Fee reimbursement scheme
-
‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా
సాక్షి, అమరావతి: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.‘రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిశాక మార్చి 12న ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించాం’ అని వైఎస్సార్సీపీ వెల్లడించింది. -
వైఎస్సార్సీపీ ‘ఫీజు పోరు’ వాయిదా
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా పడింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు పార్టీ సోమవారం(ఫిబ్రవరి3) ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఫీజుపోరు వాయిదా నిర్ణయం తీసకున్నట్లు తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తమ ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఆదివారమే ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ కోరింది. అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన పీజు రీయింబర్స్మెంట్ స్కీమ్తో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రొఫెషనల్ కోర్సులు చదువుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఈ స్కీమ్ అమలు చేయకుండా పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు,వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఫీజుపోరు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ కార్యక్రమం మార్చి 12కి వాయిదా పడింది. -
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫీజుపోరు పోస్టర్ రిలీజ్
-
ఫిబ్రవరి 5న వైస్సార్సీపీ ఫీజుపోరు.. పోస్టర్ విడుదల
సాక్షి, తాడేపల్లి: ఫిబ్రవరి 5న వైఎస్సార్సీపీ చేపట్టే 'ఫీజుపోరు' కార్యక్రమం పోస్టర్ను వైఎస్సార్సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్ని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు.. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు. దీనివలన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు.2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే వైఎస్ జగన్ వచ్చాక రిలీజ్ ఇచ్చారు. చంద్రబాబు వ్యవహార శైలి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. గడిచిన 8 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు 420 అంటూ జనం విమర్శలు చేస్తున్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోతే పోరాటం తీవ్ర రూపం చేస్తాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారు: జోగి రమేష్ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు. బాధిత విద్యార్థుల తరపున పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. కలెక్టరేట్ల ఎదుట ఫిబ్రవరి 5న పోరాటం చేస్తాం. చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే రిలీజ్ చేయాలివిద్యా వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు: వెల్లంపల్లి శ్రీనివాస్వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదు. జగన్ అభివృద్ధి చేసిన స్కూళ్లను చూసి పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయారు. ప్రైవేట్ స్కూల్కు పోటీగా ప్రభుత్వ స్కూల్ ఉందని మెచ్చుకున్నారు.ఇదీ చదవండి: CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి! -
విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ‘పోరుబాట’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్మెంట్పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపై పోరుబాట(Porubata)కు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు చేపట్టబోతోంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది. త్వరలో ఈ పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయనుంది.ఒకవైపు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒకదఫా ఫీజు బకాయిలను కూడా చంద్రబాబు సర్కార్ చెల్లించలేదు. మరోవైపు..ఫీజులు చెల్లించలేదని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత విద్యార్థులకు అండగా పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. బాబు సర్కార్కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి -
విద్యార్థులను మోసగించిన చంద్రబాబు సర్కార్: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఫిబ్రవరి 5న ఫీజు పోరు (YSRCP Fees Poru) నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy) తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ఫీజు పోరు చేస్తామని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కల్గిస్తున్నాయని.. ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తోందని అప్పిరెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా సమాజానికి మేలు చేకూరే పని చేయరు. పేద విద్యార్థులకు ఏ ప్రయోజనం చేకూర్చరు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని 2004లో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారు. ఆయన వలనే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలిగారు. కానీ చంద్రబాబు వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్కు మంగళం పాడారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రూ.18 వేల కోట్లను విద్యా రంగానికి ఖర్చు చేశారు. ఐదేళ్లలో ఆలస్యం కాకుండా నిధులను విడుదల చేశారు. చంద్రబాబు మాత్రం ఇప్పటికే 3,900కోట్లు బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెడుతూ విద్యారంగాన్ని విస్మరించారు. బకాయిలను చెల్లించాలని కోరుతూ కలెక్టర్లను కలవబోతున్నాం. రూ.3,900 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలపడలేదని చంద్రబాబు గుర్తించాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: దటీజ్ జగన్..పగవాడైనా ఒప్పుకోవాల్సిందే! -
జనవరి 3న జరగాల్సిన వైఎస్సార్సీపీ ధర్నా వాయిదా
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ధర్నాలో మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా విద్యార్థులకు బాసటగా ఫీజు రీయింబర్స్మెంట్పై జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళనన కార్యక్రమాన్ని జనవరి 29కి ఆ పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, 3వ తేదీన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా 29న నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది.పోరుబాట విజయవంతం:ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు రూ.1.20 నుంచి రూ.1.25 పైసలు చొప్పున దాదాపు రూ.15,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే డిస్కమ్లకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారులతో కలిసి వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయమన్న హామీ నిలబెట్టుకోవాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స డిమాండ్ చేశారు. -
ఈనెల 27న కరెంటు ఛార్జీల పెంపుపై నిరసనలు: వైఎస్ జగన్
-
కనీసం వెయ్యి కోట్లయినా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,020 కోట్ల మేర పేరుకు పోయాయని, అందులో కనీసం రూ.1,000 కోట్లయినా విడుదల చేయాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని మంగళవారం జీరో అవర్ సందర్భంగా ఆయన అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. విదేశీ విద్యానిధి పథకం కింద విద్యార్థికి రూ.20 లక్షలు మంజూరు చేసేందుకు రూ.5 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఏపీ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు. ఉస్మానియా తరలింపు ఆపండి: రాజాసింగ్ ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్కు తరలించే ప్రతిపాదనను రద్దు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. గోషామహల్లో ఆస్పత్రి కడితే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ఉస్మానియా వెనుకవైపు ఉన్న విశాలమైన స్థలంలో కొత్త నిర్మాణం జరపాలని సూచించారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కారి్మకులకు కనీస వేతనాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ కోరారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద హుజూరాబాద్లో 5 వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన రెండోవిడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. -
ఫీజు బకాయిలు చెల్లిస్తేనే హాల్టికెట్లు
గుడివాడ టౌన్: ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ వీకేఆర్, వీఎన్బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదివే సుమారు 275 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉంది. అందులో కొంతమంది ఏదోవిధంగా ఫీజు బకాయిలు చెల్లించగా.. 30 మందికి పైగా చెల్లించలేకపోయారు. దీంతో వారికి హాల్ టికెట్ ఇచ్చేది లేదని సోమవారం యాజమాన్యం బయటకు పంపేసింది. వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో స్పందించిన ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా నిర్ణీత సమయంలోగా బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే హాల్టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులతో హామీ పత్రాలు రాయించుకుని హాల్ టికెట్లు ఇచ్చారు. -
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కార్
-
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లించక పోవడంతో విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక.. పనులకు వెళుతున్న ఓ విద్యార్థి దీనావస్థ నాకు వేదన కలిగించింది.విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. తక్షణమే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంటుతోపాటు వసతి దీవెన డబ్బులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదని, చదువు పూర్తి చేసిన వారు బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని తెలిపారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించక పోవడంతో వారు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు.2 చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యా రంగాన్ని దారుణంగా దెబ్బ తీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు–నేడు.. ఇలా అన్నింటినీ రద్దు చేసి, 1–12 వ తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దెబ్బ తీశారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి.. డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారినీ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.3 వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదు జమ చేసే వాళ్లం. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకు రూ.12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేశాం. తల రాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్సార్సీపీ హయాంలో ఈ రెండు (విద్యా దీవెన, వసతి దీవెన) పథకాలకే రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు చేశాం.4 ఎన్నికల కోడ్ కారణంగా జనవరి–మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పారీ్టల వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ, ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్లో అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. అప్పటి నుంచి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్–జూన్, జూలై–సెపె్టంబర్ త్రైమాసికాలకు సంబంధించి ఫీజుల చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడటం లేదు. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కూడా సగం గడిచి పోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరు చూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి.. కాళ్లేమో గడప కూడా దాటడం లేదు.5 ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు. చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీ లేని వారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇలా ఉన్నాయి.6 కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టడాలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధ లేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. -
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: YS జగన్ ట్వీట్
-
పరీక్షల వేళ.. ఫీజుల పేచీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ.. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి. పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు. బకాయిలు చెల్లించాలి గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం. – డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
ఫీజు రీయింబర్స్మెంట్లో కోతే!
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల ఉన్నత విద్యకు టీడీపీ కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటనెన్స్ చార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. దీంతో సుమారు ఏటా 12 లక్షల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆరి్థకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏటా పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఫీజు రీయింబర్స్మెంట్) కోసం సుమారు రూ.2,700 కోట్ల నుంచి రూ.2,800 కోట్లు వ్యయమవుతుంది. ఇందులో హాస్టల్ విద్యార్థులకు మెయింటెనెన్స్ చార్జీల కింద సుమారు రూ.1,100 కోట్లు వెచ్చించాలి. కానీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన ఐదునెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులకు తీవ్ర నిరాశను మిగిలి్చంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,766.77 కోట్లు, పోస్టు మెట్రిక్ స్కాలర్íÙప్ (మెయింటెనెన్స్–ఎంటీఎఫ్) కింద రూ.776.18 కోట్లు కలిపి మొత్తం రూ.2,542.95 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటానే 75 శాతంగా ఉంటోంది. దీనితో పాటు ప్రధానమంత్రి యశస్వీ పథకం కింద మరో రూ.356 కోట్లను కూడా పోస్టు మెట్రిక్ స్కాలర్íÙప్స్ కేటాయింపుల్లో కలిపేసింది. ఇక ఆ చెల్లింపులు ప్రశ్నార్థకమే.. ఇక గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలను ప్రభుత్వం నిలిపివేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు ఆపేసింది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ చార్జీలు కలుపుకుని రూ.2,500 కోట్లు ఉంటే.. ప్రస్తుత బడ్జెట్ అంతకంటే తక్కువగా ఉండటం గమనార్హం! -
ఫీజు పైసల్... ముందే వసూల్ !
సాయివర్ధన్ (పేరుమార్చాం) పాలీసెట్లో మెరుగైన ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లా మీర్పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్నాడు. కాలేజీలో రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన ఆ విద్యార్థికి యాజమాన్యం షాక్ ఇచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, ట్యూషన్ ఫీజు చెల్లించాలని, లేకుంటే అడ్మిషన్ ఇవ్వలేమని తెలియచెప్పింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలైన తర్వాత, ఆ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో రూ.52 వేల రూపాయలు చెల్లించి అడ్మిషన్ పొందాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన టి.మానస (పేరుమార్చాం) డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సు పూర్తి చేసింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, యాజమాన్య ఒత్తిడితో ఫీజు చెల్లించింది. ఏడాది క్రితం కోర్సు పూర్తి కావడంతో ఒరిజినల్ సరి్టఫికెట్ల కోసం కాలేజీకి వెళితే ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పారు. దీంతో మళ్లీ డబ్బు కట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.46 వేలు ఇప్పటికీ అందలేదు.సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఆర్థికభారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. దీని కింద అర్హత సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా కాలేజీలో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేయొచ్చు. కానీ ప్రస్తుతం కాలేజీల్లో పరిస్థితి తారుమారైంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద అర్హత సాధించినా సరే... అడ్మిషన్ సమయంలో ట్యూషన్ ఫీజు పూర్తిగా చెల్లించాల్సిందే.సీనియర్ విద్యార్థులయితే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లించాలి. ప్రభుత్వం రీయింబర్స్ నిధులు కాలేజీకి విడుదల చేసినప్పుడు... సదరు విద్యార్థుల బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయడమో... లేక చెక్కు రూపంలో విద్యారి్థకి అందిస్తామంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యాకాలేజీలు ఇదే తరహా ముందస్తుగా ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. ఉచితంగా ఉన్నత చదువులు చదవాలనుకున్న విద్యార్థులకు తాజా పరిస్థితులు సంకటంగా మారాయి. ఏటా 12లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో 5,539 పోస్టుమెట్రిక్ కాలేజీలున్నాయి. ఇందులో 2,641 జూనియర్ కాలేజీలు, 1,514 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. 235 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు కాగా, 217 పారా మెడికల్ కాలేజీలున్నాయి. ఇతర వృత్తివిద్యా కేటగిరీల్లో మిగిలిన కాలేజీలున్నాయి. వీటి పరిధిలోని 12 లక్షల మంది విద్యార్థులు ఏటా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ముందస్తు వసూళ్లకు దూరంగా ఉంటున్నా, వృత్తి విద్యా కళాశాలలు మాత్రం అడ్మిషన్ల సమయంలోనే ఫీజులు వసూలు చేస్తున్నాయి. ,ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కనీసం కాలేజీలకు వెళ్లి ఫీజులపై తనిఖీలు కూడా చేయడం లేదు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాంఫీజు రీయింబర్స్మెంట్ నిధుల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.1,550 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు చెల్లిపులు చేస్తున్నాం. మా కార్యాలయానికి విద్యార్థులు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి ముందస్తు ఫీజు వసూలపై సంక్షేమ శాఖల అధికారులు సీరియస్గా పరిగణించాలి. కాలేజీల వారీగా విచారణ చేపట్టాలి. అలా వసూళ్లకు పాల్పడిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులెవరూ ముందస్తుగా ఫీజులు చెల్లించొద్దు. – ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ పరిస్థితి ఫీజు రీయింబర్స్ నిధులు విడుదల చేయకపోవడంతోనే యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో ఫీజు నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. – కందడి శ్రీరామ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు -
AP: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం.. aకదం తొక్కిన విద్యార్థి లోకం
అనంతపురం అర్బన్/తిరుపతి అర్బన్/పార్వతీపురం టౌన్/సాక్షి, అమరావతి: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున బుధవారం ఉద్యమించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ల మందు ర్యాలీ చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, వర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని..ఇలా సమస్యలను ప్రస్తావిస్తూ...వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.విద్యార్థులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. అనంతపురంలోని కేఎస్ఆర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అ«ధ్యక్షుడు ప్రసన్న ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం వారికి నోటీసులిచ్చి పంపించారు. విద్యార్థులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ఫీజుల కోసం విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తిరుపతిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. డిగ్రీలో మేజర్, మైనర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77ను రద్దు చేయా లని డిమాండ్ చేశారు. తల్లికి వందనం కింద రూ.15,000ను ఈ ఏడాది నుంచే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్కు వినతిపత్రాన్ని అందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. తక్షణమే పెండింగ్లో ఉన్న విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించాలని కోరుతూ ఆర్టీసీ కాంపెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ను ముట్టడించారు. సమస్యల పరిష్కారంపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రసన్నకుమార్, కార్యదర్శి ఎ.అశోక్ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
తెలంగాణ: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఇవాళ్లి నుంచి ప్రైవేటు డిగ్రీ , పీజీ కళాశాలలు బంద్ చేసినట్లు యజమానులు తెలిపారు. కళాశాలు నడిపే పరిస్థితి లేక మూసివేస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే కాలేజీల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నలగొండ జిల్లాలో డిగ్రీ, పీజీ కాలేజీలను యజమానులు మూసివేశారు. కళాశాలల యజమానులు నిరవధిక బంద్ నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.120కోట్ల బకాయిలు ఉన్నాయని యజమానులు చెబుతున్నారు.ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కళాశాల అసోసియేషన్ ఇవాళ్టి నుంచి బంద్ పాటిస్తోంది. కాలేజీల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. మూడేళ్లుగా రూ.2400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని యజమానలు తెలిపారు. -
మీ గొంతు మూగబోయిందా లోకేశ్?
నెల్లూరు(టౌన్): ‘ఫీజు రీయింబర్స్మెంట్ గురించి యువగళంలో మాట్లాడిన మీ గొంతు మంత్రి పదవి రాగానే మూగబోయిందా లోకేశ్..’ అని ఏబీవీపీ నాయకులు ప్రశి్నంచారు. ‘యువగళంలో మాట్లాడిన నోరు మంత్రి పదవి రాగానే మూగబోయిందా..’ అనే బ్యానర్ చేతపట్టుకుని ఏబీవీపీ నాయకులు సోమవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనీ్వనర్ రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచి్చన వెంటనే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని లోకేశ్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని చెప్పారు.ఫీజు రీయింబర్స్మెంట్ లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించాలని, లేకపోతే ఎక్కడికక్కడ ఆయన పర్యటనలను అడ్డుకుంటామని, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చి పక్కన పడేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సమీర్, సుమన్, రాబర్ట్, వినోద్, హేమంత్, సుకుమార్, నవీన్ పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
-
ఫీజు రీయింబర్స్మెంట్పై అనుమానం వద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. రకరకాల పరిస్థితుల్లో ప్రాధాన్యతలు మారి.. ఫీజు రీయింర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నాం. ఈ అకాడామిక్ ఇయర్ నుంచి ఆన్టైమ్లో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్పై మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఫీజు రీయింబర్స్మెంట్పై త్రిముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృషించినవే. మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవే. ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి. అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాదు.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజనీరింగ్ సంస్థలు ఉండాలి. ఇంజనీరింగ్లో కేవలం కంప్యూటర్ సైన్స్పైనే కాదు.. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోంది. ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది. యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోంది. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడింది. కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ను తీసుకురాబోతున్నాం. యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానం. మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆర్ధిక భారం, ఇతర సమస్యలు ఉన్నా.. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్మెంట్కు ఎసరు
సాక్షి, అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు చూద్దామంటే కుదరదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశ పడొద్దు. అప్పో.. సప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు...’ ఇదీ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి! ‘‘గత ఐదేళ్లు మా పిల్లల చదువులు సాఫీగా సాగిపోయాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద ఫీజులతోపాటు ఏడాదికి హాస్టల్, మెస్ ఖర్చులు వసతి దీవెనతో మా ఖాతాల్లో పడేవి. వెంటనే మేం కళాశాలలకు చెల్లించేవాళ్లం. మా పిల్లలకు సరిగా చదువు చెప్పకున్నా, హాస్టల్ బాగోలేకున్నా గట్టిగా ప్రశ్నించే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన దుస్థితి తప్పదని భయమేస్తోంది’’ తల్లిదండ్రులు ఆవేదన ఇది!పేర్ల మార్చడంలో ఉత్సాహం అమలులో ఏది?రాష్ట్రంలో ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యా రంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు బకాయిలు ఇంతవరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడం, కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆదుర్దా చెందుతున్నారు. ఏ కళాశాలలో చూసినా ఫీజుల గోలే వినిపిస్తోంది. ఇంతకాలం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో(వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు ఊసే విస్మరించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్)గా మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్–మెస్ చార్జీల విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిర్ణీత షెడ్యూళ్ల ప్రకారం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు రూ.1,300 కోట్లు, హాస్టల్–మెస్ చార్జీల కింద ఏడాది చివరిలో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.విద్యార్థుల్లో ‘ఫీజుల’ కలవరంప్రతి పేదింటి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోనే నేరుగా ఫీజుల మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. వారి ద్వారా ఫీజులు చెల్లిస్తుండంతో యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత అనుమతి లభించగా కొంత మంది ఖాతాల్లో నగదు జమైంది. ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేశారు. ఇంకా రూ.605 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విద్యార్థులను కలవరపెడుతోంది. పైగా జూన్లో మూడో విడత(జనవరి–మార్చి) కింద సుమారు రూ.700 కోట్లు ఫీజుల కింద విడుదల చేయాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గత సర్కారు తెచ్చిన పథకాలకు కొత్త ప్రభుత్వం మంగళం పాడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.చదువులపై బాధ్యత లేదా?పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉజ్వల బాటలు వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. వీటి చెల్లింపుల్లో నాటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిల మొత్తాన్ని చెల్లించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్పై మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజురీయింబర్స్మెంట్ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది.చెల్లింపులపై దుష్ప్రచారం..ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ విద్యార్థులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ హయాంలో 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ట్యూషన్ ఫీజులు చెల్లించారు. 25.17 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద హాస్టల్–మెస్ చార్జీల కోసం మరో రూ.4,275.76 కోట్లు అందచేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా దీవెన, వసతి దీవెనల కింద దాదాపు రూ.18,663 కోట్లకుపైగా (పాత బకాయిలతో కలిపి) వెచ్చించారు. ఎన్నికలకు ముందు షెడ్యూల్ ఇచ్చి మరీ నిధులు విడుదల చేసినా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుట్రలు చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో నిధుల విడుదలకు ఒక రోజు సమయం (పోలింగ్కు ముందు) ఇచ్చింది. దీనిపైనా మరోసారి టీడీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణ జరిగేలోపే ఆ ఒక్కరోజు సమయం కాస్తా గడిచిపోయింది. ఫలితంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అనంతరం కొంత మంది ఖాతాల్లో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ జమైంది. మిగిలిన మొత్తంతో పాటు జూన్లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన మొత్తాన్ని చెల్లించే విషయంపై కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోగా గత ప్రభుత్వంపై నెపం వేసే యత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,300 కోట్లు, వసతి దీవెనతో రూ.1,100 కోట్లు చెల్లించకుండా దుష్ప్రచారం చేస్తూ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే విద్యార్థుల కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకుపోయి చదువులు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధివసతి ఖర్చులకు సంబంధించి 2014–19 మధ్య రూ.4 వేల నుంచి రూ.10 వేల స్లాబ్ పెట్టి ఇవ్వగా వైఎస్ జగన్ ఆ విధానాన్ని తొలగించి వసతి దీవెన ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సమానంగా ఆర్థిక సాయం అందించారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2 లక్షలు పరిమితి ఉండగా అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. ఉన్నత విద్యకు అడ్డంకి.. తిరుపతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తయ్యింది. రెండేళ్లుగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన టైమ్ టూ టైమ్ మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. దీంతో సకాలంలో కాలేజీ ఫీజులు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నగదు జమ చేయలేదు. సరి్టఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని యాజమాన్యం చెబుతోంది. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి లోకేశ్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. – పి.శేఖర్, తిరుపతి -
నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ
సాక్షి, అమరావతి/పామర్రు : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లా పామర్రులో బటన్నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. నేడు పామర్రుకు సీఎం వైఎస్ జగన్ రాక.. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న సభాస్థలిని గురువారం మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్తో కలిసి పరిశీలించారు. శుక్రవారం ఉ.10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మ.1.55కు తాడేపల్లి చేరుకుంటారు. -
నేడు జగనన్న విద్యా దీవెన
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ముందెన్నడూ లేనివిధంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
అక్షరానికి అగ్రపీఠం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగాన్ని అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ విద్యా రంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ప్రక్షాళన చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంచలనాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా రంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యా రంగానికి తనదైన శైలిలో ఊపిరిలూది ప్రగతి బాట పట్టించారు. ఇంటాబయటా వెల్లువెత్తుతున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. దాదాపు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో విద్యా సంస్కరణలకే ఏకంగా రూ. 66,722.36 కోట్లు వ్యయం చేశారు. నాడు–నేడుతో పాఠశాలల్లో కొత్త భవనాలు, తరగతి గదులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ, డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ సదుపాయంతో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, తదితరాలను ఏర్పాటు చేశారు. నవశకానికి నాంది.. ♦ 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం. ♦ ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్ కేటాయింపు ♦ టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన ఖర్చు రూ.450 కోట్లు మాత్రమే. ♦ 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి. ♦ ఈ ఏడాది ముగిసిన ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ♦ నాడు నేడులో తొలి విడత కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15,713 పాఠశాలలను రూ.3,669 కోట్లతో సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. రెండో విడత కింద రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ♦ 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల చొప్పున జమ. ♦ పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సత్కారం. ♦ 10 మంది పేద ప్రతిభావంతులైన విద్యార్థులను అమెరికా సందర్శించే అవకాశం. ♦ 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 47 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.15,762 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ. 11,317 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద మరో రూ. 4,267 కోట్లు చెల్లించింది. ♦ ప్రైవేటు వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ కోర్సుల్లో 35 శాతం సీట్లలో రిజర్వేషన్ కోటా అమలు. ♦ గత నాలుగున్నరేళ్లల్లో 1,925 మంది విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థికంగా అండ. ♦ నైపుణ్య వర్సిటీ, ప్రత్యేక శిక్షణ సంస్థల ఏర్పాటుతోపాటు ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు 2021–22 బడ్జెట్లో రూ.774.01 కోట్లు ఖర్చుచేయగా 2022–23 బడ్జెట్లో రూ.969.91 కోట్లు కేటాయించారు. మైక్రోసాఫ్ట్తో ఒప్పందం.. ఎడ్యుస్కిల్, సేల్స్ఫోర్స్తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్య కోర్సులు పూర్తి చేశారు. ఒక రాష్ట్రంలో 1.64 లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వం ఏపీనే కావడం విశేషం. దీంతో 2018–19లో క్యాంపస్ ఎంపికల్లో 37 వేల మంది ఉద్యోగాలు పొందితే, 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇక 2022–23లో 1.20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. దేశ సగటు కంటే మెరుగ్గా జీఈఆర్.. ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుండడంతో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో మన రాష్ట్రం దేశ సగటుకంటే చాలా ముందుంది. 2019–20లో ఇండియా సగటు 27.1 శాతం ఉంటే.. రాష్ట్రంలో 35.2 శాతం, 2020–21లో దేశ సగటు 27.3 శాతం ఉంటే రాష్ట్రంలో 37.2 శాతం జీఈఆర్ నమోదు కావడం విశేషం. మరోవైపు కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిబంధనలు కూడా విద్యా అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆడపిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. -
‘దీవెన’తో దిమ్మతిరిగి..
సాక్షి, అమరావతి : ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు దుష్ప్రచారం చేయడంలో గోబెల్ను సైతం రాజగురువు రామోజీరావు మించిపోయారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలనే లక్ష్యంగా చేసుకుని తన విషపుత్రిక ఈనాడులో అబద్ధాలను అదేపనిగా అబద్ధాలను ప్రజలపై రుద్దేందుకు ఎల్లో మీడియా గత ఐదేళ్లుగా తెగ ప్రయాసపడుతోంది. ఇప్పుడు ఎంతో సమున్నతంగా ఉన్న ప్రభుత్వ విద్యా రంగంపై నిస్సిగ్గుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా అసత్యాలను వండివారుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ‘దీవెనే శాపమైన వేళ..’ అంటూ విద్యాదీవెన పథకంపై తన అక్కసునంతా రంగరించి ప్రదర్శించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ఉన్నతాశయంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వం జమచేస్తోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే.. అమల్లోగాని, నిధుల విడుదలలో గాని, లబ్ధిపొందుతున్న విద్యార్థుల సంఖ్యలోగాని ఈ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు నూటికి నూరుశాతం విద్యాదీవెన ద్వారా మేలు జరుగుతోంది. అపరిమితంగా ఫీజు రీయింబర్స్మెంట్.. ఇక పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితీలేదు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందినీ చదివించవచ్చు. ఫీజు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3.05 లక్షల వరకూ రీయింబర్స్మెంట్ చేస్తోంది. గత ప్రభుత్వం ఏడాదికి ఇంజినీరింగ్ కోర్సులకు గరిష్టంగా రూ.35 వేలు, ఫార్మాకు రూ.68 వేలు మాత్రమే చెల్లించింది. అలాగే, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనే కాదు, ఎందులోనూ సంతృప్తస్థాయి అన్నమాటే లేదు. ఇక ప్రభుత్వం ఫీజులు ఇచ్చేవరకూ వేచి చూడకుండా పిల్లల తల్లులు కట్టాలంటూ కొన్ని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయంటూ ఈనాడు వక్రీకరణకు దిగింది. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బును జమచేసిన తర్వాత వారంలోగా ఆ మొత్తాన్ని కాలేజీలకు చెల్లించాలి. మూడు వారాల్లోగా చెల్లించకుంటే కాలేజీలు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాయి. దాంతో తదుపరి విడత ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును నేరుగా కాలేజీ ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. దీంతో తల్లితండ్రులపై కాలేజీలు ఒత్తిడి తీసుకువచ్చే ఆస్కారమే లేదు. అలాగే, ఫీజు చెల్లించేంత వరకూ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఈనాడు చెప్పిందీ అబద్ధమే. ఇలా చేయడానికి కాలేజీలకు ఎలాంటి అధికారంలేదు. వివక్ష లేకుండా వసతి దీవెన.. ఇదేకాక.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందిస్తోంది. గత ప్రభుత్వంలో అయితే కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 మాత్రమే ఇచ్చేవారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలకు వార్షికాదాయాన్ని రూ.2 లక్షలు, ఇతర వర్గాలకు రూ.లక్ష పరిమితి పెడితే, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా అర్హులైన అందరికీ వసతి దీవెన అమలుచేస్తోంది. వసతి దీవెన డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే జమచేస్తోంది. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం చెల్లింపు.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు పాలైనా, ఇవ్వాల్సిన అరకొర ఫీజులను ఇవ్వకుండా బకాయి పెట్టినా.. ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఏనాడూ రామోజీ తన ఈనాడులో ఒక్క కథనాన్ని కూడా ప్రచురించలేదు. కానీ, ఈ ప్రభుత్వం ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ఫీజులు చెల్లించడంతో పాటు, 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సైతం చెల్లించింది. అంతేకాక.. సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తూ పేద విద్యార్థులకు అండగా నిలిచింది. పైగా దేశంలో నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఒక్కటే. అయినా, ఇదేమీ పట్టని రామోజీ మాత్రం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. నిజానికి.. టీడీపీ పాలన ఐదేళ్లలో చెల్లించిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు సగటున ఏడాదికి రూ.2,428 కోట్లు అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా చెల్లిస్తున్న సగటు మొత్తం రూ.4,044 కోట్లు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.10,332 కోట్లు వెచ్చిస్తే.. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.15,592.87 కోట్లు ఖర్చుచేసింది. 26.98 లక్షల మందికి విద్యాదీవెన కింద రూ.11,317.11 కోట్లు.. 25.17 లక్షల మందికి వసతి దీవెన కింద మరో రూ.4,275.76 కోట్లు చెల్లించింది. ♦ 2022 అక్టోబరు–డిసెంబరు కాలానికి చెల్లించాల్సిన రూ.698.68 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే చెల్లించింది. ♦ జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి రూ.702.99 కోట్లను ఈ ఏడాది మే 24న చెల్లించింది. ♦ ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికం మొత్తాన్ని ఆగస్టులో చెల్లించింది. ♦ ఇప్పుడు జూలై–సెప్టెంబరు త్రైమాసికం సొమ్ము చెల్లింపు తుపాను కారణంగా వాయిదాపడింది. ఇది ఈనెల 29న భీమవరంలో జరిగే కార్యక్రమంలో 26.98 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన, 25.17 లక్షల మందికి జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఇంత ఠంఛనుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు చెల్లింపులు చేస్తుంటే రామోజీకి దిమ్మతిరిగిపోతోంది. దీంతో విద్యార్థులకు నష్టం జరిగిపోతోందంటూ ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది. -
నత్తనడకన ఉపకార దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియకు స్పందన కరువైంది. ఈ పథకాల కింద దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం పావువంతు మంది విద్యార్థులు కూడా ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలుస్తోంది. కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులు ఏటా క్రమం తప్పకుండా ఈ దరఖాస్తులు సమర్పించడం తప్పనిసరి.. కాలేజీ యాజమాన్యం సైతం చొరవ తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 12.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. కానీ ఇప్పటివరకు 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారిక అంచనాతో పోలిస్తే 20 శాతం మాత్రమే దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. వచ్చే నెలాఖరుతో ముగియనున్న గడువు..: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగియనుంది. దరఖాస్తు ప్రారంభ సమయంలోనే నాలుగు నెలల పాటు గడువు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. ఈమేరకు కాలేజీ యాజమాన్యాలకు సర్క్యులర్లు సైతం జారీ చేసింది. విద్యార్థులు ఈపాస్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చొరవ తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో కాలేజీ యాజమాన్యాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఒక విద్యార్థి కోర్సు ముగిసే వరకు ప్రతి సంవత్సరం ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్తగా కోర్సులో చేరే విద్యార్థి ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. ఇప్పటికే కోర్సులో చేరి తదుపరి సంవత్సరం చదివే విద్యార్థి రెన్యువల్ కేటగిరీలో దరఖాస్తు సమర్పించాలి. విద్యార్థి వివరాలు కాలేజీ యాజమాన్యం వద్ద అందుబాటులో ఉండడంతో యాజమాన్యమే ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి దరఖాస్తు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవచ్చు. కానీ యాజమాన్యాలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తు ప్రక్రి య నెమ్మదిగా సాగుతోంది. గతేడాది దరఖాస్తు ప్రక్రియను దాదాపు ఏడు నెలల పాటు కొనసాగించారు. గడువు ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా ల కోరిక మేరకు ప్రభుత్వం గత ఏడాది మూడు సార్లు గడువును పొడిగించింది. కానీ ఈ ఏడాది పొడిగింపు ప్రక్రియ ఉండదని, నిర్దేశించిన సమయానికి దరఖాస్తు సమర్పించాలని సూచించినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మరో నెలన్నరలో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను గడువులోగా పూర్తి చే యాలంటూ తాజాగా జిల్లాస్థాయిలో సంక్షేమ శాఖల అధికారులు కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. -
సీఎం జగన్ కలలు సాకారమవుతున్న వేళ..
అగనంపూడి (గాజువాక): ప్రతీ పేదింటి బిడ్డ ఉన్నత చదువుల్లో రాణించాలని..ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని సీఎం జగన్ తపన..ఆరాటం సఫలీకృతమవుతుండటం సంతోషంగా ఉందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు కృష్ణదేవరాయలు అన్నారు. అమెజాన్ ప్రాంగణ ఎంపిక ప్రక్రియలో ఎంపికైన 13 మందిలో 9 మంది విద్యార్థులు ఫీజ్ రీయింబర్స్మెంట్తో చదువుకున్నట్లు తెలిపారు. వీరికి వార్షిక వేతనం రూ.26 లక్షలు అని చెప్పారు. వీరితోపాటు మరో 13 మంది కూడా 3 సంస్థల్లో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. ఒకరు రూ.12 లక్షల వార్షిక వేతనం, 12 మందికి రూ.10 లక్షల ప్యాకేజీతో దేవరెవ క్లౌడ్ ఇండియా, ఇన్సిర్క్స్, ఎటర్నల్ రోబోటిక్స్ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు వివరించారు. కళాశాలలో చేరిన తొలి ఏడాది నుంచి విలువలతో కూడిన విద్యతో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్తోపాటు విద్యార్థులను మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంచడటంతోపాటు నైతిక విలువలూ పెంపొందిస్తున్నామని చెప్పారు. విజ్ఞాన్ సీఈవో ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు
మేకల కల్యాణ్ చక్రవర్తి : ఎన్నికలు, రాజకీయాలు ఆర్థికాంశాలతోనే ముడిపడి ఉంటాయని.. ప్రజల ఆర్థిక ప్రయోనాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ఎజెండాలు అవుతాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అందె సత్యం స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలన్నీ అనుచితమేమీ కావని.. కొన్ని పైకి ఉచితంగానే కనిపిస్తున్నా ఉత్పత్తిని పెంచే సాధకాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కన్నా.. ప్రజలను కొనుగోలు చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు, ప్రజల ఎజెండా, ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రభావం, రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులపై అందె సత్యం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ఎన్నికలకు, ఆర్థిక ప్రయోజనాలకు అసలు సంబంధమేంటి? ఎన్నికల్లో ఒక భాగం రాజకీయాలైతే, మరోభాగం ఆర్థికఅంశాలు. ఎత్తుగడలు, పొత్తులు, విధానాలు రాజకీయ అంశాలైతే.. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నవి ఆర్థికాంశాలు. ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమం, ఉచితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంక్షేమంతోపాటు ఉత్పత్తిని పెంచే విధానాలూ ఉంటాయి. ఓట్ల కోసం ఉచిత హామీలు ఉంటాయి. ఉచితాలు సరికాదనే చర్చపై మీ అభిప్రాయం? తమిళనాడులో మాదిరిగా మిక్సీలు, టీవీలు ఇస్తే అవి ఉచితాల కిందకు వస్తాయి. మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించడం లేదు. వారి ప్రణాళికల్లో అనుచితాలు లేవు. టీవీ ఇస్తే ప్రజలకు సంక్షేమమేమీ లేదు. ఉత్పత్తి రాదు. కేవలం వినోదం మాత్రమే వస్తుంది. అలాంటివి అనుచితం. అదే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం వారు అప్పుల బారినపడకుండా చూడటమే. వీటిని ఉచితాలుగా చూడొద్దు. ఇవి సాంఘిక సంక్షోభానికి పరిష్కార మార్గాల్లాంటివి. వ్యవసాయానికి ఆర్థిక సాయం మంచి అంశమేనా? ఏ దేశంలోనైనా వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చాలా దేశాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో దశాబ్దకాలంగా రైతులకు అయ్యే ఖర్చులో సగ భాగం సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గిందన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయానికి అన్నివిధాలా సాయం చేసి నిలబెట్టుకోవడం అవసరం. వ్యవసాయ సబ్సిడీలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రుణమాఫీ కచ్చితంగా ఉత్పత్తి కోవలోకే వస్తాయి. ఆ ప్రణాళికల ఫలితం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆరోగ్యశ్రీ పథకాలను విస్తృతం చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్య రంగాల్లో ఖర్చుతో ప్రయోజనమేనా? విద్య, వైద్య రంగాల్లో ఖర్చు సమంజసమైనది. వైద్యంపై ఖర్చు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పార్టీలు మాట్లాడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేదే. ఉన్నత విద్యా రంగంలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. నేటికీ దేశంలో 30శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాబట్టి విద్యపై ఖర్చు అవసరం. కేరళలో ఆరోగ్య, విద్యా వనరుల కారణంగానే పేదరికం 0.7 శాతానికి తగ్గింది. పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడం.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చు కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ సెగ్మెంట్కు రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇది ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన? వ్యవస్థ పూర్తిగా వాణిజ్యపరమైనప్పుడు రాజకీయాలు కూడా వాణిజ్యపరం అవుతాయి. రాజకీయ పార్టీల నాయకులు గతంలో వ్యాపారుల దగ్గర ఆర్థిక సాయం తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే వ్యాపారులయ్యారు. ఈ లక్షణాన్నే ఎన్నికల్లోనూ ఉపయోగిస్తున్నారు. జమిలి ఎన్నికలతో... భారత్లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యంతరంగా కూలిపోయినప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన భవిష్యత్లో అధ్యక్ష తరహా పాలనకు దారితీయొచ్చు. ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఎదురుచూడాల్సిందేనా? ఎప్పుడూ ప్రభుత్వాల వద్ద అడుక్కుని లబ్ధి పొందడమే ప్రజల పనిగా మారింది. భూపంపిణీతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించని కారణంగానే ఈ దుస్థితి. ప్రజల కొనుగోలు శక్తిని నిరంతరం పెంచే విధంగా కాకుండా ప్రజలను కొను గోలు చేసి రాజకీయ నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. నగదు బదిలీ పథకాలతో నష్టమా.. లాభమా? దేశంలో ఆకలి సూచీలు దిగజారిపోతున్నాయి. అంటే కింది స్థాయి పేదలకు ప్రభుత్వాల సాయం అవసరమే. పేదల కొనుగోలు శక్తి కారణంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. డిమాండ్, ఉత్పత్తి పెరుగుతాయి. ఇక మన దేశంలో ఉద్యోగులు, కార్మి కుల వాటా ఎక్కువ. పాత పింఛన్ ప్రభుత్వాలకు భారమనేది అభివృద్ధి నిరోధక ఆలోచన. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా పాత పింఛన్ విధానాన్నే అమలు చేస్తున్నాయి. -
టోకెన్లతోనే సరి
సాక్షి, హైదరాబాద్: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్లో జనరేట్ అయ్యి టోకెన్ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి. దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. అవన్నీ రెండేళ్ల కిందటివే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ ‘సాక్షి’తో అన్నారు. -
ఓట్ల కోసం కేసీఆర్ కపట నాటకం
మధిర: పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను పదిరోజుల్లో చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం ప్రజలను మోగించడమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధితో పనిచేసే సీఎం కావాలా, ఫామ్హౌస్లో పడుకునే సీఎం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుని, వినతిపత్రాలు స్వీకరించడమే కాక అన్ని పారీ్టల ఎమ్మెల్యేల సమస్యలు వినేవారని, సచివాలయంలో అధికారులతో సమీక్షలు చేసేవారని గుర్తుచేశారు. ఇందులో ఏ ఒక్కటీ చేయలేని కేసీఆర్, ఆరు నెలలకోసారి అసెంబ్లీని మూడు రోజులు తూతూమంత్రంగా నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు సీఎం అయితే ఏంటీ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎవరు సీఎం అయితే ఏంటీ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్లు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతాయా, లేదా అన్నదే ముఖ్యమని భట్టి అన్నారు. కేసీఆర్ అనవసరంగా సీఎం గోల ఎత్తుకున్నారని మండిపడ్డారు. దోపిడీ, కమీషన్లు లేకుండా ప్రతీపైసా ప్రజల కోసం ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధుల సమస్య రాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పారీ్టపరంగానే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. -
పేద బిడ్డల చదువులకు పెన్నిధి
సాక్షి, అమరావతి: ఆర్థికంగా ఉన్నవారికే ఉన్నత విద్య అన్నట్టున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ సంక్షేమ చదువుల విప్లవాన్ని సృష్టించారు. దేశ చరిత్రలోనే లేని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి కులమతాలతో సంబంధం లేకుండా ఉన్నత విద్య పేదలందరికీ ఉచితమే అని ప్రకటించారు. 2005–08 మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులైన 26.67 లక్షల మందికి ఈ పథకం కింద రూ.2 వేల కోట్లను ఖర్చుచేశారు. ఇక 2009ని సంక్షేమ నామ సంవత్సరంగా ప్రకటించి.. 7 లక్షల మంది అగ్రవర్ణ పేదలను కూడా ఈ పథకంలో భాగం చేశారు. వారి ఉచిత చదువుల కోసం రూ.350 కోట్లు కేటాయించారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టని ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో 33.67 లక్షల మంది పేద విద్యార్థుల చదువులకు పెన్నిధిలా నిలిచారు. 18 యూనివర్సిటీల స్థాపన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యకు 2003–04లో కేవలం రూ.4,468 కోట్లు మాత్రమే కేటాయించారు. అదే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008–09లో రూ.11 వేల కోట్లు కేటాయించి దేశంలోనే ఈ రంగానికి అధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని నిర్ణయించి కొత్తగా 18 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. పేద విద్యార్థులకు సైతం ఖరీదైన ఐటీ శిక్షణ అందించాలని నిర్ణయించి నూజివీడు, ఇడుపులపాయ, బాసరలో ట్రిపుల్ ఐటీలను అందుబాటులోకి తెచ్చారు. ఆయన బాటలోనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి ప్రారంభించిన ప్రజా సంక్షేమ పథకాలను, ఫీజు రీయింబర్స్మెంట్ను నూరు శాతం అమలు చేస్తున్నారు. అంపశయ్యపై ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు: మన బడి కింద పది రకాల సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయ పౌరులుగా ఎదగాలని, ప్రపంచ స్థాయిలో పోటీపడాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టారు. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న ప్రతిభావంతులకు రూ.1.25 కోట్ల ఫీజును సైతం చెల్లించడం ఆయనకే చెల్లింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ విద్యా రంగానికి రూ.69,289 కోట్లు ఖర్చు చేశారు. -
సమున్నతం!
