
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పోస్టింగ్స్ వివరాలు..
► కాగజ్ నగర్ ఆర్డీఓగా ఆర్.ఎస్.చిత్రు
► ఆదిలాబాద్ ఆర్డీఓగా జె. రాజేశ్వర్
► తాండూరు ఆర్డీఓగా పి.అశోక్ కుమార్
► మంచిర్యాల ఆర్డీఓగా ఎల్.రమేష్
► నిజామాబాద్ ఆర్డీఓగా టి.రవి
► దేవరకొండ ఆర్డీఓగా కె.గోపీరాం
► బోధన్ ఆర్డీఓగా కె.రాజేశ్వర్
► సూర్యాపేట ఆర్డీఓగా కె.రాజేంద్రకుమార్
► హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీఓ ఎన్. ప్రసూనాంబ బదిలీ అయ్యారు. మరో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు ఎస్.మోహన్ రావు, జి.లింగ్యానాయక్లను రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.