South Central Railway To Run Special Trains For Sankranti 2023 - Sakshi
Sakshi News home page

సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. స్పెషల్‌ రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..

Published Tue, Dec 27 2022 7:55 PM | Last Updated on Tue, Dec 27 2022 8:12 PM

South Central Railway to run special trains for Sankranti 2023 - Sakshi

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.. 

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ కోసం ప్రయాణాలు చేసే వాళ్ల కోసం గుడ్‌ న్యూస్‌ చెప్పింద దక్షిణ మధ్య రైల్వే. ఈసారి పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. 

పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అధిక డిమాండ్‌ ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 

2023 జనవరి 1వ తేదీ నుంచి 20వ తారీఖు నడుమ.. వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా.. దేశంలోని ప్రసిద్ధ గమ్యస్థానాల నడుమ ఇవి నడుస్తున్నాయని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement