తెలంగాణ: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్‌ | private colleges announce indefinite bandh fee reimbursement arrears | Sakshi
Sakshi News home page

తెలంగాణ: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్‌

Published Tue, Oct 15 2024 12:56 PM | Last Updated on Tue, Oct 15 2024 1:14 PM

private colleges announce indefinite bandh fee reimbursement arrears

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో ఇవాళ్లి నుంచి ప్రైవేటు డిగ్రీ , పీజీ కళాశాలలు బంద్ చేసినట్లు యజమానులు తెలిపారు. కళాశాలు నడిపే పరిస్థితి లేక మూసివేస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే కాలేజీల  బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నలగొండ జిల్లాలో డిగ్రీ, పీజీ కాలేజీలను యజమానులు మూసివేశారు. కళాశాలల యజమానులు నిరవధిక బంద్‌ నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.120కోట్ల బకాయిలు ఉన్నాయని యజమానులు చెబుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కళాశాల అసోసియేషన్‌ ఇవాళ్టి నుంచి బంద్‌ పాటిస్తోంది. కాలేజీల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. మూడేళ్లుగా రూ.2400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయని యజమానలు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల సమ్మె! ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు డిమాండ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement