arrears
-
తెలంగాణ: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఇవాళ్లి నుంచి ప్రైవేటు డిగ్రీ , పీజీ కళాశాలలు బంద్ చేసినట్లు యజమానులు తెలిపారు. కళాశాలు నడిపే పరిస్థితి లేక మూసివేస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే కాలేజీల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నలగొండ జిల్లాలో డిగ్రీ, పీజీ కాలేజీలను యజమానులు మూసివేశారు. కళాశాలల యజమానులు నిరవధిక బంద్ నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.120కోట్ల బకాయిలు ఉన్నాయని యజమానులు చెబుతున్నారు.ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కళాశాల అసోసియేషన్ ఇవాళ్టి నుంచి బంద్ పాటిస్తోంది. కాలేజీల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. మూడేళ్లుగా రూ.2400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని యజమానలు తెలిపారు. -
దివాలా అస్త్రం నుంచి బయటపడ్డ బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్సీఎల్టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్కు ఊరట లభించినట్లయింది.బీసీసీఐ స్పాన్సర్షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్టేకింగ్లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది. అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది. రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ... ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు. వివాదమేమిటీ? బీసీసీఐ, బైజూస్లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్పై తన ట్రేడ్మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్కు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్కు సంబంధించి బైజూస్ ఒక ఇన్వాయిస్పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్వాయిస్లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్లు, టూర్లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్పై ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్ను జులై 16న అనుమతిస్తూ, ఎన్సీఎల్టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది.కష్టాల కడలిలో... బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్లైన్లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.భారీ విజయమిది: బైజూస్ ఎడ్టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు. -
ధాన్యం బకాయిలివ్వరా?
సాక్షి, అమలాపురం: భారీ వర్షాలు.. వరదలతో వరి చేలు చెరువులుగా మారిపోయాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతు భరోసా సాయం అందలేదు. ఇంకోవైపు రబీకి సంబంధించి ధాన్యం బకాయిలు సైతం రెండు, మూడు నెలలుగా జమ కావడం లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపుమండిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు సోమవారం అమలాపురం కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా చేశారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్కు వచి్చన జేసీ నుపూర్ అజయ్ కారును పది నిమషాల పాటు అడ్డుకున్నారు. మూడు మండలాల నుంచి తరలివచ్చి.. అల్లవరం, ఉప్పలగుప్తం, అయినవిల్లి మండలాలకు చెందిన సుమారు 60 మంది రైతులు కలెక్టరేట్కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. మే నెలలో అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటికీ సొమ్ములు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. తమకు రావాల్సిన సొమ్ములు కోసం జిల్లా ఉన్నతాధికారులకు, గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 8 వేల మంది రైతులకు రూ.154 కోట్ల వరకు ధాన్యం సొమ్ములు చెల్లించాల్సి ఉంది. డీఆర్వో వి.వెంకటేశ్వర్లు రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కలెక్టర్ వరద పర్యటనలో ఉన్నందున జేసీ నుపూర్ కార్యాలయానికి వచ్చి ఐదుగురు రైతులు మాట్లాడాలని డీఆర్వో సూచించారు. దీంతో రైతులు వాగి్వవాదానికి దిగారు. రైతులంతా వస్తామని పట్టుబట్టారు. ఆయన వెంట ప్రధాన గేట్లును నెట్టుకుంటూ కార్యాలయం వైపు చొచ్చుకురాగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేసీ నుపూర్ అజయ్ రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం సొమ్ములు నెలాఖరులోగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. జేసీ హామీతో రైతులు వెనుదిరిగారు. ఆత్మహత్యలే శరణ్యం ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మే నెలలో ధాన్యం విక్రయించగా అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వం సొమ్ము చెల్లించడానికి వీలు కాలేదని, ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ధాన్యం అమ్మకాలు చేసి 70 రోజులు అవుతున్నా సొమ్ములు ఖాతాల్లో జమ చేయకపోవడంతో నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని, నెలాఖరు నాటికి ధాన్యం సొమ్ములు ఇవ్వకుంటే సాగు సమ్మె చేపడతామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో సకాలంలో సొమ్ములు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం సొమ్ములు 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమయ్యేవి. గత ఏడాది ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు చేసిన వారంలోనే సొమ్ములు పడడాన్ని రైతులు గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోలు సొమ్ములు కూడా మొదట్లో సకాలంలో వేశారు. అదేవిధంగా మే 24, 25 తేదీలలో రెమాల్ తుపాను సమయంలో వర్షాలు కురుస్తుండగా రైతుల వద్ద నుంచి ఏకంగా 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత ఒకసారి రూ.117 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మిగతా రైతులకు చెల్లింపులు చేయలేదు.మే మొదటి వారంలో అమ్మాం నేను మే మొదటి వారంలో ధాన్యం విక్రయించాను. రూ.1.20 లక్షల వరకు సొమ్ములు రావాల్సి ఉంది. రబీ కోతలకు మెషీన్ ఖర్చులు నుంచి కూలీలు, ఖరీఫ్ విత్తనాలు, దమ్ములు వరకు అప్పులు చేశాను. 70 రోజులు దాటుతున్నా సొమ్ములు ఇవ్వకపోవడం అన్యాయం. – చొల్లంగి రామకృష్ణ, దేవగుప్తం గ్రామంఆత్మహత్యలే శరణ్యం ధాన్యం అమ్మిన సొమ్ముల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఇలాగే ఉంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. జేసీ మేడమ్ శనివారం చివరిలో సొమ్ములు మా ఖాతాలో పడతాయని చెప్పారు. అలా జరగకపోతే నిరాహార దీక్షలు చేపడతాం. – కర్రి రాములు, జనుపల్లి గ్రామం -
AP: ఆస్తి పన్ను బకాయిలుపై వడ్డీ మాఫీ
సాక్షి, విజయవాడ: ఆస్తి పన్ను బకాయిలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్టైం సెటిల్మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనుంది. ఆస్తీ పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనాలు, ఖాలీ స్థలాలు పన్నులపై వడ్డీ మాఫీ అమలు కానుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు వర్తించనుంది. చదవండి: ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం: సీఎం జగన్ -
పైసా ఇవ్వలే...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీలో డి.సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎంసెట్లో ఉత్తమర్యాంకు సాధించి కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న సాయికిరణ్ ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హుడు. కానీ రెండేళ్లుగా వ్యక్తిగతంగా ఫీజు చెల్లిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ నిధులు జమ కాగానే చెక్కు రూపంలో ఫీజు వెనక్కి ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో ధైర్యం చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. కోవిడ్ తర్వాత నిధుల విడుదలలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దాని ప్రభావం విద్యార్థుల చదువులు, ఇతర అంశాలపై పడుతోంది. బకాయిలు రూ.4,043.19 కోట్లు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయి. రూ.4043.19 కోట్ల మేర విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు రూపంలో చెల్లించాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్లో పైసా విడుదల కాకపోగా, అంతకుముందు ఏడాది 40శాతం మాత్రమే నిధులు విడుదలయ్యాయి. సాధారణంగా అయితే విద్యాసంవత్సరం ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తారు. కానీ మూడేళ్లుగా పరిస్థితి తారుమారైంది. బీసీ విద్యార్థులవే అధికం ఫీజు బకాయిల్లో అత్యధికం బీసీ సంక్షేమశాఖకు చెందినవే ఉన్నాయి. ఈ మూడేళ్లకు సంబంధించి బీసీ విద్యార్థులకు రూ.2182.89 కోట్ల బకాయి లున్నాయి. ఈబీసీ కేటగిరీలో మూడేళ్ల బకాయిలు రూ.661.84 కోట్లు ఉన్నాయి. ♦ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా నిధుల సర్దుబాటు చేస్తున్నారు. ♦ మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోనూ బకాయిలు 461.05కోట్లు ఉన్నాయి. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు... ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిధులు విడుదల చేసిన తర్వాత వాటిని కాలేజీ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడంలోనూ తాత్సారం చేస్తోంది. గతేడాది డిసెంబర్లో దాదాపు రూ.4వందల కోట్లకు సంబంధించి టోకెన్లు జనరేట్ చేసిన అధికారులు ట్రెజరీల్లో క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపారు. – గౌరి సతీశ్, కన్వినర్, కేజీ టు పీజీ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గరున్న ఓఇంజనీరింగ్ కాలేజీలో జె.కార్తిక్ తాజాగా ఎంటెక్ పూర్తి చేశాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూ ద్వారా జాబ్కు ఎంపికయ్యాడు. ఒప్పందపత్రంపై సంతకంతోపాటు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్టు సమర్పించాలని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాలంటూ రీయింబర్స్మెంట్కు మెలిక పెట్టింది. దీంతో అప్పు చేసి ఫీజు చెల్లించి కాలేజీకి నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నాడు. -
ఎలక్ట్రిక్ టూ–వీలర్ సంస్థలకు భారీ నష్టం
న్యూఢిల్లీ: పేరుకుపోయిన బాకీలు, గతేడాది సబ్సిడీల నిలిపివేత వల్ల మార్కెట్ వాటాను కోల్పోవడం తదితర కారణాలతో విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు (ఓఈఎం) నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కారణంగా ఏడు సంస్థలు ఏకంగా రూ. 9,000 కోట్ల మేర నష్టపోయాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) మంత్రి మహేంద్ర నాథ్ పాండేకి రాసిన లేఖలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య (ఎస్ఎంఈవీ) చీఫ్ ఎవాంజెలిస్ట్ సంజయ్ కౌల్ ఈ విషయాలు తెలిపారు. అసలే కష్టకాలంలో ఉంటే.. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తాలను వాపసు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడం మరో సమస్యగా మారిందని పేర్కొన్నారు. 2022లో సదరు సంస్థలకు భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీలను నిలిపివేసినప్పటి నుంచి పేరుకుపోయిన బకాయిలు, వడ్డీ, రుణం, మార్కెట్ వాటాపరమైన నష్టం, ప్రతిష్టకు భంగం కలగడం, పెట్టుబడి వ్యయాలపరంగా కంపెనీలకు రూ. 9,075 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని ఎస్ఎంఈవీ ఆడిట్లో తేలినట్లు కౌల్ తెలిపారు. ఫలితంగా కొన్ని కంపెనీలు ఎప్పటికీ కోలుకోకపోవచ్చని, కొన్ని మూతబడవచ్చని పేర్కొన్నారు. దేశీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 1 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో పరిశ్రమ చర్చలు జరుపుతున్న తరుణంలో దాదాపు దానికి సరిసమానమైన స్థాయిలో నష్టాలు నమోదవడం చిత్రమైన పరిస్థితి అని కౌల్ వ్యాఖ్యానించారు. రోజూ పెరిగిపోతున్న నష్టాల కారణంగా తయారీ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయండి.. ఓఈఎంలకు గత 18–22 నెలల సబ్సిడీ బాకీలు రావాల్సి ఉందని కౌల్ తెలిపారు. పైపెచ్చు పాత సబ్సిడీలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడం, కొత్త మోడల్స్ను ఎన్ఏబీ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి అనుమతించకపోవడం వంటివి ఆయా సంస్థల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ప్రధాన ఉద్దేశం సదరు సంస్థలను శిక్షించడం మాత్రమే అయితే, ఇలా సమస్య పరిష్కారం కాకుండా జాప్యం జరుగుతూ ఉండటం వల్ల అవి పూర్తిగా మూతబడే పరిస్థితి వస్తోందని కౌల్ తెలిపారు. ఇలాంటి శిక్ష సరికాదని పేర్కొన్నారు. మూసివేత అంచుల్లో ఉన్న ఓఈఎంలకు ఊపిరి పోసేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. తక్కువ వడ్డీపై రుణాలు, గ్రాంట్లు లేదా ఆ తరహా సహాయాన్ని అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నిర్దిష్ట స్కీము నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు పొందాయంటూ హీరో ఎలక్ట్రిక్ సహా ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటర్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటోపై ప్రభుత్వం విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు మేడిన్ ఇండియా పరికరాలను ఉపయోగించాలి. అయితే, ఈ ఏడు సంస్థలు దిగుమతి చేసుకున్న పరికరాలను వినియోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంగించాయని ఆరోపణలు ఉన్నాయి. -
ఆర్టీసీపై మళ్లీ కోర్టుకెక్కిన సీసీఎస్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీపై ఆ సంస్థకు చెందిన ఉద్యో గుల సహకార పర పతి సంఘం (సీసీ ఎస్) మరోసారి కోర్టుకెక్కింది. ఉద్యోగుల కుటుంబ అవసరాలకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా సీసీఎస్ నిధిని ఆర్టీసీ వాడేసుకోవడంతో సీసీఎస్ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి 7శాతాన్ని కోత పెడుతున్న ఆర్టీసీ యాజమాన్యం... ఆ సొమ్మును సీసీ ఎస్కు సరిగ్గా చెల్లించకపోవడం వల్ల వడ్డీతో కలిపి రూ. 903 కోట్ల మేర బకాయిలు పేరుకు పోయాయని.. అందులోంచి కనీసం రూ. 600 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది. ఆర్టీసీ తీరుతో సీసీఎస్ కొంతకాలంగా ఉద్యోగులకు రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెల కొంది. ఫలితంగా వారు బయట నుంచి అప్పులు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతు న్నారు. మరోవైపు జూలై నుంచి రిటైరైన సుమారు వెయ్యి మంది ఉద్యోగులతోపాటు వీఆర్ఎస్ తీసుకున్న 200 మంది ఉద్యోగులు ఇంతకాలం సీసీఎస్లో దాచుకున్న మొత్తం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం రుణాల కోసం 6,800 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే అంశంపై 2019లో సీసీఎస్ తొలిసారి హైకోర్టును ఆశ్రయించగా రూ. 200 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్టీసీని న్యాయస్థా నం ఆదేశించింది. అయినా ఆర్టీసీ యాజమా న్యం స్పందించకపోవడంతో సీసీఎస్ 2020 జూన్లో కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీంతో దిగొచ్చిన ఆర్టీసీ... ఆ మొత్తాన్ని ఆర్టీసీ చెల్లించింది. -
‘ఫీజు’కు తప్పని నిరీక్షణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు మరింత నిరీక్షణ తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అటు సంక్షేమ శాఖల వద్ద భారీగా బిల్లులు పేరుకుపోగా.. ఇటు సంక్షేమశాఖలు ఈపాస్ ద్వారా ఆన్లైన్లో క్లియర్ చేసిన బిల్లులకూ ట్రెజరీల్లో చెల్లింపులు జరగని పరిస్థితి నెలకొంది. దీనితో కాలేజీల యాజమాన్యాల నుంచి ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమ శాఖల గణాంకాల ప్రకారం.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి రూ.1,867.66 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.460.96 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 2021–22కు సంబంధించి 1,406.70 కోట్లు చెల్లించాలి. ఇక 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికీ మొదలుకాలేదు. ట్రెజరీలో ఆగిన రూ.560 కోట్లు పోస్ట్మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలతోపాటు అర్హత ఉన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను ముందుగా కాలేజీ యాజమాన్యాలు పరిశీలించి ఆమోదం కోసం సంక్షేమశాఖ అధికారులకు పంపుతాయి. సంక్షేమశాఖల అధికారులు వాటిని పరిశీలించాక ఆమోదించి నిధుల విడుదల కోసం ట్రెజరీకి బిల్లులు పంపుతారు. ట్రెజరీ అధికారులు వాటిని పరిష్కరించి నిధులు విడుదల చేస్తారు. ఈ క్రమంలో 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సుమారు రూ.560.16 కోట్లకు సంబంధించిన బిల్లులను ట్రెజరీకి పంపగా.. అధికారులు ఆమోదించి టోకెన్లు జనరేట్ చేశారు. కానీ ఆర్థికశాఖ విధించిన ఆంక్షలతో నిధుల విడుదల చివరిదశలో నిలిచిపోయింది. ఆంక్షలు సడలించాకే నిధులు విడుదలవుతాయి. చెల్లింపుల్లో పెరుగుతున్న జాప్యం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చెల్లింపులు ఒక ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏదైనా విద్యా సంవత్సరం ముగియగానే.. ఆ ఏడాదికి సంబంధించిన నిధుల చెల్లింపుల ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత కాలంలో చెల్లింపుల్లో జాప్యం పెరిగింది. ప్రస్తుతం 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు దాదాపు 20 శాతం చెల్లించాల్సి ఉంది. 2021–22కు సంబంధించి 50 శాతం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా చెల్లింపులు మొదలుకాలేదు. -
తక్షణమే బకాయిలు విడుదల చేయాలి
చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.33,545 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నామని కేంద్ర నాయకులు గొప్పలు చెబుతున్నారని, అయితే ఆ నిధులన్నీ తమకు హక్కుగా వస్తున్న విషయా న్ని గమనించాలని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు, విభజన చట్టంలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రావాల్సిన రూ.1,350 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రాంట్ల రూపంలో రూ.723 కోట్లు, పౌష్టికాహారం కింద రూ.175 కోట్లు, స్టేట్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్ కింద ప్రతిపాదించిన రూ.3,024 కోట్లు, తెలంగాణకు బదులు పొరపాటున ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన రూ.497 కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక వేళ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. కృష్ణానది జలాల్లో వాటా తేల్చకుండా నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు కేంద్రం అన్యా యం చేస్తోందన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ చౌటుప్పల్ మండలం పంతంగిలో బుధవారం రాత్రి మంత్రి రోడ్ షో నిర్వహించారు. -
ఏపీనే రూ.4,774 కోట్లు బాకీ
సాక్షి, హైదరాబాద్: విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ తమకు రూ.4,774 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య సమసిన విద్యుత్ బకాయిల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ దాదాపు రూ.6వేల కోట్లు బకాయి ఉందంటూ హైకోర్టులో ఏపీ దాఖలు చేసిన పిటిషన్ను ఇటీ వల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సీజే జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం.. పిటిషన్ను అనుమతిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఏపీ జెన్కో, పెన్షన్ అండ్ గ్రాట్యు టీ ట్రస్ట్, ఏపీ విద్యుత్ డిపార్ట్మెంట్, ఏపీ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా ప్రతివాదులంతా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, 2022 జనవరి 31 నాటికి అసలు కింద రూ.2,698 కోట్లు, వడ్డీ కింద రూ.2,076 కోట్లు.. మొత్తంగా రూ.4,774 కోట్లు ఏపీ బాకీ ఉన్నట్లు తెలంగాణ పిటిషన్లో పేర్కొంది. -
ఎన్పీఏల విక్రయానికి ఎస్బీఐ రెడీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్ మొండిబకాయిలు(ఎన్పీఏలు)గా మారిన 12 ఖాతాలను విక్రయించే సన్నాహాల్లో ఉంది. తద్వారా రూ. 820 కోట్ల రుణాలను రికవర్ చేసుకోవాలని భావిస్తోంది. ఫైనాన్షియల్ ఆస్తుల విక్రయంపై బ్యాంకు విధానాల ప్రకారం నియంత్రణ సంస్థల నిబంధనలకులోబడి వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. మార్చి– ఏప్రిల్ 13 మధ్య విక్రయించేందుకు 12 ఎన్పీఏ ఖాతాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు(ఏఆర్సీలు), ఎన్బీఎఫ్సీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇవీ ఖాతాలు: ఎస్బీఐ విక్రయించనున్న ఎన్పీఏ ఖాతాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్వర్త్ ఉర్జా అండ్ మెటల్స్(దాదాపు రూ. 397 కోట్ల రుణాలు) ఖాతాను ఈ నెల 29న ఈఆక్షన్కు పెట్టనుంది. ఇందుకు రిజర్వ్ ధర రూ. 85 కోట్లుగా ప్రకటించింది. రూ. 186 కోట్ల బకాయిలుగల బాలసోర్ అలాయ్స్కు రూ. 178.2 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఈ బాటలో రూ. 122 కోట్ల బకాయిలుగల మరో ఆరు ఎన్పీఏ ఖాతాలను 30న ఈవేలం వేయనుంది. మిగిలిన నాలుగు ఎన్పీఏ ఖాతాలకు ఏప్రిల్ 13న వేలం నిర్వహించనుంది. వీటి మొత్తం బకాయిలు రూ. 125.3 కోట్లు. -
ఏఏఐకు ఎయిర్లైన్స్ బకాయిలు రూ.2,636 కోట్లు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల నిర్వహణ సంస్థ – ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఎయిర్లైన్స్ సంస్థలు స్పైస్జెట్, ఇండిగో, గోఫస్ట్, ఎయిరేషియా ఇండియా, ఎయిర్ ఇండియా, విస్తారా కలసి 2021 అక్టోబర్ చివరికి రూ.2,636 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఎయిర్ నేవిగేషన్, ల్యాండింగ్, పార్కింగ్ తదితర రూపాల్లో ఏఏఐకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏఏఐకు అత్యధిక బకాయిలు ఎయిర్ ఇండియానే చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి 1 నాటికి రూ.2,184 కోట్ల మేర ఎయిర్ ఇండియా చెల్లించాల్సి ఉంటే.. 2021 అక్టోబర్ చివరి నాటికి రూ.2,362 కోట్లకు పెరిగినట్టు ఏఏఐ అంతర్గత పత్రాలు తెలియజేస్తున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించడం తెలిసిందే. -
వ్యాపారంలో సొంత ఖర్చులా? అయితే చిక్కులు తప్పవు!
నేను చిరు వ్యాపారం చేస్తున్నాను. జీఎస్టీ నంబర్ ఉంది. స్వంత ఇంట్లోనే వ్యాపారం. నా స్వంత ఖర్చులను కూడా వ్యాపారపు ఖర్చుల్లో కలిపివేయవచ్చా. అలా కలపడం వల్ల లాభం తగ్గుతుంది కదా – ఆర్ చిట్టిబాబు, శ్రీకాకుళం చిరు వ్యాపారం అంటున్నారు.. కానీ జీఎస్టీ నంబరు ఉందంటున్నారు. సరే, సరిగ్గా అన్ని రికార్డులు నిర్వహించండి. స్వంత ఇంట్లోనే వ్యాపారం అన్నారు. ఇల్లు మీ పేరు మీదే ఉంటే అద్దె నిమిత్తం ఏ ఖర్చూ రాయకండి. ఇల్లు ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటే అద్దె ఖర్చుగా రాయవచ్చు. అది కూడా మొత్తం ఇంట్లో ఎంత భాగం అయితే వ్యాపారానికి కేటాయిస్తున్నారో, అంతకు మాత్రమే ఖర్చు చేయండి. అలాగే కరెంటు, నీరు ఖర్చు కూడా . ఇక వ్యాపార నిర్వహణలో కేవలం వ్యాపారానికి సంబంధించిన ఖర్చును మాత్రమే పరిగణిస్తారు. వ్యక్తిగత ఖర్చులు, సొంత వాడకాలు, ఇతర ఖర్చులు, క్యాపిటల్ ఖర్చులు మొదలైనవి పరిగణించరు. ఇటువంటి ఖర్చులను వ్యాపార ఖాతాలో రాయకండి. సొంత వాడకాలని కూడా విడిగా రాయాలి. ఖర్చుల విషయంలో ‘‘సమంజసం’’, ‘‘ఉచితం’’, ‘‘సంబంధం’’ అన్న సూత్రాలు వర్తిస్తాయి. పుస్తకాలు సరిగ్గా రాయండి. ఆడిట్ అవసరం కాకపోతే ఖర్చులు రాయకుండా అమ్మకాల మీద 8 శాతం కన్నా ఎక్కువ లాభం చూపించవచ్చు. అప్పుడు లెక్కల బెడద ఉండదు. ఏది ఏమైనా సొంత ఖర్చులు కలపకూడదు. నేను ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నాను. ఒక కోర్టు కేసు వల్ల గతంలో జీతం చెల్లించలేదు. 3 సంవత్సరాలకు సంబంధించిన బకాయీలు ఈ సంవత్సరం ఇస్తారు. దీని వల్ల నాకు పన్ను భారం పెరుగుతుందా? – యం. నాగమణి, రాజమండ్రి ఇలాంటి బకాయీలను ‘‘ఎరియర్స్’’ అంటారు. వీటిని ట్యాక్సబుల్ ఇన్కంగా పరిగణిస్తారు. అంటే ఈ అదాయం మీద పన్ను భారం ఉంది. అయితే, ఒక వెసులుబాటు కూడా ఉంది. ఏ సంవత్సరానికి తత్సంబంధమైన ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, మీరు తక్కువ/చిన్న శ్లాబులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ సంవత్సరానికి సంబంధించిన రాయితీలు, మినహాయింపులు తీసుకోవచ్చు. పన్నుభారం తక్కువ కావచ్చు. మీకు రెండు సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఎరియర్స్ని ప్రస్తుత సంవత్సరం ఆదాయంతో బాటు కలిపి పన్ను భారం లెక్కించండి. రెండో పద్ధతి ప్రకారంలో ఈ ఎరియర్స్.. ఆర్థిక సంవత్సరం ప్రకారం సర్దుబాటు చేయండి. గతంలో వచ్చిన జీతానికి ఈ ‘ఎరియర్స్’ భాగం కలిపి పన్ను భారం లెక్కించండి. అలా ఎన్ని సంవత్సరాలు వర్తిస్తుందో.. అన్ని సంవత్సరాలకు పన్నుభారం లెక్కించండి. ఆ తర్వాత అలా అన్ని సంవత్సరాల పన్ను భారం కలిపి మొత్తం పన్నుభారాన్ని కనుక్కోండి. ఇలా వచ్చిన మొత్తం పన్ను భారాన్ని ముందు/మొదట్లో లెక్కించిన పన్నుభారంతో పోల్చి చూడండి. ఏది తక్కువ ఉందో, అంతే చెల్లించండి. ఇలా తక్కువ చెల్లించడాన్ని 89 (1) రిలీఫ్ అంటారు. మీరే ఒక స్టేట్మెంట్ చేసుకుని ఫారం 10 ఉలో సమాచారాన్ని పొందుపర్చి, మీ యజమానికి ఇవ్వండి. రిలీఫ్ ఇస్తారు. ఒకవేళ ప్రస్తుత సంవత్సరంలోనే పన్నుభారం తక్కువగా ఉందనుకోండి. 10 ఉ ఇవ్వనవసరం లేదు. అన్ని రికార్డులు జాగ్రత్తగా భద్రపర్చుకోండి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూరి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
ఎయిరిండియా ఇంధన బకాయిలు బదిలీ
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాట పట్టిన ఎయిరిండియాకు చెందిన ఇంధన చెల్లింపులు తదితర బకాయిలు అనుబంధ సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్)కు బదిలీకానున్నాయి. రూ. 16,000 కోట్ల విలువైన ఇంధన బిల్లులు తదితరాలు పెండింగ్లో ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. చమురు కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, వెండార్లు తదితరాలకు బిల్లులు చెల్లించవలసి ఉన్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్లో భాగంగా ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్న సంగతి తెలిసిందే. కంపెనీ పగ్గాలను టాటా గ్రూప్నకు అప్పగించేముందుగానే బకాయిల బదిలీ జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఎయిరిండియాకు చెందిన కీలకంకాని ఆస్తులను ఎస్పీవీగా ఏర్పాటు చేసిన ఏఐఏహెచ్ఎల్కు బదిలీ చేసేందుకు గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఎయిరిండియా విక్రయానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది. భవనాలు, భూములు తదితర ఆస్తులతోపాటు ఎయిరిండియా రుణాలలోనూ 75 శాతంవరకూ ఎస్పీవీకి బదిలీ చేయనుంది. డిసెంబర్లోగా బ్యాలెన్స్ షీట్... ఎయిరిండియాను టాటా గ్రూప్నకు బదిలీ చేసే ముందు డిసెంబర్ నాటికి ప్రభుత్వం బ్యాలెన్స్షీట్ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మదింపులో ఇతర బకాయిలు(లయబిలిటీస్) ఏమైనా ఉంటే వీటిని సైతం ఏఐఏహెచ్ఎల్కు బదిలీ చేయనుంది. కాగా.. ఆగస్ట్ 31కల్లా ఎయిరిండియా రుణ భారం రూ. 61,562 కోట్లు. వీటిలో టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. మిగిలిన రూ. 46,262 కోట్ల రుణాలు ఏఐఏహెచ్ఎల్కు బదిలీ కానున్నాయి. సంస్కరణలకు సంకేతం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై సీఐఐ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో సంస్కరణల విషయంలో మార్కెట్లు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచి్చందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. బ్యాంకింగ్ విభాగంలో ప్రభుత్వం ఎంపిక చేసిన రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు సరైన సమయంగా అభిప్రాయపడింది. ‘‘ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎయిర్ ఇండియాను విజయవంతంగా విక్రయించడం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయమై ప్రతిష్టాత్మక ప్రణాళికకు తాజా ఉత్సాహాన్నిచి్చంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ప్రైవేటీకరణ ప్రణాళికలను ప్రభుత్వం అనుకున్నట్టుగా పూర్తి చేయగలదని, భవిష్యత్తు విక్రయాల్లో బిడ్డింగ్ను ప్రోత్సహించగలదన్న విశ్వాసాన్ని తాము కలిగించినట్టు చెప్పారు. -
టెల్కో కొనుగోలుపై ప్రభుత్వానికి ఆసక్తి లేదు
న్యూఢిల్లీ: బాకీలపై వడ్డీని కంపెనీలో వాటాల రూపంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ ఏ టెల్కోనూ కొనుగోలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని భారీ బకాయిల భారంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) ఎండీ రవీందర్ టక్కర్ తెలిపారు. టెలికం రంగంలో కనీసం మూడు ప్రైవేట్ సంస్థలైనా ఉండాలని, అవి మార్కెట్లో పోటీపడాలన్నదే కేంద్రం అభిప్రాయమని పేర్కొన్నారు. టెలికం సంస్కరణలను కేంద్రం ప్రకటించడానికి ముందు తాను ప్రభుత్వంలోని వివిధ వర్గాలతో సంభాషించానని ఆయన చెప్పారు. ఏ టెలికం కంపెనీని కొనుగోలు చేయాలని గానీ నిర్వహించాలని గానీ ప్రభుత్వానికి ఉద్దేశమేదీ లేదని ఆయా సమావేశాల్లో స్పష్టమైందని టక్కర్ తెలిపారు. -
ఆ కార్పొరేటర్ల బకాయిలు రూ. 40 లక్షలు
సాక్షి, ముంబై: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు తదితర కేసుల్లో అనర్హత వేటు పడిన పలువురు కార్పొరేటర్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి భారీగా బకాయిపడ్డారు. మొత్తం 12 మంది మాజీ కార్పొరేటర్లు రూ. 40 లక్షల మేర బకాయి పడ్డారని బీఎంసీ అకౌంట్స్ విభాగం తెలిపింది. వారిని వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. బీఎంసీకి బకాయి పడిన 12 మందిలో శివసేన పారీ్టకి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందినవారు ముగ్గురు, కాంగ్రెస్కు చెందిన ముగ్గురు, ఎన్సీపీకి చెందిన వారు ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పోటీచేసే అభ్యర్థులు టికెట్ దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఒక్కోసారి తాము గెలిచే అవకాశమున్న రిజర్వుడ్ వార్డుల నుంచి పోటీ చేసేందుకు తప్పుడు లేదా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమరి్పస్తారు. అలాంటి వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులుంటే పరిశీలిస్తారు. ఆ తరువాత ఆరోపణలు నిజమని తేలితే గెలిచిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేస్తారు. వారి స్థానంలో ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ, ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి నాలుగైదు నెలలు గడుస్తుంది. ఈ కాలవ్యవధిలో కార్పొరేటర్లు పొందిన వివిధ భత్యాలు, గౌరవ వేతనం తిరిగి బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ, గత ఎన్నికల్లో అనర్హత వేటు పడిన మొత్తం 24 మంది కార్పొరేటర్లలో 12 మంది ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. అనిల్ గల్గలే అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బీఎంసీ అకౌంట్స్ విభాగం నుంచి దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఈ బకాయిల విషయం బయటకు వచి్చంది. దీంతో బకాయిలు చెల్లించని ఆ 12 మంది మాజీ కార్పొరేటర్ల ఆస్తులు జప్తు చేయాలని అనిల్ గల్గలే బీఎంసీ కమిషనర్ ఇక్బాల్సింగ్ చహల్ను డిమాండ్ చేశారు. పేరు పార్టీ పార్టీ బకాయిలు(రూ. లక్షల్లో) ముర్జీపటేల్ బీజేపీ 5.64 కేశర్బేన్పటేల్ బీజేపీ 5.64 భావన జోబన్పుత్ర బీజేపీ 3.49 రాజపతి యాదవ్ కాంగ్రెస్ 5.64 కిణీ మారిస్ కాంగ్రెస్ 4.84 భారతీ ధోంగడే కాంగ్రెస్ 1.81 సుగుణ నాయిక్ శివసేన 3.55 అనుషా కోడం శివసేన 0.37 సునీల్ చవాన్ శివసేన 0.93 నాజీయా సోఫీ ఎన్సీపీ 7.21 చంగేజ్ ముల్తాని ఇండిపెండెంట్ 0.79 అంజుమ్ అస్లం ఇండిపెండెంట్ 0.45 -
బకాయిల కుప్పలు .. విద్యార్థులకు తిప్పలు
►రెండు సంవత్సరాలుగా నిధులు అందకపోవడంతో రూ.5.5 లక్షల అప్పు చేసి ఫీజు చెల్లించిన చైతన్యపురికి చెందిన పీజీ వైద్య విద్యార్థిని తండ్రి రెండు నెలలుగా హైదరాబాద్ బీసీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రభుత్వ పథకంపైనే ఆధారపడిన విద్యార్థులు అప్పులు చేసి కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. రెండేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. 2019–20 విద్యా సంవత్సరం బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. ఇక 2020–21కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. రెండేళ్లకు కలిపి మొత్తం రూ.3017.41 కోట్ల బకాయిలున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాలనూ ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. క్రమం తప్పకుండా జరగాల్సిన నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నిచోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందక పోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టతరంగా మారుతోందని యాజమాన్యాలు అంటున్నాయి. జాడలేని నెలవారీ నిధులు మూడేళ్ల క్రితం ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. మొదట్లో ప్రతి విద్యా సంవత్సరం చివర్లో నిధులను మంజూరు చేసేవారు. అయితే పెద్దమొత్తంలో నిధులు ఒకేసారి విడుదల చేయడం భారంగా మారుతుండటంతో నెలవారీగా నిధులు విడుదల చేయాలని భావించింది. సాధారణ, వృత్తి విద్యా కోర్సులకు వేరువేరుగా పద్దుల కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించి చర్యలు చేపట్టింది. తొలి రెండు మూడు నెలలు నిధుల విడుదల సాఫీగా జరిగినప్పటికీ.. ఆ తర్వాత క్రమం తప్పింది. దీంతో బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. దీంతో రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు పలు కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడితో తామే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాల్సి వస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత.. చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. జూనియర్ విద్యార్థుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తుండటంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇలా ఫీజులు చెల్లించినవారు సంక్షేమ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదనే సమాధానం ఎదురవుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు. వనపర్తి జిల్లా గోపాల్పేట హరిజనవాడకు చెందిన లావణ్య అనే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక గతనెల 19న బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. దరఖాస్తులు పరిశీలనకే పరిమితం... 2020–21 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలకు సంబంధించి 12.85 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగింది. దాదాపుగా నూరు శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ మొదలైన నెల రోజుల తర్వాత నుంచి వాటి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కావాలి. అయితే కోవిడ్–19 నేపథ్యంలో పరిశీలన ఆలస్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిశీలన ప్రారంభించిన సంక్షేమాధికారులు ఇప్పటివరకు 80 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాల కోసం రూ.2,250 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అయినా ఇప్పటివరకు అటు ఫీజు రీయింబర్స్మెంట్కు గానీ, ఉపకార వేతనాలకు కానీ నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. ఇక 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా రూ.767.41 కోట్ల మేర బకాయి ఉంది. వీటికి సంబంధించి సంక్షేమ శాఖ అధికారులు బిల్లులు సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. తక్షణమే నిధులు విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయమై ఆర్థిక మంత్రితో సహా పలువురికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. ఇతర పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థులకు బకాయి పడ్డ నిధులను ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం దిక్కుతోచని స్థితిలో కాలేజీలు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్పైనే ఆధారపడి ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చదువుతున్న వాళ్లు 85 శాతం ఉన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. అప్పులు చేసి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ఏకంగా కాలేజీలనే మూసేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. – గౌరి సతీష్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం -
విధాన నిర్ణయాల్లో... మా జోక్యం ఉండదు
న్యూఢిల్లీ: విధానపరమైన నిర్ణయాల్లో తమ జోక్యం ఉండబోదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకులు రుణ అకౌంట్లను మొండిబకాయిలుగా (ఎన్పీఏ) ప్రకటించడాన్ని నిలుపుచేస్తూ తాను ఇచ్చిన స్టేను మార్చి 23వ తేదీన సుప్రీంకోర్టు తొలగించింది. అయితే ఎన్పీఏగా ప్రకటించడానికి సంబంధించి మరిన్ని అంశాలను సమీక్షించాలని దాఖలైన తాజా పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం ఉండబోదని పేర్కొంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఇప్పటికే వచ్చిన తీర్పులో పేర్లు, సంబంధిత పొరపాట్లు ఏదైనా జరిగితే సవరణలకు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయవచ్చు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అలాంటి అంశాలు ఏవీ లేవు. దీనిని మేము విచారించలేము’’ అని డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది. దీనితో ఈ అప్లికేషన్ ఉపసంహరణకు న్యాయవాది ధర్మాసనం అనుమతి కోరారు. దీనికి బెంచ్ అంగీకరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణ చెల్లింపులపై గత ఏడాది ఆగస్టు 31 వరకూ 6 నెలల పాటు ఆర్బీఐ మారటోరియం విధించింది. ఈ కాలంలో బ్యాంకింగ్ చక్రవడ్డీ వసూళ్లపై జరిగిన విచారణ సందర్భంగా సెప్టెంబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇస్తూ, ఆగస్టు 31 వరకూ మొండిబకాయిలుగా ప్రకటించిన ఖాతాలను తన తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ యథాతథంగా కొనసాగించాలని పేర్కొంది. ఇరు పక్షాల వాదనల అనంతరం ఈ స్టేను వెకేట్ చేస్తూ, ఈ ఏడాది మార్చి 23న తీర్పును ఇచ్చింది. అలాగే మారటోరియం కాలంలో చక్రవడ్డీ తగదనీ ఆదేశా లు ఇచ్చింది. దీనితో తీర్పునకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అప్పటికే వసూలు చేసిన వడ్డీ మొత్తాలను రిఫండ్ చేసేలా లేదా రుణ అకౌంట్ల తదుపరి వాయిదాల్లో సర్దుబాటు జరిగేలా బ్యాంకింగ్కు ఆదేశాలిచ్చింది. -
ఆ విద్యార్థులకు షాక్.. తప్పక పరీక్ష రాయాల్సిందే!
సాక్షి, చెన్నై: పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన ‘అరియర్స్’ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సైతం షాక్ ఇచ్చింది. ఆల్పాస్ ఉత్తర్వుల నుంచి యూటర్న్ తీసుకుంది. అరియర్స్ విద్యార్థులందరూ పరీక్షలు రాయాల్సిందేనని ప్రకటించింది. ఇందుకు తగ్గ నివేదిక గురువారం మద్రాసు హైకోర్టుకు చేరింది. కరోనా విలయతాండవంతో గత విద్యా సంవత్సరం జరగాల్సిన ప్లస్టూ మినహా, తక్కిన అన్ని పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. పది విద్యార్థులకు ఆల్పాస్ ప్రకటించారు. అదే తరహాలో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు మినహా, తక్కిన సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసి తర్వాత సంవత్సరానికి ప్రమోట్ చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా, అనేక సబ్జెక్టుల్లో ఫెయిలై ఏళ్ల తరబడి అరియర్స్ను భుజాన వేసుకుని ఉన్న విద్యార్థులకు ఊరట కల్గించే రీతిలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఆల్పాస్ ప్రకటన చేయడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టు చేరింది. విచారణ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఏఐసీటీఈ తీవ్రంగా ఖండించింది. ఇది తమ నిబంధనలకు విరుద్ధమని యూజీసీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని అరియర్స్ విద్యార్థులు ఎదురుచూశారు. ఆల్ పాస్ ప్రకటన సమయంలో పాలక వర్గాన్ని ఆకాశానికి ఎత్తేసిన ఈ విద్యార్థులకు తాజాగా షాక్ తప్పలేదు. పరీక్ష రాయాల్సిన పరిస్థితి. అయితే, ఇది నామమాత్రంగా ఉంటుందా వేచి చూడాల్సిందే.? ఆన్లైన్లో పరీక్ష.. తమ నిర్ణయాన్ని సమర్థించుకునే రీతిలో కోర్టులో వాదన వినిపిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా యూటర్న్ తీసుకుంది. ఓ వైపు ఏఐసీటీఈ, మరో వైపు యూజీసీ, ఇంకో వైపు కోర్టు రూపంలో వ్యతిరేకత , అక్షింతలు ఎదురుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం తగ్గాల్సిన పరిస్థితి. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ విజయనారాయన్ హాజరై నివేదికను సమర్పించారు. అందులో అరియర్స్ విద్యార్థుల ఆల్ పాస్ ఉత్తర్వులను వెనుక్కి తీసుకుంటూ, పరీక్ష నిర్వహించన్నుట్టు ప్రకటించారు. అరియర్స్ విద్యార్థులందరికి ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నామని వివరించారు. ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులే ఉత్తీర్ణతకు అర్హులు అవుతారని ప్రకటించారు. పరీక్షల నిర్వహణ తేదీలను ఆయా విశ్వవిద్యాలయాలు ప్రకటిస్తాయని పేర్కొంటూ, యూజీసీ వర్గాలతో మరో మారు సంప్రదింపులు జరిపి సజావుగా అన్ని వ్యవహరాలు సాగే రీతిలో చర్యలు తీసుకుంటామని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ, ఆన్లైన్లో పరీక్షల నిర్వహణకు ఎనిమిది వారాలు సమయం ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతలోపు అన్ని ప్రక్రియలు ముగించి కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలైకు వాయిదా వేశారు. చదవండి: ఈ వైద్యురాలు తన శ్వాసతో పసి ప్రాణాన్ని కాపాడింది -
బకాయిల బండ!
సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తి కంపెనీలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిల భారం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి పోర్టల్ (https: //praapti.in) ప్రకారం 2019 డిసెంబర్ నాటికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,860 కోట్లు ఉండగా 2020 డిసెంబర్ నాటికి అవి రూ. 7,101 కోట్లకు ఎగబాకాయి. తెలంగాణ జెన్కోతోపాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఈ జాబితాలో పొందుపర్చలేదు. అవి రెండూ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయడం లేదు. జెన్కో, సింగరేణిలకు చెల్లించాల్సిన బకాయిలు కలిపితే డిస్కంల మొత్తం బకాయిలు రూ. 10 వేల కోట్లకుపైనే ఉండనున్నాయి. ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ ఎన్టీపీసీ, జెన్కో వంటి ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు పలు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు భారీ ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వంటి అన్ని ఖర్చులు కలిపి విద్యుత్ సరఫరాకు అవుతున్న వాస్తవ వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్)తో పోల్చితే వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్ల ద్వారా పొందుతున్న ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉండటంతో డిస్కంలు ప్రతి నెలా రూ. 200 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్పై 0.93 పైసల చొప్పున డిస్కంలు నష్టపోతున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న ‘ఉదయ్’పోర్టల్ పేర్కొంటోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విద్యుత్ సబ్సిడీలు పూర్తిస్థాయిలోఆదాయ లోటును పూడ్చటంలో విఫలం కావడంతో డిస్కంలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నష్టాల కారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపలేకపోతున్నాయి. దీంతో క్రమేణ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. గత డిసెంబర్ నాటికి డిస్కంలు వివిధ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) విద్యుదుత్పత్తి కంపెనీ డిస్కంల బకాయిలు సీఎల్పీఐ 171.73 ఐటీపీసీఎల్ 9.53 ఎన్ఎల్సీఐఎల్ 492.11 ఎన్టీఈసీఎల్ 248.55 ఎన్టీపీసీ 1,723.97 ఎన్టీపీఎల్ 418.65 ఎస్ఈఎంబీ 2,532.22 సంప్రదాయ విద్యుత్ బకాయిల మొత్తం: 5,596.76 సంప్రదాయేతర విద్యుత్ బకాయిలు: 1,504.57 మొత్తం బకాయిలు: 7,101 ‘కో–ఆర్డినేషన్’కమిటీపై బకాయిల భారం.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 478.86 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 1,335.16 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) రూ. 5,287.31 కోట్లు కలిపి డిస్కంలు మొత్తం రూ. 7,101.33 కోట్లను విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిపడ్డాయి. అత్యధిక శాతం విద్యుత్ కొనుగోళ్లను టీఎస్పీసీసీ ఆధ్వర్యంలో జరుపుతుండటంతో అత్యధిక బకాయిలు సైతం దీని పేరిటే ఉన్నాయి. ట్రాన్స్కో సీఎండీ డి. ప్రభాకర్రావు చైర్మన్గా ఉన్న టీఎస్పీసీసీ డిస్కంల తరఫున విద్యుత్ కొనుగోళ్లు, జనరేటర్లకు బిల్లుల చెల్లింపుల వంటి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. నెలవారీగా జనరేటర్లకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) 2020 బకాయిలు జనవరి 6,153 ఫిబ్రవరి 6,385 మార్చి 6,039 ఏప్రిల్ 6,494 మే 7,143 జూన్ 7,443 జూలై 4,755 ఆగస్టు 4,872 సెప్టెంబర్ 5,485 అక్టోబర్ 6,096 నవంబర్ 6,655 డిసెంబర్ 7,101 కేంద్రం మెట్టు దిగితేనే.. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలకు ఆత్మనిర్భర్ రుణాలను ప్రకటించింది. తెలంగాణ డిస్కంలకు ఆర్ఈసీ, పీఎఫ్సీల నుంచి రూ. 12,600 కోట్ల రుణాలు మంజూరవగా 50 శాతం రుణాలను తొలి విడత కింద విడుదల చేశారు. రెండో విడత రుణాల విడుదలకు విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదిస్తున్న సంస్కరణల అమలుకు అంగీకరిస్తేనే మిగిలిన రుణాలను విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంటోంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల అమలును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మెట్టుదిగి రుణాల విడుదలకు అంగీకరిస్తేనే డిస్కంలు బకాయిల భారం నుంచి బయటపడనున్నాయి. -
ప్రభుత్వం ఆదుకోకపోతే బ్యాంకింగ్కు కష్టాలే..
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక మొండి బకాయిల (ఎన్పీఏ) భారం మోస్తున్న భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్కు కేంద్రం సహాయక చర్యలు అందకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన నలుగురు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఒక పుస్తకంలో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. ‘మహమ్మారి: భారత ఘన బ్యాంకింగ్ కష్టాలు’ పేరుతో పబ్లిషింగ్ హౌస్– రోలీ బుక్స్ ఆవిష్కరించనున్న పుస్తక రచనలో భాగంగా రచయిత, ప్రముఖ పాత్రికేయులు తమల్ బందోపాధ్యాయ నలుగురు గవర్నర్లను ఇంటర్వ్యూ చేశారు. అసలు మొండిబకాయిల సమస్యలకు కారణాలపై గవర్నర్లు విభిన్నంగా స్పందించినప్పటికీ బ్యాంకింగ్ విలీనాలు, పరిపాలనా, బ్యాంకుల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంపై ఒకే విధంగా స్పందించడం గమనార్హం. విలీనాలు, భారీ బ్యాంకింగ్ ఏర్పాటుతో సమస్య తీరిపోదని వారు పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు తగ్గాలని, పాలనా వ్యవస్థ మెరుగుపడాలనీ సూచించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ ఇంటర్వ్యూల్లో నలుగురు గవర్నర్లూ ఏమన్నారంటే... అత్యుత్సాహమూ కారణమే కంపెనీల భారీ పెట్టుబడులు, రుణాలు అందించడంలో బ్యాంకర్ల అత్యుత్సాహం ఎన్పీఏలు భారీగా పెరిగిపోడానికి కారణమయ్యాయి. ఆర్థిక మందగమనం మొండిబకాయిల తీవ్రతకు ఒక కారణం అయితే, సత్వర చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కూడా సమస్యను మరింత జఠిలం చేసింది. మొండిబకాయిల సత్వర గుర్తింపు, తగిన భారీ మూలధన కల్పన, బ్యాంకింగ్ పాలనా వ్యవస్థ పటిష్టం తక్షణం అవసరం. ఈ దిశలో చర్యలు ఉండాలి. – డాక్టర్ రఘురామ్ రాజన్ (గవర్నర్గా.. 2013–2016) అతి పెద్ద సమస్య అవును. భారత్ బ్యాంకింగ్ మొండిబకాయిలు భారీ, వాస్తవ సమస్య. ఈ సమస్య సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు మహమ్మారితో మరింత విషమించాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందే ప్రారంభమైన మొండిబకాయిల సమస్య, అటు తర్వాతా కొనసాగింది. కొన్ని అననుకూల పాలనాపరమైన సమస్యల వల్ల మొండిబకాయిలను తరువాత అదుపుచేయలేకపోవడం చోటుచేసుకుంది. – దువ్వూరి సుబ్బారావు (బాధ్యతల్లో.. 2008–2013) ఇతర ఇబ్బందులకూ మార్గం బ్యాంకుల్లో ఉన్న మొండిబకాయిల సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు. ఇతర సమస్యలకూ ఇది దారితీస్తుంది. బలహీన ఫైనాన్షియల్ పరిస్థితులు, మొండిబకాయిలు వాస్తవ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. రుణాల పెంపునకు వచ్చిన ఒత్తిడులు కూడా మొండిబకాయిల భారానికి కారణం. 2015–16 రుణ నాణ్యత సమీక్ష తరువాత ఆర్థిక వ్యవస్థ విస్తృతమయినప్పటికీ, రుణాల్లో వృద్ధి లేకపోవడం ఇక్కడ గమనార్హం. – వై. వేణుగోపాల్ రెడ్డి (విధుల్లో.. 2003–2008) పెద్ద నోట్ల రద్దు... సంక్షోభం! బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ‘ప్రణాళికా బద్దంగా జరగని’’ నోట్ల రద్దుతో మరింత తీవ్రమయ్యాయి. నోట్ల రద్దు ఒక ఆర్థిక సంక్షోభంగా పేర్కొనవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యకు ఈ వ్యవస్థమాత్రమే కారణం కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. పాలనాపరమైన లోపాలను సవరించడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని ఒక గాడిన పెట్టడం సాధ్యమవుతుంది. – సీ. రంగరాజన్ (పదవీకాలం..1992–1997) -
బాకీ మొత్తం కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల విషయంలో కేంద్రం, టెల్కోలకు సుప్రీం కోర్టు తలంటింది. ఈ అంశాన్ని టెల్కోలు సాగదీస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. నిర్దేశిత బాకీలు మొత్తం కట్టి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. స్వీయ మదింపులు, బకాయిల పునఃసమీక్ష లాంటివి కుదరదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాకీల చెల్లింపునకు టెలికం సంస్థలకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కేంద్రం వేసిన పిటిషన్ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా తో కూడిన బెంచ్ బుధవారం తిరస్కరించింది. రెండు వారాల తర్వాత దీన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ‘20 ఏళ్ల వ్యవధి ఇవ్వడమనేది అసమంజసం. తీర్పులో పేర్కొన్నట్లుగా టెలికం కంపెనీలు బాకీలన్నీ తీర్చాల్సిందే‘ అని స్పష్టం చేసింది. వడ్డీలు, జరిమానాలపై టెలికం కంపెనీలు, ప్రభుత్వం వాదోపవాదాలన్నీ విన్న మీదటే ఏజీఆర్ బాకీలపై తీర్పునిచ్చామని, అన్ని పక్షాలు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. ఆ అధికారులను పిలిపిస్తాం.. ఏజీఆర్ బాకీలపై టెలికం కంపెనీలు స్వీయ మదింపు చేపట్టడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన తర్వాత కూడా ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటివి కలలో కూడా ఊహించలేనివంటూ వ్యాఖ్యానించింది. స్వీయ మదింపు ప్రక్రియ చేపట్టేందుకు టెల్కోలను అనుమతించిన టెలికం శాఖ కార్యదర్శి, డెస్క్ ఆఫీసర్లను పిలిపిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. స్వీయ మదింపు పేరుతో టెలికం కంపెనీలు తీవ్రమైన మోసానికి పాల్పడుతున్నాయని ఆక్షేపించింది. ఏజీఆర్ బాకీల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పే అంతిమమని, దాన్ని తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. టెల్కోల చీఫ్లకు హెచ్చరిక.. టెల్కోలు తమకు అనుకూలంగా వార్తాపత్రికల్లో కథనాలు రాయించుకుంటున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇలాంటి కథనాలు తమ తీర్పును ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. ఏజీఆర్ బాకీలపై సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ’తప్పుడు వార్తలు’ ప్రచురిస్తే టెలికం కంపెనీల ఎండీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్వీయ మదింపుతో భారీ వ్యత్యాసం.. ఏజీఆర్ బాకీలకు సంబంధించి డాట్ చెబుతున్న దానికి టెల్కోల స్వీయ మదింపునకు మధ్య ఏకంగా రూ. 82,300 కోట్ల వ్యత్యాసం ఉంది. డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్, టెలినార్వి కలిపి రూ. 43,980 కోట్లు, వొడాఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్ సంస్థలు రూ. 16,798 కోట్లు చెల్లించాలి. అయితే, ఆయా టెల్కోలు జరిపిన స్వీయ మదింపు లెక్కల ప్రకారం.. భారతి గ్రూప్ రూ.13,004 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.21,533 కోట్లు, టాటా గ్రూ ప్ సంస్థలు రూ.2,197 కోట్లు కట్టాల్సి ఉంటుంది. -
నరేగా బకాయిలు విడుదల చేయండి : విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద రాష్ట్రానికి రావలసిన రూ.2,246 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ఆయన మాట్లడుతూ... ఏడాదిలో వంద రోజులపాటు వేతనంతో కూడిన పని కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకం వలన వేలాది కుటుంబాలకు జీవనోపాధి భద్రత కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ప్రధానమైన ఆదాయ వనరుగా మారిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలను కొన్ని నెలలపాటు దుర్బిక్షం వెంటాడింది. ఆ తర్వాత అంతే స్థాయిలో ఎడతెగని వర్షాలు ముంచెత్తాయన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలు నెలల తరబడి వరదలతో సతమతమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ఆదాయమే దిక్కయిందని పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు కేంద్రం నుంచి ఈ పథకం కింద విడుదల కావలసిన నిధులు సకాలంలో అందకపోవడంతో ఈ పథకం కింద డిమాండ్కు తగిన విధంగా పనులు కల్పించేలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి హామీ కింద పని చేసే కూలీలకు వేతనం 100 శాతం కేంద్ర నిధుల నుంచే చెల్లిచడం జరుగుతుంది. మెటీరియల్ ఖర్చుతో పాటు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్ల వేతనాల కింద చేసే ఖర్చులో కేంద్రం 75 శాతం భరిస్తుంది. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెటీరియల్, పాలనా చెల్లింపుల పద్దు కింద చెల్లించాల్సిన రూ. 2,246 కోట్ల రూపాయలను విడుదల చేయలేదన్నారు. ఈ నిధులను కేంద్రం బకాయి పెట్టడం వలన ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు పనులు కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు మొత్తాన్ని సత్వరమే విడుదల చేయవలసిందిగా విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. -
మా డబ్బెక్కడ సీఎంసారూ!
ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.5,000 కోట్ల దాకా బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది. ఫీజుల పథకానికి అర్హులైన విద్యార్థుల సంఖ్య 16 లక్షల దాకా ఉంది. పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి దిక్కు తోచటం లేదు. రాష్ట్రంలో అంగన్వాడీలకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో దాదాపు రూ.50 కోట్ల దాకా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు మరో రూ.10 కోట్ల దాకా కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. సాక్షి, అమరావతి: ఒకపక్క సొంత ప్రచారం, ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక విమానాలు, ఓట్ల పథకాల కోసం డబ్బులు కుమ్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అత్యవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ డబ్బులను కూడా ఇవ్వకపోవడంతో పిల్లల చదువులు, వివాహాలు, ఇంటి కొనుగోలు లాంటివి తలపెట్టిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కష్టార్జితం డబ్బులను చెల్లించకుండా అవస్థలకు గురి చేస్తున్న టీడీపీ సర్కారు ఓట్ల పథకాలు, ప్రచారం కోసం నిధులను మళ్లిస్తుండటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత నెల రోజులుగా అన్ని రకాల బిల్లులను నిలుపుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించిన ఓట్ల పథకాలు, ఇతర కమీషన్లు వచ్చే వాటికి మాత్రమే చెల్లింపులు చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికశాఖ రెగ్యులర్గా ఇవ్వాల్సిన బిల్లులను కూడా చెల్లించకుండా ముఖ్యమంత్రి చెప్పినట్లు రాజకీయ అవసరాలకే నిధులు విడుదల చేయడం ఎప్పుడూ చూడలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అన్ని రకాలకు చెందిన దాదాపు రూ.15,000 కోట్ల మేరకు బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జీవోలతో సరి.. ఉద్యోగుల భవిష్య నిధికి ప్రతి నెలా వారి వేతనాలను నుంచి కొంత మొత్తాన్ని జమ చేస్తారు. దీన్ని పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం ఉద్యోగులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకు ఆర్థికశాఖ అనుమతితో జీవోలు జారీ చేస్తారు. అయితే జీవోలు జారీ అవుతున్నా ఈ బిల్లులను ట్రెజరీల్లో పాస్ చేయకపోవడంతో అత్యవసరాల కోసం దాచుకున్న డబ్బులు అక్కరకు రావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బిల్లులు వందల సంఖ్యలో ఉంటాయని ఒక్కో బిల్లు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటికి చెల్లింపులను నిలిపివేస్తూ ఎన్నికల ముందు ప్రకటించిన ఓట్ల పథకాలకు అప్పులు చేసి మరీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల వాటా డబ్బులు మళ్లింపు! ప్రభుత్వ ఉద్యోగులకు వందల సంఖ్యలో మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులను కూడా ఆర్థికశాఖ నిలిపివేసింది. మరోపక్క నగదురహిత వైద్య చికిత్స కోసం తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన రూ.400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇన్సూరెన్స్ సంస్థకు జమ చేయలేదు. ఉద్యోగుల వాటా సొమ్ముతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా మరో రూ.400 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల వాటా సొమ్మును జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో నగదు రహిత వైద్య సేవలు అందడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులకు అత్యవసర మందుల కోసం ఇవ్వాల్సిన రూ.180 కోట్లను కూడా పెండింగ్లో పెట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏకంగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పలుకుబడి కలిగిన వారికి మాత్రమే ఈ బిల్లులను చెల్లిస్తున్నారు. పేదలకు చిల్లిగవ్వ కూడా విదల్చకపోవడంతో వైద్య ఖర్చులు పెనుభారంగా పరిణమించాయి. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.600 కోట్ల బకాయిలను కూడా ఇవ్వకుండా ఆర్థికశాఖ నిలుపుదల చేసింది. ఉపాధి కూలీలకు బకాయి రూ.360 కోట్లు కేంద్ర నిధులతో అమలయ్యే ఉపాధిహామీ పథకం కింద పనిచేసే కూలీలకు కూడా రోజు వారీ కూలీ డబ్బులను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం గమనార్హం. ఉపాధి హామీ కూలీలకు రూ.360 కోట్ల మేరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. కూలీలకు వేతనాలు చెల్లించేందుకు నిధులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ఆర్థికశాఖకు విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్టు లెక్చరర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, పోలీసులకు మొండిచెయ్యి...యూనివర్శిటీ కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిలిపివేశారు. అసెంబ్లీలో ఔట్సోర్సింగ్పై పని చేస్తున్న ఉద్యోగులకు కూడా గత మూడు నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. పోలీసులకు టీఏ, డీఏ బిల్లులతోపాటు ఆర్జిత సెలవుల బిల్లులను కూడా చెల్లించకుండా నిలుపుదల చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి చెందిన వస్తువులకు బిల్లులను కూడా ఇవ్వకుండా నిలుపుదల చేశారు. ‘పసుపు–కుంకుమ ఈవెంట్’కు రూ.32 కోట్లు! డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ పేరుతో ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించిన పోస్ట్ డేటెడ్ చెక్కుల పంపిణీ ఈవెంట్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.32 కోట్లు వ్యయం చేయడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. రోజువారీ కూలీలకు వేతనాలు ఇవ్వకుండా నిలిపివేస్తూ ఈవెంట్ల పేరుతో కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎలా బతకాలి? మూడు నెలలుగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆయాలకు ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలకు సుమారు రూ. 50 కోట్ల దాకా వేతన బకాయిలున్నాయి. కిరాణా సరుకుల బిల్లులు ఏడాదిగా రూ.కోట్లలోనే పెండింగ్లో ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు సుమారు రూ.10 కోట్ల వరకు అద్దె బకాయిలు చెల్లించాలి. అంగన్వాడీ కార్యకర్తలు తమ సొంత డబ్బులతో అద్దెలు కడుతున్నారు. వాళ్లంతా ఎలా బతకాలి? వెంటనే జీతాల బకాయిలు చెల్లించకుంటే మరోసారి ఆందోళన చేపడతాం. – కె.సుబ్బరావమ్మ (అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి) సెప్టెంబర్ నుంచి పెన్షన్ రావాలి... నేను గత జూలైలో రిటైర్ అయ్యా. పెన్షన్ ఆగస్టు నెలకు సంబంధించి మాత్రమే ఇప్పటి వరకు వచ్చింది. సెప్టెంబర్ నుంచి పెన్షన్ మంజూరు కావాల్సి ఉంది. – నాగభూషణం (రిటైర్డ్ తహసీల్దార్, విశాఖపట్నం) కూలీల పొట్టకొడుతోంది.. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ కూలీల వేతనాలను చెల్లించకుండా పెడింగ్లో పెట్టింది. రాయలసీమతోపాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 90 శాతం కరువు మండలాలున్నాయి. ఇక్కడ 150 రోజులు పని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు నెలలుగా రూ.360 కోట్ల మేర కూలీ బకాయిలను చెల్లించకపోవడంతో పొట్టకూటి కోసం 12 లక్షల మంది వలస వెళ్లారు. ఉపాధి హామీ నిధులను ఏకంగా స్టేడియంల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం దారుణం. – వి.వెంకటేశ్వర్లు (రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి) నెల రోజులైనా పీఎఫ్ డబ్బులు అందలేదు.. చిత్తూరు జిల్లా సవరంబాకం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నా. అనారోగ్యంతో ఉన్న మా చిన్నమ్మ వైద్య చికిత్స కోసం పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుని నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు అందలేదు. – ఎన్ లింగయ్య, హెచ్ఎం, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా. దాచుకున్న డబ్బులపైనా ఆంక్షలా అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేందుకు వీలుగా ఉద్యోగులు దాచుకునే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణం. ఆరు నెలలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాఖలు చేసుకున్న దరఖాస్తులను నిలిపివేయడంతో తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. వైద్య సేవల కోసం ఉద్యోగులు ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా బీమా కంపెనీకి కట్టకుండా దారి మళ్లించడంతో ఆస్పత్రుల్లో చికిత్స అందడం లేదు. –వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు) ఫ్రీజింగ్తో ఆగాయంటున్నారు.. కుటుంబ పరిస్థితుల వల్ల దాదాపు ఏడేళ్ల సర్వీసును వదులుకుని గతేడాది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా. గ్రాట్యూటీ, పెన్షన్ బిల్లు పాస్ అయ్యాయి. మిగిలిన బిల్లులు పాస్ కాలేదు. ఫ్రీజింగ్ వల్ల ఆగిపోయాయంటున్నారు. నాకు దాదాపు రూ.ఐదారు లక్షల వరకు రావాల్సి ఉంది. – సూర్యప్రకాశరావు (రిటైర్డ్ ఏఓ, విశాఖపట్నం) -
రీడ్ అండ్ టేలర్ లిక్విడేషన్ నిలిపివేత
ముంబై: ఖరీదైన సూట్లు, జాకెట్లు విక్రయించే రీడ్ అండ్ టేలర్ కంపెనీ లిక్విడేషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిలిపేసింది. రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తామని, దానిని తమకు అప్పగించాలని ఉద్యోగుల సంఘం చేసిన అభ్యర్థనను ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం మన్నించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ కంపెనీ బకాయిలు రూ.4,100 కోట్ల మేర ఉన్నాయని, కానీ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు మాత్రమేనని, లిక్విడేషన్ చేపడితే రుణ దాతలకేమీ రాదని, ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత, అధిక ధరలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సంఘానికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొంది. కంపెనీలో మొత్తం 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మైసూర్లో ప్లాంట్ ఉంది. ఈ కంపెనీ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు జేమ్స్బాండ్ పాత్రధారి పియర్స్ బ్రాస్నన్, అమితాబ్ బచ్చన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ఎడెల్వీస్ వ్యాజ్యంతో ఎన్సీఎల్టీకి కస్లివాల్ కుటుంబానికి చెందిన ఎస్ .కుమార్ గ్రూప్ రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఖరీదైన సూట్లు, జాకెట్లు, ట్రౌజర్లు, షర్ట్లు, టి–షర్ట్లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ బ్యాంక్లకు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.4,100 కోట్ల మేర బకాయిలు పడటంతో వీటి వసూళ్లకు గాను ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఎడెల్వీజ్ ఏఆర్సీ ఎన్సీఎల్టీలో ఒక కేసు వేసింది. ఎనిమిది కంపెనీలు రిజల్యూషన్ ప్రణాళికలను సమర్పించినప్పటికీ, అవేవీ సంతృప్తికరంగా లేకపోవడంతో రుణదాతల కమిటీ లిక్విడేషన్కు సిఫార్సు చేసింది. ఫైన్క్వెస్ట్కే అధిక భారం... రీడ్ అండ్ టేలర్ కంపెనీ నుంచి ఫైన్క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీకి అధికంగా రూ.800 కోట్ల మేర రావలసి ఉంది. యూనియన్ బ్యాంక్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ తదితర సంస్థలకు ఈ సంస్థ భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
కెనరా బ్యాంక్ లాభం రూ.300 కోట్లు
బెంగళూరు: కెనరా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 15 శాతం పెరిగి రూ.300 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కెనరా బ్యాంక్ తెలియజేసింది. ఆదాయం 6 శాతం పెరిగి రూ.12,679 కోట్లకు చేరుకుంది. రుణాలు 14 శాతం వృద్ధి చెందాయని, గత క్యూ2లో 11.05 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 10.56 శాతానికి తగ్గాయని బ్యాంకు పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు 6.91 శాతం నుంచి 6.54 శాతానికి తగ్గాయని వివరించింది. సిండికేట్ బ్యాంక్ నష్టాలు రూ.1,543 కోట్లు ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్కు రెండో త్రైమాసికంలో రూ.1,543 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత క్యూ2లో రూ.105 కోట్ల నికర లాభం వచ్చిందని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు బాగా పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,419 కోట్ల నుంచి రూ.5,889 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో 9.39 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 12.98 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 5.76 శాతం నుంచి 6.83 శాతానికి పెరిగాయి. -
అప్పుడు గొప్పలు.. ఇప్పుడు తిప్పలు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. మార్చి 28న ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ అంటూ ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శిద్దా.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చైర్మన్గిరి ముళ్ల కిరీటమంటూ డెయిరీ గేటు తొక్కడం మానుకున్నారు. 10 రోజులుగా పత్తా లేకుండాపోయారు. చైర్మన్గా ఎంపికైన నాడు శిద్దా ఆర్భాటంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. పాడి రైతులకు, డెయిరీ ఉద్యోగులకు రూ.20 కోట్లు సొంత డబ్బులు చెల్లిస్తున్నానంటూ ప్రకటించారు. డెయిరీని ముందుకు నడిపిస్తానంటూ గొప్పలు చెప్పారు. డెయిరీ లాభాల్లోకి వచ్చిన తర్వాతే తమ అప్పును జమ వేసుకుంటానని ప్రకటించారు. డెయిరీ ముందుకు నడిపించేవారు వచ్చారని పాడి రైతులు, ఉద్యోగులు ఒకింత సంబరపడ్డారు. నెల రోజులు గడవక ముందే ఆ ఆశలు ఆవిరయ్యాయి. వ్యాపారస్తుడైన శిద్దా యూటర్న్ తీసుకున్నారు. పైసా చెల్లించకపోగా డెయిరీ వైపు తొంగి చూడటం లేదు. ఏం చేయాలో పాలుపోక డెయిరీ ఉద్యోగులు, పాడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంగళవారం డెయిరీలో సమావేశమైన ఉద్యోగులు ఎండీకి అల్టిమేటం జారీ చేశారు. తక్షణం న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు డెయిరీ డైరెక్టర్లు బుధవారం సమావేశమవుతున్నారు. చివరిసారిగా డైరెక్టర్లు, జిల్లాకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పి ఆందోళన ప్రారంభిస్తామని డెయిరీ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ.13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు రూ.3 కోట్లు, కరెంట్ బిల్లు రూ.2 కోట్లు, ట్రాన్స్పోర్టు బకాయిలు మరో రూ.2 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కొత్త చైర్మన్గా ప్రమాణస్వీకారం చేసిన రోజు శిద్దా ప్రకటించారు. ఇదే జరిగితే డెయిరీ తిరిగి రన్నింగ్లోకి వస్తుందని మిగిలిన అప్పుల సంగతి తర్వాత చూసుకోవచ్చునని అందరూ భావించారు. అయితే కొత్త చైర్మన్ శిద్దా నెల కావస్తున్నా పైసా చెల్లించలేదు. పైపెచ్చు తన సొంత డబ్బులిచ్చేది లేదని బ్యాంకు రుణం వస్తేనే చెల్లిస్తానంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఓకే అంటేనే తాను చైర్మన్గా డెయిరీకి వస్తానంటూ శిద్దా అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది.పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్తో ఒప్పందం చేసుకున్న శిద్దా వెంకటేశ్వరరావు రాత్రికి రాత్రే ఒంగోలు డెయిరీ చైర్మన్ అయ్యారు. ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకున్నారు. శిద్దా డెయిరీ చైర్మన్ ఎంపిక వ్యవహారం తమకు తెలియదంటూ మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్తో పాటు పలువురు అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టారు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి ఏప్రిల్ 15న పాత, కొత్త చైర్మన్లను విజయవాడకు పిలిపించారు. జిల్లా మంత్రి, టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలకు తెలియకుండా డెయిరీ చైర్మన్ ఎలా అవుతావు అంటూ చివాట్లు పెట్టారు. తర్వాత మాట్లాడదాం పో.. అంటూ పంపించివేశారు. రెండు రోజుల తర్వాత మరోమారు ముఖ్యమంత్రితో సమావేశం ఉంటుందని అన్ని చక్కబడతాయని అధికార పార్టీ నేతలు ప్రకటించారు. ఇది జరిగి 10 రోజులు కావస్తున్నా సమావేశం ఊసే లేదు. దీంతో శిద్దా యూటర్న్ తీసుకున్నారు. సీఎం చెప్పిన తర్వాతే డెయిరీకి వస్తానంటూ పత్తా లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో ఒంగోలు డెయిరీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. -
బడ్జెట్ను వెంటాడుతున్న బకాయిలు
సాక్షి, హైదరాబాద్: భారీగా బడ్జెట్ అంచనాలు వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పాత బకాయిలు నీడలా వెంటాడుతున్నాయి. ప్రగతి పద్దులోని కీలకమైన పథకాలకు బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఎక్కువ మొత్తం బాకీలు చెల్లించేందుకే సరిపోనున్నాయి. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రతరం కానుంది. అదనంగా నిధులు సమకూర్చకపోతే ఈ పథకాల అమలు తీరుపై ప్రభావం పడుతుందని ఆయా శాఖల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆసరా, బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, వ్యవసాయ యాం త్రీకరణ, వడ్డీలేని పంట రుణాలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలకు ఈ గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. ఏటా ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.1,400 కోట్లకుపైగా బకాయిలున్నాయి. ఈ పథకానికి కొత్త బడ్జెట్లో ప్రభుత్వం రూ.3,282 కోట్లు కేటాయించింది. ఏటేటా స్కాలర్షిప్పుల చెల్లిం పులకు దాదాపు రూ.2,500 కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయి. ఈ లెక్కన కేటాయించిన బడ్జెట్లో పాత బకాయిలు చెల్లిస్తే.. మళ్లీ దాదాపు వెయ్యి కోట్లు పెండింగ్లో పడనున్నాయి. రేషన్ కార్డులపై పంపిణీ చేసే బియ్యం సబ్సిడీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల విభాగానికి రూ.3,800 కోట్లు బాకీ పడింది. వచ్చే ఏడాది సైతం బియ్యం సబ్సిడీకి రూ.2,200 కోట్లు అంచనా వ్యయమవుతుంది. కానీ బడ్జెట్లో కేవలం రూ.2,744 కోట్లు కేటాయించటంతో బాకీలు సైతం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ సబ్సిడీలపై ఇంచు మించుగా అలాంటి పరిస్థితి ఉత్పన్నమవనుం ది. విద్యుత్తు చార్జీలపై ఉన్న లోటు రూ.1,400 కోట్లు, 24 గంటల విద్యుత్ సరఫరాతో పడే భారం రూ.1,500 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వచ్చే ఏడాది విద్యుత్ సంస్థలకు రూ.2,900 కోట్లు చెల్లించాలి. ఇప్ప టికే రూ.6,000 కోట్లు పాత బకాయిలు ఇవ్వా ల్సి ఉంది. దీంతో ప్రస్తుతం కేటాయించిన రూ.4,984 కోట్లు బకాయిలకే సరిపోనున్నాయి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధుల చెల్లింపు సైతం ప్రస్తుతం అస్తవ్యస్తంగా సాగుతోంది. ఆడపిల్లల పెళ్ళిళ్లకు కానుకగా అందించాల్సిన ఈ ఆర్థిక సాయం, దరఖాస్తు చేసుకున్నాక ఏడాదికిగానూ అంద డం లేదనే ఫిర్యాదులున్నాయి. ఈ పథకానికి భారీగానే నిధులు కేటాయించిన ప్రభుత్వం, ఆర్థిక సాయాన్ని రూ.75 వేల నుంచి రూ.లక్షా నూట పదహార్లకు పెంచుతున్నట్లు ప్రకటించటంతో పెండింగ్ బకాయిలు, పెరిగిన అంచనా వ్యయంతో మళ్లీ ఎదురుచూపులు తప్పవనే ఆందోళనæ వ్యక్తమవుతోంది. రైతులకు, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ వాటా గత ఏడాదిగా పెండింగ్లో ఉంది. డ్వాక్రా సంఘాలకు ఇచ్చే బకాయిలు పేరుకుపోయాయి. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కూడా చిక్కుల్లో పడుతోంది. ఎస్సీ ఎస్టీలకు 95 శాతం సబ్సిడీపై ఇచ్చే ట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు దాదాపు రూ.300 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఖర్చు లేకుండా పాత అంచనాలు నిరుడు బడ్జెట్లో కేటాయించిన కొన్ని పథకాలకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దీంతో అప్పటి కేటాయింపులనే పునరావృతం చేశారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సబ్సిడీపై ఇచ్చే స్వయం ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం నిరుడు రూ.వెయ్యి కోట్లకు పైగా కేటాయించింది. అందులో నిధులేమీ ఖర్చు చేయలేదు. ఈసారి రూ.1,682 కోట్లు కేటాయించినట్లు మళ్లీ బడ్జెట్లో ప్రస్తావించింది. ఎంబీసీలకు ఆర్థిక చేయూతను అందించే కార్యక్రమాలకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో నిధులు పెట్టింది. ఇప్పటికీ ఖర్చేమీ కాకపోవటంతో అప్పటి నిధులనే మళ్లీ పునరావృతం చేసింది. ఈ బడ్జెట్లోనూ రూ.వెయ్యి కోట్లు ప్రకటించింది. -
ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు 1,524 కోట్లు
ముంబై: ఐడీబీఐ బ్యాంక్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,524 కోట్ల నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,255 కోట్ల నికర నష్టాలు వచ్చాయని, మొండి బకాయిలకు కేటాయింపులు పెరిగినా, ఈ క్యూ3లో నష్టాలు తగ్గాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,104 కోట్ల నుంచి రూ.6,645 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.3,135కోట్ల నుంచి రూ.3,649 కోట్లకు పెరిగాయని, దీంతో మొత్తం కేటాయింపులు రూ.3,205 కోట్ల నుంచి రూ.4,179 కోట్లకు చేరాయని వివరించింది. పెరిగిన మొండి బకాయిలు: గత క్యూ3లో రూ.35,245 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.50,621 కోట్లకు పెరిగాయని, అలాగే నికర మొండి బకాయిలు రూ.20,949 కోట్ల నుంచి రూ.29,352 కోట్లకు ఎగిశాయని వివరించింది. శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 15.16 శాతం నుంచి 24.72 శాతానికి, నికర మొండి బకాయిలు 9.61 శాతం నుంచి 16.02 శాతానికి పెరిగాయని పేర్కొంది. మొండి బకాయిల రద్దు రూ.778 కోట్ల నుంచి ఐదు రెట్లు పెరిగి రూ.4,214 కోట్లకు చేరిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 1% నష్టంతో రూ.60 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,894 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.2,611 కోట్లు)తో పోల్చితే 27 శాతం క్షీణత నమోదైందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ట్రెజరీ ఆదాయం 92 శాతం తగ్గడం, ఇతర ఆదాయం కూడా తగ్గడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచర్ చెప్పారు. ట్రెజరీ ఆదాయం 92 శాతం క్షీణించి రూ.66 కోట్లకు పరిమితమైందని, ఫారెక్స్ లాభాలు రూ.82 కోట్లే వచ్చాయని వివరించారు. మొత్తం ఆదాయం మాత్రం రూ.27,876 కోట్ల నుంచి స్వల్పంగా వృద్ధిచెంది రూ.28,501 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.2,442 కోట్ల నుంచి 32 శాతం క్షీణించి రూ.1,650 కోట్లకు తగ్గిందని తెలిపారు. వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయ్... నికర వడ్డీ ఆదాయం రూ.5,363 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.5,705 కోట్లకు పెరిగిందని కొచర్ పేర్కొన్నారు. నిర్వహణ లాభం 10 శాతం వృద్ధితో రూ.4,992 కోట్లకు పెరిగిందని తెలిపారు. రిటైల్ రుణాలు 22 శాతం పెరగడంతో దేశీయ రుణ వృద్ధి 15.6 శాతానికి ఎగసిందని, ఇది ఐదు క్వార్టర్ల గరిష్ట స్థాయి అని వివరించారు. రుణాలు నిలకడగా 10 శాతం చొప్పున వృద్ధి చెందాయని తెలిపారు. రిటైల్ రుణాలు 18–20 శాతం రేంజ్లో, కార్పొరేట్ రుణాలు 10 శాతం మేర వృద్ధి చెందగలవని ఆమె అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని చందా కొచర్ వ్యాఖ్యానించారు. 3.14 శాతంగా నికర వడ్డీ మార్జిన్.. దేశీయ నికర వడ్డీ మార్జిన్ 3.53 శాతం సాధించామని, మొత్తం మీద నికర వడ్డీ మార్జిన్ 3.14 శాతంగా ఉందని చందా కొచర్ వివరించారు. గత క్యూ3లో 7.20 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 7.82 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 3.96 శాతం నుంచి 4.20 శాతానికి పెరిగాయని తెలిపారు. అయితే స్థూల మొండి బకాయిల జాబితాలోకి చేరిన తాజా రుణాలు తొమ్మిది క్వార్టర్ల కనిష్ట స్థాయి, రూ.4,380 కోట్లకు తగ్గాయని వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు కూడా పెరిగాయని, గత క్యూ3లో రూ.2,713 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ3లో రూ.3,570 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే. ఈ క్యూ2లో రూ.44,488 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.46,039 కోట్లకు పెరిగాయని, నిక మొండి బకాయిలు మాత్రం రూ.24,129 కోట్ల నుంచి రూ.23,810 కోట్లకు తగ్గాయని వివరించారు. కేటాయింపులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన తగ్గాయని, ఈ క్యూ2లో రూ.4,503 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.3,570 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఆర్బీఐ రెండో మొండి జాబితాలో తమ బ్యాంక్కు చెందిన 18 ఖాతాల రూ.10,000 కోట్ల రుణాలున్నాయని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎన్ఎస్ కన్నన్ చెప్పారు. వీటికి రూ.500 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వివరించారు. అంతర్జాతీయ రుణాలు 14.5 శాతం క్షీణించాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ స్వల్ప లాభంతో రూ.353 వద్ద ముగిసింది. -
తగ్గుతున్న మొండి బకాయిల భారం!