సాక్షి, అమరావతి: పునాది బాగుంటేనే ఓ భవనమైనా, చదువులైనా పది కాలాల పాటు పటిష్టంగా ఉంటాయి! ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగ సంస్కరణలను చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇందుకోసం నాలుగేళ్లలో రూ.65 వేల కోట్లకుపైగా వెచ్చించడం చదువులకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఉన్నత విద్యలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తూ తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు భోజన, వసతి ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది. ఇంటర్ తర్వాత ఏ విద్యార్థి చదువుకూ ఆటంకం కలుగకుండా 2019 జూన్ నుంచి ఈ ఏడాది జూలై వరకు దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు మొత్తం రూ.14,912.43 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ.10,636.67 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయగా విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన కింద మరో రూ.4275.76 కోట్లు అందించింది. ఇక జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా మరో రూ.132.41 కోట్లను 1,858 మంది విద్యార్థులకు అందచేసి ఉన్నత చదువులకు అండగా నిలిచింది. మరోవైపు ఇంజనీరింగ్తో పాటు సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన వారికి చక్కటి ఉపాధి, ఉద్యోగాలు లభించేలా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టింది. తొలిసారిగా ప్రైవేట్ వర్సిటీల్లో 35 శాతం సీట్ల కోటా ప్రైవేట్ వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఆ వర్సిటీల్లో 35 శాతం సీట్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తద్వారా పేద మెరిట్ విద్యార్థులకు వాటిల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించింది. 27 వేల సంస్థల్లో ఇంటర్న్షిప్ గతంలో డిగ్రీ చేతికొచ్చినా తగినన్ని నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగం, ఉపాధి లభిస్తుందన్న నమ్మకం లేదు. దీన్ని సరిదిద్ది నూతన బోధనా విధానాలపై శిక్షణ కార్యక్రమాలతోపాటు ఎడెక్స్ లాంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థల ద్వారా సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇంటర్న్షిను తప్పనిసరి చేసింది. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్షి అమలు చేస్తుండగా నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ (ఆనర్స్) కోర్సులు చదివే వారికి ఏడాది ఇంటర్న్షి ప్రవేశపెట్టారు. మూడేళ్లలో డిగ్రీ కోర్సు నుంచి బయటకు వచ్చేవారికి 10 నెలల ఇంటర్న్షి తప్పనిసరి చేసింది. జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దుతోంది. ఇంటర్న్షి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని 27,119 సంస్థలను గుర్తించారు. వీటిలో ఏపీ జెన్కో, హ్యుందాయ్, కియా మోటార్స్, విప్రో, అమర్రాజా బ్యాటరీస్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెంబ్కార్ప్ ఎనర్జీ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఫైజర్ హెల్త్కేర్ ఇండియా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మైలాన్ లేబోరేటరీస్ లిమిటెడ్ లాంటి ప్రముఖ సంస్థలున్నాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ లాంటి కోర్సులు చదివిన 2,91,022 మంది విద్యార్థులు తమ సర్టిఫికేషన్ను పూర్తి చేయడం విశేషం. కమ్యూనిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో ఇంటర్న్షిప్ కోసం యునిసెఫ్కు అనుబంధంగా ఐదు లక్షల మంది విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేశారు. భారీగా ప్లేస్మెంట్స్ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అందించేందుకు నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో లక్ష మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, సేల్స్ఫోర్స్ వంటి కంపెనీల్లో వర్చువల్ ఇంటర్న్షిప్ పూర్తిచేసి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఎడ్యుస్కిల్, సేల్స్ఫోర్స్తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి కోర్సులు పూర్తి చేశారు. లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. వీటివల్ల ప్లేస్మెంట్స్ గణనీయంగా పెరిగాయి. క్యాంపస్ ఎంపికల్లో 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందగా 2022–23లో ఈ సంఖ్య 1.20 లక్షలకు పెరగడం విశేషం. నైపుణ్యాలకు పదును విద్యార్థులను ఉత్తమ రీతిలో తీర్చిదిద్దాలంటే అధ్యాపకులకు నైపుణ్యాలపై శిక్షణ అవసరం. ఇందుకోసం 400 మంది అధ్యాపకులకు వరంగల్లోని ఎన్ఐటీలో మరో వెయ్యి మంది అధ్యాపకులకు ఆన్లైన్ ద్వారా ఈ–కంటెంట్పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు నచ్చిన సమయంలో కోరుకున్న సబ్జెక్టును చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వీడియో పాఠాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సమస్యలకు పరిష్కారాలు, ప్రశ్నాబ్యాంకు లాంటి వనరులను అందుబాటులో ఉంచుతున్నారు. 3,146 వీడియోలను సిద్ధం చేసి ఎల్ఎంఎస్కు జోడించారు. న్యాక్ అక్రిడిటేషన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల ద్వారా కళాశాలల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు డిపార్ట్మెంట్ అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ను ప్రభుత్వం చేపట్టింది. బడ్జెట్లో భారీగా నిధులు యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రత్యేక శిక్షణ సంస్థలనూ నెలకొల్పుతున్నారు. ఇందుకోసం 2022–23 బడ్జెట్లో రూ.969.91 కోట్లు కేటాయించడం గమనార్హం. 2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదగాలన్న యూజీసీ లక్ష్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల్లో విద్యలో సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఆనర్స్) ప్రవేశపెట్టింది. 144 కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూములను ఏర్పాటు చేసి అధునాతన విధానాల్లో బోధించేలా చర్యలు తీసుకుంది. ఐసీటీ ఆధారిత బోధన, అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు 56 కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములను నెలకొల్పారు. ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సులు రాష్ట్రంలో 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 111 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 1,022 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం 3,65,563 సీట్లుండగా 2 లక్షల నుంచి 2.5 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కాలేజీ విద్యను పటిష్టం చేయడంలో భాగంగా ప్రమాణాలు పాటించని విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 30 మంది కన్నా తక్కువ చేరికలున్న కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి ఆ తర్వాత మూసివేతకు, కోర్సుల రద్దుకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఇతర కాలేజీలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. యూజీసీ కంటే ముందే ఉమ్మడి పీజీసెట్ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూఈటీ)ని యూజీసీ అమల్లోకి తెచ్చింది. దీనిద్వారా విద్యార్థులకు బహుళ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పడంతో పాటు ఫీజుల వ్యయమూ తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ కంటే ముందే అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు 2021లోనే కామన్ ఎంట్రెన్స్ టెస్టును అమల్లోకి తెచ్చింది. యూజీసీ ఆలోచనలను ఏడాది ముందుగానే అమల్లోకి తెచ్చింది. విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అందరి కంటే ఒక అడుగు ముందే ఉంది. జాతీయ సగటుకు మించి జీఈఆర్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండడంతో మన రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. 2020–21లో దేశంలో సగటు జీఈఆర్ 27.3 శాతం ఉండగా రాష్ట్రంలో 37.2 శాతంగా నమోదైంది. కాలేజీల్లో ఎస్సీ విద్యార్థుల చేరికల పెరుగుదలలో జాతీయ స్థాయిలో కంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉంది. చదువుల వ్యయంతోపాటు ఇంటర్న్షిప్, స్కిల్ కోర్సులను అందిస్తుండటంతో జీఈఆర్ గణనీయంగా పెరిగింది. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు యువతుల వివాహ వయసు 18 ఏళ్లు నిండడంతో పాటు 10వ తరగతి చదవడం తప్పనిసరి అనే నిబంధన విధించడంతో బాలికల విద్యా రేటు పెరిగింది. ఈ పథకాలతో ప్రయోజనం పొందిన 50 శాతానికి పైగా యువతులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారే కావడం గమనార్హం. -
ముందే ఫీ‘జులుం’
పాలిసెట్ ద్వారా ధనుంజయ్ రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని ఓ కాలేజీలో సీటు సాధించాడు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హత ఉంది. ట్యూషన్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన తర్వాత అడ్మిషన్కు కాలేజీకి వెళ్లాడు. అయితే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో ఒక్కసారిగా రూ.18వేలు చెల్లించే పరిస్థితి లేక ధనుంజయ్ సతమతమయ్యాడు. సీటు కోల్పోతాననే ఆందోళనతో తండ్రికి అసలు విషయం చెప్పగా, అప్పు చేసి వెంటనే ఫీజు చెల్లించి కాలేజీలో చేరాడు. ఫీజురీయింబర్స్మెంట్ పథకానికి అర్హత ఉన్న ధనుంజయ్ ఒక్కడే కాదు..ఆ కాలేజీలో కన్వినర్ కోటాలో వివిధ బ్రాంచ్ల్లో సీటు దక్కించుకున్న దాదాపు 500 మందికి పైగా విద్యార్థులంతా ఇదే తరహాలో ట్యూషన్ ఫీజు సొంతంగా చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నారు. పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర వృత్తివిద్యా కాలేజీలన్నీ ఇదే తరహాల్లో విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఆయా కోర్సులు అందించే కాలేజీలు ఇలా... సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. వృత్తివిద్యా కోర్సుల అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఆదాయపరిమితికి లోబడిన, కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటర్లో చేరే విద్యార్థులు, దోస్త్ ద్వారా జనరల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఈ పథకం అమలవుతోంది. వాస్తవానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద సీటు సాధిస్తే నిబంధనలకు లోబడి ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా కాలేజీలో అడ్మిషన్ తీసుకొని కోర్సు పూర్తిచేసే వరకు ఉచితంగా చదువుకోవచ్చు. కానీ మెజారిటీ కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అడ్మిషన్ సమయంలోనే కొన్ని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థి నుంచి ముందస్తుగా ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. అలా ఫీజును చెల్లించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు చెల్లిస్తే.. అప్పుడు రికవరీ రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 12.65లక్షలు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు నిధులు విడుదల చేస్తుంది. నేరుగా కాలేజీ యాజమాన్యం ఖాతాలో అవి జమ అవుతాయి. పాలిటెక్నిక్ కోర్సు మూడు సంవత్సరాలు, ఇంజనీరింగ్ కోర్సు నాలుగేళ్లు... ఇలా ఆయా కోర్సు కాలపరిమితి ఉండగా, విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ సంవత్సరానికి సంబంధించిన నిధులను తదుపరి అకడమిక్ ఈయర్ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కాలేజీ ఖాతాలో జమ చేస్తుంది. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం విద్యార్థి చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెక్కు రూపంలో అతనికే చెల్లిస్తుంది. వాస్తవానికి విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేసుకోవడం, తర్వాత అతడికి తిరిగి చెల్లించడం నిబంధనలకు విరుద్ధం. లిఖిత పూర్వక ఫిర్యాదులు నిల్ రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు అదే కాలేజీలో చదవాల్సి ఉండడంతో ముందస్తు ఫీజు వసూళ్లపై విద్యార్థులు ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు. ఇలా ఫిర్యాదు చేస్తే కాలేజీల్లో ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందనే భావన మెజారిటీ విద్యార్థుల్లో ఉంది. ఫీజుల చెల్లింపులపై సంక్షేమ శాఖలకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. -
పైసా ఇవ్వలే...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీలో డి.సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎంసెట్లో ఉత్తమర్యాంకు సాధించి కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న సాయికిరణ్ ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హుడు. కానీ రెండేళ్లుగా వ్యక్తిగతంగా ఫీజు చెల్లిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ నిధులు జమ కాగానే చెక్కు రూపంలో ఫీజు వెనక్కి ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో ధైర్యం చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. కోవిడ్ తర్వాత నిధుల విడుదలలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దాని ప్రభావం విద్యార్థుల చదువులు, ఇతర అంశాలపై పడుతోంది. బకాయిలు రూ.4,043.19 కోట్లు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయి. రూ.4043.19 కోట్ల మేర విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు రూపంలో చెల్లించాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్లో పైసా విడుదల కాకపోగా, అంతకుముందు ఏడాది 40శాతం మాత్రమే నిధులు విడుదలయ్యాయి. సాధారణంగా అయితే విద్యాసంవత్సరం ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తారు. కానీ మూడేళ్లుగా పరిస్థితి తారుమారైంది. బీసీ విద్యార్థులవే అధికం ఫీజు బకాయిల్లో అత్యధికం బీసీ సంక్షేమశాఖకు చెందినవే ఉన్నాయి. ఈ మూడేళ్లకు సంబంధించి బీసీ విద్యార్థులకు రూ.2182.89 కోట్ల బకాయి లున్నాయి. ఈబీసీ కేటగిరీలో మూడేళ్ల బకాయిలు రూ.661.84 కోట్లు ఉన్నాయి. ♦ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా నిధుల సర్దుబాటు చేస్తున్నారు. ♦ మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోనూ బకాయిలు 461.05కోట్లు ఉన్నాయి. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు... ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిధులు విడుదల చేసిన తర్వాత వాటిని కాలేజీ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడంలోనూ తాత్సారం చేస్తోంది. గతేడాది డిసెంబర్లో దాదాపు రూ.4వందల కోట్లకు సంబంధించి టోకెన్లు జనరేట్ చేసిన అధికారులు ట్రెజరీల్లో క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపారు. – గౌరి సతీశ్, కన్వినర్, కేజీ టు పీజీ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గరున్న ఓఇంజనీరింగ్ కాలేజీలో జె.కార్తిక్ తాజాగా ఎంటెక్ పూర్తి చేశాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూ ద్వారా జాబ్కు ఎంపికయ్యాడు. ఒప్పందపత్రంపై సంతకంతోపాటు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్టు సమర్పించాలని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాలంటూ రీయింబర్స్మెంట్కు మెలిక పెట్టింది. దీంతో అప్పు చేసి ఫీజు చెల్లించి కాలేజీకి నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నాడు. -
రేపు ‘కేసీఆర్ విద్యాబంధు’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు మోసుకొచ్చింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో బీసీ గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువ స్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్లో మీడియా తో మాట్లాడుతూ పథకానికి సంబంధించిన వివరాలు తెలిపారు. కేసీఆర్ విద్యాకానుక/ కేసీఆర్ విద్యాబంధు/ స్వదేశీ విద్యానిధి.. ఇలా దాదాపు 20 పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈనెల 28న హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం(ఎంహెచ్ఆర్డీ)లో పథకం పేరు, జీవో విడుదల, లోగోతోపాటు విధివిధానాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్గౌడ్తోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్ హాజరవుతున్నారని చెప్పారు. గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకు..: కేవలం స్కూల్ వరకు విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలు చెల్లిస్తే.. సరిపోదని భావించిన కేసీఆర్.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కూడా అవే సౌకర్యాలు కల్పించాలని ఈ కార్య క్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి గంగుల తెలిపారు. ఈ నిర్ణయంతో 302 హాస్టళ్లలో చదువుకుంటున్న 33, 687 మంది విద్యార్థులకు లబ్ధి చేకూ రుతుందన్నారు. వీరికి డైట్, కాస్మె టిక్ చార్జీలతోపాటు నోట్బుక్స్, రికా ర్డ్స్, బెడ్షీట్లు తదితరాలు అందిస్తా మన్నారు. అదే విధంగా ఐఐటీ, ఐఐ ఎం, ఐఐఎస్సీ, ఐఐటీ, ఎయిమ్స్తో పాటు అన్ని ప్రముఖ వర్సిటీలు, జాతీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కూడా చెల్లిసా ్తమని మంత్రి స్పష్టంచేశారు. అందు కే, గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే నూతన పథ కం ముఖ్యఉద్దేశమని శుక్రవారం విధివిధానాలు వివరిస్తామని తెలి పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్ పాల్గొన్నారు. -
జాతీయ విద్యా సంస్థల్లో చదివే బీసీలకూ ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు వంటి 200కు పైగా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన రాష్ట్ర బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించనుంది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఈ పథకాన్ని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే బీసీలకు కూడా వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఏటా సుమారు 10 వేల మందికి.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తోందని.. రాష్ట్రంలో చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని మంత్రి గంగుల గుర్తు చేశారు. ఇకపై దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఫీజు అందించనుందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఏటా రాష్ట్రానికి చెందిన దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.150 కోట్ల భారం పడుతుందని గంగుల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతు బంధు, ఉచిత కరెంటు తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అని పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు రూ.లక్ష ఆర్థిక సాయం, ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయం విప్లవాత్మకం: జూలూరు గౌరీశంకర్ ఎక్కడా లేని విధంగా దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు. -
ముందుగానే ‘ఉపకార’ దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు అనుమతివ్వాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ముందస్తుగా దర ఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తే.. వేగంగా పరిశీలించి అర్హతలు నిర్ధారించవచ్చని, దీంతో నిధు లు సైతం త్వరగా అర్హుల ఖాతాల్లో జమ చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపింది. సాధారణంగా జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల నుంచే ప్రారంభించేందుకు సాంకేతిక అనుమతులను కోరింది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. దీనిపై వారం రోజుల్లోగా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసు కుని దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. నాలుగు నెలలు గడువు.. 2023–24 విద్యా సంవత్సరంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నాలుగు నెలల పాటు నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. గతేడాది మొదట మూడు నెలల పాటు అవకాశం కల్పించగా.. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన వినతుల మేరకు మరో రెండు నెలలు, చివరగా నెలరోజుల పాటు అవకాశం కల్పించింది. ఈ సారి విడతల వారీగా దరఖాస్తుల స్వీకరణకు బదులుగా ఒకేసారి నాలుగు నెలల పాటు అవకాశం కల్పించి తర్వాత నిలిపివేయాలని యోచిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే వాటి పరిశీలన, అర్హతల ఖరారు ప్రక్రియను కొనసాగించనుంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ముందుగా ఉపకారవేతనాలను విడుదల చేసే అంశాన్ని సంక్షేమ శాఖలు పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వెంటనే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటే వేగంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారవర్గాలు సూచిస్తున్నాయి. -
నెల రోజుల్లో పరిశీలన.. ఆపై ఉపకారవేతనాలు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మార్చి 31తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా... మొత్తం 12,59,812 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో రెన్యువల్స్ 7,36,799 కాగా, ఫ్రెషర్స్ దరఖాస్తులు 5,23,013 ఉన్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గత సెపె్టంబర్లో ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ... డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికావడంలో తీవ్ర జాప్యం జరగడంతో జనవరి 31 వరకు గడువు పొడిగించారు. కానీ అప్పటివరకూ అడ్మిషన్లు కొనసాగుతుండటంతో చివరి అవకాశం కింద మార్చి 31 వరకు గడువు పొడిగించారు. ఇప్పుడు దరఖాస్తుల గడువు ముగియడంతో అధికారులు వాటి అర్హత నిర్ధారణపై దృష్టి సారించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే సంక్షేమ శాఖలు అందుబాటులో ఉన్న నిధులను ముందుగా ఉపకారవేతనాలు విడుదల చేసి, ఆ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. నెలరోజుల్లో పరిశీలన పూర్తి... ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలనకు సంక్షేమ శాఖలు నెలరోజుల గడువును నిర్దేశించుకున్నాయి. ఏప్రిల్ ఆఖరు కల్లా వీటిని పరిశీలించి అర్హులను నిర్ధారించాలని నిర్ణయించాయి. ఈమేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ , వికలాంగుల సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు ముందుగా సంబంధిత కాలేజీ యాజమాన్యం యూజర్ ఐడీకి చేరతాయి. కళాశాల ప్రిన్సిపల్ దరఖాస్తులను పరిశీలించి వాటిని సంక్షేమాధికారికి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులను నిర్ధారిస్తారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం ఆమోదం తెలిపిన తర్వాత ప్రతి విద్యార్థి మీసేవా కేంద్రాల్లో వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తంతు పూర్తయ్యాక సంక్షేమ శాఖలు సదరు దరఖాస్తును ఆమోదిస్తాయి. ఈ ప్రక్రియ కోసం సంక్షేమ శాఖలు నెలరోజులు గడువు నిర్దేశించుకున్నప్పటికీ మరింత ఎక్కువ సమయం పడుతుందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. పరీక్షలు, ప్రిపరేషన్ నేపథ్యంలో విద్యార్థులు వేలిముద్రలు సమర్పించడంలో జాప్యం జరుగుతుందని, ఏటా ఇదే జాప్యం వల్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. -
తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ప్రైవేటు కాలేజీల నిర్వహణ కష్టంగా ఉందని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడి సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు స్థాపించిన కాలేజీలపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. తమ కాలేజీల్లో 9.40 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 2021–22 సంవత్సరానికి రూ.86.55 కోట్లు ట్రెజరీకి విడుదలైనా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వలేదని, 2022–23 సంవత్సరానికి రూ.226 కోట్లు ఇంకా విడుదల చేయలేదన్నారు. దీనివల్ల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులులేవని వేధించే ప్రభుత్వం, తమకు రావాల్సిన బకాయిలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. గడచిన ఎనిమిదేళ్లలో కాలేజీలపై వివిధ రకాల ఫీజులను 10 నుంచి 50 శాతం పెంచారని, ఫీజు రీయింబర్స్మెంట్ను మాత్రం ఆ నిష్పత్తిలో పెంచలేదన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం నేతలు ఇంద్రసేనరెడ్డి, ఉస్మాన్, ఎస్ఎన్ రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫీజులు దులపండి
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలవుతున్న ఉపకారవేతన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం కనిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో క్రమంగా బకాయిలు పెరిగిపోతున్నాయి. 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు నిధుల విడుదలకు ప్రభుత్వం తాత్సారం చేయడంతో బకాయిలు ఏకంగా రూ.2,117.66 కోట్లకు పేరుకుపోయాయి. తాజాగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం వరకు గడువుండగా, ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టి అర్హతను నిర్ధారిస్తారు. అనంతరం తాజా విద్యా సంవత్సర చెల్లింపులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రెండేళ్లుగా బకాయిలు పెండింగ్లో ఉండడంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు కూడా ఆలస్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ‘బీసీ’ నిధులు భారీగా పెండింగ్.. గత విద్యా సంవత్సరం వరకు ఉన్న రూ.2117.6 కోట్ల బకాయిల్లో బీసీ సంక్షేమ శాఖకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. ఈ శాఖకు సంబంధించి రూ.1,376.36 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2020–21కు సంబంధించి రూ.322.25 కోట్లు, 2021–22కు చెందిన రూ.1,054.11 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఉండడం, ఆ మేరకు అందుబాటులో ఉన్న నిధులను సర్దుబాటు చేస్తుండడంతో ఆయా శాఖలకు సంబంధించిన బకాయిలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన బకాయిలు కూడాపెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నట్లు ఆయా శాఖలు చెబుతున్నాయి. ఖజానా శాఖకు అనుమతులు లేక... ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కో సం వచ్చిన దరకాస్తులను పరిశీలించి వాటిని ఆమోదిస్తున్న సంక్షేమ అధికారులు.. జిల్లా స్థాయిలో వాటికి బిల్లులు రూపొందించి నిధుల విడుదల కోసం ఖజానా విభాగానికి పంపిస్తున్నారు. అలా పంపిన బిల్లులు సంక్షేమ శాఖల్లో పరిష్కరించినట్లు రికార్డు చూపిస్తున్నప్పటికీ.. ఖజానాల్లో నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన బిల్లులను మాత్రమే ఖజానా అధికారులు క్లియర్ చేస్తున్నారు. ప్రతి నెల ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ నిధులు మాత్రమే సకాలంలో పరిష్కరిస్తుండగా... మిగతా ఎలాంటి బిల్లులకు ఆమోదం లభించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పరిశీలనతోనే సరి! 2022–23కు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చివరి తేదీ జనవ రి 31 నాటికి 12.5 లక్షల దరఖాస్తులు వస్తాయని సంక్షేమ శాఖల అధికారులు అంచనా వేస్తున్నారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ పరిశీలన పూర్తి చేసేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి చూస్తే 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ రూ.2,350 కోట్లు ఉండే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో కేవలం దరఖాస్తుల పరిశీలనతోనే సరిపెట్టి, పాత బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఖాజీపేటకు చెందిన రాఘవేంద్ర కుమార్ కూకట్పల్లి సమీపంలోని ఓ కాలేజీలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్ష ఫీజు సమయంలో మొదటి సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం మెలిక పెట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అర్హులు సైతం ట్యూషన్ ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాక వారికి తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ట్యూషన్ ఫీజు రశీదు ఇచ్చిన విద్యార్థుల నుంచే సెమిస్టర్ పరీక్ష ఫీజు స్వీకరిస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో రాఘవేంద్రకుమార్ డబ్బులు వడ్డీకి తెచ్చి ట్యూషన్ ఫీజు, సెమిస్టర్ ఫీజు చెల్లించాడు. -
విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలి
కవాడిగూడ (హైదరాబాద్): బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమంకోసం విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న సీఎం కేసీఆర్ 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సచివాలయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి భవన్లు నిర్మించుకోవడానికి నిధులు ఉంటాయిగానీ, బీసీ విద్యార్థులకు నూతన వసతి భవనాలు నిర్మించడానికి నిధుల కొరత ఉందని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. చదువుకోసం, సామాజిక న్యాయసాధన కోసం తలపెట్టిన బీసీ విద్యార్థుల పోరుయాత్ర ముగింపు సభ ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో జరిగింది. డిసెంబర్ 2న పాలమూరులో ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బీసీ విద్యార్థి, యువజనులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణను జ్ఞాన తెలంగాణ చేయకుండా గొర్రెలు, బర్రెలను పంపిణీ చేస్తూ విద్యను వ్యాపారం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బడులు మూసి, బార్లు తెరుస్తున్న కేసీఆర్ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు బకాయిపడ్డ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2023లో ఓటు మనదే.. సీఎం సీటు మనదే.. అని నినాదమిచ్చారు. ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి బీసీ విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను రద్దుచేసి ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలన్నారు. తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకోసం రాజకీయ విధానాన్ని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ తదితరులు పాల్గొన్నారు. -
AP: ప్రభుత్వ పథకాలతో ఉన్నత చదువులకు విద్యార్థుల మొగ్గు
సాక్షి, అమరావతి: ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణుల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 93.38 శాతం మంది ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడం గమనార్హం. ఇది దేశంలోనే కొత్త రికార్డు సృష్టించింది. జాతీయ సగటుకు మించి ఏపీలో గరిష్ట చేరికల నిష్పత్తి నమోదవుతోంది. ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో మూడున్నరేళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది. టీడీపీ హయాంలో 2018–19లో 20.37 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరలేక డ్రాపౌట్లుగా మిగలగా ప్రస్తుతం 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. గత సర్కారు అరకొర ఫీజులనూ ఇవ్వకుండా రూ.1,800 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోగా వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో పాటు అకడమిక్ అంశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టిన సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయనేది కాదనలేని నిజం. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ సదుపాయాలు మెరుగు పరుస్తుండడం, వివిధ పథకాలతో అడుగడుగునా అండగా నిలుస్తుండటంతో చదువుల నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రానికే ప్రాధాన్యం బయట రాష్టాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గతంలో కన్నా తగ్గి రాష్ట్ర కాలేజీల్లో చేరికలు పెరిగాయి. 2022 – 23లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిన వారు 35.50 శాతం ఉండగా డిగ్రీ కోర్సుల్లో 43.79 శాతం మంది చేరారు. 11.13 శాతం మంది అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో చేరిన వారు 2.96 శాతం మంది ఉన్నారు. మరో 6.62 శాతం మంది మాత్రమే డ్రాపౌట్లుగా మిగిలారు. 2018–19లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారిలో 20.37 శాతం మంది డ్రాపౌట్లుగా మిగిలిపోగా ఈసారి అది 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. 2018 – 19లో టీడీపీ అధికారంలో ఉండగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించినందున మిగతా ఫీజుల భారాన్ని భరించలేక ఇంజనీరింగ్ కోర్సుల్లో 21.77 శాతం మంది మాత్రమే చేరారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండడంతో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరికల శాతం అమాంతం 35.50 శాతానికి పెరగడం గమనార్హం. నాడు.. ప్రైవేట్కే విద్య టీడీపీ హయాంలో ఉన్నత విద్య మొత్తం ప్రైవేట్పరం కావడం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. ఇంటర్ చదువులకే రూ.లక్షలు ధారపోయాల్సిన దుస్థితి నెలకొంది. తూతూ మంత్రంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలైంది. కాలేజీల్లో ఫీజు ఎంతున్నా ఇంజనీరింగ్కు రూ.35 వేలు, ఇతర డిగ్రీ కోర్సులకు రూ.7 వేల నుంచి రూ. 10 వేల లోపు మాత్రమే విదిలించి గత సర్కారు చేతులు దులుపుకొంది. అది కూడా అరకొరగానే ఇవ్వడంతో మిగతా ఫీజుల మొత్తాన్ని తలిదండ్రులే భరించాల్సి వచ్చేది. ఫలితంగా పిల్లల చదువులు పూర్తయ్యేసరికి అప్పుల్లో మునిగిపోయేవారు. ఇలాంటి పరిస్థితి కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్తోనే చదువు ముగించి చిన్నా చితకా ఉద్యోగాలు, కూలి పనుల అన్వేషణలో నిమగ్నమైన పరిస్థితి ఏర్పడింది. నేడు.. సమూల మార్పులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా రంగం పరిస్థితి సమూలంగా మారిపోయింది. పేద విద్యార్థుల చదువులకయ్యే ఫీజు మొత్తాన్ని జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది. చదువులు సాఫీగా సాగేలా వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకు చెల్లిస్తున్నారు. వీటిని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత చదువులపై భరోసా ఏర్పడింది. ఫలితంగా డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. కరోనా ఉన్న రెండేళ్లలోనూ చేరికలు పెరగడం విశేషం. లక్ష ప్లేస్మెంట్స్ లక్ష్యం ► టీడీపీ హయాంలో 2015–16లో ఉన్నత విద్యా కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య 11,25,510 కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2021–22 నాటికి 14,23,952కి చేరుకుంది. చదువుల కోసం నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే మొత్తం ఫీజులను చెల్లిస్తుండటంతో ప్రవేశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ► అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2014–15లో రాష్ట్రంలో ప్లేస్మెంట్లు 56 వేలు కాగా 2021–22లో 78 వేలకు చేరాయి. ప్లేస్మెంట్స్ను లక్షకు పైగా తీసుకెళ్లటాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► జీఈఆర్ (ప్రతి వంద మందిలో కాలేజీల్లో చేరేవారి సంఖ్య)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రాల వారీగా ఆలిండియా ఉన్నత విద్యా సర్వే (ఐష్) పేరిట నివేదికలను వెలువరిస్తుంది. ఐష్ సర్వే ప్రకారం ఏపీలో జీఈఆర్ 2015–16లో 30.8 ఉండగా 2019–20లో 35.2కు పెరిగింది. జాతీయ స్థాయిలో 24.5 నుంచి 27.1కు పెరిగింది. జీఈఆర్ పెరుగుదల జాతీయ స్థాయిలో 3.04 శాతంగా ఉండగా ఏపీలో 8.64 శాతంగా ఉండడం విశేషం. కేరళ 4.86 శాతం, తమిళనాడు 4.89 శాతం, తెలంగాణ –1.65 శాతంగా ఉన్నాయి. -
‘ఫీజు’కు తప్పని నిరీక్షణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు మరింత నిరీక్షణ తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అటు సంక్షేమ శాఖల వద్ద భారీగా బిల్లులు పేరుకుపోగా.. ఇటు సంక్షేమశాఖలు ఈపాస్ ద్వారా ఆన్లైన్లో క్లియర్ చేసిన బిల్లులకూ ట్రెజరీల్లో చెల్లింపులు జరగని పరిస్థితి నెలకొంది. దీనితో కాలేజీల యాజమాన్యాల నుంచి ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమ శాఖల గణాంకాల ప్రకారం.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి రూ.1,867.66 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.460.96 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 2021–22కు సంబంధించి 1,406.70 కోట్లు చెల్లించాలి. ఇక 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికీ మొదలుకాలేదు. ట్రెజరీలో ఆగిన రూ.560 కోట్లు పోస్ట్మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలతోపాటు అర్హత ఉన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను ముందుగా కాలేజీ యాజమాన్యాలు పరిశీలించి ఆమోదం కోసం సంక్షేమశాఖ అధికారులకు పంపుతాయి. సంక్షేమశాఖల అధికారులు వాటిని పరిశీలించాక ఆమోదించి నిధుల విడుదల కోసం ట్రెజరీకి బిల్లులు పంపుతారు. ట్రెజరీ అధికారులు వాటిని పరిష్కరించి నిధులు విడుదల చేస్తారు. ఈ క్రమంలో 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సుమారు రూ.560.16 కోట్లకు సంబంధించిన బిల్లులను ట్రెజరీకి పంపగా.. అధికారులు ఆమోదించి టోకెన్లు జనరేట్ చేశారు. కానీ ఆర్థికశాఖ విధించిన ఆంక్షలతో నిధుల విడుదల చివరిదశలో నిలిచిపోయింది. ఆంక్షలు సడలించాకే నిధులు విడుదలవుతాయి. చెల్లింపుల్లో పెరుగుతున్న జాప్యం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చెల్లింపులు ఒక ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏదైనా విద్యా సంవత్సరం ముగియగానే.. ఆ ఏడాదికి సంబంధించిన నిధుల చెల్లింపుల ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత కాలంలో చెల్లింపుల్లో జాప్యం పెరిగింది. ప్రస్తుతం 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు దాదాపు 20 శాతం చెల్లించాల్సి ఉంది. 2021–22కు సంబంధించి 50 శాతం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా చెల్లింపులు మొదలుకాలేదు. -
550 కోట్ల కేంద్ర నిధులు హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న దళిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సాయం బంద్ అయ్యింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ విధించిన షరతులతో రెండేళ్లుగా ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాలేదు. షరతులకు లోబడి పథకాన్ని అమలు చేస్తేనే నిధులిస్తామని కేంద్రం పేర్కొనగా వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల కావాల్సిన రూ. 550 కోట్లు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక కోటాలో నిధులు విడుదల చేసింది. వాటిని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ వద్ద ఉన్న నిధులను సర్దుబాటు చేస్తూ సీనియర్ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించింది. ఈ రెండేళ్లకు సంబంధించి కేంద్ర వాటా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకిలా... షరతులేంటి?: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇవ్వగా కేంద్రం 40 శాతం నిధులిచ్చింది. 2021–22 వార్షిక సంవత్సరం నుంచి కేంద్రం ఎస్సీ విద్యార్థులకు మరింత ఎక్కువ బడ్జెట్ను కేటాయిస్తూ 60 శాతం కేంద్రం భరిస్తూ 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా మార్పులు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంతమేర భారం తగ్గనుందని అధికారులు సైతం భావించారు. కానీ తాము నిర్దేశించినట్లుగానే పథకాన్ని అమలు చేయాలంటూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి విద్యార్థి వివరాలను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు కాకుండా లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా పంపుతామని తెలిపింది. అయితే ఈ నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ను కాలేజీల యాజమాన్యాలకు చెల్లిస్తున్నందున కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల వివరాలను సమర్పిస్తే పథకం అమలు స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం భావించి మిన్నకుండిపోయింది. ఫలితంగా రెండేళ్లుగా కేంద్రం తన వాటా నిధుల విడుదలను నిలిపేసింది. -
‘ఉపకార’ సంస్కరణలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల విషయంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని భావించిన సంక్షేమ శాఖలకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలను సమర్పించాయి. ప్రధానంగా సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ, పరిశీలన, ఆమోదం విషయంలో సవరణలకు సంబంధించిన ప్రతి పాదనలను సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా..వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రస్తుతం అవలంభిస్తున్న పద్ధతులతోనే పథకాలను అమలు చేయాలని భావించి పాత విధానాల ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేశాయి. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి విద్యార్థుల నుంచి ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేలా గడువును నిర్దేశించాయి. సులభతరం కోసం సంస్కరణలు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఇవన్నీ ఆన్లైన్ పద్ధతిలోనే స్వీకరిస్తున్నప్పటికీ.. పరిశీలన ప్రక్రియలో పలు అంచెలన్నీ మాన్యువల్ పద్ధతిలోనే సాగుతున్నాయి. దీంతో పథకాల అమలులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సులభతర విధానం కోసం దరఖాస్తుల ప్రక్రియలో మార్పులు చేయాలని సంక్షేమ శాఖలు పలు దఫాలుగా చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఏదైనా కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థి ఒకసారి ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు సమర్పిస్తే కోర్సు ముగిసే వరకు ఆ దరఖాస్తును సాంకేతికంగా అప్డేట్ చేయాలని, ఈ బాధ్యతలను కాలేజీ యాజమాన్యాలకు ఇస్తే విద్యార్థి పదేపదే దరఖాస్తు చేసే పని ఉండదని, సంక్షేమ శాఖ అధికారులు మొదటి ప్రతిపాదన చేశారు. విద్యార్థుల నుంచి ప్రతిసారి ఆదాయ ధ్రువీకరణ పత్రాల సమర్పణ, అఫిడవిట్లు తీసుకునే విధానాన్ని రద్దు చేయాలని, ఇక ప్రతి విద్యార్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో పత్రాలను సమర్పించడం కాకుండా ఆన్లైన్ విధానాన్నే పాటించడం, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియంతా కాలేజీలో నిర్వహించడంలాంటి పద్ధతులతో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలు మరింత సులభతరమవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇదంతా జరిగి ఆర్నెళ్లు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో పాత విధానాన్నే అనుసరించాలని, ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాది నుంచి కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేస్తూ కాలేజీ యాజమాన్యాలకు జిల్లా సంక్షేమ శాఖల నుంచి ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు మౌఖిక ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారు. -
జగనన్న విదేశీ విద్యా దీవెనకు 392 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు పెద్ద చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం 392 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈ పథకంలో దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆర్థికసాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకం రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలు (ఈబీసీ), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వర్తిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, వాటికి జతచేసిన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించిన తరువాత ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెనను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారందరికీ వర్తింపజేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న వారికి ఫీజు రూ.కోటి అయినా నూరుశాతం ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. 101 నుంచి 200 క్యూఎస్ ర్యాంకులున్న యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షల వరకు పెంచడం విశేషం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె.హర్షవర్ధన్ తెలిపారు. (క్లిక్ చేయండి: ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా) -
ఉచితాలు కావవి... సంక్షేమ పథకాలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంక్షేమ పథకాలు అనేవి బలహీన వర్గాలకెంతో మేలు చేసేవి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందించడం. ఆ పనిని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ దేశంలోనే అందరికంటే మేలైన రీతిలో అమలు చేస్తున్నారు. రైతును ఆదుకునే పథకాలు, విద్యా సంబంధమైన ఫీజు రీయింబర్స్మెంట్లు, రుణమాఫీలు, వృద్ధాప్య పెన్షన్లు, వివిధ వృత్తుల వారి ఆదాయాలను పెంచే పథకాలెన్నో రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడాలేవు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ పథకాలను ఉచితాలంటూ, ఉచితాలు ఇవ్వకూడదంటూ విమర్శలు చేస్తున్నది. పేదల కడుపు కొట్టాలని చూస్తున్నది. ఉచిత కరెంటు, గ్రామీణ పేదలకు లక్షల్లో ఇళ్లు కట్టించడం, రైతుబంధు, ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా నాణ్యమైన విద్యను పేదలకు అందించడం, రుణమాఫీ, దళితుల దీన పరిస్థితులను మార్చే దళితబంధు, వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి రైతును ఆదుకోవడం, మహిళలను ఆదుకోవడం... ఇలాంటివన్నీ బీజేపీ దృష్టిలో ఉచితాలే. ఈ ఉచితాల వల్ల నష్టం జరుగుతుందట. సర్వ సంపదలు సృష్టించే ఉత్పత్తి కులాల వారి బతుకుల్లో వెలుగు నింపడానికి అమలు చేసే సంక్షేమ పథకాలు ఉచితాలు ఎలా అవుతాయి? ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయడమనేది ప్రభుత్వ అతి ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి. సంక్షేమ పథకాలను బాగా అమలు చేయడం వల్ల ప్రజల్లో హింసాయుత తిరుగుబాటు ధోరణి తగ్గు తుందన్నది వాస్తవం. అందుకే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్క విప్లవమూ విజయవంతం కాలేదు. సంక్షేమ పథకాలతో పాటు ఉపాధిహామీ, ఉపాధి కల్పన వంటివి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి దేశం పట్ల ప్రేమను పెంచుతాయి. ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలనడం ప్రజావ్యతిరేకతకు నిదర్శనం. ఇన్కంటాక్స్ పేయర్స్ డబ్బుల నుంచి ఈ డబ్బు వస్తుందట. ఈ కార్పొరేట్ శక్తుల ఆదాయం వేలు, లక్షల కోట్లలో పెరుగడానికి కారణం ఈ దేశ సాధారణ ప్రజలే. వీళ్ళు వాళ్ళ వస్తువులను కొనకుంటే వారికి ఆదాయమెక్కడిది? పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ శక్తులకు, ఇన్కంటాక్స్ పేయర్స్కు వచ్చే ఆదాయంలోని ప్రతి రూపాయిలో కోట్లాది మంది ప్రజలు రోజూ కొంటున్న వస్తువులపై వేసే పన్నుందనేది వీరు మరచిపోతున్నారు. (క్లిక్ చేయండి: ఓటమి భయంతో రెండు నాల్కలు) ఇంతకీ కార్పొరేట్ శక్తులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ఆదాయ పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోలా పన్ను చెల్లిస్తే దేశ పరిస్థితి ఇలా ఉండేదా? పేదరికం ఈ స్థాయిలో బుసలు కొడుతుందా? ఈ శక్తులు అక్రమ సంపాదనను బ్లాక్ మనీగా ఉంచడం, విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడం వల్లనే కదా లక్షల కోట్ల దేశ సంపద లెక్కల్లోకి రాకుండా పోతోంది! ఆ డబ్బునంతా వైట్మనీగా మారిస్తే దేశంలో పేదరికం ఉంటుందా? కార్పొరేట్లు... బ్యాంకుల రుణాలను కట్టలేమంటే రుణమాఫీ పేరుతో ఇచ్చే వెసులుబాటు ఉచితం కాదు కానీ ప్రజా సంక్షేమ పథకాలు మాత్రం ఉచితాలా? పేదలకిచ్చే ఉచితాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందా? పన్ను ఎగవేతదారులను సగౌరవంగా విదేశాలకు పంపించడం దేశానికి మేలు చేయడమవుతుందా? పేదలను ఆదుకొనే ప్రభుత్వాలే అసలు సిసలైన సంక్షేమ ప్రభుత్వాలు. వాటిని విమర్శించేవారు ఎప్పటికీ ప్రజావ్యతిరేకులే! (క్లిక్ చేయండి: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?) - డాక్టర్ కాలువ మల్లయ్య ప్రముఖ కథారచయిత, విమర్శకులు -
పదివేల లోపు నిబంధన బీసీ, ఈబీసీల ఆవేదన
విఘ్నేష్ కుమార్ గండిపేట సమీపంలోని పేరున్న కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో ఎంసెట్లో 10025 ర్యాంకు రావడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. మంచి ర్యాంకు రావడం, బీసీ–బీ కేటగిరీలోని రిజర్వేషన్తో పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని భావించిన విఘ్నేష్ ఫీజు ఎక్కువైనా అందులో చేరాలనుకున్నాడు. అయితే అడ్మిషన్ ఖరారు చేసే సమయంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అధికారులు సూచించారు. దీనిపై ఉన్నతాధికారులను ఆరా తీయగా పదివేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని, ఈ లెక్కన కాలేజీలో వ్యక్తిగతంగా రూ.90 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అప్పటికే పూర్తి ఫీజు రీయింబర్స్ చేయాలనే డిమాండ్ ఉండటంతో, తర్వాతైనా ప్రభుత్వం ఇవ్వకపోతుందా అనే ఆశతో తొలిఏడాది ఎలాగోలా ఫీజు మొత్తం సర్దుబాటు చేసుకుని అందులో చేరాడు. కానీ ఇప్పటికీ డిమాండ్ నెరవేరక పోవడంతో.. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఫీజు చెల్లించడానికి ఎన్నో ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. ఒక దశలో కోర్సు మానేద్దామనుకున్నా అష్టకష్టాలూ పడి ఫైనల్ ఇయర్ పూర్తిచేసి కొలువు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తుండటం..చాలామంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు, ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక ర్యాంకు ఎక్కువ వచ్చినా ఆ పథకం కింద విద్యార్థికి కేవలం రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని టాప్–10 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ట్యూషన్ ఫీజు రూ.80 వేలకు పైమాటే ఉంది. నాలుగైదు కాలేజీల్లో రూ.లక్ష కంటే ఎక్కువ ఉండగా.. మిగతా కాలేజీల్లో రూ.80 వేలకు అటుఇటుగా ఉంది. ఇక టాప్ 10 నుంచి 20 వరకు కాలేజీల్లో రూ.55 వేలకు మించి ఫీజు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా పదివేల ర్యాంకు సీలింగ్ దాటిన విద్యార్థులకు ప్రభుత్వం కనీస ఫీజు అయిన రూ.35 వేలు మాత్రమే ఇస్తుండగా.. చాలా కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.50 వేల కంటే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సీలింగ్ ర్యాంకు దాటిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన పక్షంలో అదనపు ఫీజును వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తోంది. సీఎం సానుకూలంగా స్పందించినా.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ర్యాంకు సీలింగ్ను కొన్నేళ్ల క్రితం విధించారు. అప్పట్నుంచీ విద్యార్థి సంఘాలతో పాటు బీసీ సంఘాలు, ఇతర సామాజిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సమానంగా బీసీలు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తి ఫీజును రీయింబర్స్ చేయాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు సందర్భాల్లో ర్యాంకు సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రతిపాదనల్లోనూ ఈ మేరకు సూచనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మూడేళ్లు గడిచినా ఈ అంశం ఎటూ తేలలేదు. ర్యాంకు సీలింగ్ నిబంధనతో ఏటా వేలాది బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అరకొరగానే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుండగా.. ఆయా కాలేజీల్లో అదనపు ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. వారిలో సగం మందే బీసీలు ఎంసెట్లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో బీసీలు సగం మంది మాత్రమే ఉంటున్నారు. జనరల్ కేటగిరీతో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మినహాయిస్తే బీసీలు సగటున 3 వేల నుంచి గరిష్టంగా 6 వేల మంది ఉంటున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏటా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులు 6 వేలకు మించడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా లక్ష మంది ఉండగా.. ఇందులో గరిష్టంగా 6వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ఫుల్ ఫీజు అందుతోంది. మొత్తం విద్యార్థుల్లో 10 శాతం మందికి పూర్తి ఫీజు మంజూరవుతుండగా.. అందులో బీసీల వాటా 6శాతం మాత్రమే. -
ఉపకారానికి కొర్రీ .. విద్యార్థులు వర్రీ!
సాక్షి, హైదరాబాద్: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై కేంద్రం విధించిన సరికొత్త నిబంధనలు పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాము సూచించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటేనే కేంద్ర వాటా విడుదల చేస్తామని స్పష్టం చేయడం, దీనిపై రాష్ట్ర సర్కారు మిన్నకుండడంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.600 కోట్లు నిలిచిపోయాయి. దీంతో అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. రాష్ట్రంలో వివిధ పోస్టుమెట్రిక్ కోర్సులు చదివే విద్యార్థులు ఏటా 2 లక్షలకు పైగా ఉంటారు. 60 శాతానికి పెరిగిన కేంద్రం వాటా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి రాష్ట్రాలకు నిధులిస్తుంది. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులు కలిపి విద్యార్థులకు అందిస్తుంటాయి. ఎన్నో ఏళ్లుగా ఈ పద్ధతి కొనసాగుతోంది. అయితే తన వాటా నిధులు 40 నుంచి 60 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి కొత్త నిబంధనలు విధించింది. గతేడాది నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 40 శాతం (గతంలో 60 శాతం) విడుదల చేయాలనే మెలిక పెట్టింది. అంతేకాకుండా విద్యార్థుల ఖాతా నంబర్లను కేంద్రానికి పంపితే నేరుగా నిధులు జమ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. వివరాలను పంపాలని సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం పంపలేదు. సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం! నేరుగా తామే ఖాతాల్లో నిధులిస్తామనే నిబంధనతో లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశముందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు ఉపకారవేతనాలే నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ను కాలేజీ ఖాతాలో జమ చేస్తోంది. కేంద్రం నిబంధనల ప్రకారం ఫీజులు కూడావిద్యార్థి ఖాతాలో జమ చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయని ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో లబ్ధిదారులకు అందించడమే ఉత్తమమని, ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల వివరాలను పంపకపోవడంతో రెండేళ్లుగా ఈ కోటాలో పైసా కూడా విడుదల కాలేదు. ఇరకాటంలో విద్యార్థులు.. 2021–22 విద్యా సంవత్సర దరఖాస్తుల పరిశీలన పూర్తయినప్పటికీ ఆయా విద్యార్థులకు సంబంధించిన ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో మెజార్టీ విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఎదురు చూస్తుండగా... కాలేజీ యాజమాన్యాలు ఫీజు నిధుల కోసం పడిగాపులు కాస్తున్నాయి. కొన్నిచోట్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తుండడంతో వారు అప్పులు చేసి సొంతగా ఫీజులు చెల్లిస్తున్న ఉదంతాలు సైతం కనిపిస్తున్నాయి. -
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి: కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): తెలంగాణలో పెండింగ్లో ఉన్న 15 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,500 కోట్లు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచాలని, బీసీ, ఈబీసీ విద్యార్థుల మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయాలని కోరారు. పై డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు బడ్జెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని, రెండేళ్లుగా 15 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యా లు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చలో కలెక్టరేట్ పోస్టర్ను ఆవిష్కరించారు. -
బాధ్యత వద్దు, విషప్రచారం ముద్దు
విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్నది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట. ‘విద్య ప్రభుత్వ బాధ్యత. అది పవిత్రమైన పెట్టుబడి, యువత భవిష్యత్తుకు అది బంగారు పెట్టుబడి’.. ఇది ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట. వీరిద్దరిలో ఎవరు రైట్? ఎవరు రాంగ్? చంద్రబాబు విద్యారంగంపై చేసిన వ్యాఖ్య చాలా తీవ్రమైనది. ఆయన రాసుకున్న పుస్తకంలో కూడా ఉన్న సంగతే ఇది. విద్యారంగానికి ప్రైవేటు రంగం బాధ్యత వహించాలనీ, కార్పొరేట్లు దాన్ని చేపట్టాలనీ అనడం ద్వారా ప్రభుత్వానికి దానితో సంబంధం అంతంత మాత్రమే అని చెప్పకనే చెప్పారు. నిజానికి ప్రభుత్వాలు నిర్వహించవలసిన ముఖ్యమైన కర్తవ్యాలలో విద్య ప్రధానమైనది. ఆ తర్వాత వైద్యం, తదుపరి వ్యవసాయం వస్తాయి. మొత్తం రాష్ట్ర ప్రజలందరి జీవితాలనూ ప్రభావితం చేసే విషయాలివి. అందువల్లే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కానీ, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి కానీ, ఆయా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున స్కూళ్లు స్థాపించాయి. టీచర్ల నియామకానికి బాధ్యత తీసుకున్నాయి. స్కూళ్లకు భవనాలు, మైదానాలు సమ కూర్చాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ధోరణిలో మార్పు వచ్చింది. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రముఖంగా మారాయి. విద్య వ్యాపారంగా మారిపోయింది. అందువల్ల 1998లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినా, ఆ తర్వాత ఏదో సాకుతో ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైనవారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. జనం కూడా క్రమంగా ప్రభుత్వ స్కూళ్లనూ, కాలేజీలనూ వదలి, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలవైపు చూడడం ఆరంభించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన ‘ఫీజు రీయింబర్స్మెంట్’ స్కీమ్ గేమ్ ఛేంజర్గా మారింది. అంతవరకు ఆర్థికంగా స్థితిమంతులకూ, ఎక్కువ భాగం అగ్రవర్ణాలకే పరిమితం అయిన ఉన్నత విద్య, ఈ స్కీమ్తో పేదలకూ, బలహీన వర్గాలకూ కూడా అందుబాటులోకి వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఏకంగా ప్రైవేటు రంగంలోనే విద్యారంగం ఉండాలని అధికారిక కార్యక్రమాలలోనే చెప్పడం ద్వారా తన ప్రభుత్వ వైఖరి తెలియచెప్పారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ చాలా నిర్దిష్టంగా విద్యా రంగానికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ‘అమ్మ ఒడి’ పేరుతో వినూత్న స్కీమ్ను ప్రవేశ పెట్టి పిల్లలను బడులకు పంపించే తల్లులకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం ఆరంభించారు. అది పేదలకు, మధ్య తరగతి పిల్లలకు వరంలా మారింది. స్కూళ్లను ‘నాడు–నేడు’ పథకం కింద బాగు చేయాలని సంకల్పించి చకచకా పనులు ప్రారంభించారు. వాటి రూపురేఖలను మార్చడం మొదలుపెట్టారు. రంగులు వేయడం, పైకప్పులు బాగు చేయడం, స్కూల్ కాంపౌండ్ను ఆహ్లాద కరంగా తయారు చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా టాయిలెట్లకు ప్రయారిటీ ఇవ్వడం వంటి చర్యలతో ప్రభుత్వ ప్రాధాన్యతలలో ముఖ్యమైనవాటిలో విద్య ఒకటి అని తెలియచెప్పారు. ఇక ‘జగనన్న విద్యా దీవెన’, ‘గోరు ముద్ద’... ఇలా వివిధ స్కీములు కూడా అమలు చేస్తున్నారు. ఫలితంగా ప్రజలలో జగన్ పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడింది. దీంతో తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, తదితర మీడియా సంస్థలు కానీ తడబాటుకు గురయ్యాయి. ఇది ఇలాగే సాగితే ప్రజలలో జగన్ పలుకుబడిని దెబ్బతీయలేమని భావించి, రకరకాల వ్యతిరేక ప్రచారాలు ఆరంభించారు. అందులో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ‘అమ్మ ఒడి, నాన్న బుడ్డి’ అంటూ అవహేళనగా సభలలో మాట్లాడుతున్నారు. బైజూస్ టెక్నాలజీని ప్రభుత్వం తీసుకు వస్తే, దానిని ‘జగన్ జ్యూస్’ అంటూ చంద్రబాబు తన వయసు కూడా మర్చిపోయి అసహ్యకరమైన వ్యాఖ్య చేశారు. విద్యార్థులకు లోటుపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహిస్తే, లీకేజీలను అరికడితే, రెండు లక్షల మంది పిల్లలు పాస్ కాలేదనీ, ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ చిత్రమైన వాదన కూడా వీరు చేశారు. ఇలా ఒకటికాదు, ఏ అవకాశం వస్తే దానిని వారు వినియోగించుకుని విషం చిమ్మినంత పనిచేశారు. అందువల్లే జగన్ ఏకంగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను దుష్టచతుష్టయంగా ప్రకటించి... వారికి దత్తపుత్రుడు తోడుగా ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. ఇలా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్న తరుణంలో కొన్ని ప్రశ్నలు సహజంగానే ముందుకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ, వారి అనుబంధ మీడియా ఒక వైపు రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో అమ్మ ఒడి లేదా ఇతర సంక్షేమ స్కీములలో ఇన్ని వేల మందికి, లక్షల మందికి ప్రభుత్వం కోత పెడుతూ అన్యాయం చేస్తోందని ద్వంద్వ ప్రమాణాలతో వార్తలు ఇస్తోంది. ఇంకో వైపు స్కూళ్ల విలీనం చేస్తున్నారంటూ రగడ సృష్టించే యత్నం చేస్తున్నారు. నిజంగానే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం సర్దుకోవడం తప్పుకాదు. కానీ అదే పనిగా ఈ మీడియా... వ్యతిరేక కథనాలు ఇస్తుండడంతో అవి విశ్వసనీయత కోల్పోతున్నాయి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చంద్రబాబు, ఆయన వర్గం మీడియా చెబుతుంటారు. అదేమిటో వివరించరు. అంటే అమ్మ ఒడి స్కీమ్ అమలు చేసి, పేదలకు మేలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతున్నట్లా? ప్రభుత్వ బడులను బాగుచేస్తే ప్రభుత్వం రాష్ట్రాన్ని పాడు చేస్తున్నట్లా? పోనీ తాము అధికారంలోకి వస్తే అమ్మఒడి, నాడు–నేడు వంటి వాటిని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టగలుగుతుందా? లేక ఎప్పటి మాదిరి ప్రజలను మాయచేయడంలో భాగంగా అమ్మ ఒడి పేరు మార్చి మరింత ఎక్కువ మొత్తం ఇస్తామని ప్రకటిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఇందులో ఏది చేసినా టీడీపీకి చికాకే. రద్దు చేస్తామని అంటే పేదలెవరూ ఒప్పుకోరు. ఇంకా ఎక్కువ సాయం చేస్తామని అంటే ఇన్నాళ్లుగా చేస్తున్న ప్రసంగాలకు విరుద్ధం కనుక ఎవరూ నమ్మరు. ఈ నేపథ్యంలో అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్కు ఇది ఫ్లాగ్ షిప్ కార్యక్రమంగా మారింది. తెలుగుదేశం పార్టీకి అయోమయ పరిస్థితిని సృష్టించినట్లయింది. ఆయా ముఖ్యమంత్రులు చేపట్టిన వివిధ కార్యక్రమాలలో కొన్నిటినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అందువల్లే గతంలో ఇందిరాగాంధీ, ఆ తర్వాత ఎన్టీఆర్, తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసే స్కీములను ప్రవేశ పెట్టి ప్రజాదరణ చూరగొన్నారు. చంద్రబాబు తనకంటూ ఒక బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేసుకోలేక పోయారు. వీటన్నిటినీ పరిశీలిస్తే జగన్ చెప్పినట్లు విద్యే పిల్లల భవిష్యత్తుకు అత్యంత కీలకం. అదే సంపద. మానవ వనరులపై పెట్టే పెట్టుబడి పవిత్రమైనదని భావించవచ్చు. అందువల్లే జగన్ సభలో ఒక చిన్నారి చక్కటి ఆంగ్లంలో ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రులు చరిత్రలో భాగం అవుతుంటారు; కానీ జగన్ చరిత్రను సృష్టిస్తుంటారు అని చెప్పినప్పుడు ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన కనిపించింది. చివరిగా ఒక మాట. ముఖ్యమంత్రిగా జగన్ ప్రసంగిస్తున్న ప్రతి సందర్భంలోనూ ఆ సభలో పాల్గొన్న ప్రజలు కానీ, విద్యార్థులు కానీ స్పందిస్తున్న తీరును గమనిస్తే జగన్ నిజంగానే చరిత్రను సృష్టించినట్లు అర్థమవుతుంది. కనుకే ప్రతిపక్ష టీడీపీకి గుండెల్లో రైళ్లు పరుగు పెడుతున్నట్లుగా ఉంది. (క్లిక్: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది?) - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
‘ఫీజు’ లేట్.. మారని ఫేట్!
