
టన్నెల్ వద్ద సహాయక చర్యలు అప్డేట్స్..
నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్లో ఇరుక్కున్న ఎనిమిది రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్లొన్నారు.
తీవ్రంగా శ్రమిస్తున్న ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
- కార్మికులు ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్లిన బృందాలు
- గ్యాస్ కట్టర్లతో బోర్ మిషన్ ను కట్ చేసేందుకు యత్నం
ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించిన జానారెడ్డి
- ఎస్ఎల్బీసీ వద్ద విషాద ఘటన జరిగింది
- పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఘటన జరగటం విషాదం
- రెస్క్యూలో అందరు చురుకుగా పని చేస్తున్నారు
- ఏ పద్దతుల్లో వారిని గుర్తించగలమో చర్యలు చేపడుతున్నారు
- ఆచూకీ దొరక్క వారు చనిపోతే మృతదేహాలను ఎలా తీసుకురావాలో చూస్తున్నారు
- బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
- ఘటనకు తీవ్రంగా బాధపడుతున్నాను
- మా ప్రాజెక్టు పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ప్రమాదంలో పడటం విచారకరం
- ఎనిమిది మందిని ప్రాణాలతో తీసుకురావటమే మా ముందున్న లక్ష్యం
- శ్రీశైలం మల్లన్న దయతో బాధితులు బయటకు రావాలి.
- రాజకీయాలు చేయాలని చూస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం
- సిరిసిల్ల ఘటనలో చనిపోయిన వారి గురించి కేటీఆర్కు గుర్తుకురాలేదా?
- సహయక చర్యలకు ఆటంకం కలగవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి రావటం లేదు
- గతంలో పెద్ద పెద్ద ఘటనలు జరిగినప్పుడు పలకరించని కేటీఆర్ ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు
- ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలనే చిత్తశుద్ది కేసీఆర్కు లేదు
ప్రత్యేక పరికరాలతో టన్నెల్లో గాలింపు చర్యలు..
- ఎస్ఎల్బీసీ టన్నెల్లో టన్నెల్లో 50 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలు
- తీవ్రంగా శ్రమించి టన్నెల బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్న సహాయక బృందం
- బురదలో మరో 40 మీటర్లు ముందుకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు
- గల్లంతైన వారికోసం బురదలోనూ గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- బురదలో కూడా వ్యక్తులను గుర్తించే పరికరాలతో గాలింపు చర్యలు
- టన్నెల్ బోరింగ్ మిషన్లో సేఫ్ కంటైనర్ ఉంటుందని తెలిపిన సిబ్బంది
- కార్మికులు సేఫ్ కంటైనర్లోకి వెళ్తే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందన్న సిబ్బంది
ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలపై క్లారిటీ ఇచ్చి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.
- శిథిలాలను తొలగించడానికి నెల రోజుల సమయం పట్టొచ్చు.
- టన్నెల్లో చిక్కుకున్న వాళ్లు ప్రాణాలతో ఉంటారని భావించలేం.
- ప్రస్తుతం శిథిలాలను తొలగించడం ఒక సవాల్.
- టీబీఎంను తొలగిస్తే గానీ శిథిలాల తొలగింపు సాధ్యం కాదు.
- శిథిలాలు టీబీఎంపై పడిపోయి పూర్తిగా ధ్వంసమైంది.
- సొరంగం లోపల నెలకొన్న పరిస్థితులను చూస్తే దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
- ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంట్ కూడా పునరుద్దరించలేదు.
- నడుము లోతు వరకు నీరు, బురద పేరుకుపోయి ఉంది.
- టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా కట్ చేయాల్సిందే.
- మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది.
- శిథిలాలను తొలగించాలంటే ఉన్న ఏకైక మార్గం రైల్వే ట్రాక్.
- రైల్వే ట్రాక్ కూడా రెండు కిలోమీటర్ల వరకు నీటిలో మునిగిపోయింది.
- సొరంగం లోపల నెలకొన్న పరిస్థితులు చూస్తే పప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 500 మీటర్ల వరకు మూసుకుపోయింది.
👉సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇక, నిరంతరం ఆక్సిజన్ పంపింగ్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
టన్నెల్ వద్దకు మంత్రి కోమటిరెడ్డి..
👉మరోవైపు.. తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పనులను పరిశీలించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. టన్నెల్ వద్ద ప్రమాద సహాయకచర్యలు పూర్తి అయ్యేంత వరకు మంత్రి అక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. పనులను పర్యవేక్షించనున్నారు.
మరో 50 మీటర్లే..
👉ఇక, టన్నెల్లోని 13.5 కిలోమీటరు వద్ద పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

👉టన్నెల్లో 14వ కి.మీ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది. ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్కబల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలానికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ వైద్య బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుఖేంద్ తెలిపారు. సహాయక చర్యల కోసం నేవీ బృందం శ్రీశైలం చేరుకోనుంది.
ఆందోళనలో బాధితుల కుటుంబ సభ్యులు..
👉టన్నెల్లోకి చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారు ఎలా ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది మంది ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. టన్నెల్ లోపల ఉన్నది వీరే.. జేపీ సంస్థకు చెందిన మనోజ్కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్ఈ), రోజువారీ కార్మికులు సందీప్సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) సొరంగం లోపల చిక్కుకు పోయారు.
Comments
Please login to add a commentAdd a comment