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల ప్రక్షాళన కార్యక్రమంతో దేశ బ్యాకింగ్ రంగంలో వసూలు కాని మొండి బకాయిలు (ఎన్పీఏ) గణనీయంగా పెరిగిపోగా, అవి కాస్త నెమ్మదిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–డిసెంబర్ కాలంలో ఇవి చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. ఫిక్కీ–ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తాజా సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. 19 ప్రభుత్వరంగ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల నుంచి సర్వే కోసం అభిప్రాయాలను సేకరించారు. 58 శాతం మంది ఎన్పీఏలు పెరిగినట్టు పేర్కొనగా, అంతకుముందు నిర్వహించిన సర్వేలో 80 శాతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు తెలిసింది. మెటల్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల రంగాలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగా ఎన్పీఏలుగా మారాయి. తమ రుణాలను పునరుద్ధరించాలన్న అ భ్యర్థనలు ఎక్కువైనట్టు కేవలం 28 శాతం బ్యాంకులే తెలిపాయి. ఇది అంతకుముందు సర్వేలో 40 శాతం కావడం గమనార్హం. ఎన్పీఏలకు చేసే నిధుల కేటాయింపులకు పూర్తిగా పన్ను మినహాయింపు కల్పిస్తూ బడ్జెట్లో నిర్ణయం ప్రకటించాలని బ్యాంకులు కోరాయి. ‘‘కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించాలని చాలా వరకు బ్యాంకులు డిమాండ్ చేశాయి. అలాగే, మ్యాట్ (కనీస ప్రత్యామ్నాయ పన్ను)ను 15 శాతానికి తీసుకురావాలని కోరాయి. వ్యక్తులకు పన్ను మినహాయింపులు, రాయితీలను పెంచాలని కూడా డిమాండ్ చేశాయి. దీనివల్ల కార్పొరేట్, రిటైల్ రుణాలకు డిమాండ్ పెరుగుతుంది’’అని ఫిక్కి తన నివేదికలో పేర్కొంది. కాగా, భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలకు మారుతున్నందున బ్యాంకులు రుణాలకు సంబంధించి అదనంగా రూ.89,000 కోట్ల మేర కేటాయింపులు చేయాల్సి రావచ్చని ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ పేర్కొంది. -
విద్యాశాఖకు బకాయిల గుదిబండ
► ధుల కోసం విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ► గత ఏడాది పేరుకుపోయిన బకాయిలు రూ.7.88 కోట్లకుపైనే ► నిధులు విడుదల చేయని సర్కారు ఒంగోలు: జిల్లా విద్యాశాఖకు వివిధ పథకాల కింద ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నా యి. వివిధ విభాగాల్లో రూ.7.88కోట్ల మేర బకాయిలు నిలిచి పోయాయి.విద్యాశాఖ నుంచి తమకు చెల్లించాల్సిన నగదు కోసం యూనిఫాంలు కుట్టిఇచ్చిన డ్వాక్రామహిళలు, మధ్యా హ్న భోజనం చేసే కుక్కం హెల్పర్లు, సమ్మెటివ్ ప్రశ్నపత్రాలు ముద్రించిన ప్రింటర్లు ఇలా..పలువురు ఎదురు చూస్తున్నారు. యూనిఫాం బకాయిలు 2017–18 సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ విడుదల చేసిన వార్షిక క్యాలెండర్లో యూనిఫాం జూన్ నెలాఖరులోగా పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. గత ఏడాది యూనిఫాం కుట్టించి పంపిణీ చేసే బాధ్యతను ఆప్కోకు కేటాయించారు. ఏడాది పూర్తయింది. కానీ ఇప్పటికీ రూ.3.80 కోట్లకుపైగా బకాయిలను సర్వశిక్షా అభియాన్ ఆప్కోకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆప్కో ద్వారా యూనిఫాం పొంది వాటిని కుట్టిన మహిళలు భగ్గుమన్నారు. ఒక్కో జత యూనిఫాంకు ఇచ్చే కుట్టుకూలి రూ.40 మాత్రమే అని, దానిని కూడా నిలిపివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సాక్షాత్తు సీఎం దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కోకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావాల్సి ఉండడంతో వారు తమకు నిధులు రాగానే ఇస్తామంటున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరినా ఇంత వరకు మోక్షం కలగలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ తరగతుల గౌరవ వేతనం సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మే, జూన్ నెలల్లో ఆరు బ్యాచ్లుగా ఉపాధ్యాయులకు అన్ని మండలాల్లో శిక్షణ ఇచ్చారు. సమావేశాలకు హాజరైన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు రూ.350, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు రూ.375ల చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి శిక్షణ తరగతులు ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల అకౌంట్లకు ఈ నిధులు జమచేస్తామని చెప్పారు. కానీ నేటికీ ఈ మొత్తం జమకాలేదు. ఈ మొత్తం సుమారు రూ.28.70 లక్షలు ఉంది. మధ్యాహ్న భోజనం బకాయిలు: మధ్యాహ్న భోజనానికి సంబంధించి కుక్ కం హెల్పర్లకు ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి, మార్చి , ఏప్రిల్ నెలలకు సంబంధించి ఇంతవరకు వారి ఖాతాలకు వేతనాలు జమకాలేదు. ఇలా చెల్లించాల్సిన మొత్తం రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. డీసీఈబీ ప్రింటింగ్ ఖర్చులు: జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం జిల్లావిద్యాశాఖ అధికారి నేతృత్వంలో ఉంటుంది. ఈ విభాగం పరీక్షల నిర్వహణకు ప్రశ్నపత్రాలు తయారు చేసి వాటిని పాఠశాలలకు పంపాలి. గతంలో 1 నుంచి 9 తరగతుల వరకు ప్రశ్నపత్రాలను వీరే ముద్రింపజేసేవారు. కానీ గత ఏడాది 6 నుంచి 10 తరగతుల వరకు ఎస్సీఈఆర్టీ ముద్రించి పంపింది. దీంతో 1 నుంచి 5 తరగతుల వరకు విద్యార్థులకు మూడు సమ్మెటివ్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు ముద్రించే బాధ్యత వీరిమీద పడింది. ఇప్పటికి ఈ విభాగం దాదాపు రూ.40 లక్షలకుపైగా ప్రింటర్స్కు బకాయి పడింది. గత ఏడాది మొత్తంలో రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఒక్క రూపాయి కూడా ఈ విభాగానికి విడుదల కాకపోవడంతో ప్రింటర్లు డీసీఈబీ కార్యాలయం, విద్యాశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మళ్లీ ఈ ఏడాది సమ్మెటివ్ పరీక్షలకు సంబంధించి జూలైలో ప్రింటర్ల వద్ద నుంచి టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. బాహ్య మూల్యాంకనానికి నిధులు నిల్ బాహ్య మూల్యాంకనానికి హాజరయ్యే ఉపాధ్యాయులకు రోజుకు రూ.200 చెల్లిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. సమ్మెటివ్ –1(త్రైమాసిక), సమ్మెటివ్–2(అర్ద సంవత్సర), సమ్మెటివ్–3(వార్షిక) పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 6 నుంచి 10 తరతగతుల వరకు పరీక్షలు రాసిన విద్యార్థులకు బాహ్యమూల్యాంకనం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. తరువాత దానిని 5 శాతం ప్రశ్నపత్రాలను పరిశీలించాలని ఆదేశించారు. అయితే ప్రైవేటు , ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ మూల్యాంకనానికి హాజరయ్యే ఉపాధ్యాయులకు రోజుకు రూ.200లు చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. కానీ సంవత్సరం మొత్తం అయిపోయి నూతన సంవత్సరం కూడా ప్రారంభంమైంది. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఉపాధ్యాయులకు అందలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఉపాధ్యాయులు ఆ మొత్తాలను అందుకోలేకపోయారు. సుమారుగా ఒక్కో ఉపాధ్యాయునికి దాదాపుగా రూ.2 వేలకుపైగా అందుతాయని అంచనా. ఇలా విడుదల కావాల్సిన మొత్తం రూ.40 లక్షలకుపైనే. -
డిఫాల్టర్ల ఇళ్ల ఎదుట మౌన ప్రదర్శనలు
బాకీల వసూళ్లకు కార్పొరేషన్ బ్యాంకు నిర్ణయం హైదరాబాద్: రుణ బకాయిల వసూళ్లకు కార్పొరేషన్ బ్యాంకు నూతన మార్గాన్ని ఎంచుకుంది. బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఖాతాదారుల ఇళ్లు, కంపెనీల కార్యాలయాల ముందు బ్యాంకు ఉద్యోగులు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. రుణ చెల్లింపుల దిశగా వారిపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు, విఫలమైతే ఎదురయ్యే పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. -
డబ్బులు ఇవ్వరు..డాంబికాలు ఆపరు
∙నేటి నుంచి నియోజకవర్గాల్లో నివనిర్మాణ దీక్షలు ∙గతేడాది దీక్షల బకాయిలు చెల్లించని ప్రభుత్వం ప్రొద్దుటూరు: ప్రభుత్వ తీరు డాంభికాలే తప్ప. డబ్బులు ఇవ్వరన్న విధంగా తయారైంది. గత ఏడాది నిర్వహించిన నవనిర్మాణ దీక్షలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గంలో సుమారు లక్ష రూపాయలు ఖర్చయింది. సంబంధిత అధికారులకు చేతి చమురు వదిలింది. మరికొందరు అధికార పార్టీ నాయకుల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ ఏడాది నిర్వహించిన సంక్రాంతి సంబరాల పరిస్థితి కూడా అలాగే తయారైంది. గ్రామానికి రూ.5వేలు, మండల కేంద్రంలో వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, బహుమతుల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు రూ.25వేలు కలిపి ప్రతి మండలంలో లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ప్రకారం జిల్లాలోని 50 మండలాలకు కలిపి సంక్రాంతి సంబరాలకుగా 50 లక్ష రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత నవనిర్మాణ దీక్షలకు మేము ఇస్తామని చెప్పలేదు కదా అని జిల్లా అధికారులు చెప్పినట్లు సమాచారం. సంక్రాంతి సంబరాల డబ్బును ఎప్పుడు ఇస్తారో ఇంకా అధికారులకే అంతు చిక్కకపోగా, ప్రస్తుతం నిర్వహించే నవనిర్మాణ దీక్షలకు కూడా ఎంత మొత్తంలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తామన్న విషయాన్ని జిల్లా అధికారులు స్పష్టంగా చెప్పలేదని సమాచారం. ఈ నేపథ్యంలో నేటి నుంచి నవనిర్మాణ దీక్షలను నిర్వహించాల్సి వస్తోంది. అధికారులను ఇలా అప్పుల ఊబిలోకి నెట్టి కార్యక్రమాలను నిర్వహించడం సమంజసమేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో నవనిర్మాణ దీక్షలు చేపట్టాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా విజయవాడ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు సందేశం ఇవ్వనున్నారు. మూడో తేదీ నుంచి 8వ తేదీ వరకు రోజూ వివిధ అంశాలపై నియోజకవర్గ కేంద్రాల్లో సభలను నిర్వహించాలని నిర్ణయించారు. మండల, గ్రామస్థాయి అధికారులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా స్పెషల్ ఆïఫీసర్లను ఇందుకు బాధ్యులుగా నియమించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలును చర్చించకుండా సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల ఏ మాత్రం ఫలితం ఉంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకులు బాగుపడితే వాటాల విక్రయం
-
బ్యాంకులు బాగుపడితే వాటాల విక్రయం
కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ టోక్యో: మొండిబకాయిలతో కుంగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి కొంత మెరుగైన తర్వాత ప్రభుత్వం వాటిల్లో కొంత మేర వాటాలు విక్రయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకునేలా రిజర్వ్ బ్యాంక్కు మరిన్ని అధికారాలు దక్కిన నేపథ్యంలో నిరర్ధక ఆస్తుల సమస్యకు పరిష్కారమార్గం లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకుల మూలధన అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే ఒక పథకం అమలవుతోందని, మరిన్ని నిధులు కావాల్సి వస్తే ఆ అంశమూ పరిశీలించగలమన్నారు. ‘అయితే, బ్యాంకుల పరిస్థితులు మెరుగుపడితే వాటిల్లో వాటాలను 52 శాతానికి తగ్గించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించాము. ఈ రకంగా వచ్చే నిధులను బ్యాంకుల మూలధన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు’ అని సోమవారం జరిగిన సీఐఐ–కోటక్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. వసూలుకావాల్సిన మొండిబకాయిల్లో సింహభాగం మొత్తం .. కేవలం కొన్ని ఖాతాలకు మాత్రమే పరిమితమైందని, అయితే పరిమాణం భారీగా ఉండటంతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. -
‘మెప్మా’ బినామీల దందా!
• చేతులు మారుతున్న ప్రభుత్వ నిధులు • రెండేసి బ్యాంకుల నుంచి రుణాలు.. • ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు • ఆధార్ అనుసంధానంతో 250 మంది పేర్ల తొలగింపు నర్సంపేట : నర్సంపేట నగర పంచాయతీ పరిధిలోని మురికివాడల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ద్వారా నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల్లో బినామీల దందా కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ని«ధులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గత నెల నుంచి ఆధార్ అనుసంధానం చేస్తుండడంతో 250 మంది పేర్లను కూడా తొలగించారు. అయితే, ఇప్పటికే పలువురు బినామీ పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు రెండు స్వయం సహాయ సంఘాల్లో పేర్లు నమోదు చేయించుకోని రుణాలు తీసుకున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది రుణాలను బ్యాంకులకు తిరిగి డబ్బులు చెల్లించడం లేదని చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ బ్యాంకుకు చెల్లించాల్సిన డబ్బును కాజేయడంతో సంఘంలోని సభ్యుల నడుమ గొడవ జరిగింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు.. మహిళా స్వయం సహాయక సంఘాల్లో అక్రమాలను నిర్మూలించేందుకు రాష్ట్రప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా సంఘాల్లోని బినామీలను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆధార్తో అనుసంధానం చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నర్సంపేట మెప్మా సంస్థకు చెందిన 699 స్వయం సహాయక సంఘాల్లో 7,280 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 1800 మంది వివరాలను ఆధార్తో అనుసంధానం చేయగా 250 మంది పేర్లు రెండు సంఘాల్లో నమోదై ఉన్నట్లు తేలింది. దీంతో వారిని పేర్లను తొలగించారు. తద్వారా బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇచ్చే స్వయం ఉపాధి రుణాలు పక్కదారి పట్టకుండా అర్హులకే అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పక్కదారి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేయడానికి గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇందిరాక్రాంతి పథకం(ఐకేపీ) పేరును ఇప్పుడు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)గా మార్చారు. దీనిద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వ రుణాలు ఇస్తోంది. మహిళలు బృందాలుగా ఏర్పడి వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం కల్పించింది. నర్సంపేట పట్టణంలోని 20 వార్డుల్లో దాదాపు 40వేల మంది జనాభా ఉన్నారు. ఇందులో 699 స్వయం సహాయ సంఘాల్లో 7,280 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. ఒక్కో గ్రూపులో ఐదుగురి నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఒక్కో స్వయం సహాయక సంఘం సభ్యులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పిస్తోంది. ఈ రుణంతో కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటుచేసుకుని స్వయం ఉపాధి పొందాల్సి ఉంటుంది. ఇలా నగర పంచాయతీకి సంబంధించి ఐదు బ్యాంకుల నుంచి 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.4.50 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం విధించగా... మెప్మా అధికారులు 575 సంఘాలకు రూ.4 కోట్ల రుణాలు ఇప్పించారు. అయితే, రుణాలు పొందిన కొందరు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉన్నట్టు రెండు గ్రూపుల్లో పేరు నమోదు చేసుకోని రెండుసార్లు బ్యాంక్ రుణాలు తీసుకోని తిరిగి చెల్లించడంలేదు. ఇంతకుముందు స్వయం సహాయక సంఘాల సభ్యులు అక్రమంగా రెండుచోట్ల రుణాలు తీసుకున్నా, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోయినా అధికారులు అంతగా పట్టించుకునే వారు కాదు. బ్యాంకు అధికారులు రెండు, మూడేళ్లకోసారి మారుతుండడంతో రుణాలు పొందిన మహిళా సంఘాల నుంచి బకాయిలు రికవరీ ఆశించిన స్థాయిలో జరగడం లేదని చెబుతున్నారు. ఇలా కొన్నేళ్లుగా రూ.లక్షల్లో నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, నర్సంపేట నగర పంచాయతీ పరిధిలో బ్యాంక్ రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆధార్ నంబర్లు అనుసంధానం చేయడంతో రెండు చోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. తద్వారా ఒక సభ్యురాలు నివాసం ఉండే చోటే రుణం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని పరకాల, నర్సంపేట నగర పంచాయతీ సంఘాల్లోనూ çపూర్తిస్థాయిలో ఆధార్ అనుసంధానం చేస్తే అక్రమంగా రుణాలను పొందడాన్ని అరికట్టొచ్చని చెబుతున్నారు. -
ఆదాయం అవసరం లేదా..?
ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై అధికారుల నిర్లక్ష్యం టార్గెట్ 5.26కోట్లు, వసూళ్లు 1.38కోట్లు పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిలు వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సానిటరీ ఇన్స్పెక్టర్లకు వ్యాపారులపై వల్లమాలిన ప్రేమో లేక, నిర్లక్ష్యమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2017 జనవరి 31 నాటికి వంద శాతం వసూళ్లు చేయాల్సిన సానిటరీ ఇన్స్పెక్టర్లు కేవలం 26 వసూళ్లతో సరిపెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని చూస్తే సొంత ఆదాయంపై వీరికి ఏ మేరకు శ్రద్ధ ఉందో అవగతమవుతోంది. కార్పొరేషన్ పరిధిలో 17,559 మంది ట్రేడ్ లైసెన్స్లతో యాజమానులు వ్యాపారాలు నిర్వహిస్తునట్లు రికార్డులు చూపుతున్నాయి. కానీ నగరంలో రెట్టింపు స్థాయిలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది స్థానికంగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా మేనేజ్ చేసుకుంటూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. రికార్డుల్లో అధికారికంగా నమోదైన వ్యాపారుల నుంచి కుడా ఏడాదికోకమారు ఫీజు వసూలు చేయడంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు విఫలమవుతున్నారు. ఫలితంగా గత కొద్ది సంవత్సరాలుగా వేలాది మంది ట్రేడ్ లైసెన్స్దారుల వద్ద ఫీజు బకాయిలు పేరుకుపోతున్నాయి. లక్ష్యం రూ.5.28 కోట్లు.. వసూళ్లు రూ.1.38 కోట్లు గ్రేటర్ వరంగల్ 2016–17 సంవత్సరానికి గాను ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూ. 5.28 కోట్ల వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్ణీత గడువు 2017 జనవరి 31 నాటికి వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు. గడువు దాటింది. కానీ ట్రేడ్ ఫీజు కేవలం రూ. 1.38కోట్లు వసూలు చేశారు. ట్రేడ్ ఫీజు, జరిమానాలతో ఇంకా రూ. 3.90కోట్లు ఫీజులు బాకాయిలు పేరుకుపోయాయి. బిర్రు శ్రీనివాస్ అనే సానిటరీ ఇన్స్పెక్టర్ మాత్రం 85 శాతం పన్నులు వసూలు చేయగా, భాస్కర్ 63శాతం, కుమారస్వామి 63 శాతం టార్గెట్ వసూలు చేశారు. మారో సానిటరీ ఇన్స్పెక్టర్ యాదయ్య 15 శాతం, కర్ణాకర్ 17శాతం, భీమయ్య 18శాతం వసూలు చేయడం గమనార్హం. కొత్త డిమాండ్ రూ.5.51కోట్లు ఈ ఏడాది కొత్త డిమాండ్ ఫిబ్రవరి 1న ఖరారైంది. పాత బకాయిలతోపాటు వడ్డీ, ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ ఫీజుతో రూ.5.51కోట్లుగా నిర్ణయించారు. గత ఏడాది 3.90 కోట్ల బాకాయిలతో పాటు కొత్త లైసెన్స్ ఫీజు రూ.160కోట్లతో ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లిస్తే దీనిపై జరిమానా విధించరు. కానీ మార్చి తర్వాత 3 నెలల వరకు 25 శాతం జరిమానా, ఏడాది గడిస్తే 50 శాతం జరిమానా వసూలు చేస్తారు. -
బిల్లులకు చిల్లులు
• 1104 యూనియన్ రూ.45 లక్షలకుపైగా బాకీ • 327 యూనియన్ రూ.8.34 లక్షల బకాయిలు సాక్షి, హైదరాబాద్: వారు బిల్లుల వసూళ్లలో కర్కశంగా ప్రవర్తిస్తుంటారు. వినియోగ దారులతో దురుసుగా వ్యవహరిస్తుంటారు. ఇంటికి వచ్చి ఫ్యూజ్ తీసుకెళ్లడమో, కరెంట్ కనెక్షన్ తొలగించడమో చేస్తుంటారు. కానీ తమ యూనియన్ కార్యాలయాల బిల్లులు చెల్లించకున్నా కిమ్మనకుండా ఉండిపోతారు. ఇదీ కరెంటోళ్ల లీల. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యుత్ ఉద్యోగ, కార్మిక యూనియన్ల కార్యాలయాలు దశాబ్దాలుగా విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో లక్షలాది రూపాయల బకాయిలు పేరుకుపోయా యి. అయినా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) యాజ మాన్యం యూనియన్ల కార్యాలయాలకు నిరాటంకంగా విద్యుత్ సరఫరాను కొనసా గిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల నుంచి యూని యన్లు లక్షల రూపా యల సభ్యత్వ రుసుం వసూ లు చేస్తున్నాయి. యూనియ న్లు పోటాపోటీగా పెద్ద ఎత్తున డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్య క్రమాలను నిర్వహిస్తున్నాయి. కానీ, ఏటా వచ్చే ఆదాయం నుంచి కొంత బిల్లులకు వెచ్చించడానికి యూనియన్ల నేతలు చొరవ చూపడం లేదు. జిల్లాల్లో అయితే యూని యన్ల కార్యాలయాలకు విద్యుత్ మీటర్లు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 1104 వర్కర్స్ యూని యన్ కార్యాలయం రూ.45.32 లక్షలు. 327 కార్యాలయం రూ.8.34 లక్షలు. తెలుగునాడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రూ.4.02 లక్షలు, ఏపీఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లా యీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.4.47 లక్షలు, ఏపీఎస్ఈబీ టెక్నికల్ ఎంప్లాయీస్ యూనియన్ రూ.1.46 లక్షలు, స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.69,140 బకాయిలను డిస్కంకు చెల్లించాల్సి ఉంది. -
‘ఫీజు’ బకాయిలపై కదం తొక్కిన కాంగ్రెస్
రాష్ట్ర యువజన కాంగ్రెస్ మహాధర్నా.. పలువురి అరెస్టు హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లు, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ని పోలీసు లు భగ్నం చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్కుమార్యాదవ్ సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి గాంధీ నగర్ పీఎస్కు పోలీసులు తరలించారు. ఫీజు బకాయిలు చెల్లించాలని, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇందిరాపార్కు వద్ద రాష్ట్ర యువజన కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించిం ది. అనంతరం అసెంబ్లీ వైపు ప్రదర్శనగా దూ సుకు వెళ్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను పోలీసులు ఇందిరాపార్కు చౌరస్తాలో అడ్డుకుని అరెస్టు చేశారు. రుణమాఫీపై కేసీఆర్ మోసం: జైపాల్ యూత్ కాంగ్రెస్ మహాధర్నాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అందమైన, ఆచరణ సాధ్యంకాని హామీలతోనే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని అన్నారు. రైతుల రుణమాఫీని ఒకే విడతగా చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్, కేసీఆర్తో తెలంగా ణ రాలేదని, విద్యార్థులు, యువకుల బలిదా నాలకు సోనియాగాంధీ చలించి తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని, రోజుకు 750 కేలరీల ఆహారాన్ని దీక్ష సమయంలో తీసుకు న్నారని, దీనికి సంబంధించి తన వద్ద ఆధా రాలు ఉన్నాయని అన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్కు మధ్య జరిగిన ఒప్పందం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే సత్తా యూత్ కాంగ్రెస్కు ఉందని అన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపో వడంతో 3,250 కళాశాలలకు చెందిన దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. యువకులు, విద్యార్థుల బలిదానాల పునాదులపై కేసీఆర్ సర్కారు ఏర్పడిందని, కానీ, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వంపై యూత్ కాంగ్రెస్ పోరాటం ఆగ దని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి, ఎమ్మెల్సీలు రాజగోపాల్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, గండ్ర వెంకటర మణారెడ్డి, సుధీర్రెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దు ప్రభావం..
'మధ్యాహ్న' భారం ! ఏజెన్సీలకు అందని బిల్లులు నాలుగు నెలలుగా బకాయి నిత్యావసర సరుకుల కొనుగోలుకు అగచాట్లు అప్పు కోరితే ధరల పెంపు దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం చెల్లించే డబ్బు – 1–5వ తరగతి వరకు రూ. 5.13 – 6–10 తరగతి వరకు రూ. 7.18 – మధ్యాహ్న భోజనం అమలవుతున్న పాఠశాలలు : 3,783 – రోజూ భోజనం తింటున్న విద్యార్థులు : 3,43,557 – బిల్లుల పెండింగ్ మొత్తం రూ. 17.53 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ను తగ్గించాలనే ప్రధాన ఉద్ధేశంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. పథకం నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధుల మంజూరులో జాప్యం ఏర్పడినా నిర్వాహకులే సర్దుబాటు చేసేవారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డబ్బు లభించే పరిస్థితిలేదు. దుకాణాల్లో అప్పు అడిగితే సరుకుల ధరలను పెంచేస్తున్నారని వారు వాపోతున్నారు. కిలోపై రూ. 15–25 ఎక్కువగా చెబుతున్నారని. గత్యంతరం లేక సరులకు తెచ్చుకొంటున్నామని వారు చెబుతున్నారు. జిల్లాలో 2,663 ప్రాథమిక, 595 ప్రాథమికోన్నత, 525 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3,43,557 మంది విద్యార్థులు పాఠశాలల్లో భోంచేస్తున్నారు. నిధులున్నా ఇవ్వలేదు.. 9,10 తరగతులకు సంబంధించి డిసెంబర్ దాకా నిధులు అందుబాటులో ఉన్నాయని, అయితే రెండు నెలలుగా విడుదల చేయడం లేదని తెలిసింది. నాలుగు నెలలకు సంబంధించి మొత్తం జిల్లాలోని ఏజెన్సీలకు రూ. 17.53 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు కార్మికులకు కూడా వేతనాలు చెల్లించాల్సి ఉంది. అందని బిల్లులు... : నాగమణి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాలో సెప్టెంబర్ నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు ఇవ్వలేదు. కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్లు రద్దువల్ల అప్పులు పుట్టడం లేదు. కిరాణకొట్లలో అప్పు తీసుకోవడం వల్ల అధికరేట్లు వేస్తున్నారు. కార్మికుల వేతనాలు కూడా మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. నిధులు మంజూరు కాలేదు.. : శామ్యూల్, డీఈఓ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వచ్చిన నిధులన్నీ ఇచ్చేశాం. మూడో విడత బడ్జెట్ ఇంకా మంజూరు కాలేదు. బిల్లులు పెండింగ్ ఉండడంతో ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్న సంగతి వాస్తవమే. ప్రభుత్వం మంజూరు చేయగానే వారివారి ఖాతాల్లో జమా చేసేలా చర్యలు తీసుకుంటాం. -
వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్
కర్నూలు(రాజ్విహార్): ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీఎస్ఆ ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి పి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్లోని రీజినల్ మేనేజరు కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013 ఏప్రిల్ నుంచి 2015 జూన్ మధ్య కాలంలో పదవీ విరమణ పొందిన కార్మికులు, ఉద్యోగులకు గ్రాట్యూటీ అరియర్స్ ఇప్పటి వరకు చెల్లించకపోవడం విచారకరమన్నారు. దీక్షల్లో ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ఎస్ రావు, సుబ్బారాయుడు, ప్రసాద్, జీఎస్ వాసులు, ఎస్ఎ అజీమ్, జె. రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల వెంటే కాంగ్రెస్
‘‘ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రాబట్టుకొనే వరకు విద్యార్థుల వెంటే కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ఉంటాయని పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుంతియా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆల్ ఇండియా చైర్మన్ కొప్పుల రాజులు మూకుమ్మడిగా పేర్కొన్నారు. ఆర్మూరులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ విద్యార్థి యువ గర్జనకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దాదాపు 200 మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. -ఆర్మూరు -
భరోసా ఇవ్వని ‘అభయహస్తం’
సాక్షి, హైదరాబాద్: పేరుకే అభయహస్తం. కానీ, అది ఎక్కడా కానరావడంలేదు. ఆ పథకం నిధుల విడుదల ఆగిపోయింది. దీంతో 8 నెలలుగా లబ్ధిదారులకు సాయం అందడంలేదు. ప్రభుత్వ వైఖరి మూలంగా ఆ పథకానికే భరోసా లేకుండా పోయింది. 1.08 లక్షలమందికి రూ.65 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అభయ హస్తం పథకాన్ని ఎత్తివేయాలని తొలుత భావించిన సర్కారు తర్వాత ఆ ప్రతిపాదనను విరమించుకుంది. ప్రస్తుతానికి 30 శాతం మంది మహిళలకే ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతోంది. దాన్ని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలందరికీ వర్తింపజేయాలని, వారి జీవిత భాగస్వాములకు కూడా బీమా ప్రయోజనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అభయహస్తం పథకంలో మార్పులు, చేర్పులు చేయాలని ఆదేశించడంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిధుల విడుదల ఆగిపోయిందని అధికారులు అంటున్నారు. అభయహస్తం ఇలా... మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ‘అభయహస్తం’ పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వయం సహాయక గ్రూపులోని పేద మహిళలకు ఈ పథ కం ద్వారా పలు రకాలుగా లబ్ధి చేకూరనుంది. పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి మహిళ ఈ పథకంలో సభ్యురాలిగా చేరేందుకు అర్హత కల్పించారు. రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే రూ.75 వేల జీవిత బీమా లభిస్తుంది. సభ్యురాలు చెల్లించినదానికి సమానంగా ప్రభుత్వం కూడా జీవిత బీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తుంది. సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున నాలుగేళ్లపాటు( 9 నుంచి 12వ తరగతి వరకు) ఎల్ఐసీ నుంచి ఉపకారవేతనం కూడా లభిస్తుంది. సభ్యులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.500 చొప్పున పింఛను కూడా వస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు సభ్యురాలు మరణించినా, శాశ్వత అంగవైక్యలం కలిగినా రూ.75 వేల బీమా అందుతుంది. సహజ మరణానికి కూడా రూ.30 వేల బీమా బాధిత కుటుంబానికి లభిస్తుంది. -
పీఆర్సీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
ప్రభుత్వపాఠశాలల మనుగడకు చర్యలు చేపట్టాలి టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్అలీ విద్యారణ్యపురి : ఉద్యోగ,ఉపాధ్యాయులకు పీఆర్సీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ ప్రై మరీ టీచర్స్అసోసియేషన్(టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్పీటీఏ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీహైస్కూల్లో నిర్వహించిన ఆ ఉపాధ్యాయసం ఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు. కాలయాపన కాకుండా కరువుభత్యం మంజూరి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాధించాలంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేటు పాఠశాలలను నియంత్రించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల ల్లో పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యను ప్రవేశపెట్టాలన్నా రు. అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు వర్తింపజేయాలని డిమాం డ్ చేశారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రపతి చేత ఆమోదింపజేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని పాఠశాలల్లోను ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా చిన్నచిన్న జిల్లాల ఏర్పాటు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయన్నారు. టీఎస్పీటీఏ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎన్.ఆశాకుమారి మాట్లాడుతూ విద్యాశాఖమంత్రి ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నా రు. రాష్ట్ర అసోసియేట్ రమేష్ ,రాష్ట్ర కార్యదర్శి ఖాజా అజీముద్దీన్,అదనపు ప్రధాన కార్యదర్శి మహ్మద్ సలీమ్, జిల్లా అధ్యక్షుడు ఎంఏ బాసిత్,జిల్లా జనరల్సెక్రటరీ పివి.రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
78% తగ్గిన ఎస్బీఐ నికర లాభం
రూ.4,714 కోట్ల నుంచి రూ.1,046 కోట్లకు క్షీణత రెండు రెట్లు పెరిగిన ‘మొండి’ కేటాయింపులు ఫలితాల అనంతరం దూసుకుపోయిన షేర్ 7 శాతం లాభంతో రూ.243 వద్ద ముగింపు ముంబాయి: పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని వణికిస్తున్న మొండి బకాయిల సమస్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై మరీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ బ్యాంక్కు భారీగా మొండి బకాయిలుంటాయని మార్కెట్ వర్గాలు అంచనాలు వేయగా... వాటికన్నా తక్కువే నమోదయ్యాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రెట్టింపైనప్పటికీ, అంచనాల కంటే తక్కువగానే మొండి బకాయిలు నమోదయ్యాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి 78 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.4,714 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,046 కోట్లకు పడిపోయింది. మొండి బకాయిలకు కేటాయింపులు రెండు రెట్లు పెంచటంతో ఈ స్థాయిలో నికర లాభం క్షీణించిందని ఎస్బీఐ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.63,165 కోట్ల నుంచి రూ.69,415 కోట్లకు పెరిగిందని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.3,359 కోట్ల నుంచి రూ.6,340 కోట్లకు పెరిగాయని, మొత్తం కేటాయింపులు రూ.5,510 కోట్ల నుంచి 55 శాతం పెరిగి రూ.8,533 కోట్లకు చేరాయని తెలియజేశారు. స్థూల మొండి బకాయిలు 4.29 శాతం (రూ.56,421 కోట్లు ) నుంచి 6.49 శాతానికి(రూ.1,01,541 కోట్లు). నికర మొండి బకాయిలు 2.24 శాతం(రూ.28,669 కోట్లు) నుంచి 4.05(రూ.57,421 కోట్లు) శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 2.99 శాతం నుంచి 2.83 శాతానికి తగ్గాయి. డిపాజిట్లు రూ.16,13,545 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.17,82,371 కోట్లకు, రుణాలు రూ.13,13,735 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.14,63,690 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం రుణ వృద్ధి లక్ష్యమని అరుంధతి చెప్పారు. రెండు మూడేళ్లలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామన్నారు. ఇక స్టాండెలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.3,692 కోట్ల నుంచి 32 శాతం క్షీణించి రూ.2,521 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.44,731 కోట్ల నుంచి రూ.48,929కోట్లకు ఎగసింది. ముగిసిన అధ్వాన పరిస్థితులు.. మొండి బకాయిలుకు సంబంధించి అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని అరుంధతి చెప్పారు. అయితే రికవరీ మందగమనంగా ఉందన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంక్లు విలీనం కానున్న నేపథ్యంలో ఈ అనుబంధ బ్యాంక్లు మొండి బకాయిలకు అధికంగా కేటాయింపులు జరిపాయని వివరించారు. గత క్వార్టర్లో పెరిగినట్లుగా మొండి బకాయిలు భవిష్యత్తు క్వార్టర్లో పెరిగే అవకాశాల్లేవని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కళక ళలాడిన ఎస్బీఐ షేర్.. మొండి బకాయిలు అంచనాల కంటే తక్కువగా ఉండడం, భవిష్యత్ అంచనాలు మార్కెట్ అంచనాలకనుగుణంగానే ఉండడంతో ఎస్బీఐ షేర్ ఫలితాలనంతరం దూసుకుపోయింది. ఇంట్రాడేలో 9 శాతం లాభంతో రూ.247.7కు చేరిన ఈ షేర్ చివరకు 7.1 శాతం లాభఃతో రూ.243 వద్ద ముగిసింది. చాలా ఏళ్ల తర్వాత ఒక్క రోజులో ఎస్బీఐ ఈ స్థాయిలో కళకళలాడడం ఇదే మొదటిసారి. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్లతో పోలిస్తే మొండి బకాయిల విషయంలో ఎస్బీఐ మంచి పనితీరు కనబరిచిందని విశ్లేషణ. -
బకాయిల చెల్లింపులో జాప్యం
విద్యారణ్యపురి : సంవత్సరం కాలంగా నిరీక్షస్తున్నా ఉపాధ్యాయ, ఉద్యోగుల పీఆర్సీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోం దని పీఆర్టీయూ–టీఎస్ జిల్లా అధ్యక్షుడు పిం గిళి శ్రీపాల్రెడ్డి విమర్శించారు.శుక్రవారం హ న్మకొండలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలతో సమానంగా ఉండాలన్న వేతనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యాశాఖలో పదేళ్లుగా ఖాళీగా ఉన్న పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీ చేయకుండా ఆ పోస్టులలో ఎంఈఓలకు అదనపు బా« ద్యతలను అప్పగించి పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యా వలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరునగరి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలన్నారు. సమావేశంలో నాయకులు యాకూబ్రెడ్డి, సూరి బాబు, రాంరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, వెంకట స్వా మి, తిరుపతిరెడ్డి, రాంచంద్రం, గఫార్, రాజాసురేందర్రెడ్డి, లక్ష్మణ్బాబు పాల్గొన్నారు. -
కదం తొక్కిన విద్యార్థులు
♦ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి ♦ చేవెళ్లలో హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై రాస్తారోకో ♦ బకాయలను చెల్లించేవరకు పోరాటం ఆగదు- కార్తీక్రెడ్డి ♦ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తగదు- యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్కుమార్ చేవెళ్లః విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్పార్టీ ఇన్చార్జి, యువజన నాయకులు పి.కార్తీక్రెడ్డి తెలిపారు. ఫీజురీయింబర్స్మెంట్ బకాయల చెల్లింపులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో పలు డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారిపై యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్తీక్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కూతురు కవిత బతుకమ్మ ఆడుకుంటానంటే 20 కోట్లు, హోమాలు, యజ్ఞాలు చేయడానికి 100 కోట్లు, కాన్వాయ్లో కొత్త కార్లు కొనడానికి 50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం...విద్యార్థులు చదువుకోవడానికి ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయలు విడుదల చేయడానికి ఎందుకు చేతులు రావడంలేదని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నదన్నారు. తెలంగాణ ఉధ్యమానికి విద్యార్థులు కావాలి..కానీ వారికి ఫీజులు చెల్లించడానికి ఎందుకు స్పందించడంలేదని దుయ్యబట్టారు. పైగా కళాశాలలపై విజిలెన్స్ దాడులంటూ యాజమాన్యాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నావని పేర్కొన్నారు. కేవలం రెండువేల కోట్లు రూపాయలు విడుదల చేస్తే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయలు తీరుతాయన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక తెలంగాణ కోసం మరోసారి ఉధ్యమించాల్సిన పరిస్థితి వస్తుందని, ఇందుకు విద్యార్థిలోకం సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్ధులు, రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థ విధానాలవల్ల ముఖ్యంగా విద్యార్థులు, రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మందడి అనీల్కుమార్యాదవ్ తెలిపారు. కేసీఆర్ పబ్లిసిటీకి, హోర్డింగ్లకు పెట్టే ఖర్చు మానేస్తే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయలు తీరుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన కేసీఆర్ కుటుంబపాలనలా తయారైందని తెలిపారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగుగాని కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు మాత్రం వచ్చాయన్నారు. కేజీనుంచి పీజీ ఉచిత విద్య, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు, డబుల్బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేబినెట్ మొత్తం అటెండర్లమాదిరిగా తయారైందని విమర్శించారు. విద్యార్థుల ఆగ్రహానికి గురికాకముందే విద్యార్థుల బకాయలను విడుదల చేయాలని డిమాండ్చేశారు. డీసీసీ మాజీ అధ్యక్షులు పి.వెంకటస్వామి మాట్లాడుతూ..విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వానికి ఉసురుతగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం పాలన కేసీఆర్ దొరల పాలనలా తయారైందన్నారు. పార్లమెంటు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడుపల్లి రవికాంత్రెడ్డి, కార్యదర్శి పి.మధుసుదన్రెడ్డి, నర్సింహ్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎం.రమణారెడ్డి, తదితరులు మాట్లాడుతూ..విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు పి.గోపాల్రెడ్డి, శివానందం, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు టేకులపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పర్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలయ్య, మాధవరెడ్డి, జి.చంద్రశేఖర్రెడ్డి, విఠలయ్య, గయాస్, భూషన్, జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రుణ ఎగవేతదారుల జాబితా విడుదల
♦ 5,610 డిఫాల్టర్లు... ♦ 58,792 కోట్ల బకాయిలు: ఏఐబీఈఏ చెన్నై: బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద రూ.58,792 కోట్ల మేర రుణాలు పొంది ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారి జాబితాను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల్లోని 5,610 ఖాతాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో జాతీయ బ్యాంకులకు రూ.28,775 కోట్ల మేర రుణాలు ఎగవేసిన ఖాతాదారులు 3,192 మంది ఉన్నారు. ఒక్క ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులకే 1,546 ఖాతాదారుల నుంచి రూ.18,576 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ ఖాతాదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ఎస్బీఐ గ్రూపు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఇక ప్రైవేటు బ్యాంకులకు 792 మంది ఖాతాదారులు రూ.10,250 కోట్లు ఎగ్గొట్టారు. ఆర్థిక సంస్థలకు 42 మంది ఖాతాదారుల నుంచి రూ.728 కోట్లు, విదేశీ బ్యాంకులకు 38 ఖాతాదారుల నుంచి రూ.463 కోట్లు వసూలు కావాల్సి ఉంది. రోజురోజుకీ పెరుగుతున్న బకాయిలు ఈ సందర్భంగా ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ... బ్యాంకుల్లోని మొండి బకాయిలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.5.39 లక్షల కోట్లకు చేరుకున్నాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి ఇవి కేవలం రూ.2.78 లక్షల కోట్లేనని ఆయన గుర్తు చేశారు. ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల నుంచి రుణ బకాయిలు రాబట్టేందుకు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కలెక్టరేట్ జప్తునకు ఆదేశం
‘ఎల్టా’కు బకారుులుచెల్లించకపోవడమే కారణం వారంలోగా చెల్లిస్తామనే ఒప్పందంతో ముగిసిన వివాదం హన్మకొండ అర్బన్ : ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) కు రూ.2.06లక్షలు బకాయిలు చెల్లించని కారణంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం జప్తు చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఎల్టా ప్రతినిధులు తమ న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి కలెక్టరేట్కు వచ్చి కోర్టు ఆదేశాల పత్రాలను అధికారులకు అప్పగించారు. దీంతో కలెక్టరేట్లో కొద్ది సేపు ైెహ డ్రామా నెలకొనగా చివరకు డబ్బు చెల్లించేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. 2006 నాటి ఘటన జిల్లాలో డీపెప్ ఆధ్వర్యాన 2006సంవత్సరంలో జిల్లా యంత్రాంగం సుమారు 500 మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఎల్టాకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నా శిక్షణ పూర్తయిన తర్వాత డబ్బు చెల్లించలేదు. దీంతో ‘ఎల్టా’ బాధ్యులు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. వెంటనే డబ్బు చెల్లిం చాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ కార్యాలయం జప్తు చేసుకోవాలని(మూవబుల్ ప్రాపర్టీ) తీర్పునిచ్చింది. అరుుతే, ఈ తీర్పుపై అధికారులు స్టే తెచ్చుకోవడంతో పాటు హైకోర్టులో అప్పీల్కు వెళ్లారు. కానీ హైకోర్టు కూడా పిటీషనర్లకు డబ్బు చెల్లించని కారణంగా కలెక్టరేట్ జప్తునకు గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఎత్తివేయడంతో అవే ఉత్తర్వులు అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఎల్టా బాధ్యులు జిల్లా కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటీషన్ వేసుకుని గతంలో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు కోర్టు ఖర్చులతో కలిపి బాధితులకు బకారుు రూ.1.50లక్షలతో పాటు ఖర్చులు కలిపి రూ.2.06లక్షలు చెలించాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అమల్లో భాగంగా ఫీల్డ్ అధికారి సత్తార్, ఎల్టా తరపున జిల్లాకోర్టులో వాదించిన న్యాయవాది హరిహరరావు బుధవారం కలెక్టరేట్ అధికారులకు ఉత్తర్వుల కాపీలు అందజేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఎల్టా ప్రతినిధులతో మధ్యవర్తి ద్వారా మాట్లాడి డబ్బులు చెక్కు రూపంలో చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో తమకు డబ్బులు చెల్లిస్తామని అధికారులు చెప్పారని ఎల్టా గౌరవ అధ్యక్షుడు బత్తిని కొమురయ్య, అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఇది రెండో సారి.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో ఆత్మకూరు మండలంలో భూ బాదితులకు పరిహారం ఇచ్చే విషయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం వహించగా వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2009లో కూడా ఇదే విధంగా కోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయం గెలిచింది : కొమురయ్య, శ్రీనివాస్, ఎల్టా బాధ్యులు మేం ఎల్టా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. జిల్లా కలెక్టర్, యంత్రాంగంపై మాకు గౌరవం ఉంది. డబ్బు సమస్య కాకున్నా అధికారులు మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతూ కోర్టుకు వెళ్లే వరకు పట్టిం చుకోలేదు. మొదటి సారి కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. మొత్తానికి హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిం ది. అధికారులు ఇకనైనా నిర్లక్ష్య ధోరణి వీడి నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. -
బకాయిలు రూ.49 కోట్లు!
♦ జిల్లాలో నిలిచిన ‘ఆరోగ్యశ్రీ’ సేవలు ♦ ఏడాది కాలంగా ఆస్పత్రులకు అందని బిల్లులు ♦ వైద్యం నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆస్పత్రులు సాక్షి, రంగారెడ్డి జిల్లా : పేదోడికి ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తలపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి గ్రహణం పట్టింది. ఏడాది కాలంగా ప్రభుత్వం ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కుప్పలుతెప్పలుగా బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రులు స్పష్టం చేశాయి. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్లోని ఆస్పత్రులు మినహా మిగతా అన్నిచోట్ల సేవలు నిలిచిపోయాయి. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఆందోళనతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 450కిపైగా కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. అయితే వీటిలో 65 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోజుకు సగటున 150 మంది పేదలు సేవలు పొందుతున్నట్లు అంచనా. ఇవేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ పథకం కింద అదనంగా కొన్ని జబ్బులను చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో రోగుల సంఖ్య సైతం పెరిగింది. అయితే సేవలందించిన ఆస్పత్రులకు నెలవారీగా బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేసింది. దాదాపు ఏడాది కాలంగా బిల్లుల చెల్లింపులు నిలిచినట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈక్రమంలో జిల్లాకు చెందిన ఆస్పత్రులకు గాను రూ.49కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. అయోమయం.. ఆగమ్యగోచరం ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రులకు వస్తున్న వారికి చేదుఅనుభవం ఎదురవుతోంది. ఆస్పత్రులు చికిత్సలను నిలిపివేయడంతో రోగులు అయోమయంలో పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రోగుల ప్రాణాలమీదకు వస్తోంది. అటు ఉచిత చికిత్స పొందక.. ఇటు ప్రైవేటు ఆస్పతుల్లో చికిత్స చేయించుకోలేక పేద రోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే బకాయిలు చెల్లించేవరకు సేవలందించలేమని పలు ఆస్పత్రులు తేల్చిచెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పరిస్థితి ఆందోళనకర ంగా మారనుంది. -
కొలిక్కిరాని ఫీజు బకాయిల వ్యవహారం
పాలనాపరమైన మంజూరు లేక నిలిచిన ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలే దు. గతనెల 19న రెండేళ్ల ఫీజు బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బడ్జెట్ విడుదల ఉత్తర్వులు (బీఆర్వోలు) ఇచ్చినా వాటికి పాలనాపరమైన మంజూరు రాలేదు. పదిహేను రోజులు గడిచినా తదుపరి ఉత్తర్వులు వెలువడక విద్యార్థులతోపాటు, కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గోరుచుట్టపై రోకలి పోటులా పాలేరు ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో ఫీజు బకాయిలు చెల్లించేందుకు అనుమతినివ్వాలంటూ బీసీ, ఎస్టీ శాఖల ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)కి విజ్ఞప్తులు పంపించారు. బీసీ, ఎస్టీ శాఖలకు సంబంధించే రూ.2,300కోట్ల వరకు బకాయిలున్నా యి. అన్నింటినీ ఒకేసారి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికిప్పుడు పాత బకాయిలన్నీ మొత్తం తీరిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. చెల్లింపునకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. 2014-15, 2015-16 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కింద ఎస్సీశాఖకు రూ.517.35 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.288.92 కోట్లు, బీసీ సంక్షేమశాఖకు రూ.1954.26 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖకు రూ.300.49కోట్లు, వికలాంగ సంక్షేమశాఖకు ఆర్టీఎఫ్ కింద రూ.68.88 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్వోలు ఇచ్చింది. -
పంచాయతీల కరెంటు బిల్లు రూ.16 కోట్లు
♦ రాబట్టేందుకు రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ ♦ శంషాబాద్ మండలంలో వీధి దీపాల కనెక్షన్ల తొలగింపు వీధి దీపాలు, నీటి సరఫరాకు సంబంధించిన కరెంటు కనెక్షన్ల బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శంషాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 16.67 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బకాయిలను వసూలు చేసేందుకు ట్రాన్స్కో అధికారులు నడుం బిగించారు. వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. -శంషాబాద్ శంషాబాద్ ట్రాన్స్కో డివిజన్ పరిధిలోని ఎయిర్పోర్టు కాలనీ, నర్కూడ, బహదూర్గూడ, చెర్లగూడ, హమీదుల్లానగర్ , దొడ్డి, కాచారం, కవ్వగూడ, కొత్వాల్గూడ, పోశెట్టిగూడ, రాళ్లగూడ, రషీద్గూడ, రాయన్నగూడ, సంఘీగూడ, శంషాబాద్, శంకరాపురం, సుల్తాన్పల్లిలో వీధిదీపాల బకాయిలు రూ. 4.77 కోట్లు వసూలు కావాల్సి ఉంది. పీడబ్ల్యూఎస్కు సంబంధించిన బకాయిలు రూ. 6.98 కోట్లు పేరుకుపోయాయి. మొత్తం కలిపి రూ. 11. 75 కోట్లు డివిజన్ పరిధిలో చెల్లించాల్సి ఉంది. పెద్దషాపూర్ డివిజన్ పరిధిలోని బోటిగూడ, గండిగూడ, ఘాంసిమీయాగూడ, జుకల్, కవేలిగూడ, కిషన్గూడ, మదన్పల్లి, మల్కారం, ముచ్చింతల్, ననాజీపూర్, పాలమాకుల, పెద్దతూప్ర, పిల్లోనిగూడ, రామాంజపూర్, పెద్దషాపూర్, తొండుపల్లి, ఊట్పల్లి తదితర గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించి విద్యుత్ బకాయిలు రూ. 1.58 కోట్లు ఉండగా పీడబ్ల్యూఎస్కు సంబంధించిన మొత్తం రూ. 3.33 కోట్లు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా ఇటీవల సంబంధిత ట్రాన్స్కో అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందనరాలేదు. దీంతో ఎలాగైనా విద్యుత్ బిల్లులు రాబట్టేందుకు విద్యుత్ అధికారులు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో వీధి దీపాలకు సంబంధించిన కనెక్షన్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. రెండురోజుల క్రితం టీఎస్ పీడీసీఎస్ ప్రత్యేకాధికారి తిరుపతయ్యగౌడ్ తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. విద్యుత్ బకాయిలను రాబట్టేందుకు ఆయా గ్రామ సర్పంచ్లను కలిసి పరిస్థితి వివరించారు. బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించిన కనెక్షన్లను తొలగించారు. దీంతో బకాయిలు వసూలయ్యేంత వరకు గ్రామాల్లో చీకట్లు కమ్ముకునే పరిస్థిలు నెలకొనడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు తీరు సరికాదని కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు చెల్లించాల్సిందే: రాజేంద్రనగర్ డీఈ సోమిరెడ్డి వీధి దీపాలు, పీడబ్ల్యూఎస్కు సంబంధించి పంచాయతీలు వినియోగించిన విద్యుత్ బిల్లులు చెల్లించాలని రాజేంద్రనగర్ డీఈ సోమిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ మండల పరిధిలో మొత్తం రూ. 16 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయా బిల్లులను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేయాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. బకాయిలు చెల్లించని కారణంగానే వీధి దీపాల కనెక్షన్లు తొలగిస్తున్నాం. -
ఎన్టీఆర్ వైద్యసేవకు బకాయి సుస్తీ
పేద రోగులు వైద్యసేవల కోసం మునుపటిలా కార్పొరేట్ ఆస్పత్రుల మెట్టెక్కేందుకు సంశరుుస్తున్నారు. ఆరోగ్యశ్రీ (ప్రస్తుత పేరు ఎన్టీఆర్ వైద్యసేవ) కార్డు వెంటబెట్టుకుని వెళ్లడానికి వెనుకాడుతున్నారు. తమను చేర్చుకుని వెంటనే సేవలందిస్తారా లేదా అనే సందేహం వీరిని వెంటాడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. చేర్చుకుని సేవలందిస్తే సర్కారు నిధులు విడుదల చేస్తుందా లేదా అనే మీమాంస కార్పొరేట్ ఆస్పత్రులను వెంటాడుతోంది. ఇప్పటికే బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రోగులను చేర్చుకోవడం పట్ల అంత ఆసక్తి కనబరచడం లేదని భోగట్టా. అంతేకాదు తమ బకాయిల కోసం ఉద్యమించడానికి కార్పొరేట్ ఆస్పత్రులు సిద్ధపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం దూరమయ్యేలా ఉంది. * ఎన్టీఆర్ వైద్యసేవకు నిధులు విడుదల చేయని సర్కారు * కార్పొరేట్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు * వైద్యసేవలు నిలిపివేయాలనే యోచనలో ఆస్పత్రి యాజమాన్యాలు శ్రీకాకుళం సిటీ : ఎన్టీఆర్ వైద్యసేవలకు నిధుల గ్రహణం వెంటాడుతోంది. రిమ్స్తో పాటు పాలకొండ, టెక్కలి, పాతపట్నం, సీహెచ్సీల్లో ఈ పథకం కింద వైద్య సేవలందుతున్నాయి. వీటితో పాటు ఎంపిక చేసిన కార్పొరేట్ ఆస్పత్రులు బగ్గు సరోజనీదేవి, కిమ్స్ సాయిశేషాద్రి, సిందూర, జీఎంఆర్, జెమ్స్లలో కూడా వైద్య సేవలు అందుతున్నాయి. 2007లో అప్పటి ముఖమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేదలకు కార్పొరేట్ స్ధాయి వైద్యం అందించాలన్నదే ముఖ్య ఉద్ధేశంగా ఆయన ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి పేరు మార్చింది. ఎన్టీఆర్ వైద్యసేవగా తెర పైకి తీసుకువచ్చింది. పేదప్రజలకు అందిస్తున్న వైద్యానికి రకరకాలు మెలికలు పెట్టి కుదించేసింది. కార్పొరేట్ ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలుచేస్తున్నా ప్రభుత్వం సరిగ్గా నిధులు చెల్లించడం లేదు. దీంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రపదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్(ఆషా) ఆందోళన కూడా చేపట్టాల్సి వచ్చింది. కొన్ని నెలలుగా ప్రభుత్వానికి, ఆషాకు మద్య పలుపర్యాయాలు చర్యలు జరిగినా ఫలితం అంతంతమాత్రమే. ఈనెల 11వ తేదీలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వం తన హామీని అమలు చేయకపోవడంతో ఆషా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్ వైద్యసేవలను బంద్ చేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఇదే జరిగితే పేద రోగులకు ఇక్కట్లు తప్పవు. శ్రీకాకుళం పట్టణంలో డేఅండ్నైట్ జంక్షన్ సమీపంలో ఉండే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో నిర్వహించిన 407 (ఈఎన్టీ, జనరల్సర్జన్,గైనిక్, యూరాలజీ తదితర విబాగాలకు) శస్త్ర చికిత్సలకు మూడునెలలుగా రూ. 60 లక్షలకు పైగా బకాయిలు రాలేదని తెలిసింది. ఇది ఒక ఆస్పత్రి బకాయి మాత్రమే. మరో నాలుగు ఆస్పత్రులకు రూ. కోట్లల్లోనే బకాయిలన్నట్లు తెలియవచ్చింది. ఈ బకాయిల పరిస్థితి రోగులను ప్రభావితం చేస్తోంది. ఈ పథకం కింద సేవలదించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. రోగులను చేర్చుకుంటే మరింత బకారుులు పేరుకుపోవడం తప్ప ఫలితం లేదని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రోగులు ఈ ఆస్పత్రులకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. శస్త్ర చికిత్సలు సకాలంలో జరగడంలేదు. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యసేవలు బంద్ చేపట్టనున్న సమచారం అధికారికంగా తమకు చేరలేదని ఎన్టీఆర్ వైద్యసేవల జిల్లా కో-ఆర్డినేటర్ రాజేష్ పేర్కొనడం విశేషం. -
సమస్యలు దండి.. నిధులు లేవండి!
ఎస్ఎఫ్సీ నిధులివ్వని రాష్ట్రం రూ.50 కోట్ల ఎగవేత ఆర్థిక సంఘం నిధుల్లో కోతపెట్టిన కేంద్రం మొక్కుబడిగా ట్యాక్స్, నాన్ట్యాక్స్ వసూళ్లు నిధులు లేక నీరసిస్తున్న గ్రామ పంచాయతీలు రాష్ట్రప్రభుత్వం నిధులివ్వక.. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కేంద్రప్రభుత్వం కోతవిధించి.. గ్రామపంచాయతీల పరిధిలో పన్నులు వసూళ్లుగాక.. పంచాయతీలు నీరసించి పోతున్నాయి. అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేక చతికిలపడుతున్నాయి. చిత్తూరు: జిల్లాలోని 66 మండలాల పరిధిలో 1,363 గ్రామపంచాయతీల పరిస్థితి దారుణంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడం, పన్ను బకాయిలు పేరుకుపోతుండడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. వసూలు కాని పన్నులు చిత్తూరు డివిజన్లో ఇంటి పన్నులు పాత బకాయిలతో కలిపి రూ.4,12,39,958 వసూలు కావాల్సి ఉండగా, రూ.2,19,40,594 (53.20శాతం) మాత్రమే వసూలైంది. ఇదే డివిజన్లో నాన్ ట్యాక్స్ (కొళాయి ఫీజు, లెసైన్సు ఫీజు, రూమ్ రెంట్, మార్కెట్, బస్టాండు తదితర) రూ. 81,39,793 వసూలు కావాల్సి ఉండగా, రూ. 71,74,688 వసూలైంది. తిరుపతి డివిజన్లో ఇంటి పన్నులు (ట్యాక్స్) రూ.13,40,60,719 వసూలు కావాల్సిఉండగా, 8,02,65,270 వసూలైంది. ఇదే డివిజన్లో నాన్ ట్యాక్స్ రూ.11,16,62,744 వసూలు కావాల్సి ఉండగా రూ.10,35,66,540 వసూలైంది. మదనపల్లె డివిజన్లో ఇంటి పన్నులు (ట్యాక్స్) రూ.10,32,24,543 వసూలు కావాల్సి ఉండగా, రూ.6,01,98,279 వసూలైంది. నాన్ ట్యాక్స్ పరిధిలో రూ.8,76,19,354 వసూలు కావాల్సి ఉండగా రూ.7,11,95,098 వసూలైంది. జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్నులు (ట్యాక్స్) రూ.27,85,25,220 వసూలు కావాల్సి ఉండగా రూ.16,24,04,143 (58.31శాతం) వసూలైంది. నాన్ ట్యాక్స్ కింద రూ.20,74,21,891 వసూలు కావాల్సి ఉండగా రూ.18,19,36,326 మాత్రమే వసూలైంది. మొత్తం 48,59,47,111 రూపాయలు వసూలు కావాల్సి ఉండగా, రూ.34,43,40,469 వసూలైంది. ఇంటిపన్ను (ట్యాక్స్) రూ.27.85 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉండగా, ఇందులో 58.31 శాతం మాత్రమే వసూలైంది. పంచాయతీల పరిధిలో జిల్లావ్యాప్తంగా నెలకు రూ.15 కోట్ల మేరకు విద్యుత్ బిల్లు వస్తోంది. ప్రస్తుతం రూ.150 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఆర్థిక సంఘం నిధుల్లో కోత గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కోతపెట్టింది. 2014-15లో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.137.67 కోట్లు ఇచ్చిన కేంద్రం ఈ ఏడాది రూ.88 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ నిధులను సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు వెచ్చించాల్సి ఉండగా గ్రామపంచాయతీలు విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ఖర్చు చేస్తున్నారు. నిధులివ్వని రాష్ట్రం 2015-16 ఏడాదికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫిషనల్ ట్యాక్స్, యునానిమస్ గ్రాంట్, సీనరైజస్ చార్జెస్, ఫర్ క్యాపిటా గ్రాంట్ మొత్తం కలిపితే కేవలం రూ.22,00,57,000 నిధులిచ్చింది. ఇక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి జిల్లాకు రూ.50కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉన్నా ఒక్క పైసా చెల్లించలేదు. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్శాఖ కనెక్షన్లు తొలగించేపనిలో పడింది. అధికారులు ఉపాధి హామీ నిధులుతో అరకొరగా సిమెంట్ రోడ్లు నిర్మించి మమ.. అనిపిస్తున్నారు. -
'పీఆర్సీ బకాయిలు విడుదల చేయండి'
మంత్రి ఈటలకు పీఆర్టీయూ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్కు పీఆర్టీయూ-టీఎస్ విజ్ఞప్తి చేసింది. సోమవారం సచివాలయంలో పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి, ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ అధ్యక్షుడు దేశ్పాండే మంత్రిని కలిశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీన వేతనాలివ్వాలని కోరారు. -
ఆస్తి పన్నుకు రిబేటు
ఏడాది ముందు చెల్లిస్తే 5 శాతం రాయితీ మున్సిపాలిటీలకు అందిన ఉత్తర్వులు పన్నుల వసూలు వేగవంతం చేసేందుకే ఈ నెల 30 లోపు చెల్లిస్తేనే వర్తింపు నెల 1 నుంచి 2017 మార్చి 31 వరకు ఆస్తిపన్నుకే అమలు పాత బాకీకి పెనాల్టీలు తప్పవు గుడివాడ : మున్సిపాలిటీల్లో కొండలా పేరుకుపోయిన పన్ను బకాయిలను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రెండు అర్ధ సంవత్సరాల ఆస్తి పన్ను మొత్తాన్ని ఒకేసారి చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఒకేసారి వసూలు చేయటం కోసం ఇంటిపన్ను చెల్లించేవారికి ఐదు శాతం రాయితీని ప్రకటించింది. మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ శాఖ ఈ మేరకు అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఏడాది ఆస్తి పన్నును ఈ నెల 30 లోపు చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుందని ఉత్తర్వులలో తెలిపారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థల్లో ఆస్తిపన్ను వసూలు వేగవంతంగా ఉండాలనే నిర్ణయంతో ఈ రాయితీని ప్రకటించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రతి ఏటా రెండు అర్ధ సంవత్సరాలలో రెండు విడతలుగా ఆస్తి పన్నులు చెల్లించేవారు. ఒకేసారి చెల్లించటం వల్ల మున్సిపాలిటీలకు ఆదాయం పెరగటంతో పాటు ఎక్కువ శాతం వసూలయ్యే అవకాశముందని అధికారుల అంచనా. ఇప్పటికే పన్ను బకాయిలు ఉన్నవారు మాత్రం పాత బకాయిని తప్పనిసరిగా వడ్డీతోనే చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని ఒక్క గుడివాడ మున్సిపాలిటీలోనే ఏడాదికి రూ.6 కోట్ల పన్ను వసూళ్లు కావాల్సి ఉంది. వాటిలో ఎక్కువ మొత్తం ఈ రాయితీ ద్వారా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. -
కార్పొరేట్లపై ‘మాల్యా’ మరక తగదు...
కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: కార్పొరేట్లలో ఘనత వహించినవారెందరో ఉన్నారని.. అయితే, అందరినీ బకాయిలు ఎగవేసిన విజయ్ మాల్యా వంటి వారి గాటన కట్టకూడదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు. ఆమె ఈ మేరకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘కార్పొరేట్ల అనుచిత అంశాలు ఒక్క భారత్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. అయితే భారత్లో దేశీయ, అంతర్జాతీయ కంపెనీల మంచి పనితీరును మాల్యా వంటి అంశాలతో కప్పివేయడం సరికాదని అన్నారు. విజయ్ మాల్యా ఘటన భారత్ పట్ల ఇన్వెస్టర్లలో ప్రతికూల భావనలను లేవనెత్తుతుందా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, ఇలాంటి పరిస్థితి ఉండబోదని తాము భావిస్తున్నామన్నారు. భారత్ ఈ తరహా అంశాల నుంచి పాఠాలు నేర్చుకుందని, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మాల్యా గ్రూప్ కంపెనీ 17 బ్యాంకుల నుంచి రూ.9,000 కోట్లు రుణాలు తీసుకుంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా విమర్శలను ఎదుర్కొంటున్న మాల్యా... మార్చి 4న దేశం వదలి వెళ్లారు. ప్రస్తుతం బ్రిటన్లో ఉన్నట్లు సమాచారం. పలు విచారణా సంస్థలు ఆయన కంపెనీల ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుపుతున్నాయి. -
చెరకు రైతుకు అండ
నెలాఖరులోగా బకాయిలు ఇవ్వకుంటే ఆందోళన మంత్రుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ చోడవరం: చెరకు రైతులకు ఈనెలాఖరులోగా బకాయిలు ఫ్యాక్టరీలు చెల్లించకపోతే జిల్లా కలెక్టరేట్ వద్ద రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగుతుందని వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ ప్రతినిధి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఇక్కడ మంగళవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను మోసం చేస్తూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కిందస్థాయి వరకు అంతా దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గోవాడ ఫ్యాక్టరీని రూ.25 కోట్లు లాభాల్లో ఉంచితే ఇప్పుడు పూర్తిగా నష్టాల్లోకి తెచ్చి చివరికి రైతులకు సకాలంలో పేమెంట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి తేవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. టన్నుకు రూ.175చొప్పున ఇవ్వాల్సిన బకాయి పేమెంట్ ఈనెల 31లోగా ఇవ్వకపోతే వచ్చే నెలలో జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగుతుందని, ఈ విషయమై శాసనసభలో కూడా పార్టీ తరపున ప్రస్తావిస్తామని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఇది పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి మాట అని బొత్స చెప్పారు. గతంలో కూడా ఇందిరమ్మ కమిటీలను గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిందని, అయితే ఎవరైనా అర్హులు పథకాలకు ఉండిపోతే సూచించడానికే ఆ కమిటీ పరిమితమయ్యేదని గుర్తుచేశారు. కాని ఇప్పుడు జన్మభూమి కమిటీలు అర్హులైన వారిని కూడా తీసేయడంతోపాటు దోపిడీలకు పాల్పడతున్నాయని ఆరోపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఇష్టారాజ్యం: రాష్ర్ట శాసనసభలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బొత్స పేర్కొన్నారు. శాసనభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం సంప్రదాయమని, అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ప్రతి మాటకు మంత్రులు అడ్డుపడి ఇష్టారాజ్యంగా మాట్లాడటం, పది మంది మంత్రులు ఒకేసారి మాటల దాడికి దిగడం అధికార పార్టీ దౌర్జన్యపూరిత విధానాలకు అద్దంపడుతోందన్నారు. శాసనసభలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ప్రజలు చూస్తున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులతో సహా అధికార పార్టీ తీరు, వారు వాడుతున్న పదజాలం చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న ప్రసుత్త శాసనసభకు వెళ్లకపోవడమే మంచిదని కొందరు సీనియర్ నేతలు అనుకునే స్థాయిలో సభ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ రాజధాని నిర్మించినా తమ పార్టీకి అభ్యంతరం లేదని, అయితే రాజధాని పేరుతో జరుగుతున్న భూదందా,దోపిడీలకు వ్యతిరేకంగానే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని బొత్స స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందు మంత్రులకు, తన సన్నిహితులకు సీఎం చెప్పి రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకొని, వారికి పంట దక్కకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ భూ దోపిడీపై విచారణ చేయించాలని బొత్స డిమాండ్ చేశారు. తమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి శాసనసభలో మాట్లాడుతున్న తీరు చాలా దారుణంగా ఉందన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం: జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాధ్ మాట్లాడుతూ పార్టీ కమిటీలు నెలకు ఒకసారి సమావేశాలు నిర్వహించుకొని గ్రామస్థాయి ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. విశాఖకు రైల్వేజోన్ను ఏప్రిల్ 14లోగా ఇవ్వకపోతే ఆమరణదీక్షకు దిగుతానని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు పరిశీలిస్తున్నారని, టీడీపీకి త్వరలోనే బుద్ధిచెబుతారన్నారు. సమస్యలు గాలికొదిలేసిన ఎమ్మెల్యే: నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గం అనేక మంది అర్హులకు పింఛన్లు సైతం ఇవ్వలేదని, స్థానిక ఎమ్మెల్యే ప్రజాసమస్యలు వదిలేసి మూడు క్వారీలు, ఆరు క్రషర్లుగా సొంత పనులు చేసుకోవడానికే అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. గోవాడ సుగర్స్లో రైతుల సొమ్ముతో ఎమ్మెల్యే, సుగర్స్ చైర్మన్ పేరుతో విరాళాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రతినిధులు కొయ్య ప్రసాద్రెడ్డి, గొల్ల బాబూరావు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, మాజీలు ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు, తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు, తిప్పలనాగిరెడ్డి , కర్రి సీతారాం, పార్టీ నాయకులు జాన్ వెస్లీ, సత్తిరామకృష్ణారెడ్డి, వీసం రామకృష్ణ, బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నోటీసుల కలకలం
బకాయిలు చెల్లించాలంటూ పీఏసీఎస్ ఒత్తిడి 550 మంది రైతులకు నోటీసులు రుణ మాఫీ ఎందుకు వర్తించలేదని ఆందోళన అప్పు తీసుకోకున్నా నోటీసులిచ్చారని మరికొందరి ఆరోపణ తక్షణం రుణ బకాయిలు చెల్లించాలని, లేకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ పీఏసీఎస్ అధికారులు ఒక్క సారిగా రైతులకు నోటీసులివ్వడం కలకలం సృష్టించింది. ఎప్పుడో పదేళ్లు... పాతికేళ్ల కిందట తీసుకున్న రుణాలకు ఇప్పుడు నోటీసులేమిటని రైతులు మండి పడుతున్నారు. అసలు రుణమే తీసుకోలేదు.. అయినా నోటీసులు వచ్చాయని, ఇందులో ఏదోగోల్మాల్ జరిగిందని మరి కొందరు అంటున్నారు. చీడికాడ: స్థానిక పీఏసీఎస్ పరిధిలోని 19 పంచాయతీలకు చెందిన 550 మంది రైతులకు రుణాలు చెల్లించాలంటూ పీఏసీఎస్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పీఏసీఎస్ పరిధిలో 1988 నుంచి 2006 మధ్య కాలంలో గొర్రెలు, మేకలు, ఆవులు, ఇసుక మేటల తొలగింపు కోసం తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు వడ్డీలతో తక్షణమే చెల్లించాలని వారం రోజుల క్రితం సిబ్బంది రైతులకు నోటీసులు అందించారు. ఎప్పుడో పది..పాతికేళ్ల కిందట తీసుకున్న రుణాలకు ఇప్పడు నోటీసులు రావడమేమిటని, తమకు మాఫీ వర్తించకుంకే అప్పుడే చెప్పాలి కదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు తాము అప్పే తీసుకోలేదని, బకాయిలు చెల్లించమని నోటీసులు రావడమేమిటని మరికొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. మృతుల వారసులకు నోటీసులు అప్పట్లో రుణాలు తీసుకున్న 550 మందిలో సుమారు 180 మంది వరకు మరణించారు. వారి వారసులకు ఇప్పుడు నోటీసుల రావడంతో వారు లబోదిబోమంటున్నారు. కాగా, తమ ఆస్తులు జప్తు చేస్తామంటున్నారని, తమకు రక్షణ కల్పించాలని బాధిత రైతులు సోమవారం చీడికాడకు చెందిన అడ్వకేట్ యర్రా వెంకటరావుతో కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు ఎలాంటి ఫిర్యాదు స్వీకరించలేదు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఇన్చార్జి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడు నోటీసులేమిటి? ఈ సందర్భంగా రైతులు రెడ్డి కొండబాబు, బొడ్డు కన్నయ్య, రెడ్డి నాయుడు తదితరులు మాట్లాడుతూ పీఏసీఎస్ నుంచి ఏ రుణాలు తీసుకున్నా నిబంధనల ప్రకారం ఏడాది తరువాత రైతులకు నోటీసులు జారీ చేస్తారని పాతికేళ్ల తరువాత బకాయిలున్నాయంటు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. మొదటి విడత 2006లో రుణ మాఫీ జరిగిన పుడు.. మా రుణాలు మాఫీ కాకుంటే అప్పట్లో నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. రుణాలే తీసుకోని తమ పేరిట బకాయిలున్నాయని నోటిసులిచ్చారని, పాలకవర్గం, సిబ్బందే తమ పేర్లుమీద బినామీ రుణాలు తీసుకుని అవకతవకలకు పాల్పడి ఉంటారని రైతులు పాలకుర్తి సత్యనారాయణమ్మ, వంటాకు దేముడు ఆరోపించారు. 1988 నుంచి 2006 మధ్య కాలంలో లావాదేవీలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, రూరల్ ఎస్పీ, కో-ఆపరేటివ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. దీర్ఘకాలిక రుణాల రైతులకే నోటీసులు 1988 నుంచి 2006 మధ్య దీర్ఘకాలిక రుణాలు తీసుకుని పూర్తిస్థాయిలో చెల్లించని వారికే నోటిసులిచ్చాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1997 నుంచి 2007 మధ్య రుణాలకే మాఫీ వర్తింపచేశారు. రుణమాఫీకి ముందు తరువాత ఇన్స్టాల్మెంట్లు రైతే చెల్లించాలి, అటువంటి వారికే నోటీసులు ఇచ్చాం. అయితే చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీలో ఆ రుణాలు పోతాయని ఇప్పటివరకు చూశాం.. ఈ ప్రభుత్వం స్వల్పకాలిక రుణాలను మాత్రమే మాఫీచేసింది.. ఒక్క దీర్ఘకాలిక రుణం కూడా మాఫీకాలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు నోటీసులిచ్చాం -బత్తిన సత్యనారాయణ, పీఏసీఎస్ కార్యదర్శి -
ప్రభుత్వ విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు కట్టాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం వాడే విద్యుత్ బిల్లులు ప్రతి నెలా కచ్చితంగా చెల్లించేలా ఆయా శాఖలకు, కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకిచ్చే వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలతో పాటు ఇతర రాయతీల కింద విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని ఆదేశించారు. -
మొండి ఘటాలు!
♦ కడప నగర పాలక సంస్థలో సగం కూడా వసూలు కాని పన్నులు ♦ అధికార పార్టీ అండతో మొండి కేస్తున్న బడా నేతలు ♦ ఎక్కువ మొత్తంలో బకాయిలన్నీ వారివే ♦ ఇరువైపులా ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది సతమతం కడప కార్పొరేషన్ : ఓ వైపు 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా కడప నగర పాలక సంస్థలో మాత్రం పన్నులు సగం కూడా వసూలు కాలేదు. నగరంలోని ప్రైవేట్ ఆస్తుల నుంచి రావలసిన పన్ను రూ.22 కోట్లకు పైగా ఉండగా, ప్రస్తుతం రూ.12 కోట్లు మాత్రమే వసూలైంది. కేంద్ర, రాష్ట్ర కార్యాలయాల నుంచి కూడా రూ.15 కోట్లు రావలసి ఉంది. కడప నగరంలో పేరు, పలుకుబడి ఉన్న అధికార పార్టీ నేతలే ఎక్కువ మొత్తంలో పన్నులు బకాయిపడి చెల్లించకుండా మొండికేస్తున్నారని కార్పొరేషన్ వర్గాలు వాపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలైన ఆర్అండ్బీ, హరిత, ఇతర కార్యాలయాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పన్ను వసూలు కావలసి ఉంది. మార్చి అఖరు నాటికి 100 శాతం కలెక్షన్ చేయాలని మున్సిపల్ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఒకవైపు, మరోవైపు అధికారపార్టీ నేతల మొండి వైఖరి, బెదిరింపులతో నగర పాలక రెవెన్యూ అధికారులు, సిబ్బంది సతమతమవుతున్నారు. పెద్దమొత్తంలో పన్ను బకాయిపడ్డ వారి సంస్థలు, ఇళ్ల ముందు ఆందోళన నిర్వహిస్తున్నా ఆశించినంత ఫలితం కనిపించడం లేదు. బకాయిలు వసూలు చేసేందుకు రెవెన్యూ సిబ్బంది వెళితే రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న వారి నుంచి కమిషనర్కు ఫోన్లు చేయిస్తూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాగేతై పన్నులు వసూలు చేయడం తమ వల్ల కాదని నగర పాలక సంస్థ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్లు వరుసగా ఆస్తి పన్నుపై వడ్డీ మినహాయించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం లోటు బడ్జెట్ను సాకుగా చూపి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం లేదు. దీంతో చాలా మంది బకాయిదారులు వడ్డీ మాఫీ అవుతుందనే ఆశతో పన్ను చెల్లించకుండా మొండికేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి డిమాండ్ నోటీసులు, రెడ్ నోటీసులు, ట్యాప్ కనెక్షన్ నోటీసులు, ఆక్యుపై నోటీసులు జారీ చేశారు. ఆస్తులు వేలం వేసైనా పన్నులు రాబట్టాల్సిందేనని ఉన్నతాధికారులు జప్తు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేసేందుకు కృషి చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ పి. చంద్రమౌళీశ్వర్రెడ్డి తెలిపారు. సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించామన్నారు. -
మొండిబకాయిలు @ రూ.506.51 కోట్లు
♦ పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తులు ♦ వసూలుకు బ్యాంకర్ల తంటాలు ♦ మాఫీ హామీ వల్లే మాకీ పరిస్థితి అంటున్న బ్యాంకర్లు బడాబాబుల బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయినా పట్టించుకోరు. కానీ రైతులు, డ్వాక్రాసంఘాలు, చిరువ్యాపారులు రుణాలు చెల్లించడంలో కాస్త ఆలస్యం చేస్తే చాలు... నోటీసుల మీద నోటీసులిస్తారు. ఆస్తులను జప్తు చేస్తారు. వేలం వేస్తారు. ఇదీ బ్యాంకర్ల తీరు. విశాఖపట్నం: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాఫీ హామీల మాయలో పడి ఎప్పుడూ క్రమం తప్పకుండా రుణాలు చెల్లించే అన్నదాతలు..డ్వాక్రాసంఘాల మహిళలు తీసుకున్న అప్పులు కూడా నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిపోయాయి. వ్యవసాయ, స్వల్పకాలిక పంట రుణాల కింద 80,010 రైతుల(అకౌంట్స్)కు ఏకంగా రూ.3438 కోట్ల అవుట్స్టాండింగ్ (వడ్డీతో కలిసి మొత్తం బకాయిలు) ఉన్నాయి. దాంట్లో 64,978 రైతులకు రుణమాఫీ పుణ్యమాని రూ.397.78 కోట్ల మేర ఓవర్డ్యూస్ జాబితాలో చేరాయి. వీటిలో ఎన్పీఎ(నిరర్ధక ఆస్తుల) జాబితా కిందకు 25,628 మంది రైతులకు రూ.124.23 కోట్లు చేరాయి. ఇక 5395 డ్వాక్రా సంఘాలకు రూ.52.59 కోట్ల బకాయిలకు 310 సంఘాలకు చెందిన రూ.5.89 కోట్ల మేర ఓవర్డ్యూస్ జాబితాలో ఉన్నాయి. 326 సంఘాలకు చెందిన రూ.2.421 కోట్లు ఎన్పీఏ జాబితాలో చేరాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కోసం 1,91,333 మందికి రూ. 780.86 కోట్ల రుణాలిస్తే..దాంట్లో 14,617 మంది రైతులకు రూ.800 కోట్ల మేర ఓవర్ డ్యూస్గా చూపిస్తున్నారు. వీటిలో ఎన్పీఏ జాబితాలో 3916 మందికి చెందిన రూ.17.59 కోట్ల మేర చేరాయి. ఇక ఎంఎస్ఎంఈ కింద 64,195 మందికి రూ.4789.41 కోట్ల బకాయిలుంటే.. 7305 మందికి చెందిన రూ.721.62 కోట్ల ఓవర్ డ్యూస్గా మిగిలాయి. వీటిలో 3084 మందికి చెందిన రూ.118.96 కోట్ల మొండి బకాయిల(ఎన్పీఎ) జాబితాలో చేర్చారు. ఇతర ప్రాధాన్య రంగాల కింద ఇచ్చిన రుణాల్లో 78,483 మందికి రూ.4186.24 కోట్ల బకాయిలుంటే, 7393 మందికి చెందిన రూ.290.91 కోట్ల ఓవర్ డ్యూస్ జాబితాలో ఉన్నాయి. వీటిలో 5206 మందికి చెందిన రూ.53.43 కోట్ల మొండిబకాయిలుగా చూపిస్తున్నారు. ఇక ప్రాధాన్యేతర రంగాలకు ఇచ్చిన రుణాల్లో 2,30,421మందికి రూ.12,613.71 కోట్లు బకాయిలుగా పేర్కొంటుండగా, 11,595 మందికి చెందిన రూ.796.97 కోట్లు ఓవర్ డ్యూస్గా పేర్కొంటున్నారు. వీటిలో 29,457 మందికి చెందిన రూ.191.56 కోట్ల మేర మొండి బకాయిలు(ఎన్పీఎ)గా పేర్కొంటున్నారు. ఇలా మొత్తమ్మీద 67,290 అకౌంట్స్కు చెందిన రూ.506.51 కోట్లు ఎన్పీఏ జాబితాలో చేర్చారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఉండేది కాదని బ్యాంకర్లు చెబుతున్నారు. వీటి వసూలు కోసం ఆయా బ్యాంకులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాయి. మాఫీ హామీల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బ్యాంకర్లు చెబుతున్నారు. -
చెరకు వేయలేం!
గిట్టుబాటు ధర పెంచాలి, బకాయిలు చెల్లించా షుగర్స్ కమిషనర్ను నిలదీసిన రైతులు కారు ముందు రైతు సంఘం నాయకుల బైఠాయింపు చోడవరం: గిట్టుబాటు ధర ఇవ్వాలని, చెరకు బకాయిలు చెల్లించాలని రైతులు రాష్ట్ర సుగర్స్ కమిషనర్ మురళిని నిలిదీశారు. సోమవారం గోవాడ సుగర్ ప్యాక్టరీకి వచ్చిన కమిషనర్ను రైతులు చుట్టుముట్టారు. క్రషింగ్ సీజన్ కావడంతో ఫ్యాక్టరీకి చెరకు తీసుకొచ్చిన రైతులు, పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మునుపెన్నడూలేని విధంగా ఈ ఏడాది సకాలంలో చెరకు బకాయిలు చెల్లింపులో చాలా ఆలస్యం జరిగిందని, పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని రైతులు గగ్గోలు పెట్టారు. తమ కష్టాలు చెప్పుకుందామంటే పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నుకు రూ.3 వేలు గిట్టుబాటు ధర ఈ ఏడాది ఇవ్వాలని, లేదంటే వచ్చే ఏడాది నుంచి చెరకు పంట వేయలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దశలవారీగా పేమెంట్స్ ఇస్తామని యాజమాన్యం చెబుతోందని, అలాకాకుండా అంతా ఒకే సారి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. చెరకు ఫ్యాక్టరీలను, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ధ్వజమెత్తారు. హుద్హుద్ తుఫాన్కు ఫ్యాక్టరీ నష్టపోయినా కనీసం ఇన్సూరెన్సు కూడా ఇవ్వలేదన్నారు. టన్నుకు మూడు వేలు ఇవ్వాలి అనంతరం ఎపీ చెరకు రైతు సంఘం నాయకులు మరికొంత మంది రైతులు వచ్చి కమిషనర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్ కారు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనకాపల్లి సుగర్ ప్యాక్టరీని తెరిపించాలని, టన్నుకు రూ.3 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గోవాడ ఫ్యాక్టరీలో కటింగ్ ఆర్డర్లు సక్రమంగా ఇవ్వడం లేదని, ఫ్యాక్టరీలో జరిగిన అవినీతిపై వెంటనే విచారణ నివేదిక బహిర్గతం చేయాలని, యంత్రాల కొనుగోలులో అవకతవలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ కిందకు దిగి రైతు సంఘం నాయకులతో మాట్లాడారు. బకాయిలు నెలాఖరులోగా చెల్లిస్తామని, మిగతా విషయాలను ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళతామన్నారు. అంతకు ముందు వడ్డాది చెరకు కాటాను, రేవళ్లు ప్రాంతంలో రైతులను కలిసి చెరకు సాగుపై కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలంటూ కార్మికులు సుగర్స్ కమిషనర్ను కోరారు. సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న గోవాడ యాజమాన్యం అదనంగా ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు సిబ్బందిని నియమిస్తోందని గుర్తింపు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు తోట శంకరావు, శరగడం రామునాయుడు కమిషనర్ దృష్టికి తెచ్చారు. కారుణ్య నియామకాలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా పదవీవిరమణ వయస్సును 60ఏళ్లకు పెంచాలని కోరారు. తమను పర్మినెంట్ చేయాలని, జీతభత్యాలు పెంచాలని ఫ్యాక్టరీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు, ఫ్యాక్టరీ సెక్యూరిటీ కంట్రోల్ లేబర్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు జె.రమణ, టి.గంగరాజు కోరారు. -
రుణభారం పెను శాపం
⇒రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు ⇒ఆ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వం ⇒బకాయిలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకర్ల నోటీసులు ⇒పంటలు లేక, చేతిలో చిల్లి గవ్వ లేక ఆందోళనలో అన్నదాత ‘రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రుణమాఫీతో మాకు సంబంధం లేదు.. బకాయిలు చెల్లించకపోతే వడ్డీలు పెరిగిపోతాయి.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రావు..’ రైతులను బ్యాంకర్లు, సొసైటీల అధ్యక్ష కార్యదర్శులు బెదిరిస్తున్న తీరిది. అంతేకాదు.. బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు వేలం వేస్తామంటూ నోటీసులకు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకుగురవుతున్నారు. ఒకపక్క పంటలు పండక, చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వం నుంచి రుణమాఫీ రెండో విడత సొమ్ము విడుదల కాక, బ్యాంకర్ల బెదిరింపులు తాళలేక అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. విజయవాడ : రుణభారం రైతన్నకు పెనుశాపంగా మారింది. తీసుకున్న బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకర్లు, సహకార సంఘాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఆందోళనకు గురవుతున్నాడు. పంటలు పండకపోవడంతో ఏడాదంతా ఎలా జీవనం సాగించాలా అని మధనపడుతున్న రైతులకు బ్యాంకర్లు నోటీసులిస్తామంటూ బెదిరింపులకు దిగుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. మరోపక్క రుణమాఫీ రెండో విడత సొమ్ము విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవటం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 4.04 లక్షల మంది రుణమాఫీ లబ్దిదారులు... రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 5.54 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ కింద మూడు విడతల్లోనూ కలిపి 4,04,000 మందిని గుర్తించారు. వారి బకాయిల మాఫీ కోసం రూ.1,490 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రూ.50 వేల లోపు ఉన్నవారికే ఒకేసారి రుణమాఫీ చేస్తానని ప్రకటించిన ప్రభుత్వం మిగిలిన రైతులకు ఐదు భాగాలుగా ఐదేళ్లలో విడుదల చేస్తామంటూ ప్రకటించింది. రూ.50 వేల రుణమాఫీతో కలిపి మొత్తం రూ.573 కోట్లు రుణమాఫీ జరిగినట్లు జిల్లా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది చెల్లించాల్సిన రెండో విడత సొమ్ము ఊసే ఇంతవరకూ ప్రకటించలేదు. దీంతో బ్యాంకర్లు తమను బకాయిలు చెల్లించాలని వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు వేలం వేసేందుకు నోటీసులు ఇస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సిన రెండో విడత సొమ్ము చెల్లించాక ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తామని చెబుతున్నారని, అయితే అసలే కుటుంబం గడవని పరిస్థితుల్లో ఉన్న తాము బకాయిలు ఎలా చెల్లించగలమని వారు ఆవేదన చెందుతున్నారు. మిగిలిన నాలుగేళ్ల సొమ్మును ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తద్వారా తమకు వేధింపులు తగ్గుతాయని చెబుతున్నారు. సాగు లేక.. కుటుంబం గడవక.. కృష్ణా డెల్టాలో 150 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్కి, రబీకి ప్రభుత్వం నీరు అందించలేకపోయింది. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల భూమికి గాను ఖరీఫ్లో కేవలం 4.64 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. రబీలో 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, ఏమాత్రం జరగలేదు. పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఎకరాకు సగటున 28 బస్తాలు ధాన్యం పండాల్సి ఉండగా కేవలం 20-22 బస్తాలు మాత్రమే పండాయని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో రైతులు డబ్బులు సరిగా అందక బకాయిలు తీర్చలేని దుస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు. -
2016.. బ్యాంకింగ్కు సవాళ్ల సంవత్సరం!
మొండి బకాయిలు, పోటీ ధోరణులు కీలకం బేస్ రేటు నిర్ణయానికి నిబంధనలూ సమస్యే..! ముంబై: పలు సవాళ్లతో బ్యాంకింగ్ రంగం 2016లోకి అడుగుపెట్టింది. అందులో మొదటిది మొండిబకాయిల సమస్య. ఈ విలువ దాదాపు 60 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిస్తున్న విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ముగింపుకల్లా ఈ భారాన్ని బ్యాంకింగ్ తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ ప్రధాన సవాలు... పెరగనున్న పోటీ వాతావరణం. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రెండింటికీ ఈ సమస్య ప్రధానమైదే. రెండు కొత్త తరహా బ్యాంకులు- పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల రూపంలో ప్రధానంగా తాజా పోటీ ఎదురుకానుంది. కనీస రుణ రేటు (బేస్) నిర్ణయానికి సంబంధించి ఏకరీతి విధానం అమలు దిశలో ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు కూడా బ్యాంకింగ్ సవాళ్లలో ఒకటి. ఆర్బీఐ రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ యథాతథంగా కస్టమర్కు బదలాయించాలన్న సిద్ధాంతం సరికాదని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య బహిరంగంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయా అంశాలపై బ్యాంకింగ్ ప్రముఖుల అభిప్రాయాలూ చూస్తే... సేవలదే విజయం కస్టమర్లు, వారికి అందుతున్న అత్యుత్తమ సేవలే ఈ రంగంలో పోటీలో నిలబడాలనుకునే వారికి ప్రధాన అంశాలు. ఇక దీనికి టెక్నాలజీ రంగంలో ముందడుగు వేయడం కీలకం. బ్యాంకింగ్ అంతా దాదాపు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉంది. సాంప్రదాయక బ్యాంకింగ్ విధానాలకు రానున్నది సవాలే. సేవల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం మరింత పెరగాలి. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ కొత్త బ్యాంకులకు కొన్ని సానుకూలతలు.. కొత్తగా బరిలోకి వస్తున్న బ్యాంకులకు కొన్ని సానుకూలతలు ఉన్నాయి. పరిశ్రమ స్థాయి వేతన ఒప్పందాలకు ఆయా బ్యాంకులు తక్షణం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేకపోవడం ఇక్కడ ప్రధానంగా గమనించదగింది. వ్యయ భారాల కోణంలో ఇది లాభించేదే. ఇక ఆయా బ్యాంకులు ప్రారంభంతోనే అత్యాధునిక సాంకేతిక, సేవా విధానాలను అవలంభిస్తాయి. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ వేగం పెరగాలి... ఇచ్చిన రుణాలు తగిన విధంగా వసూలు అవుతాయా లేదా? మూలధన... ఈ రెండు అం శాలూ బ్యాంకింగ్కు కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇప్పుడిప్పుడే కొంత మెరుగుదల ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ దిశలో సంస్కరణలు కొంత నెమ్మదిగా ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కొనే విషయంలో చొరవల వేగం మరింత పెరగాలి. - విభా బత్రా, ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ -
ఇదెక్కడి చేయూత
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అందని రాయితీలు రూ.కోటికి పైగా పేరుకుపోయిన బకాయిలు పరిశ్రమలకు స్వర్గధామం ఏపీ. ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఫలానా పరిశ్రమ పెట్టుకుంటామని దరఖాస్తు చేస్తే చాలు. అన్ని అనుమతులు చకచకా ఇచ్చేస్తాం.. అన్ని రాయితీలు ఇస్తాం.. అంటూ సర్కా రు చెప్పుకుం టున్న గొప్పలు నీటి మీద రాతలేనని తేలిపోతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికులకు ప్రభుత్వ ఆసరా కాగితాలకే పరిమితమవుతోంది. రాయితీల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలు పొందే అవకాశం ఉంది. పెట్టుబడితోపాటు స్టాంప్ డ్యూటీ, పావలా వడ్డీ, సేల్స్ ట్యాక్స్, పవర్ టారిఫ్ ఇలా వివిధ రకాల రాయితీలు కల్పించాల్సిన బాధ్యత సర్కార్పై ఉంది. అలాగే వారికి అవసరమైన ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు కావాల్సిన స్థలం కేటాయింపు విద్యుత్ తదితర అన్ని విషయాల్లో రాయితీలు కల్పించాలి. అయితే జిల్లాలో గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నేటికీ వివిధ రాయితీలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో వారంతా పరిశ్రమల స్థాపనకు చేసిన అప్పులు తీర్చే దారిలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడిలో 35 శాతం రాయితీగా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ విధంగా మూడు కంపెనీలకు రూ.20 లక్షల మేర పెట్టుబడి రాయితీ రావాల్సి ఉంది. అలాగే స్టాంప్డ్యూటీలో 50 శాతం, ల్యాండ్ కాస్ట్లో 25 శాతం రాయితీ కింద చెల్లించాల్సి ఉంటుంది. రెండు కంపెనీలకు రూ.70వేల వరకు రావాల్సి ఉండగా, పావలా వడ్డీ స్కీమ్లో భాగంగా ఇంట్రస్ట్ సబ్సిడీ కింద రూ.3.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. సేల్స్ టాక్స్ కింద మూడు కంపెనీలకు రూ.50 లక్షల మేర రాయితీ విడుదల కావాల్సి ఉంది. పవర్ టారిఫ్ రాయితీ కింద ఓ కంపెనీకి రూ.3 వేల వరకు విడుదల కావాల్సి ఉంది. మరికొన్ని కంపెనీలకు రూ.50 లక్షల మేర వివిధ రాయితీల కింద ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సి ఉంది. గత రెండేళ్లుగా తిరుగుతున్నా రాయితీ సొమ్ము విడుదలలో సర్కార్ చిన్నచూపు చూస్తోందని ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. -
బకాయిలు రూ. 100 కోట్లు
అధికారుల నిర్లక్ష్యం రెవెన్యూలో అవినీతి తిమింగలాలు ఎస్టేట్స్, టౌన్ప్లానింగ్లో జోరుగా అక్రమాలు కార్పొరేషన్ ఆదాయానికి గండి నగరపాలక సంస్థ ఆదాయానికి అధికారుల నిర్లక్ష్యంతో గండి పడుతోంది. వివిధ పన్నుల రూపంలో వసూలు కావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కోర్టు కేసులు ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్నాయి. పాత బకాయిలను రాబట్టి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉన్నా అధికారులు సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అక్రమార్కుల కాసుల కక్కుర్తి ఆదాయానికి గండికొడుతోంది. రెవెన్యూ, ఎస్టేట్స్, టౌన్ప్లానింగ్ విభాగాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ అరకొరగానే జమ అవుతోంది. ఏటా మామూళ్ల రూపంలో కోట్లాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఖాళీ స్థలాల పన్నుల రూపంలో ఏడాదికి రూ.8.48 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, సగం కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.58.20 కోట్ల మేర ఖాళీ స్థలాల పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు రూ.22.34 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎస్టేట్స్ విభాగంలో మ్యుటేషన్ (పేరు మార్పు) ద్వారా రూ.11 కోట్లు రావాల్సి ఉందని అంచనా. గాడితప్పిన రెవెన్యూ రెవెన్యూ విభాగంలో ఆస్తిపన్ను ద్వారా ఏడాదికి రూ.82.58 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యం. తొలి అర్ధ సంవత్సరానికి గాను రూ.41.29 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.35 కోట్లు వసూలు చేశారు. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటానని కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. రెవెన్యూ విభాగం అవినీతికి కేరాఫ్గా మారిందనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. పైసలివ్వనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) స్థాయి అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కలేదు... ఎస్టేట్స్ విభాగం గ‘లీజు’లకు లెక్కే లేదు. నగరపాలక సంస్థకు చెందిన 69 షాపింగ్ కాంప్లెక్స్లలో 3,396 షాపులు ఉన్నాయి. ఇందులో 700 షాపులు సబ్ లీజుల్లో ఉన్నాయని సర్వేలో తేలింది. మ్యుటేషన్ వసూలు చేయడం ద్వారా సుమారు రూ.11 కోట్లు వసూలవుతోందని అంచనా. 25 సంవత్సరాలు నిండిన షాపు యజమానులు కోర్టుకు వెళ్లి ఇంజంక్షన్ ఆర్డర్ తేవడంతో బకాయిల వసూలు కష్టంగా మారింది. వివిధ విభాగాలకు సంబంధించి 636 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రొఫెషనల్ ట్యాక్స్ రూ.12.82 కోట్లు వసూలవుతుంది. ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల్ని గుర్తించడంలో సంబంధిత అధికారులు విలఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దోచేస్తున్నారు... నగరంలో 240 చదరపు గజాలలోపు మార్ట్గేజ్ లేకుండా జీ ప్లస్ 2కు అనుమతి ఇస్తామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నాలుగు నెలల క్రితం ప్రకటించారు. ఇంతవరకు జీవో మంజూరు కాలేదు. అనధికారిక కట్టడాల పేరుతో టౌన్ప్లానింగ్ సిబ్బంది గృహ యజమానులను దోచేస్తున్నారు. టౌన్ప్లానింగ్ విభాగం ఏడాదికి 2,500 గృహ నిర్మాణాలకు అనుమతి ఇస్తోంది. 240 గజాల లోపు భవనాలు ఇందులో 65 శాతం వరకు ఉంటాయి. టౌన్ప్లానింగ్ అధికారులు మార్ట్గేజ్ను బూచిగా చూపడంతో గృహ యజమానులు బెంబేలెత్తి ఆమ్యామ్యాలు సమర్పించుకొంటున్నారన్నది బహిరంగ రహస్యం. బిల్డింగ్ లెసైన్స్ ఫీజులు, ఇతర ఫీజుల రూపంలో ఏడాదికి రూ.33.50 కోట్లు వసూలవుతోంది. 240 గజాల లోపు మార్ట్గేజ్ లేకుండా జీ ప్లస్ 2కు ప్రభుత్వం అనుమతిస్తే సుమారు రూ.15 కోట్ల మేర ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. -
ఈ ఏడాదీ నో క్రషింగ్
స్పందించని చిత్తూరు షుగర్స్ పాలకవర్గం, అధికారులు పట్టించుకోని ప్రభుత్వం బకాయిలందక అవస్థల్లో కార్మికులు, రైతులు చిత్తూరు: ‘జిల్లాలో చెరుకు రైతులకివ్వాల్సిన రూ.20 కోట్ల బకాయిలు రెండు రోజుల్లో చెల్లిస్తాం. ఈ ఏడాదే చిత్తూరు షుగర్స్లో క్రషింగ్ చేపట్టి వారిని అన్నివిధాలా ఆదుకుంటాం’. ఇదీ 11-12-2014న చిత్తూరు పర్యటనలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు. ఆ తరువాత బకాయిలు ఇచ్చిందీ లేదు.. క్రషింగ్ నిర్వహించిందీ లేదు. ఈ ఏడాదీ క్రషింగ్ ప్రారంభించే సూచనలు కనుచూపుమేరలో కనిపించడంలేదు. ఏం చేయాలో తెలియక చెరుకు రైతు ఆందోళనలో మునిగిపోయారు. జిల్లాలో చెరుకుపంట సాధారణ సాగువిస్తీర్ణం 27,705 హెక్టార్లు. కాగా ఈ ఏడాది 20,860 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 26,147 వేల హెక్టార్లలో సాగుచేశారు. అయితే కర్మాగారాన్ని చంద్రబాబు ప్రభుత్వం మూసేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోల్చితే ఆరు వేల హెక్టార్ల వరకు సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. కనీసం ఈ ఏడాదైనా తిరిగి క్రషింగ్ నిర్వహించక పోతారా..! అన్న ఆశతో చాలామంది రైతులు చెరుకుపంట సాగుచేశారు. వాస్తవంగా జూన్ మొదటి వారంలో కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభం కావాలి. క్రషింగ్ నిర్వహించే క్రమంలో చెరుకు సాగుతోపాటు చెరుకు సరఫరాకు సంబంధించి చక్కెర కర్మాగారం రైతులతో అగ్రిమెంట్ చేసుకోవాలి. కానీ ఈ ఏడాది ఇంతవరకు అలాంటివేమీ జరగలేదు. ఈ ఏడాదీ చెరుకు క్రషింగ్ జరిగే అవకాశం లేదని కార్మిక వర్గాలు తేల్చి చెబుతున్నాయి. కానీ ఈ విషయంపై అటు షుగర్కేన్ అధికారులు కానీ పాలకవర్గం కానీ నోరుమెదపడంలేదు. బకాయిలు చెల్లించని ప్రభుత్వం 2011-12, 2012-13 ఏడాదిలకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ.6.57 కోట్ల బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం మాటలతో సరిపెడుతోంది. ఇక కార్మికులకు సంబంధించి 1-01-2014 నుంచి జులై 2015 వరకు చెల్లించాల్సిన రూ.7.10 కోట్ల బకాయిలతో పాటు 2011 నుంచి ఇప్పటివరకు పీఎఫ్ రూ.3.50 కోట్లు, గ్రాట్యుటీ రూ.92 లక్షలతో కలిపి మొత్తం కార్మికులకు రూ.11.52 కోట్లు చెల్లించాలి. రైతు బకాయిలతో కలిపితే రూ.18.09 కోట్లు చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయికూడా చెల్లించక పోవడంతో అటు రైతులు, ఇటు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అమ్మకానికే మొగ్గు! రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించి సహకార చక్కెర కర్మాగారాన్ని ముందుకు నడిపిస్తానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబునాయుడు తాను అధికారం చేపట్టిన తరువాత హామీలు తుంగలో తొక్కారు. విలువైన ఆస్తులున్న కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టేందుకు మొగ్గుచూపారు. ఇందుకోసం అధ్యయనం అంటూ కమిటీ వేసి చిత్తూరు షుగర్స్ అమ్మకానికి మార్గం సుగమం చేశారు. ఇందులో భాగంగానే కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పన్ను ఎగవేత రూ.2 కోట్లు!
- రవాణా పన్ను చెల్లించని వాహనదారులు - జిల్లాలో రెండేళ్లుగా పేరుకుపోయిన వైనం - జరిమానా విధించాలని అధికారుల నిర్ణయం - ఈ నెల 16 వరకు బకాయిల చెల్లింపునకు గడువు తాండూరు: జిల్లాలో రవాణా పన్ను (ట్రాన్స్పోర్ట్ టాక్స్) ను వాహనదారులు రూ.కోట్లల్లో ఎగవేస్తున్నారు. రెండేళ్లుగా పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. జిల్లా లో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 8 వేల రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. ఇందులో మూడు చక్రాల ఆటోలతో పాటు వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు ప్రభుత్వం రవాణా పన్ను మినహాయించింది. మిగతా రవాణా వాహనాలు పన్ను ఎగవేశాయని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరకుండాపోయింది. ఆలస్యంగా మేల్కొన్న రవాణా శాఖ అధికారులు.. పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా జిల్లా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల(ఎంవీఐ)కు ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా పన్ను బకాయిలను వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల 16 వరకు స్వచ్ఛందంగా పన్ను బకాయిల చెల్లింపునకు అధికారులు గడువు ఇచ్చారు. గడువులోపు పన్ను చెల్లించని వాహనదారులకు అసలు పన్నుకు 200శాతం జరిమానా విధింపుతోపాటు వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్లి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దిగనున్నాయి. -
మంత్రుల పేషీలకు ఫోన్ కట్
రూ.కోటి వరకు బకాయిలు మూడు రోజులుగా మూగబోయిన ఫోన్లు బెంగళూరు: తమ తమ ప్రాంతాల్లోని సమస్యలను చెప్పుకునే వారు, అధికారులు, ఆయా నియోజకవర్గాల్లోని నేతలు, ఇక పైరవీలు చేసే చోటామోటా నాయకులు వీరందరి ఎడతెరిపి లేని ఫోన్కాల్స్తో ఎప్పుడూ మారుమోగి పోయే మంత్రుల పేషీలు స్తబ్దుగా మారిపోయాయి. గత మూడు రోజులుగా విధానసౌధలోని మంత్రుల కార్యాలయాల్లో ఉన్న ల్యాండ్ఫోన్లేవీ పనిచేయడం లేదు. దీంతో తమ సమస్యలను నేరుగా మంత్రివర్యుల దృష్టికి తీసుకొద్దామని భావించే సామాన్యులకు ‘ఈ నంబర్ తాత్కాలికంగా పనిచేయడం లేదు’ అనే సమాధానం వినిపిస్తోంది. మంత్రుల పేషీల్లో ఫోన్లు పనిచేయక పోవడానికి బీబీఎంపీ ఎన్నికలో లేదంటే తాంత్రిక పరమైన లోపమో కారణం కాదండోయ్! మంత్రుల కార్యాలయాల్లోని ఫోన్ బిల్లులు కట్టకపోవడమే ఇందుకు కారణం. విధానసౌధలో ఉన్న మంత్రుల పేషీల్లోని ల్యాండ్ ఫోన్లకు సంబంధించిన బిల్లులు రూ.కోటి రూపాయలు దాటేశాయి. అయినా కూడా సంబంధిత అధికారులు ఈ బిల్లులను చెల్లించకపోవడంతో బీఎస్ఎన్ఎల్ సంస్థ మంత్రుల పేషీల ఫోన్ కనెక్షన్లను తాత్కాలికంగా తొలగించింది. దీంతో గత మూడురోజులుగా మంత్రుల పేషీల్లోని ఫోన్లన్నీ మూగబోయాయి. మంత్రుల కార్యాలయాల్లోని ఫోన్ బిల్లులే చెల్లించకపోతే ఇక సామాన్యుల సమస్యల పరిష్కారంలో ఎంతమాత్రం ఆసక్తి చూపుతారో అర్థమవుతోందని సామాన్యులు వాపోతున్నారు. -
బిల్లు రూ.300 కోట్లు.. ‘టిప్పు’ రూ.43 కోట్లు..?
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో మరో దోపిడీ పర్వం ఈసారి జవహర్నగర్ ప్రాజె క్టు వంతు నిర్మాణ సంస్థకు బకాయిలు చెల్లించే పేరిట అవినీతి దందా హైదరాబాద్: అసలే దివాలా తీసిన ప్రాజెక్టు.. ఆపై అంతంత మాత్రంగా మారిన ప్రభుత్వ పర్యవేక్షణ.. ఇదే అదనుగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో మరో దోపిడీ పర్వానికి తెర లేచింది. తెల్ల ఏనుగులా మారిన జవహర్నగర్లోని ప్రాజెక్టును ఎలా అమ్మాలనే విషయంలో కసరత్తు కూడా కనిపించని తరుణంలో.. దాని బిల్లుల చెల్లింపులో హస్తలాఘవం ప్రదర్శించేందుకు తెరవెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బడా నిర్మాణ సంస్థ ఈ భవనాలను నిర్మించింది. అయితే ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో ప్రాజెక్టు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో రెండేళ్లుగా ఇక్కడ పనులు జరగటం లేదు. 14 అంతస్తులతో కూడిన బ్లాకుల్లో 2,858 ఫ్లాట్లను నిర్మించారు. నిర్మాణ సంస్థకు రూ.300 కోట్లకుపైగా ప్రభుత్వం బకాయిపడింది. ఈ బిల్లుల కోసం ఆ సంస్థ ప్రతినిధులు కొన్ని నె లలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా.. నిధులు లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని చెల్లించటం లేదు. ఈ తరుణంలో రంగంలోకి దిగిన కొందరు నేతలు.. ఆ సంస్థకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఇక్కడే రాష్ట్ర విభజనకు పూర్వం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వ హయాంలో బండ్లగూడ ప్రాజెక్టులో జరిగిన ఓ దందాను వీరు కాపీ కొట్టేశారు. ఎస్కలేషన్ పేరిట అప్పట్లో నేతలు, కొందరు అధికారులు వంద కోట్ల వరకు కొల్లగొట్టేశారు. టీఆర్ఎస్ సర్కారు కొలువుదీరిన తర్వాత అప్పటి గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తెచ్చి.. రెండో విడతలో ఇదే తరహాలో లూటీ చేసేందుకు సిద్ధమైన కుట్రను భగ్నం చేశారు. అయితే ఇప్పుడు కొందరు నేతలు అదే విధానాన్ని జవహర్నగర్ ప్రాజెక్టుకు అన్వయించి రూ.43 కోట్లను స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ జీవో.. ఓ దోపిడీ: నిర్మాణ సామగ్రి ధరలు పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్ చేసే విధానాన్ని సిమెంటు, స్టీలుతోపాటు ఇసుక, ఇటుకలు తదితరాలకు వర్తించేలా ఐదేళ్ల క్రితం నాటి ప్రభుత్వం ఉత్తర్వు నం.35ను జారీ చేసింది. కానీ ఇది స్వగృహకు వర్తించదు. అయితే కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో దీనిని స్వగృహకు వర్తించేలా కొందరు ఉత్తర్వు ఇప్పించారు. బండ్లగూడ ప్రాజెక్టుకు దీన్ని వర్తింపజేసి రూ.100 కోట్లు స్వాహా చేశారు. ఇప్పుడు అదే ఉత్తర్వును జవహర్నగర్ ప్రాజెక్టుకు వర్తింపచేసి.. ఎస్కలేషన్ రూపంలో రూ.43 కోట్లు కొల్లగొట్టాలని కొందరు నేతలు చూస్తున్నారు. నిర్మాణ సంస్థకు రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉన్నందున.. రూ.43 కోట్లు అందులో చేర్చి విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా రు. నిర్మాణ సంస్థ ఫైనల్ బిల్లులను దాఖలు చేస్తేనే బకాయిలు వచ్చే అవకాశం ఉండటంతో స్వగృహలో పనిచేస్తున్న కొందరు విశ్రాంత అధికారులు, ఓ ముఖ్య అధికారి ఈ తంతును పూర్తి చేయిస్తున్నట్టు తెలుస్తోంది. -
హెచ్ఎండీఏ మెడపై ఐటీ కత్తి!
ఈ నెల 12లోగా 471 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు దిక్కుతోచని స్థితిలో మహానగరాభివృద్ధి సంస్థ హైదరాబాద్: ఆదాయ పన్ను శాఖ అకస్మాత్తుగా హెచ్ఎండీఏకు మళ్లీ షాక్ ఇచ్చింది. ఈ నెల 12లోగా ఐటీ బకాయిలు రూ. 471 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ అందులో హెచ్చరించింది. గతంలో హైకోర్టు ఎటువంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని, చట్ట నిబంధనలకు భాష్యం మాత్రమే చెప్పిందని పేర్కొంటూ ఆదాయ పన్ను బకాయిలు చెల్లించాల్సిందేనని హెచ్ఎండీఏకు ఆదేశించింది. ‘ప్రభుత్వ స్థలాలు అమ్మిపెట్టిన పాపానికి మేము ఐటీ బకాయిలు చెల్లించడమేంటీ..? ఆ భూముల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును ఎప్పుడో ప్రభుత్వ ఖజానాకు జమ చేశాం. స్వార్జితం కాని సొమ్ముకు కూడా ఆదాయపు పన్ను చెల్లించాలని ఆ శాఖ నోటీ సులివ్వడం ఎంతవరకు సమంజసం’ అంటూ హెచ్ఎండీఏ అధికారులు వాదిస్తున్నారు. అయితే... ఆదాయ పన్ను శాఖ మాత్రం ఈ వాదనతో ఏకీభవించట్లేదు. రికార్డుల ప్రకారం ఆ భూములను హెచ్ఎండీఏ విక్రయించి ఆదాయం సమకూర్చుకుంది. ఆ నిధులు ఏం చేశారన్నది తమకు సంబంధం లేదు. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ నిబంధన ప్రకారం సమకూరిన ఆదాయంలో 30 శాతం పన్ను చెల్లించాల్సిన బాధ్యత హెచ్ఎండీఏదేనని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఉపకారానికి పోతే ఊబిలో కూరుకు పోయినట్లయిందని హెచ్ఎండీఏ అధికారులు వాపోతున్నారు. -
ఇందిరమ్మ బకాయిలు రూ.32 కోట్లు
హుజూర్నగర్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బకాయిలు రూ.32కోట్లుగా తేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వివిధ దశల్లో నిలిచిపోయిన లబ్ధిదారులకు బిల్లులు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇక వీరి సొంతింటి కల నెరవేరకుండా పోయింది. పేదల సొంతింటి కల నిజం చేయడమే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఒడిదుకుడుల మధ్య ఈ పథకాన్ని కొనసాగించింది. అయితే నాడు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ పాలన రావడం, సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గత ఏడాది మార్చి 17 నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు చెల్లిం చాల్సిన సుమారు రూ. 32 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే రూ. 3 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మా ణం చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి హామీ నేటి వరకు కార్యరూపం దాల్చకపోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి బిల్లులు కూడా అందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వపాలనలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి వివిధ దశల్లో ఉన్న ఇళ్ల లబ్ధిదారులు విధిలేని పరిస్థితులలో కొందరు అప్పు లు చేసి నిర్మాణాలు పూర్తిచేయగా మరికొం దరు అసంపూర్తిగానే వదిలేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందని సీబీసీఐడీ విచారణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించి ఆ దిశగా కూడా ఎటువంటి చర్యలు చేపట్టకుండా, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో లబ్ధిదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో 4,03,973 ఇళ్లు మంజూరు కాగా 2,22,943 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అంతేగాక 14,281 ఇళ్లు రూఫ్ లెవల్లో, 4,389 ఇళ్లు లెంటల్ లెవల్లో, 31,397 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో, 8,089 ఇళ్లు బేస్మెంట్ లోపు నిర్మాణ దశలో నిలిచిపోగా 1,22,874 ఇండ్ల నిర్మాణం నేటి వరకు మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి గాను ఎస్సీ లబ్ధిదారులకు రూ. 1,05,000, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 1,00,000, ఇతరులకు రూ. 70,000లను వారి ఇంటి నిర్మాణ దశల వారీగా బిల్లులను అందజేసేవారు. అయితే పెరిగిన ధరలు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే బిల్లులు ఏ మాత్రం సరిపోకపోవడం, ఇచ్చే బిల్లులు కాస్తా సకాలంలో అందజేయకపోవడంతో నిరుపేదల సొంతింటి కల తీరని కోరికగానే మిగిలి పోయింది. అయితే వివిధ దశ లలో ఇంటి నిర్మాణం ఆగిపోయిన సుమారు 58,156 మంది లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంటి నిర్మాణాలు ఎంత మంది పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారో వారిని గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని గతనెలలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హౌసింగ్ మండలస్థాయి అధికారులు ఆయా మండలాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 6,038 ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయినట్లు గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సుమారు రూ. 20 కోట్ల నుంచి రూ. 24 కోట్ల చెల్లింపులు చేయాల్సి వస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపించాక ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా వివిధ దశలలో నిర్మాణాలు నిలిపివేసిన లబ్ధిదారులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే నిర్మాణాలు నిలిపివేసిన తమను.. ప్రభుత్వం ప్రవేశపెడతామన్న నూతన ఇంటి నిర్మాణ పథకంలో అవకాశం కల్పించి ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అంతేగాక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇందిరమ్మ ఇళ్లనిర్మాణ సమస్యలను పరిష్కరించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేస్తుందో వేచిచూడాల్సిందే. లబ్ధిదారులందరికీ బిల్లులు చెల్లించాలి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలి. వివిధ దశలలో నిర్మాణాలు ఆగిపోయిన లబ్ధిదారులకు కూడా బిల్లులు అందించి నాడు నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారుల ఇళ్లు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలి. - ఇందిరాల వెంకట్రామ్, హుజూర్నగర్ -
బకాయిల బాదుడు !
సాక్షి, హైదరాబాద్: మద్యం కొనుగోళ్లు, అమ్మకాల కోసం తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్(టీఎస్బీసీఎల్)ను కొనసాగించాలని సర్కారు ఏ ముహూర్తంలో నిర్ణయించిందో గాని రాష్ట్రం మీద ఆర్థికంగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గత నెలలో ఆదాయపు పన్ను శాఖ 2011-12, 2013- 14 బకాయిల కింద ఏకంగా రూ. 1274 కోట్లు తెలంగాణ సర్కారు ఖాతా నుంచి లాగేసుకున్న ఘటన మరువకముందే తాజాగా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ టాక్స్ అధికారులు మరో బాంబు పేల్చారు. పన్ను చెల్లింపుల వివరాలు కావాలని సెర్చ్ వారెంట్తో గురువారం టీఎస్బీసీఎల్కు వచ్చిన ఆ శాఖ అధికారులు 20 అంశాల్లో వివరాల కోసం సోదాలు జరుపుతామని నోటీసులు ఇచ్చారు. 2010-11 నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించనందున ఆ కార్పొరేషన్కు కొనసాగింపుగా ఉన్న టీఎస్బీసీఎల్ ఆ సొమ్ము చెల్లించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి కాలం 2010 నుంచి 2014 జూన్ వరకు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి సాగిన ఏడాది అమ్మకాలపై పన్ను కలుపుకొని దాదాపు రూ. 700 కోట్ల వరకు సర్వీస్ టాక్స్ బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీంతో దిమ్మ తిరిగిన అధికార యంత్రాంగం హుటాహుటిన ప్రభుత్వానికి సమాచారం అందించింది. -
డిస్కం నిర్లక్ష్యం!
జిల్లాలో పేరుకుపోతున్న బకాయిలు వసూలు కాని కస్టమర్ సర్వీసు చార్జీలు ఉచిత విద్యుత్లోనే రూ.6.5 కోట్ల బకాయిలు సీఎండీకి నివేదిక పంపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ తిరుపతి రూరల్: జిల్లాలోని డిస్కం అధికారులు రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. బకాయిలు రూ.కోట్లలో పెరిగిపోతున్నాయి. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టకపోవడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తప్పుపట్టింది. వ్యవసాయ కనెక్షన్ల వినియోగదారుల నుంచే రూ.6.50 కోట్లు వసూలు చేయాల్సివున్నట్లు గుర్తించి, ఆ మేరకు డిస్కం సీఎండీకి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ నివేదికను పంపారు. అసలు కథ ఏంటంటే... రైతులను ఆదుకునేందుకు నాటి ప్రభుత్వం 2004లో రైతులందరికీ ఉచిత విద్యుత్ని అందజేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించేందుకు ఉచిత విద్యుత్ని పొందే ప్రతి వినియోగదారుడు ప్రతి నెలా హార్స్పవర్కి కేవలం రూ.30 మాత్రం కస్టమర్ సర్వీసు చార్జీల కింద చెల్లించాల్సి ఉంది. అంటే ఏడాదికి రూ.360 డిస్కంకు చెల్లించాలి. కానీ 2005 నుంచి ఈ కస్టమర్ సర్వీస్ చార్జీలను వసూలు చేయడంలో జిల్లాలోని డిస్కం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నారు. జిల్లాలో రూ.6.50 కోట్ల బకాయిలు జిల్లాలో తిరుపతి, తిరుపతి రూరల్, పుత్తూరు, చిత్తూరు, చిత్తూరు రూరల్, మదనపల్లె, పీలేరు మొత్తం ఏడు డివిజన్లలో 2,65,221 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 2005-06 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ కనెక్షన్లకు సంబంధించి కస్టమర్ సర్వీస్ చార్జీల కింద రూ.6.50 కోట్ల బకాయిలున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో గుర్తించారు. డిస్కం అధికారులు ఈ బకాయిలను వెంటనే వసూళ్లు చేయించాలని సూచించారు. వసూలు చేస్తున్నాం... జిల్లాలో వ్వవసాయ కనెక్షన్లకు సంబంధించి కస్టమర్ సర్వీస్ చార్జీలు పెండింగ్లో ఉన్నది వాస్తవమే. వాటిని వసూలు చేస్తున్నాం. కరువు పరిస్థితుల వల్ల కొంత ఆలస్యంగా వసూలు అవుతున్నాయి. - హరినాథ్రావు, ఎస్ఈ, డిస్కం తిరుపతి ఆపరేషన్ సర్కిల్ -
మింగుడు పడని ముద్ద
మధ్యాహ్న భోజనం బకాయిల చెల్లింపుల్లో జాప్యం ధరల పెరుగులతో భారంగా మారిన నిర్వహణ విద్యార్థులకు అందని పౌష్టికాహారం కష్టాల్లో నిర్వాహకులు ప్రతి ఒక్కరికి విద్య అందాలనే లక్ష్యంతో.. చదువు విద్యార్థికి భారం కాకూడదని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఓ వైపు విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో విద్యనందిస్తూనే, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా అక్షరాస్యత శాతం పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన. క్రమంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వ ల్ల ఈ పథకం ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. దీనికి ధరల పెరుగుదల తోడై భోజనం పెట్టేవారికి.. తినే వారికి ముద్ద మింగుడుపడ్డం లేదు. - విశాఖ ఎడ్యుకేషన్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మహిళా సంఘాలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వీరికి ఈ పథకం నిర్వహణ ద్వారా వచ్చే వెయ్యి రూపాయిల భృతి కోసం.. కుటుంబానికి ఓ ఆధారం, భరోసా దొరుకుతుందని వీటి నిర్వహణబాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించడంతో మొద ట్లో భాగానే నడిచింది. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెలల కొద్ది బకాయిలు చెల్లించకుండా ఎప్పటికప్పుడు తాత్సారం చేస్తూ నిర్వహకులపై తీవ్ర భారం మోపింది. అయితే పిల్లలకు భోజనం ఆగిపోకూడదనే ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో కిరాణా షాపుల వద్ద అరువు పెట్టి సరుకులు తీసుకొచ్చి ఒడ్డించి పెడుతున్నారు. కిరాణా సరుకులకు లక్షలు అయ్యే సమయంలో ఎవరివద్దనైనా అప్పు చేసి వారికి చెల్లించడం చేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగానే జరుగుతుండటంతో.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాలయాపన చేస్తూ బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. 10 నెలలుగా బకాయిలు..: గత 10 నెలల నుంచి మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించిన జీతాలు, సరుకుల బకాయిలు ప్రభుత్వం నిర్వాహకులకు అందించలేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల జీతాలు వెయ్యి రూపాయిల చొప్పున మొత్తం రూ.4 కోట్లు, సరుకులకుగాను రూ.9 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి మొత్తం బకాయిలు చెల్లిస్తామని నాయకులు చెప్పిన మాట వాస్తవ రూపంలోకి మాత్రం రాలేదు. నిర్వాహకుల వేతనం ఇప్పటికే విడుదలైనప్పటికీ.. ఆ మొత్తం అందించడంలో కూడా అధికారులు జాప్యం చేస్తున్నారు.పెరిగిన ధరలతో అదనపు భారం..: మధ్యాహ్న భోజన పథక నిర్వహణలో భాగంగా 1 నుంచి 5 వ తరగతి విద్యార్థికి రూ.4.65, 6 నుంచి 10 విద్యార్థులకు రూ 6.10 చెల్లిస్తూ వస్తోంది. దీంతో 5వ తరగతి వరకు విద్యార్థులకు 50 గ్రాముల బియ్యం, 10వ తరగతి వరకు విద్యార్ధులకు 100 గ్రాముల బియ్యం అందిస్తోంది. ప్రతి వారం మెనూలో అన్నంతో పాటు సాంబారు, పప్పు, కూరలు, వారానికి రెండు రోజులు గుడ్లు విద్యార్థులకు అందించాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో ఒక్కో గుడ్డు ఖరీదు రూ. 4.50. అలాగే కందిపప్పు ఖరీదు రూ. 60 నుంచి రూ. 130కు చేరింది. కూరగాయ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా మెనూ ప్రకారం పథకం నిర్వహించాలంటే తడిపిమోపుడవుతోంది. అదనంగా అరటిపండ్లు కూడా అందించాలని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కోవిద్యార్థిపై ఇది అదనపు ఖర్చు. ఏడాదికి ఆ ఏడాది ఖర్చులు పెరిగిపోతుంటే.. బడ్జెట్లో విద్య కోసం వెచ్చించే నిధులు మాత్రం తగ్గించుకుంటూ పోతోంది. గత ఏడాది రూ.13 వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. -
కేటుగాళ్లు
పీఆర్సీ పేరిట దోపిడీ కాసులివ్వని శాఖల్లో అందని వేతనాలు కొత్త పీఆర్సీకి రూ.కోట్లలో వసూళ్ల పర్వం యూడీసీలదే దందా.. {sెజరీ పేరిట వసూళ్లు.. అగ్రస్థానంలో ఆరోగ్య శాఖ.. ఒక్కొక్కరి నుంచి రూ.1000 సంక్షేమంలో అందని బకాయిలు హన్మకొండ అర్బన్ : రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీలో 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. కొన్ని శాఖల్లో ఇది కాగితాలకే పరిమితమైంది. అవినీతికి అలవాటు పడ్డ ఉద్యోగులు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. పెరిగిన వేతనాలు, మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. జూన్ నెల మొదలై 12 రోజులవుతున్నా ఒకటో తారీఖు రావాల్సిన వేతనాలు చాలా శాఖల్లోని ఉద్యోగుల ఖాతాల్లో జమకాలేదు. ఇందుకు కారణం.. ఖజానా చెల్లింపుల కార్యాలయంలో వేతనాల బిల్లులు చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన మామూళ్ల వ్యవహారం సెటిల్ కాకపోవడమే. జిల్లాలో ట్రెజరీ అధికారులు స్థానిక సౌలభ్యం కోసం ముందుగా వేతనాలు తీసుకుని తరువాత మార్చి, ఏప్రిల్ నెలల పీఆర్సీ బకాయిల బిల్లులు ఎస్టీవోలకు అందజేయాలని చెప్పారు. ఇదే అదనుగా భావించిన కొందరు యూడీసీలు ఖజానా అధికారుల పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇష్టారాజ్యంగా వసూళ్లు కొన్ని శాఖల్లో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నా రు. తమకు నెలసరి వేతనాలు, రెండు నెలల బకాయిలు ఇచ్చేందుకు ఖజానా పేరు చెప్పి వేధించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ మొదటి స్థానంలో ఉంది. ఈ శాఖ యూడీసీలు ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.1500 వరకు.. విద్యాశాఖలో పీఆర్సీ పేరిట వసూళ్ల దందా రూ.400 నుంచి రూ.1000 వరకు వసూళ్ల పర్వం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సిబ్బందికి ఇంకా కొత్త వేతనాలు, బకాయిలు అందలేదు. వసూళ్ల వ్యవహారం సెటిల్ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీసీ సంక్షేమ శాఖలో కూడా నాల్గో తరగతి ఉద్యోగులకు కొత్త వేతనాలు ఇవ్వలేదు. ఖజానాలో కేటుగాళ్లు పీఆర్సీ వసూళ్ల విషయంలో యూడీసీలు ఉద్యోగుల నుంచి ఎంత వసూలు చేసినా ఖజానాలో ఇచ్చింది తక్కువ అని తెలుస్తోంది. అయితే జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఒక ఎస్టీవో, స్టేషన్ఘన్పూర్లో అడిగినంత ఇస్తేనే బిల్లులు పాస్ చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
మండుటెండలో ఉపాధి
- సుర్రుమంటున్న ఎండలో కూలీల విలవిల - పని స్థలాల్లో కానరాని ప్రత్యేక వసతులు - పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బెంబేలు - షామియానాలు, హెల్త్కిట్లు మాయం - ఏప్రిల్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం ముకరంపుర : పొట్టకూటి కోసం మండుటెండల్లో ఉపాధిహామీ పనులకు వెళ్తున్న కూలీలకు ఎండవేడిమి శాపంలా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కూలీలు విలవిల్లాడుతుంటే కనీస సౌకర్యాలు కల్పించాల్సిన యంత్రాంగం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే జిల్లాలో గరిష్ట ఉష్ణోగత్రలు 43 డిగ్రీలకు చేరగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తీవ్రమైన ఎండవేడిమితో వడదెబ్బలు తగిలే ప్రమాదాలు పొంచి ఉన్నా అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం లేదు. వేసవిలో ఉపాధి పనులు జరిగే చోట ప్రత్యేక వసతుల కల్పించాల్సి ఉండగా అధికార యంత్రాంగం కేవలం సమీక్ష సమావేశాలకే పరిమితమవుతోంది. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద 6,08,934 జాబ్ కార్డులు ఉన్నాయి. మొత్తం 25,154 శ్రమశక్తి సంఘాల కింద 4,54,713 మంది నమోదై ఉన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 1,20,000 కూలీలు పనులకు వెళ్తున్నారు. 57 మండలాల్లోని 1050 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఎండకు చెరువు మట్టి గట్టిగా ఉండడంతో మిషన్ కాకతీయలో ఎంపిక కాని చెరువులలో ఉపాధిహామీ కింద పూడికతీత పనులు కూడా చేపడుతున్నారు. ఇందులో 635 చెరువులను ఎంపిక చేసుకోగా ప్రస్తుతం 135 చెరువులలో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఏటా జనవరి నుంచి జూన్ వరకు ఉపాధి పనులు కొనసాగుతాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ మంది ఉపాధి పనులకు హాజరవుతారు. వ్యవసాయ పనులు పూర్తి కావడంతో ఉపాధిపై దృష్టి సారిస్తున్నారు. పనులలో భాగంగా ఉదయం 7 గంటలకే హాజరవుతున్న కూలీలకు కొలతల ప్రామాణికంగా కేటాయించిన పనులు దాదాపు మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తి చేస్తున్నారు. ఉదయం 10 దాటితేనే ఎండ తీవ్రతకు తాళలేకపోతున్నారు. వేసవి కాలంలో ఉపాధిహామీ కూలీలకు మౌలిక సదుపాయాల కల్పన అందని దాక్ష్రగానే మారింది. ఏటా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి నిధులు కేటాయిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. వసతుల కల్పనకు అవసరమైన మెటీరియల్ కొనుగోళ్ల వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరుగుతూనే ఉంది. ఉపాధి పనులకు వెళ్లే వారు పనులు చేసి కొంత సమయం సేద తీర్చుకోవడానికి, ఎండ నుంచి ఉపశమనం పొందడానికి జిల్లాలో 2010లో దాదాపు 20 వేలకు పైగా షామియానాలు అందజేశారు. గతేడాది వరకు వీటిని ఇచ్చారు. ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అనేక మంది వాటిని సొంత పనులకు వినియోగించడం, ఎండకు అవి చిరిగిపోవడం తదితర కారణాలతో ఇప్పుడు అవి లేకుండా పోయాయి. దీంతో కూలీలు దిక్కులేక ఎండలోనే పనిచేస్తున్నారు. వాటిని కొనుగోలు చేయకుండానే నిధులు భోం చేశారనే ఆరోపణల కూడా లేకపోలేదు. ఎండ తీవ్రతకు భయపడి అనేక మంది కూలీలు పనులకు హాజరు కావడం లేదు. వచ్చిన వారికి నిలువ నీడ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. హెల్త్ కిట్లు ఏవీ..? ఉపాధి పనులు చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగినా, అత్యవసర పరిస్థితులు వచ్చినా తక్షణమే వారికి ప్రథమ చికిత్స చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి పంపించడానికి ప్రభుత్వం ఆరోగ్య కిట్లను పంపిణీ చేసేది. రెండేళ్ల నుంచి ఈ కిట్ల జాడే లేదు. ప్రతి సంవత్సరం కిట్లు కొనుగోలు చేయూలని ఆదేశాలు జారీ కావడంతో పాటు నిధులు కూడా డ్రా అవుతూనే ఉంటాయి. కానీ అవి మచ్చుకైనా లేకపోవడంతో కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. హెల్త్ కిట్లలో అయోడిన్, కాటన్, ఆయింట్మెంట్, ఇతర ట్యాబ్లెట్లు ఉంటాయి. ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచాల్సినప్పటికీ ఇవేమీ కూలీలకు అందడం లేదు. కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నప్పటికీ వారినే ఇంటి వద్ద నుంచి తెచ్చుకోవాలని నిబంధన వి ధించారు. ఎండకు తగినంత నీరు లేకపోతే వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి. ఉపాధి కూలీలు పనిచేస్తూ తనువు చాలిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ఫిర్యాదు, రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగానే సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సిపార్సు చేస్తారు. అన్ని సక్రమంగా ఉంటేనే పరిహారం అందజేస్తారు. పనిచేసి వెళ్లి ఇంటి వద్ద మృతిచెందితే మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏప్రిల్లో పని చేసిన కూలీల వేతనం రూ.8కోట్ల వరకు బకాయి పడింది. ఇప్పటివరకు ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలనే ఇస్తున్నారు. ఏప్రిల్కు సంబంధించిన నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
దారుణంగా మాఫీ
వసూలు చేసుకోవడం చేతకాక.. కుదవపెట్టిన డాక్యుమెంట్లే లేవనే సాకుతో మొండిబకాయిల రద్దుకు రంగం సిద్ధం పాలకవర్గాన్ని ఏమారుస్తున్న అధికారులు చేతులు మారిన రూ.50 లక్షలు..? డీసీసీబీలో కొత్త అవినీతి కోణం.. రూ.4కోట్ల మాఫీకి మహాజన సభలో నేడు తీర్మానంతప్పుబడుతున్న సహకార సంఘ నిపుణులు ఏదైనా సంస్థలో మొండిబకాయిలుంటే వాటిని ఏ విధంగా వసూలు చేసు కోవాలా? అని ఆలోచిస్తారు. కుదువపెట్టిన ఆస్తులను,తనఖా పెట్టిన డాక్యుమెంట్లను అడ్డం పెట్టుకుని రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. సామ,దాన,భేద,దండోపాయాలను ఉపయోగించి ఏదో విధంగా రాబట్టేందుకు యత్నిస్తారు. అడ్డగోలుగా మాఫీ చేయాలని చూడరు. కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) తీరేవేరు. వసూలు చేసుకోవడం చేతకాక..చేతులెత్తేయడమే కాదు..వాటిని అడ్డుగోలుగా మాఫీకి సిద్ధమైంది. మంగళవారం జరుగనున్న 42వ మహాజన సభలో ఈ మేరకు తీర్మానించనున్నారు. మొండి బకాయిదారులకు రూ.4 కోట్ల మేర లబ్ధి చేకూర్చే ఈ వ్యవహారంలో రూ.అరకోటికిపైగా చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) మూడు దశాబ్దాలుగా వివిధ పథకాల కింద మంజూరు చేసిన రుణాలు అధికారుల ఉదాశీన వైఖరివల్ల వసూలుకాక నిరర్ధక ఆస్తులుగా పేరుకు పోయాయి. వీటివిషయంలో తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆడిట్ కమిటీ కొత్త పాలకవర్గానికి సిఫారసు చేసింది. అంటే వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని. కానీ డీసీసీబీ అధికారులు మాత్రం వాటిని రద్దు చేసి చేతులుదులుపుకోవాలని నిర్ణయానికి వచ్చి మహాజనసభ తీర్మానం కోసం అజెండాలో పెట్టారు. ఈ మొండి బకాయిల్లో ప్రధానంగా చెప్పు కోవలసినవి భూమి అభివృద్ధి బ్యాంకు రుణాలు (ల్యాండ్మార్టిగేజ్ లోన్స్). తమ భూముల అభివృద్ధి కోసం వాటి డాక్యుమెంట్లను కుదవపెట్టి తీసుకునే రుణాలివి. వీటి కింద జిల్లాలోని 14 మండలాల పరిధిలో 11,702 మందికి రూ.2, 55,21,000 ఇచ్చారు. 1759 మంది మత్స్యకారులకు మంజూరు చేసిన రూ.99.5లక్షలు, రెండు చేనేత సహకార సంఘాలకు రూ.91వేల రుణాలుండగా, నగదు పరపతి రుణాల కింద విశాఖపట్నం, మహారాణిపేట బ్రాంచ్ల పరిధిలో సూపర్ బజార్ కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్కు రూ.26.22లక్షలు, మాడుగుల ఏజెన్సీ ప్రొడ్యూసర్స్కు రూ.73వేలు, కస్తూర్బా కో- ఆపరేటివ్ స్టోర్స్కు రూ.1.56 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ స్టోర్స్కు రూ.2.18లక్షలు, టీవీ అసెంబ్లింగ్ కో- ఆపరేటివ్ సొసైటీస్కి రూ.65వేలున్నాయి. మధ్యకాలిక వ్యవసాయేతర ఉద్యోగ సహకారసంఘాలకు మంజూరుచేసిన రుణాల కింద గోపాలపట్నం, ద్వారకానగర్, మహారాణి పేట బ్రాంచ్ల పరిధిలో 14 కో-ఆపరేటివ్ సొసైటీలు, ఉద్యోగ సంఘాలకు మంజూరు చేసిన రూ.8.42 లక్షలున్నాయి. వీటిలో మత్స్యకార, చేనేత సంఘాలకు మంజూరు చేసిన రుణాలు రద్దుచేసినా ఎవరూ ఆక్షేపించరు. ల్యాండ్ మార్టిగేజ్,నగదు పరపతి, మధ్యకాలిక వ్యవసాయేతర ఉద్యోగ సంఘాలకు మంజూరు చేసినరుణాలను రద్దు చేయాలని అజెండాలో చేర్చడం పట్ల సహకార సంఘ నిపుణులు తప్పుబడుతున్నారు. ల్యాండ్ మార్టిగేజ్ రుణాలంటే కుదవపెట్టిన డాక్యుమెంట్ల సంగతేమిటంటే ఏ బ్రాంచ్లోనూ అవి కనిపించడంలేదని అధికారులు పేర్కొనడం వారి నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. వందకోట్ల టర్నోవర్లక్ష్యంగా దూసు కెళ్తున్న సూపర్ బజార్ కో- ఆపరేటివ్ సొసైటీకి ఇచ్చిన రూ.26.22లక్షల రుణాలు రద్దు చేయాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందంటున్నారు. అలాగే ఉద్యోగ సంఘాలకు మంజూరు చేసిన రుణాలను వసూలు చేసుకోవాలని..లేకుంటే వీటినిమంజూరు చేసిన అధికారుల నుంచి రికవరీ చేయాలే తప్ప ఈవిధంగా రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇలా మొత్తం రూ.3.95కోట్ల మొండి బకాయిలను ‘టెక్నికల్ రైటాఫ్’కు మహాజనసభ ఆమోదం కోసం పెడుతున్నట్టు అజెండాలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహా రంలో మొండిబకాయిదారుల నుంచి రూ.50లక్షల వరకు చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లనే ఇంతకాలంగా ఉన్న ఈ మొండి బకాయిలను రైటాప్ చేసేందుకు అధికారులు నిర్ణయించారని తెలుస్తోంది. ఏది ఏమైనా పాలకవర్గం ఈ మొండి బకాయిల వసూలు, మాఫీ విషయంలో పునరాలోచన చేయాల్సినఅవసరం ఎంతైనా ఉందని సహకార సంఘ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మాఫీ చేసుకుంటూ పోతే భవిష్యత్లో డీసీసీబీ ద్వారా రుణాలు తీసుకున్న వారు పాలకవర్గాన్ని, అధికారులను మేనేజ్ చేసుకుంటే మాఫీ చేయించు కోవచ్చన్న భావనతో చెల్లించడం మానేస్తారన్న వాదన వ్యక్తమవుతోంది. ఇక ఎంతమాత్రం వసూలు కాదనే నిర్ణయానికి వచ్చి మాఫీ చేసేపరిస్థితి ఉంటే..ఈ రుణాలు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.