సాక్షి, హైదరాబాద్: ఆర్.రాజవర్ధన్ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్) ఫైనలియర్ చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రముఖ (క్యాప్ జెమినీ) సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం సంపాదించాడు. సంవత్స రానికి రూ.25 లక్షల ప్యాకేజీ కావడంతో జీవితంలో స్థిరపడొ చ్చని భావించాడు. కోర్సు పూర్తయింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగంలో చేరాలని కంపెనీ షరతు పెట్టింది. కానీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందలేదని.. ఆ నిధులు వచ్చాక సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ కొర్రీ పెట్టింది. లేదంటే ఫీజు సొమ్ము చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాలని.. ప్రభుత్వం నుంచి నిధులొచ్చాక తిరిగిస్తామని పేర్కొంది. దీంతో రాజవర్ధన్ అప్పుచేసి కాలేజీలో ఫీజు కింద కట్టాడు. నెలనెలా వడ్డీ కడుతున్నాడు. ప్రభుత్వం నిధులు ఎప్పుడిస్తుందో, కాలేజీ నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూస్తున్నాడు. .. ఒక్క రాజవర్ధన్ సమస్య కాదు ఇది. రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతుండటంతో పై చదువులకు వెళ్లేందుకు, ఉద్యోగాల్లో చేరేందుకు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు నిధులు అందక అవస్థ పడుతున్నామని కాలేజీల యాజమాన్యాలు వాపోతున్నాయి. బడ్జెట్ లో కేటాయిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కేటాయింపులు జరుపుతున్నా.. వాటిని సకాలంలో విడుదల చేయడం లేదు. వివిధ కారణాలతో ఇలా ‘ఫీజు’ బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. 2019–20 విద్యా సంవత్సరం నుంచి 2021–22 విద్యా సంవత్సరం వరకు.. రూ.3,397.23 కోట్లకుపైగా రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టు సంక్షేమ శాఖలే పేర్కొంటున్నాయి. ఇక 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల పరిశీలన చివరి దశలో ఉంది. ఇవి కూడా తోడైతే బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ‘ఫీజు’ నిధులు అందకపోతుండటంతో కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు రానందున.. కాలేజీల నిర్వహణ కోసం విద్యార్థులే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చాక తిరిగి తీసుకోవాలని చెబుతున్నాయి. పెండింగ్లో ఎక్కువ బీసీ విద్యార్థులవే.. పోస్టు మెట్రిక్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్లో ఎక్కువగా బీసీ కేటగిరీకి చెందిన నిధులే ఉన్నాయి. సంక్షేమ శాఖల అంచనా ప్రకారం.. ఇప్పటివరకు రూ.3,397.23 కోట్ల మేర ఫీజు బకాయిలు ఉండా.. అందులో సగానికిపైగా బీసీ విద్యార్థులకు సంబంధించినవే. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆయా సంక్షేమ శాఖలు నిధులను రీయింబర్స్మెంట్ పథకానికి ఖర్చు చేస్తుండగా.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన నిధులు మాత్రం విడుదలకాని పరిస్థితి ఉంది. బీసీలకు సంబంధించి రూ. 1,532.56 కోట్లు పెండింగ్లో ఉండగా.. బీసీ, ఈబీసీ బకాయిలను కలిపితే రూ.1,953.49 కోట్లు చెల్లించాల్సి ఉంది. నిధులపై కోవిడ్ ప్రభావం ప్రభుత్వంలో అన్ని రంగాలపైనా కరోనా మహమ్మారి ప్రభావం చూపింది. దీనితో ప్రభుత్వానికి ఆదాయం తగ్గి.. 2020–21, 2021–22 సంవత్సరాల్లో నిధుల విడుదల గాడి తప్పింది. దీనితో బకాయిలు పేరుకుపోయాయి. గత ఏడాదిగా కోవిడ్ ప్రభావం తగ్గినా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి నిధుల విడుదలలో జాప్యం జరిగింది. చెల్లింపులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు కరోనా ప్రభావంతో కాలేజీలు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వస్తే ఊరట లభిస్తుందని కాలేజీలు భావించినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు విద్యార్థులపై భారం వేస్తున్నాయి. వారి నుంచి ఫీజులు వసూలు చేస్తూ.. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక తిరిగి ఇస్తామంటున్నాయి. కాలేజీలు ఈ విషయంగా గట్టిగా ఒత్తిడి చేస్తుండటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ ఫీజుల సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. నిధుల విడుదల కాగితాలకే పరిమితం ప్రైవేటు కాలేజీలు మూడేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో నడుస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వస్తే కాస్త అయినా ఊరట లభించేది. కానీ మూడేళ్ల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. 2019–20, 2020–21 సంవత్సరాలకు సంబంధించి చాలా బీఆర్వోలు (బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్స్) జారీ చేశారు. కానీ నిధుల విడుదల కాగితాలకే పరిమితమైపోయింది. ఇది కాలేజీ యాజమాన్యాల్లో ఆందోళన రేపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా మార్చి 31 నాటికి తప్పకుండా నిధులు విడుదలయ్యేవి. ఇప్పుడు పరిస్థితి ఏమిటో అర్థంకాకుండా పోయింది. – నాగయ్య, ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బడ్జెట్లో ఒక శాతమే అయినా సరిగా ఇవ్వడం లేదు పోస్టు మెట్రిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేవలం ఒక్క శాతం మాత్రమే. ఈ ఒక్క శాతం నిధులను కూడా సకాలంలో ఇవ్వడం లేదంటే ఉన్నత విద్యపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టమవుతోంది. పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ చార్జీలపైనే ఆధారపడి ఉన్నత విద్య చదువుతున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులివ్వక, వ్యక్తిగతంగా చెల్లించే పరిస్థితి లేక ఉన్నత విద్యలో డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది. కాలేజీల్లో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలి. – గౌరీ సతీశ్, ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
విదేశీ విద్యా వరం... ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూర్చేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలను రూపొందించింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన ఏపీ విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్–100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేస్తుంది. టాప్ 100 – 200 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. తద్వారా రాష్ట్ర విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఈ స్థాయిలో ప్రయోజనం చేకూర్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దేశంలోనే మరొకటి లేదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింప చేయనున్నారు. టాప్ 200 యూనివర్సిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అంతమందికీ సంతృప్త స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనున్నారు. 35 ఏళ్లలోపు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు. ఏపీలో స్థానికులై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింప చేయనున్నారు. ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. విదేశీ విద్యా దీవెన ఎప్పుడు.. ఎలా? టీడీపీ హయాంలో... ► 2016 – 17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్ల మేర బకాయి పెట్టిన గత సర్కారు. ► చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్ధికంగా వెనకబడ్డ అగ్రకులాలకు ఈ పథకాన్ని వర్తింప చేయలేదు. ► సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే వర్తింపు. ► కొన్ని దేశాల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించేలా ఆంక్షలు. ► చంద్రబాబు హయాంలో ఎస్సీలకు రూ.15 లక్షలు, ఎస్టీలకు రూ.15 లక్షలు, కాపులకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.10 లక్షలు, మైనార్టీలకు రూ.15 లక్షల వరకూ మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు. ► 300 మంది ఎస్సీలు, 100 మంది ఎస్టీలు, 400 మంది కాపులు, 1,000 మంది బీసీలు, 500 మంది మైనార్టీ విద్యార్థులకే మాత్రమే వర్తించేలా పరిమితులు. వైఎస్సార్ సీపీ పాలనలో.. ► ప్రతిభను పరిగణలోకి తీసుకుంటూ అగ్రవర్ణ పేద విద్యార్థులకూ పథకం వర్తింపు. ► ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచి మరింత మందికి మేలు చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు. ► ప్రపంచంలో ఎక్కడైనా సరే టాప్ 200 యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు సంతృప్త స్థాయిలో పథకం వర్తింపు. ► టాప్ 100 యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు. 101 – 200 లోపు ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షల వరకూ ఫీజులు చెల్లించనున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. ► ఆంక్షలు లేకుండా టాప్ 200 యూనివర్సిటీల్లో ఎంతమంది సీట్లు సాధిస్తే అంతమందికీ వర్తింప చేయాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నిర్ణయం. నాడు అస్తవ్యస్థంగా.. ► గత సర్కారు హయాంలో విదేశీ విద్యా పథకం అమల్లో పలు లోపాలున్నట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం వెల్లడించింది. ► లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితులను పాటించలేదని నిర్ధారణ. ► ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే కొందరు విద్యార్థులు తాము చదివే యూనివర్సిటీని, వెళ్లాల్సిన దేశాన్ని మార్చుకున్నట్లు వెలుగులోకి. ► పథకం ద్వారా లబ్ధి పొందిన అనంతరం కోర్సులు పూర్తి చేయకుండానే వెనుదిరిగిన కొందరు విద్యార్థులు. ► నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబంలో ఒకరికి మించి పథకం వర్తింపు. ► ప్రభుత్వానికి సమర్పించిన చిరునామాలో జాడలేని కొందరు లబ్ధిదారులు. నాలుగు వాయిదాల్లో ఖాతాల్లో జమ నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేస్తారు. ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లించనున్నారు. ఫస్ట్ సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లిస్తారు. రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లిస్తారు. నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లించనున్నారు. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యే వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనున్నారు. -
YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి
పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ముందుచూపు, చకచకా అభివృద్ధితో ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచారు. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన ఆ వైతాళికుడే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని అజేయుడి 73వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇదీ.. (రామగోపాల్ ఆలమూరు – సాక్షి, అమరావతి): ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఐదేళ్ల మూడు నెలలపాటు మాత్రమే పని చేశారు. కానీ.. ఆ కొద్ది కాలంలోనే పాలకుడికి మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సమగ్రాభివృద్ధివైపు ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. రూపాయి డాక్టర్గా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. అపర భగీరథుడు ‘1978లో శాసనసభలో తొలిసారి అడుగు పెట్టాక కోస్తా పర్యటనకు వెళ్లినప్పుడు కాలువల్లో గలగలా పారుతున్న నీటిని చూసి కరువుతో తల్లడిల్లుతున్న ప్రాంతాలకు కూడా జలధారలు అందించాలనే సంకల్పం నాలో ఏర్పడింది. కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని కోరితే.. ‘‘దోసిలి పట్టు.. పోస్తా’’ అని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజు నా సంకల్పం మరింత బలపడింది’ అని 2004లో సీఎంగా సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే సమయంలో వైఎస్సార్ గుర్తు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం తలపెట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరానికి శ్రీకారం చుట్టారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు. ఆరోగ్యశ్రీతో ప్రజారోగ్యానికి భరోసా.. 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. అనారోగ్యం పాలైన పేద కుటుంబాలు ఆపత్కాలంలో సాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాల్సిన ప్రయాసలకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎనలేని భరోసా ఇచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. పేదరికానికి విద్యతో విరుగుడు.. పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్సార్ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని ధృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం రాష్ట్రంపై పడకుండా వివిధ పనుల కల్పన ద్వారా వైఎస్సార్ నివారించగలిగారు. ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేశారు. అజేయుడు.. రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. వారిలో దివంగత వైఎస్సార్ ముందు వరుసలో నిలుస్తారు. పులివెందుల నియోజకవర్గం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో అసెంబ్లీకి, కడప లోక్సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో పార్లమెంట్కి, ఆ తర్వాత మళ్లీ పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా వైఎస్ రాజశేఖరరెడ్డి విజయాలు సాధించారు. రైతును రాజు చేసిన మారాజు.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్ అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్పై వెనక్కు తగ్గలేదు. వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్ఫుట్ సబ్సిడీ అందించారు. నేడు రైతు దినోత్సవం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) స్థాయిల్లో వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిలో పెద్ద ఎత్తున రైతులను భాగస్వాములను చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా గత మూడేళ్లుగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శాఖల వారీగా ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తొలుత వైఎస్సార్కు ఘన నివాళులర్పించాక వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ యంత్ర సేవా పథకం వంటి వాటి ద్వారా లబ్ధి పొందిన రైతులను భాగస్వాములను చేస్తున్నారు. రైతన్నల సంక్షేమానికి ఎన్నో మేళ్లు.. వివిధ పథకాల ద్వారా రైతన్నలకు నేరుగా రూ.1,27,633.08 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన విషయాన్ని రైతులకు వివరించనున్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి, వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్, అమూల్ ద్వారా పాడి రైతులకు అదనంగా లబ్ధి, ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రభుత్వం లబ్ధి కలిగిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థిక సాయం, వైఎస్సార్ జలకళ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించి, మోటార్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. వీటన్నింటిపై రైతు దినోత్సవ వేడుకల్లో అవగాహన కల్పించనున్నామని వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. -
తిరుపతి కోర్టుకు నటులు మోహన్బాబు, విష్ణు, మనోజ్
సాక్షి, తిరుపతి: నటుడు మంచు మోహన్బాబు మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా కోర్టుకు వచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో 2019లో అప్పటి ప్రభుత్వం మోహన్బాబుపై కేసు నమోదు చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 2019లో మదనపల్లి హైవేపై మోహన్బాబు ఫ్యామిలీ ఆందోళన చేసింది. దీంతో ఆరోజు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. అయితే న్యాయస్థానం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 20కు వాయిదా వేసింది. చదవండి: (మీరు అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్మన్ వచ్చుండేదా?: కొడాలి నాని) -
విద్యార్థుల ‘ఫీజు’ బకాయిలు విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు వెంటనే రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమ వారం ఒక లేఖ రాశారు. ఇంజనీరింగ్ కోర్సులో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ర్యాంకు నిబంధన ఎత్తివేయా లని కోరారు. ఈ నెలాఖరులోపు నిధులు విడుదల చేయని పక్షం లో బీజేపీ ఆధ్వర్యంలో గాంధేయపద్ధతిలో ఆం దోళన కార్యక్రమాలు చేపడతా మని అన్నారు. గత రెండేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యా ర్థులకు బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల 14 లక్షలమంది ఇబ్బందులకు గురవుతు న్నారని పేర్కొన్నారు. -
అందని ‘ఉపకారం’!
నల్లగొండ జిల్లా మర్రిగూడెంకు చెందిన మణికేశవ్ ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రఖ్యాత కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) ఫైనలియర్ చదువుతున్నాడు. కన్వీనర్ కోటాలో సీటు సాధించిన ఇతనికి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం సకాలంలో ఫీజు నిధులు ఇవ్వకపోవడంతో యాజమాన్యం తీవ్ర ఒత్తిడి చేసింది. రెండు, మూడో సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో మణికేశవ్ తండ్రి నరసింహారావు రూ.1.20 లక్షలు అప్పు చేసి ట్యూషన్ ఫీజు చెల్లించారు. తర్వాతే మణికేశవ్ సెమిస్టర్ పరీక్షలు రాశాడు. తండ్రి తెచ్చిన అప్పుకు 4 నెలల నుంచి వడ్డీ పెరుగుతున్నా... ప్రభుత్వం మాత్రం ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదు. ఇది ఒక్క మణికేశవ్ పరిస్థితి మాత్రమే కాదు.. చాలా కాలేజీల్లో యాజమాన్యాలు ఇదే తరహాలో విద్యార్థుల నుంచి వ్యక్తిగతంగా ఫీజులు కట్టించుకుంటున్నాయి. కళాశాల నిర్వహణ భారమవుతోందని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలవుతున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉపకార వేతన నిధులు విడుదల కాక, రీయింబర్స్మెంట్ నిధులు సైతం ఏళ్లుగా నిలిచిపోవడంతో బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. 2019–20 నుంచి 2020–21, 2021–22 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు మొత్తంగా రూ.3,271.15 కోట్లు ఉన్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. సంక్షేమ శాఖలు దరఖాస్తులను పరిశీలించి బడ్జెట్ అంచనాలను రూపొందించి బిల్లులను ఖాజానా శాఖకు సమర్పిస్తాయి. ఈ క్రమంలో ఈ సంవత్సర దరఖాస్తుల పరిశీలన పూర్తయితే డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని సంక్షేమ శాఖలు చెబుతున్నాయి. బకాయిలు అంతకంతకు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పడం.. నిధుల విడుదలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో ఏటా చేయాల్సిన చెల్లింపులు నిలిచిపోయాయి. ఏడాదిన్నరగా ఈ పథకాలకు నిధులను ప్రభుత్వం పెద్దగా విడుదల చేయలేదు. దీంతో బకాయిలు పెరుగుతూ వస్తున్నాయి. 2019–20, 2020–21 వార్షిక సంవత్సరాలకు సంక్షేమ శాఖలు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి చాలా కాలమైంది. ఇక 2021–22 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది మార్చి 31 వరకు జరిగింది. కొన్ని రకాల కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఈనెల 21 వరకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ దరఖాస్తుల స్వీకరణ పూర్తయితే 2021–22 ఏడాది డిమాండ్పై స్పష్టత వస్తుంది. విద్యార్థులు సతమతం.. ‘ఫీజు’చెల్లింపులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోంది. ఫీజు చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని, కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం కుదరదని.. ఇలా కాలేజీ యాజమాన్యాలు రకరకాల నిబంధనలు పెడుతున్నాయి. చదువు కొనసాగాలంటే ఫీజు చెల్లించాలనే డిమాండ్ పెడుతున్న యాజమాన్యాలు.. ‘ఫీజు’రాకుంటే కాలేజీ నిర్వహణ భారమవుతుందని విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడితో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కాలేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు అప్పు చేసి ఎంతో కొంత ఫీజు చెల్లించి బతిమాలుకుంటున్న సంఘటనలు కాలేజీల్లో కనిపిస్తున్నాయి. నిర్వహణ భారంగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో సరిపడా ప్రభుత్వ కాలేజీలు లేకపోవడంతో పేదలు ప్రైవేట్ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు మినహాయిస్తే.. ఇతర ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే తీసుకుంటున్నారు. చాలామంది పేదలు ‘ఫీజు’పథకం ద్వారా అందే సాయాన్నే నమ్ముకుని చదువుతున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పథకంపై ఆధారపడిన కాలేజీల నిర్వహణ మరింత భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను పూర్తిస్థాయిలో విడుదల చేస్తేనే కాలేజీల నిర్వహణ సక్రమంగా సాగుతుంది. –గౌరి సతీశ్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేట్ కాలేజీల సంఘం సింహభాగం బీసీ విద్యార్థులవే.. ప్రస్తుతమున్న బకాయిల్లో అత్యధికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించినవే. ఈ శాఖ ద్వారా బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుండగా.. ఈబీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటివరకున్న మొత్తం బకాయిల్లో ఈ విద్యార్థులవే సింహభాగం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) నుంచి నిధులు సర్దుబాటు చేస్తున్నా.. బీసీ విద్యార్థులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన బకాయిలు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. -
చదువుతో ఎదుగుదాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదరికాన్ని నిర్మూలించే శక్తి చదువులకు మాత్రమే ఉందని, పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి కూడా అదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు, అవమానాలను తాను పాదయాత్రలో స్వయంగా చూసి పూర్తి ఫీజురీయింబర్స్మెంట్తో జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, విద్యాకానుక, అమ్మ ఒడి లాంటి పథకాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జగనన్న విద్యాదీవెన 2021–22 నాలుగో త్రైమాసికం ఫీజు రీయింబర్స్మెంట్ కింద 10,85,225 మంది విద్యార్థులకు మేలు చేకూరుస్తూ రూ.709.20 కోట్లను 9.73 లక్షల మంది తల్లుల ఖాతాల్లో గురువారం తిరుపతిలో బటన్ నొక్కి సీఎం జగన్ నేరుగా జమ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. నీరుగార్చిన నిర్వాకం చంద్రబాబుదే.. పెద్ద చదువులు ఒక మనిషి చరిత్రనే కాకుండా కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశ చరిత్రను మారుస్తాయి. మన తలరాతలను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అది ఎవరూ దొంగిలించలేని ఆస్తి. గతంలో నాన్న వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చి విద్యార్థుల ఉన్నత చదువులకు బాట వేశారు. తర్వాత వచ్చిన పాలకులు పిల్లల చదువుల గురించి, తల్లిదండ్రుల కష్టాల గురించి పట్టించుకోలేదు. ఫీజుల పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నీరు గార్చారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అవస్థ పడటం, ఆ దుస్థితిని చూడలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఆ కుటుంబాల దయనీయ పరిస్థితిని నా పాదయాత్రలో స్వయంగా చూశా. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా గత మూడేళ్లుగా వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. చదువులకు నాదీ బాధ్యత ఈరోజు.. మీబిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఈ పథకాలను ఎలా అమలుæ చేస్తున్నాడు? ఎలాంటి మార్పులు తెచ్చాడు? అనేది మీరంతా గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయాలి. ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలను చదివించాలి. వారికి నేను అండగా ఉంటా. పిల్లల చదువుల బాధ్యతను నేను తీసుకుంటున్నా. ప్రతి ఇంటి నుంచి గొప్ప ఇంజనీరు, డాక్టరు, కలెక్టర్ వస్తారని నమ్ముతున్నా. ఈ మాట నాలో ఎంతో ఉత్తేజాన్ని, సంతోషాన్ని ఇస్తోంది. పేద పిల్లల చదువులకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించండి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ప్రతి త్రైమాసికం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. గత సర్కారు అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సక్రమంగా చెల్లించలేదు. 2017–18, 2018–19లో రూ.1,778 కోట్లు కట్టకుండా ఎగ్గొడితే మీ జగనన్న ప్రభుత్వం వచ్చాక చెల్లించింది. నాడు అడుగడుగునా నిర్లక్ష్యం.. అధికారంలో ఉండగా ప్రభుత్వ పాఠశాలల మూసివేత లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరించారు. పిల్లల డ్రాపౌట్లకు కారణం ఏమిటో చంద్రబాబు ఒక్కరోజైనా ఆలోచించారా? చదువుల పట్ల అడుగడుగునా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. మధ్యాహ్న భోజనాన్ని నిర్వీర్యం చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. గత సర్కారు దీనికి ఏటా రూ.600 కోట్లు ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా రూ.1,900 కోట్లు చెల్లిస్తున్నాం. విద్యారంగంలో సత్ఫలితాలు విద్యారంగంపై మన ప్రభుత్వం రూ.వేల కోట్లను వెచ్చిస్తుండటంతో గత మూడేళ్లలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు, సత్ఫలితాలను మనమంతా చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 2018–19లో 37.20 లక్షల మంది మాత్రమే చదువుతుండగా ఇప్పుడు ఆ సంఖ్య 44.39 లక్షలకు పెరిగిందని గర్వంగా చెబుతున్నా. తల్లులకు నమ్మకం కలిగించడం, పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడం లాంటి చర్యల ద్వారా ఈ సత్ఫలితాలు వచ్చాయి. గతంలో ఇవన్నీ ఉన్నాయా..? ► జగనన్న విద్యాదీవెన మాదిరిగా గతంలో వందశాతం ఫీజు రీయింబర్స్ ఇచ్చారా? అని సభలో సీఎం ప్రశ్నించగా.. లేదు.. లేదు.. అని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిస్పందించారు. ► పెద్ద చదువులు చదివే వారికి వసతి, భోజనం సదుపాయాలు కల్పించే జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి లాంటి పథకాలు గత సర్కారు హయాంలో ఉన్నాయి? అని ప్రశ్నించగా.. లేదని విద్యార్థులు నినదించారు. ► ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, సదుపాయాల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? అని అడగ్గా.. లేదు.. లేదు... అంటూ సభలో నినాదాలు హోరెత్తాయి. పిల్లల చదువులకు ఎంత ఖర్చు చేశామంటే.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలివిడతలో 15,715 పాఠశాలలను రూపురేఖలను మార్చేందుకు రూ.3,698 కోట్లు వ్యయం. రెండో విడత కింద 26,451 పాఠశాలల్లో రూ.8,122 కోట్లతో మౌలిక వసతుల కల్పన లక్ష్యం. ► జగనన్న విద్యాకానుక కింద 47.32 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరుస్తూ రూ.1500 కోట్లు వ్యయం. విద్యా దీవెన అమలుకు మరో రూ.900 కోట్లు. ► జగనన్న గోరుముద్ద ద్వారా 44 లక్షల మంది పిల్లలకు రూ.1,900 కోట్లతో పౌష్టికాహారం. ► డాక్టర్ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 34.20 లక్షల మంది గర్బిణిలు, బాలింతలు, చంటిబిడ్డల కోసం రూ.1,800 కోట్లు వ్యయం. 35 నెలల్లో సంపూర్ణ పోషణ పథకం కింద రూ.4,900 కోట్లు ఖర్చు. ► అమ్మఒడి ద్వారా ఇప్పటికే తల్లుల ఖాతాల్లోకి రూ.13,023 కోట్లు జమ. జూన్లో మరో రూ.6,400 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం. ► అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా రూ.1,38,894 కోట్లు నేరుగా పారదర్శకంగా ఖాతాల్లోకి జమ చేసి లబ్ధి చేకూర్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. చదువుకు ఎంతో సహకారం మాది సామాన్య రైతు కుటుంబం. ఇద్దరం ఆడపిల్లలం. ఆర్థిక స్తోమత లేకపోవడంతో మమ్మల్ని చదివించడం అమ్మానాన్నకు కష్టంగా మారింది. ఇంటర్ తర్వాత కష్టపడి ఇంజనీరింగ్లో చేరా. ఫస్టియర్లో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఇంకా మూడేళ్లు ఎలా చదవాలా? అని దిగులు చెందుతున్న సమయంలో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద నాకు రూ.73,900 ఫీజురీయింబర్స్మెంట్ వచ్చింది. అలాగే జగనన్న వసతి దీవెన కింద మరో 20,000 అందాయి. మా చెల్లికి అమ్మఒడి పథకం కింద రూ.15,000 లబ్ధి చేకూరింది. మా నాన్నకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.13,500 వచ్చింది. మా అవ్వకి ప్రతి నెలా రూ.2,500 పింఛను ఇస్తున్నారు. మా అమ్మ డ్వాక్రా సంఘంలో ఉండటంతో ఆ ప్రయోజనాలు కూడా మా కుటుంబానికి అందుతున్నాయి. ప్రస్తుతం నేను తిరుపతిలో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నా. ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్స్లో మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. ఇంతకన్నా నాకు ఇక ఏంకావాలి.. జగనన్న? మీరు తీసుకొచ్చిన దిశ యాప్ మేము బయటకు వెళ్లి జీవించడానికి ధైర్యాన్ని ఇస్తోంది. మేమంతా మీకు జీవితాంతం రుణపడి ఉంటాం అన్నా. – ఇందుమతి, ఇంజనీరింగ్ విద్యార్థిని -
10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్
-
జగనన్న విద్యా దీవెన.. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ
సాక్షి, తాడేపలి: అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.709 కోట్ల బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన కింద ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం రూ. 9,274 కోట్లను అందజేసింది. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లను కూడా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వమే చెల్లించింది. -
‘ఫీజు’పై దుష్ప్రచారం దారుణం
సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్మెంట్పై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ గందరగోళం రేపాలని ప్రయత్నిస్తున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో తల్లిదండ్రులు, విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేలా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తూ అందరినీ ఆదుకుంటున్నారని చెప్పారు. దీన్ని చూసి ఓర్వలేని ఆ పత్రికలు తప్పుడు కథనాలు అల్లుతున్నాయని విమర్శించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏడాదికోసారి ఫీజు రీయింబర్స్మెంట్.. అదీ అరకొరగా ఇస్తూ కాలేజీలను ఇబ్బంది పెట్టేవారన్నారు. అప్పట్లో కాలేజీల యాజమాన్యాలు అనేకసార్లు ధర్నాలు చేసినా, ఈ పత్రికల్లో అందుకు సంబంధించిన వార్తలు కనిపించలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజు ఇవ్వకుండా కేవలం రూ.35 వేలతోనే సరిపెట్టిన విషయం ఎవరికి తెలియదని నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఎవరిలో ఎలాంటి ఆందోళన లేదు ► ప్రస్తుత ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అందిస్తోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాల్లో ఎలాంటి ఆందోళన లేదు. ► గత ప్రభుత్వం 2016–17లో రూ.2,391 కోట్లు, 2017–18లో రూ.2,828 కోట్లు, 2018–19లో రూ.1,687 కోట్లు ఇచ్చింది. ఇందులో ఇంటర్ ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్, 2012–13కు సంబంధించిన బకాయిలు కూడా ఉన్నాయి. ► ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం ఉన్నత విద్యకు సంబంధించి 2019–20లో రూ.2,559 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చింది. 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలకు గత టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా బకాయి ఉంచిన రూ.1,800 కోట్లు ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. ► 2019–20లో కరోనా కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.3,900 కోట్లు (ఇంటర్ విద్యార్థులకు అందించిన అమ్మ ఒడి నిధులు కలుపుకుని) ఇచ్చింది. గత ప్రభుత్వంలో కన్నా ఇది ఒకటిన్నర రెట్లు అధికం. ► 2020–21కి వచ్చేసరికి కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఏప్రిల్లో రూ.671.03 కోట్లు, జూలైలో రూ.693.27 కోట్లు, నవంబర్లో రూ.683.13 కోట్లు విడుదల చేశారు. నాలుగో త్రైమాసికానికి సంబంధించి.. కరోనా వల్ల గత నెలలో ఇవ్వాల్సింది ఈ నెలలో విడుదల చేయనున్నారు. ఇది కాకుండా అమ్మ ఒడి కింద రూ.1500 కోట్లు ఇవ్వనున్నారు. ఇవన్నీ కలుపుకుంటే ఈ విద్యా సంవత్సరంలో రూ.3,600 కోట్లు ప్రభుత్వం అందిస్తోంది. ► గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఫీజులు ఇవ్వక పోవడం వల్ల కాలేజీల యాజమాన్యాలపై రూ.1,000 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు వడ్డీల భారం పడింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకోసారి ఇవ్వడం వల్ల యాజమాన్యాలకు ఏ ఇబ్బందీ లేదు. మంచి నిర్ణయాలు కనిపించవా? ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాశయంతో విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించి, రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్గా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి వాటి గురించి ఆ పత్రికలు కథనాలు రాయవు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను నెలకొల్పింది. ఏ కాలేజీ అయినా విద్యార్థుల నుంచి అదనంగా, అధికంగా డబ్బులు వసూలు చేసినా, డిమాండ్ చేసినా ఈ కమిషన్కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటుంది. ► రెండేళ్లలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో (జీఈఆర్) రేట్లో మన రాష్ట్రం దేశంలో చాలా ముందుంది. 2018–19, 2019–20లో పరిశీలిస్తే జీఈఆర్ జాతీయ స్థాయిలో 26.3 నుంచి 27.1కు పెరిగింది. అదే ఏపీలో 32.4 నుంచి 35.2కు పెరిగింది. ► ఎస్సీల చేరికల పెరుగుదల జాతీయ స్థాయిలో 1.7% అయితే రాష్ట్రంలో 7.5 శాతంగా ఉంది. ఎస్టీలలో జాతీయ స్థాయిలో 4.5% పెరుగుదల ఉంటే రాష్ట్రంలో 9.5 శాతంగా నమోదైంది. చేరికలతో సరిపెట్టకుండా వారికి నాణ్యమైన విద్య అందించేలా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను చేపట్టించారు. ► 10 నెలల ఇంటర్న్షిప్, స్కిల్ కోర్సులు ఏర్పాటు చేశాం. ప్రైవేటు వర్సిటీల్లో పేద మెరిట్ విద్యార్థులకు కోటా కల్పించాం. రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చే ఆ వర్సిటీల్లో 35 శాతం సీట్లు పేద మెరిట్ విద్యార్థులకు దక్కేలా చేశాం. ఈ ఏడాది 2,118 మందికి అక్కడ సీట్లు అందించాం. -
ఇకపై ఒకే ‘ఫీజు’ దరఖాస్తు!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకొస్తోంది. ఆన్లైన్ విధానంతో అత్యంత పారదర్శకంగా ఈ పథకాలను అమలు చేస్తుండగా... ఇప్పుడు విద్యార్థులు దరఖాస్తు చేసుకొనే విధానాన్ని మరింత సులభతరం చేయాలని నిర్ణయించింది. పోస్టుమెట్రిక్ కోర్సులో చేరిన విద్యార్థులు ఫ్రెషర్స్ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంటుండగా... కోర్సు ముగిసే వరకు ఏటా దరఖాస్తును రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలా దరఖాస్తులు సమర్పించేందుకు ప్రభుత్వం ఏటా నోటిఫికేషన్ ఇవ్వడం... కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులకు సమాచారం అందించడంలో జాప్యం జరగడంతో దరఖాస్తు ప్రక్రియను ప్రతి సంవత్సరం పొడిగిస్తుండటం పరిపాటిగా మారింది. ఇలాంటి పరిస్థితులు పథకాల అమల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు విధానాన్ని సులభతరం చేయాలని సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి సూచనలు చేశాయి. ఈ క్రమంలో నోడల్ విభాగంగా వ్యవహరిస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. కోర్సులో చేరిన విద్యార్థి కేవలం ఒకసారి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే... ఆ కోర్సు పూర్తయ్యే వరకు ఆ దరఖాస్తునే పరిగణనలోకి తీసుకొనేలా మార్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందులో రెన్యువల్స్ 8 లక్షలు ఉండగా... ఫ్రెషర్స్ 4లక్షల మంది విద్యార్థులుంటున్నారు. వన్టైమ్ రిజిస్ట్రేషన్... ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రతి విద్యార్థి ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుమెట్రిక్ కోర్సులో చేరిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ ఆధారంగా అందులో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ దరఖాస్తును కోర్సు ముగిసే వరకు ఫార్వర్డ్ చేసే బాధ్యతను కాలేజీ యాజమాన్యానికి ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో విద్యార్థి డ్రాపౌట్ కావడం, కోర్సు నుంచి ఎగ్జిట్ కావడంలాంటి విషయాలు కాలేజీ పరిధిలో ఉండటంతో ఈ బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని అధికారులు యోచిస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపాదనలను ఎస్సీ అభివృద్ధి శాఖ అతిత్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం ఆమోదిస్తే ఈ సంస్కరణలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బులేయండి
సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని విద్యా సంస్థలకు కాకుండా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని తేల్చి చెప్పింది. అప్పడే కేంద్రం నుంచి పథకం వాటా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఆ మేరకు ఖచ్చితమైన హామీనిస్తూ నిర్ణయం తీసుకొని కేంద్రానికి నివేదికివ్వాలని ఆదేశించింది. కేంద్రం వాటా 15 నుంచి 60 శాతానికి పెంపు పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి ఉపకారవేతనాలను విద్యార్థి ఖాతాలో.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విద్యార్థి పేరిట కాలేజీ యాజమాన్యం ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన ఈ పద్ధతినే రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా పాటిస్తోంది. అయితే కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు ఇవ్వడాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆక్షేపిస్తోంది. ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా విద్యార్థి ఖాతాకే ఫీజు నిధులు ఇవ్వాలని తాజాగా ఆదేశించింది. మరోవైపు ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్ర వాటా గతంలో 15 శాతం ఉండగా రాష్ట్రం వాటా 85 ఉండేది. అయితే గతేడాది నుంచి కేంద్రం నిధులను 60 శాతం ఇస్తోంది. రాష్ట్ర వాటా కంటే కేంద్రం వాటా ఎక్కువగా ఉన్నందున కేంద్రం నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర సర్కారుకు చెప్పింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రమణ్యం శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం స్పష్టం చేశారు. కొత్త నిబంధనతో నష్టమే ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద కేంద్ర, రాష్ట్రాలు ఏటా రూ.440 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం సగటున 2.3 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం తాజా నిబంధనతో ఇబ్బందులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ది శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఖాతాకు ఫీజు నిధులు విడుదల చేస్తే కాలేజీ యాజమాన్యానికి చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, అలాగే నిధుల విడుదలలో జాప్యం జరిగితే విద్యార్థి వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తుందని వాదనలు వాదనలు వినిపిస్తున్నాయి. ఫీజుల విషయంలో కాలేజీలు కచ్చితత్వాన్ని పాటించే ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల చివరకు డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతుందని విమర్శలూ వస్తున్నాయి. -
‘ఉపకారం’.. బహుదూరం
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ మొదలై 5 నెలలవుతున్నా ఇంకా 76 శాతం మంది విద్యార్థులే వివరాలు నమోదు చేసుకున్నారు. నమోదు ప్రక్రియను సర్కారు ఇప్పటికే రెండుసార్లు పొడిగించినా అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. 31తో గడువు పూర్తి కానుండటంతో ఆలోపు 90 శాతం లక్ష్యం చేరుకునేలా కనిపించట్లేదు. దీంతో గడువును మరోసారి పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్లో మొదలు రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న వారిలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2021–22 విద్యా సంవత్సరంలో 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. గతేడాది సెప్టెంబర్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాయి. ఈ ప్రక్రియను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సర్కారు గడువు పెట్టింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవడంతో గడువును నవంబర్ వరకు పొడిగించింది. అయినా అనుకున్న లక్ష్యం పూర్తవకపోవడంతో ఈ నెల 31 వరకు పెంచింది. ఇప్పటికీ కూడా 9.60 లక్షల మందే ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. సంక్షేమ శాఖల అంచనాల ప్రకారం మరో 3 లక్షల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుత గడువులోగా 3 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం లేదు. వాస్తవానికి కాలేజీ యాజమాన్యాలు చొరవ తీసుకుని విద్యార్థులకు అవగాహన కల్పించడం, వాళ్ల నుంచి వివరాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసేలా చూడాలి. దీనిపై సంక్షేమ శాఖలు కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చినా ప్రక్రియ ఇంకా పూర్తవలేదు. పరిశీలనపై తీవ్ర ప్రభావం ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు గతంలో (కరోనాకు ముందు) నవంబర్ చివరి వారం, డిసెంబర్ రెండో వారం నాటికి 95 శాతం వచ్చేవి. వీటిని ఫిబ్రవరి రెండో వారం కల్లా సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించి అర్హతను ఖరారు చేసేవారు. బడ్జెట్ లభ్యతను బట్టి నిధులు విడుదల చేసేవారు. కానీ ఈ సారి దరఖాస్తు ప్రక్రియే ఇంకా కొనసాగుతోంది. లక్ష్యం దూరంలో ఉండటంతో గడువును మరో నెల పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఫలితంగా విద్యార్థులకు మరింత ఆలస్యంగా ఉపకార వేతనాలు అందే అవకాశం ఉంది. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ బీసీ వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో ప్రభుత్వం దాదాపు రూ.3 వేల కోట్లు బకాయిపడిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు మొత్తం ఫీజును ప్రభుత్వాలే చెల్లించేవని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పది వేల లోపు ర్యాంకు వచ్చినవారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తూ ఆపై ర్యాంకు వచ్చిన వారికి రూ. 35 వేలు మాత్రమే చెల్లిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీలో మాదిరిగానే పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో నం.18ను సవరించాలని బండి సంజయ్ సూచించారు. -
కన్వీనర్ కోటాకు జై..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ప్రభావం ఆయా కోర్సుల సీట్ల భర్తీలో పెను మార్పులను తెస్తోంది. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ చేయడంతో పాటు.. విద్యార్థుల వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకూ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యే సీట్ల శాతం.. గతంలో కన్నా భారీగా పెరిగింది. ఈ సీట్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ పోటీపడుతుండటంతో సీట్ల భర్తీలో గడచిన రెండేళ్లలో ఏకంగా 10 శాతానికి పైగా పెరుగుదల కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ముందు టీడీపీ హయాంలో చూస్తే.. ఇంజనీరింగ్ కోర్సుల్లో 2018లో 61.54 శాతం, 2019లో 51 శాతం మాత్రమే కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత 2020లో, 2021లో 73 శాతం మేర భర్తీ అవుతుండటం విశేషం. ఈడబ్ల్యూఎస్ కోటాలోని వారికి అదనంగా 10 శాతం సీట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రాష్ట్రంలో సీట్ల కేటాయింపు ఇంతకు ముందు నుంచీ ఉంది. అదనపు సీట్లు రాకుండా ఉంటే.. వీరికి కేటాయించిన సీట్లను కూడా కలుపుకొంటే కన్వీనర్ కోటా సీట్ల భర్తీ 2021లో 80.79 శాతం, 2020లో 80.60 శాతం అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్పాట్ అడ్మిషన్లకు ‘సీట్ల’ తగ్గుదల గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేనందున విద్యార్థుల చేరికల్లేక కన్వీనర్ కోటా సీట్లు భారీగా మిగిలిపోయేవి. ఆ తర్వాత వాటిని స్పాట్ అడ్మిషన్ల కింద ఆయా కాలేజీలు భర్తీచేసుకునేవి. ఇప్పుడు కన్వీనర్ కోటా సీట్లు అధిక శాతం భర్తీ అవుతుండటంతో స్పాట్ అడ్మిషన్లకు మిగులు సీట్లు తగ్గాయి. టీడీపీ హయాంలో 2015లో 40,436 సీట్లు, 2016లో 47,735 సీట్లు, 2019లో 45,888 సీట్లు మిగిలిపోయాయి. అదే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలుతో వాటి సంఖ్య 2020లో 28,575, అలాగే 2021లో 30,369 మాత్రమే మిగిలాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను మినహాయిస్తే కనుక ఈ సంఖ్య మరింత తక్కువే. 2021లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో కేవలం రెండు విడతల్లోనే ముగించారు. గతంలో కౌన్సెలింగ్ను నాలుగు విడతల వరకూ కూడా నిర్వహించేవారు. ఈ సారి కూడా అలాగే ఉంటుందని భావించిన పలువురు.. రెండు విడతల్లోనే కౌన్సెలింగ్ ముగియడంతో కన్వీనర్ కోటా సీట్లను దక్కించుకోలేకపోయారు. చేరికలు లేక గతంలో తగ్గిపోతూ వచ్చిన సీట్లు గతంలో రాష్ట్రంలో ప్రమాణాలు లేకున్నా పలు కాలేజీలను కొనసాగించిన దరిమిలా రాష్ట్రం మొత్తంమీద ఇంజనీరింగ్ కాలేజీలు 467 వరకూ ఉండేవి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేక చేరికలు తగ్గి ఆయా కాలేజీలు కోర్సులను రద్దు చేసుకోవడంతో సీట్ల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. 2015 నాటికి రాష్ట్రంలో 467 కాలేజీల్లో 1,13,745 సీట్లుండగా.. 2018 నాటికి 96,857, 2019 నాటికి 95,582 ఉన్నాయి. 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు అదనంగా చేరి మొత్తం సీట్లు 1,06,203కు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రమాణాలు లేని కాలేజీలను ప్రక్షాళన చేయడంతో వాటి సంఖ్య 437కు తగ్గింది. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకొని కన్వీనర్ కోటా సీట్లు 2020లో 1,04,090, 2021లో 1,11,304కు చేరాయి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో కన్వీనర్ కోటా సీట్లలో అత్యధిక శాతం భర్తీ అవుతున్నాయి. ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులతో మెరిట్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ నిరుపేద విద్యార్థులు గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేక అత్యధిక ఫీజులుండే ప్రముఖ కాలేజీల్లో చేరలేకపోయేవారు. కానీ ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రావడంతో వారంతా తమ మెరిట్కు తగ్గ ప్రముఖ కాలేజీల్లో చేరగలుగుతున్నారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో పది శాతం మేర పెరిగిన భర్తీ అయిన సీట్లన్నీ ఇటువంటి పేద విద్యార్థుల చేరికలతోనే అన్నది స్పష్టమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం.. కాలేజీల్లో ఫీజు ఎంత ఉన్నా సరే.. రూ.35 వేలే ఇచ్చేది. దీనివల్ల మిగతా ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి రావడంతో కోర్సు పూర్తయ్యే నాటికి తల్లిదండ్రులకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకూ అప్పులయ్యేవి. -
కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలి
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన పథకం కింద స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా ఆయా కాలేజీల ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తానిచ్చిన తీర్పును పునః సమీక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలను నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పిస్తూ గత ఏడాది జూన్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి సోమవారం ఉత్తర్వులిచ్చారు. -
ఆర్థికమే కాదు... సామాజికం కూడా!
ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చినట్లే విద్యా రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మన దేశంలో గత కొంతకాలంగా విద్య అనేది అతిపెద్ద వ్యాపార పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఇక్కడ విద్యారంగానికి అతిపెద్ద మార్కెట్ కలిగి ఉందని గుర్తించిన విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడి విద్యార్థులను దోచుకోవడానికి తమ దుకాణాలను తెరవడం మొదలు పెట్టాయి. ఒకపక్క అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో విద్య అనేది వాణిజ్య వస్తువు కాదనీ, దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టడం నేరమనీ తీర్పులు ఇచ్చినా కూడా విద్యా వ్యాపారవేత్తల తీరు మారకపోవడం శోచనీయం. 1995లో ఐక్యరాజ్యసమితి పేద వర్గాల అభ్యున్నతికి కేవలం విద్య మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి సమాజంలోని ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలని తీర్మానం చేయడం జరిగింది. మన ప్రభుత్వం కూడా విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి అవసరమైన నూతన విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంబానీ బిర్లా కమిటీగా పేర్కొన్న ఈ కమిటీ నివేదిక ప్రకారం, సమాచార సాంకేతిక యుగంలో విద్య అత్యంత అవసరం అనీ, అదే సమయంలో మన దేశం లోని విద్యా వ్యవస్థ అత్యంత వక్రంగా ఏర్పాటు చేయ బడిందనీ వ్యాఖ్యానించింది. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను స్వాగతిస్తూ సరికొత్త విధానాలను రూపకల్పన చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే, విద్యారంగాన్ని ప్రైవేటీకరించి ఆ రంగంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను, విదేశీ సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ వర్సిటీలకు నిధులను తగ్గిస్తుండటంతో... పేదవాళ్లు ఉన్నతవిద్యకు దూరమవుతున్నారని గ్రహించలేకపోతున్నారు. విద్య అనేది ప్రభుత్వ సామాజిక బాధ్యత అనే విషయాన్ని ఈ కమిటీ విస్మరించింది. (చదవండి: కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!) ప్రైవేటు విద్యా సంస్థలు వివిధ మార్గాల ద్వారా విద్యార్థి వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇటువంటి ధోరణి వల్ల విద్యా వ్యవస్థలో నాణ్యత అనేది దిగజారి పోతుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులకు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు రూపకల్పన చేస్తున్నాయి. ఈ వ్యాపార ధోరణిలో కేవలం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు మాత్రమే బతికి ఉంటాయి. కంప్యూటర్ రంగానికి చెందిన కృత్రిమ మేథస్సు వంటి కొత్త శాఖలు ఆవిర్భ వించడంతో వాటి వైపు విద్యార్థులు పరుగులు తీస్తూ, సాంప్రదాయ కోర్సుల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ కోర్సులు అన్నీ కూడా ఎంతో ఖర్చుతో కూడినవి. పేద వర్గాలకు ఇవి అందనంత దూరంలో ఉన్నాయి. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు) ఈ నేపథ్యంలో పేదవాడికి కూడా ఇటువంటి అత్యాధునిక కోర్సులు అందుబాటులోకి రావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రియింబర్స్మెంట్ విధానాన్ని కల్పించి, ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు అత్యున్నతమైన ఆధునిక విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పరిచింది. అయితే, గత ప్రభుత్వం ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయక పోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించలేక మధ్యలోనే తమ చదువులు ఆపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బకాయిలు చెల్లిస్తే గానీ సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా పేద విద్యార్థులు తమకొచ్చిన ఉపాధి ఉద్యోగ అవకా శాలను వదులుకోవాల్సి వచ్చింది. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం నిర్దిష్ట కాలంలో ఫీజు బకాయిలను విడుదల చేయటం వల్ల విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ చదువులను కొనసాగిస్తున్నారు. ఫీజు రుసుమును తమ తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటం వల్ల తామే స్వయంగా కళాశాలల ఫీజు చెల్లించినట్లయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఫీజు రియింబర్స్మెంట్ విధానాన్ని ఆర్థిక పరమైన అంశంగానే ప్రభుత్వాలు ఆలోచించాయి. కానీ నేడు పేదలకు ఉద్దేశించిన ప్రతి పథకాన్ని సామాజికపరమైన అంశంగా కూడా చూస్తుండటం వల్ల బలహీన వర్గాల్లో ఆర్థిక స్వావలంబనతో పాటు ఆత్మగౌరవం నెలకొన్నదని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. (చదవండి: అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు) - ప్రొఫెసర్ ఈదర శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్, డాక్టర్ వైఎస్సార్ ఏఎన్నార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ -
పేద బిడ్డలకు పట్టం
తల్లులందరికీ ఒక మనవి... మంచి ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ చేసిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు లను వారం పది రోజుల్లోగా కళాశా లకు వెళ్లి చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఒకవేళ మీరు కాలేజీ లకు చెల్లించకపోతే తదుపరి విడ తలో ఆ ఫీజుల డబ్బులను మీ ఖాతా లకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కేవలం అక్షరాస్యత మాత్రమే కాకుండా పేద పిల్లలను వందకు వంద శాతం గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ ఆశయంతోనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ను తీసుకొస్తే ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించకుంటే కాలేజీకి రావద్దని, పరీక్షలు కూడా రాయనివ్వబోమని అడ్డుకున్న ఘటనలను కూడా గతంలో చూశామని గుర్తు చేశారు. ఈ అవమానాలను తట్టుకోలేక, ఫీజులు కట్టలేక నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాన్ని తన పాదయాత్ర సమయంలో చూశానని, అది ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా చూడాలని, చదువుకునేందుకు పేదరికం అడ్డు కాకుండా అండగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని వివరించారు. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన మూడో విడత కింద 11.03 లక్షల మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుస్తూ 9,87,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలరాతను మార్చే పెద్ద చదువులు పేదరికం తొలగిపోయి తలరాతలు మారాలంటే ఇంజనీర్లు, డాక్టర్లు లాంటి పెద్ద చదువులు చదివిన వారి సంఖ్య బాగా పెరగాలి. గత సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి రూ.6,259 కోట్లు ఫీజుల కింద చెల్లించాం. దీనివల్ల దాదాపు 21,48,477 మంది విద్యార్ధులకు మేలు జరిగింది. ఇంజనీరింగ్, మెడిసిన్కూ రీయింబర్స్మెంట్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్.. ఇలా కోర్సులేవైనా పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. పీజీ కోర్సులకు కూడా ప్రభుత్వ కాలేజీలలో చదివే వారికి అమలు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ప్రతి మూడు నెలలకొకసారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వారే కాలేజీలకు వెళ్లి స్వయంగా వసతులను పరిశీలించి కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతను అప్పగించాం. పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి? బాగా చదువుతున్నారా? లేదా? అనే విషయాలను అవగతం చేసుకోవడంతోపాటు ల్యాబ్స్, ఇతర సదుపాయాలను తల్లులే స్వయంగా పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు. దీనివల్ల కాలేజీలకు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. తల్లుల పర్యవేక్షణతో ఈ రెండూ జరుగుతాయి. కాలేజీల్లో సమస్యలుంటే యాజమాన్యాలను ప్రశ్నించడమే కాకుండా 1902 నంబర్కు ఫోన్ చేసి తెలియచేస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది. ప్రైవేట్లోనూ కోటా గతంలో మెరిట్ ఉన్నా ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్ రంగంలోని ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సమూల మార్పులు తీసుకొచ్చాం. ప్రైవేట్ యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్లో 50 శాతం సీట్లు, ఇంజనీరింగ్, డిగ్రీ లాంటి ఇతర కోర్సుల్లో 35 శాతం సీట్లను కచ్చితంగా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో సవరణలు చేశాం. ఫలితంగా పేద విద్యార్థులకు అవకాశం లభిస్తోంది. ఈ ఏడాది దాదాపు 2,118 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం. ప్రతిభ ఉన్న అర్హులైన పేద విద్యార్థులకు మేలు జరుగుతోంది. విద్యా దీవెన, వసతి దీవెనతో మంచి ఫలితాలు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇటీవల సర్వే నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరుతున్న 17 – 23 ఏళ్ల వయసు విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2020కి 35.2 శాతానికి పెరిగింది. 2018–19తో పోలిస్తే 2019–20లో జాతీయ స్థాయిలో జీఈఆర్ రేషియో పెరుగుదల 3.04 శాతం కాగా మన రాష్ట్రంలో 8.6 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో జీఈఆర్కు సంబంధించి ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28 శాతం పెరుగుదల ఉండగా మన రాష్ట్రంలో మరింత మెరుగైన ఫలితాలున్నాయి. ఎస్సీల్లో 7.5 శాతం, ఎస్టీల్లో 9.5 శాతం, విద్యార్థినుల్లో 11.03 శాతం పెరుగుదల నమోదైంది. జాతీయ స్థాయి సగటు కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ మనం అనుకున్న లక్ష్యాలను చేరాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. అందరి ఆశీస్సులు, దేవుడి దయతో గమ్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం ఉంది. రెండున్నరేళ్లలో రూ.8,526 కోట్లు పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్కటే సరిపోదని వసతి దీవెన పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. పిల్లల బోర్డింగ్, మెస్ ఖర్చులు రూ.20 వేలు చెల్లించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులున్నారు. వారు అవస్థలు పడకూడదు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే వసతి దీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెనకు ఇప్పటివరకు రూ.2,267 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశాం. పిల్లలకు మేనమామలా.. అక్క చెల్లెమ్మలకు తమ్ముడిగా, అన్నగా మంచి చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన.. ఈ రెండు పథకాలకు కలిపి ఈ రెండున్నర ఏళ్లలో రూ.8,526 కోట్లకుపైగా ఇచ్చాం. 16 కొత్త మెడికల్ కాలేజీలు.. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శరవేగంగా శ్రీకారం చుట్టాం. రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. ట్రైబల్ వర్సిటీకి త్వరలో శంకుస్థాపన విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉంటుంది. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటవుతున్నాయి. త్వరలోనే పనులు మొదలవుతాయి. డిగ్రీ కాలేజీల్లో నాడు – నేడు 2019 నుంచి రాష్ట్రంలో కొత్తగా పది డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశాం. 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రూ.880 కోట్లతో నాడు – నేడు పనులకు శ్రీకారం చుడుతున్నాం. రెండేళ్లలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగాలు వచ్చేలా కోర్సులు.. డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం వైపు అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బైలింగువల్ (ద్వి భాషా) టెక్టŠస్బుక్స్ ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అందుబాటులోకి తెస్తున్నాం. ఉద్యోగాలు వచ్చే కోర్సులుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతీ డిగ్రీ విద్యార్ధికి అప్రెంటిషిప్, వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం జిల్లాల్లోని పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నాం. 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. మైక్రోసాఫ్ట్తో 40 కోర్సుల్లో ఉచిత శిక్షణ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిలో భాగంగా మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ప్రాజెక్టు కింద 1.62 లక్షల మంది విద్యార్థులకు ఫ్యూచర్ రెడీ స్కిల్ సొల్యూషన్స్ అంటే 40 రకాల కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందచేసి సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు చేపట్టాం. 40 స్కిల్ కోర్సుల్లో డేటా ఎనలైటిక్స్, కృతిమ మేథస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, కోడింగ్, లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్ లాంటి 8,600 అంశాలను పొందుపరిచారు. పెద్ద కంపెనీలు, నాస్కామ్ లాంటి సంస్ధలను స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలతో అనుసంధానం చేస్తున్నాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్చంద్ర, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జే. శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్దండే, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. తల్లులందరికీ ఒక మనవి... మంచి ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ చేసిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వారం పది రోజుల్లోగా కళాశాలకు వెళ్లి ఫీజుల కింద చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఒకవేళ మీరు కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడతలో ఆ ఫీజుల డబ్బులను మీ ఖాతాలకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. – సీఎం జగన్ -
Jagananna Vidya Deevena: 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు
సాక్షి, అమరావతి: కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.686 కోట్లు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. 2021 ఏప్రిల్ 19న మొదటి విడత.. జూలై 29న జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేశాం. పేదరికం చదువుకు అవరోధం కారాదు. ఉన్నత చదువులు అభ్యసిస్తేనే తల రాతలు మారుతాయి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న ఫీజులు కాలేజీలకు తప్పకుండా కట్టాలి. లేకుంటే నేరుగా కాలేజీలకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది' అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ మాటల్లోని ముఖ్యాంశాలు.. ►నాన్నగారు ఫీజు రియంబర్స్మెంట్ను తీసుకు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. కాలేజీలకు ఏళ్లతరబడి బకాయి పెట్టారు. దీనివల్ల కాలేజీల్లో నాణ్యతను అడిగే పరిస్థితి ఎలా వస్తుంది?. కాలేజీకి రావొద్దని, పరీక్షలు రాయనివ్వమని అన్న ఘటనలు కూడా మనం చూశాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. అలాంటి పరిణామాల నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాదయాత్రలో నాకు ఎదురైంది. ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికీ రాకూడదనే అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకేశాం. ►అర్హులైన విద్యార్థులందరికీ కూడా వందకు వందశాతం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా.. వారికి పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్.. ఈకోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. తల్లిదండ్రుల ఖాతాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జమచేస్తున్నాం. కాలేజీలకు పిల్లల తల్లులే వెళ్లి కాలేజీల పరిస్థితులను, వసతులను చూసి.. కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతలను తల్లిదండ్రులకే అప్పగిస్తున్నాం. లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను వాళ్లు ప్రశ్నించగలుగుతారు. దీనివల్ల కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుంది మంచి ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన మొదలుపెట్టాం మీ ఖాతాల్లో జమ అయిన సొమ్మును వారం రోజుల్లోపు కాలేజీలకు వెళ్లి ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం మీకు ఇచ్చిన తర్వాత కూడా మీరు కాలేజీలకు ఇవ్వకపోతే.. మీ ఖాతాలకు కాకుండా.. ఆఫీజుల సొమ్మును ఇవ్వక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. దయచేసి ప్రతి తల్లీ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ఉన్నా.. ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి గతంలో ఉండేది. వీటిలో మార్పులు తీసుకు వచ్చాం. అన్ని ప్రైవేటు యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్ అయితే కచ్చితంగా యాభైశాతం, ఇతర కోర్సుల్లో అయితే 35 శాతం సీట్లు గవర్నమెంటు కోటాలో భర్తీ చేయాలని మార్పులు తీసుకు వచ్చి చట్టం చేశాం. ఇంతకుముందు అవకాశంలేని పేద విద్యార్థులకు అవకాశం వస్తోంది. ఈ ఏడాది దాదాపు 2118 విద్యార్థులకు అవకాశం వచ్చింది. వీరికి పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ఇస్తున్నాం. ప్రతిభ ఉన్న అర్హులైన పేదవిద్యార్థులకు గతానికి భిన్నంగా చదువుకునే అవకాశం లభించింది. మనసున్న ప్రభుత్వంగా మనం ఇవన్నీ చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనల ద్వారా చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే రిపోర్టులో మన రాష్ట్రంలో ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థల జీఈఆర్ రేష్యో 2020 నాటికి 35.2 శాతానికి పెరిగింది. 2018 –19 తో పోలిస్తే.. 2019–20 మధ్య పెరుగుదల దేశవ్యాప్తంగా 3.04 అయితే, మన రాష్ట్రంలో 8.6శాతంగా నమోదయ్యింది. జీఈఆర్ దేశవ్యాప్తంగా ఎస్సీల్లో 1.7శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28శాతం ఉంటే.. మన రాష్ట్రంలో ఎస్సీల్లో 7.5, ఎస్టీల్లో 9.5శాతం.. విద్యార్థినుల్లో 11.03శాతంగా నమోదయ్యింది. చదువుల కోసం భారం ఉండకూడదు. గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలి. దేశం కన్నా మనం మెరుగ్గా ఉన్నాం ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో ఆ గమ్యాన్ని మనం చేరుకుంటాం. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్ చదివేవాళ్లకి రూ.15వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదివేవారికి రూ.20వేలు ఇస్తున్నాం. ఇప్పటివరకూ 2,267 కోట్ల రూపాయలు ఇచ్చాం. మంచి మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాలకి కలిపి ఈ రెండు ఏళ్లలో రూ.8,500 కోట్లకుపైగా ఇచ్చాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ►విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్టీయూ యూనివర్శిటీని తీసుకువస్తున్నాం ►ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీని తీసుకువస్తున్నాం ►కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీని తీసుకువస్తున్నాం ►కురుపాంలో ఇంజినీరింగ్కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ, పాడేరులో మెడికల్ కాలేజీ తీసుకువస్తున్నాం ►2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా మరో 10 డిగ్రీలు కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం ►నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీకాలేజీల్లో 880 కోట్లతో నాడు – నేడుకు శ్రీకారం చుడుతున్నాం ►మరో 2 సంవత్సరాల్లో ఇవన్నీకూడా పూర్తిగా పనులు అవుతాయి ►డిగ్రీ కోర్సుల్లో కూడా మార్పులకు శ్రీకారం చుట్టాం ►ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులువేస్తున్నాం ►టెక్ట్స్ బుక్లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ తెలుగు ముద్రిస్తున్నాం ►ఉద్యోగాలు ఇచ్చే కోర్సులుగా వీటిని తీర్చిదిద్దుతున్నాం ►ఏకంగా 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నాం ►ఒక స్కిల్ యూనివర్శిటీని కూడా తీసుకువస్తున్నాం కాగా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్ల బకాయిలతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.6,259 కోట్లు ఫీజు చెల్లించారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ విద్యా పథకాల కింద 1,97,38,694 మంది విద్యార్థులకు రూ.34,753.17 కోట్ల వ్యయం చేశారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు: మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 'పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచింది. కానీ మన ప్రభుత్వం కోవిడ్ పరిస్థితుల్లోనూ జగనన్న విద్యాదీవెన అమలు చేస్తున్నామని' ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. -
ఫీజు.. ప్లీజ్! 2,500కోట్లు గతరెండేళ్లలో పెండింగ్...
హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన ప్రశాంతి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. ఫైనలియర్ చివర్లో క్యాంపస్ సెలక్షన్లో క్యాప్ జెమినీ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. కోర్సు ముగియడంతో ఉద్యోగంలో చేరేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. వాటికోసం కాలేజీలో సంప్రదిస్తే మూడో, నాలుగో ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా రాలేదని.. సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు చెల్లించాలని యాజమాన్యం తేల్చి చెప్పింది. దీనితో ప్రశాంతి తల్లిదండ్రులు రూ.లక్షా పదివేలు అప్పు చేసి..కాలేజీలో కట్టాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో వేల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలన్నా.. పైచదువులకు వెళ్లాలన్నా సర్టిఫికెట్లు కావాల్సిందే. దీంతో విధిలేని పరిస్థితుల్లో అప్పోసొప్పో చేసి కాలేజీలకు డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఇక సర్టిఫికెట్లతో అత్యవసరం లేని పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఇతర విద్యార్థుల ‘ఫీజు’బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి. ప్రభుత్వం ఈ పథకాలకు అరకొరగా నిధులు విడుదల చేయడమే దీనికి కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. బకాయిలు రూ.2,500 కోట్లు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద.. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించే రూ.2,500 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో 2019–20 ఏడాది బకాయిలు రూ.406.66 కోట్లుకాగా.. 2020–21కు సంబంధించి దరఖాస్తుల పరిశీలన ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు రూ.1,178.21 కోట్లు అవసరమని తేల్చగా.. పరిశీలన పూర్తయ్యే సరికి మరో రూ.వెయ్యి కోట్లు పెరుగుతుందని అంచనా. మొత్తంగా 2020–21 నాటికే రూ.2,500 కోట్లకుపైగా అవసరం. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరాని (2021–22)కి సంబంధించిన ఉపకార వేతనాలు, ‘ఫీజు’కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ట్రెజరీల్లో పెండింగ్! ఉపకార వేతనాలు, ‘ఫీజు’దరఖాస్తులను సంక్షేమశాఖలు పరిశీలించి అర్హతను నిర్ధారిస్తాయి. తర్వాత కాలేజీల వారీగా బిల్లులు సిద్ధం చేసి ఖజానా శాఖకు పంపుతాయి. ప్రస్తుతం సంక్షేమశాఖలు బిల్లులు పంపాయని.. ట్రెజరీల్లో పెండింగ్లో ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఉపకార వేతనాలు, ‘ఫీజు’బకాయిల తీరు (రూ.కోట్లలో) అప్పుల్లో కూరుకుపోయాం.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయక కాలేజీల నిర్వహణ కష్టంగా మారింది. సిబ్బంది వేతనాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. కరోనా పరిస్థితులతో కాలేజీల నిర్వహణ మరింత భారంగా మారింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి. – గౌరీ సతీశ్, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షుడు -
ఈడబ్ల్యూఎస్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలోనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు 10 శాతం కోటా అమలుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెట్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను పూర్తిగా కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, చీఫ్ క్యాంపు ఆఫీసర్ (అడ్మిషన్స్) డాక్టర్ బల్లా కళ్యాణ్, సెట్స్ ప్రత్యేకాధికారి సుధీర్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం కాలేజీల్లోని కోర్సుల్లో పది శాతం సీట్లను సూపర్న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లోని సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా కింద, 30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద కేటాయిస్తున్నారు. కన్వీనర్ కోటాలో 7 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 3 శాతం సీట్లు సూపర్న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా కేటాయిస్తున్నారు. అయితే కన్వీనర్ కోటాలో సీట్లు పొందే విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తోంది. వారిపై పైసా భారం పడదు. మేనేజ్మెంట్ కోటా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఆ కోటాలో సీట్లు పొందే ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులు ఫీజు వారే చెల్లించాలి. ఇది కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకంటే ఈ ఏడాది 3 రెట్లు అధికంగా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలపై ఇంత ఫీజు భారం సరికాదన్న ప్రభుత్వ అభిప్రాయం మేరకు మొత్తం 10 శాతం సీట్లను కన్వీనర్ కోటాలోనే కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనివల్ల ఆ విద్యార్థులపై ఫీజుల భారం పడదు. ప్రైవేటు యూనివర్సిటీల్లో కేంద్ర చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాకు అవకాశం లేనందున రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా ఆ కోటా అమలు కాదు. నేడు ఈఏపీ సీట్ల కేటాయింపు రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీ సెట్–2021 సీట్ల కేటాయింపు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈనెల 10వ తేదీనే సీట్లు కేటాయించాల్సి ఉన్నా, ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకోవలసి ఉండటంతో వాయిదా పడింది. గురువారం దీనిపై నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం నుంచి సీట్లు కేటాయిస్తారు. -
విద్యార్థులపై పైసా భారం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రయివేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్ కాలేజీల్లోని అన్ ఎయిడెడ్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు అమలు చేస్తోంది. ఏ ఒక్క విద్యార్థి మీద పైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా వాటిని భరిస్తోంది. విద్యావ్యవస్థలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానం 1960లో ఆరంభమైంది. అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ డిగ్రీ కాలేజీలకు, సీట్లకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. దీనికి అనుగుణంగా కాలేజీలు, సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం ప్రయివేటు డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులు ఇచ్చింది. ఈ తరుణంలో కొంతమంది దాతలు, ప్రముఖులు మంచి ఉద్దేశంతో సమాజానికి సేవచేయాలని కాలేజీలు స్థాపించారు. భీమరంలోని డీఎన్ఆర్ కాలేజీ, ఏలూరులోని సీఆర్రెడ్డి కాలేజీ, మదనపల్లెలోని బీటీకాలేజీ, అమలాపురంలోని ఎస్కేబీఆర్ కాలేజీ, విశాఖపట్నంలో డాక్టర్ ఎల్బీ కాలేజీ.. వంటివి ఇలా ఏర్పాటైనవే. వీటిలో విద్యార్థుల చేరికలు పెరుగుతున్న కొద్దీ అదనంగా అధ్యాపకుల అవసరం ఏర్పడింది. సిబ్బంది సంఖ్య పెరిగిన కొద్దీ వారికి వేతనాలు వంటివి అందించడం ఆయా సంస్థలకు ఆర్థికంగా భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా యాజమాన్యాలు ఆర్థికసాయాన్ని అర్థించగా ప్రభుత్వం టీచర్ల వేతనాలకు ఇయర్లీ గ్రాంటును మంజూరు చేసింది. తరువాత దీన్ని 3 నెలలకు మార్చింది. 2010–12 నుంచి ఈ వేతనాల చెల్లింపును సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి చేర్చారు. రాష్ట్రంలో 1,444 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 1,153 ప్రయివేటు అన్ ఎయిడెడ్వి. 137 ఎయిడెడ్, 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు. కాలేజీల సంఖ్య పెరిగాక ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో చేరికలు తగ్గిపోయాయి. 2020–21లో మొత్తం కాలేజీల్లోని సీట్లలో 57 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఫీజులు భరిస్తున్న ప్రభుత్వం మరోవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల పునర్వ్యవస్థీకరణ జరిగి మార్కెట్, ఎంప్లాయిమెంటు ఓరియెంటెడ్ కోర్సులు ప్రారంభమయ్యాయి. దీంతో సంప్రదాయ కోర్సుల్లో చేరికలు పడిపోయాయి. ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో 90 శాతం కోర్సులు అన్ ఎయిడెడ్వి ఉన్నాయి. వీటికి ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఖరారు చేసిన ఫీజులే వర్తిస్తాయి. ఈ కోర్సులకు అయ్యే ఫీజులను.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక పూర్తిగా రీయింబర్స్మెంటు చేయిస్తున్నారు. ప్రయివేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్ కాలేజీల్లోని అన్ ఎయిడెడ్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు అమలవుతోంది. ఏ ఒక్క విద్యార్థి మీద కూడా నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఖరారైన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్నట్లు ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్కు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఒకవేళ ఏ కాలేజీలోనైనా నిర్ణీత ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో తగ్గిన చేరికలు ఎయిడెడ్ పాఠశాలల్లో కనీస వసతులు, సరైన బోధన లేకపోవడం, యాజమాన్యాలు కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో చేరికలు మరింతగా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇక్కడి సిబ్బంది వేతనాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఖర్చుచేస్తున్న ప్రజాధనం వృధాగా మారుతోంది. విద్యార్థులకు సరైన ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదు. -
టార్గెట్.. జాబ్స్
సాక్షి, అమరావతి: ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చదువులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖకు సూచించారు. నాణ్యమైన బోధన, ఉపాధి కల్పనే లక్ష్యం కావాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి ఇంటర్న్షిప్, జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నామని, కోర్సుల్లో కూడా చాలా మార్పులు తెచ్చామని తెలిపారు. జాబ్ ఓరియెంటెడ్గా కోర్సులను తీర్చిదిద్దాలని, విద్యార్థి యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే కచ్చితంగా ఉద్యోగం సాధించేలా ఉండాలని స్పష్టం చేశారు. మూడేళ్లలో యూనివర్శిటీలన్నీ అన్ని రకాలుగా మెరుగుపడేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఉన్నత విద్యామండలి ప్రతి వారం ఒక్కో వైస్ ఛాన్సలర్తో సమావేశం నిర్వహించి సమస్యలను నేరుగా తన దృష్టికి తెచ్చి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. టెక్ట్స్బుక్స్ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి సురేష్, ఉన్నతాధికారులు క్వాలిటీ రిక్రూట్మెంట్స్ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపాం. టీచింగ్ స్టాఫ్ పోస్టులన్నీ పూర్తిగా భర్తీ చేయాలి. టీచింగ్ స్టాఫ్ లేనప్పుడు యూనివర్సిటీలున్నా ఏం లాభం? మంచి అర్హతా ప్రమాణాలు కలిగినవారిని నియమించాలి. క్వాలిటీ లేకపోతే రిక్రూట్ చేసినా అర్ధం ఉండదు. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి. పక్షపాతాలకు తావుండకూడదు. కరిక్యులమ్లో కూడా మార్పులు రావాలి. అప్పుడే నాణ్యమైన విద్య అందించగలుగుతాం. విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ మూడు అంశాల్లో మార్పు వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. యూనివర్సిటీల్లో అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను రికార్డ్ చేసి సబ్జెక్టుల వారీగా ఆన్లైన్లో పొందుపరచాలి. విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోలు ఉపకరిస్తాయి. ప్రతి వీసీ కూడా తన హయాంలో మంచి మార్పులు తీసుకురావాలి. పిల్లలకిచ్చే ఆస్తి నాణ్యమైన విద్యే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. అదీ నాణ్యతతో కూడిన విద్య మాత్రమే. మనం వచ్చిన తర్వాత విద్యారంగంలో తేడా ఏమిటన్నది కనిపించాలి. ఈ ప్రభుత్వం చదువుకు ఇచ్చినంత ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు. నాణ్యమైన విద్య అందించడానికి పలు చర్యలు తీసుకున్నాం. మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారతాయి. కాలేజీల్లో ప్రమాణాలు తప్పనిసరి.. యూనివర్సిటీల్లో ఇంటర్నెట్ సదుపాయం పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలి. మంచి బ్యాండ్ విడ్త్ క్వాలిటీ ఉండాలి. ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీ పడొద్దు. మన పార్టీ, ఆ పార్టీ అని చూడాల్సిన అవసరం లేదు. ప్రతి కాలేజీ కచ్చితంగా ప్రమాణాలు పాటించాల్సిందే. కాలేజీలు సరిగా లేకపోతే యూనివర్సిటీల ప్రతిష్ట దెబ్బతింటుంది. ఏ కాలేజీలోనైనా ప్రమాణాలు లేకపోతే గుర్తించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి మెరుగుపరుచుకోవడానికి సమయం ఇవ్వండి. ప్రమాణాలు లేనివాటికి అనుమతులు ఇవ్వొద్దు. వర్శిటీలు అధ్యయనం చేయాలి గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ లాంటి వ్యవస్ధలు సమర్ధవంతంగా పనిచేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్సిటీలు అధ్యయనం చేయాలి. సబ్ రిజిస్ట్రార్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపైనా అధ్యయనం చేయాలి. ఇంటర్వూ ఇబ్బందులు తొలగిపోవాలి ఉద్యోగాలు కల్పన దిశగా చదువులు ఉండాలి. మైక్రోసాప్ట్ లాంటి సంస్ధలతో శిక్షణ నిరంతరం కొనసాగాలి. కోర్సులలో శిక్షణను సమ్మిళతం చేసినప్పుడు ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతాయి. బాగా చదువుకున్నా ఇంటర్వూల దగ్గరకు వచ్చేసరికి విఫలం అవుతున్న పరిస్థితులను చూస్తున్నాం. అప్రెంటిస్షిప్ కచ్చితంగా ఉండాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తెస్తున్నాం. జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకుని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను, కాలేజీలను అనుసంధానం చేయాలి. అత్యుత్తమ కరిక్యులమ్... సర్టిఫైడ్ కోర్సులనూ కరిక్యులమ్లో భాగం చేయాలి. ఉగ్యోగాల కల్పన, ఉపాధి లక్ష్యం కావాలి. ఆయా రంగాల్లో నిపుణులైన, అత్యుత్తమమైన వ్యక్తులతో కోర్సులను రూపొందించండి. బైలింగువల్ (ద్వి భాషా) పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టాలి. ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలి. చదువులు పూర్తయ్యాక కచ్చితంగా జాబ్ వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తేవాలి. ప్రాక్టికాలిటీ (అనుభవపూర్వకంగా నేర్చుకోవడం)కి పెద్దపీట వేయాలి. జాతీయ స్థాయి ప్రమాణాలు జీఈఆర్ రేషియోను 2025 నాటికల్లా 70 శాతం అందుకోవాలి. విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలతో కచ్చితంగా దీన్ని సాధిస్తాం. ఆస్పత్రుల మాదిరిగానే ప్రతి యూనివర్శిటీ పరిధిలో కూడా జాతీయ ప్రమాణాలు ఉండాలి. కాలేజీలన్నీ నిర్దిష్ట ప్రమాణాలను పాటించేలా లక్ష్యాలను నిర్దేశించి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. సమస్యలున్నా రీయింబర్స్మెంట్ ఎన్ని సమస్యలున్నా సరే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఎక్కడా లోటు చేయడం లేదు. ప్రతి మూడు నెలలకొకసారి కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నాం. రీయింబర్స్మెంట్ రానందున సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాల నుంచి రాకుండా చూసుకుంటున్నాం. తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం. విద్యా బోధన, కాలేజీల్లో పరిస్థితులపై వారికి నేరుగా ప్రశ్నించే అవకాశాన్ని కల్పించాం. ఇతర ప్రైవేట్ కాలేజీల మాదిరిగానే యూనివర్శిటీకీ సంబంధించిన కాలేజీల్లో కూడా భవిష్యత్లో సమానంగా ఫీజులు చెల్లిస్తాం. దీనివల్ల యూనివర్సిటీలు ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధిస్తాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ కాలేజీలు స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. పరిశోధనలపై కూడా సమన్వయం చేసుకోవాలి. జిల్లాల్లో పరిశ్రమలతో అనుసంధానం కావాలి. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రంగానికి సంబంధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో కొలాబరేట్ కావాలి. వర్సిటీలకు మూడేళ్ల కార్యాచరణ ఉన్నత విద్యా మండలి ప్రతి వారం ఒక వీసీతో సమావేశమై యూనివర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వపరంగా అందించాల్సిన తోడ్పాటుపై చర్చించాలి. ప్రస్తుత స్ధాయి, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలను గుర్తించాలి. వర్సిటీల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మూడేళ్లలో ఈ విజన్ సాధించాలి. నాక్ రేటింగ్కు అప్గ్రేడ్ కావాలి అన్ని యూనివర్శిటీల్లో నాక్ రేటింగ్కు అప్గ్రేడ్ కావాలి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను యూనివర్సిటీలతో ఇంటిగ్రేట్ చేయాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా పేరున్న కంపెనీలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటాయి. ఆన్లైన్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ఉంచాలి. ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని మెరుగుపర్చడంపైనా దృష్టి పెట్టాలి. బేసిక్ ఇంగ్లీషు అన్నది తప్పనిసరి సబ్జెక్టు కావాలి. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. వర్క్బుక్, పాడ్కాస్ట్ ఆవిష్కరణ.. సమావేశంలో ఇంగ్లీషు కమ్యూనికేషన్ వర్క్బుక్, టెక్టŠస్బుక్స్తో పాటు ఏపీఎస్సీహెచ్ఈ పాడ్కాస్ట్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్చంద్ర, ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్ధుల్లో 1,10,779 మంది ల్యాప్టాప్లను ఆప్షన్గా ఎంపిక చేసుకున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఎయిడెడ్పై బలవంతం లేదు ఎయిడెడ్ విద్యాసంస్ధల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందం. చాలా విద్యాసంస్ధల్లో పరిస్థితులు దెబ్బతిన్నాయి. శిధిలావస్థలో, మౌలిక సదుపాయాలు కొరవడటంతో విద్యార్ధులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వపరంగా ఒక అవకాశం కల్పించాం. ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయా సంస్ధలను ప్రభుత్వమే నిర్వహించి మెరుగైన రీతిలో నడుపుతుంది. దాతల పేర్లు కూడా కొనసాగుతాయి. లేదూ.. తామే నడుపుకొంటామంటే భేషుగ్గా నడుపుకోవచ్చు. దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వానికి ఎయిడెడ్ విద్యాసంస్ధల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలి. -
AP: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం లేదు: హేమ చంద్రారెడ్డి
సాక్షి, విజయవాడ: నాణ్యమైన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమ చంద్రారెడ్డి అన్నారు. విద్యారంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం లేదని.. 87 శాతం విద్యార్థులకు పూర్తిగా చెల్లింపులు చేశామని స్పష్టం చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 4వేల కోట్లు చెల్లించామని తెలిపారు. రూ.1880 కోట్ల గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నాయని తెలిపారు. అక్రమాలను నిరోధించేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. వివిధ అంశాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. చదవండి: ‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’ -
బోగస్ పేర్లతో ఫీజురీయింబర్స్మెంట్ స్వాహా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డిగ్రీ కళాశాలల్లో పీజీ తరగతులను నిర్వహిస్తున్నవి కొన్ని కాగా... విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను యూనివర్సిటీలకు చెల్లించకుండా తమ ఖాతాల్లోనే దాచుకున్న కళాశాలలు మరికొన్ని. ఇక అసలు విద్యార్థులు లేకుండానే ఉన్నట్లుగా చూపిస్తూ బోగస్ పేర్లతో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కాజేస్తున్న కాలేజీలు మరికొన్ని ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా ప్రైవేట్ కాలేజీల్లో వసతులతో పాటు రికార్డులను అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలను మరో రెండు రోజుల్లో పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ కాలేజీల్లో జరుగుతున్న ఈ అవకతవకలను అరికట్టేందుకే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లో కాకుండా జవాబుదారీతనం, పారదర్శకత కోసం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే క్యాంపస్లో డిగ్రీ, పీజీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో పలు కాలేజీల్లో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా డిగ్రీ కాలేజీకి అనుమతి పొందిన కొన్నేళ్ల తర్వాత పీజీ కాలేజీకి అనుమతి తీసుకుంటున్నారు. ఒకటో, రెండో తరగతి గదులను పెంచి అదే క్యాంపస్లో పీజీ కాలేజీ నిర్వహిస్తున్నారు. ల్యాబ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం లేదు. బోధనా సిబ్బందిని నియమించకుండా డిగ్రీ అధ్యాపకులతోనే సరిపెడుతున్నారు. ప్రత్యేకంగా తరగతి గదులు, ల్యాబ్, స్టాఫ్ ఉన్నారని తప్పుడు పత్రాలు సృష్టించినట్టు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్నాయి. విద్యార్థుల సంఖ్యల్లోనూ తేడాలు కొన్ని కాలేజీలు యూనివర్సిటీకి, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సమర్పిస్తున్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు తేడా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. బినామీ విద్యార్థుల ఫీజులను కాలేజీ యాజమాన్యాలు తమ జేబులో వేసుకుంటున్నట్లు వెల్లడవుతోంది. కొన్ని కాలేజీల్లో ఇలాంటి అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలకు ఫీజులు చెల్లించకుండా ఏళ్ల తరబడి తమ వద్దే ఉంచుకుంటున్నాయి. అయితే ఆ ఫీజులను మాత్రం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. విశాఖ జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీ ఏకంగా రూ.10 కోట్ల మేర జేఎన్టీయూ (కాకినాడ)కు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. -
తల్లి ఖాతాలో కాదు..కాలేజీ ఖాతాలో జమచేయాలి
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోనే జమచేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్లో జారీచేసిన జీవో 28ని హైకోర్టు రద్దుచేసింది. అదేవిధంగా జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వం చెల్లించిన ఫీజును విద్యార్థి తల్లి కాలేజీకి చెల్లించకపోతే ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదంటూ గత ఏడాది నవంబర్ 6న జారీచేసిన జీవో 64లో పేర్కొన్న క్లాజులన్నింటినీ కొట్టేసింది. ఇకపై జగనన్న విద్యాదీవెన పథకం కింద స్కాలర్షిప్పులను, ఫీజులను ఆయా కాలేజీల ఖాతాలకే జమచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమచేసిన డబ్బు విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఈ మొత్తాలను ఆయా విద్యార్థుల నుంచి కాలేజీలే వసూలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. జీవోలు 28, 64లను సవాలు చేస్తూ అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకృష్ణదేవరాయ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఎస్.హెచ్.ఆర్.ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ విజయలక్ష్మి విచారణ జరిపారు. స్వీయ అవసరాలకు వాడుకునే పరిస్థితులున్నాయి పిటిషనర్ న్యాయవాది మోతుకుమిల్లి విజయకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఫీజులను, స్కాలర్షిప్పులను విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయడం వల్ల కాలేజీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రామీణ విద్యార్థుల తల్లులు నిరక్షరాస్యులుగా ఉంటున్నారని, వారి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విద్యార్థి చదువుకోసం ప్రభుత్వం జమచేస్తున్న ఫీజుల డబ్బును స్వీయ అవసరాల నిమిత్తం మళ్లించాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని చెప్పారు. దీంతో ప్రభుత్వం చెల్లించిన ఫీజు మొత్తం కాలేజీలకు చేరడంలేదని, తల్లి ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం జీవో కూడా జారీచేసిందని పేర్కొన్నారు. దీంతో జగనన్న విద్యాదీవెన పథకం తీసుకొచ్చిన సదుద్దేశం నెరవేరకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది తల్లులు ప్రభుత్వం చెల్లించిన ఫీజులను తిరిగి కాలేజీలకు చెల్లించడం లేదో పేర్కొంటూ జిల్లాల వారీగా వివరాలను ఆయన కోర్టు ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? లేదా? కాలేజీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? తదితరాలను పరిశీలించే నిమిత్తమే తల్లి ఖాతాలో డబ్బు జమచేయడం వెనుకున్న ప్రధాన ఉద్దేశమని చెప్పారు. మహిళా సాధికారతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాలేజీ ఖాతాలో డబ్బు వేస్తే చదువు ఆపేసే అవకాశాలు స్వల్పం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి.. దాదాపు 40 శాతంమంది విద్యార్థులు ప్రవేశాల సమయంలో ఫీజులు చెల్లించలేదని, ప్రభుత్వ జీవో ప్రకారం ఫీజుల కోసం వారిని కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీల్లేదని, తల్లులు ఫీజు చెల్లించకపోతే ప్రభుత్వానిది బాధ్యత కాదని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థి బలవంతంగా చదువు ఆపేయాల్సి వస్తోందని, అంతిమంగా ఓ సీటు వృథా అవుతోందని తెలిపారు. కాలేజీల ఖాతాల్లో డబ్బు జమచేస్తే విద్యార్థి చదువు ఆపేసే పరిస్థితులు చాలా స్వల్పమని చెప్పారు. ఒకవేళ ఆ కాలేజీలో సౌకర్యాలు సరిగా లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులు దానిపై ఫిర్యాదుచేసే అవకాశం ఉంటుందన్నారు. తల్లి ఖాతాలో ఫీజు జమచేయడం వల్ల చదువు కొనసాగింపునకు హామీ లభించడంలేదని చెప్పారు. ఇది జగనన్న విద్యాదీవెన పథకం లక్ష్యానికి విరుద్ధమన్నారు. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు జస్టిస్ విజయలక్ష్మి తన తీర్పులో పేర్కొన్నారు. -
అభివృద్ధి – సంక్షేమం ఆయన పథం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేయవచ్చో, వారిని ఆరోగ్యవంతులుగా, ఉన్నత విద్యావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చో.. నిరూపించి వారి హృదయాల్లో నిలిచిపోయారు. ప్రజలను కుటుంబసభ్యులుగా భావించి వారి కష్టాలు, కన్నీళ్లు.. వాటికి కారణాలు తెలుసుకుని నేనున్నానంటూ భరోసా కల్పించి.. మీకోసం ఎందాకైనా.. అంటూ నడిచి నిలిచారు. గలగలా జలాలు పారించి నోళ్లు తెరిచిన బీళ్లకు ఊపిరి పోశారు. ఆయన భౌతికంగా దూరమై నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేం. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అంటూ ఆప్యాయమైన ఆయన పిలుపు చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి టీడీపీ ప్రభుత్వ దోపిడీ, దౌర్జన్యాలు, దాష్టీకాలపై మడమతిప్పకుండా పోరా డారు. ఆ చీకటి పాలనలో నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నేనున్నానంటూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా ప్రస్థానం పేరుతో 1,475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి భరోసా కల్పించారు. ప్రజల కష్టాలు విన్నారు. కన్నీళ్లు తుడిచారు. 2004 సాధారణ ఎన్నికల్లో ప్రజ లు బ్రహ్మరథం పట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసే ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సం తకంతో ఎత్తేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షలకుపైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ.. ఆ తర్వాత ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కి తగ్గలేదు. పావలా వడ్డీకే రైతులకు రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. 2004 – 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1,000 వరకు పెరిగిందంటే.. అది ఆ యన కృషే. నదీ జలాలను తెలుగునేలకు మళ్లించి.. సుభిక్షం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి.. శరవేగంగా పనులు చేసి.. నీళ్లందించి అపర భగీరథుడిగా నిలిచారు. విద్య, వైద్యం.. అందరికీ అవసరమైన విద్య, వైద్యాలను అందు బాటులోకి తీసుకొచ్చారు. పేదరికం వల్ల ఏ ఒక్క రూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. లక్షలాదిమంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓసీ విద్యార్థులు ఉన్నత విద్యావంతులయ్యేలా చేశారు. ఉన్నత చదువులు అందరికీ అందుబాటు లోకి రావాలని జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ ఐటీ)ని ఏర్పాటు చేయించారు. బాసర, ఇడు పులపాయ, నూజివీడుల్లో ట్రిపుల్ ఐటీలను ఏర్పా టు చేశారు. వైద్యానికి డబ్బులేక ఏ ఒక్కరూ ఇబ్బం ది పడకూడదనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్, గర్భకోశవ్యాధులు, గుండె జబ్బులు తదితర 942 వ్యాధులకు చికిత్స అందించేలా ఆరోగ్యశ్రీని రూపొందించి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా దక్కేలా చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోను మహానేత వైఎస్ రూపకల్పన చేసిన ఆరోగ్యశ్రీ పథకం వివిధ పేర్లతో అమలవుతోందంటే ఆయన దార్శనికత అర్థమవుతోంది. ఫోన్ చేసిన నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యే 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసులు, 104 వైద్యసేవలకు ఆయనే శ్రీకారం చుట్టారు. తనయుడు.. మరో రెండడుగులు ముందుకు ప్రజల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జనం అభ్యున్నతి కోసం రెండడుగులు ముందుకేస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు తోడ్పాటును అందించేందుకు రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతుకు అన్నింటా సాయంగా నిలుస్తున్నారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వైద్యరంగంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్–19ను వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో చేర్చారు. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో వైద్యవ్యవస్థను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. -
బకాయిల కుప్పలు .. విద్యార్థులకు తిప్పలు
►రెండు సంవత్సరాలుగా నిధులు అందకపోవడంతో రూ.5.5 లక్షల అప్పు చేసి ఫీజు చెల్లించిన చైతన్యపురికి చెందిన పీజీ వైద్య విద్యార్థిని తండ్రి రెండు నెలలుగా హైదరాబాద్ బీసీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రభుత్వ పథకంపైనే ఆధారపడిన విద్యార్థులు అప్పులు చేసి కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. రెండేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. 2019–20 విద్యా సంవత్సరం బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. ఇక 2020–21కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. రెండేళ్లకు కలిపి మొత్తం రూ.3017.41 కోట్ల బకాయిలున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాలనూ ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. క్రమం తప్పకుండా జరగాల్సిన నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నిచోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందక పోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టతరంగా మారుతోందని యాజమాన్యాలు అంటున్నాయి. జాడలేని నెలవారీ నిధులు మూడేళ్ల క్రితం ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. మొదట్లో ప్రతి విద్యా సంవత్సరం చివర్లో నిధులను మంజూరు చేసేవారు. అయితే పెద్దమొత్తంలో నిధులు ఒకేసారి విడుదల చేయడం భారంగా మారుతుండటంతో నెలవారీగా నిధులు విడుదల చేయాలని భావించింది. సాధారణ, వృత్తి విద్యా కోర్సులకు వేరువేరుగా పద్దుల కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించి చర్యలు చేపట్టింది. తొలి రెండు మూడు నెలలు నిధుల విడుదల సాఫీగా జరిగినప్పటికీ.. ఆ తర్వాత క్రమం తప్పింది. దీంతో బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. దీంతో రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు పలు కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడితో తామే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాల్సి వస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత.. చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. జూనియర్ విద్యార్థుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తుండటంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇలా ఫీజులు చెల్లించినవారు సంక్షేమ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదనే సమాధానం ఎదురవుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు. వనపర్తి జిల్లా గోపాల్పేట హరిజనవాడకు చెందిన లావణ్య అనే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక గతనెల 19న బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. దరఖాస్తులు పరిశీలనకే పరిమితం... 2020–21 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలకు సంబంధించి 12.85 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగింది. దాదాపుగా నూరు శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ మొదలైన నెల రోజుల తర్వాత నుంచి వాటి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కావాలి. అయితే కోవిడ్–19 నేపథ్యంలో పరిశీలన ఆలస్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిశీలన ప్రారంభించిన సంక్షేమాధికారులు ఇప్పటివరకు 80 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాల కోసం రూ.2,250 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అయినా ఇప్పటివరకు అటు ఫీజు రీయింబర్స్మెంట్కు గానీ, ఉపకార వేతనాలకు కానీ నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. ఇక 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా రూ.767.41 కోట్ల మేర బకాయి ఉంది. వీటికి సంబంధించి సంక్షేమ శాఖ అధికారులు బిల్లులు సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. తక్షణమే నిధులు విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయమై ఆర్థిక మంత్రితో సహా పలువురికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. ఇతర పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థులకు బకాయి పడ్డ నిధులను ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం దిక్కుతోచని స్థితిలో కాలేజీలు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్పైనే ఆధారపడి ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చదువుతున్న వాళ్లు 85 శాతం ఉన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. అప్పులు చేసి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ఏకంగా కాలేజీలనే మూసేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. – గౌరి సతీష్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం