Advertisement
jitender
-
మర్యాదతో మన్నన పొందండి
సాక్షి, హైదరాబాద్: పోలీస్స్టేషన్లలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తని ఖీల చేయాలని, తాను సైతం త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు చేపడతానని వెల్ల డించారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిష నర్లతో డీజీపీ జితేందర్ పోలీస్ కేంద్ర కార్యా లయంలో సమావేశమయ్యారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రంలోని అన్నియూనిట్ల ఉన్నతాధికారు లతో నిర్వ హించిన ఈ సమీక్షలో జితేందర్ పలు కీలక సూచనలు ఇచ్చారు. ప్రజావాణి దరఖాస్తుల్లోని ప్రజాసమస్యల పరిష్కారా నికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవ సరాన్ని నొక్కిచెప్పిన డీజీపీ, అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించా లని ప్రతిపాదించారు. ఆయుధాల లైసెన్స్ల జారీపై జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు. సమావేశంలో శాంతి భద్రతల అడిషన ల్ డీజీ మహేశ్భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీజీలు శిఖా గోయెల్, అభిలాష బిస్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్బాబుతో పాటు జోనల్ ఐజీలు, జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు. -
అనూహ్యంగా తెరపైకి జితేందర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి రాష్ట్ర డీజీపీ మార్పుపై కసరత్తులు జరుగుతున్నాయి. తెరపైకి కొందరు సీనియర్ అధికారుల పేర్లు వచ్చినా అవకాశం మాత్రం అనూహ్యంగా డాక్టర్ జితేందర్కు దక్కింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిలో డీజీపీగా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ గతేడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే నాటి పీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డిని ఇంటికి వెళ్లి కలిసి అభినందించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అంజనీకుమార్ను సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో రవి గుప్తాను నియమిస్తూ మరసటి రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీలో కీలకంగా మారిన ఆనంద్... రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి దఫదఫాలుగా పోలీసు బదిలీలు జరిగినా రవి గుప్తాను మాత్రం కొనసాగించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో కొత్త అధికారిని డీజీపీగా నియమించడానికి కసరత్తులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రానికి సంబంధించి డీజీపీ హోదాలో ఉన్న అధికారుల సీనియారిటీ జాబితాలో తొలి పేరు 1990 బ్యాచ్కు చెందిన రవి గుప్తాదే. ఈ తర్వాతి స్థానంలో 1991 బ్యాచ్కు చెందిన రాజీవ్రతన్ ఉండగా... ఇటీవల ఆయన కన్ను మూయడంతో అదే బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ ఆ స్థానంలోకి వచ్చారు. ఈ పరిణామంతో 1992 బ్యాచ్కు చెందిన జితేందర్ సీనియారిటీ జాబితాలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చారు. రవి గుప్తా తర్వాత సీనియర్ అయిన సీవీ ఆనంద్ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న గొర్రెల స్కామ్ సహా అనేక కేసులు కీలక దశలో ఉన్నాయి. ఈ విభాగానికి డైరెక్టర్గా పని చేసిన ఏఆర్ శ్రీనివాస్ సైతం గత నెల ఆఖరున పదవీ విరమణ చేశారు. దీంతో ఏసీబీలో ఆనంద్ కీలకం కావడంతో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. ఆయనకు ఈసారి డీజీపీగా అవకాశం దక్కలేదు. ఇక అనుభవం, సమర్థతతో పాటు వివాదరహితుడు, మృదుస్వభావి కావడంతోనే జితేందర్ను డీజీపీ పోస్టు వరించింది. పదోన్నతులు పూర్తి కాకపోవడంతోనే... ప్రస్తుతం నిఘా విభాగాధిపతిగా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన బి.శివధర్రెడ్డి పేరు కూడా డీజీపీ రేసులో వినిపించిది. అయితే ఆయన ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్నారు. డీజీపీ హోదాలో ఉన్న రాజీవ్రతన్ కన్ను మూయడం, సందీప్ శాండిల్య పదవీ విరమణ చేయడం రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అదనపు డీజీల సీనియారిటీ జాబితాలో ముందున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డితో (హైదరాబాద్ పోలీసు కమిషనర్) పాటు శివధర్రెడ్డికీ డీజీలుగా పదోన్నతి రావాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో లైన్ క్లియర్ కాలేదు.పూర్తి స్థాయి డీజీపీని నియమించాలంటే... రాజకీయ కారణాల నేపథ్యంలో కొన్నేళ్లుగా రాష్ట్ర పోలీసు విభాగానికి ఇన్చార్జ్ లేదా ఫుల్ అడిíÙనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) డీజీపీలే నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డీజీపీగా నియమించాలంటే సీరియారిటీ ఆధారంగా ఐదుగురు ఐపీఎస్ అధికారుల జాబితాను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. సీనియారిటీ, గతంలో పని చేసిన స్థానాలు, అనుభవం, సెంట్రల్ డెప్యుటేషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే కేంద్రం వీటిలో మూడు పేర్లను వెనక్కు పంపుతుంది. ఆ ముగ్గురి నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకోవాల్సి ఉంటుంది. శ్రీనివాసరెడ్డి, శివధర్రెడ్డి పదోన్నతుల తర్వాత కేంద్రానికి సీనియారిటీ జాబితా పంపితే అందులో వీరితో పాటు రవి గుప్త, సీవీ ఆనంద్, జితేందర్ల పేర్లు ఉంటాయి. వీటిలో ఏ మూడు పేర్లు వెనక్కు వస్తాయి? వారిలో ఎవరిని డీజీపీగా నియమిస్తారు? లేదా గతంలో మాదిరిగా జితేందర్ పదవీ విరమణ చేసే వరకు, ఆ తర్వాత కూడా ఎఫ్ఏసీ డీజీపీతోనే నడిపిస్తారా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. -
Telangana: తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ జితేందర్ నియామకం
-
తెలంగాణకు కొత్త బాస్
-
