ప్రభుత్వాన్నిఇబ్బంది పెట్టే కుట్రలు | No leniency for violators of law and order says CM Revanth | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్నిఇబ్బంది పెట్టే కుట్రలు

Published Sat, Sep 14 2024 4:27 AM | Last Updated on Sat, Sep 14 2024 4:27 AM

No leniency for violators of law and order says CM Revanth

శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండండి 

డీజీపీని ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు.

 తెలంగాణ, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్‌ని ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement