమ ముఖ కవళికలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ ఎన్నికల సీజన్కు ముందు నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయించిన వారిలో కుర్ర నేతలతో పాటు వయసు మళ్లిన నేతలూ ఉన్నారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఎన్నికలకు కొద్ది నెలల కిందట ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ఎంపీ ముంబై వెళ్లి, తన ముఖానికి మెరుగులు దిద్దించుకున్నారు. ప్రముఖ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ మోహన్ థామస్ వద్ద శస్త్రచికిత్స చేయించుకున్నారు. తన బండ ముక్కును, లావాటి మెడను సరిచేయించుకునేందుకు ఆ ఎంపీ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘దాదా మాదిరిగా కాదు, నేత మాదిరిగా కనిపించాలనుకుంటున్నాను’ అని ఆయన కోరుకున్నారని తెలిపారు. ముక్కును సరిచేసేందుకు రినోప్లాస్టీ, లావాటి మెడను సన్నగా తీర్చిదిద్దేందుకు లైపోసెక్షన్ చికిత్సలు చేసినట్లు వివరించారు. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళా నేత తన లావాటి నడుమును తగ్గించుకునేందుకు లైపోసెక్షన్ చికిత్స చేయించుకున్నారు. ముఖంపైన మచ్చలు, పులిపిర్లు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల పరిష్కారం కోసం డెర్మటాలజిస్టులను ఆశ్రయించే నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. దక్షిణ ముంబై, నాగపూర్, ముంబై పశ్చిమ శివారు ప్రాంతాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఎన్నికలకు ముందు తన వద్ద ఇలాంటి చికిత్సల కోసం వచ్చారని ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ రేఖా సేథ్ చెప్పారు. ఇలాంటి చికిత్సల కోసం వస్తున్న వారిలో మహిళా నేతల కంటే పురుష నేతల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు ఆమె తెలిపారు. కోపిష్టి ముఖాలతో కనిపించే నేతలను ఎవరూ చూడాలనుకోరని డాక్టర్ కల్పేశ్ అనే ప్లాస్టిక్ సర్జన్ వ్యాఖ్యానించారు. ముఖం జేవురించి, ఉబ్బిపోయి కోపిష్టుల్లా కనిపించే నేతలు, శస్త్రచికిత్సల ద్వారా తమ ముఖ కవళికలను సౌమ్యంగా మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల ఇలాంటి సమస్యలతో తన వద్దకు వచ్చిన ఇద్దరు ఎంపీలకు, ఒక స్థానిక మహిళా నేతలకు చికిత్స చేశానని తెలిపారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా వద్ద శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆస్పత్రులకు వెళితే, ప్రజలు, మీడియా తమను గుర్తిస్తే ఇబ్బందనే ఉద్దేశంతో వైద్యులనే ఇళ్ల వద్దకు రప్పించుకుంటున్న నేతలూ ఉంటున్నారని డాక్టర్ అప్రతిమ్ గోయల్ చెప్పారు. -
సాహసాలు చేయిస్తున్న సౌందర్యకాంక్ష
విపరీతం ‘అందం దేవుడిచ్చిన వరం’ అంటుంటారు. అసలు దేవుడు ఏది ఇచ్చినా, ఏదో ఒక రూపంలో అదొక వరంలానే మనిషి భావించాలి. అయితే సియోల్అమ్మాయిలు ‘అందం మాత్రమే అసలైన వరం’ అని భావిస్తున్నారు. తమకు నచ్చిన విధంగా తమ ముఖాలను మలుచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. మితి మీరిన సౌందర్యకాంక్షతో... ఒక విధంగా దుస్సాహసాలు చేస్తున్నారు! ప్రపంచంలో ఎక్కడా లేనంతగా దక్షిణ కొరియాలో ప్లాస్టిక్ సర్జరీపై మోజు పెరుగుతోంది! తక్కువ ధర, నాణ్యత, సులువుగా అయిపోవడం... అనే మూడు ప్రలోభాలతో మగువలు కోరుకున్న ముఖ వర్చస్సును ప్రసాదిస్తున్నాయి కొరియన్ సర్జరీ క్లినిక్కులు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రస్తుతం వీధికో ప్లాస్టిక్ సర్జరీ కేంద్రం ఉందంటే నమ్మి తీరాల్సిందే. ఒక సర్వే ప్రకారం 2009 నాటికే సియోల్లో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఏదో ఒకరకమైన ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తేలింది. అంతేకాదు, అక్కడ దాదాపు ప్రతి సెలబ్రిటీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నవారేనట. 2012 మిస్ కొరియా కూడా తాను కొద్దిపాటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెప్పుకోవడం విశేషం అని ఆ సర్వే పేర్కొంది. ఇక అక్కడి ప్రతి అమ్మాయీ లైట్ స్కిన్, సన్నటి నాజూకు ముక్కు, పెద్దపెద్ద కళ్లు, వి-షేప్లోని చిన్నటి గడ్డం కోసం ప్రయత్నిస్తోందనీ, వారి దేశానికి చెందిన అంతర్జాతీయ మోడల్ ‘కిమ్ తై హీ’ లా తమ ముఖాలను మలచుకోడానికి ఎక్కువ మంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. అమెరికాలో పది వేల డాలర్ల ఖర్చయ్యే ప్లాస్టిక్ సర్జరీ ఇక్కడ 2-3 వేల డాలర్లకే అందుబాటులో ఉండడం కూడా ఇందుకో కారణం అని సర్వే పేర్కొంది. సర్జరీపై ఒక రియాలిటీ షో! ఇదిలా ఉంటే, సియోల్లోని స్థానిక టీవీ ఛానెల్ ‘స్టోరీ ఆన్’లో ప్లాస్టిక్ సర్జరీ లపై ప్రస్తుతం ఒక రియాలిటీ షో నడుస్తోంది. అసలది రియాలిటీ షోలకే పరాకాష్టగా నిలుస్తోంది. నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ రియాలిటీ షోలో ముఖానికి అక్కడికక్కడే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఇది పూర్తిగా ఉచితం కూడా. కాకపోతే ఆ షోలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వారి అందానికి సంబంధించిన అన్ని హక్కులు ఆ ప్రోగ్రాం నిర్వాహకులకు ఉంటాయి. అంటే ఇక అప్పట్నుంచి వారి ప్రకటనలకు వీళ్ల ముఖార విందాలను వాడుకుంటారు. ఈ విషయాన్ని సర్జరీకి ముందే చెబుతారు. సర్జరీ మొత్తం షో వేదికపైనే జరుగుతుంది. సర్జరీ ముగిశాక... పాల్గొన్నవారి మునుపటి విజువల్స్ని, సర్జరీ అనంతర విజువల్స్ను చూపిస్తారు. అయితే ఈ రియాలిటీ షో భారీ క్రేజును సంపాదించడమే కాకుండా, పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఇటీవల ఈ షోలో ఒకేలా ఉన్న కవల పిల్లలకు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇద్దరిని వేర్వేరు రూపంలోకి తెచ్చారు. అది మోస్ట్ పాపులర్ ఎపిసోడ్ అట!! విపరిణామాలు దక్షిణ కొరియాలోని ఈ సర్జరీల ధోరణి అనారోగ్యకరమైన పోటీని పెంచుతోంది. తల్లిదండ్రులు ఇతర పిల్లల కంటే తమ పిల్లలు అందంగా ఉండాలని సర్జరీల మీద సర్జరీలు చేయిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లు ప్రతి వీధిలోనూ పెద్దపెద్ద హోర్డింగులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఈ పరిణామం చివరకు అప్పులకు, తద్వారా సామాన్యుల ఆర్థిక కష్టాలకు దారితీస్తోంది. దీంతో ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ఈ హోర్డింగులు పెట్టడాన్ని ఇటీవల నిషేధించింది. కాగా 2013 లో మిస్ కొరియా పోటీలకు వచ్చిన వారిలో ఎక్కువమంది మొహాలు ఒకేవిధంగా ఉన్నట్టు అనిపించడంతో వారిలో చాలామంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారేమో అనే అనుమానాలు తలెత్తాయి. వైద్యం కోసం కనిపెట్టిన కొన్ని ప్లాస్టిక్ సర్జరీలను అందం కోసం ఇలా వాడేస్తున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. అందులో ఒకటి డబుల్ జా సర్జరీ. ఈ సర్జరీల కారణంగా కొందరు శాశ్వతంగా నంబ్నెస్ (స్పర్శ మొద్దుబారడం)కు గురవుతున్నా, ‘చూడటానికి బాగుంటే చాలు’ అనే స్థాయికి వెళ్లిపోతున్నారు. ఏదైనా ఇది మంచి ధోరణి కాదనీ, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం భవిష్యత్తులో పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొరియన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
టీవీక్షణం: ప్లాస్టిక్ సర్జరీలు ఆపండి!
సీరియల్ మాంచి రసవత్తరంగా సాగిపోతూ ఉంటుంది. ఓ రోజు సడెన్గా... ‘నేటి నుంచి ఫలానా పాత్రలో ఆ నటికి బదులు ఈ నటి కనిపిస్తారు’ అంటూ ఇద్దరి ఫొటోలూ తెరమీద ప్రత్యక్షమౌతాయి. నిర్వాహకులు దాన్ని చాలా సింపుల్గా చెప్పేస్తారు. కానీ ప్రేక్షకులు దాన్ని అంత ఈజీగా అంగీకరించలేరన్నది మాత్రం వాస్తవం! ‘మొగలిరేకులు’లో లిఖిత స్థానంలో కరుణ రావడం ప్రేక్షకులకు పెద్ద షాక్. అంతకుముందు సెల్వస్వామి పాత్రలోకి సెల్వరాజ్ బదులు రవివర్మ, కీర్తన పాత్రలో మేధకు బదులు మరో నటి వచ్చారు. అలాగే ‘అనుబంధాలు’ మీనాతో మొదలైతే, ఇప్పుడు సుహాసిని ఉంది. గతంలో ‘చక్రవాకం’ నుంచి ఇంద్రనీల్ తప్పుకుంటే జాకీ వచ్చాడు. ‘స్రవంతి’గా మీనా కొన్నాళ్లు మెప్పించాక లక్ష్మి వచ్చింది. కళ్యాణి ‘ఆటోభారతి’నంటూ వస్తే, తర్వాత మోనిక స్టీరింగ్ చేతబట్టింది. ఎందుకిలా మారిపోతున్నారు? తెలీదు. ఏం జరిగిందో అర్థం కాదు. అంతవరకూ ఒకరిని చూసి, ఆ రోల్లో ఇంకొకరిని చూడ్డం ఇష్టం ఉండకపోవచ్చు. కానీ చూడాలి అంతే. ‘‘కొందరు పాత్రలో ఒదిగిపోతారు. వాళ్లను చాలా ఇష్టపడతాం. సడెన్గా మరొకరిని తెచ్చిపెడితే సొంతవాళ్లు దూరమైనంత బాధ కలుగుతుంది’’ అని ఓ ప్రేక్షకురాలు అన్నారంటే... నటీనటుల మార్పు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చదని అర్థమవుతోంది. నిజానికిది కొత్తగా వచ్చిందేం కాదు. ‘పవిత్రబంధం’లో గాయత్రి హీరోయిన్. ఆమెకు డెలివరీ టైమ్ కావడంతో చేయలేనంది. ఏం చేయాలో అర్థం కాని దర్శకుడు హీరోయిన్కి యాక్సిడెంట్ చేయించి, ముఖం గాయపడినట్టు చూపించి, ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టుగా కవరింగ్ ఇచ్చి, గాయత్రి ప్లేస్లో యమునని ప్రవేశపెట్టాడు. అప్పట్నుంచి ఎవరినైనా మార్చాల్సి వస్తే, ప్రమాదంలో పడేసి ప్లాస్టిక్ సర్జరీలు చేయడం మొదలుపెట్టారు. రానురాను అది కూడా మానేశారు. ఇవాళ్టినుంచి ఈ పాత్రలో ఫలానా నటిని చూడమంటూ చెప్పేస్తున్నారు. ఇక హిందీ సీరియల్స్ అయితే మరీ ఘోరం. నటీనటులను ఇష్టం వచ్చినట్టు మార్చడంలో ‘బాలికావధు’దే మొదటిస్థానం. హీరోయిన్ ప్రత్యూష స్థానంలో తోరల్ రాస్పుత్ర, ‘గంగ’ పాత్రలో శ్రుతి ఝాకి బదులు సర్గుణ్, ‘సుగుణ’గా విభాఆనంద్ బదులు జాన్వీ చెద్దా... ఇలా మారిపోతూనే ఉంటారు. ‘ససురాల్ సిమర్కా’లో ‘ప్రేమ్’ పాత్రకు షోయబ్ ఇబ్రహీమ్కి బదులు ధీరజ్, ‘సాత్ నిభానా సాథియా’లో జియా మానెక్కి బదులు దేవొలీనా... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతే ఉండదు. యాక్టర్స్ని మార్చడానికి మా కారణాలు మాకున్నాయి అంటారు దర్శక నిర్మాతలు. వాళ్లు మారిస్తే మేమేం చేస్తాం అంటారు చానెల్ నిర్వాహకులు. మనం మాత్రం ఏం చేయగలం? ఇష్టం లేకున్నా చూసేయడం తప్ప! -
అందాల క్రేజ్
=నగరంలో ప్లాస్టిక్ సర్జరీలపై పెరుగుతున్న మోజు =సొట్టబుగ్గలు, నడుము, చాతీ చికిత్సలపై అమ్మాయిల ఆసక్తి =ముక్కు, బట్టతల, పొట్టను సరిచేసుకుంటున్న అబ్బాయిలు సాక్షి, సిటీబ్యూరో : అందాలను సమకూర్చుకోవడం... ఆకర్షణను ద్విగుణీకృతం చేసుకోవడం అమ్మాయిల్లో మామూలే. ఇప్పుడా జాబితాలో సొగసుల సోగ్గాళ్లూ చేరిపోతున్నారు. ‘అందం అమ్మాయిల సొత్తేనా? మాకూ కావాలి’ అంటూ కత్తిగాట్లకు సిద్ధమవుతున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థటిక్ ప్లాస్టిక్ సర్జరీ సర్వే ప్రకారం గతేడాది ప్లాస్టిక్ సర్జరీల్లో మన దేశానిది నాలుగో స్థానం. అందాలకు మెరుగులు దిద్దుకోవాలని కిందటేడాది భారత్లో శస్త్రచికిత్సలకు క్యూ కట్టిన వారి సంఖ్య 8,94,700 మంది. వీరిలో 20-25 శాతం మంది మన హైదరాబాదీయులే ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ ప్లాస్టిక్ సర్జరీల కల్చర్ తాజాగా మధ్యతరగతి వారినీ విశేషంగా ఆకర్షిస్తోంది. ఎదుటి వారిని ఆకర్షించడంలో కళ్లు, ముక్కు, పెదాలు, సొట్ట బుగ్గలు, చాతీ, నడుము కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా హేళన తప్పదు. అనుభవించేందుకు కావలసినంత ఐశ్యర్యమున్నా... చూసేందుకు కంటికి ఇంపుగా కన్పించకపోతే ఏదో తెలియని వెలితి వెంటాడుతూనే ఉంటుంది. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిచయం ఉన్న ఈ ప్లాస్టిక్ సర్జరీలు నేడు సామాన్యులను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎదుటి వారి దృష్టిని ఇట్టే ఆకర్షించేందుకు ప్లాస్టిక్ సర్జరీలతో తమ ఆకృతిని మార్చుకుని సరికొత్త రూపాన్ని సంతరించుకుంటున్న యువతీ, యువకుల సంఖ్య నగరంలో రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ఫలిత ంగా సిటీలో ప్లాస్టిక్ సర్జరీలు చేసే ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాము అందంగా తీర్చిదిద్దుతామంటే...తామే అందంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మగవాళ్లు మ్యాన్బూబ్స్, బట్టతలను సరి చేసుకుంటుంటే, ఆడవారు ముక్కు, బుగ్గలు, ముఖంపై ముడుతల్ని సరిచేయించుకుంటున్నారు. కోటేరు లాంటి ముక్కు కోసం... ముఖం అందాన్ని నిర్ణయించేది ముక్కు. ముక్కు ఎంత కొంచెంగా ఉంటే అంత అందంగా కన్పిస్తుంటారు. అయితే చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ముందు అందంగా కన్పించేందుకు రైనోప్లాస్టీ సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ సర్జరీ చేయించుకుంటున్న వారిలో 70 శాతం అమ్మాయిలు ఉంటే, 30 శాతం అబ్బాయిలు ఉన్నారు. ఇందుకోసం సర్జరీ చేయించుకునే వ్యక్తి శరీరంలోని ఏదో ఒక భాగం నుంచి కణజాలాన్ని సేకరిస్తారు. ఒకవేళ ఆ కణజాలం వారికి సరిపోకపోతే రక్త సంబంధీకుల నుంచి సేకరించి అమర్చుతున్నట్లు కేర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ ఈఎన్టీ, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ విష్ణుస్వరూప్రెడ్డి చెప్పారు. ఇలా నగరంలో నెలకు 10-15 సర్జరీలు జరుగుతున్నట్లు సమాచారం. నాజుకైన నడుము కోసం.. శరీరంలో ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం ఎక్కువ ఉంటే ఁఅధిక బరువుగారూ.భావిస్తారు. ఇది ఒక జబ్బు కాకపోవచ్చు కానీ, అనేక ఇతర జబ్బులకు కారణం అవుతోంది. మధ్యతరగతి మగవాళ్లలో మూడో వంతు, ఆడవాళ్లలో సగానికిపైగా అధిక బరువుతో బాధపడుతున్నట్లు ఓ అంచనా. ఓ సర్వే ప్రకారం 2005లో నగరంలో ఈ సంఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం ఇది 10 శాతానికి చేరుకుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ‘లైపోసక్షన్, బెరియాట్రిక్’ పద్ధతుల్లో తొలగిస్తారు. సినీ తారలు ఎక్కువగా లైపోసక్షన్ను ఆశ్రయిస్తుంటే... ల్యా ప్రోస్కోపిక్ సహాయంతో చేసే బెరియాట్రిక్ సర్జరీలను మధ్యతరగతి వాళ్లు ఆశ్రయిస్తున్నట్లు లివ్లైఫ్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ బె రియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ చెప్పారు. ఇలా నగరంలో ప్రతి నెలా 70-80 బెరియాట్రిక్ సర్జరీలు జరుగుతున్నట్లు సమాచారం. మచ్చుకు కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు... రైనోప్లాస్టీ: అందమైన నాసిక కావాలనుకునే వారి చాయిస్. చప్పిడి ముక్కు, వంకరలు తిరిగిన ముక్కును సరి చేయవచ్చు బొటాక్స్: ముఖంపై ముడుతలు పోవడానికి చక్కని పరిష్కారం. 30 దాటిన వారు బొటాక్స్ కోసం పరుగులు తీస్తున్నారు లైపోసక్షన్: పొట్ట, నడుము భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించేందుకు వాడే శస్త్రచికిత్స డింపుల్స్ క్రియోషన్స్ సర్జరీ: నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టపడేలా చేస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్: బట్టతలపై వెంట్రుకలను మొలిపిస్తారు. చీక్ అగ్మంటేషన్: ఆకట్టుకునే ముఖాకృతి కోసం చేసే సర్జరీ గైనకో మాస్టియా: అమ్మాయిల్లా పెరిగిపోయిన మ్యాన్బూబ్స్ తొలగించే శస్త్రచికిత్స టమ్మీటక్: పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. సిక్స్ప్యాక్లకు దారి చూపుతుంది బ్లైఫరోప్లాస్టీ : నాజుకైన కంటిరెప్పల కేరాఫ్ అడ్రస్ ఇది విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు ప్లాస్టిక్ సర్జరీతో తక్కువ ఖర్చుతో లోపాలను సరిచేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని యువత సైతం ఇటీవల ఇక్కడికే వస్తున్నారు. నిపుణులు అందుబాటులో ఉండటం, సర్జరీల ఖర్చు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్న వారిలో 70 శాతం మంది అమ్మాయిలుంటే, 30 శాతం మంది అబ్బాయిలున్నారు. వీరిలో 80 శాతం పెళ్లికి ముందే చేయించుకుంటున్నారు. - డాక్టర్ విష్ణుస్వరూప్రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్ 30 ఏళ్లలోపు వారే ఎక్కువ అందం బాహ్య సౌందర్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది. ఆధునిక తరం ఈ విషయాన్ని తొందరగా గ్రహించింది. ప్రతి ఒక్కరూ అందాలను మెరుగు దిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తీరైన శరీరాకృతి కోసం సర్జరీలు చేయించుకుంటున్న వారిలో 90 శాతం మంది 30 ఏళ్లలోపు వారే. - డాక్టర్ నందకిషోర్, లివ్లైఫ్ హాస్పిటల్