ఎన్ఎస్యూఐ విద్యార్థులతో రాహుల్ ములాఖత్కు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: చంచల్గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలను కలిసేందుకు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి అనుమతివ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, జైళ్ల శాఖ డీజీ జితేందర్ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కాంగ్రెస్ నేతల బృందంతో జితేందర్ను కలసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ములాఖత్పై విజ్ఞప్తిని పరిశీలించి తమ నిర్ణయం వెల్లడిస్తామని డీజీ తెలిపినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అధికార పార్టీ ఒత్తిడి తీసుకువస్తోందని, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చంచల్గూడ జైల్లో ఉన్న విద్యార్థి నేతలను కలిసేందుకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన విషయంలో కూడా టీఆర్ఎస్ కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. కనీసం శనివారం విద్యార్థి నేతలను జైల్లో పరామర్శించాలన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తాము ఇప్పటికే జైలు సూపరింటెండెంట్కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని, అ యితే ఉన్నతాధికారులను కలసి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించడంతో డీజీ జితేందర్ను కలసినట్టు వెల్లడించారు. జైళ్ల శాఖ డీజీని కలసిన వారిలో కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, జగ్గారెడ్డి, గీతారెడ్డి, సంపత్, మానవతారాయ్ ఉన్నారు. ఎంత అడ్డుకుంటే అంత ప్రతిఘటిస్తాం.. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ను అడ్డుకునేందుకు చూస్తోందని, కానీ ఎంత అడ్డుకుంటే అంతకన్నా ఎక్కువ బలంగా ఎదుర్కొంటామని రేవంత్రెడ్డి అన్నారు. గురువారం ఓయూ జేఏసీ అధ్యక్షుడు విజయ్కుమార్తో పాటు మరో ఏడుగురు ప్రగతిభవన్ ముట్టడికి రాగా వారిని పంజగుట్ట పోలీస్స్టేషన్కు తరలించారు. వారిని పరామర్శిం చేందుకు రేవంత్రెడ్డి తదితరులు ఠాణాకు వచ్చారు. వైట్ చాలెంజ్కు రాహుల్ సిద్ధమా? రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ ‘వైట్ చాలెంజ్’కు సిద్ధమా అంటూ హైదరాబాద్లోని గన్పార్క్, ట్యాంక్బండ్ సహా పలు చోట్ల ఫ్లెక్సీ లు, పోస్టర్లు వెలిశాయి. రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్ బయటపడ్డ సమయంలో మంత్రి కేటీఆర్కు రేవంత్రెడ్డి ‘వైట్ చాలెంజ్’విసిరిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల నేపాల్లోని ఓ క్లబ్లో రాహుల్గాంధీ కనిపించడంతో.. ఆయన ఫొటోలతో ‘వైట్ చాలెంజ్’కు సిద్ధమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన పలువురు టీఆర్ఎస్ నేతలు ‘వైట్ చాలెంజ్కు సిద్ధమా?’అంటూ రాహుల్ను ప్రశ్నిస్తున్నారు. -
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్?
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలకు త్వరలో మోక్షం కలగనుంది. అదనపు డీజీపీల నుంచి ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు భారీ స్థాయిలో బదిలీలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కీలక విభాగాలు మొదలుకొని 80 శాతం జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లలో ఉన్న డీసీపీలను బదిలీ చేసేందుకు ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది. తెలంగాణ పోలీస్ శాఖకు ఆయువుపట్టు లాంటి హైదరాబాద్ కమిషనరేట్కూ కొత్త బాస్ను నియమించేందుకు కసరత్తు జరిగినట్టు తెలిసింది. అంజనీకుమార్ స్థానంలో ఇటీవల కేంద్ర డిప్యుటేషన్ పూర్తిచేసుకున్న అదనపు డీజీపీ సీవీ ఆనంద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అదేవిధంగా మరో అదనపు డీజీపీ జితేందర్ పేరూ ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే రాచ కొండ కమిషనరేట్కూ కొత్త చీఫ్ని నియమించనున్నారు. మహేష్ భగవత్ స్థానంలో ఐజీ నాగిరెడ్డి లేదా ఐజీ డీఎస్ చౌహాన్ ఉండనున్నట్టు సమాచారం. దర్యాప్తు విభాగాలకు కొత్త బాస్లు రాష్ట్రంలో ఉన్న రెండు దర్యాప్తు విభాగాలకు నూతన బాస్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు డైరెక్టర్ జనరల్గా అదనపు డీజీపీ జితేందర్ లేదా అంజనీకుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చీఫ్గా మహేష్ భగవత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజిలెన్స్తోపాటు అవినీతి నియంత్రణనూ ఒకే విభాగం కిందకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నందున రెండింటికీ కలిపి ఒకే డీజీని నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఐడీ చీఫ్గా ఉన్న గోవింద్సింగ్ను జైళ్ల శాఖకు డైరెక్టర్ జనరల్గా నియమించే అవకాశం ఉంది. లాంగ్ స్టాండింగ్కు స్థాన చలనం చాలాకాలంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్రెడ్డితోపాటు సిబ్బంది విభాగం అదనపు డీజీపీగా ఉన్న బి.శివధర్రెడ్డిని సైతం బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరిని శాంతి భద్రతల అదనపు డీజీపీగా నియమిస్తారని, మరొకొరిని ప్రొవిజినల్ అండ్ లాజిస్టిక్ అదనపు డీజీపీగా బదిలీచేసే అవకాశాలున్నట్టు తెలిసింది. రాచకొండలో అదనపు సీపీగా ఉన్న సుధీర్కుమార్ను ఒక జోన్కు ఐజీగా నియమించే అవకాశముంది. అదేవిధంగా నగర కమిషనరేట్లలో డీఐజీలుగా ఉన్న ఎం.రమేష్రెడ్డి, ఏఆర్.శ్రీనివాస్, విశ్వప్రసాద్లను కొత్తగా ఏర్పడబోతున్న రేంజులకు డీఐజీలుగా లేదా జాయింట్ సీపీలుగా బదిలీ చేయనున్నట్టు తెలిసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాకు సైతం స్థానచలనం కలిగే అవకాశముంది. కాగా, ప్రస్తుతం డీఐజీ పదోన్నతి కోసం వేచిచూస్తున్న సీనియర్ ఎస్పీలను దర్యాప్తు విభాగాల్లోకి తీసుకొని కీలక కేసుల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాల నుంచి బదిలీ అయ్యే అవకాశం ఉన్న అధికారులను సీఐడీతోపాటు ఏసీబీలో నియమించే అవకాశం ఉంది. జిల్లాలకు కన్ఫర్డ్ ఐపీఎస్లు కన్ఫర్డ్ ఐపీఎస్ జాబితాలోకి వచ్చిన 23 మంది అధికారులను వివిధ జిల్లాలతోపాటు ఎస్పీ హోదా ఉన్న కమిషనరేట్లకు బదిలీ చేయా లని పోలీస్ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం. అదేవిధంగా జిల్లాల్లో లాంగ్ స్టాండింగ్లో ఉన్న ఐపీఎస్, నాన్కేడర్ అధికారులను రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లోని జోన్లకు డీసీపీలుగా నియమించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. -
ఢిల్లీ గ్యాంగ్వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు?
దేశ రాజధాని ఢిల్లీలో రెండు హంతక ముఠాల గ్యాంగ్వార్ పెను సంచలనం రేపింది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించింది. మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్పూరియా గ్యాంగ్కు చెందిన వారని అనుమానిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే వైరం జితేందర్ గోగి, టిల్లు తాజ్పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య వైరానికి దారితీశాయి. 2010లో ఔటర్ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు గ్యాంగ్వార్గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం. ఎవరీ జితేంద్ర? గ్యాంగ్స్టర్ జితేంద్ర మన్ అలియాన్ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్కు చెందిన వ్యాపారవేత్తను తీహార్ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్గఢ్లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్లోని సెక్టార్ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. దశాబ్ద కాలంగా గ్యాంగ్వార్ టిల్లు తాజ్పురియా కూడా తీహార్ జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే ముఠా కార్యాలపాలు సాగించినట్టు ఇతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి గోగి, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్వార్ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్గా చెప్పుకునే మరో గ్యాంగ్స్టర్ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్పురియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్వార్ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు. లాయర్ డ్రెస్లో వచ్చిన దుండగులు అతడిని తుపాకులతో కాల్చి చంపారు. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
-
కోర్టులోనే రెండు గ్రూపుల కాల్పులు
-
లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో ఓ గ్యాంగ్ లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్ దుస్తుల్లో వచ్చిన సునీల్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర మృతి చెందాడు. ఓ కేసు విషయంలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర కోర్టు రాగా లాయర్ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ప్రత్యర్థి ముఠా కాల్పులకు దిగగానే షూటర్లను కాల్చి చంపిన గోగి గ్యాంగ్. కాగా, ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ జితేంద్రతోపాటు మరో ముగ్గురు మృతి చెందారు. అందరూ చూస్తుండగానే ఇరు గ్యాంగ్లు విచ్చల విడిగా కాల్పులు జరుపుకున్నాయి. కొంతకాలంగా సునీల్ గ్యాంగ్-జితేంద్ర గ్యాంగ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే జితేంద్ర టార్గెట్ చేసుకున్న సునీల్ గ్యాంగ్.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు దిగింది. జితేంద్ర గోగి అలియాస్ దాదా మోస్గ్ వాంటెడ్ క్రిమినల్. 2016లో పోలీస్ కస్టడీ నుంచి జితేంద్ర గోగి పరారీ కాగా, ఆ గ్యాంగ్ స్టర్పై రూ. 4 లక్షల రివార్డు ఉంది. కాగా, గోగిపై ఇప్పటికే 12 దోపిడీ, హత్య కేసులున్నాయి. కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కూడా గోగిపై కేసు నమోదైంది. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి #WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J — ANI (@ANI) September 24, 2021 -
‘విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు’
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాతంగా జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సీసీ కెమరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద అదనపు బలగాలను కూడా మోహరించామని అన్నారు. పాస్లు ఉన్నవారినే కౌంటింగ్ సెంటర్లలోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని కోరారు. సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి 2014లో 1600కు పైగా కేసులు నమోదు కాగా, ఈ సారి 1500కు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డికి భద్రత కల్పించాలని ఆ పార్టీ నేతలు డీజీపీని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. కౌంటింగ్ సెంటర్లలోకి సెల్ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. -
బాక్సర్ దారుణ హత్య
నోయిడా : హర్యానాకు చెందిన మాజీ బాక్సర్ జితేందర్ మన్ శుక్రవారం అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. జెటా సెక్టార్లోని ఏవీజే హైట్స్ అపార్ట్మెంట్లో తన ఇంటిలో శవమై కనిపించాడు. జితేందర్ను కలవాడినికి ప్రీతం అనే స్నేహితుడు జితేందర్ ప్లాట్ వెళ్లాడు. ఎంతసేపటికి తలపుతట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ప్రీతం పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై ఎస్పీ సునీత్ మట్లాడుతూ జితేందర్ శరీరంపై పలు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక జితేందర్ విషయానికి వస్తే జూనియర్ బాక్సింగ్లో భారత్ తరపున ఉబ్జెకిస్తాన్, క్యూబా, ఫ్రాన్స్, రష్యాలతో పాటు పలు అంతర్జాతీయ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. గాయాల కారణంగా గత ఏడు నెలల క్రితం బాక్సింగ్కు వీడ్కొలు పలికి జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. -
ఎన్డీయేలో చేరం: జితేందర్
హైదరాబాద్: తమ పార్టీకి ఎన్డీయే కూటమిలో చేరే ఉద్దేశం లేదని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు జితేందర్రెడ్డి స్పష్టంచేశారు. అయితే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వానికి అంశాలవారీ మద్దతు కొనసాగుతుందని బుధవారం ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని 16 విపక్ష పార్టీల కూటమిలో చేరే ఉద్దేశంకూడా లేదని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణను తమ ప్రభుత్వం అభివృద్ధి పథంలో తీసుకెళుతోందని, రాష్ట్రానికి మేలు చేసినంతకాలం ఎన్డీయేకు అంశాలవారీ మద్దతు కొనసాగుతుందని, అలా కాని పక్షంలో ఆ కూటమిపై కూడా పోరాటం చేస్తామని చెప్పారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న బీజేపీ లక్ష్యం గురించి ప్రశ్నించగా, రాష్ట్రంలో బీజేపీని గట్టి ప్రత్యర్థిగా భావించడం లేదన్నారు. -
అమీర్పేట కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు
⇒ ‘మెట్రో’ పనుల నేపథ్యంలో అమీర్పేట వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ⇒ బుధవారం నుంచి వచ్చే మంగళవారం వరకు అమలు హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాల నేపథ్యంలో నగరంలోని అమీర్పేట బిగ్బజార్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి వారం రోజుల పాటు అమలులో ఉండే వీటిని దృష్టిలో పెట్టుకుని వాహనచోదకులు సహకరించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ మళ్లింపు దారులు ఇవే.. ⇒ ఖైరతాబాద్, పంజగుట్ట వైపు నుంచి అమీర్పేట వైపు వచ్చే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్ని షాలిమార్ ‘టి’ జంక్షన్ నుంచి ముందుకు వెళ్లడానికి అనుమతించరు. వీటిని బిగ్బజార్ వెనుక వైపు నుంచి పంపిస్తారు. ⇒ కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్కాలనీ వైపుల నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ మీదుగా అమీర్పేట వైపు వచ్చే వాహనాలను (భారీ వాహనాల మినహా) జీహెచ్ఎంసీ పార్క్, శ్రీనగర్కాలనీ క్రాస్రోడ్, పార్క్ వ్యూ జీఎస్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్, గౌతమ్ చికెన్ సెంటర్, ఇమేజ్ హాస్పటల్ లైన్ మీదుగా పంపిస్తారు. ⇒ ఎర్రగడ్డ, ఎస్సార్నగర్, అమీర్పేట వైపు నుంచి ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళే వాహనాలను బిగ్బజార్ నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ వరకు ఒకే మార్గంలో రెండు వైపులకూ వెళ్లే వాహనాలను అనుమతిస్తారు. ⇒ ఈ మళ్లింపుల ప్రభావం సిటీ బస్సు రూట్ నంబర్లు 218, 225, 9, 9 ఎం, 9 ఎక్స్, 9/ఎఫ్, 189 ఎం, 19/ఎఫ్, 158, 113, 19 జే, 19 ఎం, 185, 19 కె/జె రూట్ బస్సులపై ఉంటుందని ట్రాఫిక్ అదనపు సీపీ జితేందర్ తెలిపారు. -
భారత రెజ్లర్ల పసిడి పట్టు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సింగపూర్లో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్లో చివరిరోజు భారత కుస్తీ వీరులు 8 స్వర్ణాలు, 8 రజతాలు సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో హర్ఫుల్ (61 కేజీలు), బజరంగ్ (65 కేజీలు), జితేందర్ (74 కేజీలు), దీపక్ (86 కేజీలు), హితేందర్ (125 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు. వికాస్ (61 కేజీలు), రాహుల్ మాన్ (65 కేజీలు), సందీప్ (74 కేజీలు), అరుణ్ (86 కేజీలు), కృషన్ (125 కేజీలు) రజత పతకాలు గెలిచారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో రవీందర్ (59 కేజీలు), దీపక్ (71 కేజీలు), హర్దీప్ (98 కేజీలు) పసిడి పతకాలను కై వసం చేసుకున్నారు. కృషన్ (59 కేజీలు), రఫీక్ (71 కేజీలు), సచిన్ (98 కేజీలు) రజత పతకాలను సాధించారు. -
రూ.2 కోట్ల ‘కిక్’ వదిలింది!
సాక్షి, హైదరాబాద్: మద్యం సేవించి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి ‘నిషా’చరుల్లో పలువురికి జైలు శిక్షలూ పడ్డాయి. జనవరి నుంచి అక్టోబర్ 20 వరకు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు జరిమానాల రూపంలో ఖజానాకు మొత్తం రూ.2,01,17,100 సమర్పించారు. ఈ ఏడాది ఇప్పటివరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ల్లో 13,447 మంది చిక్కారని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ శుక్రవారం తెలిపారు. వీరిలో 6,245 మందికి ఎర్రమంజిల్లోని కోర్టులు శిక్షలు విధించాయని వెల్లడించారు. ఇప్పటివరకు 10,065 ద్విచక్ర, 983 త్రిచక్ర, 2,115 తేలికపాటి వాహనాలతో పాటు 284 ఇతర వాహనాలను పట్టుకున్నట్లు చెప్పారు. వీటి చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఎర్రమంజిల్లోని మూడు, నాల్గో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో హాజరుపరిచారు. చోదకులు తీసుకున్న మద్యం మోతాదును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షలు విధించాయి. 582 మందికి ఒక రోజు, 1,161 మందికి రెండు రోజులు, 544 మందికి మూడు రోజులు, 227 మందికి నాలుగు రోజులు, 189 మందికి ఐదు రోజులు, 33 మందికి ఆరు రోజులు, 136 మందికి వారం, 138 మందికి పది రోజులు, 161 మందికి 15 రోజులు, ముగ్గురికి 20 రోజుల చొప్పున శిక్షలు పడ్డాయని జితేందర్ తెలిపారు. మరో 3,071 మందికి కోర్టు సమయం ముగిసే వరకు న్యాయస్థానంలోనే నిలబడేలా, సామాజిక సేవలు చేసేలా కోర్టులు శిక్ష విధించాయన్నారు. -
ఫుట్పాత్లు ఆక్రమిస్తే అరెస్టే
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడానికి ఆక్రమణలు కూడా ప్రధాన కారణం. వ్యాపారులు ఫుట్పాత్ల్ని ఆక్రమించడంతో పాదచారులకు రహదారులే ఆధారమవుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటమే కాదు... కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిణామలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఫుట్పాత్లను ఆక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలా అలా ముందుకొస్తూ... ఈ ఆక్రమణదారుల వ్యవహారం నానాటికీ తలనొప్పిగా మారుతోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. ఓ దుకాణదారుడు తొలుత తన దుకాణం ముందు ఉన్న ఫుట్పాత్పై కన్నేస్తున్నాడు. కొన్ని రోజుల పాటు దుకాణం తెరిచినప్పుడు అక్కడ సామాను పెట్టి, మూసేప్పుడు తిరిగి తీసేయడంతో ఆక్రమణ మొదలవుతోంది. కొన్నాళ్లకు ఆయా ఫుట్పాత్లపై నిర్మాణాలు చేపట్టి రహదారిని కూడా ఆక్రమిస్తున్నారు. ఇలా నానాటికీ కుంచించుకుపోతున్న ఫుట్పాత్లు, రహదారులు సామాన్యులకు అనేక ఇబ్బందులు కలిగించడంతో పాటు నరకం చూపిస్తున్నాయి. ఒకప్పుడు జరిమానా మాత్రమే... ఫుట్పాత్, రోడ్డు ఆక్రమణలపై ఒకప్పుడు కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉండేదికాదు. వీరిపై కేవలం సిటీ పోలీసు (సీపీ) యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాతో సరిపెట్టేవారు. దీంతో ఈ ఆక్రమణదారులపై ఎలాంటి ప్రభావం ఉండేది కాదు. ట్రాఫిక్ పోలీసులు వచ్చినప్పుడల్లా జరిమానాలు కట్టేస్తూ తమ పంథా కొనసాగించేవారు. ఫలితంగా సమస్య తీరకపోవడంతో పాటు ఆక్రమణదారుల సంఖ్య నానాటికీ పెరిగేది. ఏళ్లుగా కొనసాగుతున్న జరిమానా విధానంలోని లోపాలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. క్రిమినల్ కేసులతో కోర్టుకు... నగరంలో ఈ తరహా ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభించారు. దీనికోసం ‘మొబైల్ ఈ–టికెట్’ పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించి ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న ట్యాబ్్సలో పొందుపరిచారు. దీని ఆధారంగా ఆక్రమణదారులపై సాంకేతికంగా కేసులు నమోదు చేసే ఆస్కారం ఏర్పడింది. ఈ యాప్లో టిన్ నెంబర్, దుకాణం, యజమాని వివరాలతో పాటు ఆక్రమణ ఫొటో సైతం తీసుకునే ఆస్కారం ఉంది. ఇది జీపీఎస్ ఆధారితంగా పని చేయడంతో న్యాయస్థానంలో బలమైన సాక్ష్యంగా పనికి వస్తోంది. వీటి ఆధారంగా ఆక్రమణదారులను న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. రెండుసార్లు అవకాశం ఇచ్చాకే: ‘సిటీలో ఫుట్పాత్లు, రహదారుల్ని ఆక్రమిస్తున్న దుకాణదారులకు రెండు అవకాశాలు ఇస్తున్నాం. తొలుత రెండుసార్లు కేవలం జరిమానా, కౌన్సెలింగ్తో సరిపెడుతున్నాం. మూడోసారి కూడా పునరావృతమైతే క్రిమినల్ కేసు నమోదు చేసి అభియోగపత్రాలతో సహా కోర్టుకు తరలిస్తున్నాం. ఇప్పటికే కొందరికి జైలు శిక్ష కూడా పడింది. ఈ వివరాల ఆధారంగా జీహెచ్ఎంసీ అధికారులకూ లేఖ రాసి వారి ట్రేడ్ లైసెన్సు రద్దుకు సిఫార్సు చేస్తున్నాం.’ – జితేందర్, నగర ట్రాఫిక్ చీఫ్ -
ఐఓఎస్లోనూ ‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్’
నేటి నుంచి అందుబాటులోకి: జితేందర్ సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించిన సిటిజన్ ఫ్రెండ్లీ మెబైల్ యాప్ (HYDERABADTRAFFIC LIVE) ఐఓఎస్ పరిజ్ఞానంలోనూ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి యాపిల్ ఐ స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ గురువారం తెలిపారు. ఈ యాప్ను ఆవిష్కరించినప్పుడు కేవలం ఆండ్రాయిన్ పరిజ్ఞానంతో పని చేసే ఫోన్లకు మాత్రమే ఉపకరించేలా రూపొందించారని,. ప్రస్తుతం ఐఓఎస్ పరిజ్ఞానంతో పని చేసే ఐఫోన్ వినియోగదారులకూ అనుగుణంగా అభివృద్ధి చేశారు. జీపీఎస్ ఆధారంగా పని చేసే ఈ యాప్లో తొమ్మిది రకాలైన సమాచారం, సేవలు అందబాటులో ఉంటాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, నేరాలతో పాటు పోలీసులు చేసే ఉల్లంఘనలు, సూచనల్ని ఇందులో ఫీడ్ చేయవచ్చు. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటో చార్జీ ఎంత ఉంటుందనేదీ తెలుసుకోవచ్చు. వివిధ మార్గాల్లో ఉన్న ట్రాఫిక్ సరళి గరిష్టంగా ఓ నిమిషం ఆలస్యంగా ఇందులో అప్డేట్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని చెప్పడంతో పాటు సమీపంలో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సైతం ఇది సూచిస్తుంది. గమ్య స్థానం దూరం, మ్యాప్స్ సైతం కనిపిస్తాయి. ఓ వ్యక్తి తాను ఉన్న ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లను తెలుసుకోవడానికి, మీ వాహనంపై ఉన్న పెండింగ్ ఈ-చలాన్లు తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. దీని ద్వారానే మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లకు కనెక్ట్ అవడంతో పాటు బకాయి మొత్తాన్ని అప్పటికప్పుడే చెల్లించే సౌకర్యమూ ఉంది. నో పార్కింగ్లో ఉంచిన వాహనాలను పోలీసులు క్రేన్ ద్వారా ఎత్తుకెళితే (టోవింగ్) ఆ విషయాన్నీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్టీఏ వివరాలు, ఆటో, బస్సు, క్యాబ్, ట్యాక్సీ తదితర వాహనాలకు సంబంధించిన ఫిర్యాదులు, రహదారి నిబంధనలు, ఉపయుక్తమైన వెబ్సైట్లు, రోడ్ సైన్స్, ట్రాఫిక్ పోలీసు అధికారుల సమాచారం ఇందులో లభిస్తాయి. -
‘న్యూఇయర్’కు నిబంధనలు
* ఆంక్షలు విధించిన నగర పోలీసులు.. ఔటర్ రింగ్ రోడ్డుపై నిషేధాజ్ఞలు * డిసెంబర్ 31 రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకే సంబరాలకు అనుమతి * మద్యం సేవించి వాహనాలు నడపరాదు.. 200 ప్రాంతాల్లో చెక్పోస్టులు సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు బందోబస్తు ప్రణాళికతో పాటు నిబంధనలను సైతం సిద్ధం చేశారు. గతేడాది న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు పక్కా ప్రణాళికతో బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోలేదు. ఈ ఏడాది కూ డా ఈ వేడుకలను ప్రశాంతంగా జరిపేందుకు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్రెడ్డి, సీవీ ఆనంద్లు కసరత్తు చేపట్టారు. బుధవారం సైబరాబాద్ కమిషరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో స్టార్ హోటళ్లు, పబ్లు, ఫాంహౌజ్ నిర్వాహకులతో సీవీ ఆనంద్ ప్రత్యేక సమావేశం నిర్వహిం చి నూతన సంవత్సర వేడుకలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను వివరించారు. హద్దుమీరితే దండనే... న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వేడుకల్లో అపశ్రుతులు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మద్యం తాగి ఎవ్వరూ డ్రైవింగ్ చేయరాదు. త్రిబుల్ రైడింగ్కు పాల్పడినా దండన తప్పదు. పోలీసులు విధించిన నిబంధనలు పాటించాలి. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలు జరపాలి. సమయపాలన పాటించని హోటళ్లపై కేసులు నమోదు చేస్తాం. - మహేందర్రెడ్డి, కమిషనర్ సైబరాబాద్లో 25 స్టార్ హోటళ్లు, 3 పబ్స్, 22 రిసార్ట్స్, 269 ఫాంహౌజ్లలో ఈ వేడుకలు జరుగనున్నాయి. నగరంలోని హోటళ్లు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వేడుకల్లో మద్యం సేవించిన తరువాత వాహనాలు నడపరాదని, అలా నడిపే వారిపై నిఘా పెట్టామని, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు జాతీయ రహదారులపై సైబరాబాద్లోని మొత్తం సిబ్బంది 7,500 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విధులు నిర్వహిస్తారని ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి తెలిపారు. అలాగే, హైదరాబాద్ నగరంలో కూడా విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ పేర్కొన్నారు. వేడుకల నిబంధనలివీ... - కార్యక్రమాల నిర్వహణకు రాత్రి 8 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి. - కార్యక్రమాన్నంతా సీడీలో నిక్షిప్తం చేసి కమిషనర్కు నిర్వాహకులు అందజేయాలి. - ఒంటిగంట తరువాత కూడా కార్యక్రమం కొనసాగితే కేసులు నమోదవుతాయి. - జంటలను మాత్రమే అనుమతించాలి. ఒంటరిగా అబ్బాయినిగాని, అమ్మాయినిగాని అనుమతించరాదు. ఆహ్వానం ఉన్నవారినే లోపలికి అనుమతించాలి. - అనుమతిలేనిదే బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లు, హోర్డింగులు ప్రదర్శించరాదు. - 1974 గేమింగ్ చట్టం వర్తించే ఆటలు నిర్వహించరాదు. డీజే సౌండ్ నిషేధం. 45 డెసిబిల్స్ కంటే మించి శబ్దాలు రాకూడదు. - నగ్న ప్రదర్శనలు, అశ్లీల చిత్రాల ప్రదర్శనలు, నృత్యాలపై నిషేధం ఉంది. - ప్రచార పత్రాలు, హోర్డింగులలో అశ్లీలత ఉండరాదు. - ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం పంపిణీ చేయరాదు. మద ్యం సేవించి గొడవ చేసే వారిని అరికట్టాలి. - బాణాసంచా కాల్చరాదు. అగ్నిమాపక శాఖ అధికారుల సూచనలు పాటించాలి. - ఆహ్వానితులకు పోలీసుల నిబంధనలు ముందుగానే వివరించాలి. - సీట్లకు మించి ఆహ్వానితులు ఉండరాదు. - తాగి వాహనాలు నడపకూడదు. ప్రతి రహదారిపై పోలీసు నిఘా - వేడుకల నిర్వాహకులే సొంతంగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని ట్రాఫిక్ను సరి చేసుకోవాల్సి ఉంటుంది. - పార్కింగ్ ప్రదేశాలలోనే వాహనాలు పార్క్ చేయాలి. ఎక్కడపడితే అక్కడ రోడ్డుపై పార్క్ చేస్తే సీజ్ చేస్తారు. - జంట పోలీసు కమిషనరేట్లలో 200 ప్రాంతాలలో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. - డ్రంకెన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తె పోలీసులు చలానా విధిస్తారు. - నగరంలో అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తారు. ఓఆర్ఆర్పై నిషేధాజ్ఞలు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై నిషేధాజ్ఞ లు విధిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. సైబరాబా ద్ పరిధిలోని ఫ్లైఓవర్లను మూసివేస్తారు. - 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గం. వరకు ఓఆర్ఆర్తో పాటు ఇతర ప్రాంతాలలో ట్రాఫిక్పై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. - ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్ను ఓఆర్ఆర్పై అనుమతించరు. - విమాన ప్రయాణికులు కారులో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. అయితే వారు విమాన ప్రయాణ టికెట్లు చూపించాల్సి ఉంటుంది. - సాధారణ ప్రయాణికులు కారులో ప్రయాణించడంపై ఆంక్షలు విధించారు. - కేవలం భారీ సరుకు రవాణా వాహనాలు, చిన్నపాటి గూడ్స్ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. - పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్ పూర్తిగా మూసివేస్తారు. - ఫతేనగర్, హఫీజ్పేట ఫ్లైఓవర్లపై మాత్రం ట్రాఫిక్ను అనుమతిస్తారు. - వేడుకలలో పాల్గొనే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. -
సంబరాల వేళ...సమస్యలు లేకుండా
నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సాయంత్రం 4 నుంచి 11.30 గంటల వరకూ అమలు నాంపల్లి: బతుకమ్మ సంబరాలకు ఇబ్బంది కలుగకుండా నగరంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించామని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ తెలిపారు. సంబరాలు తిలకిం చేందుకు 5 వేల మంది ప్రముఖులు వస్తున్నారన్నారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ పైకి వచ్చే వాహనాలు కర్బల మైదాన్ నుంచి దారి మళ్లి, బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కట్టమైసమ్మ, కవాడి గూడ నుంచి వాహనాలను ట్యాంక్బండ్ పైకి అనుమతించరు. వీటిని డీబీఆర్ మిల్స్ నుంచి కవాడిగూడ వైపు మళ్లిస్తారు. ఎక్బాల్మినార్ టవర్ నుంచి ట్యాంక్బండ్ పైకి వచ్చే వాహనాలను పాత సచివాలయ గేట్ వద్ద దారి మళ్లిస్తారు. ఇవి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కట్టమైసమ్మ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం జంక్షన్ వైపు అనుమతించరు. ఈ వాహనాలు నాంపల్లి, రవింద్రభారతి వైపు మళ్లిస్తారు. ఆబిడ్స్ నుంచి వ చ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం, బషీర్బాగ్ జంక్షన్ వైపు అనుమతించరు. ఈ వాహనాలు గన్ఫౌండ్రి నుంచి దారి మళ్లించి చాపల్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్నగర్ వై జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. కింగ్కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్బాగ్కు వచ్చే వాహనాలను కింగ్కోఠి చౌరస్తా నుంచి తాజ్మహల్ వైపు మళ్లిస్తారు. ఓల్డ్ పీసీఆర్ నుంచి బషీర్బాగ్ జంక్షన్కు వచ్చే వాహనాలను పీసీఆర్ నుంచి నాంపల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు. హిల్ఫ్ఫోర్ట్ నుంచి వాహనాలను బషీర్బాగ్ చౌరస్తా వైపు అనుమతించరు. వాటిని నాంపల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు. హిమాయత్నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ చౌరస్తాకు వెళ్లే వాహనాలను హిమాయత్నగర్ వై జంక్షన్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు మళ్లిస్తారు. పంజగుట్ట, రాజ్భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైవర్ మీదుగా వచ్చే వాహనాలను ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధభవన్ వరకు వాహనాలను అనుమతించరు. ఎల్బీ స్టేడియం నుంచి బషీర్బాగ్, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్బండ్ వరకు వాహనాలను అనుమతించరు. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి రామకష్ణ మఠం వరకు వాహనాలను అనుమతిస్తారు. బస్సులు నిలిపే స్థలాలు ఉత్తర మండలం నుంచి వచ్చే వారు బీజేఆర్ విగ్రహం వద్ద దిగాల్సి ఉంటుంది. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి. దక్షణ మండలం నుంచి వచ్చే వారు ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దిగాల్సి ఉంటుంది. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి. పశ్చిమ మండలం నుంచి వచ్చేవారు అయకర్ భవన్ వద్ద బస్సు దిగాలి. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి. మధ్య, తూర్పు మండలాల నుంచి వచ్చే వారు నిజాం కళాశాల వద్ద బస్సు దిగాలి. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి వీరంతా ఎల్బీ స్టేడియంలోకి వెళ్లాలి. ర్యాలీ మార్గం అన్ని మండలాల నుంచి ఎల్బీ స్టేడియంకు చేరుకునే మహిళలు ర్యాలీగా ఎల్బీ స్టేడియం, బషీర్బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్బండ్ మీదుగా చిల్ట్రన్ పార్క్కు చేరుకుంటారు. అక్కడ బతుకమ్మ ఆడిన తరువాత డీబీఆర్ మిల్స్, వార్త లైన్, ధర్నా చౌక్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకొని, అక్కడ పార్క్ చేసిన బస్సులలో గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలి. అందరూ వారి టీమ్ లీడర్లసెల్నెంబర్లను తమ వద్ద ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పార్కింగ్ ప్రదేశాలు బస్సులు ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆగుతాయి. కార్ల కోసం డీబీఆర్ మిల్స్ సమీపంలోని మసీదు దగ్గర, ధోబీఘాట్లను కేటాయించారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే వారి కోసం ఎ,బి,సి కారు పాస్లను ఇచ్చినట్లు తెలిపారు. పాస్పై కేటాయించిన ప్రదేశాల్లో కార్లను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. -
తప్పించుకు తిరగలేరు!
కొత్త విధానంలో ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలు పాత పద్ధతికి స్వస్తి నగరంలో 200 తనిఖీ పాయింట్లు ప్రత్యేక బారికేడ్లు సిద్ధం సాక్షి, సిటీబ్యూరో: ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు పోలీసు తనిఖీల నుంచి తప్పించుకు తిరగలేరు. దీనికోసం పోలీసులు కొత్త పద్ధతులు పాటించబోతున్నారు. ప్రస్తుతం అవలంబిస్తున్న ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో సమూల మార్పులు చేయాలని ఎమ్.మహేందర్రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడ పడితే అక్కడ కాకుండా, వాహనదారులు, పాదచారులకు అసౌకర్యం కలుగకుండా క్రమపద్ధతిలో తనిఖీలు చేయాలని అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ అన్ని ట్రాఫిక్ ఠాణా ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కొత్త తనిఖీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన బారికేడ్లు వచ్చేశాయి. ఇదీ ప్రస్తుతపద్ధతి మలక్పేట్కు చెందిన రవి తన బైక్పై కోఠి వైపు దూసుకెళ్తున్నాడు. చాదర్ఘాట్ దాటిన తరువాత ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయి చూపించి వాహనాన్ని ఆపమన్నాడు. రవి సడన్గా బ్రేక్ వేశాడు. అంతే.. వెనుక నుంచి వచ్చిన మరో వాహనం రవిని ఢీ కొట్టింది...నగరంలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్నిఆపమంటే చోదకులు ఆపకుండా, వేగంగా దూసుకెళ్లి ప్రమాదాల బారినపడిన దాఖలాలూ కోకొల్లలు. కొన్ని సందర్భాలలో మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. చెకింగ్ సమయంలో ఉన్నట్టుండి వాహనాన్ని నిలిపే క్రమంలో పోలీసులు, వాహనదారులకు ముష్టియుద్ధాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి ఘటనలకు తావులేకుండా జాగ్రత్త వహించనున్నారు. కొత్త విధానమిదీ... ‘ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులను తనిఖీ చేస్తున్నాం. వాహనదారులు సహకరించాలి’ అని తెలిపే బారికేడ్లు వంద మీటర్ల దూరం నుంచే వాహనదారుడికి కనబడేలా దర్శనమిస్తాయి. వీటి వద్ద ట్రాఫిక్ పోలీసులు మర్యాదగా, గౌరవంగా, చెయ్యి చూపించి వాహనాన్ని ఆపేస్తారు. ఆ సమయంలో ఆ వాహనం వెనుక నుంచి వచ్చే ఇతర వాహనదారులు వేగాన్ని తగ్గించుకుంటారు. దీని వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపమన్నా తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. బారికేడ్లు పెట్టడం వల్ల వాహన వేగం పెంచలేక తనిఖీలకు తప్పనిసరి సహకరించాల్సిందే. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించే వారు తనిఖీలలో పట్టుబడడం ఖాయం. కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది ఎటువంటి ఆదేశాలు లేకున్నా సందుగొందుల్లో తనిఖీలు చేసి జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలకు కూడా కొత్త పద్ధతితో బ్రేక్పడుతుంది. ఈ బారికేడ్లు లేకుండా తనిఖీలు చేయరాదని కమిషనర్ మహేందర్రెడ్డి ఆదేశించారు. 200 ప్రాంతాల్లో... నగర కమిషనరేట్ పరిధిలో 25 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్ పరిధిలో భౌగోళికతను దృష్టిలో పెట్టుకుని ఏడు నుంచి పది వరకు తనిఖీ పాయింట్లను గుర్తించారు. ట్రాఫిక్ తనిఖీల కోసం నగరంలో మొత్తం 200 ప్రాంతాలను గుర్తించారు. ప్రతి తనిఖీ పాయింట్ వద్ద బారికేడ్లు ఉంటాయి. -
నేడు శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు
మెహిదీపట్నం, న్యూస్లైన్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్కు ఎలాంటి ఆటంకాలు జరగకుండా నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చేపట్టే ర్యాలీలకు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గౌలీగూడ రామాలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కు చేరుతుందని, ఈ మార్గాల్లో వెళ్లే ర్యాలీకి ట్రాఫిక్ను ఇతర వైపులకు మళ్లిస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ... అఫ్జల్గంజ్, శంకర్ హోటల్, ముక్తాయార్ గంజ్ మీదుగా పుత్లీ బౌలికి వెళ్లే వాహనాలు గౌలీగూడ చమాన్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వైపు సీబీఎస్కు వెళ్లాలి. ఆంధ్రాబ్యాంకు రంగ్మహల్ నుంచి గౌలీ గూడ చమాన్ వైపుకు ట్రాఫిక్ను అనుమతిం చరు. ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలను పుత్లీ బౌలీ క్రాస్ రోడ్ మీదుగా రంగ్మహల్ వైపుకు మళ్లిస్తారు. ఊరేగింపు ప్రారంభమైన తర్వాత చాదర్ఘాట్ నుంచి పుత్లీ బౌలి వైపు వెళ్లే వాహనాలు రంగ్మహల్ వై జంక్షన్ నుంచి సీబీఎస్ వైపుకు మళ్లిస్తారు. పుత్లీబౌలి నుంచి ర్యాలీ ఆంధ్రాబ్యాంకు వైపు దాటిన తర్వాత జీపీఓ అబిడ్స్ జంక్షన్ నుంచి ఎంజే మార్కెట్ వైపుకు మళ్లిస్తారు. ఈ ర్యాలీ కోఠి ఆంధ్రాబ్యాంకు వచ్చే సమయంలో చాదర్ఘాట్ క్రాస్ రోడ్ నుంచి ఆంధ్రాబ్యాంకు వైపు వచ్చే వాహనాలను బీఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్ నుంచి సుల్తాన్బజార్ క్రాస్ రోడ్వైపు మళ్లిస్తారు. ర్యాలీ కాచిగూడ క్రాస్ రోడ్ వచ్చే సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాహనాలు బడీచౌడీ టూరిస్టు హోటల్ జంక్షన్, బర్కత్పుర వైపు మళ్లిస్తారు. అజమాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను వీఎస్టీ క్రాస్రోడ్లోని క్రౌన్కేఫ్ వైపు మళ్లిస్తారు. ముషీరాబాద్ క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను రాంనగర్ టీ జంక్షన్ మీదుగా మెట్రో కేఫ్ వైపు మళ్లిస్తారు. హిమాయత్నగర్ వై జంక్షన్ నుంచి నారాయణగూడ క్రాస్రోడ్కు వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు. వీటిని నేరుగా నారాయణగూడ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు. నారాయణగూడ క్రాస్రోడ్ వైపుకు ఎటువంటి వాహనాలకు అనుమతి ఉండదు. క్రౌన్కేఫ్ నుంచి నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను నారాయణగూడ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు. నారాయణగూడ ఫ్లైఓవర్ కింద నుంచి హిమాయత్నగర్ వై జంక్షన్ వరకు అనుమతించరు. కింగ్కోఠి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ సర్కిల్ వైపు వచ్చే వాహనాలను సిమెటరీ మీదుగా హిడెన్ గార్డెన్స్ వైపు మళ్లిస్తారు. బర్కత్పుర చమాన్ నుంచి ఓఎంసీ వైపుకు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలను ఓల్డ్ పోస్టాఫీస్ మీదుగా క్రౌన్ కేఫ్, కాచిగూడ క్రాస్రోడ్కు మళ్లిస్తారు. కవాడిగూడ క్రాస్రోడ్, రాగా టూల్స్ టీ జంక్షన్ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదు. కర్బలా మైదానం నుంచి కవాడిగూడ క్రాస్ రోడ్ వైపుకు వాహనాల అనుమతి ఉండదు. వీటిని శైలింగ్ క్లబ్ టీ జంక్షన్ చిల్డ్రన్ పార్కు మీదుగా మళ్లిస్తారు. లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ నుంచి వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద అప్పర్ట్యాంక్బండ్ వైపు మళ్లిస్తారు. ర్యాలీ ఆర్పీ రోడ్కు రాగానే కర్బలా మైదానం నుంచి ఆర్పీ రోడ్ వెళ్లే వాహనాలను కర్బలా మైదానం క్రాస్ రోడ్ నుంచి రాణిగంజ్ ఎంజీ రోడ్వైపుకు ట్రాఫిక్ మళ్లిస్తారు. అడవయ్య క్రాస్ రోడ్ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. బైబిల్ హౌస్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులు కర్బలా మై దానం నుంచి మినిస్టర్ రోడ్వైపు మళ్లిస్తారు. టివోలి క్రాస్ రోడ్ నుంచి బాలమ్రాయి వైపు వెళ్లే వాహనాలు గ్రూప్ బాండ్ క్రాస్ రోడ్ మస్తాన్ కేఫ్ డైమండ్ పాయింట్ వైపు మళ్లిస్తారు. ఎన్సీసీ క్రాస్ రోడ్ నుంచి డైమండ్ పాయింట్ వెళ్లే వాహనాలను నార్నె ఎస్టేట్ పా యింట్ నుంచి కార్కాన బస్తీ వైపు మళ్లిస్తారు. -
మధ్యప్రదేశ్ వాసి హత్య
ఓర్వకల్లు, న్యూస్లైన్: బతుకుదెరువుకోసం వచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఓర్వకల్లు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. 45 రోజుల క్రితం కర్నూలు జిల్లాకు వచ్చిన మధ్యప్రదేశ్లో ని డ్యాతోల్ జిల్లా, బాషపాణ గ్రామానికి చెందిన జితేంద్ర(45) నెల రోజులుగా ఉలిందకొండ వద్ద జరుగుతున్న విద్యుత్ టవర్ల నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఎల్ఎంటీ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్ టవర్ల వద్ద కాపలా ఉండేందుకు కాం ట్రాక్టర్ శ్రీనివాసులు జితేంద్రను ఓర్వకల్లు వద్దకు తీసుకొచ్చాడు. అతనితో పాటు మరో ఐదుగురు అక్కడే పని చేస్తున్నారు. ఈ క్రమం లో రెండు రోజుల క్రితం వారి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జితేంద్ర హత్యకు గురి కావడం అనుమానాలకు తావిస్తోంది. తాలుకా రూరల్ సీఐ శ్రీనివాసమూర్తి, ఉలిందకొండ ఎస్ఐ నరేంద్ర కుమార్రెడ్డి, క్లూజ్ టీమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడే పని చేస్తున్న నలుగురిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.